10, అక్టోబర్ 2021, ఆదివారం

శివలింగాన్ని దర్శించడం

 నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం.


శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. 

 

 

అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. 


సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.  


పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.  


అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.  

 

 

అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది. 


కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. 

గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. 


అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.  


రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు. వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణాలలో ఉన్నది .

తమలపాకు ప్రాముఖ్యత.

 🍃🍃🍃🍃🍃

తాంబూలానికి తమలపాకులనే ఎందుకు వాడతారు?

🍃🍃🍃🍃🍃

హిందూ ధర్మంలో తమలపాకు ప్రాముఖ్యత..


హిందూ ధర్మం లో తమలపాకును అష్ట మంగళాల లో(1. పూలు 2. అక్షింతలు, 3. ఫలాలు,4,అద్దం, 5. వస్త్రం, 6. తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8. కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణ లు చేసేటప్పుడు తమలపాకుని వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసిన వస్తువు.పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం. భారత దేశం లో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదల లోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.


తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యం?


క్షీర సాగర మథనం లో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణం లో చెప్పబడింది. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు 

చెబుతున్నాయి . తమలపాకు యొక్క మొదటి భాగం లో కీర్తి, చివరి భాగం లో ఆయువు, మధ్య భాగం లో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.


 తమలపాకు లోని ఏయే భాగాలలో ఏ దేవతలు ఉంటారో తెలుసుకుందాం 

తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.


సరస్వతీదేవి మధ్యభాగం లో ఉంటుంది.


తమలపాకు చివరలలో మహాలక్ష్మీ దేవి ఉంటుంది.


జ్యేష్టా దేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.


విష్ణుమూర్తి తమలపాకు లో ఉంటాడు.


శివుడు, కామదేవుడు తమలపాకు పైభాగం లో ఉంటారు.


తమలపాకు లోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు.


భూమాత తమలపాకుకి కుదిభాగం లో ఉంటుంది.


సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు అని శాస్త్రంలో ఉంది.

రసాభసా

 రసాభసా

                        ------------

     ఎప్పటిలాగే ఆ సభా మందిరం దీపకాంతులతో ధగధగలాడుతోంది!సాయం సంధ్యవేళ నిత్యం కళార్చనతో విలసిల్లే క్షేత్రమది.నగరంలో కళాప్రియులు,సాహితీ ప్రియులు సాయంవేళ సేదతీరి ఒయాసిస్ అది!

   "ఈ రోజు ఏమి కార్యక్రమాముందని!?" ఎవరినైనా ప్రశ్నిస్తే "తిరుమల క్షేత్రం లో ఏ కార్యక్రమాముందంటే ఏమని చెబుతాం!నిత్య కళ్యాణం పచ్చతోరణం!ఇక్కడ కూడా అంతే!"అని చమత్కారంగా సమాధానమిస్తారు.

 ప్రతి రోజు సాయంత్రం ఎదో ఒక సాహితీ సదస్సు,లేదా కళా కార్యక్రమం ,కవులు కళా కారులకు సన్మానాలు!

  ఆ రోజుకూడా యధావిధిగా కార్యక్రమం సాగుతోంది.రోజువచ్చే పెద్దలే వేదిక మీద కుడి ఎడమగా ఆసీనులై వున్నారు.సభికులు కూడా,ఒకరు ఆరా తప్ప దాదాపుగా రోజు వచ్చే వాళ్ళే!సాయంత్రమాయె సరికి వాళ్ళ కాళ్ళు ఇక్కడికే దారి తీస్తాయి.సత్కాలక్షేపం మంచిదేగా!వాళ్లంతా కూడా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కూర్చుని వున్నారు.మైకులో ఒకాయన ఘంటసాల గీతాన్ని ఖంగున పాడుతున్నాడు.(ఆయన కూడా ఆస్థాన విద్వాన్సుదేని వేరుగా చెప్పనవసరం లేదు).పాట ముగియడంతో అంతా చప్పట్లు కొట్టారు.సభాధ్యక్షుడు రోజు చెప్పే మాటలనే మలిచి కొత్తగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు!అంతా రొటీన్ గా జరిగేదయితే మనం మాట్లాడుకోవాల్సిందేముందంటారా!అక్కడే వుంది అసలు కధ! 

  ఆ రోజు ప్రత్యేకత ఏమిటంటే,నగరమంతా రెండు మూడు రోజులుగా ముసురుపట్టి వానలు దంచికొడుతున్నాయి!గత సంవత్సరం కూడా ఇదే రోజులలో కుంభవృష్టితో రోడ్లు వాగులయ్యాయి.ఇండ్లు చెరువులై తల్లడిల్లి పోయారు.తేరుకోవడానికి చాలా కాలం పట్టింది.అటువంటి పరిస్థితులలోకూడా ఈ సభ జరగడం విశేషం!

 అలా జరగడానికి ఎవరి ఒత్తిడులు వాళ్ళకున్నాయి.వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సభను వాయిదా వేద్దామని నిర్వాహకుడు ఆ రోజు సన్మానం పొందాల్సిన కవులు కళాకారులను సంప్రదించాడు.వాళ్ళు వొప్పలేదు!తాము ఎట్టి పరిస్థితుల్లోనైనా వస్తామని ,ఒక వేళ అదే జరిగితే భవిష్యత్తులో ఆ నిర్వాహకుడి కార్యక్రమాలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.దానితో ఆయన గొంతులో వెలక్కాయ పడింది.వారానికి ఒకటో రెండో కార్యక్రమాలు చేయక పోతే ఆయనకు పొద్దుపోదు!దాని ద్వారా ఆర్ధిక లభ్ది,ఉపలబ్ధి వున్నాయనుకోండి!వాటిగురించి మనం మాట్లాడ కూడదు!సరేని ముఖ్య అతిధి,ఇతర వక్తలతో మాట్లాడాడు.వాళ్ళు వస్తామన్నారు.మాకు పోయిందేముంది,రిటైర్ అయి కూర్చున్నాం!పడవలాంటి కారులో డ్రైవర్ ను పెట్టుకుని వచ్చి మాట్లాడి ఎంచక్కా పోతామని అన్నారు.పాపం వాళ్ళు ఆ వేదికలకు,మైకులకు,పేపర్ లో వచ్చే ఫోటో లకు అలవాటు పడిపోయారు.సభా ప్రాంగణం యాజమాన్యం యధావిధిగా హాలు తెరిచే ఉంటుందని చెప్పింది.ఈ సమీకరణాల్లో ఈ సభ తప్ప లేదు.మల్లి సభలోకి వద్దాం!

