23, ఫిబ్రవరి 2023, గురువారం

బ్రాహ్మణ సేవా వాహిని

 *బ్రాహ్మణ సేవా వాహిని (BSV)*

*💊అత్యవసర వైద్య సహాయ పథకం💊*

---------------------------------------------------------

🔸బ్రాహ్మణుల్లో ఎవరికైనా ప్రమాదవశాత్తు శరీరంలో పార్ట్ దెబ్బతిన్న,

🔸వాహన ప్రమాదం జరిగిన

🔸క్రింద పడి జారీ పడి శరీరానికి గాయాలు తగిలిన

🔸అగ్ని ప్రమాదాలు జరిగిన

ఇంకా ఏవైనా ప్రమాదవశాత్తు ఏది జరిగినా వెంటనే బ్రాహ్మణ సేవా వాహిని నుండి...

*అత్యవసర చికిత్స సహకారం క్రింద*

⭕ *30 వేల నుండి 50 వరకు హాస్పిటల్ కర్చు*

⭕ *ఇంకా మెడిసిన్ తక్కువలో అందజేసే ప్రయత్నం చేస్తుంది*

⭕ *పూర్తిగా ప్రమాదం జరిగి ఏమి చేసుకోలేని పరిస్థితులో ఉన్న లేక మరణించిన*

*3 లక్షల నుండి 5 లక్షల వరకు*

⭕ *దహన సంస్కారాల నిర్వహణకు 10 వేల వరకు వెంటనే ఆర్ధిక సహాయం అందిస్తుంది*

⭕ *పిల్లల చదువులకు సహకారం*


✍️ *పూర్తి వివరాలకు వెంటనే ప్రతిఒక్క బ్రాహ్మణుడు మార్చ్ 5  ఆదివారం రోజున  జరిగే సమావేశానికి వచ్చి మీ పేర్లు నమోదు చేసుకోండి*


సమయం

*ఉదయం 11 నుండి* *సాయంత్రం 4 వరకు*


వేదిక🏛️

*భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాలు గ్రౌండ్,*

*హనుమాన్ టెంపుల్ పక్క  లేన్,ఓల్డ్ పోలీస్ స్టేషన్,నేరెడ్ మెట్, మల్కాజ్ గిరి*


మీ

*బ్రాహ్మణ సేవా వాహిని BSV*

*రాష్ట్ర అధ్యక్షులు*

*రఘు కిరణా చార్యులు*

*83284 90238*


*ఈ విషయం అందరికీ తెలియజేసేలా అన్ని గ్రూప్స్ కి forwed చేయండి👉*

కోరికలను వదులుట చాలా కష్టము.

 . *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_*


*శ్లో𝕝𝕝 దుర్లభో విషయత్యాగో*

 *దుర్లభం తత్త్వదర్శనమ్।*

*దుర్లభా సహజావస్థా*

 *సద్గురోః కరుణా వినా॥*


*తా𝕝𝕝 విషయములయందు గల కోరికలను వదులుట చాలా కష్టము.....తత్త్వదర్శనము గాంచుట అంతకంటెనూ కష్టము....సహజావస్థను పొందుట అనగా ఆత్మదర్శనము పొందుట మరీ కష్టము*.....*సద్గురువు లభించి ఆయన అనుగ్రహముప్మ శుభం లభించినచో వీటిని ఎవరైననూ సాధించగలుగుతారు*....

వేదాంతము

 . *వేదాంతము*


▪️వేదాంతము అనగా అతి ఉత్కృష్ఠజ్ఞానం అయిన బ్రహ్మమును ( దేవుడు) తెలుసుకోవటం కొరకు నిర్దేశించడిన *ఆధ్యాత్మిక గ్రంథముల చివరి భాగములు.*


▪️ వీటినే *ఉపనిషత్తులు* అని పిలుస్తారు. వేదాంతమునకు అర్ధం అంత్యజ్ఞానం. వేదములు అనేవి ఏ ఒక్క గ్రంథము నుండో గ్రహించినవి కావు. *అవి స్వతస్సిద్ధములు, అపౌరుషేయములు. వ్రాయబడినవి కావు*.


▪️ వేదాంతమును 'ఉత్తరమీమాంస' అని కూడా చెప్పబడింది. అనగ తరువాతి విచారణ లేదా అధికోన్నత విచారణ అని అర్ధం. ఈ నామం 'పూర్వమీమాంస' యజ్ఞ, యాగాదులు, ఉపాసనలకు సంబంధించిన మంత్రముల సముదాయము. (వేదాలలోని సంహిత భాగం).


♦️వేదములే మన మనుగడకు ఆధారము. ఇది అందరకు తెలిసిన విషయము. కొద్ది మందికి మాత్రమే తెలిసిన లోతైన విషయమును, నలుగురికి తెలియచేసే అవకాశము కల్పించిన వారికి ధన్యవాదములు.


▪️ నాల్గు వేదములలో, ప్రతి వేదమును రెండు భాగములుగా విభజించవచ్చు. *మొదటి భాగము కర్మకాండ కాగా, రెండవది లేక చివరి భాగము అయినవి వేదాంతములు అని చెప్తారు*. వీటినే పూర్వమీమాంస, ఉత్తర మీమాంస అని కూడా తెలుసుకొన వచ్చు.


▪️ప్రతి వేదములోని ప్రథమ భాగములో, కర్మకాండ విషయములు *అనగా ధర్మబద్ధంగా మనిషి యొక్క జీవన విధానాన్ని నిర్ధేశించబడి ఉన్నాయి*.


▪️ దీని ఆధారముతోనే మనుస్మృతి (మనువుచే వ్రాయబడినది, ధర్మసూత్రములు (జైమిని కారులచే వ్రాయబడినవి) వచ్చాయి.


▪️యోగాదులు, ధ్యానం, ఆయుర్వేదం, ఇది అది అని చెప్పనవుసరము లేదు. *హైందవ సాంప్రదాయంలో మానవునికి కావలసిన అన్ని ధర్మసూక్ష్మములు ఇక్కడే లభ్యం*. దీనినే అపర విద్య అని చెప్పారు. ఇది క్లుప్తంగ ఇంత వరకు తెలుసుకుందాము.


▪️ఇక రెండవది ఉత్తరభాగం. *దీనినే ఉపనిషత్తులు అని చెప్పారు*. ఈవిద్య పరవిద్య.


▪️ వేయికి పైగా ఉపనిషత్తులు ఉండగా, 108 మాత్రము బాగా లభ్యము కాగా, అందులో 10 ఉపనిషత్తులు, అంటే దశోపనిషత్తులు మాత్రము ముఖ్యముగా ప్రాచుర్యము పొంది ఉన్నాయి.


▪️ఈ దశోపనిషత్తులకు మాత్రమే, ఆదిశంకరులవారు వ్యాఖ్యానములు వ్రాసి ఉన్నారు. అవే మనకు రక్ష అయి ఉన్నాయి.


▪️ పరమాత్మ, *సృష్టికర్త* అయిన భగవంతుని యథార్థ ఉనికి తెలుసుకోదలచిన వారికి ఇవే శరణ్యం. ఇందలి రహస్యములను, సూత్రములుగా వ్రాసినారు వేదవ్యాసభగవానుడు. *ఆవే బ్రహ్మసూత్రములు*. వీటికి గూడ భాష్యము వ్రాసినారు ఆదిశంకరులవారు.


▪️ఈ పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని చెప్పబడే ఈ వేదములు, పరాపర విద్యలని తెలుసుకోవాలి. ఇవి యెవరో ఒక వ్యక్తిచే గాని, మరేదయినా పద్ధతిలో వ్రాయబడి వుండలేదు. కేవలము వినపడినవి. *శ్రవణములు మాత్రమే. అందు వలననే వానిని *అపౌరుషేయములని అన్నారు*.


▪️అనగ ఏ మానవుని సృష్టి కాదు. ఈ భాగమునకు (ఉపనిషద్ భాగమునకు) రాగానే, గురువుగారు, మునుపటి భాగములో చెప్పిన సర్వమును ఖండించి, నేతి నేతి మాటలతో, జగన్మిథ్య, ( *అనగా జగత్తు పరమాత్మచే కల్పితము మాత్రమే*) అనియు, పరమాత్మయే సత్యం అని బోధించుతారు.


▪️ఇక్కడ కర్మకాండ పూర్తిగా నిషేధించ బడుతుంది. కర్మ ఖాండ నిషేధమునకు ఒప్పుకొ గల్గిన, *శమదమాదులు కలిగిన ఉత్తమ అధికారత్వము పొందిన వారికి మాత్రమే ఈ శాస్త్రము అబ్బుతంది*. శాస్త్రం వారిని "కశ్చిత్ ధీరాః" ఒకానొక ధీరుడు లేక వివేకి మాత్రమే ఈ శాస్త్రార్ధం గ్రహించగలడు అని నిష్కర్షగ చెప్తుంది.


▪️పూర్వపు రోజులలో, వర్ణాశ్రమ ధర్మము ననుసరించి, బ్రహ్మచర్య ములో గురుకులములకు వెళ్ళి, వర్ణముతో నిమిత్తము లేకుండ, విద్యనభ్యసించవలెను.


▪️తరువాత గృహస్తాశ్రమములో తాము మునుపటి ఆశ్రమములో అభ్యసించిన విద్యతో, ధర్మ మార్గములో జీవనము సాగించెడివారు.


▪️వర్ణాశ్రమ ధర్మముల గురించి ఇంకను వివరముగ చెప్పవలసి ఉంది.


▪️ఈ బాటలోనే శ్రీకృష్ణ పరమాత్మ, తన బాల్యములో, బ్రహ్మచర్యాశ్రమము ననుసరించి, సాంధీప మహాముని గురుకులములో తన సహపాటీలు కుఛేలుడు, అన్న బలరాముడుతో కలసి పర అపర విద్యలను అభ్యసించాడు. *ఆ విద్యను, అర్జునునకు యుధ్దభూమిలో భగవద్గీతగా చెప్పినాడు.*


▪️అందువలననే గీత ఉపనిషత్ సారాంశము అయినది. *అందులో పర, అపర విద్యలు (అపర విద్య = కర్మఖాండ, పర విద్య = పరమాత్మ యొక్క యధార్థ ఉనికి) ధర్శనమిస్తాయి*. అంటే జీవన విధానము (ధర్మ, అర్ధ, కామ) + జీవన రహస్యము (మోక్షము), ఈ రెండు తప్ప ఇతర విషయములకు తావు లేదు. ఇదే పూర్ణ విద్య.


▪️ఈ రెండు విద్యలను, శ్రీరాములవారు తన బాల్యములో వశిష్టుల వారికి శిష్యుడయి, అభ్యసించి నాడు. అదే యోగవాశిష్టము అయినది.


▪️దానిని గీత అన్నను సరియే అగును. *కనుక ఈ విద్య గురు శిష్య పరంపరగా ఈనాటికి సాగుతూ వస్తున్నది*. ఇది మరుగుపడుట, ఏమైపోతుందో ననే భయము అక్కరలేదు. రహస్యమేమిటి.


▪️ఇది ఆతని (అనగా పరమాత్మ యొక్క ఉనికిని చాటే) శాస్త్రము కనుక, తన శాస్త్రమునకు తానే రక్షకుడు. అలాగుననే ఈ జగత్తుకు తానే రక్షకుడు.