27, డిసెంబర్ 2025, శనివారం

విజయమున ప్రయత్నము*

 *నేటి సూక్తి* 


*ప్రతి విజయం ప్రయత్నం, అవహేళన మరియు వ్యతిరేకత అనే మూడింటిని దాటి రావాల్సిందే*


*క్రాంతి కిరణాలు*


*కం.

ప్రతి విజయమున ప్రయత్నము*

*వ్యతిరేకత కలుగుచుండు పరి పరి విధముల్*

*వెతలు నవహేళనుండును*

*నతిక్రమణము చేయవలెను నతి తేలికకై*



*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

పరాశక్తి అరుణారుణ అని చెప్పుకున్నాం.

  🌹సర్వారుణా🌹


ఆ పరాశక్తి అరుణారుణ అని చెప్పుకున్నాం. 

అమ్మ అంతా అరుణమే, ఆమె శరీర చాయ ఎరుపు.  

ధరించే ఆభరణాలు ఎర్రవి. కురువింద మణులు పొదగబడిన కిరీటము ఎరుపు.  

పద్మరాగమణీ దర్పణాన్ని మించిన తరళమైన చెక్కిళ్ళు, 

ఎర్రని రత్నహారాలు ధరించి మనలను ఆశీర్వదిస్తుంది. 

మాణిక్యమకుటాల వంటి మోకాళ్ళు అందంగా అమిరాయి.   

జపాకుసుమాలు, కౌసుంభము వంటి ఎర్రని పుష్పాలు ఇష్టంగా ధరించి ఆనందపడుతుంది. 

ఎర్రని కాంతి వలయంతో ఆ నిజారుణ ప్రభాపూర మెరిసిపోతూ ఉంటుంది. 

ఎర్రని రంగుతో భాసించే వస్త్రాలు ధరించి మనలను తరిపింపచేస్తుంది. 

ఆరుద్ర పురుగుల ఎరుపులో వున్న తూణీరము వంటి పిక్కలు కలిగినది.  

లలితమ్మ అంతా ఎర్రెర్రని ఎరుపే, ఆ సర్వారుణ కు వందనం. 🌹


🌹అనవద్యాంగీ🌹


ఈ నామమును అనవద్యాంగీ అని పలకాలి. నింద లేని అంగములు కలది అని అర్ధం. 

ఆ శ్రీదేవి అంగములు అన్నీ చక్కనివి, నిండైనవి. ఆ అవయవ సౌష్టవము లోపమెన్నలేనిది. 

ఏ అవయవము ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో అదే విధంగా ఉన్నది. 

కను ముక్కు తీరు అంటామే అదీ. అమ్మకి ఏ చిన్న అవయవము లోనూ లోపము లేదు. 

ఆ దేవి మహా లావణ్య శేవధి కదా, ఏ అంగము లోనూ లోపము వుండనే ఉండదు.  

ఏ అవయవ అమరికకూ నింద లేదు, అంటే, వంక లేదు. 

ఆపాదమస్తకమూ ఏ విధము గానూ వంక పెట్టలేని, లోపం చూపలేని, నింద చేయలేని 

అంగములు కల, ఆ అనవద్యాంగి కి వందనం. 🌹


🌹సర్వాభరణ భూషితా 🌹


ఆ శ్రీ మహారాజ్ఞి సర్వాభరణ భూషిత. అంటే, ఏ అవయవమునకు ఏ ఆభరణం పెట్టుకోవాలో,

ఆ విధంగా అన్ని ఆభరణములనూ అతిశయంగా ధరించిన శ్రీదేవి. 

తలపై చూడామణి నుంచి కాలి వేళ్ళకు గల మెట్టెల దాకా సౌభాగ్య చిహ్నాలైన 

అన్ని ఆభరణములనూ ఆమె అలంకరించుకుని వుంటుంది.

సౌభాగ్యవతి ఏ ఆభరణములను పెట్టుకోవాలో, ఆ యా ఆభరణాలన్నీ అలంకారప్రాయంగా

వేసుకున్నది. ప్రతి ఆభరణము ఒక్కొక్క అంగానికి అమరి, తాము ప్రకాశాన్నీ, 

శోభనూ పొందుతూ ఆ తల్లిని సేవించుకుంటున్నాయి.  

ఆ అమ్మ పెట్టుకున్న ఎన్నో నగలు ఇప్పుడు ఎంతో మందికి తెలియవు. 

ఉదాహరణకు, ఇడా, పింగళా నాడులను సూచిస్తూ తలపై ఎడమ వైపున చంద్రవంకనూ, 

కుడివైపున సూర్యబింబాన్నీ పెట్టుకుంది. 

మధ్యలో సుషుమ్నను సూచిస్తూ నాగరాన్ని పెట్టుకుంది. 

ముత్తైదువులకు తప్పనిసరిగా ఉండవలసిన పంచ మాంగల్యాలనూ ధరించింది. 

కాలికి పసుపు, మధురంగా మోగే మువ్వల మంజీరాలు, మెట్టెలు,  

రెండు చేతుల నిండా ఘల్లు ఘల్లుమనే గాజులు,

పాపిట నిండుగా ఎర్రని సిందూరము, తలలో సువాసన భరితమైన పువ్వులు,

చెవులకు దుద్దులు, కంటికి కాటుక, ముక్కుకు ముక్కెర, ఇతర నాసాభరణాలు,  

నల్లపూసలు, వివాహసమయంలో భర్త కట్టిన మంగళసూత్రము, వీటిని పంచ మాంగళ్యాలంటారు. 

కామేశ్వరి ఆపాదమస్తకమూ అన్ని ఆభరణములనూ ధరించి నిండుగా వున్న సువాసినీమూర్తి.   

అన్ని ఆభరణములనూ అందముగా అలంకరించుకున్న ఆ సనాతని, ఆ పెద్దఇల్లాలు, 

ఆ అపరాజిత, ఆ సర్వమంగళ, ఆ సర్వాభరణ భూషిత కు వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

లలితా_దేవి_అనుగ్రహం_అందరికీ_లభిస్తుందా

 "#లలితా_దేవి_అనుగ్రహం_అందరికీ_లభిస్తుందా? 

#అమ్మ_మన_దగ్గరకు_రావాలంటే_ఏం_చేయాలి?"


"లలిత అమ్మవారు అందరి దగ్గరికి రాదు" లేదా "అందరూ ఆమెను పూజించలేరు" అని ఎందుకు అంటారంటే:


🙏 ​1. పూర్వజన్మ సుకృతం:-


శాస్త్రాల ప్రకారం, "జన్మాంతర సహస్రేషు కృతపుణ్యైక లభ్యతే" - అంటే వేల జన్మల పుణ్యం ఉంటే తప్ప లలితా దేవి నామం నోటికి రాదు, ఆమె పూజ చేసే భాగ్యం కలగదు. అందుకే లలితా సహస్రనామ పారాయణ చేసేవారిని చాలా పుణ్యాత్ములుగా భావిస్తారు.


