21, మే 2023, ఆదివారం

ఆలోచించుకో

 .

                   _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*కస్త్వం కోsహం కుత ఆయాతః*

*కా మే జననీ కో మే తాతః।*

*ఇతి పరిభావయ సర్వమసారం*

*సర్వం త్యక్త్వా స్వప్నవిచారమ్॥*


తా𝕝𝕝

*స్వప్నదర్శనం వంటి ఈ సంసారమంతా సారవిహీనమైనదని తెలుసుకుని "నేను ఎవడిని?" "ఎక్కడి నుండి వచ్చాను?"నా "తల్లి ఎవరు?" "తండ్రి ఎవడు?" అని ఆలోచించుకో* ....

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 66*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 66*


సుకల్పనందుడు కోపంగా చూస్తూ "మీరెందుకొచ్చారు ?" అని ప్రశ్నించాడు అసహనంగా. ఆయన కావాలనే, తాము 'తమ వెంట రావద్దని' చెప్పామన్న ఉక్రోషంతోనే అక్కడికి పనిగట్టుకు వచ్చాడని నందులకి అర్థమైపోయింది. 


"ఏం ? రాకూడదా ?" ఎదురు ప్రశ్నించాడు సుబంధుడు. తీక్షణంగా వాళ్లని చూస్తూ "ఇది నా ఆశ్రమం. దీనిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వచ్చాను" అన్నాడు పరుషంగా. 


ధర్మానందుడు పటపట పళ్లు కొరుకుతూ "ఇప్పుడు గుర్తొచ్చిందా, ఇది నీ ఆశ్రమమని.... ? అంతఃపురాల్లో, రాజమందిరాల్లో, మాతో పాటు రాజభోగాలు అనుభవించినంత కాలం గుర్తుకు రాలేదా.. నీకో ఆశ్రమం వున్నదని...?" ప్రశ్నించాడు ఏకవచనంలోకి దిగుతూ. 


"మర్యాద... మర్యాద... స్వధంశ సంజాతుడినైన సద్బ్రాహ్మణుడిని... మర్యాదిచ్చి మాట్లాడండి" అన్నాడు సుబంధుడు ఆగ్రహంతో. 


జీవసిద్ధి నవ్వి "అంటే నందసోదరులు వర్ణసంకర సంజాతులనా ?" అని చణకు విసిరాడు. 


ఆ మాట విని నివ్వెరపోయాడు సుబంధుడు. ఆ మాట నందులకి 'ఎక్కడ తగలాలో అక్కడ' తగిలింది. సుబంధుడు చప్పున తేరుకుంటూ "నా ఉద్దేశ్యం అది కాదు" అన్నాడు గట్టిగా. 


"అది కాదా... ? మరేమిటి...? మా డబ్బుతో ధర్మశాల నడిపించి అక్కడ నీకు అగ్రాసనం పెట్టించుకుని మా ఖర్చుతో నీ గొప్ప చాటుకోవడమా ? డబ్బు మాది, అయినా మేము బ్రాహ్మణద్వేషులమటా... మా తిండి తింటూ మా దగ్గిర కుక్కలా పడుండే నువ్వు సద్భ్రాహ్మణుడివటా.... అంతేనా ?" రెట్టించాడు ధర్మానందుడు వెటకారంగా. 


"నోర్ముయ్... కుక్క గిక్క అంటే మర్యాద దక్కదు..." అరిచాడు సుబంధుడు ఆగ్రహంతో. 


"ఏం చేస్తావురా గుంటనక్కా ... నువ్వోక వేదవేదాంగ వేత్తవా...? నీకొక సమున్నత ఆసనమా... ? అసలు నువ్వు ఏనాడైనా వేదాలు వల్లించావా ? ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక, వైదిక శాస్త్రాల విషయాలు ఎప్పుడైనా మా ముందు ప్రస్తావించావా? ఏ ఒక్క శాస్త్రాన్నైనా మాకు నేర్పావా ? మాతో అధ్యయనం చేయించావా ? మీ నాన్న మీదున్న గౌరవంతో ఆయన పోయాక, ఫోన్లే పాపమని ఆయన పదవిని నీకు మేము కట్టబెట్టాం. అంతఃపుర నివాసంతో పాటు రాజభోగాలు కల్పించాం. మాతో సరిసమాన గౌరవాలను కల్పించాం. అదంతా మరిచిపోయి... బ్రాహ్మణాహంకారంతో మమ్మల్ని... మమ్మల్ని 'వర్ణసంకరులని' మాటతూల్తావా ? ఆ చాణక్యుడిని రహస్యంగా రప్పించి అతడితో 'మా వంశం నిర్వంశం అవుతుందని' ప్రతిజ్ఞలు చేయిస్తావా ?" అరిచాడు ధర్మానందుడు ఆవేశంతో. 


ఆ సరికొత్త ఆరోపణకి నివ్వరపోతూ "నేనా.... ?" రెట్టించాడు సుబంధుడు తీవ్రస్వరంతో. 


"మరి నేనా ... ?" కల్పించుకున్నాడు జీవసిద్ధి. తలతిప్పి అసహనంగా సుకల్పనందుని వైపు చూస్తూ "మహారాజా ! యుగధర్మాల గురించి సుబంధుడు మీకు బోధించాడో లేదో నాకు తెలియదు. త్రేతాయుగధర్మానుసారం పద్నాలుగేళ్లు వనవాసం చెయ్యాలని నిబంధన పెట్టింది కైక. అలాగే ద్వాపర ధర్మానుసారం పాండవులు పన్నెండేళ్ళు అరణ్య, ఒక ఏడాది అజ్ఞాత. మొత్తం పదమూడేళ్ళు వనవాసం చెయ్యాలని నిబంధన విధించారు కౌరవులు. కలియుగ ధర్మానుసారం అది పన్నెండేళ్ళు అయ్యింది..." అన్నాడు. 


"అంటే, కలియుగ ధర్మానుసారం పదహారేళ్ల క్రితమే ఈ ఆశ్రమాన్ని పాడుపెట్టి అంతఃపురానికి చేరుకున్న సుబంధుడికి ఈ ఆశ్రమంపై ఎట్టి హక్కు లేదు. దిక్కుదివాణం లేని నీవేశనాన్ని ' ఇల్లు ' లేని వాళ్ళు ఆక్రమించుకోవచ్చు... కనుక ప్రస్తుతం ఈ ఆస్తి, అంటే ఈ ఆశ్రమం జీవసిద్ధి గురుదేవుల వారిది" అని స్పష్టం చేశాడు ధర్మానందుడు. 


"అన్యాయం... అక్రమం... ఒక బౌద్ధ సన్యాసి మాయలో పడి మీ గురువుని నన్ను అవమానిస్తారా... ? ఒక సద్భ్రాహ్మణున్ని అవమానిస్తే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా?" ఆక్రోశించాడు సుబంధుడు. 


"మహారాజా ! ఇది నా ఆశ్రమం అని తమరు నిర్ధారించారు. నా ఆశ్రమంలో, మీ సమక్షంలో ఏమిటీ గోల ... ?" విసుకున్నాడు జీవసిద్ధి అసహనంతో. 


సుబంధుడు రెచ్చిపోతూ "నాది గోలా... ? నా ఆస్తి కాజేయ్యడానికి నువ్వెవడివిరా...? నీకు ఆస్తిహక్కు కల్పించడానికి ఈ రాజుకేం హక్కుందిరా.... ?" అరిచాడు గొంతు చించుకుని. మరుక్షణం... 


సుబంధుడి చెంప చెళ్లుమనిపించాడు సుకల్పనందుడు. ఆ దెబ్బకి కెవ్వున ఆక్రందిస్తూ వెనక్కితూలిపడ్డాడు సుబంధుడు. అతని కళ్ళు బైర్లుకమ్మాయి. 


జీవసిద్ధి నొచ్చుకుంటూ "శాంతి... శాంతి... అహింసో పరమోధర్మః" అని ప్రభోదించాడు తధాగతుడు. "రాజా ! శాంతికి నిలయమైన మా ఆశ్రమాన్ని హింసాద్వేషాలతో కలుషితం కానివ్వడం మాకిష్టం లేదు. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది. రాజా ! మీరు శాంతించండి. ఆ వెర్రి బ్రాహ్మణుడిని ఇంతటితో వదిలేయ్యండి" అన్నాడు ధర్మపన్నాలు వల్లిస్తూ. 


సుకల్పనందుడు శాంతిస్తూ "తమరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాం" అని చెప్పి ధర్మానందుడి వైపు తల తిప్పి "తమ్ముడూ ! నేటి నుంచీ ఈ సుబంధుడికి అంతఃపురం ప్రవేశాన్ని నిషేధిస్తున్నాం. ఇతడు ఇకముందు కోటలో గానీ అంతఃపురంలో గానీ కనిపించాడా... ? జాగ్రత్త" అని హెచ్చరించాడు కఠిన స్వరంతో.


సుబంధుడు చివాల్నలేచి నందులనూ, జీవసిద్ధిని కొరకొర చూసి విసవిసా వెళ్లిపోయాడు.


జీవసిద్ది నిటూర్చి " చూశావా రాజా ! కలుగులోని ఎలుకల్లాగ మీ విరోధులు ఒక్కొక్కరే ఎలా బయటపడుతున్నారో... మొన్న చాణక్యుడు. ఈవేళ సుబంధుడు. ఇలాంటి గాది క్రింద పందికొక్కులు ఇంకా ఎందరున్నారో... ?" అన్నాడు సాలోచనగా. 


నందులు ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. అందరూ జీవసిద్ధి వైపు భయంగా చూశారు. 


'భయంలేదు. నా రక్షణ మీకున్నంతవరకూ మీకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. నిశ్చింతంగా ఉండండి" అంటూ అభయప్రదానం చేస్తూ చెయ్యెత్తి వాళ్ళని ఆశీర్వదించాడు జీవసిద్ధి. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

పద్యము

 166వ రోజు: (భాను వారము) 21-05-2023

మన మాతృ భాష సేవలో ఈ రోజు పద్యము:


ఆటపాటలతోడ హాయిగా చదువంగ 

చదువు తలల కెక్కు ఛాత్రులకును 

ఆటపాట లెపుడు ఆరోగ్య మందించు 

తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


విద్యార్ధులు చదువు మరియు ఆట పాటలకు, ప్రతి దినము ప్రత్యేక సమయమును కేటాయించిన ఎడల వారి శారీరక మానసిక ఆరోగ్యముతో పాటు,  ఇష్టముతో చదివిన చదువు వారి మనస్సుకు హత్తుకుని భావి జీవితములో  పేరు ప్రఖ్యాతులను, కీర్తి ప్రతిష్టలను అందించును. 


ఈ రోజు పదము. 

మేక పోతు (Goat): అగ్నివాహనము, అజము, చగల, ఛగము, దేవానాంప్రియము, బస్తము, బుక్కము, వేట, స్తభము.

 माला तो कर में फिरै, जीभ फिरै मुख माहिं।

मनुवा तो चहुँदिसि फिरै, यह ते सुमिरन नाहिं।।


कबीरदास जी कहते हैं कि मनुष्य हाथ में माला फेरते हुए जीभ से परमात्मा का नाम लेता है पर उसका मन दसों दिशाओं में भागता है। यह कोई भक्ति नहीं है।

ఆయుర్వేద మూలికలు

 ప్రతి గృహము నందు ఉండదగిన ఆయుర్వేద మూలికలు మరియు ఆవరణలో ఉండవలసిన చెట్లు  - 


    ఇప్పుడు నేను మీకు తెలియచేసే మూలికలు మరియు చెట్లు అందుబాటులో ఉండే విధముగా చూసుకోనవలెను . అలాగే మీ గృహావరణలో నేను చెప్పబోయే చెట్లను పెంచుకోవడం చాల మంచిది . ఒకవేళ మీ గృహవరణలో స్థలం లేకున్నచో మీకు దగ్గర ప్రదేశాలలో ఖాళీస్థలం ఉన్నచో ఈ చెట్లను పెంచడం మంచిది . వీటివల్ల ఎన్నో గొప్పగొప్ప ఔషధ యోగాలు ఉన్నాయి . 


  గృహము నందు ఉండదగిన మూలికలు  - 


    నిమ్మకాయ , అల్లం , జీలకర్ర , సైన్ధవ లవణం , ఉప్పు , వాము , కురసాని వాము , ఇంగువ , సున్నము , బెల్లము , తేనె , ఆవునెయ్యి , నువ్వులనూనె , కుంకుడు కాయలు , వాము పువ్వు , పుదీనాపువ్వు , పచ్చ కర్పూరం , కర్పూరం , తెల్ల ఆవాలు , ఆవాలు , ఆముదము , యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క , గసగసాలు , సీమగొబ్బి విత్తనాలు , మిరియాలు , ధనియాలు , సుగంధపాల , గంధపుచెక్క , కస్తూరి , దుప్పికొమ్ము , అక్కలకర్ర , అతిమధురము , యష్టిమధుకము , కరక్కాయ , పిప్పళ్లు , పెద్ద ఉశిరిక పప్పు , పటిక , శొంటి , పటికబెల్లము , నీరుల్లి , వెల్లుల్లి , దుంపరాష్ట్రము , మోడీ , మోదుగ మాడలు , రుద్రాక్షలు , అరటిపండ్లు , తమలపాకులు , పసుపు , వాము , తేనె మైనం మొదలైనవి . 


  గృహ అవరణలో పెంచదగిన చెట్లు - 


    నిమ్మ  , నారింజ , వేప , వెలగ , ములగ , ఉత్తరేణి , తెల్ల గురువింద , నందివర్దన , మందార , తెల్ల జిల్లేడు , నల్ల ఉమ్మెత్త , అవిశ , అరటి , పనస , తెల్ల ఈశ్వరి , మారేడు , ఉడుగ , దిరిశన , తుమ్మ , గరిక , తుమ్మి , చంద్రకాంత , గన్నేరు , తోటకూర , గోంగూర , బచ్చలి , చిత్రమూలం , సరస్వతి , చిర్రి , మోదుగ , నల్లేరు , కాడజెముడు , దూలగొండి , వెంపలి , పుదినా , వాము , తులసి , కొబ్బరి , జీడిమామిడి , కానుగ , పిప్పిలి , టేకు , వెదురు , జాజి , గులాబి , మల్లె , దానిమ్మ , పెద్ద ఉశిరిక , మేడి  మొదలైన ఔషధ చెట్లు గృహ ఆవరణలో లేక గృహానికి చుట్టుపక్కల ప్రదేశాలలో తప్పక పెంచవలెను .  


          పైన చెప్పినటువంటి ఔషధాలు మరియు ఔషధ చెట్ల గురించి నేను రాసిన మూడు  ఆయుర్వేద గ్రంథాలలో విపులంగా వివరించాను. 


   గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

            9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ఉన్న దానితో

 *శుభోదయం*

💐🙏💐🙏💐

ఉన్న దానితో పోరాటం... 

లేని దానికై ఆరాటం...

 

ఉన్నదానితో లేని తృప్తి,

లేని దానికై అసంతృప్తి...


మాయలోని మర్మం అదే... అది తొలగితే, 


పోరాటానికి, ఆరాటానికి మధ్య ఉండదు పేచీ...  


తృప్తికి, అసంతృప్తికి మధ్య  పుడుతుంది 

రాజీ... 


🙏🙏🙏🙏🙏🙏

భారతదేశ స్థితి*

 *నేటి మన భారతదేశ దుస్థితి*

దేశంలోని కొంత మంది ప్రజలు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ, ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ, స్వల్ప సంతానం కలిగి ఉండి వారికై శ్రమిస్తూ, విద్య, వైద్యం వంటి అనేక ఖర్చులను భరిస్తూ బరువు బాధ్యతలతో జీవిస్తూ ఉండగా...మరో పక్క కొంత మంది ప్రజలు  బాధ్యతారాహిత్యంగా అధిక సంతానం కలిగి ఉండి కేవలం ప్రభుత్వాల ఉచిత పథకాల మీద ఆధారపడుతూ ఇస్తాను సారంగా తాను పతనం అవ్వడమే కాక దేశాన్ని కూడా పతన వ్యవస్థకు చేరుస్తున్నరు. కొంత మంది కట్టే పన్నులు మరో కొంత మంది సోమరులను పోషించడానికి అన్నట్టు తయారవుతుంది వ్యవస్థ. ప్రభుత్వ పథకాలు కేవలం పరిమిత సంతానం గల కుటుంబాలకి మాత్రమే లభించేలా చర్యలు చేపట్టేలా న్యాయ స్థానాలలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం లేదా ఇంకేదయినా పద్ధతిలో అయిన ఏదయినా చేయగలమా అనే వైపుగా మేధావులు , విద్యావంతులు ఆలోచించ గలరని.....ఒక సగటు భారతీయుడిగా నా మనవి🙏

కర్తవ్యనిష్ఠ

 *కర్తవ్యనిష్ఠ*


పని చేయడంలో యంత్రానికి, జీవరాశికి తేడా ఉంటుంది. యంత్రానిది ఒక మూసలో పోసినట్లు యాంత్రిక పనితనమైతే, జీవులు చేసే పనిలో జీవం తొణికిసలాడుతూ ఉంటుంది. గిజిగాడు సంక్లిష్టమైన తన గూటిని గడ్డిపరకలతో అల్లి నిర్మిస్తుంది. తన ముక్కును మాత్రమే పనిముట్టుగా ఉపయోగించి ఎంతో నైపుణ్యంతో గూటి నిర్మాణం సాగిస్తుంది. సాలీడు తన గూటిని అకుంఠిత దీక్షతో ఒక అందమైన వలలా రూపొందిస్తుంది. కాలర్ టైలర్ బర్డ్ గుబురుగా ఆకులు ఉండే చెట్టును ఎంచుకుని, ఆ ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు ఏర్పరచి, సాలెగూడు దారంలాంటి దానితో అందమైన గూడు నిర్మించుకుంటుంది. చీమ ఓపిగ్గా మట్టితో పుట్ట ఏర్పరచుకుంటుంది. కర్తవ్యనిష్ఠకు ఇవి ప్రకృతి మనకందించే కొన్ని ఉదాహరణలు. ఆయా జీవరాశులు కేవలం ఆ పనులకే ప్రసిద్ధం. మనిషి అలాకాదు. తాను ఎంచుకున్న ఏ పనిలోనైనా తనదైన ప్రత్యేకతను చాటుకోగలడు. ఎంచుకుని చేసేపనిని తదేక ధ్యానంతో పూర్తి కావించాలి.


ఏ కళాకారుడైనా తన పనిలో ప్రాణం పెడతాడు. అది చీర నేయడం, నగ చేయడం, చిత్రం వేయడం, నృత్యం చేయడం, పాట పాడటం.. ఇలా ఏదైనా కావచ్చు. అందుకే కళలకు అంతటి ప్రాధాన్యం, విలువా! తాము చేసే పనులను అత్యంత ఆసక్తితో చేసేవారు పరమ సిద్ధిని పొందుతారని చెప్పాడు శ్రీకృష్ణుడు. మనం చేసే ప్రతి పనీ మన స్వభావం మీద తనదైన ముద్రను వేస్తుంది. మనిషి వ్యక్తిత్వం మీద, శీలం మీద కర్మ చూపే ప్రభావమే అతడు ఎదుర్కోవలసిన శక్తులన్నింటిలోకీ అత్యంత శక్తిమంతమైనది అంటారు. వివేకానందులు. మనిషి తాను చేసే పని కేవలం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి, సేవను చేయడానికో కాదని అది తన వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేసేదని గమనించి శ్రద్ధతో పనిచేస్తేనే అందులో లీనం కాగలుగుతాడు. పరిపూర్ణ ఫలితం పొందగలుగుతాడన్నది. వివేకానందుల వారి ఉద్బోదించారు. నంబి కురవ గ్రామవాసి అతడి వృత్తి వేంకటేశ్వరస్వామి వంటశాలకు కుండలు చేయడం. అందులోనే తలమునకలై స్వామి దర్శనానికి వెళ్ళలేకపోయేవాడు. కుండలు చేశాక తన చేతికి అంటుకున్న మట్టిని పువ్వుల్లా చేసి కొయ్య వేంకటేశ్వరస్వామికి అర్పించేవాడు. అవి తనకు అత్యంత ప్రియమైనవని తొండమాన్ చక్రవర్తి సమర్పించే సువర్ణ పుష్పాలను పక్కకు తోనేనేవాడు శ్రీనివాసుడు. చక్రవర్తి నంబి దగ్గరకెళ్ళి ఆయన ముందు మోకరిల్లి వేంకటేశ్వరుడు అతడి పూలను ఇష్టపడటానికి కారణమేమిటని అడిగాడు. అదేమీ తనకు తెలియదని కుండలు చేయడమే తనకు తెలిసిన పని అన్నాడు నంబి. నిష్ఠతో పనిచేయడమే భక్తి అన్న భావనతో పరమాత్ముణ్ని మెప్పించిన నంబి- అందరికీ ఆదర్శప్రాయుడు. కర్మనిష్టుడైన మంత్రుల్లో


అప్పాజీ శ్రేష్ఠుడు. రాయల మీద ప్రీతికన్నా రాజ్యక్షేమమే ప్రధానం అని భావించాడు. నేడు మానవుడు చేసే పనిలో శ్రద్ధ, అంకితభావం, నైపుణ్యం కొరవడ్డాయి. సమయం, దనం పని ఫలితాన్ని పలచన చేస్తున్నాయి. పనిలో కృత్రిమత్వం - గోచరిస్తోంది. పని కూడా మోక్షమార్గానికి దారి చూపే భక్తి అని తెలుసుకుని చక్కని పనితనం చూపగలిగితే చాలు... ధన్యజీవులం అవుతాం.


- ప్రతాప వెంకట సుబ్బారాయుడు.

ఆగి ఒకసారి చూశారు

 ఆగి ఒకసారి చూశారు


మా నాన్న శ్రీ రామానుజం గారు ఒక న్యాయవాది. మాది కులిత్తలై అగ్రహారంలోని శ్రీవైష్ణవ కుటుంబం. మేము శ్రీమఠానికి పెద్ద భక్తులం. మహాస్వామి వారు, జయేంద్ర సరస్వతి స్వామివారు ఎప్పుడు యాత్రకు వచ్చినా మా ఇంట్లోనే బస చేసేవారు.


ఇది అరవైలలో జరిగిన సంఘటన అనుకుంటా. ఆ అగ్రహారంలో పిల్లాపాపలతో ఒక కుటుంబం ఉండేది. అక్కడి ప్రముఖులలో వారి కుటుంబం కూడా ఒకటి. వారు ప్రధానంగా ఏదో వ్యాపారం చేసేవారు. బాగా కలిసివచ్చి హాయిగా ఉండేవారు. వారిది అంతా ధార్మికమైన సంపాదన. చాలాకాలం పాటు హాయిగా సాగిన వారి జీవితాలలో హఠాత్తుగా సమస్యలు మొదలయ్యాయి. వాళ్ళ ఇంట్లో కొన్ని భయంకరమైన సంఘటనలు జరగడం మొదలయ్యాయి. నేలపైన జుత్తు పెద్ద ఉండలుగా కనపడడం, వసారా మధ్యలో మానవ అశుద్ధము కనపడడము, అద్దాలు పగలడం వంటివి కనపడడం మొదలయ్యాయి.


ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కావడం లేదు. వీటితో పాటు వాళ్ళ ఇంట్లోని వాళ్ళు ఎవరైనా బయటకు వెళితే చాలు వాళ్ళ బట్టలన్నీ చిరిగిపోయేవి. ఇది ఆడవాళ్ళ విషయంలో కూడా జరిగేది. ఇవన్నీ వినడానికి నమ్మేలాగా లేకపోయినా ఆ అగ్రహారంలో చాలామంది వీటీని ప్రత్యక్షంగా చూసారు.


తరువాత వాళ్ళు ఇదంతా చేతబడి వల్ల జరిగినది అని తెలుసుకున్నారు. వారు ఈ విషయానికి చాలా భయపడ్డారు. కాని దీని పరిష్కారం కనిపెట్టలేక పోయారు.


ఆ సమయంలో మహాస్వామివారు ఆ ప్రాంతానికి పర్యటనకు వచ్చి ఆ అగ్రహారానికి కూడా వచ్చారు. స్వామివారికి ఆ అగ్రహారం ప్రజలు ఘన స్వాగతం పలికారు. స్వామివారు అందరిని యోగక్షేమాలు విచారిస్తుండగా, ఆ వీధిలో నివసించే వారు ఆ కుటుంబం పడుతున్న ఇబ్బందుల గురించి చెప్పి వారికి సహాయం చెయ్యవల్సిందిగా అడిగారు.


మాహాస్వామి వారు విషయం అంతా విన్నారు కాని ఏమి చెప్పలేదు.


తరువాతిరోజు స్వామివారు వారి శిష్యులతో కలిసి ఆ వీధిలో వెళ్తుండగా, చుట్టూ ఉన్నవారు ఆ ఇంటివైపు చూపించారు. మహాస్వామివారు ఆగి ఒకసారి ఆ ఇంటిలోకి నేరుగా చూసి ముందుకు వెళ్ళిపోయారు.


ఆ ఒక్క చూపు ఆ ఇంటిలో ఉన్న సమస్యలన్నిటిని పారద్రోలింది. ఆ క్షణం నుండి ఆ ఇంటికి చేసిన చేతబడి ప్రభావాలు పూర్తిగా మాయమైపోయాయి. కుటుంబంలో అందరికి ప్రశాంతత చేకూరింది. వారు మళ్ళా వారి వ్యాపారం చూసుకుంటూ ఆడవారు కూడా ధైర్యంగా బయట తిరగగలిగారు.


నాకు ఈ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడల్లా మహాస్వామి వారి ఈ చిత్రపటం స్ఫురణకు వస్తుంది. మహాస్వామివారి చూపులవల్ల ఎటువంటి క్షుద్ర శక్తి అయినా నాశనం చెయ్యబడుతుంది. అలాగే వారి కరుణా విలాసం భక్తులను రక్షిస్తుంది. ఆ చూపులకు ఎంతటి శక్తి అని ఇప్పటికి నాకు ఆశ్చర్యం వేస్తుంది.


--- శ్రీరామ్, కులిత్తలై అగ్రహారం


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

 🥗శ్రీవారి గడ్డం కింద పచ్చకర్పూరం ఎందుకు పెడతారు..?ఆంతర్యం ఏంటి..?🥗


ఆంద్రప్రదేశ్‌ లోని చిత్తూరు జిల్లాలో తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం  వెలసింది. ఇక్కడికి స్వామి వారి సేవకై భక్తులు ప్రతిరోజూ తండోపతండాలుగా తరలి వస్తుంటారు. శ్రీవారికి భక్తి శ్రద్ధలతో ముడుపులు, కానుకలు సమర్పించుకుంటారు. కొందరు వారి వారి మొక్కులు తీర్చికోవడానికి తిరుపతికి కాలినడకన వస్తుంటారు. గోవిందా గోవిందా అనే నామంతో పరమ పవిత్రం అయింది తిరుపతి. ఏడు కొండలు మీద కొలువై ఉన్న శ్రీవారి గురించి చెప్పాలంటే ఎన్ని గ్రంధాలైనా చాలవు. అంతటి మహత్యం కలిగిన శ్రీవారి గడ్డం కింద నిత్యం పచ్చ కర్పూరంతో అలంకరిస్తారు దానికి కారణం మీకు తెలుసా. ఎందుకు పచ్చ కర్పూరంతో అలంకరిస్తారో దాని ఆంతర్యం ఏమిటో తెలుసుకోవాలని ఉందా... ఆలస్యం చేయకుండా చదివేయండి.


శ్రీవారి భక్తులలో అగ్రగణుడు అనంతాళ్వారు. ఆ శ్రీవారికి సేవచేస్తూ తరించిన బక్తుడు శ్రీ అనంతాళ్వార్‌. ఇతడు శ్రీవారి కొండ వెనుక భాగంలో నివసించేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకుంటారు. పూలతోటను పెంచాలని నిర్ణయానికి వచ్చిన తరువాత పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయించుకొని, మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య నిండు చూలాలు. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకుని 12 సంవత్సరాలు బాలుని రూపంలో అక్కడికి వస్తాడు. గర్భిణిగా ఉన్న ఆమెకు సాయం చేస్తానని చెప్పి ఆ మట్టిని నేను పారబోస్తా అంటాడు. దానికి అనంతాళ్వారు ఒప్పుకోడు కాని అతని భార్య అంగీకరించడంతో బాలుడు ఆమెకు సాయం చేస్తాడు. ఆమె భర్తకు తెలియకుండా మట్టి తట్టని తీసుకెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.


ఆమె మట్టితట్టని తీసుకెళ్ళి తొందరగా రావడం గ్రహించిన అనంతాళ్వారులు భార్యని ప్రశ్నించగా ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది. దాంతో అతడు ఆగ్రహానికి గురవుతాడు. అనంతాళ్వారులు కోపంతో చేతిలో ఉన్న గునపాన్ని బాలుడి మీదకి విసురుతాడు. అది ఆ బాలుడు గడ్డానికి తగులుతుంది. దాంతో బాలుడు రూపంలో వచ్చిన వెంకటేశ్వరస్వామి వారు ఆనంద నిలయంలోకి వెళ్ళి కనబడకుండా మాయం అయిపోతాడు.


ఆలయంలో అర్చకులు స్వామివారి విగ్రహానికి గడ్డం వద్ద రక్తం కారటం చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని అనంతాళ్వారు కు చెప్తారు. దాంతో కంగారు గా అతడు అక్కడికి చేరుకుంటాడు. గర్భగుడిలో ఉన్న శ్రీవారి గడ్డం నుండి రక్తం కారడం చూసి ఆశ్చరపోతాడు. తమకి సాయం చేయడానికి వచ్చిన బాలుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరస్వామి వారే అని గ్రహించి కన్నీళ్ళతో స్వామివారిని మన్నించమని కోరుతూ పాదాలపై పడతాడు. గాయం వలన కలిగే బాధనుండి ఉపసమయం పొందడానికి గడ్డం దగ్గర పచ్చకర్పూరం అద్దుతాడు. అప్పటినుండి రోజూ చల్లదనం కోసం గాయంపై చందనం రాసి ఆ తర్వాత పచ్చకర్పూరం పెట్టేవాడు. అప్పటి నుండి శ్రీవారి గడ్డంపై రోజూ పచ్చకర్పూరం రాయడం ఆచారంగా మారిపోయింది. శ్రీవారిని గాయపరిచిన గునపాన్ని చూడాలి అనికుంటే  మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు.


🌹సమస్తలోకాన్ సుఖినోభవంతు,శుభోదయం 🌹

విద్యాభివృద్ధికి

 🌷🙏విద్యాభివృద్ధికి+విదేశీయానానికి మంత్ర శ్లోకం🙏🌷


🌷🙏మంత్రం🙏🌷


"జయ అజిత జయ అశేష జయ వ్యక్తిస్థితే 

జయ పరమార్థార్థ సర్వజ్ఞ జ్ఞానజ్ఞేయార్థనిః సృతః"


ఈ జయకర మంత్ర శ్లోకం నిత్యము 108 సార్లు ధ్యానిస్తుంటే సర్వ  విద్యలందు జయము కల్గును. విదేశీయానం సంకల్పించిన వా సంకల్పం తప్పక నెరవేరును.


🌷🙏శ్రీ మాత్రే నమః🌷🙏