  ప్రసంగాల మధ్యలోనే కవిత్వాలు సాగుతున్నాయి.సభాధ్యక్షులవారు,అర్జునుడు రధం తొలినంత సులభంగా సభను నడిపిస్తూ రక్తికట్టిస్తున్నారు.అందుకే చాలా సంఘాలకు ఆయనే అభిమాన సభాధ్యక్షుడు!బయటి వర్షం తాలూకు శబ్దం,హోరు మైక్ శబ్దాలను అధిగమిస్తూ అప్పుడప్పుడు హాలు లోపటికి చొచ్చుకొస్తోంది.అలవాటుగా హాలులోకి వచ్చి పడినవారు తిరిగి వెళ్లిపోవాలని ఆలోచనకు వస్తున్నారు.ఇంతలోనే ఫెటేలుమని ఉరుముల శబ్దం!కరెంటు పోయింది.కొద్దీ సెకండ్ లలోనే జనరేటర్ ఆన్ అయి దీపాలు వెలిగాయి.ఆ చీకట్లో సగం హాలు ఖాళీ అయింది.

  విలేఖరులు,ఫొటోగ్రాఫేర్ లు నిర్వాహకుడిని వేదిక పక్కకు పిలిచి,నగరం లో వర్షం జోరు పెరుగుతోందని, తమకు ఇచ్చేది ఇచ్చేస్తే తమ దారీ తాము చూసుకుంటామని కరపత్రాన్ని చూసి వార్తలు రాసుకుంటామని తీసిన ఫోటోలు చాలని డిమాండు చేస్తున్నారు.వేదిక ముందు వరసలో కూర్చుని వున్న కవులు ఈ తతంగాన్నంతా ఓ కంట కనిపెడుతూనే వున్నారు.వాళ్లలో ఓ ముదురు కవి నిర్వాహకుడిని పిలిచి తమ సన్మానం ఫోటో లు రేపు పత్రికలలో రాకపోతే ఊరుకునేది లేదని విలేఖరులు,ఫొటోగ్రాఫేర్ పోవడానికి వీలు లేదని హెచ్చరించాడు.ఆ నిర్వాహకుడు అలాగే నంటూ వెర్రి నవ్వుతో సర్దిచెపుతున్నాడు.

  వేదికమీది పెద్దలు ఇవేమి పట్టనట్టు ప్రసంగాలు చేస్తున్నారు.ఛలోక్తులు వేస్తున్నారు.ఇలా నిర్వాహకులు,కవులు,కళాకారులు,విలేఖరులు,వేదికమీది పెద్దల మధ్య పితకాలాటం నడుస్తోంది.ఇంతలో నిర్వాహకుడికి ఫోన్ రావడంతో ఆయన మాట్లాడుకుంటూ హడావుడిగా బయటకు వెళ్ళిపోయాడు.అప్పటికే వేదికమీదున్న ఇద్దరు వక్తలు సభాధ్యక్షుడి అనుమతి తీసుకుని గంభీరంగా నడుచుకుంటూ హాల్ నుండి బయట పడ్డారు.విలేఖరులు కూడా ఒకరితర్వాత ఒకరు చెవికి సెల్ ఫోన్ ఆనించుకుని ఎదో కాల్ లో మాట్లాడుతున్నట్లు నటిస్తూ జారుకున్నారు.ఈ సెల్ ఫోన్ తో ఇదో సౌకర్యం వుంది కదా!దాన్ని వినియోగించుకున్నారు!ఇక వేదిక మీద మిగిలింది సభాధ్యక్షుడు,సన్మానం చేయాల్సిన పెద్ద మనిషి!వేదికకింద మిగిలింది సన్మానం పొందాల్సిన కవులు,కళాకారులు మాత్రమే!సభామందిరం పూర్తిగా ఖాళీ అయింది.ఇదేమి కొత్త కాదండోయ్!రోజు జరిగే తంతే ఇది!అందుకే కెమెరా ఎప్పుడు వేదిక మీదకే పెట్టి ఫోటోలు తీస్తారు.వాళ్ళ చాతుర్యం వాళ్ళది!అందువలన సభలో మిగిలిన వాళ్ళు నిశ్చిన్తగా నిర్వాహకుడి కోసం ఎదురు చూస్తూ కబుర్లాడుకొంటున్నారు.

  ఇంతలో ఆ హాల్ వాచ్ మాన్ హడావుడిగా లోపలకు పరిగెత్తికొచ్చి"అయ్యా!అందరు పారిపోండి!నీళ్లు మన రోడ్ మీద ప్రవాహాంగా వస్తున్నాయి.ఈ హాల్ కూడా మునిగి పోవచ్చు."అని అంటూనే బయటకు పరిగెత్తి పోయాడు.వేదిక మీద పెద్ద వాళ్ళు కూడా తమ డ్రైవర్ లు రావడం తో మారు మాట్లాడకుండా బయటకు దారి తీశారు.

   శాలువాలు,పూలదండలు,ఫోటో లు,మెమెంటోల కోసం చివరి వరకు ఆశతో ఎదురు చూసిన కవులు ఆశాభంగమైనందుకు ఖిన్న వదనాలతో నిర్వాహకుడిని తిట్టుకుంటూ అలాగే స్థాణువులై ఉండి పోయారు.వాళ్లకు తెలియని విషయం మేమిటంటే ఆ నిర్వాహకుడి ఇల్లు వర్షం లో మునిగి పోయిందని ఫోన్ రావడం తో ఆయన ఎప్పుడో ఆగమేఘాలమీద ఇంటికి వెళ్ళిపోయి అక్కడ వరద నీళ్లలో తలమునకలవుతున్నాడు!ఇంతలో సభా మందిరం లోకి వర్షపు నీరు రావడం మొదలైంది.జనరేటర్ ఆపి వేయడంతో చిక్కని చీకట్లు హాల్ లో కమ్ముకున్నాయి.ఉరుములు మెరుపుల శబ్దాలు భయంకరంగా వినబడుతున్నాయి.ఓ మంచి ప్రకృతి కవిత్వం రాయడానికి అనువైన వాతావరణం గదా!

                                        -------

                                                                                         -సుగుణాకర్   

(ఇంతటి వర్ష బీభత్సం లో కూడా నగరం లో సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్విస్తున్న ధీరులకు అంకితం.)

శ్రీమద్భాగవతము

 *10.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2287(౨౨౮౭)*


*10.1-1417-*


*క. శిష్యులు బలాఢ్యులైన వి*

*శేష్యస్థితి నొంది గురువు జీవించును ని*

*ర్దూష్యగుణ బలగరిష్ఠులు*

*శిష్యులరై గురుని కోర్కి సేయం దగదే?"* 🌺



*_భావము: “శిష్యులు శక్తిమంతులైనట్లయితే, గురువు విశేషమైన, సర్వోన్నతమైన స్థాయిని పొందుతాడు. ఇంత గొప్ప లక్షణములు, మహా పరాక్రమము కల మీరు నా శిష్యులైనప్పుడు గురువు యొక్క కోరిక తీర్చవలెను కదా!”_* 🙏



*_Meaning: “When the disciples are strong and powerful, Guru achieves the highest status. As you two are of the best of character and valour, it would be quite appropriate that you fulful the wishes of your Guru.”_* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

ఏ అవసరం ఎలా వస్తుందో.!