🙏 ​2. అమ్మవారి పిలుపు (The Calling):-


​మనం అమ్మవారిని ఎంచుకోవడం కాదు, అమ్మవారే మనల్ని ఎంచుకుంటుంది అని అంటారు. ఎవరికైతే లలితా దేవి పట్ల ఆసక్తి కలుగుతుందో, ఎవరైతే ఆమె కథలు లేదా నామాలు వినాలనుకుంటారో.. అది అమ్మవారి పిలుపుగానే భావించాలి.


🙏 ​3. మానసిక పరిపక్వత:-


​లలితా దేవి "జ్ఞాన స్వరూపిణి". అందరూ భయం భక్తితో దేవుళ్ళను పూజిస్తారు, కానీ లలితా దేవిని పూజించాలంటే మనసులో ప్రేమ, కరుణ, ప్రశాంతత ఉండాలి. రాగద్వేషాలతో నిండిన మనసులోకి అమ్మవారు ప్రవేశించదు. ఎవరైతే మనసును నిర్మలంగా ఉంచుకుంటారో, వారి దగ్గరికి అమ్మవారు పరిగెత్తుకుంటూ వస్తుంది.


🙏 4. గురువు మరియు సంకల్పం:-


​కొన్నిసార్లు మనం పూజ ప్రారంభించాలనుకున్నా ఏవో ఆటంకాలు వస్తుంటాయి. అది అమ్మవారు మనల్ని పరీక్షిస్తున్నట్లు లెక్క. మన సంకల్పం బలంగా ఉంటే, ఆమె తప్పకుండా మనల్ని తన దరి చేర్చుకుంటుంది.


👍 అమ్మవారు మీ దగ్గరకు రావాలంటే ఏం చేయాలి?


అమ్మవారు అందరికీ తల్లి. తల్లి బిడ్డ దగ్గరకు రాకుండా ఉండదు. కాకపోతే మనం ఆమెను పిలిచే విధానంలో "కపటం" ఉండకూడదు.


✨​ రోజూ "శ్రీమాత్రే నమః" అని ఒక్కసారి మనస్ఫూర్తిగా అనండి.

✨​ అమ్మవారిని ఒక చిన్న పాపలా భావించి మీ ఇంట్లో అలంకరించుకోండి.

✨ ​కఠినమైన నియమాల కంటే **"నిజాయితీ గల భక్తి"**ని ఆమె ఇష్టపడుతుంది.


 ఎవరైతే ఈ పోస్ట్ చదువుతున్నారో లేదా అమ్మవారి గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారో.. వారందరిపై అమ్మవారి కటాక్షం ఉన్నట్లే! ఆమె ఇప్పటికే మీ హృదయంలో ఉంది, అందుకే మీకు ఈ ఆసక్తి కలిగింది.


అమ్మవారి అస్సిసులు మన అందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 

🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻

హరి లీలలనే తలచుచు*

  *14 కం. 

హరి లీలలనే తలచుచు*

*హరినామము మరువకుండ నానందముతో*

*విరి మాలల నర్పించగ*

*కరములు జోడించినాను కైవల్యము🌹హిందూ ధర్మం 🌹


మాయ చేత తాను కర్తననే భావమే జీవుడిని, ఈశ్వరుడి నుంచి వేరు చేస్తోంది. ఆ భావనే అహం. అహం నశిస్తే, సర్వం నశిస్తుంది, అప్పుడు మిగిలేది తానే అంటారు రమణులు. జ్ఞానం అంటే మరేదో కాదు, అహం నాశనం అని కూడా అంటారు. జీవుడు ఎప్పుడైతే తాను కర్తను అనుకుంటాడో, ఆ క్షణం నుంచి అతనికి కర్తృత్వం ఏర్పడుతుంది. అప్పుడు అతనికి కర్మ అంటుకుంటుంది. కర్మ ఏర్పడినప్పుడు, దానికి కర్మఫలం కూడా ఉంటుంది. అది జీవుడు అనుభవించవలసి వస్తుంది. అది పుణ్యకర్మ అయినా సరే, పాప కర్మ అయినా సరే. అందుకే పాపం జీవుడిని బంధించడానికి ఇనుపసంకెళ్ళు అయితే, పుణ్యం బంగారు సంకెళ్ళు అంటారు జ్ఞానులు. ఏదైనా బంధిస్తుంది. 


నిజానికి అంతా మనమే చేస్తున్నామనే భావనకు కారణం అన్నిటికి తానే కారణం అనుకోవడం, ఇది మాయ నుంచి వస్తుందని చెప్పుకున్నాము కదా. దీనికి రమణ మహర్షి ఒక చక్కని ఉపమానం చెబుతారు. రాత్రి ఒళ్ళు మరిచి నిద్రపోతాడు. అప్పుడు నేను అనే భావన ఉండదు. అసలు మనస్సులో ఏ ఆలోచన కలుగదు. నేను ఉన్నాను అన్న భావన కూడా ఉండదు. ఆ భావన లేనప్పటికి తాను లేడని అర్ధం కాదు. రాత్రి నిద్రలో మనస్సు హృదయంలో లయించి ఉంటుంది. ఉదయం లేస్తూనే, మనస్సు లేస్తుంది. మెల్లిగా అన్నీ గుర్తుకు వస్తాయి. నేను అన్న భావన కూడా పుడుతుంది. ఇలా పుట్టే నేను అన్న భావన మనస్సుకు చెందినది. అది నిద్రలో లేదు. ఆ భావన లేదు కాబట్టి తాను లేడని అనడం లేదు కదా. అనగా ఉదయం లేచింది, మనస్సు, అహంకారము. జ్ఞానోదయం అయినప్పుడు ఈ మనస్సు, అహంకారాలు రెండు ఉండవు. ఉన్నా, అవి హృదయం యొక్క ఆధీనంలో ఉంటాయి. కనుక అప్పుడు జీవునకు కర్మలు అంటవు.


జీవుడు చేసే కర్మలు కేవలం భౌతికమైన దేహానికే పరిమితం కావు. భౌతిక దేహంతో చేసిన కర్మలు, జీవుడు బయట నుంచి స్వీకరించే ఆలోచనలు, వినే మాటలు, చూసే విషయాలు, తిరిగే వాతావరణం సూక్ష్మదేహం మీద అనగా మనస్సు మీద చెరగని ముద్రలు వేస్తాయి. ఒక ప్రదేశానికి మొదటిసారి వెళ్ళినా, ఆ ప్రదేశం తనకు ఎప్పటి నుంచో తెలిసినట్టు అనిపిస్తుంది. కొందరిని చూసినప్పుడు, వారు ఎప్పటి నుంచో తెలిసినవారనిపిస్తుంది, లేదా బాగా దగ్గరివారని తోస్తుంది. మనస్సులో ఒక అలజడి లాంటిది కలుగుతుంది. దాన్నే వేదాంతశాస్త్రంలో 'వాసన' అంటారు. అనగా పూర్వజన్మ జ్ఞాపకం. చేతిలో కాసేపు కర్పూరం పట్టుకుంటే, చేయి అంతా కర్పూరం వాసనే వస్తుంది, అలానే మనస్సు దేన్ని పట్టుకుంటే, దానికి ఆ వాసన అలవడుతుంది. అది అంత తొందరగా వదలదు. 


ఒకే పనిని పదే పదే చేస్తే, అది 'సంస్కారం'గా ఏర్పడిపోతుంది. అది తర్వాత జన్మలో కూడా ఆ జీవునిపై ప్రభావితమవుతుంది. మనకు గత జన్మలో ఉన్న మంచి సంస్కారాలు, చెడ్డ అలవాట్లు/ దుసంస్కారాలు మనస్సులో వాసనలుగా నిక్షిప్తమవుతాయి. మరణం స్థూల (భౌతిక) దేహానికి కానీ సూక్ష్మ, కారణ శరీరాలకు, ఆత్మకు కాదు. కనుక మరణించిన తర్వాత, ఒక జీవుడు తాను ఆ జన్మలో చేసిన కర్మల యొక్క జ్ఞాపకాలు, ఆలోచనలు, కోరికలు, అతడిని వాసనల రూపంలో వెంటాడుతాయి. మరణం తర్వాత దేహం నుంచి ఆత్మ విడువడగానే, ఆ ఆత్మను పట్టుకుని, సూక్ష్మ, కారణ దేహాలు, వాటిల్లో ఉండే వాసనలు తదుపరి ఉపాధిని వెతుకుతూ ప్రయాణం మొదలుపెడతాయి. ఉపాధి అంటే శరీరం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹కై*

దయామయుడైన విశ్వేశ్వరుడు



పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో కాశీలో వుండి తపస్సు చేసుకోసాగాడు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది. మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు. అలా మూడు రోజులయింది. ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు. అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు. సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి ? కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది. అందుకే వారికి అహంకారం పెరిగి తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు. మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు. అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది. తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది. మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది. కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది. ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు. వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే , ‘’వ్యాస నిష్కాసనం ‘’చరిత్ర సృష్టిస్తుందని ఊరడించి, ప్రతి అష్టమి నాడును ,ప్రతి మాస శివరాత్రి నాడును కాశీ ప్రవేశమునకు వ్యాసునికి అనుమతి నిచ్చాడు దయామయుడైన విశ్వేశ్వరుడు

అలాగే

కాశీలో 'గవ్వలమ్మ' అనే గ్రామదేవత ఉంటుంది. ఈమెకు ఐదు గవ్వలు కలిపి అల్లిన మాలను భక్తులు సమర్పిస్తూ ఉంటారు. ఈమె విశ్వనాధుని సోదరి అని ప్రతీతి.

మడి, ఆచారాలు ఎక్కువగా ఉన్న గవ్వలమ్మ, కాశీ నగరంలో అందరినీ 'తప్పుకోండి, మడి, మడి...' అని ఒకటే విసిగించేదట ! రెండు మూడు మార్లు మందలించి, నచ్చజెప్పబోయిన విశ్వేశ్వరుడి ప్రయత్నం ఫలించకపోవడంతో... కోపించిన స్వామి... ఆమెను మాలపేటలో పడి ఉండమని, విసిరేసారట ! అందుకే, కాశీలో మడి, ఆచారాల పేరుతో ఎవరూ, మితిమీరి వ్యవహరించరాదట !


ఇది శివపురం... కాశీ, కేదార క్షేత్రాలు శివునికి అత్యంత ప్రీతిపాత్రం. అనుక్షణం శివభక్తులు, అదృశ్య దేవతలు, సకల జీవరాశులు జపించే పంచాక్షరీ మంత్రం మార్మ్రోగే కాశీలో... అహాన్ని, కోపాన్ని, భేద భావనలను వీడి, అనుక్షణం అత్యంత అప్రమత్తంగా మెలగాలని, గుర్తుంచుకోవాలి ! భక్తితో చేసే ప్రార్ధనే శివానుగ్రహానికి రాచమార్గం !ఓం నమః శివాయ. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

మహనీయుని మాట

  🙏సర్వేజనాః సుఖినోభవంతు: 🙏


     🌺*శుభోదయం*🌺

    -------------------

🏵️ *మహనీయుని మాట*🏵️

        -------------------------

"అధర్మాన్ని ఆచరిస్తే పుత్రులనైనా క్షమించరాదు.

ధర్మాన్ని ఆచరిస్తే శత్రువును అయినా చేరదీయవచ్చు." 

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌹

      ---------------------------

"అవసరం చాలా గొప్పది.

 తెగిపోతున్న బంధాన్నీ కలుపుతుంది.

బలంగా ఉన్న బంధాన్నీ తెంపుతుంది." 


🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻



🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

        🌹పంచాంగం🌹

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు,


తేదీ ... 26 - 12 - 2025,

వారం ... భృగువాసరే (శుక్రవారము)

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,

దక్షిణాయనము,

హేమంత ఋతువు,

పుష్య మాసము,

శుక్ల పక్షము,


తిథి : *షష్ఠి* ఉ 10.05 వరకు,

                తదుపరి *సప్తమి*

నక్షత్రం : *పూర్వాభాధ్ర* తెల్లవారుజామున 5.55 వరకు,

                 తదుపరి *ఉత్తరాభాధ్ర*

యోగం : *సిద్ధి* మధ్యాహ్నం 12 వరకు,

                  తదుపరి *వ్యతీపాత*

కరణం : *తైతుల* ఉదయం 10.05 వరకు,

                 తదుపరి *గరజి* 


రాహుకాలం : *ఉ10.30 నుండి 12.00 వరకు*

దుర్ముహూర్తం : *ఉ8.43 నుండి 9.26 వరకు*

                              *తిరిగి 12.21 నుండి 01.05 వరకు*

వర్జ్యం : *మ 12.36 నుండి 2.11 వరకు*

అమృతకాలం : *రా 10.03 నుండి 11.37 వరకు*

సూర్యోదయం : 6.31,

సూర్యాస్తమయం : 5.28,


               *_నేటి పాశురం_*


*తిరుప్పావై – 11వ పాశురము*


*కత్తు క్కఱవై క్కణంగళ్ పల కఱన్దు*

*శెతార్ తిఱ లళియ చ్చెన్రు శెరుచ్చెయ్యుమ్*

*కుత్త మొన్రిల్లాద కోవలర్దమ్ పొర్కొడియే*

*పుత్తర వల్గుల్ పునమయిలే పోదరాయ్*

*శుత్తత్తు తోళిమారెల్లారుమ్ వన్దు నిన్*

*ముత్తమ్ పుగున్దు ముగిల్ వణ్ణన్ పేర్పాడ*

*శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్ణాట్టి ! నీ*

*ఎత్తు క్కురంగుమ్ పొరుళే లోరెమ్బావాయ్.*


*తాత్పర్యము:-*


లేగదూడలు గలవియు, దూడల వలె నున్నవియు, నగు ఆవుల మందల నెన్నింటినో పాలు పితుకగలవారును, శత్రువులను ఎదిరించి బలముతో యుద్ధము చేయగలవారును, ఏవిధమగు దోషము లేనివారును అగు గోపాలకుల వంశమున మొలచిన ఓ బంగారుతీగా ! పుట్టలోని పాము పడగవలె నన్ను నితంబప్రదేశము గలదానా ! అడవిలోని నెమలివలె అందమైన కేశపాశముతో ఒప్పుచున్నదానా ! రమ్ము. చుట్టములును, చెలికత్తెలను మొదలుగ అందరును వచ్చిరి. నీముంగిట చేరిరి. నీలమేఘవర్ణుడగు శ్రీకృష్ణుని నామము కీర్తించుచుండిరి. కీర్తించుచున్నను నీవు ఉలుకక పలుకక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకు అర్థమేమో తెలుపుము.


            *_🌹శుభమస్తు🌹_*

🙏 సమస్త లోకాః సుఖినోభవంతు 🙏

కాశీ రాజు దివోదాసుడు

   ఇది కాశీ రాజు దివోదాసుడు (Divodasa) కథే.

ఇదే కారణంగా కాశీలో చిన్న చిన్న గూళ్లలో కూడా శివలింగాలు ఉన్నాయని పురాణకథ చెబుతుంది.


ఇప్పుడు పూర్తి కథను చెబుతాను 👇



🔱 కాశీ – దివోదాసుడు – శివుని ఆగ్రహ కథ


👑 కాశీ రాజు దివోదాసుడు

 • దివోదాసుడు ధర్మనిష్టుడైన, యజ్ఞాలు చేసే, విష్ణుభక్తుడైన రాజు

 • అతని పాలనలో కాశీ అత్యంత పవిత్రంగా, క్రమశిక్షణతో ఉండేది

 • దేవతల జోక్యం లేకుండా కాశీని మానవులు ధర్మబద్ధంగా జీవించాలి అని అతని సంకల్పం



🔥 శివుని నగరం అయిన కాశీ నుంచి శివునికే నిషేధం

 • కాశీ శివుని నగరం అయినప్పటికీ,

 • దివోదాసుడు చేసిన తపస్సు బలంతో

👉 శివుడు, పార్వతి, గణాలు కాశీని విడిచి వెళ్లాల్సి వచ్చింది

 • దేవతలంతా కాశీ వెలుపలికి వెళ్లిపోయారు


👉 ఇది శివునికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది



⚡ శివుని ఆగ్రహంతో ఇచ్చిన ఆదేశం


శివుడు తన గణాలను పిలిచి ఇలా అన్నాడు:


“నన్ను కాశీ నుంచి వెళ్లగొట్టారు.

అయితే నేను ఒక్క చోటే కాదు —

కాశీ అంతటా విస్తరిస్తాను!”


🔱 ఆ ఆదేశంతో:

 • శివుడు వెయ్యి కాదు – అనంతమైన రూపాల్లో

 • చిన్న చిన్న శివలింగాలుగా కాశీ అంతటా ప్రత్యక్షమయ్యాడు



🛕 అందుకే కాశీలో…

 • వీధి మలుపుల్లో

 • ఇళ్ల గోడల్లో

 • చిన్న గూళ్లలో

 • ఆలయాల ప్రక్కన


👉 సూక్ష్మ శివలింగాలు దర్శనమిస్తాయి


ఇవి అన్నీ:

➡️ శివుడు కాశీని ఎప్పటికీ విడవను అన్న సంకల్పానికి గుర్తులు



🌸 శివుని విజయం

 • చివరకు దేవతల కుట్రలతో దివోదాసుడు కాశీని విడిచాడు

 • శివుడు మళ్లీ కాశీలో స్థిర నివాసం చేసుకున్నాడు

 • అందుకే కాశీని:

 • అవిముక్త క్షేత్రం

 • శివుడు ఎప్పుడూ విడవని నగరం అంటారు



🕉️ సారాంశం


ఒక రాజు ధర్మబలం శివుడినే కాశీ నుంచి బయటకు పంపింది

కానీ శివుని సంకల్పం కాశీ అంతటా తానే ఉండేలా చేసింది🙏🏻🙏🏻🙏🏻

⚜ శ్రీ కంపహరేశ్వరర్ ఆలయం

  🕉 మన గుడి : నెం 1338


⚜  తమిళనాడు : తంజావూరు


⚜  శ్రీ కంపహరేశ్వరర్ ఆలయం     



💠 కంపహేశ్వర ఆలయం లేదా కంప-హర-ఈశ్వరర్ (కంప-హరేశ్వరర్) అనేది శివుడికి అంకితం చేయబడిన దేవాలయం. 

ఇది దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని తంజావూరు జిల్లాలోని తిరుభువనంలో, మైలదుత్తురై-కుంభకోణం రహదారిపై ఉంది. 


💠 పురాణాల ప్రకారం బ్రాహ్మణుడిని పొరపాటున చంపిన కారణంగా పాపము వెంటాడుతున్న రాజు శివుని కృపవల్ల కంప (పాపం) నుండి ఉపశమనం పొందాడని నమ్ముతారు. అందువలన శివునికి కంపహరేశ్వరుడు అనగా పాపములను హరించువాడు అనే పేరు వచ్చింది. 


💠 కంపహరేశ్వరర్ లేదా శరభేశ్వర్ ఆలయం శివకేశవులు భక్తులను, ఋషులను మరియు దేవతలను రక్షించుటకు దుష్టులైన రాక్షసుల సంహారానికి అనేక సందర్భాలలో వివిధ రూపాలలో అవతరించారు అన్నది సుస్పష్టం. 


💠 పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగ తదితర క్షేత్రాలలో లింగరూపుడై దర్శనం ఇస్తాడు. 

కొన్ని క్షేత్రాలలో ముఖంతో ఉద్భవించినట్లు అట్టి ఆలయాల గురించి పురాణాల్లో వివరించడం జరిగింది. 


💠 మహావిష్ణువు మిగిలీన రూపాలకు  భిన్నంగా సగభాగం సింహరూపంతో సగభాగం మానవరూపంతో నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించాడు. 

ఆ విధంగానే శివుడు విబిన్నమైన శరభ రూపంలో అవతరించి ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపచేసినట్లు పిమ్మట కంపహరేశ్వరర్ పేరుతో లింగరూపంలో వెలసినట్లు తెలుస్తూంది. 


💠 ఈ పురాతన కంపహరేశ్వరర్ దేవాలయంనందు శివుడు లింగరూపంలో పూజించబడే ప్రధానదైవం.


💠 హిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట  నరసింహుని ఉగ్రరూపం నుండి శివరూపమైన కంపహరేశ్వరర్ దేవతలను రక్షించాడని నమ్ముతారు. 


💠 ఉత్సవ మూర్తి మూడుకాళ్ళతో, సింహపు శరీరం, ముఖం, తోక మరియు నాలుగు చేతులతో కనిపిస్తుంది. 

శరబేశ్వరుడు సమస్త దుష్టగ్రహములను, శత్రువులను నాశనం చేస్తాడని భక్తుల నమ్మకం.


💠 పౌరాణిక గ్రంధాలలో  శరభ అనునది మహావిష్ణువు నరసింహ అవతారంలోని తీవ్ర స్వభావం నుండి శాంతపరచడానికి అవతరించిన శివరూపంగా చెప్పబడింది. 

శరభ విష్ణువు యొక్క నరసింహ రూపంతో పోరాడే పురాణ కధనం విష్ణుభక్తులకు మరియు శివభక్తుల మధ్య అభిప్రాయ భేదం బహిర్గతం చేస్తుంది. 


💠 పురాణ గ్రంధములందు ఎక్కడా  శివకేశవులు తమలో ఆధిపత్యంపై విభేధించినట్లు చెప్పబడలేదు. 

ప్రముఖ విష్ణుక్షేత్రం బదరీనాధ్ లో పరమశివుడు బదరీనాధుని ప్రతిష్టించి తాను ఆదికేదారేశ్వర్ రూపంలో ఇరువురు స్వయంభూః మూర్తులుగా, రామేశ్వరలింగాన్ని ప్రతిష్టించిన మహావిష్ణువు అవతారం శ్రీరాముడు శివుని అర్చించి కోదండరాముని పేరుతోనూ  ప్రసిద్ధి చెందినట్లు పురాణములందు ప్రస్తావించబడినది. 


💠 శివాంశ శంభూతుడైన ఆంజనేయుడు శ్రీరాముని ప్రధమభక్తుడు అనేది విశేషం. హింధువులు శివకేశవులను సమాన ప్రాతినిధ్యంతో పూజిస్తూ అన్ని క్షేత్రాలు దర్శిస్తారు. 

కొద్దిమంది శైవులు మరియు వైష్ణవుల మధ్య ఆభిజాత్యపోరు ఉన్నమాట వాస్తవం. కానీ శివ కేశవులు ఒక్కరే వేరుకాడు అన్నది సుస్పష్టం.  


💠 ఉగ్ర్రరూపుడైన నరసింహుని ఆయన భక్తుడు ప్రహ్లాదుడు స్తుతించి శాంతపరచినట్లు, లక్షీదేవి చెంచులక్ష్మిగా అవతరించి శాంతపరచినట్లు ఆంధ్రప్రదేశ్ నందు కర్నూలు జిల్లాలో ప్రముఖ విష్ణుక్షేత్రమైన అహోబిలం క్షేత్రపురాణం బట్టి తెలుస్తూంది. 

కానీ ప్రస్తుత  కధనం ప్రకారం స్థితికారకుడైన విష్ణువు నరసింహుని ఉగ్రరూపంలో ఉన్నట్లయిన ప్రకృతి సమతుల్యతకు విఘాతమని భావించి, విష్ణువు నరసింహ శరీరం వదలి దైవిక రూపానికి మారడం కోసం శివుడు శరభ రూపాన్ని ధరించాడని తెలుపబడింది. 


💠 నరసింహుడు  తన శరీరంతో శరభును కొట్టగా శరభుడు ఉగ్రరూపందో  నరసింహునిపై దాడిచేసి నియంత్రించినట్లు తెలుస్తూoది. అప్పుడు విష్ణువు శరభ రూపంలో ఉన్నది శివుడు అని గ్రహించి శరభను స్తుతించాడని, శివుడు విష్ణువును దీవించి రాక్షసులను సంహరించడానికి వరం ఇచ్చాడని, శరభ తన కోపాన్ని భరించలేని దేవతలు భయంతో శివుడిని శరభ రూపాన్ని విడిచిపెట్టమని కోరగా శివుడు శరభరూపం ఛిద్రం చేశాడు; 


💠 నరసింహుడు మళ్లీ ప్రశాంతమైన విష్ణువుగా మారడం మరియు శరభ శివడు లింగ రూపునకు మారిన పిమ్మట శరభుని అవయవాలు ఛిద్రమై భయంకర రూపమైన అతని మొండెం కాపాలికగా మారింది.


💠 ఆలయంలోని మూలవర్ శివలింగం కంపహేశ్వరర్ అని పిలుస్తారు. 

అంబల్, గణేశ, సుబ్రమణ్య, నటరాజర్, శరబేశ్వరర్ మరియు నాయన్మార్గులకు ప్రత్యేక సన్నిధులు ఉన్నాయి.


💠 రోజుకు నాలుగు సార్లు నిర్వహించే రోజువారీ పూజలతో పాటు,  సోమవారం  మరియు శుక్రవారం వంటి వారపు ఆచారాలు , ప్రదోషం వంటి పక్షం రోజుల ఆచారాలు మరియు అమావాస్య , పౌర్ణమి , కిరుతిగై మరియు  శతుర్థి వంటి నెలవారీ పండుగలు ఉన్నాయి. 


💠 ఆలయ అత్యంత ప్రముఖ పండుగ, థైపూసం, థాయ్ నెలలో  (జనవరి మధ్యలో) పది రోజులు జరుపుకుంటారు . 


💠 చిత్తిరై బ్రహ్మోత్సవాలు, మార్గజి తిరువాతిరై, కార్తీక దీపం మరియు ప్రదోషం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సాహంతో జరుపు ఉత్సవాలు.


💠 ఈ ఆలయం కుంభకోణం నుండి 35 కి.మీ దూరం




©️ Santosh Kumar

ఉదయం మీదైతే..* *విజయం మీదే*

 

          **ఉదయం మీదైతే..*

                    *విజయం మీదే*

                ➖➖➖✍️

```

విజేత అంటే... అందరికంటే ముందుగా లక్ష్యాన్ని చేరుకున్నవాడు. 


అందరికంటే ముందుగా చేరు కున్నాడంటే... అందరికంటే ముందుగా సాధన ప్రారంభించి ఉంటాడు. 

అందరికంటే ముందుగా ప్రారంభించాడంటే, అందరికంటే ముందే లక్ష్యం గురించి ఆలోచించి ఉంటాడు. 

అందరికంటే ముందే ఆలోచించాలంటే, అందరికంటే ముందే నిద్రలేవాలి. 


అంటే, “ది ఫైవ్ ఏఎమ్ క్లబ్ లో సభ్యులు కావాలి. రాబిన్‌ శర్మ తాజా పుస్తక సారాంశం ఇదే!



1.పొద్దున్నే నిద్రలేవడం బ్రహ్మవిద్యేం కాదు. మనల్ని మనం కష్టపెట్టుకోవడం అంతకన్నా కాదు. దేనికైనా ప్రారంభం, ముగింపు అనేవి ఉంటాయి. 

ఏ ఏడింటికో, ఎనిమిదింటితో రోజు మొదలు కాదు. మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్తమని చెప్పిన సమయం నుంచే... అంటే తెల్లవారుజామున 

ఆ రోజు ఆరంభం అవుతుంది. 

ఆ తర్వాత ఎప్పుడు మెల్కొన్నా ‘లేట్ అటెండెన్స్’ కిందే లెక్క. 


ఆలస్యంగా వచ్చిన విద్యార్థికి పాఠమూ ఆలస్యంగానే అర్థం అవుతుంది. మార్కులు కూడా అంతంతమాత్రంగానే వస్తాయి. 


ముందుగా బడికి వచ్చిన విద్యార్థి ఎప్పుడూ ముందే ఉంటాడు. కాబట్టి, జీవిత పాఠశాలలో 'లాస్ట్ బెంచ్ ఫెలో' అని పించుకోకూడదంటే, తెల్లవారు జామున మేల్కొనాల్సిందే... 


 2.సమాజంలో ఐదుశాతం మంది... విజేతలూ నాయకులూ. 

మిగిలిన తొంభై అయిదు శాతమూ అనుచరులూ పరాజితులే. 


ఆ ఐదుశాతం మందిని పరిశీలిస్తే... వాళ్ల దినచర్య తెల్లవారు జామునే మొదలవుతుంది. అంతా నిద్రపోతున్న వేళలో వాళ్లు మేల్కొంటారు. అంతా కలలు కంటున్న సమయంలో వాళ్లు కలల్ని నిజం చేసుకోవడం గురించి ఆలోచి స్తారు. 

అంతా పరుగు ప్రారంభించే సమయానికే వాళ్లు గమ్యాన్ని చేరుకుంటారు. ఓ గంట ముందు లేస్తే పోయేదేం లేదు... బద్దకం తప్ప!


3.ప్రమోషన్లు వచ్చేవరకో, సొంతిల్లు కొనేవరకో, కోటి రూపాయలు సంపాదించేవరకో... మీ ఆనందాన్ని వాయిదా వేసుకోకండి. గమ్యం వైపుగా సాగించే ప్రయాణంలో ప్రతి నిమిషాన్నీ ఆస్వాదించండి, ఆనందించండి.


4.ఎవరో పిలిచి కిరీటం పెట్టినప్పుడు మాత్రమే... మన శక్తి సామర్థ్యాల్ని ప్రదర్శించాలనే పిచ్చి నిర్ణయానికి కట్టుబడిపోయి.. మిమ్మల్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం వాయిదా వేయకండి. ప్రపంచం గుర్తించిన తర్వాత మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నిరూపించుకున్నాకే ప్రపంచం గుర్తిస్తుంది.


5.వికాసానికి ఓ ముగింపు అంటూ లేదు. ఓ శిఖరాన్ని చేరుకోగానే పర్వతారోహణ పూర్తయి పోదు. అంతకంటే ఎత్తయిన మరో పర్వతం మీకోసం సిద్ధంగా ఉంటుంది. 

నన్ను అధిరో హించమంటూ సవాలు విసురుతుంది. జిజ్ఞాసి నిత్య విద్యార్థి. నిరంతర యాత్రికుడు.

    _పేదరికానికి కారణం... చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, మనసును చుట్టుముట్టిన భావ దారిద్ర్యం. కాబట్టి, ఎంత తొందరగా నిద్ర మేల్కొంటే, అంత తొందరగా ప్రపంచాన్ని ఏలుకుంటావు.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝  *విద్యాధనమదోన్మత్తో*

          *యః కుర్యాత్పితృహేలనమ్*।

          *స యాతి నరకం ఘోరమ్*

          *సర్వధర్మబహిష్కృతః*॥


తా𝕝𝕝 *"విద్య, ధన మదముతో కళ్లుగానక పొగరుబోతు తనంతో తండ్రినెవ్వడు చులకన చేయునో వాడు ధర్మచ్యుతుడై నరకమున బడును....."*

✍💐🌹🌸🙏

సనాతన ధర్మం*

 🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*సనాతన ధర్మం*


*ఒకరి చేత చెప్పబడనిది, అనుభవైకవేద్యమైనది, కాలాతీతమైనది సనాతనధర్మం. క్రైస్తవం, బౌద్ధం, ఇస్లాం - ఇవన్నీ కొన్ని వందల ఏళ్ల నాడు ఆయా మత ప్రవక్తలైన వారిచే నిర్వచించబడినవి. ఎవరో కొద్దిమంది గురువులు ప్రచారం చేసినది కాదు సనాతన ధర్మం. గంగాప్రవాహంలా కాలాతీతమై ముందుకు సాగుతూనే ఉంది. స్వయంగా భగవద్రక్షితమై, భగవద్ప్రేరితమై అపౌరుషేయమై ఉద్భవించినవి వేదాలు. మహా ఋషుల అపరోక్షానుభూతులు ఉపనిషత్తులుగా వచ్చాయి. అమిత తపోసంపన్నుడు, శ్రీమహావిష్ణువు అవతారము అయిన వేదవ్యాసునిచే లోకకల్యాణార్థమై రచించబడినవి 18 పురాణాలు. ఇవీ మన ధర్మానికి మూలాలు. ప్రతి యుగంలోనూ వీటి సారములు మనకు గాథలుగా, అనేకానేక దివ్యరచనలుగా అందించబడుతున్నాయి.*


*నాస్తికవాదులు, పరధర్మ ప్రచారకులు, కుహనావాదులు చేసే ఒక దుష్ప్రచారం మన ధర్మంలో స్వేచ్ఛ లేదు, శాస్త్రీయత లేదు అని. అంతకన్నా పచ్చి అబద్ధం ఇంకొకటి లేదు. మన ధర్మం ఇచ్చినంత స్వేచ్ఛ ఇంకే ధర్మమూ ఇవ్వలేదు. మన ధర్మానికున్నంత శాస్త్రీయత మరే ధర్మానికీ లేదు. విశ్వాసము మరియు ఆరాధనలలో సంపూర్ణ స్వేచ్ఛనిచ్చినది సనాతన ధర్మం. అందుకే మనకు ఎన్నలేనన్ని మార్గాలు, భగవద్రూపాలు. ప్రకృతి, ఆత్మ, దేవ, పరమాత్మ, అర్చనా తత్త్వాలను ప్రశ్నించి సమాధానం తెలుసుకునే స్వేచ్ఛ ఈ ధర్మం ఇచ్చింది. ఫలానా ఒక్క పద్ధతే సరైనది, ఫలానవి చేస్తేనే ఆరాధన సఫలమవుతుంది అన్నది సనాతన ధర్మం చెప్పలేదు. కోట్లాది మార్గాలు, కోట్లాది పద్ధతులు ఈ ధర్మంలో అంతర్భాగం. ఇతర ధర్మాల వారు చేసినట్లు సనాతన ధర్మం నాస్తికవాదాన్ని తప్పుగా పేర్కొనదు. సనాతన ధర్మంలో మానవీయ విలువలకున్న స్థానం మరే ధర్మంలోనూ లేవు. మరొక ధర్మం వారిని నిందించటం, వారిని బలవంతంగా ఈ ధర్మంలోకి మార్పిడి చేయడం అన్నవి లేవు. అసలు ఆ సిద్ధాంతమే సనాతన ధర్మంలో లేదు. అత్యంత ఉదారమైనది, విశాలమైనది సనాతన ధర్మం.*


*మన ధర్మంలో ఉన్న మొట్ట మొదటి గొప్పతనం - మానవుని నిత్య జీవితంలో ఎదురుకునే ప్రతి సమస్యకు, ప్రతి అలజడికి శాశ్వత, సర్వామోదయోగ్యమైన పరిష్కారం కలిగి ఉండటం. వేదాలు, ఉపనిషత్తుల సారమే మానవుని ఆత్మోద్ధరణ ద్వారా ఆనందాన్ని పొందటం. కాబట్టి, వ్యక్తిత్వ వికాసమనేది ఈ ధర్మంలో సహజ పరిణామం. నీతి, ధర్మం, న్యాయం మొదలైన వాని ద్వారా ఈ వ్యక్తిత్వ వికాసాన్ని మన ధర్మం మనకు ఉచితంగా అందిస్తుంది.*


*ఇక రెండవ గొప్పతనం - శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునే జీవనశైలి, సూత్రాలు అద్భుతమైన యోగము ద్వారా, వైద్యశాస్త్రము ద్వారా మనకు అందించింది సనాతన ధర్మం. ప్రపంచంలో ఏ ధర్మంలోనూ లేనంత శాస్త్ర సాంకేతికత మన ధర్మంలో ఉన్నాయి కాబట్టే అనాదిగా వీనిని ఆచరించిన వారు దేహానికున్న పరిమితులను అధిగమించి దివ్యత్వాన్ని పొందగలిగారు.*


*మూడవ గొప్పతనం - స్త్రీలు, పురుషులు, పిన్నలు, పెద్దలు, ధనికులు, పేదలు అని లేకుండా ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అనేది వారి వారి ఉపాధులలో, నిత్యజీవితంలో తెలియకుండానే అబ్బేలా చేసింది మన ధర్మం. బంధాలు, బాంధవ్యాలు, బాధ్యతలు, కట్టుబాట్లు మొదలైనవి మనిషిని ఆధ్యాత్మిక సంపన్నునిగా చేసింది ఈ ధర్మం. అందుకే నాస్తికులమని చెప్పుకునే వారు కూడా ఏదో ఒకరకంగా ఆధ్యాత్మికవాదులే.*


*సనాతన ధర్మమంటే కేవలం సన్న్యాసమూ కాదు, మాయావాదమూ కాదు, అనేక తత్త్వాల సమ్మేళనమూ కాదు. ఇది అగణితమైన ఆధ్యాత్మికానుభూతుల కలయిక. జీవితం గురించిన పరిపూర్ణము మరియు అఖండమైన దృష్టికోణము కలది. అత్యంత సహిష్ణుత, మానవీయత, ఆధ్యాత్మికత కలది సనాతన ధర్మం. అతివాదానికి దూరమైనది, అందుకే ఎన్నో దాడులు జరిగినా ఇప్పటికీ అలానే నిలిచి ఉంది. సనాతన ధర్మంలో ఉన్న కిటుకు మూలసూత్రాలలోనే. ఇవి పూర్తిగా అనుభవాల మీద, సత్యాల మీద ఆధారపడినవి. అందుకే కాలప్రవాహంలో చెక్కు చెదరకుండా నిలిచింది ఈ ధర్మం.*


*ధర్మో రక్షతి రక్షితః.*


🌿🌴🥀🍀🌹

అమ్మకు చెప్పలేని పనులు

 🌸 అమ్మకు చెప్పలేని పనులు చేయనేమిరా? 🌸

అమ్మ అంటే ప్రేమ, త్యాగం, ధైర్యం…

అలాంటి అమ్మకు చెప్పలేని పని ఏదైనా చేస్తే...?

అది మన మనసుకే ప్రశ్నగా మిగులుతుంది.

సమాజానికి ఆలోచన రేపే, 

మనసును కదిలించే ఈ గేయాన్ని

తప్పకుండా చూడండి, వినండి, ఆత్మీయులతో... ముఖ్యంగా విద్యార్థులతో, యువతతో పంచుకోండి. చానల్ సబ్స్క్రయిబ్ చేయండి. 

✍️ రచన: డా. నూజిళ్ల శ్రీనివాస్, రాజమహేంద్రవరం

💡 స్ఫూర్తి: విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి మాటలు

👉 


మన ఇంట్లోనూ, మనసుల్లోనూ విలువలు బతికేలా చేద్దాం 🙏

కాశీ యాత్రా విధానం

  🌹ఈరోజు కధ 🌹


చాలా కాలం క్రితం, కాశీ నగరంలో సదానందయోగి అనే మునీశ్వరుడు ఉండేవారు. ఆయన అన్ని క్షేత్రాలు తిరిగారు. ఆయనకు ఎటువంటి తాపత్రయాలు, చీకూచింతలూ లేవు. ఆయన జ్ఞాని, ఆయనలో ఎప్పుడూ ఏదో ఆనందం, నిండుదనం కనిపిస్తాయి. అందుకే ఆయనను సదానంద యోగి అనేవారు. 


ఒకరోజు ఆయన తన శిష్యుడయిన చిదానందయోగిని పిలిచి, 'నాయనా! నాకు కాశీరామేశ్వర యాత్ర చెయ్యాలన్న సంకల్పం కలిగింది. నీవు, నీ తోటి విద్యార్ధులు నాతొ రండి. నేను మీకు కాశీ నుండీ రామేశ్వరం వరకూ కల నదులు, తీర్దాలు, వనాలు, పుణ్య క్షేత్రాలు మొదలయిన వాటి విశేషాలను చెప్తాను,' అన్నారు.


అదే మహాభాగ్యమని, నమస్కరించి, చిదానందుడు తోటి శిష్యులను పిలిచి కూర్చోపెట్టాడు. అప్పుడు సదానంద యోగి ఇలా చెప్పసాగారు....


సదానందయోగి, తన చుట్టూ ఉన్న శిష్యులను ప్రసన్నంగా చూసి, "నాయనలారా! ముందు మీరు మనం ఉన్న ఈ కాశీనగర వైశిష్ట్యాన్ని గురించి తెలుసుకోవాలి. ఈ వారణాసి లోని ప్రతీ క్షేత్రమూ, ప్రతీ దైవము గురించి పూర్తిగా చెప్పాలంటే, బ్రహ్మకయినా సాధ్యం కాదు. ఇక నేనెంత? అలాగని మనిషి నిరుత్సాహపడరాదు, అందుకే నేను పెద్దలవల్ల విన్నది సమగ్రంగా చెబుతాను, వినండి," అంటూ ఇలా చెప్పసాగారు.


కాశీ నగరానికి మరొక పేరు శివ రాజధాని. ఇది గంగా నదికి పడమరగా, వక్రము కలిగి, ఐదు క్రోసుల దూరాన విస్తరించి ఉన్న మహా పట్టణము. ఈ నదీ తీరము పొడవునా, అరవై నాలుగు పెద్ద తీర్ధములు ఉన్నాయి. 


పూర్వం దక్షప్రజాపతి తన కుమార్తె అయిన సతీదేవిని శివుడికి ఇచ్చి వివాహం చేసాడు. ఒకసారి దక్షయజ్ఞం సమయంలో దక్షుడు శివుడి మీద అక్కసుతో, సతీదేవిని పరాభవించాడు. ఆమె యోగాగ్నిలో పడి, ప్రాణాలు విడిచింది. ఆమె ప్రేతాన్ని భుజాన వేసుకుని తిరుగుతున్న శివుడిని, తిరిగి మామూలు స్థితికి తెచ్చేందుకు, విష్ణువు తన యోగమాయతో ఆ దేహాన్ని పద్దేనిమిది ముక్కలు చేసాడు. అప్పుడు ఆ దేవి ముఖం ఈ కాశీలో పడినందువల్ల, ఈ ప్రదేశానికి " గౌరిముఖ " అనే పేరు వచ్చింది. ఇక్కడి దేవత పేరు, కాశీ విశాలాక్షి. 


ఈ మహాకాశీ క్షేత్రానికి రాజు విశ్వనాధుడు . మంత్రి బిందుమాధవ స్వామి. క్షేత్రపాలకుడు భైరవుడు. గణనాయకుడు లేఖాదారుడు. ఇక్కడ లేని దేవతలు, తీర్ధములు, మహిమలు మరి వేరెందునూ లేవని పురాణాలు చాటి చెబుతున్నాయి. ప్రళయంలో కూడా నశించని, శివుడి త్రిశూలాగ్రంపై స్థితమై ఉన్న ఈ పట్టణమే కాశీ. 


ఇక ఈ క్షేత్ర యాత్రా విధానం చెబుతాను, వినండి....


కాశీ యాత్రా విధానం గురించి చెప్పసాగారు సదానందయోగి.


ఈ కాశీ యాత్రకు వెళ్ళినవారు ఉదయాన్నే మేల్కొని, స్నానాదులు ముగించుకుని, ముందుగా అన్నపూర్ణా విశ్వేస్వరులను దర్శించుకోవాలి.


తరువాత బిందుమాధవ స్వామిని సేవించి, విశ్వేశ్వర మందిరం వద్ద ఉన్న డుండిం రాజ గణపతిని ఆరాధించి, తరువాత ఉత్తరంగా ఉన్న దండపాణి స్వామిని పూజించి, కాలభైరవుడిని దర్శించి, పడమరన ఉన్న కాశీ మూర్తిని సేవించి, వాయువ్యంగా ఉన్న గుహను చూచి, గంగా పుష్కరిణిని కొలిచి, విశ్వేశ్వరం లోని అన్నపూర్నాదేవిని పూజించి, మణికర్నికకు పోయి, మణికర్ణికా మూర్తిని ఆరాధించి, అక్కడే స్నానం చేసి, తిరిగి విశ్వేశ్వర సన్నిధికి వచ్చి నమస్కరించి, వసతికి వెళ్ళాలి . దీనినే నిత్య యాత్రా విధానం అంటారు. ఇక మనం బయలుదేరి, గయా గదాధరకు వెళ్దాము , అంటూ శిష్యులతో యాత్రకు బయలుదేరారు సదానంద యోగి. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

ముగ్గురు స్నేహితుల నిజమైన కథ.

 *ఇది ముగ్గురు స్నేహితుల నిజమైన కథ.👉*

*1) మొదటి వాడు చాలా తెలివైనవాడు, స్కూల్లో ఎప్పుడూ ఫస్ట్ పొజిషన్‌ వదిలేవాడు కాదు. ప్రతి విషయంలో టాపర్‌.*

*2)రెండోవాడు సాధారణం, ఫెయిల్‌ అవ్వడు కానీ తరగతి నుంచి తరగతికి కేవలం నెట్టుకొని వెళ్లేవాడు.*

*3)మూడోవాడు చతురుడు,మోసగాడు,omanipulation లో నిపుణుడు.*

*కానీ ఈ ముగ్గురూ మంచి స్నేహితులు… చాలా దగ్గర. స్కూల్ పూర్తయ్యాక…*

*1)మొదటి వాడు—ఆ తెలివైన వాడే—ఇంజనీర్ అయ్యాడు.* 

*Indian Engineering Services పరీక్ష పాస్ చేసి, క్లాస్ వన్ ఆఫీసర్ అయ్యాడు. ఆ తర్వాత ఢిల్లీ మెట్రో చీఫ్ అయ్యాడు.*

*2)రెండోవాడు ఫిజిక్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి సివిల్ సర్వీసెస్‌ పరీక్ష రాశాడు. ఉత్తీర్ణత సాధించి, తన మొదటి స్నేహితుడు పని చేస్తున్న శాఖలో అతనికంటే ఉన్నత స్థాయి అధికారిగా నియమితుడయ్యాడు.*

*3)మూడోవాడు స్కూల్ తరువాత చదవటం కూడా పట్టించుకోలేదు. సరైన సమయంలో సరైన రాజకీయ పార్టీని ఎంచుకున్నాడు. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచాడు. ఎంపీ అయ్యాడు. ఆ తర్వాత కేబినెట్ మంత్రిగా మారాడు. అతడి ఆధ్వర్యంలోనే మిగతా ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు.*

*ఇది కల్పిత కథ కాదు.👉 నిజం:*

*1)మొదటి వాడు — ఈ. శ్రీధరన్ — మెట్రోమ్యాన్*

*2)రెండోవాడు — టి.ఎన్. శేషన్ — మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్*

*3)మూడోవాడు — కె.పీ. ఉన్నికృష్ణన్ — ఐదు సార్లు వరుసగా లోక్‌సభకు ఎన్నికై, వి.పీ.సింగ్ ప్రభుత్వంలో కేబినెట్‌ మంత్రి*

*ముగ్గురు స్నేహితులు 👉 అదే స్కూలు, అదే టీచర్లు… కానీ విధి మాత్రం వేర్వేరు మార్గాల్లో నడిపించింది! 🤔🤔🤔🤔*

పంచాంగం

 


పంచాంగం 27.12.2025

 ఈ రోజు పంచాంగం 27.12.2025 

Saturday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: దక్షిణాయనం హేమంత ఋతువు పుష్య మాస శుక్ల పక్ష సప్తమి తిథి స్థిర వాసర పూర్వాభాద్ర నక్షత్రం వ్యతీపాత యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు. 

  

 

శ్రాద్ధ తిథి: అష్టమి

 


నమస్కారః , శుభోదయం