17, ఫిబ్రవరి 2025, సోమవారం

మహాకవి భర్తృహరి

 🙏మహాకవి భర్తృహరి 🙏

యోగి కవి భర్తృహరి గురించి: సంస్కృత సాహిత్యంలో యోగికవి భర్తృహరి నీతి, శృంగార, వైరాగ్య శతకకర్తగా, ‘మహాభాష్య’ వ్యాఖ్యానకర్తగా, ‘వాక్యపదీయం’ అనే గ్రంథం రచించిన వైయాకరణుడిగా సుప్రసిద్ధుడు. ‘భర్తృహరి’ అనే పదానికి దేవుని భక్తితో ఆరాధిస్తూ దేవునికే తన జీవితాన్ని అంకితం చేసినవాడని అర్థం- అని పండితవాక్కు.


భర్తృహరి సంస్కృత కవి. ఇతను 5వ శతాబ్దికి చెందినవాడు. సుభాషిత త్రిశతి రచయిత భర్తృహరి. ఇందు నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలు ఉన్నాయి.

"సుభాషిత త్రిశతి" లేక "సుభాషిత రత్నావళి" అనేది, కావ్యములలో లఘుకావ్యజాతిలో చేరినది. ఈ కావ్యమును రాసిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. అతనిని, ఆతని గ్రంథములను గూర్చి విశ్వసనీయములగు చారిత్రికాధారములు దొరకలేదు. అతని జీవితములోని కొన్ని సంభవములు మాత్రము కథారూపమున అనుశ్రుతముగా సంప్రదాయబద్ధమై లోకమున వ్యాపించి యున్నను అవి ఒకదానికొకటి పొంది పొసగి యుండకపోవుటచే నానావిధ గాథలకును సామరస్య మేర్పరచుట దుస్సాధ్యమేయగును. భర్తృహరి ఉజ్జయినీ రాజ వంశస్తుడనియు, తనకు రాజ్య పరిపాలనార్హత యున్నను తనభార్య దుశ్శీలముచే సంసారమునకు ఇష్టపడక, రాజ్యమును తన తమ్ముడగు విక్రమార్కున కప్పగించి తాను వనప్రస్థుడయ్యెనని ఒక ప్రతీతి ఉంది. ఈ విక్రమార్కుడే 'విక్రమ శకాబ్దమునకు' మూల పురుషుడు. భర్తృహరి విరచితమైన లఘు శతకముల నుండి అతనికి జీవితమున ఆశాభంగము మిక్కిలిగా యేర్పడెననియు, స్వకుటుంబమును, యిరుగుపొరుగులను సూక్ష్మదృష్టితో పరిశీలించుట వలన స్త్రీ శీలమునందు అతనికి సంశయము బలపడెననియు విశదమగును. 


పూర్వ సంఘటనలను తెలియజేసిన ఒక గ్రంథములో భర్తృహరి భార్య పేరు అనంగసేన అని యున్నది.

భర్తృహరి భార్య పద్మాక్షి అని యింకొక కథ ఉంది.

భర్తృహరి తల్లి సుశీల, ఆమె మూలమున నితడు మాతామహుని రాజ్యమునకు అధికారియై దానిని తన సోదరుడు విక్రమాదిత్యునకొసగెనని యింకొక గాథ.

ఇంకొక గ్రంథమున భర్తృహరి తండ్రి వీరసేనుడను గంధర్వుడనియు, ఇతనికి భర్తృహరి, విక్రమాదిత్యుడు, సుభటవీర్యుడు అను ముగ్గురు కుమారులును, మైనావతి యను కుమార్తె యునుగా నలుగురు సంతాన మనియును దెలియవచ్చును.


చంద్రగుప్తుడను బ్రాహ్మణునకు నాల్గు వర్ణముల నుండియు నల్గురు భార్యలనియు, వారికి యధాక్రమమున వరరుచి, విక్రమార్కుడు, భట్టి, భర్తృహరి యను కుమారులు జనించిరని మరియొక గాథ.

ఇట్టి గాథల పరంపరను బట్టి కవి చరిత్రను నిర్థారించుట ఎంత కష్టమో చదువరులు ఊహించవచ్చును. కాని పై గాథలనుండి ఈ కవి మహారాజు అని, ఇహపర సౌఖ్యములను విడిచి విరాగియై సన్యాసమును స్వీకరించినాడని, గొప్ప విద్వాంసుడనీ, కవి అనీ, యోగి అనీ తెలియుచున్నది.

భర్తృహరి ఈ త్రిశతికి సంధాత మాత్రమే కాని రచయిత కాడని కొందరనుచున్నారు. ఈ త్రిశతి లోని శ్లోకములు ఎక్కువగా భాసుని నాటకాదులందు గాన వచ్చుచున్నవి. కావున నట్లనుట యుక్తముగా దోచుచున్నది. కొన్ని శ్లోకములను ఇతర గ్రంథముల నుండి సంధానించి మరికొన్నింటిని నాతడు రచియించి యీ త్రిశతిని గూర్చి యుండవచ్చును.

సముద్ర గుప్తుడి పుత్రుడైన రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడి (క్రీ.శ.375-415) ఆ స్థానంలోని నవ రత్నాలలో ఒకడుగా మహా కవి కాళిదాసు ఉండేవాడు. అతడి ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకంలోని అయిదవ అంకంలో 12వ శ్లోకం ‘భవన్తి నమాస్త రవః.. వైష పరోపకారిణం’ భర్తృహరి విరచిత ‘నీతి శతకం’లో 61వ శ్లోకంగా కనిపిస్తుంది. క్రీ.శ. 6వ శతాబ్దం వాడైన విష్ణుశర్మ రచన ‘పంచతంత్రం’లో – భర్తృహరి ‘నీతిశతకం’లోని 85వ శ్లోకమైన ‘గజ భుజంగ విహంగమ బంధనం’ కనబడుతుంది. కనుక భర్తృహరి, కవి కాళిదాసుకు తక్షణకాలం వాడు, విష్ణుశర్మ పూర్వుడు అనీ, అంటే క్రీ.శ.5వ శతాబ్దానికి చెందినవాడనీ రూఢీ అవుతోంది.

 క్రీ.శ.691లో భారతదేశానికి వచ్చిన చైనా దేశీయుడు ‘ఇత్సింగ్‌’ నలందాలో విద్యార్థిగా ఉంటూ భర్తృహరిని బౌద్ధ సన్యాసిగా పేర్కొన్నాడు. భర్తృహరి శాస్త్ర గ్రంథాలపై అతడు ప్రసంగిస్తూ-భర్తృహరి మానవనీతి సూత్రాలనూ రచించాడనీ తెలిపాడు.


                       సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

మాఘ పురాణం - 19

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷సోమవారం 17 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 19 వ*_

       _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*🌳మునుల వాగ్వాదము🌳*


☘☘☘☘☘☘☘☘☘


గృత్నృమదమహర్షి జహ్నుమునితో నిట్లు పలికెను. ఓయీ వినుము గోమతీ నదీ తీరమున పవిత్రమైన నైమిశారణ్యము కలదు. అచట బహువిధములైన లతావృక్షగుల్మము లెన్నియోయున్నవి. అచట నుత్తములైన తపోధనులెందరో నివసించుచుండిరి. తమకు నచ్చిన తపమును యాగమును చేసికొనుచుండిరి. జ్ఞానము , వైరాగ్యము , ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వోత్తములైన వారిలో పరస్పరము నేనెక్కువయనగ నేనేయక్కువ యను వివాదము కలిగెను. భృగుమహర్షి , నేను తపోనిష్టుడను యోగీశ్వరుడను నన్ను మించిన వారెవరున్నారని యనెను. గౌతముడును నేను అందరికంటే పెద్దవాడను , బ్రహ్మకల్పము పూర్తియగు వరకు తపమును చేసినవాడను. నేనే గొప్పవాడనని పలికెను. లోమశుడను ముని నాకు సమానుడు లేడు. నేను మునులకు గురువునని ప్రకటించెను. గార్గ్యుడను ముని సభలో నిలబడి వేదశాస్త్రాదులన్నియు నాకు వచ్చును. కావున నేనే ఉత్తముడనని యనెను. మాండవ్యుడు నేను కర్మలను యేమరకుండ యధాకాలముగ చేయుదును. నిత్కర్మలనాచరింతును , అన్ని శాస్త్రములను చదివినవాడను నాకంటె ఉత్తముడెవడని గర్జించెను. శంతనుడను ముని నేను యోగాభ్యాసము చేయువాడను , ఆత్మజ్ఞానిని , ఏకాగ్రతకలవాడను నన్ను మించిన వాడెవడు లేడని పలికెను. పాలస్త్యుడను ముని లేచి , నేను వేదములు. , శాస్త్రములు అన్నియు నేర్చినవాడను. పెద్దలు కూడ నన్నే గౌరవింతురు. కావున నేనే అధికుడననియనెను. శౌనకుడును ఆత్మనేత్తలలో నేను మొదటివాడను , నాకంటె పూజ్యులెవరును లేరనెను. ఆ మునివరులు తమ గొప్ప తనమును బిగ్గరగా యెవరికి వారే చెప్పుకొనిరి. కొందరు కోపమును పట్టజాలక భృగు మహర్షి వద్దకు వచ్చి వాని జడలను లాగి పిడికిళ్లు బిగించి కొట్టిరి. ఒకరినొకరు ధూషించుకొనుచు , కొట్టు కొనుచు వారి దండములను , ఛత్రములను లాగుచు కోలాహలమును పెంచిరి.


ఇట్లు వారు పరస్పరము వివాదపడుచుండగా కలహప్రియుడైన నారదుడు వచ్చెను , కలహించుకొనుచున్నవారిని మరింత ఉద్రేకపరచెను. వైకుంఠమును చేరి శ్రీహరికి యీ విషయమును విన్నవించెను. శ్రీహరియు 'నారదా ! ఆ మునులు జ్ఞానులైనను నామాయకు లోబడి కలహించుకొనుచున్నారు. వీరి వివాదము ఉపాయముచే ఉపశమింపజేయవలెను. నాకిష్టులైన సనక , సనందన , సనత్కుమార , సనత్పుజాతులను వారిని వివాదపడుచున్న మునీశ్వరుల వద్దకు పంపుదును. వీరు నలుగురును యెల్లప్పుడును అయిదు సంవత్సరములవారుగనే యుందురు. వీరి బాల్యమున చతుర్యుగములెన్నియో మార్లు గడచినవి. వీరితో బాటు వృద్ధుడు , బుద్ధిశాలియగు మార్కండేయుని గూడ పంపుదును. అతడు సప్తమహాకల్పములు జీవించువాడు. మునులకు మార్కండేయునకు వివాదము జరుగును. నారదా నీవును అచటకు పోయి చూడుము అని పంపెను. మార్కండేయ మహర్షి వివాదపడుచున్న మునుల వద్దకు వచ్చెను. క్రొత్తగా వచ్చిన మార్కండేయ మహర్షిని జూచి వివాదపడుచున్న మునులు వివాదమును ఆపి అస్పష్టములైన మాటలతో వానికి గౌరవమును చూపిరి. మార్కండేయుడును వారినందరిని కుశల ప్రశ్నాధికముతో శంతపరచెను. ఇట్లు కొంతకాలము గడచెను.


కొంతకాలము గడచిన తరువాత బ్రహ్మజ్ఞానులగు సనక సనందాది మునులు నలుగురును అచటకు శ్రీహరిని కీర్తించుచు వచ్చిరి. మార్కండేయ మహర్షియు వారిని జూచి యెదురువెళ్ళి నమస్కరించి అర్ఘ్యపాధ్యములచే పూజించెను. వారి పాదములు కడిగిన నీటిని తన తలపై జల్లుకొనెను. ఇట్లు తమకు పాదాభివందనము చేసి గౌరవించుచున్న మార్కండేయుని జూచి సనకాది మునులాశ్చర్య పడి యిట్లనిరి. మార్కండేయ మునీంద్రా ! నీవు వయో వృద్ధుడవు మునులలో నుత్తముడవు , సప్త మహాకల్పములు నీ ఆయుష్కాలము. ఇట్టి నీవు బాలురమైన మాకు నమస్కరించి పాదోదకమును నీ తలపై జల్లుకొనుచున్నావేమి ? వృద్దులు బాలురకు యెదురు వెళ్ళుట నమస్కరించుట చేయరాదని శ్రుతివాక్యమున్నది కదా మేము అయిదేండ్లవారమే కదా ! అని పలికిరి.


ఇట్లు సనకాదులు పలికిన మాటలను విని మార్కండేయ మహర్షి యిట్లనెను. భగవద్గావలాలమలారా ! ఒకొక్క దినము గడుచుచుండగా ప్రాణుల ఆయుర్దాయము , కుండ నుండి స్రవించు నీరువలె తగ్గిపోవుచున్నది. ఇరువది యొక్క కల్పములు జీవించినను మృత్యువు తప్పదు. ఇందసత్యము లేదు. యెక్కువ వయస్సు ఉండుటవలన ప్రయోజనమేమి వేదశాస్త్రములను చదువుటచేత లాభమేమి , యోగమును పాటించుటచే , ఉపయోగమేమి ? తపముచేత , కర్మానుష్ఠానముచే ప్రయోజనమేమి ? జ్ఞానహీనుడు చిరంజీవియైనచో వచ్చిన ప్రయోజనమేమి ? నిరర్దకముగ కాలము గడచుటచే దుష్టుల జీవనము గడచిపోవుచున్నది. జ్ఞానమును సంపాదించు వాడే యెక్కువగ వ్యర్థముగ అజ్ఞానియై యెక్కువ కాలము గడిపిన వాని గొప్పదనమేమున్నది వినాశకాలము దాపురించినప్పుడు ప్రాణిలోకము భయమునంది తాను చేసిన కర్మఫలముననుభవించి మరల జన్మించును. నిత్యముకాని దేహముతో విష్ణుకథా ప్రసంగము చేయువాని బ్రతుకు సార్థకమైనది.


మహాత్ములైన సనక , సనందన , సనత్కుమార , సనత్పుజాతులారా ! మీరు నిరంతరము విష్ణు కథా ప్రసంగమును చేయువారు , నిత్యము ఆయనను తలచి నమస్కరింతురు. శ్రీహరి యెల్లప్పుడును నీ హృదయపద్మములందే యుండును. మేము క్షణకాలమైనను విష్ణువును స్మరింపము. శ్రీహరి ప్రసంగములను కూడ చేయము. విష్ణు కథను8 విడువని బాలువాడైనను వృద్ధుడే , నిరంతరము హరి కథా ప్రసంగము చేయు మీరు బాలురైనను వృద్ధులే , హరికథా ప్రసంగములేని వారెంత వృద్ధులైనను బాలురే కావున మాకంటే మీరే గొప్పవారని మార్కండేయ మహర్షి సమాధానము నిచ్చెను. మార్కండేయుని మాటలను విని సనకాది మహర్షులు శ్రీహరిని కీర్తింపసాగిరి. వారి మాటలను వినుచున్న మునులు తమలో తాము యెక్కువ తక్కువ అనుకొనుట మూర్ఖత్వమని గమనించుకొని సిగ్గుపడిరి. వారందరును మార్కండేయ మహర్షికి , సనకాది మునులకును పాదాభివందనము చేసిరి. మేము మీ వలన విష్ణు కథా ప్రసంగపు విలువను తెలిసికొంటిమి. కావున విష్ణు భగవానుని మహిమ నెరుగశక్తి యుండని ప్రార్థించిరి.


నారదుడును శ్రీహరి వద్దకేగి జరిగిన దానిని చెప్పిరి. అప్పుడు శ్రీహరి వ్యాస రూపమున సూతునకు సర్వశ్రుతుల జ్ఞానమును బోధించెను. సూతునివలన మునులు మొదలగు వారందరును శ్రుతులసారము నెరిగిరి. శౌనకుడు మునులును అహంకారము మొదలైన మనోవికారములను విడిచి ప్రశాంతచిత్తులై పరమేశ్వర జ్ఞానము , పరమేశ్వర చింతనము కలిగియుండిరి. హరకేయూరాది భూషణములు తమ తమ విభిన్నరూపములనందినను కరిగిపోయి తుదకు తమ మూలధాతువైన సువర్ణముగా అయినట్లుగా ప్రాణులను తమ తమ కర్మ విశేషము ననుసరించి వివిధరూపములు పొంది తుదకు పరమాత్మ భావనమునే చేరును. వేదవేదాంగములను సర్వశాస్త్రములను అభ్యసించి పరమాత్మ మహత్త్యము నెరిగి పరమాత్మ చింతనమును చేసి భగవదనుగ్రహము నందుటయే జ్ఞానమునకు ఫలితము. మాఘమాసాది వ్రతములు భగవచ్చింత నేను నిరంతరముగ అలవాటు చేసి జీవులను తరింపజేయును. జహ్ను మునీశ్వరా ! మాఘమాస వ్రతాచరణ భగవచ్చింతనమును జీవికి అలవాటు చేయును. అట్టి చింతనము వలన ప్రాణి ఇహలోక సుఖములను పరలోకములను దుష్కర్మక్షయమును సత్కర్మాచరణ ఫలమును పొంది భవసాగరమును తరించును. మునుల అహంకారమును మార్కండేయ ముని వినయవివేకములను , సనక సనందనాదుల మహత్త్యమును , పరిశీలించి ప్రాణి వినయమును భగవచ్చింతనమును జ్ఞానఫలములని యెరిగి ఆచరించి భవసాగరమును దాటవలెను సుమా అని గృత్నృమద మహర్షి వివరించెను.


*మాఘపురాణం పంతొమ్మిదవ* 

  *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

17, ఫిబ్రవరి, 2025🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

      *🕉️సోమవారం🕉️*

*🌹17, ఫిబ్రవరి, 2025🌹*

     *దృగ్గణిత పంచాంగం*                 


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిరఋతౌః* *మాఘమాసం - కృష్ణపక్షం*


*తిథి       : పంచమి* రా 04.53 తె వరకు ఉపరి *షష్ఠి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : చిత్త* *పూర్తిగా రోజంతా రాత్రితో సహా*


*యోగం  : శూల* ఉ 08.55 వరకు ఉపరి *గండ*

*కరణం   : కౌలువ* మ 03.33 *తైతుల* రా 04.53 తె ఉపరి *గరజి*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.30 - 11.00  సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 12.22 - 02.10*

అభిజిత్ కాలం  : *ప 11.58 - 12.45*


*వర్జ్యం             : మ 01.32 - 03.21*

*దుర్ముహూర్తం  : మ 12.45 - 01.31 & 03.04 - 03.51*

*రాహు కాలం   : ఉ 08.00 - 09.27*

గుళికకాళం       : *మ 01.49 - 03.16*

యమగండం    : *ఉ 10.54 - 12.21*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కన్య/తుల*

సూర్యోదయం :*ఉ 06.32*

సూర్యాస్తమయం :*సా 06.11*

*ప్రయాణశూల  : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.32 - 08.52*

సంగవ కాలం         :      *08.52 - 11.12*

మధ్యాహ్న కాలం    :      *11.12 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.51*


*ఆబ్ధికం తిధి         : మాఘ బహుళ పంచమి*

సాయంకాలం        :  *సా 03.51 - 06.11*

ప్రదోష కాలం         :  *సా 06.11 - 08.39*

రాత్రి కాలం            :  *రా 08.39 - 11.57*

నిశీధి కాలం         :*రా 11.57 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.53 - 05.42*

________________________________

        🌷 *ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*నటరాజ స్తోత్రం (పతంజలి కృతం)*

*అథ చరణశృంగరహిత శ్రీ నటరాజ స్తోత్రం*


*అనంతవిభవం త్రిజగదంతర మణిం త్రినయనం త్రిపుర ఖండన పరం*

*సనంద ముని వందిత పదం సకరుణం పర చిదంబర నటం హృది భజ*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


          

🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

మాఘ పురాణం - 18 వ*_

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷  ఆదివారం 16 ఫిబ్రవరి 2025🌷*

_*మాఘ పురాణం - 18 వ*_

        _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


     *ఇంద్రుని శాపవిముక్తి*


☘☘☘☘☘☘☘☘☘


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా ! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘపూర్ణిమనాడు మాఘస్నానము , పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును. మాఘ వ్రతము నాచరించినవారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.


మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్త్రీలలో లక్ష్మీదేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది.  పర్వతములలో మేరువు గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి , గంగా , కావేరీ ఇలా సర్వనదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమున స్నానము చేసినచో వచ్చు పుణ్యము , మూడు దినములు అరుణోదయ సమయమున చేసిన మాఘస్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మున్నగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామరూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును , అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను.


దేవతలు విష్ణువాక్యమును శిరసావహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరిరి. ఇంద్రుని వెదకుచున్నవారికి చిన్న పాదములు , పెద్ద శరీరము కల విచిత్రమైన తొండయొకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ యొక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.  ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.


పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాపవిముక్తికి సంతసించుచు. దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను. నేను  సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి *"మనుష్య జన్మము కష్ట ప్రదము , స్త్రీగా పుట్టుట మరియు కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము. ఇట్లు బాల్యముననే భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను , ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుటమేలని"* తలచెను. పుత్రికనైన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లితండ్రులిద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.


నేనును బంధువుల వద్దనుంటిని , వారి నిరాదరణ ఫలితముగ చూచువారెవరును లేకపోవుటచే భిక్షాటనముచే జీవించుచుంటిని. నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి , వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదనపరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు , నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచారవంతురాలనై జీవితమును గడిపితిని , తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.


పులి , కోతి , ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనొందితిని , పెక్కు బాధలను పడితిని. ఒకనాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కల వానికి పెట్టితిని , ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాపవిముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజలస్పర్శచే ఆమె దేవతత్వమునంది దేవప్రియ అను పేరును పొందెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికారరూపముతో తిరుగుచున్న ఇంద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను , లోనికిపారిపోయెను. దేవతలు ఇంద్రుని జూచి వెంబడించి వానిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాపవిముక్తికి మార్గమును సూచించెను , ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రాతీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.


ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకేగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమదమహర్షి జహ్నుమునికి యీ విధముగ మాఘమాస స్నానమహిమను వివరించెనని పలుకుతుండగా జహ్నుముని , స్వామీ ! యీ విష్ణు కథామృతము ఇంకను వినవలెననున్నది ఇంకను చెప్పుడని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపాతీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ , దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపాతీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను. ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగు చేయుచు శిష్యులకు మాఘమాస మహత్త్యమును వివరించుచుండెను , అతడు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకుపోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను , చేయకపోవుటవలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపాజలమున మాఘస్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరి కథలను వినుట వలన , మాఘ స్నానము వలన వాని పిశాచరూపముపోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.


*మాఘపురాణం పద్దెనిమిదవ*  

 *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*