 *కృతజ్ఞత*


నీకున్న ఉద్యోగ అర్హతలే ఇతరులకూ ఉన్నాయి. అయితే నీకు ఉద్యోగము వచ్చింది....!

ఇతరులకు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు.*


నీవు చేసిన ఏ ప్రార్థనకైతే దేవుడు జవాబిచ్చాడో...

అదే ప్రార్థన అనేకులు ఇంకా చేస్తూనే ఉన్నారు.....!

జవాబు రాలేదు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ దారిలో అయితే నీవు ప్రతిరోజూ క్షేమంగా ప్రయాణం

చేస్తున్నావో.... అదే దారిలో...

అనేకులు మరణించారు...!

*కృతజ్ఞత కలిగి ఉండు.*


 ఏ స్థలంలో అయితే దేవుడు 

నిన్ను దీవించాడో, అక్కడే... అనేకులు దేవున్ని పూజిస్తూనే ఉన్నారు, ఇంకా దీవెన రాలేదు..!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఆసుపత్రిలో ఏ పడక మీద ఉండి నీవు బాగుపడి 

ఇంటికెళ్ళావో......

అదే పడకపై ఉండి అనేకులు

మరణించారు....!

*కృతజ్ఞత కలిగి ఉండు*


ఏ వర్షమైతే నీ పొలానికి మంచి 

పంటలనిచ్చిందో...

అదే వర్షం, ఇతరుల పొలాలను 

నాశనం చేసింది.

*కృతజ్ఞత కలిగి ఉండు.*


 కృతజ్ఞత కలిగి ఉండు..

ఎందుకంటే 

నీవేదైతే కలిగి ఉన్నావో

 అది *నీ శక్తి* కాదు,

*నీ బలం* కాదు,

*నీ అర్హతలు* కాదు.

*కేవలం దేవుని అనుగ్రహం* అని గుర్తుంచుకో...

నీకు కలిగిన ప్రతీది ఇచ్చేవాడు

*ఆయనే.*

ప్రతీ విషయంలో *దేవునికి* కృతజ్ఞత కలిగి ఉండండి.

నీకు ఏదైనా సమయం లో సాయం చేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడం మరిచిపోకు. 

కృతజ్ఞత ఆశించడం వాళ్ళ తప్పు ఔనో/కాదో తెలియదు కానీ చెప్పడం మాత్రం నీ బాధ్యత విజ్ఞత... 

ఒక్కసారి ఆలోచించు. 

కోట్లు సంపాదించే వాళ్లు మన వాళ్ళు ఎక్కడ ఉన్నా , నీకు నెలకు ఎన్ని పైసలు పంపినా, పక్కన (గంజి) నీళ్లు అందించే వాడే గొప్పోడు....

అందుకనే అప్పుడప్పుడు "మనీ"తో కాకుండా "మనిషి"తో కూడా మాట్లాడుతుండండి, 

చెప్పలేం ఏ అవసరం ఎలా వస్తుందో.! 

ఎన్ని కోట్లు ఉన్నా ఎప్పుడు ఎవరి సాయం తీసుకోవలసి వస్తుందో ఎవరికీ తెలియదు కదా…


*అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి…*🙏

విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు

 నిజం గా జరిగిన సంఘటన




విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట ఆవిడ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ ఆవిడ చేసిన మహిమలు కోకొల్లలు..


ఆవిడ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆవిడ కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది..


1955 వ సంవత్సరం లో జరిగిన యాదర్థ సంఘటన ఇది..


విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు..


అప్పట్లో రోజులు మారాయి అనే సినిమా విడుదల అయ్యింది.. ఈయన రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు ఎవరన్నా వస్తే తన రిక్షా ఎక్కించుకునీ వెళ్ళటానికి..


అలా ఉండగా ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక పెద్దావిడ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది..


అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి సమయమైంది కదా మొత్తం చీకటిగా ఉంది అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అంటారు కదా నీకు భయమేయట్లేదా అంటే దానికి సమాధానంగా ఆ రిక్షా వెంకన్న ఆవిడ మా తల్లీ అమ్మ.. తల్లి దగ్గర బిడ్డలకి భయమెందుకు అంటాడు..


కొంత దూరం వెళ్లగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన రిక్షా ఆపి ఏ ఇంటికి వెళ్ళాలి అమ్మ అనగా వెనక నుండి సమాదానం లేదు అదేంటీ అని వెనక్కి తిరిగి చూడగా ఆవిడ ఉండదు రిక్షాలో అదేంటీ అని చుట్టూ చూడగా పక్కనే ఉన్న అమ్మవారి గుడి మెట్లు ఎక్కుతూ ఉంటుంది అదేంటీ అమ్మ డబ్బులు ఇవ్వలేదు అనగా నీ తలపాగా లో పెట్టాను చూడు అంటుంది.. అందులో చూసుకోగా అమ్మవారి బంగారు గాజు ఒక పక్క, పదిరూపాయల నోటు మరో పక్క ఉన్నాయి.


వెంటనే ఆయనకి అర్ధమవుతుంది తన రిక్షా ఎక్కింది ఆ అమ్మలగన్నఅమ్మ అని..


దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రి కేకలు వేయటం మొదలెడతాడు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ళు అందరు పరుగు పరుగున వచ్చి ఏమైంది ఏంటి అని అడుగగా వారికీ జరిగింది చెప్తే బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకి వచ్చింది అమ్మవారే అని అర్ధమవుతుంది...


ఇలా ఎన్నో సంఘటనలు జరిగాయి


ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా గాజు ఫోటోతో సహా వేశారు..

పరమతస్తుల దండయాత్రలు

 కొన్ని వందల సం. ల కిందట భూతల స్వర్గం సుందర కాశ్మీర్లో హిందూత్వం వెల్లివిరిసేది. ఆ మంచుకొండల మధ్య కొన్ని వందల దేవాలయాలు, ఉదయాన్నే ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపించే గుడిగంటలు, ఉచ్ఛస్వరంతో వినిపించే వేద మంత్ర ఘోషలు....భారతీయ సంగీత నృత్య శిక్షణలు.... ఇలా ఒకటేమిటి పూర్తి భారతీయత ఉట్టిపడే వాతావరణం వుండేది.


కానీ పరమతస్తుల దండయాత్రలు, ఆక్రమణలతో అన్ని కనుమరుగయ్యాయి. ఈ శతాబ్దంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల వల్ల మిగిలి ఉన్న ఆ కొద్దీ ఆనవాళ్ళు కూడా దాదాపుగా కనుమరుగు అయిపోయాయి. అసలు కాశ్మీరం మాదే. ఎప్పుడూ అది హిందువులది కాదు అనే పరిస్థితికి తెచ్చుకున్నాం.


ఒక ప్రదేశం లో మత పరంగా జనాభా మారితే వచ్చే పరిణామాలు ఏమిటో కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మన కళ్ళముందు ఉదాహరణ. 


మన పూర్వీకులు ఇచ్చిన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకెందుకులే. అది లేకపోతే ఇప్పుడు మనం బతకలేమా అన్న మన ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక రాష్ట్రంలో దాని ప్రాచీన సంస్కృతి దాదాపుగా కనుమరుగు అయింది. దేశంలో ఇతర ప్రదేశాల్లో గల తమ మతస్తులైన ప్రజల నిర్లిప్తత కారణంగా, మద్దత్తు వారికి లభించని కారణంగా కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగిన కొన్ని వేల కుటుంబాలు కట్టు బట్టలతో వారి స్వస్థలాలను విడిచిపెట్టి పోయి ఈ దేశంలోనే కాందిశీకులుగా జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. వారి బాధలకు కారణం మనలో చైతన్యం లేకపోవడమే.


సరిగ్గా ఇటువంటి నిర్లక్ష్య ఆలోచన విధానం ఉండడం వల్లే అతి పురాతన సంస్కృతులైన మాయన్, గ్రీక్, ఈజిప్షియన్, జోరాష్ట్రీయన్ సంస్కృతులు ఆనవాళ్ళు లేక కాల గర్భంలో కలసి పోయాయి. పరమతస్తుల ఇన్ని దాడుల తరువాత కూడా ఈ భారతీయ సంస్కృతి ఇంకా మిగిలి ఉంది అంటే పూర్వీకులు హిందూ ధర్మాన్ని , సంస్కృతిని కూడా సామాన్య ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మలిచిపెట్టడం వల్లే.


అందుకే విదేశీమతాల వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అనుకున్నంతగా మత మార్పిడులు చెయ్యలేకపోతున్నాం అని భావించి ఇక్కడ సాంప్రదాయాలను పద్ధతులను తమ మత విశ్వాసాలకు జోడించి వాటిని అనుకరిస్తు అమాయకులను మోసపూరితంగా మత మార్పిడి చేస్తున్నారు. 


హిందూ ధర్మం లో ఇలాగే పూజించాలి. ఫలానా వారినే పూజించాలి అని లేకపోవడం వల్ల ఎవరి వ్యక్తి గత లేక సామాజిక విశ్వాసాలకు ఆధారంగా వారి ఇష్టదేవతలను తయారు చేసుకోవడం పూజించడం జరుగుతోంది. ఏ ఒక్కరూ ఇతరుల నమ్మకాలని తక్కువ చేసి చూడరు.


అందుకే వీధి వీధికో అమ్మవారు, గ్రామ గ్రామానికో గ్రామ దేవత, అడవుల్లో ఒక్కో కొండ తెగకూ ఒక కొండదేవత.


పట్టణాల నుండి హిందూ ధర్మగురువులు కొండల్లోకి పోయి ఈ పద్దతి తప్పు ఫలానాలాగా పూజిస్తేనే మోక్షం కలుగుతుంది అని బలవంతం పెట్టరు. పట్టణాల వారు అడవులకు పోయినప్పుడు ఆ కొండ దేవతలను కూడా వీరు దండాలు పెట్టుకుని గౌరవిస్తారు అంతే కానీ వారి ఆచార వ్యవహారాలను, కట్టుబొట్టును, వివిధ రూపాల్లో వుండే వారి దేవతా మూర్తులను హేళన చేయడం కానీ విమర్శించడం కానీ చెయ్యరు. అలాగే మీరు ఫలానా శివుణ్ణి, రాముణ్ణి లేదా కృష్ణుడినీ పూజించ కపోతే నరకానికి పోతారని వారిని ఎప్పుడు 

భయపెట్టరు.


అందువల్లే ఈ పవిత్ర భూమి మీద ఇంత వైవిధ్యం వెల్లి విరుస్తోంది.


ఇంత వైవిధ్యం కల ఇక్కడ ప్రజల జీవన విధానం పై పరమతస్తుల దాడి వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎడారుల్లో పుట్టిన ఒకే దేవుడు, ఒకే పద్దతి, ఒకే పుస్తకం అని ఒకే మూస గల క్రిస్టియనిటీ, ఇస్లాం

ఈ వైరుధ్యానికి పెను ప్రమాదంగా పరిణిమించాయి. వీరు అడవుల్లోకి.కూడా పోయి అక్కడ కొండప్రజలను వారి ప్రాచీన సంస్కృతులకు దూరం చేస్తున్నారు.


అది కొండ ప్రాంత నివాసం కావచ్చు, గ్రామం కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు మత ప్రాధిపదికన జనాభా మారితే అక్కడ ప్రాచీన సంస్కృతి కనుమరుగు అవుతుంది.


కాశ్మీర్, ఆఫగానిస్థాన్, పాకిస్థాన్ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు. అలాగే ఈశాన్య ప్రాంతంలో ఎక్కువుగా వుండే కొండజాతుల వారు తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను దాదాపుగా పొగుట్టుకున్నారు. అక్కడ ప్రజలలో 90% మంది క్రిస్టియానిటి లోకి పోయి తమ ప్రాచీన సంప్రదాయాలను, పూజ పద్ధతులకు క్రమంగా దూరం జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ మతం మారిన ప్రజల్లో కూడా తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి అన్న తపన మొదలైంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు గ్రీక్, ఈజిప్ట్ మొదలగు దేశాల్లో కూడా మొదలు అయ్యింది.


ఈ దేశంలో గల ఈ వైవిధ్య వాతవరణం ఇలాగే కొనసాగలి అంటే నిర్మొహమాటంగా వివిధ ప్రాంతాల్లో పాటిస్తున్న మన ప్రాచీన పద్దతులు, సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. 


అయితే దురదృష్టవశాత్తూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన హిందువులలోనే ఒక మేధావి వర్గం వుత్తర, దక్షిణ అంటూ, రాముడు కృష్టుడు అంటూ హిందూవులలో బేధాలు సృష్టిస్తున్నారు. వుత్తరాది వారు వచ్చి దేశం అంతా రాముణ్ణి రుద్దుతున్నారు అనే ఈ మేధావి వర్గానికి ఎక్కడో ఎడారుల్లో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దడం, ఆ మతం మారుతున్న వాళ్ళు ఈ దేశ సహజ సిద్ధ వైవిధ్యానికి దూరం జరుగుతూ ఇక్కడ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ద్వేషించడం వీరి గుడ్డి కళ్ళకు కనిపించదు. 


దేశం అంతా రాముణ్ణి రుద్దినా శివుణ్ణి రుద్ధినా ఈ సనాతనధర్మం లో వుండే వైవిధ్యానికి ఏదీ లోటు వుండదు. ఎందుకంటే ఉత్తరాది కాశ్మీర్ లో శివుణ్ణి పూజించే వాడు దక్షిణాది రామేశ్వరం వచ్చి అదే శివుణ్ణి పూజిస్తాడు, పశ్చిమాన సోమనాథుని, తూర్పున వైద్య నాథ్ నీ కూడా పూజిస్తాడు. అలాగే రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. అందువల్ల ఏ రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి లేదా శివుణ్ణి దేశం అంతా రుద్దడం వల్ల ఈ ధర్మానికి వచ్చే నష్టం లేదు.


అసలు ఈ పవిత్ర నేలలో వుండే వైవిధ్యానికి నిజంగా తూట్లు పొడుస్తున్న ఎడారి మతాల గురించి ఒక్క మాట కూడా మరి ఈ మేధావులు మాట్లాడరు ఎందుకని? 


అందుకే కాబోలు ఒక మిత్రుడు అన్నాడు.

క్రిస్టియన్ లేదా ఇస్లాం లోకి మతం మారిన ఒకరిని కష్టపడి మళ్లీ హిందూ ధర్మంలో తీసుకు రావడం సులభం ఏమో కానీ ఒక మేధావి హిందువుని హిందువుగా మార్చడం చాలా కష్టం.

పరమత హిందూ ద్వేషులు బహిరంగంగా హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అడ్డుకోవచ్చు. కానీ ఈ మేధావి ఉదార హిందువులు కర్రకు చేదపట్టినట్లు పైకి కనిపించకుండా హిందూ ధర్మం లోపల వుండే హిందూ ధర్మాన్ని బలహీన పరుస్తారు జాగ్రత్త అన్నాడు. అవును ఇది నూటికి నూరు శాతం నిజం.


ముఖ్యంగా మనకెందుకులే, ఎవరి పాపాన వారు పోతారు అన్న ఉదాసీనత మనం వదిలించుకోవాలి. ఎవరి మీదా ద్వేషం కానీ శత్రుత్వం కానీ నూరిపొయ్యక్కరలేదు. అదే సమయంలో మన ధర్మానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మన వారిని మనం ఈ విషయాలపై జాగృతం చేస్తే చాలు.


స్వస్తి

.....చాడా శాస్త్రి....

 కొన్ని వందల సం. ల కిందట భూతల స్వర్గం సుందర కాశ్మీర్లో హిందూత్వం వెల్లివిరిసేది. ఆ మంచుకొండల మధ్య కొన్ని వందల దేవాలయాలు, ఉదయాన్నే ఆ నిశ్శబ్ద వాతావరణంలో వినిపించే గుడిగంటలు, ఉచ్ఛస్వరంతో వినిపించే వేద మంత్ర ఘోషలు....భారతీయ సంగీత నృత్య శిక్షణలు.... ఇలా ఒకటేమిటి పూర్తి భారతీయత ఉట్టిపడే వాతావరణం వుండేది.


కానీ పరమతస్తుల దండయాత్రలు, ఆక్రమణలతో అన్ని కనుమరుగయ్యాయి. ఈ శతాబ్దంలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల వల్ల మిగిలి ఉన్న ఆ కొద్దీ ఆనవాళ్ళు కూడా దాదాపుగా కనుమరుగు అయిపోయాయి. అసలు కాశ్మీరం మాదే. ఎప్పుడూ అది హిందువులది కాదు అనే పరిస్థితికి తెచ్చుకున్నాం.


ఒక ప్రదేశం లో మత పరంగా జనాభా మారితే వచ్చే పరిణామాలు ఏమిటో కాశ్మీర్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ మన కళ్ళముందు ఉదాహరణ. 


మన పూర్వీకులు ఇచ్చిన సంస్కృతి వారసత్వాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. మనకెందుకులే. అది లేకపోతే ఇప్పుడు మనం బతకలేమా అన్న మన ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల ఒక రాష్ట్రంలో దాని ప్రాచీన సంస్కృతి దాదాపుగా కనుమరుగు అయింది. దేశంలో ఇతర ప్రదేశాల్లో గల తమ మతస్తులైన ప్రజల నిర్లిప్తత కారణంగా, మద్దత్తు వారికి లభించని కారణంగా కొన్ని శతాబ్దాలుగా అక్కడే పుట్టి పెరిగిన కొన్ని వేల కుటుంబాలు కట్టు బట్టలతో వారి స్వస్థలాలను విడిచిపెట్టి పోయి ఈ దేశంలోనే కాందిశీకులుగా జీవితాలు వెళ్ళ దీస్తున్నారు. వారి బాధలకు కారణం మనలో చైతన్యం లేకపోవడమే.


సరిగ్గా ఇటువంటి నిర్లక్ష్య ఆలోచన విధానం ఉండడం వల్లే అతి పురాతన సంస్కృతులైన మాయన్, గ్రీక్, ఈజిప్షియన్, జోరాష్ట్రీయన్ సంస్కృతులు ఆనవాళ్ళు లేక కాల గర్భంలో కలసి పోయాయి. పరమతస్తుల ఇన్ని దాడుల తరువాత కూడా ఈ భారతీయ సంస్కృతి ఇంకా మిగిలి ఉంది అంటే పూర్వీకులు హిందూ ధర్మాన్ని , సంస్కృతిని కూడా సామాన్య ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మలిచిపెట్టడం వల్లే.


అందుకే విదేశీమతాల వారు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అనుకున్నంతగా మత మార్పిడులు చెయ్యలేకపోతున్నాం అని భావించి ఇక్కడ సాంప్రదాయాలను పద్ధతులను తమ మత విశ్వాసాలకు జోడించి వాటిని అనుకరిస్తు అమాయకులను మోసపూరితంగా మత మార్పిడి చేస్తున్నారు. 


హిందూ ధర్మం లో ఇలాగే పూజించాలి. ఫలానా వారినే పూజించాలి అని లేకపోవడం వల్ల ఎవరి వ్యక్తి గత లేక సామాజిక విశ్వాసాలకు ఆధారంగా వారి ఇష్టదేవతలను తయారు చేసుకోవడం పూజించడం జరుగుతోంది. ఏ ఒక్కరూ ఇతరుల నమ్మకాలని తక్కువ చేసి చూడరు.


అందుకే వీధి వీధికో అమ్మవారు, గ్రామ గ్రామానికో గ్రామ దేవత, అడవుల్లో ఒక్కో కొండ తెగకూ ఒక కొండదేవత.


పట్టణాల నుండి హిందూ ధర్మగురువులు కొండల్లోకి పోయి ఈ పద్దతి తప్పు ఫలానాలాగా పూజిస్తేనే మోక్షం కలుగుతుంది అని బలవంతం పెట్టరు. పట్టణాల వారు అడవులకు పోయినప్పుడు ఆ కొండ దేవతలను కూడా వీరు దండాలు పెట్టుకుని గౌరవిస్తారు అంతే కానీ వారి ఆచార వ్యవహారాలను, కట్టుబొట్టును, వివిధ రూపాల్లో వుండే వారి దేవతా మూర్తులను హేళన చేయడం కానీ విమర్శించడం కానీ చెయ్యరు. అలాగే మీరు ఫలానా శివుణ్ణి, రాముణ్ణి లేదా కృష్ణుడినీ పూజించ కపోతే నరకానికి పోతారని వారిని ఎప్పుడు 

భయపెట్టరు.


అందువల్లే ఈ పవిత్ర భూమి మీద ఇంత వైవిధ్యం వెల్లి విరుస్తోంది.


ఇంత వైవిధ్యం కల ఇక్కడ ప్రజల జీవన విధానం పై పరమతస్తుల దాడి వందల సంవత్సరాలుగా జరుగుతోంది. ముఖ్యంగా ఎడారుల్లో పుట్టిన ఒకే దేవుడు, ఒకే పద్దతి, ఒకే పుస్తకం అని ఒకే మూస గల క్రిస్టియనిటీ, ఇస్లాం

ఈ వైరుధ్యానికి పెను ప్రమాదంగా పరిణిమించాయి. వీరు అడవుల్లోకి.కూడా పోయి అక్కడ కొండప్రజలను వారి ప్రాచీన సంస్కృతులకు దూరం చేస్తున్నారు.


అది కొండ ప్రాంత నివాసం కావచ్చు, గ్రామం కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు మత ప్రాధిపదికన జనాభా మారితే అక్కడ ప్రాచీన సంస్కృతి కనుమరుగు అవుతుంది.


కాశ్మీర్, ఆఫగానిస్థాన్, పాకిస్థాన్ మన కళ్ళ ముందు ఉన్న ఉదాహరణలు. అలాగే ఈశాన్య ప్రాంతంలో ఎక్కువుగా వుండే కొండజాతుల వారు తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను దాదాపుగా పొగుట్టుకున్నారు. అక్కడ ప్రజలలో 90% మంది క్రిస్టియానిటి లోకి పోయి తమ ప్రాచీన సంప్రదాయాలను, పూజ పద్ధతులకు క్రమంగా దూరం జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ మతం మారిన ప్రజల్లో కూడా తమ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవాలి అన్న తపన మొదలైంది. ఇదే ట్రెండ్ ఇప్పుడు గ్రీక్, ఈజిప్ట్ మొదలగు దేశాల్లో కూడా మొదలు అయ్యింది.


ఈ దేశంలో గల ఈ వైవిధ్య వాతవరణం ఇలాగే కొనసాగలి అంటే నిర్మొహమాటంగా వివిధ ప్రాంతాల్లో పాటిస్తున్న మన ప్రాచీన పద్దతులు, సంస్కృతీ సంప్రదాయాలు, నాగరికతపై జరుగుతున్న దాడులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలి. 


అయితే దురదృష్టవశాత్తూ ఈ సనాతన ధర్మాన్ని కాపాడవలసిన హిందువులలోనే ఒక మేధావి వర్గం వుత్తర, దక్షిణ అంటూ, రాముడు కృష్టుడు అంటూ హిందూవులలో బేధాలు సృష్టిస్తున్నారు. వుత్తరాది వారు వచ్చి దేశం అంతా రాముణ్ణి రుద్దుతున్నారు అనే ఈ మేధావి వర్గానికి ఎక్కడో ఎడారుల్లో ఉన్న దేవుణ్ణి తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మీద రుద్దడం, ఆ మతం మారుతున్న వాళ్ళు ఈ దేశ సహజ సిద్ధ వైవిధ్యానికి దూరం జరుగుతూ ఇక్కడ ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను ద్వేషించడం వీరి గుడ్డి కళ్ళకు కనిపించదు. 


దేశం అంతా రాముణ్ణి రుద్దినా శివుణ్ణి రుద్ధినా ఈ సనాతనధర్మం లో వుండే వైవిధ్యానికి ఏదీ లోటు వుండదు. ఎందుకంటే ఉత్తరాది కాశ్మీర్ లో శివుణ్ణి పూజించే వాడు దక్షిణాది రామేశ్వరం వచ్చి అదే శివుణ్ణి పూజిస్తాడు, పశ్చిమాన సోమనాథుని, తూర్పున వైద్య నాథ్ నీ కూడా పూజిస్తాడు. అలాగే రాముణ్ణి, కృష్ణుణ్ణి కూడా పూజిస్తారు. అందువల్ల ఏ రాముణ్ణి లేదా కృష్ణుణ్ణి లేదా శివుణ్ణి దేశం అంతా రుద్దడం వల్ల ఈ ధర్మానికి వచ్చే నష్టం లేదు.


అసలు ఈ పవిత్ర నేలలో వుండే వైవిధ్యానికి నిజంగా తూట్లు పొడుస్తున్న ఎడారి మతాల గురించి ఒక్క మాట కూడా మరి ఈ మేధావులు మాట్లాడరు ఎందుకని? 


అందుకే కాబోలు ఒక మిత్రుడు అన్నాడు.

క్రిస్టియన్ లేదా ఇస్లాం లోకి మతం మారిన ఒకరిని కష్టపడి మళ్లీ హిందూ ధర్మంలో తీసుకు రావడం సులభం ఏమో కానీ ఒక మేధావి హిందువుని హిందువుగా మార్చడం చాలా కష్టం.

పరమత హిందూ ద్వేషులు బహిరంగంగా హిందూ ధర్మాన్ని నాశనం చెయ్యడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అడ్డుకోవచ్చు. కానీ ఈ మేధావి ఉదార హిందువులు కర్రకు చేదపట్టినట్లు పైకి కనిపించకుండా హిందూ ధర్మం లోపల వుండే హిందూ ధర్మాన్ని బలహీన పరుస్తారు జాగ్రత్త అన్నాడు. అవును ఇది నూటికి నూరు శాతం నిజం.


