2, అక్టోబర్ 2020, శుక్రవారం

*ధార్మికగీత - 27*


                                  

           *శ్లో:- ధనాని భూమౌ, పశవశ్చ గోష్ఠే ౹*

                  *నారీ గృహద్వారి, జనా శ్శ్మశానే ౹*

                  *దేహా శ్చితాయాం, పరలోక మార్గే ౹*

                  *ధర్మానుగో గచ్ఛతి జీవ ఏకః ౹౹*



సంపద యింటిలో , పశుల

        సంపద లెల్లను గోష్టమందునన్ ,

యింపగు భార్య గుమ్మమున ,

         యెల్లరు బంధులు ప్రేత భూమినిన్ ,

సొంపగు కాయమగ్నియును

         జొచ్చు , నినేవియు వెంటరావు , తా 

నింపిన ధర్మమే కలసి

         నిల్చును తోడుగ జీవు నెల్లెడన్


గోపాలుని మధుసూదన రావు

కామెంట్‌లు లేవు: