3, ఆగస్టు 2020, సోమవారం

అహంభావం - కధ

'' నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న  విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ  పట్టలేకపోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే !  ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego]  నింపాయి. ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర  వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి. ఆయన ఇలా అనుకొన్నాడు : ' నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కివుంటాను. అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .' అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు. మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది. శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు. అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! ''  అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అపద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! చూడు , ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది ,'' అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది. అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు ,  ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం. మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి ' అహం ' తీసేస్తే మిగిలేది ' భావం '. అంటే ' అర్థం'. అర్థమైతే అనర్థం జరగదు.

*భారతీయ యోగ.. రహస్యం...*

మన ఋషులు ఎందుకు అన్ని ఏళ్లు బ్రతికారో
ఆ రహస్యం ...

*శ్వాస*
-------------
మనిషి నిమిషానికి "15 సార్లు" శ్వాస తీస్తాడు...100 నుండి 120 సం.. బ్రతుకు తాడు.తాబేలు నిమిషానికి "3 సార్లు" శ్వాస తీస్తుంది...500 సం. లు బ్రతుకు తుంది.

ఐతే ప్రాణాయామం ద్వారా 'శ్వాస' లు తగ్గించడం వలన ఆయుష్షు ఎలా పెరుగు తుంది....?

దీనిని సశాస్త్రీయం గా వివరించే 'వ్యాసం' ఇది...
అప్పుడు ప్రాణాయామం యొక్క శక్తి,గొప్ప దనం ఏమిటో మనకు తెలుస్తుంది.

మన శరీరం  కోట్ల కణాల  కలయిక వలన ఏర్పడింది. ఒక గ్రామ్ మానవ మాంసం లో కోటాను కోట్ల కణాలు ఉంటాయి. వీటినే " సెల్స్" అంటాం. ఈ ప్రతి కణంలోనూ 'మైటోకాండ్రియా (హరిత రేణువు) అనే ప్రత్యేక కణ వ్యవస్థ ఉంటుంది.

ఈ మైటోకాండ్రియా- మనం శ్వాస తీసు కున్నప్పుడు,గాలి లోని 'ఆక్సిజన్' ను తీసుకుని మండిస్తుంది.
దీని ద్వారా "ఉష్ణం" జనిస్తుంది.
ఈ ఉష్ణమే మనం ప్రాణాలతో ఉండటానికి కావలసిన " ప్రాణశక్తి".
ఇలా శరీరంలోని కాలి గోరు నుండి తల వెంట్రుకలు చివర వరకూ ఉన్న ప్రతి కణం లోనూ ఉష్ణం జనిస్తున్నది...

ఇలా ఒక్కొక్క కణం నిమిషానికి,15 సార్లు ఉష్ణాన్ని జనింపజేస్తుంది.
ఎందుకంటే, మనం నిమిషానికి "15 సార్లు" శ్వాస తీసుకుంటాం కాబట్టి...
ఇలాంటి కణం 3 రోజులు ఏకధాటి గా పని చేసి, తరువాత ఉష్ణాన్ని పుట్టించే సామర్థ్యం కోల్పోయి మరణిస్తుంది...
ఇలాంటి మృత కణాలు మలినాల రూపం లో శరీరం లోంచి బయటకు వెళ్లిపోతాయి.
ఎప్పుడైతే ఒక మృత కణం బయటికి వెళ్లిందో,ఆ స్థలంలో ఒక కొత్త కణం మనం తీసుకొనే ఆహారం ద్వారా తయారవు తుంది......

ఉదాహరణకు - మన  గుండెలో 1000 మృత కణాలు తయారయ్యాయి,అను కుంటే...
ఆ కణాలన్నీ విసర్జన అనగా చెమట,ఉమ్మి,మూత్రం ద్వారా బయటికి వెళ్ళి పోయి, గుండెలో ఖాళీ ఏర్పడినప్పుడు మాత్రమే...
ఆ స్థలంలో కొత్తకణాలు తయారవు తాయి.

పాత వాటిని ఖాళీ చేస్తేనే...
కొత్తవి రాగల్గుతాయి.
అందుకే ప్రతి దినం మన మల విసర్జన క్రియ అతి ముఖ్యమైనది.

ఎవరైతే మల విసర్జన సరిగా చెయ్యరో...
వారి శరీరం నిండా ఈ "మృత కణాలు(toxins)" నిండిపోయి,
సరిగా ఉష్ణం జనించక......
తీవ్ర రోగాల బారిన పడతారు...

కనుక ఈ టాక్సిన్ లను
బయటికి పంపే "డిటాక్సీఫీకేషన్
(విసర్జన)"
చాలా ముఖ్యం.

ఒక కణం 15 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...3 రోజులు జీవిస్తుంది.

అదే కణం 14 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

5 రోజులు జీవిస్తుంది......

13 సార్లు ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తే...

7 రోజులు జీవిస్తుంది......

ఈ విధంగా మనం.. 'శ్వాస' ల సంఖ్యను తగ్గించే కొద్దీ...
మన కణాలు పని చేసే కాలం పెరుగు తుంది.

ఎలా ఐతే ఒక యంత్రం దగ్గర ఎక్కువ పని చేయిస్తే...త్వరగా చేస్తుందో......
అలాగే ఈ కణాలు కూడా......

భారతీయ యోగులు ...
కణం యొక్క జీవిత కాలాన్ని...
3 నుండి 21 రోజుల వరకూ
పెంచి...2100 సంవత్సరాలు కూడా జీవించ గలిగారు.

మనం శ్వాసను ఎక్కువ తీసుకునే కొద్దీ...

శరీరంలోని ప్రతీ కణం పై తీవ్ర పని ఒత్తిడి పడి...
ఆ కణం త్వరగా పాడై పోతుంది.

*ప్రాణ యామ సాధన ద్వారా "శ్వాస"* ల సంఖ్యను తగ్గించి కణాల పని రోజులని పెంచ గల్గితే......
మన శరీరంలోని ప్రతి అవయం మరి కొన్ని రోజులు ఎక్కువగా పని చేస్తుంది...

ఎందుకంటే......

అవయవాలు అంటే...
కణాల సముదాయమే.

ఇలా మనలోని ప్రతీ అవయవం యొక్క...
ఆయుష్షు పెరిగితే...

*మన ఆయుష్షు కూడా పెరిగినట్టే కదా.!!*

*మనం ఒక్క "శ్వాస"ను తగ్గించ గల్గితే...*
*20 సంవత్సరాల ఆయుష్షును*
*పెంచు కోవచ్చు...*

*యోగులు...*
*ఈ శ్వాసల సంఖ్యను గణించడం ద్వారానే...*
*తాము... ఏ రోజు...మరణించేదీ...*
*ముందే చెబుతారు ........*
***************

DID ANYONE NOTICE

DID ANYONE NOTICE THE EIGHT BIG STEPS TAKEN IN 10 DAYS BY THE MINISTRY OF HOME AFFAIRS IN J&K ?

1. 5 Lakh Hindu-Sikh Families Became Jammu & Kashmir Domiciles.

2. All Perks/Facilities Withdrawn From Omar Abdullah and Mehbooba.

3. Kashmir Lost Control Over All Universities Including Jammu & Kashmir National Law University.

4. Kashmir Lost Control Over Hindu Shrines.

5. Competent Authority Empowered To Take Suo Moto Notice And Evict Encroachers From Properties Hindus Left Behind In Kashmir In 1990.

6. Kashmir Lost Control Over All Golf And Other Clubs In J&K.

7. Role Of Kashmir (CM) In University Affairs Reduced To Zero.

8. Legal Protection Granted To Anti-Nationals In J&K 42 Years Ago revoked
Now, Those Facing Public Safety Act, 1978, Can Be Put In Any Jail Outside J&K.

9. No Secretariat Move for Now From Jammu To Kashmir Or Secretariat Will Continue To Function In Jammu.

Some more additions :
2. All facilities withdrawn from all ex CM’s including Farooq, Omar, Azad, Mehbooba including accommodation and vehicles. 
3. All Universities now directly controlled by New Delhi and curriculum in these universities to be modified away from being Kashmir centric. 
4. Hindu shrines were always controlled by the Dharmath Trust or respective Shrine Boards. Now these boards report directly to Home Ministry. But that is not all. Now even J&K Waqf Board (Auqaf) has been taken over by New Delhi and all its assets, which till now were created by contributors and niyaz from Kashmiri Muslims, have been taken over by New Delhi and will be controlled by them. 
6. New Delhi has empowered local administration to evict locals from properties they might have purchased from Pandits. Sale deeds could be nullified. 
6. Not only golf courses but all forest lands and tourist development authorities are now directly controlled by New Delhi. They can issue, allot, lease or provide prime land and facilities to anybody from India now. 
8. J&K CM has been reduced to number 15 on the Warrant of Precedence from earlier 7. All nominations of J&K CM from Universory boards or Waqf boards has been removed. 
9. All Kashmiri IAS officers have been posted in less important positions, while non local officials are running the  administration from Jammu. 
10. Land banks of thousands of kanals have been indefinite and earmarked in different districts of Kashmir to be allotted to non state subjects in the name of ‘investment and industry’.
We were Just Wondering WHY Home Minister is So Much Quite in Corona Fight, Delhi and Mumbai incidents. He Silently Enforced These Actions In J&K.last steps of india for jammu and kashmir.

************************

గ్రామీణం

మీరెప్పుడైనా గమనించారా.. గ్రామాల్లో ఉన్న భూమిని వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు. అలా ఎందుకు పిలుస్తారు.. ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా..! ఒకే గ్రామానికి చెందిన భూమిని వేర్వేరు పేర్లతో ఎందుకు పిలుస్తారు, వాటి వివరాలు తెలుసుకుందాం... 

గ్రామ కంఠం: గ్రామంలో నివసించడానికి కేటాయించిన భూమినే గ్రామ కంఠం అంటారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో గృహ నిర్మాణాలు చేపట్టవచ్చు. గ్రామానికి సంబంధించిన కార్యాలయాలు నిర్మించవచ్చు. దీనిలో ప్రభుత్వ సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. 

అసైన్డ్‌ భూమి: భూమి లేని నిరుపేదలకు సాగు చేసుకోవడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం మంజూరు చేసిన భూమిని అసైన్డ్‌ భూములుగా పేర్కొంటారు. ఈ భూమిని వారసత్వ సంపదగా అనుభవించాల్సిందే గాని ఇతరులకు అమ్మడానికి గానీ, బదలాయించడానికి గానీ వీలుండదు. దీనినే లవాణీ పట్టా అని కూడా పిలుస్తారు. 

ఏడబ్ల్యూ భూములు: శిస్తును నిర్థారించిన భూములను ప్రభుత్వ భూములు లేదా అసైన్డ్‌ వేస్ట్‌ల్యాండ్‌ భూములు అంటారు. శిస్తు కట్టిన ఏడబ్ల్యూ భూములు మెట్ట భూములైతే ల్యాండ్స్‌ అంటారు. వీటిని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది. 

బంజరుభూమి: గ్రామం, మండల పరిధిలో ఖాళీగా, నిరుపయోగంగా ఉన్న భూములను బంజరు భూములుగా గుర్తిస్తారు. వీటిని రెవెన్యూ రికార్డులలో ప్రత్యేక గుర్తులతో సూచిస్తారు. 

అగ్రహారం: పూర్వకాలంలో బ్రాహ్మణులకు శిస్తు లేకుండా తక్కువ శిస్తుతో ఇనాంగా అందజేసిన కొంత భాగాన్ని అగ్రహారం అంటారు. 

అడంగల్‌: దీనినే పహాణి అని కూడా అంటారు. గ్రామంలోని సాగు భూముల వివరాలు ఈ దస్త్రం (రిజిస్టర్‌)లో నమోదు చేస్తుంటారు. దీన్నే గ్రామ లెక్కల మూడో నంబరు రిజిస్టర్‌గా పిలుస్తారు. దీనిని ఆంధ్రాలో అడంగల్‌ అని పిలుస్తుండగా.. తెలంగాణాలో పహాణీ అని పిలుస్తారు. 

చిట్టా: రోజువారీ వసూళ్లు తెలిపే రిజిస్టర్‌ను చిట్టా అంటారు. దీన్ని గ్రామ లెక్క నంబరు-6 అని అంటారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన నీటి పన్ను, భూమి శిస్తు వగైరాలను అసామీల వారీగా వసూలు చేసి రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. 

జమాబందీ: ప్రభుత్వానికి రావాల్సిన భూమి శిస్తు, నీటి పన్ను, ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడాన్ని జమాబందీ అని పిలుస్తారు. ఈ వివరాలు రెవెన్యూ లెక్కల్లోకి తీసుకు వచ్చారా లేదా అని నిర్థారించడం, గ్రామ, మండల రెవెన్యూ లెక్కల విస్తృత తనిఖీలు ఇందులో పొందుపరుస్తారు. 

అజమాయిషీ: భూమికి సంబంధించి గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే గ్రామ లెక్కలు ఉన్నదీ, లేనిదీ తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, వీఆర్వో రాసిన లెక్కల్లోని వివరాలను సంబంధిత తహశీల్దారు, ఉప తహశీల్దారు తనిఖీలు నిర్వహిస్తారు. తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్కనంబరు- 3లో నమోదు చేయాలి. ఈ విధంగా అజమాయిషీని ఏటా నిర్వహించాల్సి ఉంటుంది. 

దస్తావేజు: భూములకు సంబంధించిన కొనుగోళ్లు, అమ్మకాలు, కౌలుకు ఇవ్వడం, ఇతర లావాదేవీలను తెలియజేసే పత్రం. భూ బదలాయింపులు చేసే సమయంలో ఈ దస్తావేజులను చట్టపరంగా, రిజిస్ట్రేషన్‌  చేయించుకోవాలి. 

ఎన్‌కంబరెన్స్‌ సర్టిఫికెట్‌(ఈసీ): గ్రామ భూ స్వరూపాన్ని తెలియ జేసే ధ్రువపత్రాన్ని ఈసీ అని పిలుస్తారు. 32 ఏళ్లలోపు ఓ సర్వే నంబరు భూమికి గల లావాదేవీలను ఈసీ తెలియజేస్తుంది. 

ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ బుక్‌(ఎఫెఎంబీ): దీనిని ఎఫ్‌ఎంబీ టిప్పన్‌ అని కూడా అంటారు. గ్రామ రెవెన్యూ రికార్డులలో ఎఫ్‌ఎంబీ ఒక భాగం. దీనిలో గ్రామంలోని అన్ని సర్వేనంబర్లు, పట్టాలు, వాటికొలతలు ఉంటాయి. 

బందోబస్తు: వ్యవసాయ భూములను సర్వే నిర్వహించి, వర్గీకరణ చేపట్టడాన్ని బందోబస్తుగా పేర్కొంటారు. 

బీ-మెమో: ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్న వ్యక్తికి శిస్తు చెల్లించాలని ఆదేశిస్తూ ఇచ్చే నోటీసు. దానికి వారు అర్హులైతే కొనసాగిస్తారు. అనర్హులైతే తొలగిస్తారు. 

ఫసలీ: ఏటా జులై 1 నుంచి తర్వాతి సంవత్సరం జూన్‌ 30 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ‘ఫసలీ’ అంటారు. ఈ పదం మొఘల్‌ చక్రవర్తుల కాలం నుంచి వాడుకలో ఉంది. 

ఎకరం: ఇది భూమి విస్తీర్ణానికి సంబంధించిన కొలమానం. ఎకరం అంటే 4,840 చదరపు గజాల స్థలం లేదా 100 సెంట్ల స్థలం. (సెంటు అంటే 48.4 గజాల స్థలం) లేదా 40 కుంటలు. (కుంట అంటే 121 చదరపు గజాల స్థలం).

సోమవారం 03-08-2020 ఏడు పండుగలు

 ఈరోజు పలు పర్వదినాలు కలసివచ్చాయి.

1). శ్రావణ పౌర్ణమి- జంధ్యాల పౌర్ణమి.
2). రక్షాబంధన
3). హయగ్రీవజయంతి
4). గాయత్రీ జయంతి
5). లవకుశ జయంతి
6).సంస్కృతభాషా జయంతి.
7). విఖనసమహర్షి జయంతి.
వీటిని గురించి కొంచెం తెలుసుకొందాం!

మాన్యులందరికీ శ్రావణపౌర్ణమి సందర్భంగా అనేకమైన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. 

ఈరోజు చాలా ప్రత్యేకమైంది. 

ఏడు పండుగలు కలసివచ్చాయి.
వీటిలో
                                     🌷శ్రావణపౌర్ణమి- జంధ్యాల పౌర్ణమి అందరికీ తెలిసిందే! 

క్రొత్తజంధ్యాలను వేసుకోవడం ఇవాళ చేస్తారు. శ్రావణమాసంలో  వచ్చే పూర్ణిమ నాడు ఈ కార్యక్రమం చేస్తున్నారు.  అయితే,  పూర్ణిమ తిథితో పాటు, నక్షత్రం కూడా చూస్తారు. సూర్యోదయానికి
ఉత్తరాషాఢ ఉంటే ఆ రోజు పనికిరాదు.
శ్రవణం ఉంటే చాలు కొందరికి. 
సౌరమానాన్ని బట్టి కర్కాటకం పనికిరాదు. సింహంలో రవి ప్రవేశించాలి. ఇలా ఏవో నిబంధనలు ఉన్నాయి.  అవన్నీ మనకేం తెలుసు? అందుకే పంచాంగం చూసి, ఏ రోజున చేయాలో తెలుసుకొంటాం. ఆ రకంగా పంచాంగం మనకి ఉపయోగపడుతుంది.  పూర్వం పెద్దలు ఇవన్నీ చెప్పేవారు. ఇవాళ శాస్త్రం, సంప్రదాయం ఎరిగి,  నిర్దుష్టంగాను నిర్దిష్టంగాను చెప్పేవారు కరువైపోయారు.

జంధ్యాలు వేసుకోవడం  - ఋగ్వేదులకు రేపు, ఇతరులందరికీ ఇవాళ.

ఇవాళ జంధ్యాలు మార్చుకోవడమే కాదు..ఋషితర్పణాలు చేయాలి. బ్రహ్మచారులు ఉపాకర్మ చేసుకోవాలి.
కాండర్షులు అని వేదఋషులలో ఒక వర్గం. వారికి తర్పణం చేయాలి.

నూతనవస్త్రాలు ధరించాలి. కనీసం కౌపీనమైనా క్రొత్తది ధరించాలి. కటిసూత్రం (మొలత్రాడు) కొత్తది ధరించాలి. బ్రహ్మయజ్ఞం చెయ్యాలి. అప్పుడు కానీ ఈ నాటి కార్యక్రమం పూర్తికాదు.  ఇవాళ దోసెలు, తిమ్మనం చేస్తారు. ఇదీ నియతంగా చేసేదే!

🌷ఈ రోజు రక్షాబంధన దివసం!

దీనిని ఔత్తరాహుల సంప్రదాయంగా మనవాళ్ళు అనుకుంటారు.కానీ దేశమంతా దీనిని ఆచరించే సంప్రదాయం ఉండేది.  ఇవాళ రాఖీబంధన్ అని చేస్తున్నారు.  రక్షాబంధనమే వాడుకలో  అలా అయింది.

ఈ రక్షని కట్టినప్పుడు పఠించే మంత్రం కూడా మనకి పెద్దలు చెబుతారు.

యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,తేన త్వా మపి బధ్నామి రక్షే  మాచల మాచల

🌷ఈరోజు సాయంత్రం హయగ్రీవజయంతి.

విద్యాధిదేవత హయవదనుడు. వేదాలను రక్షించి, మధుకైటభులను సంహరించి,  బ్రహ్మకి వేదాలను ఉపదేశించాడు. క్షణంలో సగంకాలం హయగ్రీవుని ధ్యానిస్తే చాలు - ఆయన అనుగ్రహం లభిస్తుంది. వారి వాక్ప్రవాహం ముందు మందాకిని మందగిస్తుంది. అయితే, అందరికీ హయగ్రీవారాధనం లభించదు. పూర్వజన్మలో చేసిన పుణ్యం పరిపాకానికి వస్తేనే ఈ జన్మలో ఆ స్వామిని ఆరాధించగలుగుతాం.

🌷ఈ రోజు గాయత్రీ జయంతి కూడా. 

మంత్రాలలో చాలా గొప్పది, గాయత్రి.
గాయత్రీమంత్రంకంటే గొప్ప మంత్రం లేదు అని సూక్తి ప్రచురమైనది. ప్రతిదినం సంధ్యావందనంలో గాయత్రీమంత్రం జపిస్తాం. ముప్పొద్దులా తప్పకుండా చేయవలసింది, ఇది. సంధ్యావందనం  వైదికకార్యక్రమాలను నిర్వహించడానికి అర్హతను కలిగిస్తుంది.  గాయత్రీ జపం పాతక, ఉపపాతకాలనుండి రక్షిస్తుంది. తేజస్సు నిస్తుంది.

🌷ఈరోజు రామాయణాన్ని గానంచేసి లోకానికి అందించిన లవకుశుల జయంతి!

వీరు కవలు! సీతమ్మ బిడ్డలు. వాల్మీకి శిష్యులు.  మంచి విద్యావంతులు, సౌందర్యశాలులు, శౌర్యపరాక్రమాలు కలవారు. రామకథని గానంచేసి  లోకాన్ని, రామచంద్రునీ ఆనందడోలికల నుర్రూతలూగించారు.  రాముని సంతానమని తెలిసాక, యువరాజులైనారు. రాజుగా కుశుడు చాలా ప్రసిద్ధికెక్కాడు. వారిద్దరి పుట్టినరోజు ఇవాళ.

🌷ఈరోజు సంస్కృతభాషా దినోత్సవం

భాషకి పుట్టినరోజు చేయడం వింతగా ఉంటుంది కదా! దేవభాష సంస్కృతం. విజ్ఞాన ఖని సంస్కృతం. వేదాలు, ఉపనిషత్తులు ,వేదాంగాలు, దర్శనాలు, శాస్త్ర, పురాణ,ఇతిహాసాలు మొదలైనవన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి.  గొప్ప కవులు సంస్కృతంలో రచనలు చేసారు. కంప్యూటర్ అంగీకరించినభాష సంస్కృతం!
అపవర్గం గురించి చెప్పే ఒకేఒక్క భాష సంస్కృతం!

ఇన్ని విశేషాలు కల రోజు,  ఈరోజు.
కనుక ఈ శుభదినాన శుభాకాంక్షలు చెబుతూ,  ఈ విషయాలను మీ ముందు ఉంచడం జరిగింది.

🌷విఖనసమహర్షి జయంతి కూడా ఈరోజే!

వైఖానసాగమం పాటించేవారు విఖనోమహర్షి జయంతిని విశేషంగా జరుపుతారు.

ఇన్ని విశేషాలు కల ఈ శుభదినం అందరికీ అనేకమైన శుభాలను అనుగ్రహించాలి

విష్ణువు పంచాక్షరీ మంత్ర జపం

లింగ పురాణం ప్రకారం విష్ణువు పంచాక్షరీ మంత్ర జపం వలన సమస్త విశ్వ రహస్యం తెలిసినా తనను గురించి తాను తెలియలేదు. అలాగే బ్రహ్మ అష్టాక్షరీ మంత్ర ప్రభావంవలననే సమస్త ప్రకృతితో గూడిన విశ్వ రహస్యం తెలిసినది.తననుతాను తెలియలేదు. పరమేశ్వరుని చే వచించబడిన పంచాక్షరి వలన విష్ణువు నారాయణుని వలన వచించిన అష్టాక్షరీ వలన బ్రహ్మ వారు వారి గురించి వారు తెలుసుకొనుటకు వీలు పడలేదు. యప్పటికీ వారు చేయుచూ సృష్టిని నడపుచుంటిరి. మరి పరమేశ్వరుడు జప నామం రామ నామంతో వీటి అన్నింటికి అతీతమైన రమ శక్తి తత్వానికి ధ్యానించుచు సమస్త ప్రకృతిని నడపుచుంటిరి. యిక్కడ శక్తి అనగా యీ మూడింటికి మూల మైన శక్తి తత్వ మని భావన. అందుకే ఏ ఉపాసన అవసరం లేకుండా నీరసంగా నైనా యధాలాపంగానైనా రామ నామజపంతో ముక్తి. దాని విశిష్ట యింతని వర్ణింప లేనిది. అది పెద్దలు చెప్పినట్టు ఎంతో రుచి. చేస్తూనే ఉందాం.
*********************

*#ధర్మసందేహం*

*ఎవరు #బ్రాహ్మణులు - ఏది #బ్రాహ్మణవాదం*
ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం. బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు, బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మ��
************************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఏడవ అధ్యాయము*

*సముద్రమథనము - పరమశివుడు విషమును భక్షించి సురాసురులను కాపాడుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.13 (పదమూడవ శ్లోకము)*

*ఉపర్యధశ్చాత్మని గోత్రనేత్రయోః  పరేణ తే ప్రావిశతా సమేధితాః|*

*మమంథురబ్ధిం తరసా మదోత్కటా మహాద్రిణా క్షోభితనక్రచక్రమ్॥6552॥*

ఈ విధముగా భగవంతుడు పర్వతముయొక్క పై భాగమును పట్టుకుని, క్రింద ఆధారముగా కూర్మరూపమును ధరించి, దానిని నిలిపెను. సురాసురుల శరీరములయందు శక్తిరూపమునను , పర్వతమునందు  దృఢత్వ రూపమునను, వాసుకియందు నిద్రారూపమునను ప్రవేశించి, వారికి ఎట్టి కష్టము కలుగకుండగజేసి, అందరిని శక్తి సంపన్నులను గావించెను. దేవాసురులు బలగర్వితులై మిగుల వేగముగా సముద్ర మథనమును గావింపసాగిరి. అప్పుడు సముద్రము, మరియు అందలి జలజంతువులు క్షోభకు గురియయ్యెను.

*7.14 (పదునాలుగవ శ్లోకము)*

*అహీంద్రసాహస్రకఠోరదృఙ్ముఖశ్వాసాగ్నిధూమాహతవర్చసోఽసురాః|*

*పౌలోమకాలేయబలీల్వలాదయో దవాగ్నిదగ్ధాః సరలా ఇవాభవన్॥6553॥*

నాగరాజైన వాసుకి యొక్క భయంకరమైన వేలకొలది నేత్రముల నుండియు, ముఖముల నుండియు, నిశ్వాసలనుండి విషాగ్నులు వెలువడెను. వాటి పొగలవలన పౌలోముడు, కాలేయుడు, బలి, ఇల్వలుడు మొదలగు అసురులు తమ తేజస్సును కోల్పోయిరి. వారు దావానలముచే దగ్ధమైన తెల్లతెగడ చెట్లవలె కన్పట్టిరి.

*7.15 (పదునైదవ శ్లోకము)*

*దేవాంశ్చ తచ్ఛ్వాసశిఖాహతప్రభాన్  ధూమ్రాంబరస్రగ్వరకంచుకాననాన్|*

*సమభ్యవర్షన్ భగవద్వశా ఘనాః వవుః సముద్రోర్మ్యుపగూఢవాయవః ॥6554॥*

వాసుకి యొక్క శ్వాసాగ్నిశిఖలు దేవతలనుగూడ వదలిపెట్టలేదు. వారును తేజోవిహీనులైరి. వారి వస్త్రములు, మాలలు, కవచములు, ముఖములు పొగచూరి పోయెను. వారి ఈ దుస్థితిని జూచిన భగవంతుడు మేఘములను ప్రేరేపింపగ అవి వారిపై జలములను వర్షించెను. వాయువులు సముద్ర తరంగములపై వీచుచు చల్లదనమును, పరిమళములను ప్రసరింప జేసెను. వారికి హాయిని గూర్చెను.

*7.16 (పదునారవ శ్లోకము)*

*మథ్యమానాత్తథా సింధోర్దేవాసురవరూథపైః|*

*యదా సుధా న జాయేత నిర్మమంథాజితః స్వయమ్॥6555॥*

ఇట్లు దేవాసురులు సముద్రమును మథించుచున్నను దానినుండి అమృతము వెలువడలేదు. అపుడు పరాజయములను ఎరుగని శ్రీమహావిష్ణువు స్వయముగా సముద్రమును మథింపసాగెను.

*7.17 (పదునేడవ శ్లోకము)*

*మేఘశ్యామః కనకపరిధిః కర్ణవిద్యోతవిద్యున్మూర్ధ్ని  భ్రాజద్విలులితకచః స్రగ్ధరో రక్తనేత్రః|*

*జైత్రైర్దోర్భిర్జగదభయదైర్దందశూకం గృహీత్వా మథ్నన్ మథ్నా ప్రతిగిరిరివాశోభతాథో ధృతాద్రిః॥6556॥*

సంపూర్ణజగత్తునకు అభయ ప్రదాతయు, విశ్వవిజేతయు ఐన శ్రీహరి తన బలిష్థములైన భుజములతో వాసుకి సర్పమును పట్టుకొని, కూర్మరూపమున పర్వతమును మోయుచు, మందరాచలమును కవ్వముతో సముద్ర మథనమును చేయ సాగెను. మేఘమువలె శ్యామవర్ణముగల ఆయన శరీరముపై బంగారు పీతాంబరము రెపరెపలాడుచుండెను. విద్యుత్కాంతుల నిచ్చెడి కర్ణకుండలముల కాంతులు తలపై నొక్కులుదీరిన ముంగురులు మనోజ్ఞముగా నుండెను. నేత్రముల యందు ఎర్రని రేఖలు, కంఠమున వనమాలలు శోభిల్లుచుండెను. ఆ సమయమున ఆ స్వామి రెండవ పర్వతరాజువలె విలసిల్లుచుండెను.

*7.18 (పదునెనిమిదవ శ్లోకము)*

*నిర్మథ్యమానాదుదధేరభూద్విషం మహోల్బణం హాలహలాహ్వమగ్రతః|*

*సంభ్రాంతమీనోన్మకరాహికచ్ఛపాత్తిమిద్విపగ్రాహతిమింగిలాకులాత్॥6557॥*

ఆ పురుషోత్తముడు ఈ విధముగ సముద్రమును మథించుచుండగా అందలిజలము తీవ్రక్షోభకు గురియయ్యెను. అంతట చేపలు, మొసళ్ళు, నీటిపాములు, తాబేళ్ళు, భయముతో పైకి వచ్చి, అటునిటు పరుగులు తీయసాగెను. తిమి, తిమింగలములు మొదలగు జలజంతువులు సముద్రపు ఏనుగులు, గ్రాహములు, పెద్ద పెద్ద మొసళ్ళ వ్యాకుల పాటునకు లోనయ్యెను. అదే సమయమున మొట్టమొదట హాలాహలము అను భయంకరవిషము వెలువడెను.

*7.19 (పందొమ్మిదవ శ్లోకము)*

*తదుగ్రవేగం దిశి దిశ్యుపర్యధోవిసర్పదుత్సర్పద సహ్యమప్రతి|*

*భీతాః ప్రజా దుద్రువురంగ సేశ్వరా అరక్ష్యమాణాః శరణం సదాశివమ్॥6558॥*

ఆ భయంకర విషము దశదిశలయందును, పైన క్రింద సర్వత్ర వ్యాపించెను.దుర్భరమైన ఆ  విషమునుండి రక్షించుకొను ఉపాయము కనబడకుండెను. అందులకు భయభ్రాంతులైన ప్రజలు, ప్రజాపతులు తమను రక్షించువారు కనబడక సదాశివుని శరణుజొచ్చిరి.

*7.20 (ఇరువదియవ శ్లోకము)*

*విలోక్య తం దేవవరం త్రిలోక్యాః భవాయ దేవ్యాభిమతం మునీనామ్|*

*ఆసీనమద్రావపవర్గహేతోస్తపో  జుషాణం స్తుతిభిః ప్రణేముః॥6559॥*

శంకరభగవానుడు, సతీదేవితో గూడి కైలాస పర్వతముపై విరాజిల్లుచుండెను. మహర్షులు, మునులు, ఆ ప్రభువును సేవించుచుండిరి. ముల్లోకవాసుల క్షేమమునకును, మోక్షమునకును ఆ శివుడు తపమొనరించు చుండెను. ప్రజాపతులు ఆ మహాదేవుని దర్శించి, ప్రణమిల్లి ఇట్లు స్తుతింపసాగిరి-

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*

*శ్రీమాత్రేనమః*
*52వ నామ మంత్రము*

*ఓం శివ కామేశ్వరాంకస్థాయై నమః*

శివస్వరూపుడు, కామస్వరూపుడు అయిన కామేశ్వరుని (శివుని) అంకమును (తొడను) స్దానముగా  విరాజిల్లు శ్రీమాతకు నమస్కారము

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివ కామేశ్వరాంకస్థా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును ఉచ్చరించుచూ ఆ శ్రీమాతను ఉపాసించు సాధకునికి ఆత్మానందము, భౌతికసంబంధమైన సుఖసంతోషములు సంప్రాప్తమగును

నిర్గుణుడై సగుణ స్థితిని పొందిన కామేశ్వరుని యొక్క వామాంకము నందు ఉండునది శ్రీదేవి. ఈ నామము చాలా ప్రశస్తమైనది. ఇది శ్రీమాత నివాసస్థలము. దీనిలో రెంఢు నామములు తెలుపబడినవి. 1) శివుడు, 2) కాముడు. శివుడు మంగళప్రదుడు. శుభంబులను ప్రసాదించువాడు. శివపరమాత్మకు తల్లి, తండ్రి లేరు. ఆయస అవతరణకు అంతు, ఆధారము లేదు. సర్వము ఆయన విలాసమే. శివుని నుండే శ్రీజగన్మాత, జగత్తు రూపంగా వ్యక్తమైనది. ఈ విశ్వం వ్యక్తం కానప్ఫుడు తానొక్కడుగా ఉన్న శివుడు ఒక బిందువుగా వ్యక్తమగుతాడు. శివుడు ప్రపంచానికి ప్రధముడు. *అంకము* అనగా ఒక గుర్తు. *మచ్చ* అని గమనించాలి. కావున *శివుడి అంకము* అనగా బిందువు అని భావము. ఈ విధంగా కామేశ్వరుని అంకము అనవచ్చును. పూర్తిగా వ్యాపించిన బిందువు. అనగా ఈ బ్రహ్మాండము వరకు అని గ్రహించదగును. ఈ ప్రకారముగా, శివుని అంకస్థితి నుండి కామేశ్వరుని అంకస్థితి వరకు అనగా బిందువు నుండి బ్రహ్మాండము పరిణామము వరకు సృష్టి స్థాపింపబడినది. ఈ సువిశాల  విశ్వమంతయూ అమ్మవారి నుండి ప్రభవమైనది. అని గ్రహించాలి. *శివకామేశ్వరాంకస్థా* అను నామ మంత్రము చాలా ప్రాముఖ్యము వహించియున్నది. ఇది శ్రీమాత నివాస స్థలము. *సుధాసింధోర్మధ్యే పరమశివపర్యంకనిలయా* అని సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు 8వ శ్లోకములో వివరించిన విధానము 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సౌందర్యలహరి - 8వ శ్లోకము*

*సుధాసింధోర్మధ్యే - సురవిటపివాటీపరివృతే*

*మణిద్వీపే నీపో-పవనవతి చింతామణి గృహే |*

*శివకారే మంచే - పరమశివపర్యంక నిలయామ్*

*భజంతి త్వాం ధన్యాః - కతిచన చిదానందలహరీమ్ || 8 ||*

అమ్మా...అమృతసముద్రము మధ్యలో కల్పవృక్షాలతో నిండియున్న మణిద్వీపంలో, కదంబపుష్ప వృక్ష  తోటలో,చింతామణులతో నిర్మించిన గృహమునందు,త్రికోణాకారపు మంచము మీద,పరమశివుని పర్యంకస్థితవై ప్రకాశించుచు,జ్ఞాన స్వరూపమై నిరతిశయ సుఖప్రవాహరూపముగా ఉన్న నిన్ను స్వల్ప సంఖ్యాకులైన ధన్యులు మాత్రమే సేవించుకోగలుగుతున్నారు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శివ-కామేశ్వర పదములు ప్రజ్ఞాన బోధకములు. అంకస్థగా వర్ణితమైన పరాశక్తి అమ్మవారు అటువంటిదియే అగును. అనగా శివునికి, శక్తికి భేదము లేదు. అందుచే పరాశక్తికి నామరూపాదులు లేవు. అయిననూ  స్థూల శరీర ధారులైన భండాసుర మహిషాసురాదులను  వధించుటకై కరచరణాది కల్పితమైన రూపమును పరాశక్తి ధరించినది. వాస్తవానికి లలితాంబికా పరాశక్తికి భేదాలు లేవు. అందుచే శివకామేశ్వర పదములకు మంగళకరమైన ప్రజ్ఞానము అని గ్రహింపదగును.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివకామేశ్వరాంకస్థాయై నమః* అని అనవలెను

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* అనుగ్రహముతో, వారి విరచితమైన *శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ*  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
నేడు సోమ వారము. ఇందు వారము అని కూడా అంటాము. నీలకంఠుని ఆరాధించు పవిత్రమైన దినము. *ఓం నమశ్శివాయ* అనే ఈ పంచాక్షరిని పదిసార్లు మననం చేసుకుందాము.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఏడవ అధ్యాయము*

*సముద్రమథనము - పరమశివుడు విషమును భక్షించి సురాసురులను కాపాడుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ప్రజాపతయ ఊచుః*

*7.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*దేవదేవ మహాదేవ భూతాత్మన్ భూతభావన|*

*త్రాహి నః శరణాపన్నాంస్త్రైలోక్యదహనాద్విషాత్॥6560॥*

*ప్రజాపతులు ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*- "దేవతలకు ఆరాధ్యుడవైన మహాదేవా! నీవు సకల ప్రాణులకును ఆత్మవు. జీవనదాతవు. మేము నిన్ను శరణు జొచ్చుచున్నాము. ముల్లోకములను దహన మొనర్చుచున్న ఈ భయంకర విషము నుండి మమ్ములను రక్షింపుము.

*7.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*త్వమేకః సర్వజగత ఈశ్వరో బంధమోక్షయోః|*

*తం త్వామర్చంతి కుశలాః ప్రపన్నార్తిహరం గురుమ్॥6561॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

జగత్తులోని సకల జనులకు బంధములను కలిగించుటకును, ముక్తి నొసంగుటకును నీవు ఒక్కడవే సమర్థుడవు. కనుక జ్ఞానులు నిన్నే ఆరాధించెదరు. ఏలయన, నీవు శరణాగతుల బాధలను తొలగించునట్టి జగద్గురుడవు.

*7.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*గుణమయ్యా స్వశక్త్యాస్య సర్గస్థిత్యప్యయాన్ విభో|*

*ధత్సే యదా స్వదృగ్భూమన్ బ్రహ్మవిష్ణుశివాభిధామ్॥6562॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

ప్రభూ! త్రిగుణాత్మకమైన నీ శక్తిద్వారా ఈ జగత్తును సృష్టించుటకును, పాలించుటకును, ప్రళయమొనర్చుటకును, పరబ్రహ్మమైన నీవు బ్రహ్మ, విష్ణువు, శివుడు మొదలగు పేర్లతో ఒప్పుచుందువు.

*7.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*త్వం బ్రహ్మ పరమం గుహ్యం సదసద్భావభావనః|*

*నానాశక్తిభిరాభాతస్త్వమాత్మా జగదీశ్వరః॥6563॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

నీవు స్వయంప్రకాశుడవు. పరమ గోప్యమైన బ్రహ్మతత్త్వమునకు నీవే కారణుడవు. దేవతలు, మనుష్యులు, పశుపక్ష్యాదులు, వృక్షములు, మొదలగు చరాచరప్రాణులకు నీవే జీవనదాతవు. నీవు లేకుండా ఈ సృష్టియు, దాని అస్తిత్వము గూడ ఉండదు. ఏలయన, అన్నింటికిని నీవే ఆత్మవు. అనేక శక్తుల ద్వారా నీవే జగద్రూపమున ప్రతీతమగుచుందువు. నీవు సర్వేశ్వరుడవు. సర్వసమర్థుడవు.

*7.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*త్వం శబ్దయోనిర్జగదాదిరాత్మా  ప్రాణేంద్రియద్రవ్యగుణస్వభావః|*

*కాలః క్రతుః సత్యమృతం చ ధర్మస్త్వయ్యక్షరం యత్త్రివృదామనంతి॥6564॥*

సమస్త వేదములు నీ నుండియే ప్రకటములైనవి. కనుక, స్వయముగా జ్ఞానస్వరూపుడవైన నీవే సకల శాస్త్రజ్ఞానములకు మూలము. జగత్తునకు ఆదికారణమైన మహత్తత్త్వము, మూడు అహంకారములు (సాత్ప్విక, రాజస, తామస అహంకారములు) నీవే. ప్రాణములు, ఇంద్రియములు.పంచమహాభూతములు,అట్లే, శబ్దాది విషయములయొక్క వేర్వేరు స్వభావములు, వాటి మూలకారణములును నీవే. ప్రాణుల యొక్క ఆయువును వృద్ధిచేయుటకును, తగ్గించుటకును కారణమైన కాలస్వరూపుడవు నీవే. శుభములను ప్రసాదించు యజ్ఞములు, సత్యవాక్యములు, ధర్మము యొక్క స్వరూపములు నీవే. అ, ఉ, మ్ (ఓమ్) అను మూడక్షరములతో కూడిన ఓంకార స్వరూపుడవు నీవే. త్రిగుణాత్మకమైన ప్రకృతియు నీవేయని వేదవేత్తలు పేర్కొందురు.

*7.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*అగ్నిర్ముఖం తేఽఖిలదేవతాత్మా  క్షితిం విదుర్లోకభవాంఘ్రిపంకజమ్|*

*కాలం గతిం తేఽఖిలదేవతాత్మనో దిశశ్చ కర్ణౌ రసనం జలేశమ్॥6565॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

ముల్లోకములకు అభ్యుదయమును చేకూర్చునట్టి శంకరా! సర్వదేవతాస్వరూపుడైన అగ్ని నీముఖము, పృథ్వి నీ పాదపద్మములు. కాలమే నీ గమనము, దిక్కులు నీ కర్ణములు. వరుణుడు నీ నాలుక. నీవు సకల దేవతా స్వరూపుడవు.

*7.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*నాభిర్నభస్తే శ్వసనం నభస్వాన్ సూర్యశ్చ చక్షూంషి జలం స్మ రేతః|*

*పరావరాత్మాశ్రయణం తవాత్మా  సోమో మనో ద్యౌర్భగవన్ శిరస్తే॥6566॥*

*7.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*కుక్షిః సముద్రా గిరయోఽస్థిసంఘాః రోమాణి సర్వౌషధివీరుధస్తే|*

*ఛందాంసి సాక్షాత్తవ సప్తధాతవస్త్రయీమయాత్మన్ హృదయం సర్వధర్మః॥6567॥*

*ప్రజాపతులు ఇంకను ఇట్లు సదాశివుని స్తుతింపసాగిరి*

పరమేశ్వరా! ఆకాశము నీ నాభి, వాయువు నీ శ్వాస, సూర్యుడు నీ నేత్రములు. జలము నీ రేతస్సు. ఉన్నత-నిమ్న జీవులందఱికిని నీ స్వరూపము ఆశ్రయము. చంద్రుడు నీ మనస్సు. స్వర్గము నీ శిరస్సు. వేదస్వరూపుడవైన పరమాత్మా! సముద్రములే నీ ఉదరము. పర్వతములు నీ అస్థిసమూహములు. ఓషధులు, లతాగుల్మములు నీ రోమములు. గాయత్రి మొదలగు ఛందస్సులు నీ సప్తధాతువులు. సకలధర్మములు నీ  హృదయము.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

గాయత్రీ పాడ్యమి జపోత్సవం


ॐॐॐॐॐॐॐॐॐॐॐॐ
తేదీ 4--8-2020 మంగళ వారం శ్రావణ పూర్ణిమ మరుసటి రోజు శ్రావణ బహుళ పాడ్యమిని"గాయత్రీపాడ్యమి, గాయత్రి జపం, గాయత్రి ప్రతిపద గా "ఆపస్తంభ ధర్మ సూత్రం ప్రకారం జరుపుకొంటారు. 
యజ్ఞోపవీతధారులు తెలిసో తెలియకో దొర్లిన దోషాలప్రాయశ్చిత్త రూపమే ఈ గాయత్రీ ప్రతిపద సమాచరణ.
  ప్రస్తుతపరిస్థితిదృష్ట్యా సామూహికంగా  చేయలేం కనుక ఎవరి ఇంటి వద్ద వారే ఆచరించ వచ్చు. ఉదయాన్నే లేచి నిత్య అనుష్ఠానాలను పూర్తి చేసి "మిథ్యాదీతదోషప్రాయశ్చిత్తార్దం సహస్ర గాయత్రీ మంత్రజపం కరిష్యే " అని సంకల్పించి సహస్ర గాయత్రీ జపం చేయాలి .ఆ తర్వాత ఉత్తమేశిఖరే జాతే భూమ్యాం పర్వత మూర్థనీ బ్రాహ్మణేభ్యో అభ్యనుజ్ఞాతా గచ్చదేవి యథాసుఖమ్ - అని గాయత్రి అమ్మ వారిని స్తుతించి, కేశవనామాలు చదివి సమాప్తం చేయాలని మనవి చేస్తున్నాము. 
దయచేసి ఈ సందర్భంగా జపం చేసిన ప్రతి ఒక్కరూ తమ ఫోటో మరియు ఒక నిమిషం వీడియో చిత్రీకరణ శ్రీ వినోద్ కుమార్ మహావాది. అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ సెల్ watsup number. +919000013755 కు పంపగలరు. facebook లో post చేసి vinod mahavadi అని tag చేయ గలరు 
ఈ విషయాన్ని ఎంత మంది ఉంటే అంత మందికి Share చేసి తెలప గలరు 
ప్రపంచంలో ఉన్న బ్రాహ్మణులు కలిసి జపం చేసిన చో లక్ష ల సంఖ్య లో గాయత్రి జప యజ్ఞం జరిగి ప్రకృతి శాంతిస్తుంది అని నమ్మకం
******************

తులసి మొక్క ప్రాధాన్యత



భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది. తులసిలేని హిందువుల ఇల్లు
ఉండదు. తులసి లక్ష్మీ స్వరూపం.

అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు? తులసి ప్రత్యేకత ఏమిటి?

మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే, అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్య, వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి. మనకు అవి తెలియవి, అంతే. తులసి గురించి ఒక నాలుగు మాటలు చెప్పుకుందాం.

మాములు మొక్కలు, చెట్లు ఉదయం మొత్తం కార్బన్-డై-ఆక్సయిడ్ పీల్చుకుని, ఆక్సిజెన్ వదులుతాయి, రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్వన్-డై-ఆక్సైడ్ మొత్తాన్నీ పర్యావరణంలోనికి విడిచిపెడతాయి.


కానీ తులసి మాత్రం రోజులో 22 గంటల పాటు ఆక్సిజెన్ (ప్రాణవాయువు) ను విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది. వృక్షజాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు.

తులసి ఔషధగని. తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారు. తులసి కున్న ఘాటైనవాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు, దోమలు, పాములు రావు.

అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు, వెనుకా కూడా తులసిమొక్కను పెట్టి పూజించమన్నారు, ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి.

తులసిలో విద్యుఛ్చక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది.

తులసి ఏ ఇంటిలో ఉంటే, ఆ ఇంటి మీద పిడుగు పడదని పరిశోధకులు తేల్చారు.

తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మనం శరీరం గ్రహిస్తే, ఆరోగ్యం చేకూరుతుంది, అందుకోసమే తులసమ్మకు నీరు పోసి, చుట్టు ప్రదక్షిణం చేయాలి. అప్పుడు తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా, ఆరికాళ్ళలోకి చేరి, నాడీ మండలాన్ని ప్రభావితం చేస్తుంది.

తులసి ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంధాలు చెప్పాయి. దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడ అంగీకరించారు.

ప్రపంచాన్ని హడలుగొట్టిన స్వైన్‌ప్లూ భారత్‌లో స్వైరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది.



తులసి గాలి కారణంగా జనంలో స్వైన్‌ప్లూను తట్టుకునే రోగనిరోదక శక్తి పెరిగిందట.

అంటే మన తులసమ్మ మనకు ఆయుషు పోసిందన్నమాట. ఏ ఇంట్లో అధికంగా తులసిమొక్కలు ఉంటాయో, ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు.

తులసిచెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. తాజ్‌మహల్ కాలుష్యం బారినపడి మసకబారకుండా ఉండడం కోసం, తాజ్‌మహల్ పక్కనే, లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు.


అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం, ధ్యానం, యోగా మరిన్ని మంచి ఫలితాలని ఇస్తాయి. కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కైనా పెంచాలి.

నల్గోండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాప్తిని తగ్గించడానికి ప్రభుత్వం ఎంతో ప్రయత్నం చేస్తోంది. తులసి ఆకులు నీటిలోని ఫ్లోరోసిస్ వ్యాపితిని తగ్గిస్తాయని ఈ మధ్యే దృవీకరించారు.


మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే, రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు. ఇది తులసి మహాత్యం.

తులానాం నాస్తి ఇతి తులసి అన్నారు, దేని గురించి ఎంత చెప్పుకున్నా, ఇంకా చెపుకోవలసినది మిగిలి ఉంటుందో, దాన్ని తులసి అంటారని అర్దం.

తులసి ప్రాధాన్యత గుర్తించారు కాబట్టే జపాన్‌లో కూడా ప్రతి ఇంటిలో తులసి చెట్టు తప్పక పెంచుతారు    

రామాయణమ్.19

అంశుమంతుడు తన పినతండ్రులు వెడలిన దారిలో ప్రయాణంచేసి వారు భస్మరాశిగా మారిన చోటికి వెళ్లగా అక్కడ ఆతనికి బూడిదకుప్పలు,ఒక చోట మేయుచున్న అశ్వము కనిపించాయి.
.
తన పిన తండ్రులకు జల తర్పణములివ్వవలెనని చుట్టూ కలియచూశాడు ఎక్కడా చుక్క నీరుకూడా కనపడలేదు.
.
అప్పుడు అంశుమంతునకు ఆతని పిన తండ్రుల మేనమామ గరుత్మంతుడు కనపడి వీరికి మామూలు నీటితో తర్పణము విడువరాదు పావనగంగోదకము తో ఇచ్చిన తర్పణము మాత్రమే వీరికి పుణ్యలోకాలు కలుగచేస్తుంది .
.
ప్రస్తుతమునకు నీవు ఈ గుర్రము తీసుకొని వెళ్ళి యాగమును పూర్తిచేయించుము అని తెలిపినాడు అప్పుడు అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకొని తన పట్టణము చేరుకొన్నాడు.
.
అంశుమంతుని ద్వారా సగరచక్రవర్తి ఈ వార్తను విన్నవాడై తీవ్రమైన వేదనతో దుఃఖిస్తూ గంగను భువికి తెచ్చే ఉపాయము కానరాక మిన్నకుండినాడు.
.
కొంతకాలానికి అంశుమంతుడు రాజైనాడు.ఆయనకు దిలీపుడు అనే కొడుకు కలిగాడు.
.
దిలీపుడు కూడా గంగను తెచ్చే మార్గము కనుగొనలేకపోయాడు.
.
ఆ దిలీప మహారాజుకు పరమ ధార్మికుడైన భగీరధుడు పుత్రుడుగా జన్మించాడు.
.
భగీరధుడి మనస్సులో తన పూర్వీకుల అధోగతి గురించి తీవ్రంగా మధనపడుతూ ఉండేవాడు,
.
ఒకరోజు ఆయన తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి గోకర్ణక్షేత్రానికి వెళ్లిపోయాడు .
అక్కడ ఆయన తన చేతులు పైకెత్తి ,నెలకొక్కసారి మాత్రమే భోజనం చేస్తూ వేలసంవత్సరాలు తపస్సుచేసాడు..
.
ఆయన తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై గంగ భూమికి వచ్చునట్లుగా అనుమతించి ,ఇక్ష్వాకు వంశానికి సంతానలోటు లేకుండా వరమిచ్చి అంతర్ధాన మయ్యాడు.
.
ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడ్డది భగీరధుడికి !
.
తీవ్రమైన వేగంతో గంగ భూమిమీద దూకినప్పుడు ఆమెను భరించే సమర్ధత ఒక్క పరమశివుడికే మాత్రమే ఉన్నది .
.
వేరే దారిలేక మరల శివానుగ్రహంకోసం ఒక సంవత్సరకాలం కేవలం బొటనవేలును ఆసరాగా చేసుకొని నిలబడి ఘోరతపస్సుచేశాడు..
.
పరమశివుడు ప్రత్యక్షమై ఆతని అనుగ్రహించాడు.
.
గంగను ఆకాశం నుండి దిగమని ప్రార్ధించాడు భగీరధుడు! 
.
అహంకారంతో శివుడు ఎట్లా తట్టుకుంటాడో చూద్దామని ఒక్క ఉదుటున అతివేగంగా భూపతనం చెందింది గంగ. మహాశివుడిని తోసుకుంటూ పాతాళానికి వెళ్ళాలని గంగ ఆలోచన.
శివుడు అదిగ్రహించి తన జటాజూటంలో గంగను బందీ చేశాడు.
.
అక్కడనుండి బయటపడే దారిలేక విలవిల లాడింది గంగ.
.

జానకిరామారావు వూటుకూరు గారి 
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక