30, నవంబర్ 2021, మంగళవారం

క‌లం మూగ‌బోయింది

 క‌లం మూగ‌బోయింది..... తాను ఇంక ఎవ‌రిద్వారా భావాల్ని ప‌లికించాలంటూ రోదిస్తోంది... త‌నతో ఎన్నో భావాల్ని అల‌వోక‌గా కురిపించిన ఆయ‌న లేరనే వార్త‌ను జిర్ణించుకోలేని క‌లం ఇక నేను తెల్ల‌కాగితాన్ని అలానే వుంచుతానా అంటూ క‌నిపించిన వారిని అడుగుతూ కుమిలిపోతోంది..... 

దాద‌పు 30 సంవ‌త్స‌రాల పాటు ఆయ‌నతో మ‌మేక‌మే న‌వ‌ర‌సాల్ని అల‌వోక‌గా అల‌తితొల‌తి మాట‌ల‌తో సామాన్య ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుని ఏ సంద‌ర్భానికైనా ప‌లికే పాట‌ల్ని రాయించిన ఆయ‌న లేర‌నే మాట న‌మ్మ‌లేని క‌లం సొమ్మ‌సిల్లింది.....


సిరివెన్న‌ల సీతార‌మశాస్త్రి  ఇక లేర‌నే వార్త యావ‌త్త్ సిని ప్ర‌పంచంతో పాటు సాహితీ ప్రియులు  దిగ్భ్రాంతికి గుర‌వుతున్నారు... వారం క్రితం దాకా త‌మ‌తో ఎంతో ఆప్యాయంగా గ‌డిపిన ఆయ‌న ఒక్క‌సారిగా ఈ భువిని విడిచారంటే న‌మ్మ‌లేకున్నారు... దాదాపు మూడువేల  పాటలు రాసిన సిరివెన్న‌ల అస‌లు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి  .... చిన్న వ‌య‌సులోనే పాట రాసి ఇంటివారిని మెప్పించి  ప్ర‌శంస‌లు అందుకున్నారు... డాక్ట‌ర్ అవుదామ‌నుకున్నా ఇంటి ప‌రిస్తితులు బాగోక పోస్ట‌ల్ డిపార్ట్మెంట్లో  క్ల‌ర్క్ గా త‌న జీవితాన్ని ప్రారంభించారు... ఇది త‌నకు స‌రిప‌డ‌దనుకుని సినిప్ర‌పంచంలో త‌న అదృష్ఠాన్ని ప‌రీక్షించుకోవాల‌కున్న ప్ర‌యత్నాల‌కు కె విశ్వానాథ్ త‌న చిత్రంతో ప‌రిచ‌యం చేసారు...    ఆ సిన‌మా పేరునే త‌న ఇంటిపేరుగా మార్చుకుని  ఎన్నో చిత్రాల‌కు త‌న సాహిత్యాన్ని అందించారు...  ఆయ‌న రాసిన బూడిదిచ్చే వాడినేదికోరేది పాట ఇప్ప‌టికి పండిత‌పామ‌రుల్లో నానుతూనే వుంటుంది.,.  ఇలాంటి పాట‌లే కాకుండా శృంగార‌రసంలో కూడా త‌న  క‌లాన్ని ఝ‌ళ‌పించారు... మ‌రోవైపు శ్రీ శ్రీ ని త‌ల‌పిస్తూ  విప్ల‌వ‌గీతాల‌కు  ప్రాణం పోసాడు... నిగ్గ‌దీసి అడుగు సిగ్గులేని జ‌నాన్ని అంటూ త‌నే యాక్ట్ చేసారు... మ‌రోవైపు జ‌గ‌మంత కుటుంబం నాది అంటూ వేదాంత దోర‌ణిలో ప‌లికించిన సాహిత్యం ఆయ‌న ఋషిని గుర్తుకుతెస్తాడు., ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టా రెండా వేల పాట ఆయ‌న కలం జాలువారాయి....  అటువంటి సీతారామ‌శాస్త్రి  క‌లం మూగ‌బోయింది...

ఉత్పన్న ఏకాదశి🙏

 ఈరోజు ఉత్పన్న ఏకాదశి🙏🌹*


కార్తీక పూర్ణిమ తర్వాత వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని *ఉత్పన్న ఏకాదశి* అంటారు. ఇది పరమ ఏకాదశి తర్వాత వచ్చే ఏకాదశి. ఈ ఉత్పన్న ఏకాదశి శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన తిధి.

ఉపవాసములు ఆచరించవలసిన ముఖ్యమైన ఏకాదశి ఈ ఉత్పన్న ఏకాదశి. శ్రీమహావిష్ణువు యొక్క శక్తి స్వరూపములను తెలిపే ఏకాదశులలో ఇది చాలా ప్రత్యేకమైనది.

ముర అనబడే రాక్షసుడిని శ్రీమహావిష్ణువు సంహరించే సందర్భంలో ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి రాక్షసుడైన మురను సంహరించింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని నామధేయం చేశాడు. సప్తమాతృకలలో ఒక స్వరూపమైన వైష్ణవీదేవి విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి స్వరూపములలో ఒకటి. అందువల్ల ఉత్పన్న ఏకాదశి ని ఏకాదశి తిధి యొక్క జయంతిగా భావిస్తారు.

ఈరోజు ఉపవాసం తప్పనిసరిగా చేయవలెను. ఉత్పన్న ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారి పాపములు హరించబడతాయి.  ముర అంటే తామసిక , రాజసిక , అరిషడ్వర్గాలకు ప్రతీక. ఈ రోజు ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును పూజించిన వారి ఆ మురను జయించి మిగతా 23 ఏకాదశులలో ఉపవాసం చేసిన ఫలితం కలిగి వైకుంఠప్రాప్తి పొందగలరు. వితంతువులు కానీ ఈ రోజు ఉపవాసము ఆచరించిన యెడల ముక్తిని పొందగలరు.

ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత:

ఉత్పన్న ఏకాదశి యొక్క గొప్పతనాన్ని శ్రీ కృష్ణుడు మరియు యుధిష్ఠిర రాజు మధ్య సంభాషణ రూపంలో *'భవవ్యోత్తర పురాణం'* వంటి వివిధ హిందూ గ్రంథాలలో వర్ణించారు. 'సంక్రాంతి' వంటి పవిత్ర రోజులలో విరాళాలు ఇవ్వడం లేదా హిందూ తీర్థయాత్రలలో పవిత్ర స్నానం చేయడం వంటివి ఉత్పన్న ఏకాదశి యొక్క ప్రాముఖ్యత. ఉత్పన్న ఏకాదశి  అతని / ఆమె పాపాల నుండి విముక్తి పొందాడని మరియు చివరికి మోక్షాన్ని పొందుతారని భావిస్తారు. మరణం తరువాత 'వైకుంఠం' విష్ణువు నివాసానికి నేరుగా తీసుకువెళతారు. 1000 ఆవులను దాతృత్వంగా దానం చేయడం కంటే ఉత్పన్న ఏకాదశి మహిమ ఇంకా ఎక్కువ అని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశిలో  ఉపవాసం హిందూ మతం యొక్క మూడు ప్రధాన దేవతలు బ్రహ్మ , విష్ణు , మరియు మహేశ్వరులకు ఉపవాసానికి సమానం. అందువల్ల హిందూ భక్తులు ఉత్పన్న ఏకాదశి వ్రతాన్ని పూర్తి అంకితభావంతో , ఉత్సాహంగా పాటిస్తారు. 

medical numbers

 Important medical numbers in the life of every human being

     1. Blood pressure: 120 / 80

      2. Pulse: 70 - 100

       3. Temperature: 36.8 - 37

        4. Respiration: 12-16

5. Hemoglobin: males (13.50-18)

 Females ( 11.50 - 16 )

           6. Cholesterol: 130 - 200

             7. Potassium: 3.50 - 5

              8. Sodium: 135 - 145

                9. Triglycerides: 220

10. The amount of blood in the body: 5-6 liters

11. Sugar: for children (70-130)

 Adults: 70 - 115

12. Iron: 8-15 mg

13. White blood cells: 4000 - 11000

14. Platelets: 150,000 - 400,000

15. Red blood cells: 4.50 - 6 million..

16. Calcium: 8.6 - 10.3 mg/dL

17. Vitamin D3: 20 - 50 ng/ml (nanograms per milliliter)

18. Vitamin B12: 200 - 900 pg/ml


  Tips for those who have reached Over :

   the *40*

   the *50*

   the *60*

 And above

 May God bless you with obedience, health and wellness..


            ▪ *First tip:*

 You have to do cupping every year, even if you do not feel sick or have any illness.

 ?

(What is cupping?

Cupping is an ancient healing therapy that some people use to ease pain. A provider places cups on your back, stomach, arms, legs or other parts of your body. Inside the cup, a vacuum or suction force pulls skin upward.

        Cupping is a form of traditional Chinese and Middle Eastern medicine. People have practiced cupping therapy for thousands of years.)

        ▪ *Second tip:*

 Always drink water even if you don't feel thirsty or need it... the biggest health problems and most of them are from the lack of water in the body.

         ▪ *Tip Three:*

 Play sports even when you are at the top of your preoccupation...the body must be moved, even if only by walking...or swimming...or any kind of sports.

 ‌▪ * Fourth tip 😗 Reduce food...


 Leave excessive food cravings...because it never brings good. Don't deprive yourself, but reduce the quantities.

              ▪ * Fifth tip 😗

 As much as possible, do not use the car unless absolutely necessary...Try to reach on your feet for what you want ( grocery, visiting someone...) or any goal.

             ▪ * Sixth tip 😗

 let go of anger...

 let go of anger...

 let go of anger...

 Let go of worry....try to overlook things...

 Do not involve yourself in situations of disturbance... they all diminish health and take away the splendor of the soul. Choose a babysitter you feel comfortable with

            ▪ * Seventh tip 😗

 As it is said..leave your money in the sun..and sit in the shade..don't limit yourself and those around you..money was made to live by it, not to live for it.

 ‌. ▪ * Eighth tip 😗

 Don't make yourself feel sorry for anyone,

 nor on something you could not achieve,

  Nor anything that you could not own.

 Ignore it, forget it;  

                ▪ *Ninth tip:*

 Humility..then humility..for money, prestige, power and influence..they are all things that are corrupted by arrogance and arrogance..

 Humility is what brings people closer to you with love.

        ▪ * Tenth tip 😗

 If your hair turns gray, this does not mean the end of life. It is proof that a better life has begun. Optimistic, live with remembrance, travel, enjoy yourself.


 *(((The last and most important advice)))*

 Have faith

           *I wish you good health and happiness always*

దుర్యోధనుని కూతురు లక్ష్మణను

 దుర్యోధనుని కూతురు లక్ష్మణను పెండ్లిచేసుకొన్న శ్రీకృష్ణుని కొడుకు ఎవరో తెలుసుకుందాం...

...........................................

*శ్రీకృష్ణుణుకి ఎనిమిది మంది భార్యలు. 

వారిపేర్లు.* 


1. రుక్మిణి* (విదర్భ రాజైన భీష్మకుని కుమార్తె.)


*2. సత్యభామ* (సత్రాజిత్తు కూతురు.)


*3. జాంబవతి* (జాంబవంతుని కుమార్తె.) 


*4. నగ్నజితి* ( కోసల రాజైన నాగ్నజితుని కుమార్తె.)


*5. కాళింది* (సూర్యుని కూతురు.)


*6. మిత్రవింద* (జయసేన రాజధి దేవి కుమార్తె.)


*7. భద్ర* (దృష్ఠకేతు శ్రుత కీర్తి ల కుమార్తె.)


*8. లక్ష్మణ (మద్ర రాజైన బృహాత్సేన కుమార్తె.) 


శ్రీకృష్ణుడి అష్టభార్యలకు ప్రతి ఒక్కొక్కరికి పదిమంది కొడుకులు జన్మించారు. వారి పేర్లు.


*పట్టపుమహిషి రుక్మిణిదేవికి శ్రీకృష్ణునికి...*

(1) ప్రద్యుమ్నుడు,

(2) చారుదేష్ణుడు, 

(3) సుదేష్ణుడు, 

(4) చారుదేహుడు, 

(5) సుబారుడు, 

(6) చారుగుప్తుడు, 

(7) భద్రకారుడు, 

(8) చారుచంద్రుడు, 

(9) విచారుడు, 

(10) చారుడు.

 

*వీరిలో ప్రద్యుమ్నుడి సంతానమే శ్రీకృష్ణుని వారసులుగా ద్వారకనేలుతారు.*


*సత్యభామ వల్ల కృష్ణునికి...*

(1) భానుడు, (2) సుభానుడు, (3) స్వర్భానుడు,

(4) ప్రభానుడు, 

(5) భానుమంతుడు, 

(6) చంద్రభానుడు, 

(7) బృహద్భానుడు, 

(8) అతిభానుడు, 

(9) శ్రీభానుడు, 

(10) ప్రతిభానుడు.


*జాంబవతీ శ్రీకృష్ణులకు...*

(1) సాంబుడు, 

(2) సుమిత్రుడు, 

(3) పురజిత్తు, 

(4) శతజిత్తు, 

(5) సహస్రజిత్తు, 

(6) విజయుడు, 

(7) చిత్రకేతుడు, 

(8) వసుమంతుడు, 

(9) ద్రవిడుడు, 

(10) క్రతువు. 


*సాంబుడు దుర్యోధనుని కుమార్తె లక్ష్మణను స్వయంవరంలో అపహరించి, కౌరవులతో పోరాడి ఓడి బందీగాదొరికి పెదనాన్న బలరాముడి ద్వారా విడుదలైతాడు. దుర్యోధన చక్రవర్తి తన గురువు బలరాముడి మాటలను గౌరవించి సాంబుడికి తన కుమార్తె లక్ష్మణను ఇచ్చి పెండ్లిచేశాడు. ఇలా శ్రీకృష్ణదుర్యోధనులు వియ్యంకులైనారు.*


*సాంబుడు అతని సహచరులు దుర్వాసుని గేలి చేయడం వలన ఆ మహముని శాపంతో సాంబుడి కడుపున ముసలం (రోకలి ) పుట్టి అశేషంగా యదువంశం నశిస్తుంది.*

 

*నాగ్నజితి, శ్రీకృష్ణులకు...*

(1) వీరుడు, (2) చంద్రుడు, 

(3) అశ్వసేనుడు, 

(4) చిత్రగుడు, 

(5) వేగవంతుడు, 

(6) వృషుడు, (7) లముడు, (8) శంకుడు, (9) వసుడు, ( 10 ) కుంత.  


*శ్రీకృష్ణుడికి కాళింది వలన..* 

(1) శ్రుతుడు, (2) కవి, 

(3) వృషుడు, (4) వీరుడు, 

(5) సుబాహుడు, (6) భద్రుడు, (7) శాంతి, (8) దర్శుడు, 

(9) పూర్ణమానుడు, 

(10) శోమకులు. 


*లక్షణకు, శ్రీకృష్ణుడికి...* 

(1) ప్రఘోషుడు, 

(2) గాత్రవంతుడు, 

(3) సింహుడు, 

(4) బలుడు, (5) ప్రబలుడు, (6) ఊర్ధ్వగుడు, (7) మహాశక్తి, (8) సహుడు, (9) ఓజుడు, (10) అపరాజితుడు. 


*మిత్రవింద, శ్రీకృష్ణులకు...* 

(1) వృకుడు, (2) హర్షుడు, 

(3) అనిలుడు, (4) గృద్ధుడు, (5) వర్ధనుడు, (6) అన్నడు, (7) మహాశుడు, 

(8) పావనుడు, (9) వహ్ని, (10) క్షుధి. 


*శ్రీకృష్ణ భద్రలకు...*   

(1) సంగ్రామజిత్తు, 

(2) బృహత్సేనుడు, 

(3) శూరుడు, 

(4) ప్రహరణుడు, 

(5) అరిజిత్తు, 

(6) జయుడు, (7) సుభద్రుడు, (8) వాముడు, (9)ఆయువు, (10) సత్యకుడు. 


శ్రీకృష్ణుడికి అష్టభార్యల వలన కలిగిన కొడుకుల సంఖ్య ఎనభై మంది.

************************************

భౌమ్యవాసర శుభోదయం...

30 th November, 2021...

*ఏ యస్ యన్ శర్మ* ...

 ఒక ప్రశ్న మాత్రమే భారతం లోనిది మిగిలినవన్ని రామాయణంలోనివే సుమా !

................................................................


(1) కుంతీదేవి తనకు సంతానం కావలెనని కోరుకొన్నపుడు, తథాస్తని వరమిచ్చిన మహర్షి ఎవరు ?


(అ) వ్యాసుడు

(ఆ) దుర్వాసుడు

(ఇ) అగస్త్యుడు

(ఈ) అంగీరసుడు


(2) రామాయణంలో  ధాన్యమాలిని ఎవరు ? 


(అ) రావణుని రెండవ భార్య అతికాయుని తల్లి

(ఆ) గోదావరి తీరంలో శ్రీరాముని సేవించిన మత్స్యకన్య

(ఇ) అశోకవనంలో త్రిజటతోపాటుగా సీతాదేవికి సేవలు చేసిన రాక్షసస్త్రీ

(ఈ) దండకారణ్యంలో శూర్పణఖకు సఖి


(3) మారీచసుబాహుల తల్లి ఎవరు ?


(అ) అంక్షుమాలిని

(ఆ) లంబకర్ణిక

(ఇ) తాటకి

(ఈ) కైకసి


(4) కుంభకర్ణుడు తపస్సుచేసి ఇంద్రాసనం (ఇంద్రసింహసనం) అడగాలనుకొని పొరబాటున నిద్రాసనం కావాలన్నాడు.  ఆ దేవుడు ప్రత్యక్షమై తథాస్తు అన్నాడు. అందుకే కుంభకర్ణుడు ఆరునెలలు గాఢంగా నిద్రపోతాడు. ఇంతకు కుంభకర్ణునికి ఆ వరమిచ్చిన దేవుడెవరు ?


(అ) శంకరుడు

(ఆ) సూర్యభగవానుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) బ్రహ్మ


(5) వాలి తన చివరి ఘడియలలో సుగ్రీవుని పిలిచి అంగదుడిని బాగా చూచుకొమ్మని కోరి, తన మెడలోని కాంచనమాలను తీసి అతని మెడలో వేశాడు. తాను అహంకారంతో ప్రవర్తించానని కనుక క్షమించమని శ్రీరాముని కోరుతూ మరణించాడు.  ఆ కాంచనమాలను ఎవరు ధరించి యుద్దం చేసినా ఎదుటివ్యక్తి బలం క్షీణించి బలహీనుడైతాడు. ఇంతకు వాలికి కాంచనమాలను ఇచ్చినదెవరు ?


(అ) రావణుడు

(ఆ) ఇంద్రుడు

(ఇ) జాంబవంతుడు

(ఈ) నీలుడు


(6) రామసేతు నిర్మాణానికి వాస్తుదర్శకుడెవరు  (ఇంజనీరు ఎవరు )


(అ) నలుడు

(ఆ) జాంబవంతుడు

(ఇ) అంగదుడు

(ఈ) నీలుడు


(7) రామరావణ సంగ్రామ ప్రారంభానికి ముందు "సీతను తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పాలనే " సందేశంలో  రావణనుడి దగ్గరకు వెళ్లిన శ్రీరామదూత ఎవరు ?


(అ)  సుగ్రీవుడు

(అ) నలుడు

(ఇ) నీలుడు

(ఈ) అంగదుడు


(8) రావణుడు విద్యుజ్జిహ్వుడనే రాక్షసుడు చేసిన రాముని తలను పోలిన ఒక శిరస్సును సీతకు చూపి యుద్ధంలో రామలక్ష్మణులు చనిపోయారని సీతతో చెప్పాడు. సీత ఆ శిరస్సును చూచి, కన్నీరు మున్నీరుగా విలపించింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య -- - - - - - అనే సాధ్వి సీతను దగ్గర చేరి ఓదార్చి అదంతా కపటమాయని భయపడవద్దని, యుద్ధానికి వానర సమేతంగా శ్రీరాముడు సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభము కలుగుతుందని చెప్పింది. ఇలా చెప్పి సీతను ఓదార్చిన ఆ సాధ్వీమణి పేరేమిటి ?


(అ) రుజ

(ఆ) సరయు

(ఇ) చారుమాలిని

(ఈ) అంశుమాలిని


(9) శ్రీరామపట్టాభిషేకంలో అయోధ్యకు యువరాజుగా పట్టాభిషక్తుడైనవాడెవరు ?


(అ) లక్ష్మణుడు

(ఆ) భరతుడు

(ఇ) శత్రుఘ్నుడు

(ఈ) అంగదుడు


(10) వాల్మికిమహర్షి రామాయణం వ్రాయటానికి ముందు ఏ నది ఒడ్డున పక్షులజంటను చూచాడు ?


(అ) సరయు

(ఆ) గంగా

(ఇ) యమున

(ఈ) సరస్వతి

................................................................................ ................................ జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

29, నవంబర్ 2021, సోమవారం

రసభస్మము

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 3 . 


 * రసభస్మము -  


    ఈ రసభస్మమును పాదరసం పుటంపెట్టి శుద్ది చేసి తయారుచేస్తారు . ఇలా శుద్ది చేసిన రస భస్మమును అనుపానయుక్తముగా ఉపయోగించిన పక్షవాతము , కంపవాతము , మూత్రఘాతము , వాతరక్తము , కుష్ఠు , దోష జ్వరము , కీళ్లనొప్పులు , కాసలు , బాలింతరోగము పోగొట్టును . శరీరము నందలి రక్తమును వృద్ధిపరచును . 


 * ఇంగిలీక భస్మము - 


    దీనిని అనుపానయుక్తముగా సేవించిన సవాయి మేహము , శుక్ల మేహము , కాసలు , పిల్లల జలుబు , తిమ్మిరి వాతము , కిడ్నీ దోషములు , నొప్పులు , మూత్ర దోషములు తొలగును. 


 * రసకర్పూర భస్మము - 


    ఈ రసకర్పూరమును అనుపానయుతముగా సేవించిన సమస్త రోగములు కుదురును . కుష్ఠు , మేహమచ్చలు , తిమ్మిరి , బొల్లి , కంఠమాల , సవాయిరోగములు మాన్పును . 


 * రస సింధూరం - 


   ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన సమస్త మేహములు , కాస , శ్వాస , తిమ్మిరి , శుక్లనష్టములు హరించును . 


 * తాళక భస్మము - 


    ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన కుష్ఠు , కఫరోగము , వాతములు , క్షయ , పక్షవాతము , పడిస ( జలుబు ) బాధ పోవును . 


 * పగడ భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న కాస , శ్వాస , కుసుమ , క్షయ , రుతుశూల , పాండురోగములు నిర్మూలించును . 


 * ముత్య భస్మము - 


      ఈ భస్మమును సేవించిన కాస , శ్వాస , గుండెరోగము , అతిమూత్రము , కామెర్లు , ఉబ్బసం , మేహములను నయం చేయును , మెదడుకు మంచి బలాన్ని ఇచ్చును . ఇది క్యాల్షియం తక్కువ ఉన్నవారికి ఇవ్వడం వలన క్యాల్షియం లోపం సరిచేయవచ్చు . 


 * ఆల్చిప్పల భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న దగ్గులు , కడుపునొప్పులు పోవును . కండ్లకు చనుపాలలో కలిపి కాటుకలా రాసిన కండ్లలోని పొరలను కోయును . 


 * శంఖ భస్మము - 


       ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న సర్వ శూలలు , దగ్గులు , కుసుమ రోగములు , అగ్నిమాంద్యము , సర్ఫవిషము పోగొట్టును . 


 * గవ్వల భస్మము -  


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న రక్తగ్రహణి , గుండెవ్యాధి , వ్రణములు , పాత సుఖరోగములు , ఉడుకు జ్వరములు నశించును . 


 * కాసీస భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న ఉబ్బులు , అజీర్ణములు , చర్మరోగములు , గ్రహణి రోగములు , మూత్రకృచ్చము , పాండురోగము , గుండెనొప్పులు తప్పక కుదుర్చును . 


 * హేమాక్షిక భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన శూల , హుద్రోగము , అజీర్ణము , కాస , శ్వాస , పైత్యము , పాండువు , కామెర్ల రోగము నయం అగును. 


    తరవాతి పోస్టు నందు మరికొన్ని భస్మాల గురించి మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                     9885030034

మూడో తరంగం భారత్‌ను తాకింది

 అత్యవసర ప్రకటన; మూడో తరంగం భారత్‌ను తాకింది

 

 దయచేసి వెంటనే స్వీయ లాక్ డౌన్ చేయండి.

 1. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.

 2. మీరు బయటకు వెళ్లినప్పుడు డబుల్ మాస్క్ వేయండి మరియు ఏ సమయంలోనైనా మాస్క్ తీయకూడదు.

 3. మీ ఇంటి బయట భోజనం చేయకండి.

 4. వ్యక్తులు బంధువులు లేదా సన్నిహితులు అయినా మీ ఇంట్లోకి రానివ్వకండి.

 5. బంధువులు లేదా స్నేహితుల ఇళ్లకు వెళ్లవద్దు.

 ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇండో-పాకిస్థాన్‌లో ప్రజలు దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జనాభాలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుంది. కోవిడ్ వివక్ష చూపదు. దయచేసి వినండి.

 అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయండి.

 *కెనడా* విమానాలను లోపలికి మరియు బయటికి నిషేధించింది మరియు రోజువారీ మరణాల సంఖ్య 1,000 మించిపోయింది.

      *సౌదీ అరేబియా* బ్లాక్ చేయబడింది మరియు ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ విమానాలు లేవు.

       *కొలంబియా* పూర్తిగా నిరోధించబడింది.

       ఈరోజు 4,100 కంటే ఎక్కువ మంది మరణించిన *బ్రెజిల్* దాని అత్యంత ఘోరమైన అధ్యాయంలో పడిపోయింది.

       *స్పెయిన్* అత్యవసర పరిస్థితిని పొడిగించవచ్చని ప్రకటించింది.

       *యునైటెడ్ కింగ్‌డమ్* ఒక నెల లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

       *ఫ్రాన్స్* 2 వారాల పాటు లాక్ చేయబడింది.

       *జర్మనీ* 4 వారాల పాటు సీలు చేయబడింది.

       *ఇటలీ* ఈరోజు దగ్గరగా అనుసరించింది.

       *అన్ని* ఈ దేశాలు/ప్రాంతాలు *COVID19 యొక్క మూడవ తరంగం* మొదటి వేవ్ కంటే చాలా ఘోరమైనదని నిర్ధారించాయి. కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు *అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి*.

       స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య హెచ్చరిక సంభాషణకర్త అవ్వండి. *అందరినీ మూడవ అల నుండి రక్షించండి*.

       *రెండో తరంగ దిగ్బంధనాన్ని బట్టి అంచనా వేయకండి *ఏమీ జరగలేదు*...

       *1917-1919 నాటి స్పానిష్ ఫ్లూ లాగా, మొదటి మరియు రెండవ తరంగాల కంటే మూడవ తరంగం చాలా ప్రమాదకరమని చరిత్ర చెబుతోంది.

       *మిమ్మల్ని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోండి

      కుటుంబం*.

       * జీవ భద్రత చర్యలను నిర్వహించడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం మొదలైనవి.


      చరిత్ర అబద్ధం చెప్పదు, వెనక్కి తిరిగి చూద్దాం.

       ____________

       *ఈ సమాచారాన్ని మీ కోసం ఉంచుకోవద్దు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి.


      *

*తొలి తిరుపతి

 *తొలి తిరుపతి*......


తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.


అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం లో తిరుపతి వుందని


అదే తొలి తిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస *శ్రీ శృంగార వల్లభ స్వామి* శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.


విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ...


స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.


ఆలయ చరిత్ర : 

--------------


ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో


ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.


అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా


ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.


ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట. 


అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట


ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.


స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు *ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)*


ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. 


ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).


ఆలయ విశిష్టత : 

------------------

1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 


2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 


3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 


4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 


5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది. 


6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.


కార్యక్రమాలు - పూజా విధానం : 

------------------------------

1) నిత్య ధూప దీప నైవేద్యం.


2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం.


3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.


4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : 

------------------------------------

బోజమహా రాజు

బట్టీ విక్రమార్క 

రాణీ రుద్రమదేవి 

శ్రీ కృష్ణ దేవరాయలు 

పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు 


లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి ... బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )


How to Reach Tholi Tirupathi :


తొలితిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.


పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి. 


కాకినాడ - ప్రత్తిపాడు , పెద్దిపాలెం , శాంతి ఆశ్రమం బస్సు లు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సు తొలితిరుపతి లో ఆగుతాయి. తొలితిరుపతి ని చదలాడ తిరుపతి అని కూడా పిలుస్తారు.


Nearest Railway Station :


Samalkota ( SLO ) Distance : 10 km 


Nearest Bus Stop : 

Divili ( Divli )


Toli Tirupathi Temple Address:


Sri Srungara Vallabha Swamy Temple,

Peddapuram Mandal,

East Godavari,

Andhra Pradesh.

దేవుడు కలలో కనపడితే

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌸


*🌻దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి🌻*


🍃🌹మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..


*🌻దుర్గామాత కోపంగా కనిపిస్తే..🌻*


🍃🌹మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.


*🌻శివుడిని కలలో చూస్తే..🌻*

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.


*🌻రాముడిని కలలో చూస్తే..🌻*

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.


*🌻కలలో శ్రీకృష్ణుని దర్శనం..🌻*

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.


*🌻కలలో విష్ణువు దర్శనం..🌻*

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


*🌻లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..🌻*

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.


🌿☘️🌼🌼🌺🌼🌼☘️🌿

పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము

 పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము


సీత,రాముల వివాహా వేడుకనే వివాహపంచమి అని పిలుస్తారు.


హిందూ అచారా సాంప్రదాయాల ప్రకారం సీతారాముల పెళ్ళిరోజును పండుగగా జరుపుకోవటం అనవాయితీగా వస్తుంది. నవంబరు – డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్పడంతో ప్రతి ఏడాది సీతారాముల వివాహ వార్షికోత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.


సీతారాముల వివాహ బంధాన్ని నేటికి అంతా ఆదర్శంగా భావిస్తున్నారు. ఎక్కడైన వివాహ వేడుకకు హాజరైతే తప్పకుండా పెళ్ళిజంటను సీతారాముల్లా కలకాలం అన్యోన్యంగా ఉండాలని దీవిస్తుండటం మనం చూసే ఉంటాం. అంటే సీతారాముల వైవాహిక జీవితం ఎంతగా ఆదర్శవంతంగా మారిందో అర్ధమౌతుంది. సీతకోసం రాముడు, రాముని కోసం సీత ఇలా వారి జీవితం కష్టాల నడుమ సాగిన వైనాన్ని నేటి తరానికి కధలు కధలుగా చెప్తుంటారు.


భర్త అడువులకు వెళుతుంటే రాజప్రసాదంలో ఉండలేక భర్తతో అడవిలో కష్టాలు అనుభవించటానికైనా సిద్దమై అతనితో కలసి అడవుల బాటపడుతుంది. ప్రస్తుతం భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించాలి.


రావణుడు సీతను అపహరించుకు వెళ్ళిన సందర్భంలో లంకలో ఆమె మనస్సు మార్చే ప్రయత్నం రావణుడు చేసినప్పటికీ ఆమెకు రామునిపై ఉన్న ప్రేమ,అప్యాయత ఏమాత్రం చెరగలేదు. రాముడు తనను లంకనుండి విడిపించుకు తీసుకువెళతాడన్న నమ్మకంతో ఉంది. అదే సమయంలో రాముడు సైతం భార్యకోసం, ఆమె జాడకోసం అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఆమెను విడిపించుకుని తీసుకురావటం కూడా రామునికి సీతపై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేప్తుంది.


అలాంటి అదర్శదంపతుల వివాహమహోత్సవపు రోజును నేటికి వివాహ పంచమిగా ప్రతిఏటా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. వివాహ పంచమి వ్రతం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో 5వ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదిన వివాహ పంచమి నిర్వహించనున్నారు. వివాహ పంచమి డిసెంబర్ 07, 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.


ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అనంతరం వివాహం జరగడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా గడుపుతారు. వివాహపంచమి రోజు హిందువులు ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పంచమి రోజు సీతారాముల ప్రతిమలను ప్రతిష్టించి వారికి వివాహం జరిపించి వివిధ రకాల నైవేద్యాలతో పూజించడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది.


భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీత, రాముడి వివాహ ఉత్సవంగా జరుపుకుంటారు. సీతారాముల ఆలయంల్లో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. నేపాల్‌ ప్రాంతంలో సీతాదేవి జన్మ స్థలమని నమ్ముతారు అందుకే ఆప్రాంతంలో వివాహపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు మనదేశం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతిఏటా తరలి వెళుతుంటారు.

భోళాశంకరుడు

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🌹#భోళాశంకరుడు🔱🚩


♦️పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం 


     తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ ”♦️


🌹పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే #అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.


🌹సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటి వారు మరేవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహాంకారం.


🌹ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారాన్ని వదిలి... అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే అనుభవించగలుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి.


🌹అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.


🌹వినయాన్ని విన్నవించుకోవడం అభిషేకం.


🌹ఎలాగైతే మనం మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో...

అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి.


🌹అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది.

సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్లుగా శివాభిషేకం చేయాలి.


🌹అభిషేకం చేసే సమయంలో వెలువడే మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కోల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన #పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు.


♦️శివో అభిషేక ప్రియ:♦️ అంటే... 

🌹పరమశివుడు అభిషేక ప్రియుడు.


♦️“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి

  పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

    గామధేనువు వానింట గాడి పసర

  మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”♦️


🌹#తాత్పర్యము

శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట.

‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట.


🌹శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి. సకల ఐశ్వర్యములు సమకూరతాయి.


ఆవు పాలతో -- సర్వ సౌఖ్యాలు

ఆవు పెరుగు -- ఆరోగ్యం, బలం

ఆవు నెయ్యి -- ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార) -- దుఃఖ నాశనం, ఆకర్షణ

తేనె -- తేజో వృద్ధి

భస్మ జలం -- మహా పాప హరణం

సుగంధోదకం -- పుత్ర లాభం

పుష్పోదకం -- భూలాభం

బిల్వ జలం -- భోగ భాగ్యాలు

నువ్వుల నూనె -- అపమృత్యు హరణం

రుద్రాక్షోదకం -- మహా ఐశ్వర్యం

సువర్ణ జలం -- దరిద్ర నాశనం

అన్నాభిషేకం -- సుఖ జీవనం

ద్రాక్ష రసం -- సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం -- సర్వ సంపద వృద్ధి

ఖర్జూర రసం -- శత్రు నాశనం

దూర్వోదకం (గరిక జలం) -- ద్రవ్య ప్రాప్తి

ధవళొదకమ్ -- శివ సాన్నిధ్యం

గంగోదకం -- సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

కస్తూరీ జలం -- చక్రవర్తిత్వం

నేరేడు పండ్ల రసం -- వైరాగ్య ప్రాప్తి

నవరత్న జలం -- ధాన్య గృహ ప్రాప్తి

మామిడి పండు రసం -- దీర్ఘ వ్యాధి నాశనం

పసుపు, కుంకుమ -- మంగళ ప్రదం

విభూది -- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.


🌹నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. 

అందుకే ఆయన "భోళా శంకరుడు"

                    🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱

అద్భుతమైన కథ

 Must Read🙏🙏🙏🙏


ఒక అద్భుతమైన కథ 

  


రాత్రి 11 గంటలకు. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని అడిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు అరవింద్. మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం🙏copied..post...

రాముడిలో

 *రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?*

 

*మాయలు మంత్రాలు చూపించలేదు.*

*#విశ్వరూపం ప్రకటించలేదు.*


*జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు.*


*పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు.*


*కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు.*


*అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.*


*అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ... ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.*


*💠 శాస్త్ర ధర్మం 💠*


*తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.*


*💠 స్నేహ ధర్మం 💠*


 *మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పు తిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహ ధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.*


 *💠 యుద్ధ ధర్మం 💠*


*వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు... వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.*


*రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు*


*మరణాంతారం వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||*


*‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.*


*💠 దయా ధర్మం 💠*


*సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య.*


*అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని ప్రతి


జ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా... అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.*


*💠 మనుష్య ధర్మం 💠*


*రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.*


*‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’*


*అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.*


*💠 సోదర ధర్మం 💠*


*రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ... పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.*


*పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి... కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం.*


*రాముడు అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది.*


*రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామ జయరామ జయ జయరామ*


*🕉️🙏🙏🙏 🚩జై శ్రీ రామ్🚩

27, నవంబర్ 2021, శనివారం

బేగి ఎలిపొచ్చీ

 బేగి ఎలిపొచ్చీ...!


       సాహిత్యం... సంగీతం... విజయనగరం! ఈ మూడింటిని వేర్వేరుగా చూడలేం. ఒకరా ఇద్దరా... గురజాడ, గణపతిముని, ఆదిభట్ల, వంగపండు... ఎందరెందరు కవులు, కళాకారులు! ద్వారం, ఘంటసాల, సాలూరి, సుశీల... మరెందరెందరు సుస్వరాల సమ్రాట్టులు! ఇక అక్కడి సంస్థానాలు... జానపదుల నోళ్లలో నానే వాటి వీరగాథలు... అన్నీ అబ్బురమే! ఇంతటి ఘనచరిత్ర ఉన్న ఆ నేలమాట ఇంకా ప్రత్యేకమైంది. పలుకుల కలకూజితాలతో తనదైన తెలుగు తియ్యందనాన్ని పంచే ఆ జిల్లా అమ్మభాషా విశేషాలు మీకోసం...! 

తెలుగునాడుకు ఉత్తర సరిహద్దులో, తూర్పుతీరపు అంచున... అటు ఒడిశా, ఇటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు వారధిలా ఉంటుంది విజయనగరం జిల్లా. అనేక భాషల సంగమం ఈ ప్రాంతం. నాగరిక, జానపద సంస్కృతులు దోబూచులాడుతుంటాయి. శాతవాహనుల పాలనలో ‘మధ్యపరగణాలు’గా వ్యవహారంలో ఉందీ ప్రాంతం. తర్వాత కళింగులు, గజపతులు, వెలమరాజులు ఇలా క్రమంగా విజయనగర గజపతుల చేతుల్లోకి వచ్చింది. స్వాతంత్య్రానంతరం శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని భాగాలను విడదీసి 1979లో విజయనగరం జిల్లాను ఏర్పాటుచేశారు. 

      జిల్లా ఉత్తర, పశ్చిమ ప్రాంతమంతా పర్వతమయం. గిరిజనులు ఎక్కువగా ఉంటారు. దీనికితోడు నేడు ఒడిశాలో అంతర్భాగంగా ఉన్న గంజాం ప్రాంతం వరకు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ఏలుబడిలో కొన్నాళ్లుంది. ఇలా... తెలుగు, తమిళ, ఒడియా సంస్కృతులతో పాటు హిందీభాషా ప్రభావమూ ఈ ప్రాంతపు తెలుగు మీద బలంగానే ఉంది. భౌగోళికంగా అంతగా సంబంధం లేని హిందీ ఇక్కడికి ఎలా వచ్చిందంటే... ఒకప్పటి మధ్యప్రదేశ్, నేటి ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, జగదల్‌పుర్‌ తదితర ప్రాంతాల ప్రజలు వ్యాపారం నిమిత్తం ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించడం వల్ల. మొత్తమ్మీద విజయనగరం తెలుగు ఇన్ని భాషల కలగలుపు. ఉదాహరణకు ‘తన నివాసాన్ని మార్చుకున్నాడు’ అనే అర్థంలో ‘బిచాణా ఎత్తేశాడు’ అంటారు. ‘బిచాణా’ అనేది ఒడియా పదం. అలాగే ‘వేగం’ అనే పదానికి గ్రామ్యరూపం ‘బేగి’. ఈ పద రూపాంతరం మీదా ఒడియా ప్రభావం ఉంది. ఆ భాషీయులు ‘వ’ అక్షరాన్ని పలకరు. దాని బదులు ‘బ’ వాడతారు. వాళ్ల సాపత్యంతో ‘వేగిరం’ అనే ఉచ్చారణ కాస్తా ‘బేగిరం’గా మారింది. కాలక్రమేణా ‘బేగి’గా స్థిరపడిపోయింది. 

భలే భలే మాటలు

వివిధ భాషల సంపర్కంతో తయారైన ‘తెలుగు మాటలు’ ఇక్కడ కొల్లలు. ‘మేనత్త’ను స్థానికులు ‘బాప్ప’ అంటారు. హిందీ ‘బాప్‌’ (నాన్న)కి, తెలుగు ‘అప్ప’ (అక్క) కలిసి ‘నాన్నకి అక్క’... ‘బాప్ప’ అయిందన్న మాట. ఎవరైనా నేరాన్ని కప్పిపుచ్చితే ‘కామప్‌ చేసేశారు’ అంటారు. ఆంగ్లంలోని ‘క్లెయిమ్‌ అప్‌’ (దాచేయడం) దీనికి మూలం. ఎవరైనా అబద్ధాలు చెబుతోంటే, ‘వాడివన్నీ జూటా మాటలు’ అనేస్తారు. ‘ఝాటా’ అంటే హిందీలో అబద్ధం. ఇక ‘పొడవు’నేమో ‘జబరు’ అని పిలుచుకుంటారు. ఇది ఉర్దూ మాట. ఆ భాషలో దీనికి అర్థం ‘ఉన్నతమైన’ అని. ‘ఉష్ణం’ (వేడి) అనే సంస్కృత పదం ‘ఊష్టం’గా మారి విజయనగరం తెలుగులో జ్వరానికి మారుపేరైంది. అలాగే ఉక్కపోతని ‘ఈష్ట’ అంటారు. ఇదీ ‘ఉష్ణం’ రూపాంతరమే. ఇలా సంస్కృతం నుంచి వచ్చిన మరో మాట ‘జిమ్మ’. అంటే... నాలుక. ‘జిహ్వ’ దీనికి మూలం. ‘బైఠాయించు’ అంటే పత్రికా భాష అనుకుంటాం కానీ, ‘కూర్చోవడం’ అనే అర్థంలో స్థానికులు దీన్ని సాధారణంగానే వాడేస్తుంటారు. వీటన్నింటికీ మించి ఆశ్చర్యాన్ని కలిగించే మాట ‘ఎప్పెస్‌’. విజయనగరం భాషలో దానికి అర్థం ‘ఉచితం’. ఆంగ్ల ‘ఫ్రీ సర్వీస్‌’లోని ఎఫ్, ఎస్‌ అక్షరాల గ్రామ్య కలగలుపు ఇది! ఈ జిల్లా భాషని తరచిచూస్తే ఇలాంటి మాటలు చాలానే కనిపిస్తాయి. 

      ఇక్కడి ఊళ్ల పేర్లు కూడా ఆసక్తిదాయకంగా ఉంటాయి. చుట్టూ పర్వతాలు ఉన్న ఊరు మొదట ‘పర్వతపురం’ అయింది. కాలక్రమంలో అది పార్వతీపురంగా మారింది. భేల్‌- ఎలుగుబంటి, గాఁవ్‌- గ్రామం.... ఎలుగుబంట్లు ఎక్కువగా సంచరించే గ్రామం ‘భేల్‌గాఁవ్‌’ అయింది. క్రమేపీ అది ‘బెలగాం’గా మారింది. నిడువైన కల్లు(కొండ) ఉన్న ఊరు ‘నిడువుకల్లు’గా వ్యవహారంలోకి వచ్చి ‘నిడగల్లు’గా రూపాంతరం చెందింది. ముళ్లపొదలు ఎక్కువగా ఉన్న పల్లె ‘కంటకాపల్లి’ అయింది. తాటిచెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతమే ‘తాడివాడ’. కోనేం రకపు చేపలు ఎక్కువగా అమ్ముడయ్యే సముద్రతీర గ్రామమే కోనవాడ.. అదే కోనాడ. ఇలా ప్రతి ఊరిపేరు వెనకా ఓ విశేషం కనిపిస్తుంది. 

వాళ్లది ప్రత్యేకం 

నాగావళి, వేగావతి, సువర్ణముఖి, చంపావతి, గోస్తని, జంఝావతి తదితర నదులు ప్రవహిస్తున్నప్పటికీ ఈ ప్రాంత వ్యవసాయం ఎక్కువగా వర్షాధారమే. అయినప్పటికీ ఆహార, వాణిజ్య పంటలకి అనువైన ప్రదేశం. ‘అయ్యకి ఆస్తి లేదు, గర్వమూ లేదు’ అన్న చందాన ఉంటుందీ ప్రాంత ఫలసాయం. తిండికి లోటుండదు. అలాగని అమ్ముకుని సొమ్ము చేసుకుందామంటే చాలదు. అలాంటి ఈ ప్రాంతానికి గోదావరి సీమనుంచి కొన్ని ద్రావిడ బ్రాహ్మణ కుటుంబాలు వలస వచ్చాయి. అగ్రహారాలను ఏర్పాటు చేసుకున్నాయి. తమిళనాడుకు చెందిన ఈ శాఖీయులు మొదట గోదావరీ పరీవాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. గోదావరి నదిమీద ఆనకట్ట లేని సమయంలో ప్రబలిన కరవుకు తట్టుకోలేక, వాళ్లలో కొందరు ఈ ప్రాంతానికి వచ్చారన్నది చరిత్ర కథనం. కృష్ణరాయపురం (‘కన్యాశుల్కం’లో దీని ప్రసక్తి ఉంది), అజ్జాడ (హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు స్వస్థలం), కలవరాయి, లోగిశ (కావ్యకంఠ గణపతిముని పుట్టిన ఊరు), సుంకి, చాకరాపల్లి, చల్లపేట... ఇవన్నీ ద్రావిడ బ్రాహ్మణ అగ్రహారాలు. వీటితోపాటు వెలనాటి బ్రాహ్మణుల అగ్రహారాలు- వెంగాపురం, కుసుమూరు, నందబలగ, శివరాంపురం మొదలైనవి కొన్ని ఉన్నాయి. ఈ రెండు రకాలైన అగ్రహారాలనీ కలిపి ‘నందాపురం పట్టీ’ పేరుతో పిలుస్తారు. ఈ ఆగ్రహారికుల మాటతీరు ఒకలా ఉంటుంది. వీళ్ల దగ్గర వివిధ వృత్తుల్లో కుదురుకున్న ఇతరుల మాటతీరు మరోలా ఉంటుంది. కాలక్రమంలో అగ్రహారాలు పోయినా, ఆ రెండు వర్గాల భాషలో మాత్రం ఆ తేడాలు కనిపిస్తూనే ఉంటాయి. 

      ఎక్కువ అనే పదానికి అగ్రహారపు పలుకుబడి ‘లావు’. దాన్నే ఇతర గ్రామీణులేమో ‘వింత’ అంటారు. కొంచెం- కాస్త (అ.ప), కసింత (గ్రా); ఇటువైపు- ఇసుంటా (అ.ప), ఇటింకా (గ్రా); వచ్చేసెయ్‌- ఒచ్చీ, వళపచ్చీ (అ.ప), ఎలిపొచ్చీ (గ్రా); గోళీలు- గొట్టికాయలు (అ.ప), అల్లికాయలు (గ్రా); తొందరగా- వేరంగా (అ.ప), బేగి (గ్రా); అత్యాశ- కాప్యానం, కాపీనం (అ.ప), కాపేనం (గ్రా); సంతృప్తి చెందు- ఆటిపారు (అ.ప), గీటెక్కు (గ్రా); వేళాకోళం- సరసాలు (అ.ప), ఇగటాలు (గ్రా)... ఇలా ఒకే ప్రాంతంలో రెండు రకాల మాటలు వినపడుతుంటాయి. 

అక్కడ అలా... ఇక్కడ ఇలా!

సాగతీతగానీ, తెగవేతగానీ లేకుండా పూర్తి పదాన్ని ఉచ్చరించడం ఈ జిల్లా ప్రత్యేకత. అంతేకాదు పదోచ్చారణ స్పష్టంగా ఉంటుంది. గ్రామీణభాషలో ‘ము’ వర్ణకాంత ప్రయోగాలు ఎక్కువ. ఉదాహరణకు ‘చేద్దాము’- సేతుము; చూద్దాము- సూతము; విందాము- విందము, ఉందాము- ఉందుము లాంటివి. ఇక ఒకే జిల్లా అయినప్పటికీ, కొన్ని మాటల్లో విజయనగరం ప్రాంత గ్రామ్యానికి, పార్వతీపురం ప్రాంత గ్రామ్యానికీ స్పష్టమైన తేడా కనిపిస్తుంది. దీనికి కారణం నాడు విజయనగరం తెలుగు రాజుల పాలనలో ఉంటే, పార్వతీపురం కళింగ రాజుల ఏలుబడిలో ఉండేది. దీంతో ఆయా భాషల ప్రభావం స్థానికుల మాటల మీద పడింది.

      పశువులను పార్వతీపురం ప్రాంతంలో ‘సొమ్ములు’ అంటారు. అదే విజయనగరం వాళ్లయితే ‘పసరాలు’ అని పిలుస్తారు. అమ్మాయి, అబ్బాయిలను పార్వతీపురం వాళ్లు ‘గుంట’, ‘గుంటడు’గా వ్యవహరిస్తారు. విజయనగరం ప్రాంతవాసులేమో ‘పిల్ల’, ‘పిల్లడు’గానే ఉచ్చరిస్తారు. అలాగే... గోతులు- గుమ్ములు (పా), గాతలు (వి); నేను- నాను (పా), నీను (వి); ఉంచడం- ఇడ్డం (పా), ఎట్టడం (వి); పలకకుండా- పల్లక (పా), ఒల్లక (వి); కారం- నొర్ర (పా), వర్ర (వి)... లాంటి భేదాలెన్నో కనిపిస్తాయి. ఈ పదాలన్నీ విజయనగరం తెలుగుకు ఓ ప్రత్యేకతను సమకూర్చాయి. 

ఒకే పదానికి రెండు మూడు అర్థాలున్న పదాలూ ఉన్నాయి ఇక్కడ. గుంట- ఆడపిల్ల, రోలు; గూద- తిండియావ, కడుపు; కొర్రు- ఏ పనికైనా అడ్డుపుల్ల వేయడం, మేకు, కొండశిఖరం; పెడ- అరటి అత్తం, ఒకపక్క; జెల్ల- ఓ రకం చేప, లెంపకాయ; కొత్తెం- అరటిపువ్వు చివరి భాగం, తలవెనక భాగంలో కొట్టే చిన్నదెబ్బ... ఇలాంటివి ఎన్నో! ఎన్నెన్నో!! అలాగే, పంచదారను ‘చీనీ’ అని, ముల్లంగిని ‘సొత్తికూర’ అని పిలుస్తారు. 

అందరిదీ అదే బాట

ఈ ప్రాంతంలో పండితులు చాలామందే ప్రవర్ధిల్లారు. సంప్రదాయ సాహిత్యం నుంచి కాల్పనిక సాహిత్యం వరకూ అన్ని రకాల ప్రక్రియలకీ ఆలవాలమైంది ఈ నేల. ఎన్ని రకాల సాహితీ ప్రక్రియలు వెలువడినా, ఈ ప్రాంత భాషకి ప్రాధాన్యమివ్వడం మరవలేదు ఏ సాహిత్యకారుడున్నూ. ఆదిభట్ల అయితే ‘సీమపలుకు వహి’ అనే పేరుతో అచ్చతెలుగు మాటలకూర్పుతో ఓ నిఘంటువునే రూపొందించారు. అందులో కనిపించే విజయనగరం మాటల్లో కొన్ని... అచ్చిక బుచ్చిక (కలుపుగోలుతనం), ఆరిగం (మట్టి కుంపటి), ఇమ్ము (పదిలం), ఈండ్రపడు (మొరాయించు), ఉరిడి (కుమ్మరిపురుగు), ఆసడ్డ (నిర్లక్ష్యం). ఇక గురజాడ అయితే ‘కన్యాశుల్కం’ సంభాషణల రూపంలో విజయనగరం తెలుగుకు చెరగని ఖ్యాతిని తెచ్చిపెట్టారు.  

      ఈ ప్రాంతంలో ప్రజాసాహిత్యమూ ప్రబలంగానే వచ్చింది. దానికి కారణం రైతాంగ సాయుధ పోరాటానికి నెలవుకావడమే. ఆ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని భూషణం, వంగపండు తదితరులు ప్రజలభాషలో రచనలు చేశారు. వాళ్ల పాటల్లో వినిపించే ఈ ప్రాంత గ్రామ్య పదాలు కొన్ని... పొవ్వాకు (పొగాకు), టకురు (ముదురు), ఉమ్మిరి (ముమ్మరం), ఎక్కిడి తొక్కిడి (పుష్కలం), ఎమకల (తెల్లవారుజామున), కవుకులు (ఇబ్బందులు), ఒగ్గేసి (వదిలేసి). గ్రామీణుల మాటల్లో దొర్లే ఇలాంటి పదాలకు సాహితీ పట్టం కట్టిన కవులు ఇక్కడ చాలామందే ఉన్నారు. 

      ఇలా ప్రాచీనకాలం నుంచి నేటివరకూ అనేక రూపాంతరాలు చెందుతూ... అటు పండితులను, ఇటు జానపదులను ఒకే బాటలో నడుపుతూ... తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది విజయనగరం తెలుగు. ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా తన మట్టిమాటలకే తొలి ప్రాధాన్యమిచ్చే ప్రాంతమిది.

(అయ్యగారి శ్రీనివాసరావు, విజయనగరం)

పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 ఏ పురాణంలో ఏముందో తెలుసుకుందాము

 

 1. మత్స్యపురాణం

 2. కూర్మపురాణం

 3. వామన పురాణం

 4. వరాహ పురాణం

 5. గరుడ పురాణం

 6. వాయు పురాణం

 7. నారద పురాణం

 8. స్కాంద పురాణం

 9. విష్ణుపురాణం

 10. భాగవత పురాణం

 11.అగ్నిపురాణం

 12. బ్రహ్మపురాణం

 13. పద్మపురాణం

 14. మార్కండేయ పురాణం

 15. బ్రహ్మవైవర్త పురాణం

 16.లింగపురాణం

 17.బ్రహ్మాండ పురాణం 

 18. భవిష్యపురాణం


ఈ పురాణాలు అన్నింటిలోకీ మార్కండేయ పురాణం చిన్నది కాగా, పద్మపురాణం పెద్దది.


 *మత్స్యపురాణం* 


మత్స్యరూపంలో ఉన్న మహావిష్ణువు మనువనే రాజుకు చెప్పిన ఈ పురాణంలో కాశీక్షేత్ర ప్రాశస్త్యం, యయాతి, కార్తికేయుడు వంటి రాజుల గొప్పదనాన్ని, ధర్మమంటే ఏమిటో, ఆ ధర్మాన్ని ఆచరించే విధానాలేమిటో విష్ణుమూర్తి వివరిస్తాడు.


 *కూర్మపురాణం* 


కూర్మావతారం దాల్చిన విష్ణుమూర్తి చెప్పిన ఈ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి, వారణాసి, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వర్ణన కనిపిస్తుంది.


 *వామన పురాణం* 


పులస్త్య మహర్షి నారద మహామునికి చెప్పిన ఈ పురాణంలో శివపార్వతుల కల్యాణం, గణేశ, కార్తికేయుల జన్మవృత్తాంతాలు, ఋతువుల గురించిన వర్ణనలు కనిపిస్తాయి.


 *వరాహపురాణం* 


వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మవృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.


 *గరుడ పురాణం* 


గరుడుని వివిధ సందేహాలపై విష్ణువు చెప్పిన వివరణ ఇది. ఇందులో గరుడుని జన్మవృత్తాంతంతోబాటు జనన మరణాలంటే ఏమిటీ, మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు; ఏ పాపానికి ఏ శిక్షపడుతుంది... వంటి విషయాలు తెలుపడం జరిగింది.


 *వాయుపురాణం* 


వాయుదేవుడు చెప్పిన ఈ పురాణంలో ఈశ్వరుని మాహాత్మ్యం, భూగోళం, సౌరమండల వర్ణనలు కన్పిస్తాయి.


 *అగ్నిపురాణం* 


అగ్నిదేవుడు వశిష్టునికి చెప్పిన ఈ పురాణంలో వ్యాకరణం, ఛందస్సు, వైద్యశాస్త్ర రహస్యాలు, జ్యోతిశ్శాస్త్రం, భూగోళ, ఖగోళ రహస్యాలను ఈ పురాణంలో తెలుసుకోవచ్చు.


 *స్కందపురాణం:* 


 కాశీఖండం, కేదారఖండం, కుమారిల ఖండం, రేవాఖండం... తదితర ఖండాలుగా ఉండే ఈ పురాణాన్ని స్కందుడే చెప్పాడట. ఇంకా రామేశ్వర క్షేత్ర మహిమ, పూరీ జగన్నాథ ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి. ఇంకా కుమారస్వామి జననం, మహిమలు, శివలీలల ఉంటాయి.


 *లింగపురాణం* 


లింగరూప శివ మహిమలతోబాటు, వివిధ వ్రతాలు, ఖగోళ, జ్యోతిష, భూగోళాల గురించిన సమాచారం ఉంటుంది.


 *నారద పురాణం* 


బహ్మమానసపుత్రులైన సనక సనంద సనాతన సంపత్కుమారులకు నారదుడు చెప్పిన ఈ పురాణంలో వేదాంగాల గురించి, పలు పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలుంటాయి.


 *పద్మపురాణం* 


ఈ పురాణంలో మధుకైటభులనే రాక్షస వధ, రావిచెట్టు మహిమ, పద్మగంధి దివ్యగాథ, గంగా మహాత్మ్యం, గీతాసారం, నిత్యపూజావిధానాల గురించి ఉంటుంది.


 *విష్ణుపురాణం* 


 పరాశరుడు తన శిష్యుడైన మైత్రేయునికి బోధించిన ఈ పురాణంలో విష్ణుమూర్తి అవతార వర్ణన, ధ్రువ, ప్రహ్లాద, భరతుల చరితామృతం ఉంటుంది.


 *మార్కండేయ పురాణం* 


శివకేశవుల మాహాత్మ్యం, ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యం, దేవీ మాహాత్మ్యం ఉంటాయి.


 *బ్రహ్మపురాణం* 


బ్రహ్మదేవుడు దక్షునికి బోధించిన ఈ పురాణంలో వర్ణధర్మాలు, స్వర్గనరకాల గురించి తెలుసుకోవచ్చు.


 *భాగవత పురాణం* 


విష్ణువు అవతారాలు, శ్రీ కృష్ణ జననం, లీలల గురించి మృత్యువుకు చేరువలో ఉన్న పరీక్షిన్మహారాజుకు శుకమహర్షి చెప్పిన పురాణమిది. దీనిని తొలుత వేదవ్యాసుడు శుకునికి బోధించాడు.


 *బ్రహ్మాండ పురాణం* 


బ్రహ్మదేవుడు మరీచి మహర్షికి చెప్పిన ఈ పురాణంలో రాధాకృష్ణులు, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, లలితా మహిమ్నా స్తోత్రం, ఖగోళ విజ్ఞానం గురించిన వివరణ ఉంటుంది.


 *భవిష్యపురాణం* 


సూర్యుడు మనువుకు చెప్పిన ఈ పురాణంలో అగ్ని, సూర్యోపాసన విధులతోబాటు, భవిష్యత్తులో జరుగబోయే వివిధ విషయాల గురించిన వివరణ ఉంటుంది.


 *బ్రహ్మావైపర్తపురాణము*


 ఇందులో గోలోక ప్రశంస, భోజననియమాలు, రోగనివృత్తి సాధనాలు, తులసీ, సాలగ్రామమహత్మ్యం ఉంటాయి

🙏

దక్షిణా దేవి!!*

 *దక్షిణా దేవి!!*


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు..

దక్షిణా దేవి ప్రాముఖ్యత..............!!


ఒక గోపిక... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.


రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది. గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను. ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను. 


ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది.. దక్షిణ,గోలోకము వదలి వైకుంఠము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను. దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.


'దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా' అని శ్రుతి యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి. ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి, యజమానునకిచ్చును..


దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను. ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి. బ్రహ్మ కోరికపై విష్ణువు, లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను. యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను. యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.


బ్రహ్మ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను. 'యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును. దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును' అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.


'యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్, దురిష్టగ్ స్యాత్' అని శ్రుతి బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు, అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్ధము కలుగునని యర్ధము..!


శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు, దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను, పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.


దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును. శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.


దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.


దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం, విద్య, స్ధిరాస్తులు, లభించును.


అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి... బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.


దక్షిణాదేవి ధ్యానము, స్తోత్రము, పూజాదికము, ఆ దక్షిణాదేవిని సాలగ్రామము లేక కలశమున ఆవాహనము చేసి పూజింపవలెను.


ఈదేవిని ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయైస్వాహా అను మూల మంత్రముచే పూజించుచు అర్ఘ్యపాద్యాది షోడశోపచార పూజలను చేయవలెను.


దక్షిణా దేవి స్తోత్రం.


పురా గోలోకగోపీ త్వం గోపీనాం ప్రవరాపరా | రాధాసమా తత్సఖీ చ శ్రీకృష్ణప్రేయసీ ప్రియే || 


కార్తికీ పూర్ణిమాయాంతు రాసేరాధా మహోత్సవే | 

ఆవిర్భూతా దక్షిణాంశాత్‌ కృష్ణస్యాతో హి దక్షిణా || 


పురా త్వం చ సుశీలాఖ్యా శీలేన సుశుభేన చ | 

కృష్ణ దక్షాంశవాసాచ్చ రాధాశాపాచ్చ దక్షిణా || 


గోలోకాత్త్వం పరిద్వస్తా మమభాగ్యాదుపస్థితా | 

కృపాం కురమత్వమేవాద్య స్వామినం కురు మాం ప్రియే || 


కర్తౄణాం కర్మణాం దేవీ త్వమేవ ఫలదా సదా | 

త్వయా వినా చ సర్వేషాం సర్వం కర్మ చ నిష్ఫలం || 


ఫలశాఖా విహీనశ్చ యథావృక్షో మహీతలే | 

త్వయా వినా తథా కర్మ కర్తౄణాం న చ శోభతే || 


బ్రహ్మవిష్ణు మహేశాశ్చ దిక్పాలాదయ ఏవ చ | 

కర్మణశ్చ ఫలం దాతుం న శక్తాశ్చ త్వయా వినా || 


కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః | 

యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ ||


ఫలదాతా పరం బ్రహ్మ నిర్గుణః ప్రకృతేః పరః | 

స్వయం కృష్ణశ్చ భగవాన్‌ న చ శక్తస్త్వ యా వినా || 


త్వమేవ శక్తిః కాంతే మే శశ్వజ్జన్మని జన్మని | 

సర్వకర్మణి శక్తోహం త్వయాసహ వరాననే |


లక్షీ్మ దక్షాంశ సంభూతాం దక్షిణం కమలాకళాం | 

సర్వకర్మసు దక్షాం చ ఫలదాం సర్వకర్మణాం || 


విష్ణోః శక్తి స్వరూపాం చ సుశీలాం శుభదాం భజే | 

ధ్యాత్వానేనైవ వరదాం సుధీర్మూలేన పూజయేత్‌ 


ఈ దక్షిణాఖ్యానమును శ్రద్ధగా విన్నచో అతడు చేయు సత్కర్మలు నిర్విఘ్నముగా పరిపూర్ణమగును. 


పుత్రులు లేని వారికి పుత్రులు, భార్య లేని వారికి గుణవతియగు భార్య, విద్య లేని వానికి విద్య, ధనము లేని వానికి ధనము, భూమి లేని వానికి భూమి లభించును. 


కష్టకాలమున, బంధువుల వియోగకాలమున, కారాగారమున బద్దుడైనప్పుడు దీనిని ఒక నెలవరకు విన్నప్పటికిని అతని కష్టములన్నియు తీరిపోవును.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

సనాతన సాంప్రదాయాలు

 తరతరాలుగా మనం వింటున్న , క్రమంగా మరచి పోతున్న కొన్ని సనాతన సాంప్రదాయాలు. . 

1. సోమ వారం తలకు నూనె రాయరాదు.

2. ఒంటి కాలీపై నిలబడ రాదు

3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు

4. శుక్రవారం నాడు కొడలిని పుట్టినింటికి పంప రాదు

5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలీ

6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు

7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు

8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు, తల దువ్వ రాదు

9. పెరుగును ఉప్పును అప్పు ఈయరాదు

10. వేడి వేడి అన్నం లోనికి పెరుగు వేసుకోరాడు

11. భోజనం మధ్యలో లేచి పోరాదు

12. తల వెంట్రుకలు ఇంట్లో వేయరాదు

13. గడపపై పాదం పెట్టి వెళ్లరాదు

14. ఇంటినుండి బయటకు వెళ్ళేటప్పుడు కసవూడ్చరాదు

15. గోడలకు పాదం ఆనించి పడుకో రాదు

16. రాత్రీ వేళలో బట్టలుతక రాదు

17. విరిగిన గాజులు వేసుకోరాడు

18. నిద్ర లేచిన తరువాత పడుకున్న ఛాపను మడిచి పెట్టాలి

19. చేతి గోళ్ళను కొరకరాడు

20. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకే సారి క్షవరం చేయించుకోరాడు

21. ఒంటి (సింగల్) అరిటాకును తేరాదు

22. సూర్యాస్తమయం వేళలో నిద్ర పోరాదు

23. భోజనం తరువాత చతిని ఎండ పెట్టవద్దు

24. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను మరచిపోరాదు

25. ఇంటి గడపపై కూర్చోరాదు

26. తిన్న తక్షణమే పడుకోరాదు

27. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకుని / కాళ్ళు చాపుకుని కూర్చోరాదు

28. చేతులు కడిన పిమ్మట ఝాడించ రాదు

29. రాత్రి భోజనం తరువాత పళ్ళెం కడుక్కోవాలి

30. ఎంగిలీ చేతితో వడ్డించరాదు

31. అన్నం, కూర చారు వండిన పాత్రలలో తినరాదు

32. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు

33. ఇంటికి వచ్చిన ఆడ పిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు

34. చిరిగిన అంగీలు, బనియన్లు తదితర లో దుస్తులను ధరించరాదు

35. ఇంటి లోపలికి చెప్పులు Shoes ధరించి రారాదు

36. దేవాలయాలలో చెప్పులు పోతే మరచిపొండీ. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరీద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే.

37. చిన్న జంతువులకు (కుక్కలు, దూడలు లాంటివి) పాచిపోయిన పదార్థాలు పెట్టకండి

38. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించ రాదు

39. ప్రయాణాల్లో అపరిచితులనుండి పానీయాలు, తీడి పదార్థాలు తీసుకోవద్దు.

40. శనివారం ఉప్పు, నూనె కొని తేరాదు

41. అనవసరంగా కొత్త చెప్పులను కోనరాదు

42. ఇంటిలో వాడకుండా పడివున్న గోడ గడియారాలు, వాచీలు, సైకిళ్ళ, కుట్టు మెషిన్లు లాంటివి వదిలించుకోవాలి

43. భగవంతుణ్ణి అది కావాలి ఇది కావాలి అని అడుక్కుని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావలసివుంటే అవే వస్తాయి.

44. అర్హులకు మాత్రమే గుప్త దానం చేయండి

45. మఠాలు దేవాలయాకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తరువాతి తరం వాళ్ళకు శిక్ష పడుతుంది.

46. ఇతరులను అనవసరంగా విమర్శించడం, మిమ్మలిని మీరు పొగడుకోవడం మానండి

   మీరు, మీ అధికారం ఏవీ శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. మీరు వారికి గురువులాగా ప్రవర్తించండి.

మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవరచుకోండి.


 కారు మేఘాలు కమ్ముతున్నాయి 

ఏక్షణంలో అయినా... 

వర్షం విపరీతంగా కురుస్తుంది...! 

వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !

      *అదీ..సంప్రదాయం!* 

 ....................


అంతర్జాతీయ ఖ్యాతినార్జించి

అమెరికాలో ఉంటున్న వైద్యుడు. సొంతూరు వచ్చినప్పుడల్లా 

పాఠాలు చెప్పిన పంతులుకు 

పాదాభివందనం చేస్తాడు…! 

 *అదీ .. సంస్కారం !* 

 .....................


ఖగోళ శాస్త్రాన్ని 

నమిలి మింగిన నిష్ణాతుడు.  

నిష్టగా ఉంటూ

గ్రహణం విడిస్తేగానీ... 

ఆహారం గ్రహించడు…! *అదీ .. నమ్మకం !* 🙏

  ....................


పరమాణు శాస్త్రాన్ని 

పిండి పిప్పిచేసిన పండితుడు. 

మనవడి పుట్టు వెంట్రుకలు 

పుణ్యక్షేత్రంలో తీయాలని 

పరదేశం నుండి పయనమై వస్తాడు…! 

 *అదీ .. ఆచారం !* 🙏

......................


అంతరిక్ష విజ్ఞానాన్ని

అరచేతబట్టిన అతిరధుడు. 

 అకుంఠిత నిష్ఠతో

పితృదేవతలకు 

పిండ ప్రదానం చేస్తాడు…!

 *అదీ .. సనాతన ధర్మం!

 ........................


అత్తింటికి వెళ్లేముందు 

ఇంటి ఆడబడుచు 

పెద్దలందరికీ 

పాదాభివందనం చేసి 

పయనమవుతుంది…! 

 *అదీ .. పద్ధతి !* 🙏

 ........................


పెద్ద చదువులు చదివినా 

పెద్ద కొలువు చేస్తున్నా 

పేరు ప్రఖ్యాతులున్నా 

పెళ్లి పీటలమీద .. వధువు

పొందికగా ఉంటుంది…! *అదీ .. సంస్కృతి!*🙏

శ్రీశైల క్షేత్రం.

 శ్రీశైల క్షేత్రం..

#శ్రీశైలం ఆంద్రదేశ్ కర్నూలు జిల్లాలో వెలసిన స్వయం భూలింగ మూర్తి ఉన్న క్షేత్రము. విశేషించి అష్టాదశశక్తి పీఠములలో శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికా అమ్మవారు ఒక శక్తిపీఠం. శ్రీశైలం అంత గొప్ప క్షేత్రం. ఆ పరమేశ్వరుడు వెలసిన కొండపేరు శ్రీగిరి. మనం ఎవరినయినా గౌరవవాచకంతో పిలవాలని అనుకున్నప్పుడు పక్కన శ్రీకారం చుడతాము. శైలమునకు ముందు శ్రీకారం వ్రాయబడి శ్రీశైలం అయింది. దానిపేరు శ్రీగిరి. శ్రీశైలంలో స్వామి లింగమూర్తియై అరూపరూపిగా ఉన్నాడు. ఉన్నది ఒక్క పరమాత్మే రెండుగా భాసిస్తున్నాడు. శ్రీగిరి అన్న పేరు రావడానికి సంబంధించి స్థల పురాణం ఒకమాట చెప్పింది. ఒక భక్తురాలు తాను ఒక కొండగా మారాలని కోరుకున్నది కాబట్టి ఆమె శైలముగా మారినది అని చెబుతారు. కానీ దాని తాత్త్వికమయిన రహస్యం వేరు. శ్రీ’లో ‘శ’కార, ‘ర’కార, ‘ఈ’కారములు ఉన్నాయి. ఈ మూడక్షరములు బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి – ఈ మూడు శక్తులను తెలియజేస్తాయి. ఈ మూడు శక్తులు ఉన్న కొండ శ్రీశైలం. ఈ మూడు శక్తులు మమైకమయిన శక్తి రూపిణి భ్రమరాంబిక. అందుకని శ్రీశైలం ఒక శక్తి పీఠం. ఆ కొండమీద అడుగుపెట్టిన వాడు సరస్వతీ కటాక్షమును కానీ, లక్ష్మీ కటాక్షమును గానీ, జ్ఞానమును గానీ నోరువిప్పి అడగక్కరలేదు. అతనికి కావలసినది ఆ కొండలోంచి ప్రసరిస్తుంది. అంత శక్తిమంతమయిన కొండ. శ్రీశైల పర్వతం ఎన్నో ఓషధులకు ఆలవాలము. శ్రీశైలము ఎన్నో ఉపాసనలకు ఆలవాలము. అటువంటి శ్రీశైలంలో పర్వతం మీద పరమశివుడు స్వయంభువుగా వెలిశాడు. ఆయన అక్కడ వెలవడానికి గల కారణం గురించి పెద్దలు ఒక విషయమును చెప్తారు. 


గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అని నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు శంకరుడు తన ఇద్దరు కుమారులను పిలిచి, ఎవరు భూమండలమునంతటిని తొందరగా ప్రదక్షిణం చేసి వస్తారో వారికి గణాధిపత్యం ఇస్తాను అని చెప్పగానే సుహ్రహ్మణ్యేశ్వర స్వామి గబగబా బయలుదేరి భూమండలంలో ఉన్న దేవాలయములన్నింటినీ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. గణపతి మాత్రం అలా అన్ని దేవాలయములకు వెళ్ళలేదు. సూక్ష్మలో మోక్షం అన్నట్లుగా ఆయన ‘నాన్నగారూ, తల్లిదండ్రులకు చేసిన ప్రదక్షిణం భూమండలమునకు చేసిన ప్రదక్షిణతో సమానం. కాబట్టి నేను మీకే ప్రదక్షిణం చేసి మీకే నమస్కరిస్తున్నాను’ అని తన తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు. ఈవిధంగా గణపతి తన బుద్ధి కుశలతను ప్రదర్శించాడు. అపుడు శంకరుడు గణపతికి గణాధిపత్య పదవిని ఇచ్చారు.


సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ సుబ్రహ్మణ్యుడిని ఇంటికి రమ్మనమని కోరడానికి వెళ్ళారు. వీరిని చూసి సుబ్రహ్మణ్యుడు 24 క్రోసుల ముందుకు వెళ్ళిపోయాడు. అపుడు శంకరుడు మల్లెతీగల చేత చుట్టుకోబడిన ఒక అర్జున వృక్షం క్రింద కూర్చున్నాడు. అపుడు పార్వతీదేవి కూడా వెళ్ళింది. పిల్లవాడు ఎలా ఉన్నాడో అని శంకరుడు సుబ్రహ్మణ్యుడు ఉన్న చోటుకు వెళ్లి కొడుకును బుజ్జగించాడు. ఆయన అలక తీరిపోయింది. ఆయన మహా జ్ఞానిగా నిలబడ్డాడు. శ్రీశైలమునకు పరమేశ్వరుడు ప్రతి అమావాస్య నాడు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటాడు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారు వెళ్లి దర్శనం చేసి వస్తూ ఉంటుంది. పిల్లవానికి దగ్గరలో ఉన్నామని అనిపించుకోవడానికి అక్కడే ఉంది 


సుబ్రహ్మణ్యుడిని చూసుకుంటూ ఈ మల్లెచెట్టు క్రిందకి వచ్చాము కదా అని అక్కడ వెలశారు. మనం అలకచేతనో, అజ్ఞానం చేతనో మన శరీరములను చూసుకుని భగవంతునికి దూరం అవుతున్నాము. ఇలాంటి వాళ్ళు ఎవరయినా ఉంటే వాళ్ళ దగ్గరకు తానే వెళ్ళిపోతాను అని చెప్పి వచ్చి పరమశివుడు శ్రీశైలంలో కూర్చున్నాడు. శ్రీశైల మల్లికార్జునుడిది ధూళి దర్శనం. మీరు మీ ప్రదేశం నుంచి శ్రీశైలం వెళ్ళే లోపల ఎంతో అశౌచమునకు లోనవుతుంది మీ శరీరం. ఆ బట్టలతో కొండమీదకి వెళతారు. మీరు శుభ్రపడి దర్శనానికి వెడితే ఆయన కొద్దిగా చిన్నబుచ్చుకుంటాడట. మీరు ఆ క్షేత్రమునకు వెళ్ళగానే ఆశౌచంతో కూడిన శరీరంతో గుడి దగ్గరకు వెళ్లి ధూళి దర్శనమునకు వచ్చాము అని చెప్పి లోపలి వెళ్లి ఈ మట్టి కాళ్ళతో మోకాళ్ళ మీద కూర్చుని మట్టి చేతులతో శివలింగమును ముట్టుకుని, శివలింగం మీద తల తాటిస్తే పరమేశ్వరుడు పొంగి పోయి సర్వకామ్య సిద్ధిని ఇస్తాడుట. దీనిని ధూళి దర్శనం అంటారు శ్రీశైలంలో. కాబట్టి శ్రీశైలంలో ధూళి దర్శనం చెయ్యాలి.


అసురసంధ్య వేళలో నందివాహనం భూమండలం మీదనుండి వెడుతుంది. అటువంటి సమయంలో పరమాత్మ శ్రీశైలపర్వతం మీద ఒకసారి దిగుతాడు. అంత పరమ పవిత్రమయిన సమయంలో శ్రీశైలంలో దేవాలయంలో కూర్చుని శివాష్టోత్తర శతనామములు చదువుకున్నట్లయితే అక్కడ దిగిన పరమాత్మ అది చూసి ఆయనను అన్ని పేర్లు పెట్టి పిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తాడు. జన్మ చరితార్థం అయిపోతుంది. చెంచులు చెవిటి మల్లన్నా అని అరుస్తూ ఉండేవారు. చెవిటి మల్లన్న అంటే ఆయన పొంగిపోతాడట. శ్రీశైలంలో పరమేశ్వరుడు తన భక్తుల కోర్కెలను తీర్చడానికి ఒక తండ్రిగా వచ్చి కూర్చున్నాడు. శ్రీశైలం స్వామీ వారిని దర్శించడానికి వచ్చిన వారి గోత్రనామమునలు ప్రత్యేకంగా ఒక చిట్టాలో వ్రాయమని అమ్మవారు గణపతికి చెప్పింది. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి. లోపలి వెళ్లి మన గోత్రం, పేరు, చెప్పుకోవాలి. గణపతి మన గోత్ర నామమును చిట్టాలో రాసేసుకుంటారు. 


శ్రీశైలంలో శిఖరేశ్వరం ఉంది. అక్కడికి నువ్వులు పట్టుకెళ్ళి నంది విగ్రహం దగ్గర పోస్తారు. పూర్వకాలంలో శివాలయంలో చరనంది ఉండేది. పూర్వం రోజులలో ఇప్పుడు ఉన్నంత వైద్య సదుపాయం ఉండేది కాదు. శివాలయం, విష్ణ్వాలయం తప్పకుండా ఉండి తీరేవి. ఎవరయినా గర్భిణీకి అనుకోకుండా నొప్పులు వస్తే పట్నానికి తీసుకు వెళ్ళడానికి అవకాశం లేకపోతే అంతరాలయం మూసేసి ఉన్నా కూడా పరుగెత్తుకుంటూ అర్చకుడి దగ్గరకు వెడితే ఆలయ ప్రధాన ద్వారం తీసేవారు. ఈ బాధ పడుతున్న గర్భిణి ఇల్లు ఎటువైపు ఉన్నదో అటువైపు చరనందిని తిప్పేవారు. ఈ చరనంది అటు తిరగగానే అటువైపు బాధపడుతూ ప్రసవం జరగకుండా ప్రాణాలు పోతాయేమో నని అనుకున్న వాళ్లకి కూడా ఎందరికో సుఖప్రసవములు జరిగేవి. 


అందుకే అనేక శివాలయములలో చరనంది ఉండేది. శిఖరేశ్వరంలో కూడా మనం ఈశ్వరుణ్ణి పొందలేక పడుతున్న బాధ నుంచి విముక్తం కావడానికి నువ్వులు వేసి తిప్పి శిఖరం చూడాలి. కానీ యథార్థమునాకు శిఖరము నంది శృంగములలోంచి కనపడదు. మీరు భావన చేస్తూ కళ్ళు తెరచి అక్కడ చూడాలి. ఈ కన్నులు తెరచి నంది శృంగములలోంచి చూస్తుంటే జేగురు రంగులో ఉన్న శ్రీశైల మల్లికార్జునుని ఆలయ గోపురం మీద వున్నా త్రిశూలంతో కూడి మెట్లు మెట్లుగా ఉన్న శిఖరం మీకు కనపడాలి. అలా కనపడిన వాడికి ఒక పునర్జన్మ ఉండదు. అందుకే శిఖరేశ్వర దగ్గర పరమాత్మ ఒక పరీక్ష పెట్టాడు. ఒకసారి అమ్మవారు ‘ఏమండీ శిఖరేశ్వరం దగ్గరకు వచ్చి నందిని తిప్పి శిఖరం చూస్తే ఇక పునర్జన్మ లేకుండా మోక్షమును ఇచ్చేస్తారా? అని. అపుడు శంకరుడు “శ్రీశైలం వచ్చిన వారందరికీ మోక్షం ఇవ్వను. ఎవరికి ఇస్తానో నీకు చూపిస్తాను అని ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపమును స్వీకరించారు. ఒక వృద్ధ బ్రాహ్మణిగా పార్వతీదేవి వచ్చింది. ఇద్దరూ ఆ శిఖరేశ్వరం దగ్గరికి వచ్చారు. మెట్లు ఎక్కుతున్నారు. నంది శృంగముల లోంచి చూస్తున్నారు. క్రిందికి దిగిపోతున్నారు. ఈశ్వరుడు అక్కడ చిన్న ఊబిని సృష్టించాడు. అందులో వృద్ధ బ్రాహ్మణుడు దిగిపోతున్నాడు. ఆ ఒడ్డున ఉన్న వృద్ధ బ్రాహ్మణి ‘మా అయన దిగబడిపోతున్నాడు. అందుకని ఎవరయినా ఒక్కసారి చేయినిచ్చి పైకి లాగండి’ అన్నది. అందరూ గబగబా వచ్చి చెయ్యి ఇవ్వబోయారు. అపుడు ఆమె మీలో పాపం లేనివారు పైకి లాగండి అంది. అపుడు ప్రతివాడూ తాను ఏదో పాపం చేసి ఉండక పోతానా అనుకుని వెనక్కి వెళ్ళిపోయారు. 


ఆ సమయంలో అటుగా ఒక వేశ్య కిందికి దిగుతోంది. ఈవిడ వేశ్య అని అందరూ అంటున్నారు. ఆవిడ దిగుతూ వచ్చి నేను లాగుతాను అన్నది. అపుడు పార్వతీ దేవి ఏమమ్మా, అందరూ మాకు పాపం ఉంది అని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పాపము కంటే నీ పాపం గట్టిది కదా. అటువంటి అప్పుడు నువ్వు నా భర్తను ఎలా లాగుతావు అని అడిగింది. అపుడు ఆవిడ శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే – అమ్మా నేను ఇప్పడు శిఖర దర్శనం చేశాను. మోక్షం రావాలంటే పాపం లేదు, పుణ్యం లేదు. రెండూ సున్నా అయిపోతేనే కదా మోక్షం. ఇపుడు నా ఖాతాలో పాపం లేదు. పుణ్యం లేదు అందుకని లాగుతున్నాను. నేను అర్హురాలను’ అంది. ఈవిడకు విశ్వాసం నిజంగా ఉన్నది ఈవిడకు మోక్షం ఇస్తున్నాను’ అని శివుడు పార్వతికి చెప్పాడు. నంది శృంగములలోంచి చూడడం కాదు. అక్కడ ఉన్నది తన తల్లిదండ్రులని నమ్మిన వాడు ఎవరో వానికి మాత్రమె మోక్షం ఇవ్వబడుతుంది. కాబట్టి శ్రీశైల క్షేత్రంలో అడుగు పెట్టిన వాడికి తాను తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నాననే భావన ఉండాలి. ఈ భావన పరిపుష్టమై మీరు శ్రీశైలం వెడితే మీకు అక్కడ ఎనలేని సౌభాగ్యం కలుగుతుంది.


సర్వాం శివమయం జగత్..🙏

 ॐ సర్వం శివమయం జగత్ ॐ

  ॐ ఓం నమఃశివాయ ॐ

 🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏

24, నవంబర్ 2021, బుధవారం

శ్రీరమణీయం* *-(242)*_

 _*శ్రీరమణీయం* *-(242)*_

🕉🌞🌎🌙🌟🚩


_*"నాకు సంభవించే కష్టసుఖాల్లో భగవంతుని జోక్యం ఉంటుందా ? లేదా !?"*_


_*నీకు జీవితాన్ని, కర్మలను అందించటం మినహా నీ కష్టసుఖాల్లో భగవంతుని జోక్యంలేదు. జీవితాన్ని సంపూర్ణంగా అర్ధం చేసుకుంటే ఏవి అవసరాలో, ఏవి కోరికలో మనకు తెలుస్తాయి. అప్పుడే మన ఆధ్యాత్మిక జీవనం సాఫీగా సాగుతుంది. దైవం విషయంలో కూడా అతి కోరిక పనికిరాదు. అందుకే అప్పుచేసి తీర్థయాత్రలు చేయకూడదని పెద్దలు చెబుతారు. భార్యాపిల్లలను పోషించటం, వారికి సౌకర్యవంతమైన జీవనాన్ని అందివ్వటం మాత్రమే మన బాధ్యత. పక్కవాడ్ని చూసి అనుకరించటం సరికాదు. పాదాలకు పట్టీలు పెట్టుకోవాలనిపించవచ్చు కానీ బంగారు పట్టీలు కోరటం అశాంతికి కారణం. అసమానత లేనిదే సృష్టిలేదు. నీ కన్నా తక్కువ సుఖం, ఎక్కువ సుఖం పొందేవారు ఎప్పుడూ ఉంటారు. అసమానతలో ఉన్న సమానత్వాన్ని గుర్తిస్తే శాంతి వస్తుంది. కానీ మనం సమానత్వంలో కూడా అసమానతను వెతుకుతున్నాం. కరెన్సీ నోట్లు సృష్టించేది మనమే, దొంగనోట్లని సృష్టించేదీ మనమే. కోర్టులు, చట్టాలు, శిక్షలు కూడా మనవే. వీటిలో భగవంతుని ప్రమేయం ఏముంటుంది !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_

_*'ఆలోచించేది ఎవరో తెలుసుకోవటమే ధ్యానం !'*- 


🕉🌞🌎🌙🌟🚩

శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్

 ॐ             श्री उमामहेश्वरस्तोत्रम्   

             శ్రీ ఉమామహేశ్వరస్తోత్రమ్ 

   Sree Uma Maheswara Stotram)   


              (श्रीमच्छंकरभगवतः कृतौ)   

           (శ్రీ శంకరాచార్య విరచితమ్)  

        (BY SREE AADI SANKARA)            


                                    శ్లోకం : 3     

                            SLOKAM : 3


नमः शिवाभ्यां वृषवाहनाभ्यां 

विरिञ्चिविष्ण्विन्द्रसुपूजिताभ्याम्।

विभूतिपाटीरविलेपनाभ्यां 

नमो नमः शंकरपार्वतीभ्याम् ।।3।। 


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరిఞ్చివిష్ణ్విన్ద్ర సుపూజితాభ్యామ్ I 

విభూతిపాటీర విలేపనాభ్యాం 

నమో నమః శంకరపార్వతీభ్యామ్ ৷৷3৷৷


మంగళమూర్తులూ, 

ఎద్దు వాహనముగా కలవారూ, 

బ్రహ్మ - విష్ణువు - ఇంద్రుడు మొదలగు వారిచే పూజింపబడువారరూ, 

విభూతి - చందనము పూసుకొన్నవారూ అగు 

పార్వతీపరమేశ్వరులకు నమస్కారములు. 


Salutations to Lord Shiva and Goddess Shiva ! 

  - Who rides on the divine bull,

  - Who is worshipped by Vishnu, Brahma and Indra and 

  - Whose bodies are anointed with Sandal and holy ash,


    Salutations and salutations to Lord Sankara

and to that Goddess Parvathy. 


https://youtu.be/KSTB-amenYA


                    =x=x=x=           


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

23, నవంబర్ 2021, మంగళవారం

భస్మాల ఉపయోగాలు - 1

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 1


   నేను అంతకు మునుపు భస్మాల పైన చాలా సమాచారం ఇవ్వడం జరిగింది. ఎంత గొప్ప సమాచారం మరియు ఉపయోగాల గురించి చెప్పినా కూడా మరెంతో సమాచారం ఇంకా మిగిలే ఉంటుంది. 


      ఆయుర్వేదం నందు మూలికావైద్యం మాత్రమే కాకుండా భస్మాలను ఉపయోగించి వైద్యం చేయడం కూడా ఉంది. దీన్ని "రసౌషధ విద్య " గా పిలుస్తారు. కాని ఇది రహస్యముగా ఉంచబడినది. ఈ విద్యని ఉపయోగించుటకు అవగాహన మరియు నేర్పరితనం తప్పక ఉండాలి. ముఖ్యముగా అనువంశికముగా వైద్యం చేయువారికి ఈ విద్య పైన సంపూర్ణ అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీకు మేము ఈ రసౌషద వైద్యములో ఉపయోగించు భస్మాల ఉపయోగాల గురించి వివరిస్తాను . 


 * స్వర్ణ భస్మం - 


    ఈ భస్మం రారాజు వంటిది. దీనిని వెన్నతోగాని , తేనెతో గాని , నెయ్యితో గాని సేవించిన పిత్తము , వాతము , ప్రమేహము , గ్రహణి , కుష్టు , నపుంసకత్వం , పాండు రోగము , క్షయ , మూలరోగము సమూలంగా పోవును . 


 * వెండి భస్మము - 


      దీనికి రౌప్య భస్మం అని కూడా పేరు కలదు . దీనిని సరైన అనుపానముతో సేవించిన పైత్యము , గుల్మము , కఫము , విషము , మేహము , శ్వాస , ప్లీహ ( spleen ) రోగములు , వలిఫలితము ( చిన్న వయసులో జుట్టు తెల్లబడుట ) , పాండురోగము , వాపు , దగ్గు , క్షీణత్వం అనగా శరీరం క్షీణించుట , క్షయ రోగము నశించును . 


 * తామ్ర భస్మం - 


      తామ్రము అనగా రాగి . రాగిని సరైన పద్ధతుల్లో పుటము పెట్టి శుద్ది చేసినది . ఈ భస్మమును వాడుట వలన కుష్టు , ప్లీహము , జ్వరము , కఫము , వాతము , శ్వాస , కాసము , వాపు , శూల , ఉదర రోగములు , క్రిమి రోగములు , పాండు , మొలల రోగము , క్షయ , భ్రమ , మోహము , ఎక్కిళ్ళు వంటివి తగ్గును. 


 * లోహ భస్మము - 


      లోహము అనగా ఇనుము . ఈ ఇనుప భస్మము పుటాలు పెట్టి శుద్ది చేసి వాడవలెను . దీనిని వాడటం వలన ప్లీహ రోగము ( spleen ), మొలల నొప్పి , పిత్తము , వాతము , కుష్టు , శోభి , కాస , జ్వరము , మేహావాతము , కీళ్ల నొప్పి తగ్గించును. దీర్గాయువు ఇచ్చును . 


 * కాంత భస్మము - 


      కాంతము అనగా అయస్కాంతము . దీన్ని శుద్ది చేసి తయారు చేసిన భస్మము వాడటం వలన మేహ పిటికలు , త్రిదోషములు , శూల , మొలలు , గుల్మము , ప్లీహ రోగము , క్షయ , పాండువు , ఆడవారిలో వచ్చు తెల్లబట్ట , ఎర్రబట్ట మరియు ఉదర బలహీనతను తగ్గించును . దీర్గాయువు ఇచ్చును . 


 * మండూర భస్మము - 


    చిట్టెపు రాళ్లు తెచ్చి బాగుగా కాల్చి ఆవు పంచితములో 7 పర్యాయాలు ముంచి నీళ్లతో కడిగి , ఎండించి జిల్లేడు పాలతో నూరి పుటం పెట్టిన భస్మం అగును. దీన్ని త్రిఫల కషాయంతో కలిపి మరికొన్ని పుటాలు వేసిన శుద్ధ మండురం అగును. ఇది అత్యంత శక్తివంతం అయినది. 


    పైన చెప్పిన పద్దతుల్లో మా కుటుంబము వారు తయారు చేసేవారు. ఇది లివర్ మీద అద్భుతముగా పనిచేయును . పాండురోగము మీద , కామెర్ల మీద శరీరం వాపు మీద బ్రహ్మస్తం వలే పనిచేయును . 


       మరికొన్ని భస్మాల గురించి తరువాతి పోస్టు నందు వివరిస్తాను .

వ్యమైన సున్నిపిండి

 శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి - 


 కావలసిన పదార్దాలు - 


  * పచ్చ పెసలు - 1 కిలొ .


  * బావంచాలు - 100 గ్రాములు .


   * వట్టి వేళ్లు - 100 గ్రాములు . 


   * కచ్చురాలు - 100 గ్రాములు . 


   * మంజిష్ట - 100 గ్రాములు .


   * మంచి పసుపు - 100 గ్రాములు .


   * కస్తూరి పసుపు - 100 గ్రాములు .


   * ఉలవలు - 100 గ్రాములు .


   * బత్తాయి తొక్కలు - 100 గ్రాములు .


   * కరక్కాయ బెరడు - 100 గ్రాములు .


   * ఉసిరికాయ బెరడు - 100 గ్రాములు .


   * తానికాయ బెరడు - 100 గ్రాములు .


   * ఎండు ఖర్జూరాలు - 100 గ్రాములు .


   * కుంకుడు కాయ పెచ్చులు - 100 గ్రాములు 


    * సుగంధపాల వ్రేళ్లు - 100 గ్రాములు .


    * తుంగ గడ్డలు - 100 గ్రాములు .


    * దానిమ్మ పండ్ల బెరడు - 100 గ్రాములు .


    * ఎండు గులాబీ రేకులు - 100 గ్రాములు . 


    * మరువము - 100 గ్రాములు . 


     * ధవనము - 100 గ్రాములు .


     * జాపత్రి - 100 గ్రాములు . 


     * యాలుకలు - 100 గ్రాములు . 


     * కురువేరు - 100 గ్రాములు . 


     * తులసి ఆకులు - 100 గ్రాములు . 


  తయారీ విధానం - 


    పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో 

పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి. 


 

  వాడేవిధానం - 


     స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .


  ఉపయోగాలు - 


 

 * ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును . 


 * శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి . 


 * చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును . 


 * మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .


 * చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .


 * శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును. 


 * శరీరానికి మంచి తేజస్సు కలుగును. 


 * సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .


  గమనిక -  


         పైన చెప్పిన విధానం మీరు చేసుకోలేనిచో చేసి ఇవ్వబడును . 


              కాళహస్తి వెంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                      9885030034

సత్యం.

 నగ్న సత్యం. 


*ఆకులు తింటేనే* 

*బ్రహ్మజ్ఞానం వస్తే*

*అందరి కన్నా* 

*ముందు మేకలే* 

  *జ్ఞానులు*

   *కావాలి,*⤵️


*స్నానాలతోనే* 

*పాపాలు పోతే* 

    *ముందు*

*చేపలే పాప* 

*విముక్తులు కావాలి,*


*తలక్రిందులుగా ,*

 *తపస్సు చేస్తేనే*

     *పరమాత్మ* 

   *ప్రత్యక్షమైతే*

    *ముందు*

   *గబ్బిలాలకే* 

 *ఆ వరం దక్కాలి,*


*ఈ విశ్వమంతా,*

 *ఆత్మలో ఉంది*

*నీలో ఉన్న,*

 *ఆత్మను వదిలి,*

 *పరమాత్మ అంటూ*

*పరుగులు పెడితే*

*ప్రయోజనమే లేదు*👇,


👉 *నీలో లేనిది,*

 ❗ *బయటేమీ లేదు* 

 ❗ *బయటఉన్నదంతా* 

 ❗ *నీలోనూ ఉంది*👈


*❕తెలిసి మసులుకో* 👈

  ❕ *కలిసి జీవించు.....*.       


మానస సరోవరం 🙏

తక్కువగా చూడకూడదు

 సోషల్ రూల్స్...

నిజంగా...ఎవరైనా...పాటిస్తున్నారా...


 1. ఏవరికైన  రెండు సార్లకు మించి

     అదేపనిగా కాల్ చేయవద్దు. వారు

     సమాధానం ఇవ్వకపోతే, వారికి వేరే

     చాలా ముఖ్యమైన పని ఉందని

     అర్థం. (కోంతమంది ఫోను ఏత్తేవరకూ   

     మళ్ళీమళ్ళీ, మళ్ళీమళ్ళీ ఫోనులు చేస్తూనే 

     ఉంటారు)


 2. అవతలి వ్యక్తి అడగక ముందే మీరు

     అరువు తీసుకున్న డబ్బును వారికి

     తిరిగి ఇవ్వండి. అది ఎంత చిన్న

     మొత్తమైనాసరే! అది మీ

     వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది! 


 3. ఎవరైనా మీకోసం పార్టీ 

     ఇస్తున్నప్పుడు మెనూ లో ఖరీదైన

     వంటలను ఎప్పుడూ మీరు ఆర్డర్

     చేయవద్దు.  వీలైతే మీ కోసం వారినే

     ఆహారాన్ని ఎంపిక చేయమని వారిని

     అడగండి.


 4.  "మీకు ఇంకా వివాహం కాలేదా?

      మీకు పిల్లలు లేరా? 

      ఎందుకు మీరు ఇల్లు కొనలేదు?"

      వంటి ఇబ్బందికరమైన ప్రశ్నలను

      ఎదుటివారిని అడగవద్దు. 

      అవి వారి సమస్యలు. 

      మీవి కావు!


 5. మీ వెనుక ఉన్న వ్యక్తికి ఎల్లప్పుడూ

      మీరే  తలుపు తెరిచి లోపలికి

      ఆహ్వానించండి. 

      అమ్మాయి,అబ్బాయి, చిన్నా, పెద్దా ఎవరైనా

      సరే. ఒకరిపట్ల మంచిగా

      ప్రవర్తించడం ద్వారా మీరు చిన్నగా

      మారరు.


 6. మీరు ఎవరితోనైనా వేళాకోళంగా/సరదాగా 

     మాట్లాడుతున్నప్పుడు దాన్ని వారు

     సరదాగా తీసుకోకపోతే వెంటనే

     దాన్ని ఆపివేయండి! మరలా

     చేయవద్దు.


 7. బహిరంగంగా ప్రశంసించండి,

      ప్రైవేటుగా విమర్శించండి.


 8. ఒకరి బరువు గురించి మీరు

     ఎప్పుడూ  వ్యాఖ్యానించవద్దు.

     "మీరు అద్భుతంగా కనిపిస్తున్నారు"

      అని చెప్పండి.  అప్పుడు బరువు

      తగ్గడం గురించి మాట్లాడా

      లనుకుంటే, వారే మాట్లాడుతారు. 


 9. ఎవరైనా వారి ఫోన్‌లో మీకు ఫోటో

     చూపించినప్పుడు, అదొక్కటే

     చూడండి. ఎడమ లేదా కుడి వైపుకు

      స్వైప్ చేయవద్దు. తర్వాత

      ఏముంటాయో మీకు తెలియదు

      కదా!


 10. మీరు ఒక సీ.ఈ.ఓ. తో ఎట్లా

       వ్యవహరిస్తారో అదే గౌరవంతో

       క్లీనర్‌తో కూడా వ్యవహరించండి.

       మీ క్రింది వారిని గౌరవంగా చూస్తే

       ప్రజలు ఖచ్చితంగా దాన్ని

       గమనిస్తారు.


 11. మిమ్మల్ని అడిగే వరకు ఎప్పుడూ

        సలహా ఇవ్వకండి.


 12.  సంబంధంలేని వారికి మీ 

        ప్రణాళికల గురించి చెప్పవద్దు. 


 13. ఒక స్నేహితుడు / సహోద్యోగి

       మీకు ఆహారాన్ని ఆఫర్

       చేసినప్పుడు మర్యాదగా 'నో'

       చెప్పండి. 

       కానీ, రుచి లేదా వాసన

       చూసిన తర్వాత 'నో' చెప్పవద్దు.

       అట్లా చేస్తే మీరు వారిని

       అవమానించినట్లే! 


 14. మరో ముఖ్య విషయం! ఇతరుల

        విషయంలో అనవసరంగా జోక్యం

        చేసుకోకుండా, మీ పనేదో మీరు

        చూసుకోండి!!


చివరిది , అతి ముఖ్యమైనది 


15.  ఇలా ఎవరైనా సలహాలు ఇస్తుంటే , 

        వీడేంటి ఉచిత సలహాలు ఇస్తున్నాడు 

        వీడికి  పనిపాటా లేదా అనుకోవడం కాకుండా,           

        వారికి కాస్త సమయం కేటాయించి వారు చెప్పేది 

        విని , నచ్చితే పాటించడం నచ్చకపోతే        

        వదిలెయ్యడం


అంతేకానీ వారిని తక్కువగా చూడకూడదు 

వారు ఎవరైనా సరే పేద్దవారైనా, చిన్నవారైనా...  .


సేకరించిన పోస్టు.

19, నవంబర్ 2021, శుక్రవారం

పుణ్యం

 🙏🌺పుణ్యం వెల🌺🙏


🌺 కాశీ పట్టణం లో ధనవంతుడు అయిన ఒక బ్రాహ్మణుడు వుండేవాడు.


అతను ప్రతీ రోజు దాన ధర్మాలు చేసేవాడు. దానికి తోడు మిక్కిలి దైవ భక్తి కలవాడు మరియు యజ్ఞ యాగాదులు కూడ చేసేవాడు.🌺


 🌺ఒక యాగంలో అన్నీ దానం చేయటంతో కుటుంబ పోషణకు అతడి వద్ద డబ్బులు లేకుండా పోయాయి.


 పక్క ఊరిలో ఒక పెద్ద సేఠ్ నివసిస్తున్నాడని అతడు ఇతరుల పుణ్యంను కొని ధనం ఇస్తాడని బ్రాహ్మణుడి భార్య అతనికి చెప్పి 

వారి వద్దకు వెళ్లి మీ పుణ్యాలు అమ్మి కొంత డబ్బు తీసుకురండి, తద్వారా వ్యాపారం మళ్లీ ప్రారంభం చేయవచ్చును 

అని సలహా ఇస్తుంది.🌺


🌺 బ్రాహ్మణుడు మాత్రం తను చేసిన పుణ్యం అమ్మడానికి ఇష్టపడలేదు, కానీ భార్య ఒత్తిడి మరియు పిల్లల బాధల కారణంగా అతను పుణ్యం అమ్మడానికి సిద్ధ

పడక తప్పలేదు.


 దారిలో తినడానికి భార్య ఇచ్చిన నాలుగు రొట్టెలు తీసుకొని ప్రయాణం అవుతాడు.


   అతను నడుచుకుంటు అడవిలోనుండి పోయేవేళ

ఆకలి కావటంతో ఊరికి చేరేలోపు భోజనం ముగించాలి అనుకుని రొట్టె తీయగానే ఒక కుక్క వచ్చి తన మూడు కుక్కపిల్లలతో ఎదుట నిలబడుతుంది. పిల్లలు చాలా చిన్నవి కావడంతో వాటిని వదిలి ఊరులోకి వెళ్లలేకపోయింది.🌺

 

🌺బ్రాహ్మణునికి బాధగా అనిపించి అతను కుక్క పై కుక్కపిల్లల కోసం జాలిపడి, తన దగ్గర ఉన్న రొట్టెల నుండి ఒక రొట్టెను కుక్కకు ఇస్తాడు.


 కుక్క చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో, కుక్క త్వరగా రొట్టె తినేసింది, కానీ ఇంకా ఆకలితో ఉండటంతో బ్రాహ్మణుడి వైపు చూపసాగింది.


 బ్రాహ్మణుడు జాలిపడి రెండవది, తరువాత మూడవది, చివరి నాల్గవది అలా మొత్తం రొట్టెలు కుక్కకు వేసి తను మాత్రం కేవలం నీరు త్రాగి సేఠ్ వున్న వూరికి చేరుకొంటాడు.


  బ్రాహ్మణుడు సేఠ్‌తో తన పుణ్యాన్ని అమ్ముకోవడానికి వచ్చానని చెప్పుతాడు.🌺

 

🌺 అప్పుడు సేఠ్ నేను చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం రండి, నేను కొంటాను అని అంటాడు.


 మధ్యాహ్నం సేఠ్ ఇంటికి భోజనానికి వెళ్లి తన పుణ్యాన్ని విక్రయించడానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడని భార్యతో చెప్పుతాడు. అతని దగ్గర నేను ఏ పుణ్యం కొనాలి చెప్పు అని సలహా

అడుగుతాడు.


 సేఠ్ భార్య చాలా మంచి పతివ్రత స్త్రీ. ఈరోజు బ్రాహ్మణుడు రొట్టెలన్నీ కుక్కకు ఇచ్చి చాలా పుణ్యం సంపాదించుకున్నాడని కండ్లు మూసుకొని ధ్యానం చేసి తెలుసుకొంటుంది.


కుక్కలకు రొట్టెలు వేసి సంపాదించిన పుణ్యం ను

బ్రాహ్మణుడి నుండి కొనమని తన భర్తకు చెబుతుంది.


 సాయంత్రం బ్రాహ్మణుడు తన పుణ్యాన్ని విక్రయించడానికి వచ్చినపుడు సేఠ్ ఇలా అంటాడు.

 

ఈరోజు నువ్వు చేసిన యజ్ఞం యొక్క పుణ్యాన్ని నేను కొనాలని అనకొంటున్నాను.


 బ్రాహ్మణుడు నవ్వి ఇలా అంటాడు. నా దగ్గర యజ్ఞానికి సరిపడ ధనం ఉంటే నీకు పుణ్యం అమ్మడానికి వచ్చేవాడినా

అని.🌺


🌺 ఈరోజు ఆకలితో ఉన్న కుక్కకూ ఆహారం పెట్టి ఆ కుక్కను, దాని పిల్లలను నువ్వు రక్షించావు అదే యజ్ఞం అని సేఠ్ అంటాడు.  


నువ్వు సంపాదించిన ఆ పుణ్యాలన్నీ నేను కొనాలని

అనుకొంటున్నాను అని అంటాడు.


 బ్రాహ్మణుడు పుణ్యం అమ్మడానికి అంగీకరిస్తాడు.  


దానికి బదులుగా నీకు నాలుగు రొట్టెల బరువుకు సమానంగా వజ్రాలు, ముత్యాలు ఇస్తానని సేఠ్ అనటం దానికి బ్రాహ్మణుడు కూడ అంగీకరించడం 

జరిగిపోతాయి.


 నాలుగు రొట్టెలు తయారు చేసి త్రాసులో కాటాకు ఒక ప్రక్కన ఉంచబడతాయి.🌺

  

🌺రెండవ దానిలో, సేఠ్ ఒక సంచీ నిండా వజ్రాలు, ముత్యాలు మరియు ఆభరణాలు ఉంచుతాడు. 


త్రాసు యొక్క కాటా కొంచెం కూడ కదలదు.  


రెండవ సంచీ ఉంచిన కూడ కాటా కొంచెంకూడ కదలక పోయేసరికి సేఠ్ తన దగ్గర 

వున్న ఆభరణాలు అన్నీ రెండో దిక్కున వుంచినా కూడ కాటా అసలుకే కదలదు. అది చూసిన తర్వాత అక్కడ వున్న వారందరు 

ఆశ్చర్య పోతారు.

 

అప్పుడు బ్రాహ్మణుడు సేఠ్‌తో, "నేను నా మనసు మార్చుకున్నాను." ఇప్పుడు నా పుణ్యాన్ని నీకు అమ్మడం ఇష్టం లేదు అని రిక్త హస్తాలతో తన ఇంటికి ప్రయాణం అవుతాడు. 🌺


🌺 ఇంట్లోకి అడుగు పెట్టగానే భార్య తనతో గొడవ పడుతుందేమోనని భయపడి,

 దారిలో కుక్కకి రొట్టెలు ఇచ్చిన చోటు నుంచి కొన్ని గులకరాళ్లు, రాళ్లను ఏరుకుని దానితో ఒక మూటనూ తయారు చేసి ముడి వేస్తాడు.


 ఇంటికి చేరుకోగానే అతని భార్య పుణ్యాన్ని అమ్మి ఎంత సంపాదించావు అని అడుగటం తో ఆ రాళ్ల మూటను భార్యకు ఇచ్చి

అప్పు దొరుకుతుందేమోనని గ్రామం లోకి వెళ్ళుతాడు.


 ఇక్కడ అతని భార్య ఆ మూటను చూసి ఆగలేక, భర్త వెళ్లగానే ఆ మూట తెరిచి చూస్తుంది. ఆ మూట నిండా వజ్రాలు, నగలు ఉండటం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోతాయి.


 బ్రాహ్మణుడు ఇంటికి తిరిగి రాగానే అతని భార్య మీ పుణ్యానికి ఇంత మంచి ధర ఎవరు చెల్లించారని అడుగుతుంది.🌺


 🌺మీకు ఇన్ని వజ్రాలు మరియు ఆభరణాలు ఎక్కడ నుండి వచ్చాయి 


 వజ్రాలు, నగలా ఎక్కడ ఉన్నాయో చూపించు అని అంటాడు బ్రాహ్మణుడు.

 

భార్య తన ముందు ఉన్న మూటను విప్పగానే

అందులోంచి విలువైన ఆభరణాలు బయట పడటంతో బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోతాడు.


 అప్పుడు అతను తన భార్యకు జరిగిన విషయాలు అన్నీ పూస గుచ్చినటుల చెబుతాడు.

 

విపత్తు సమయంలో తన పుణ్యంను విక్రయించమని అతనిని బలవంతం చేసినందుకు అతని భార్య చాలా బాధపడుతుంది.🌺

 

🌺ఇదీ కథ. 

నిజానికి ఇది కథ కాదు. జీవితం. 

ఈ కలిలో, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టండి. ఆపదలో ఉన్న వారికి సాయం చెయ్యండి. మీకు ఎంత డబ్బున్నా ఇహలోక ప్రయాణానికే. మీ డబ్బును ఎవరైనా దొంగిలించవచ్చు. కానీ, మీ పుణ్యాన్ని ఎవరూ దొంగిలించలేరు. 

అందుకే, మీ దగ్గర ఉన్న డబ్బును పుణ్యంగా మార్చుకోండి. పరలోక ప్రయాణానికి పుణ్యం తోనే టిక్కెట్టు కొనుక్కోండి .


 దేవుడు మనల్ని పరీక్షిస్తాడు

  మనం ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతే, మనల్ని శాశ్వతంగా ఆశీర్వదిస్తాడు🌺


🌺 అందుకే ఎంతటి సంక్షోభం వచ్చినా భగవంతునిపై విశ్వాసం వమ్ముకాకూడదు


    ప్రపంచానికి భయపడకు


    ఇక్కడ ఎవరో కోరితే ఎవరికీ చెడ్డరాదు


    మన కర్మ ఫలమే మనకు లభిస్తుంది,


ఆ  🌺

రహస్య ఎజెండా

 *స్వాతంత్ర్యం తరువాత* *అధికారాన్ని చేజిక్కించు కున్న మితవాదులు రహస్య ఎజెండా , బ్రాహ్మణ వ్యవస్థను నిర్మూలించడం ద్వారా హిందూ మతాన్ని నిర్వీర్యం చెయ్యడం . హిందూ దేవాలయాలను* *ఎండోమెంట్ పరిధిలోనికి తీసుకుని వాటి వైభవాన్ని మసకబారేటట్లు చెయ్యడం . ఈ రోజుల్లో బిటెక్ చదివిన విద్యార్థికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే ప్రారంభంలోనే రూ .25 వేల జీతం ఇస్తున్నారు . మరి దేవాలయాల్లో ధూప , దీప ,* *నైవేద్య కైంకర్యాలకు తమ జీవితాలను అంకితం చేసి , తద్వారా మన* *హిందూమతాన్ని , మన సంస్కృతి , సాంప్రదాయాలను పరిరక్షిస్తున్న బ్రాహ్మణులకు జీతాలు ఎంత ఇస్తున్నారు*

 *స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి బ్రాహ్మణులపై ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష* *చూపిస్తుంది ? ఈ విషయాన్ని ఈ దేశంలో ఉన్న హిందూ పీఠాలు , మఠాలు , హిందువులు ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదు ? ఇది మన దేశ సమస్య కాదా ? 2012 లో ఒక వ్యక్తి మద్రాస్ హైకోర్టులో బ్రాహ్మణుల జీత భత్యాల గురించి ఒక రిట్* *పిటీషన్ వేశాడు . దక్షిణ భారతదేశంలో 50 ముఖ్యమైన దేవాలయాల్లో అర్చకుల జీతభత్యాలను ఉదహరిస్తూ .. ఒక* *దేవాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న నరశింహ గోపాలన్ జీతం 250 రూపాయలు . ప్రభుత్వం దయార్ధ హృదయంతో అతని జీతాన్ని ఒక్కసారిగా మూడింతలు పెంచితే రిట్ పిటీషన్ వేసే సమయానికి అది 750* *రూపాయలు అయింది . అదే ఆలయంలో నరశింహ గోపాలన్ గారి తండ్రి అర్చకులుగా చేసేవారు . 1980 నాటికి ఆయన జీతం రూ . 55. ఆ ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న మరో దేవాలయంలోని పూజారి జీతం రూ .19 . ( 2012 లో హిందూ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా* *మద్రాస్ హైకోర్టులో రిట్ పిటీషన్ వెయ్యడం జరిగింది . ) బ్రాహ్మణ వ్యవస్థపై ఈ విషాన్ని కక్కుతున్నదెవరు ? ఈ దేశంలో నివసిస్తున్న వారు దీన్ని ఎందుకు గ్రహించలేక పోతున్నారు ?*

 *1962 లో చైనాతో యుద్ధం ముగిసిన తరువాత ఢిల్లీలో ఒక సభ జరిగింది . ఆ సభకు నెహ్రూ మరియు స్వామి విధ్యానంద విదేహ్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు . నెహ్రూ మాట్లాడుతూ .. ఆర్యులు భారతదేశానికి వచ్చిన శరణార్ధులు అంటూ ఆర్యులను కించపరిచే విధంగా మాట్లాడాడు . ఆ మాటలు విన్న స్వామి విధ్యానంద విదేహ్ లేచి వెళ్లి , నెహ్రూ* *ముందు నిల్చుని , నిప్పులు కక్కుతున్న కళ్లతో నెహ్రూని చూస్తూ చాచి అతని చెంప మీద కొడతాడు . ఆ దెబ్బకు నెహ్రూ తూలి వెనక్కి పడబోతాడు . వెనుక ఉ న్నవాళ్లు నెహ్రూ పడిపోకుండా పట్టుకుంటారు . ఈ దృశ్యాన్ని తిలకించిన ఎంతో మంది సభికులు తమ హర్షాతిరేకాన్ని చప్పట్ల ద్వారా* *తెలియజేస్తారు . ఆ సంఘటనతో నెహ్రూ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోతాడు . ఎందుకంటే అతన్ని సపోర్ట్ చెయ్యడానికి , నెహ్రూ అంటే నచ్చని వాళ్ల నోళ్లు నొక్కడానికి అక్కడ గాంధీ లేడు . అప్పటికే ఆయన గాడ్సే చేత చంపబడ్డాడు . వెంటనే స్వామి విధ్యానంద విదేహ్ మైక్ అందుకొని “ ఆర్యులు ఈ దేశానికి శరణార్థులు కారు , ఈ దేశానికి పూర్వీకులు . వాళ్ళే భారతదేశానికి నిజమైన వారసులు . ఈ దేవంలో* *ప్రవహిస్తున్నది ఆర్యుల రక్తమే " . అని నెహ్రూని ఉద్దేశిస్తూ .. నువ్వు , నీ తండ్రి అరేబియా నుంచి వచ్చిన శరణార్థులు . నీ ఒంట్లో ప్రవహిస్తున్నది* *అరబ్బుల రక్తం . ఈ దేశానికి నువ్వు ప్రధానివి కాకుండా సర్దార్ వల్లభాయి పటేల్ అయ్యుంటే ఈ దేశ భవిష్యత్తు మరొక రకంగా ఉండేది అనేటప్పటికి .. ఆ ప్రాంగణం అంతా సభికుల* *హర్షద్వానాలతో దద్దరిల్లిపోతుంది . నెహ్రూ అవమానభారంతో వేదిక దిగి వెళ్ళిపోతాడు . మీడియా అంత ప్రాచుర్యం లేని ఆ రోజుల్లో .. ఉన్న మీడియా గొంతునొక్కి నిజాన్ని నిశీధిలో సమాధిచేశాడు నెహ్రూ . ఆ రోజుల్లో బ్రాహ్మణ వ్యవస్థ నిర్మూలనకి , హిందూమతాన్ని అణగదొక్కడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి* . *ఈ రోజుకు ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉ న్నాయి . అరకొర జీతాలతో తమ కడుపుల్లో ఆకలి మంటలు అగ్నిపర్వతాలు సృష్టించినా .. దైవాన్ని , దేవాలయాలను ఒదలకుండా హిందూ మత సంరక్షణే ధ్యేయంగా నిలబడిన ధీశాలురు మన బ్రాహ్మణులు . వారి ద్వారా మతాన్ని , సంస్కృతి సాంప్రయాలను కాపాడుతున్నారు*

*అసలు హిందూ దేవాలయం లేని దేశం ఈ - భూమ్మీద ఎక్కడైనా ఉందా ? ప్రపంచంలో ఎక్కడ ఎ . ఎటువంటి తవ్వకాలు జరిగినా హిందూ దేవాలయాలకు న సంబంధించిన ఆనవాళ్లు బయటపడుతున్నాయి . ఎక్కడ దేవాలయం ఉంటుందో అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది . ఈ పవిత్ర భూమిని , హిందూ మతాన్ని పరిరక్షించడానికి భగవత్ ప్రేరణ కలిగిన మహాయోగులు - అదృశ్యంగా కృషిచేస్తూనే ఉంటారు . దానికి నిదర్శనం , శ్రీరామకృష్ణ పరమహంస ప్రేరణతో వివేకానందుడు హిందూ మత విశిష్టతను యూరోపియన్ దేశాల్లో ప్రచారం చేసిన తరువాత , " రాబోయే 15 వందల సంవత్సరాలకు సరిపడా హిందూ విత్తనాలను యూరోపియన్ దేశాల్లో వెదజల్లాను " అంటూ తన జీవితచరిత్ర