ముఖ్యంగా మనకెందుకులే, ఎవరి పాపాన వారు పోతారు అన్న ఉదాసీనత మనం వదిలించుకోవాలి. ఎవరి మీదా ద్వేషం కానీ శత్రుత్వం కానీ నూరిపొయ్యక్కరలేదు. అదే సమయంలో మన ధర్మానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి మన వారిని మనం ఈ విషయాలపై జాగృతం చేస్తే చాలు.


స్వస్తి

.....చాడా శాస్త్రి....

జవాబులతోపాటుగా

 ఆసక్తితో జవాబులను ప్రయత్నించాలి అని అనుకన్నా యితర గృహ సమస్యలతో వీటిపై సమయాన్ని కేటాయించలేకపోయిన సభ్యబృందానికి, పై ప్రశ్నల జవాబులను వాటి వివరణలతో సహా పొందుపరచడమైనది. గమనించగలరు. 


జవాబులతోపాటుగా వివరణలు చదువాలని మనవి.


రావణుడిని చంపాలనుకొన్న శూర్పనఖ కుమారుడెవరు ?

_________________________


(1) కడుపులో అమృతభాండం కలవాడెవరు ?


(అ) విష్ణువు

(ఆ) వశిష్టుడు

(ఇ) రావణుడు✅

(ఈ) నలకుబరుడు


రావణవధ జరగాలంటే అతని కుక్షిలోవున్న అమృతకలశాన్ని చేధించాలనే విభీషనుడి సలహతో శ్రీరాముడు బాణంసంధించి రావణుడి నాభిలోని అమృతభాండాన్ని శిథిలం చేయడంతో రావణవధ జరిగిపోయిందని మనం చిత్రసీమలో చూశాం.నిజానికి ఈ ఘట్టం మూలకథలో లేదు. తరువాత జరిగిన మార్పులలో చోటుచేసుకొంది.శ్రీరామాంజనేయయుద్ధం, శ్రీకృష్ణార్జునయుద్ధం (గయోపాఖ్యానం) పురాణపురుషులు శాకాహారులని చెప్పడం ఇలాంటిదే.అయితే ప్రతి మార్పు మంచిసందేశాన్ని లోకానికి అందించాయి.


(2) శ్రీరాముడి సోదరి పేరేమిటి ?


(అ) దశరథి

(ఆ) శాంత✅

(ఇ) సుకన్య

(ఈ) రూప


వివరణ: - అయోధ్యరాజు దశరథుడు, అంగరాజు ఇద్దరూ రోమపాదుడు బాల్యమిత్రులు. రోమపాదుని భార్య వర్షిణి. ఈమె కౌసల్యకు సోదరి.దశరథకౌసల్యల తనయ శాంత. పిల్లలులేని రోమపాదునికి శాంతను దశరథుడు దత్తత ఇవ్వడం జరిగింది.


(3) "లక్షణ" దుర్యోధనుని కూతురు.లక్షణను పెండ్లాడిన శ్రీకృష్ణుని కొడుకెవరు ?


(అ) సాంబుడు✅

(ఆ) ప్రద్యుమ్నుడు

(ఇ) సుధేష్ణుడు

(ఈ) చారుచంద్రుడు


వివరణ : - శ్రీకృష్ణజాంబవతుల కొడుకే సాంబుడు.దుర్యోధనుడు తనకూతురైన లక్షణ వివాహాం చేయాలని స్వయంవరం ప్రకటించగా, సాంబుడు లక్షణను ఎత్తుకుపోతాడు.సాంబుని కౌరవులు అడ్డగించి సాంబుని బంధిస్తారు.దీంతో కోపించిన బలరాముడు హస్తినకు వస్తాడు. దుర్యోధనుడు గురువైన బలరాముడిని ఆహ్వానించి మర్యాద చేస్తాడు. బలరాముని సూచనతో సాంబలక్షణల వివాహన్ని దుర్యోధనుడు జరిపిస్తాడు.యాదవ వంశ వినాశనానికి సాంబుడే కారణం.


(4) గంధమాదనపర్వతం ఎక్కడుండేది ?


(అ) కిష్కింధ

(ఆ) దండకారణ్యం

(ఇ) నేటి గోండ్వానాప్రాంతం✅

(ఈ) శ్రీలంక


(5) కాశీవిశ్వేశ్వరుని సతి పేరేమిటి ?


(అ) అపర్ణ

(ఆ) మీనాక్షి

(ఇ) కాత్యాయని

(ఈ) అన్నపూర్ణ✅


వివరణ : - కాశీఅన్నపూర్ణ దేవికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. హిందూగ్రంథాల ప్రకారం ఓ సారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతోసహా అన్నీమాయేనని అంటాడు. భక్తుల ఆకలినితీర్చే అమ్మ అయిన పార్వతీదేవికి శివుని మాటలునచ్చక కాశీవిడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది. దాంతో ఆహారందొరకక ప్రజలు అలమటించడం ప్రారంభవుతుంది. ప్రజల కష్టాలనుచూడలేని అమ్మవారు తిరిగివచ్చి అందరి ఆకలినితీరుస్తుంది. చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తనమాటలను వెనక్కి తీసుకుని భిక్షపాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్నిఅడిగినట్లు చెబుతారు. అప్పటినుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికీ భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉందని నమ్మకం.


(6) ఇంద్రుడి ఉద్యానవనం పేరేమిటి ?


(అ) ఇంద్రవనం

(ఆ) బృందావనం

(ఇ) నందనవనం✅

(ఈ) పారిజాతవనం


(7) కాశీలో ఒకతను హరిశ్చంద్రమహరాజును దాసునిగా పొందాడు. ఎవరతను ?


(అ) కాలకౌశికుడు

(ఆ) వీరదాసుడు

(ఇ) కాలకౌక్షేయుడు

(ఈ) వీరబాహువు✅


వివరణ :- విశ్వామిత్రుని కోరికపై యమధర్మరాజే వీరబాహువుగా అవతరించి, హరిశ్చంద్రమహరాజును దాసునిగా కొన్నాడు.


(8) శ్రీకృష్ణుడు చంపిన కువలయాపీడము ఏమిటి ?


(అ) బకం

(అ) రాక్షసి

(ఇ) సర్పం

(ఈ) ఏనుగు✅


వివరణ : - కంసుని దగ్గరున్న మధించిన ఏనుగుపేరు కువలయపీడం. ఎంతటి బలశాలినైనా చంపగలశక్తి దీనికుంది. మధురానగరంలో శ్రీకృష్ణ బలరాములు విహరిస్తున్నపుడు వారిని చంపాలనే ఉద్దేశ్యంతో కంసుని ఆనతితో మావటి ఆ కువలయాపీడాన్ని వారి పైకి ఉసిగొల్పాడు. కాని శ్రీకృష్ణుని చేతిలో చచ్చింది.


(9) ద్రౌపతి వస్త్రాపహరణం ధర్మసమ్మతం కాదని వాదించిన దుర్యోధనుడి తమ్ముడెవరు ?


(అ) వికర్ణుడు✅

(ఆ) దుశ్చలుడు

(ఇ) విరోచనుడు

(ఈ) వికర్ణకుడు


వివరణ: - వికర్ణుడు దుర్యోధనునికి రెండవతమ్ముడు, అంటే కౌరవులలో మూడవవాడు. నిండుసభలో ద్రౌపదిమానభంగం తప్పని వాదించినవాడు ఇతనే.మహభారతయుద్ధంలో కౌరవనాశనం తప్పదని ఇతనికి తెలుసు. అయినా రక్తబంధానికి కట్టుబడి భీమునిచేతిలో పదనాల్గవరోజున మరణించాడు. వికర్ణుని చంపినందుకు భీముడు ఎంతగానో దు:ఖించాడు.


(10) రావణుడిని చంపాలని తపస్సు చేసిన రావణుడి మేనల్లుడు (శూర్పనఖ కొడుకు) ఎవరు ?


(అ) ఘంటాకర్ణుడు

(ఆ) జంబుమాలి

(ఇ) జంబుకుమారుడు✅

(ఈ) జంబుకేయుడు


వివరణ : - విద్యుజిహ్వుడు కాలకేయవంశానికి చెందినవాడు.ఇతని భార్య రావణసోదరి శూర్పనఖ. కాలకేయులతో జరిగిన యుద్ధంలో రావణునిచేత పొరబాటున విద్యుజిహ్వుడు మరణించాడు. అప్పుడు శూర్పనఖ ఆరునెలల గర్భిణి. శూర్పనఖ తనకు జరిగిన పతీవియోగం గురించి రావణుడిదగ్గర వాపోగా, రావణుడు మారీచసుబాహువులను తోడుగా ఇచ్చి, దండకారణ్యంలో హాయిగా బ్రతకమని చెప్పాడు. శూర్పనఖకు జన్మించినవాడే జంబుకుమారుడు. యుక్తవయస్కుడైన జంబూకుమారుడు తన మేనమామే తండ్రి మరణానికి కారణమని తెలుసుకొని, రావణసంహారానికి శక్తి కావాలని పంచవటిలో తపస్సు వెళ్ళాడు. అప్పటికే పంచవటిలో శ్రీరాముడు సీత, లక్ష్మణులతోవున్నాడు.ఒకరోజు దర్భలకోసం లక్ష్మణుడు ఆ అడవిలో బాగా గుబురుగా పెరిగిన కత్తితో నరుకుతాడు. ఆ పొదలలో తపంలోవున్న జంబూకుమారిడి తల తెగిపడుతుంది.అంతటి జంబూకుమారుడి జీవితం ముగుస్తుంది.

___________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

సంస్కృత మహాభాగవతం

 *10.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదమూడవ అధ్యాయము*


*భగవంతుడు హంసరూపమున సనకాది మహర్షులకు ఉపదేశించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*13.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రజాః|*


*జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః॥12711॥*


నాయనలారా! వాస్తవముగా జీవుడు నా స్వరూపమే. కాని అభినివేశకారణముగా చిత్తము గుణములయందు (విషయములయందు) ప్రవేశించును. సర్వదా వాటిని చింతించుటవలన గుణములు ఆ చిత్తమునందు లోతుగా పాదుకొనును. ఈ విధముగా గుణములు, చిత్తము, ఈ రెండును జీవుని దేహమునకు (ఉపాధికి) సంబంధించినవి.


*13.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*గుణేషు చావిశచ్చిత్తమభీక్ష్ణం గుణసేవయా|*


*గుణాశ్చ చిత్తప్రభవా మద్రూప ఉభయం త్యజేత్॥12712॥*


కావున ఆత్మకు చిత్తముతోగానీ, విషయములతోగానీ ఎట్టి సంబంధమూ లేదు. (గుణములచే నిర్మితమైనది స్థూలశరీరము. చిత్తము వలన ఏర్పడినది సూక్ష్మశరీరము. అనాత్మ పదార్థముల అభినివేశకారణముగా జీవుడు కర్మలయందు చిక్కుకొనును. వాసనామయ శరీరమునుగూడ నిర్మించుకొనును. వీటి అన్నింటికిని అజ్ఞానమే కారణము). విషయములను పదేపదే అనుభవించు చుండుటవలన చిత్తము ఆ విషయములయందు చొచ్చుకొనిపోవును. చిత్తముయొక్క సంకల్పవికల్పముల వలననే ఈ విషయములు ఉత్పన్నములగును. సాధకుడు తన చిత్తమును పెడదారి పట్టకుండగను, విషయముల చింతన చేయకుండగను నిరోధింపవలెను. నిరంతరము నాయందే చిత్తమును నిలిపి ఉంచవలెను. గుణములను నా స్వరూపముగా భావించి నా యందే అర్పించవలయును. ఈ విధముగా రెండింటీని నా యందే త్యజింపవలెను.


*13.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*జాగ్రత్స్వప్నః సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః|*


*తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః॥12713॥*


జాగ్రత్-స్వప్న-సుషుప్తి' అను మూడు అవస్థలును క్రమముగా సాత్త్విక, రాజస, తామస గుణములను అనుసరించుచుండెడి బుద్ధియొక్క వృత్తులు మాత్రమే. జీవుడు వీటి అన్నింటికి సాక్షిభూతుడు అనియు, ఈ మూడు ఆవస్థలకును అతీతుడు అనియును సిద్ధాంతరూపముగా ఆమోదింపబడినది.


*13.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*యర్హి సంసృతిబంధోఽయమాత్మనో గుణవృత్తిదః|*


*మయి తుర్యే స్థితో జహ్యాత్త్యాగస్తద్గుణచేతసామ్॥12714॥*


గుణముల వృత్తులయందు చిత్తము తిరుగాడుచున్నంతవరకు జీవునకు సంసారబంధము నివృత్తి కానేరదు. కావున, గుణములను, చిత్తమును ఈ రెండింటిని నాయందే త్యజించి, తురీయమగు నాయందు నిష్ఠుడై యుండవలెను.


*13.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*


*అహంకారకృతం బంధమాత్మనోఽర్థవిపర్యయమ్|*


*విద్వాన్ నిర్విద్య సంసారచింతాం తుర్యే స్థితస్త్యజేత్॥12715॥*


*నేను-నాది* అను అహంకారమే బంధములకు మూలము. అది జీవుని - పరమపురుషార్థములను దూరమొనర్చును. కావున విద్వాంసుడు (జ్ఞాని) తురీయావస్థయందు స్థితుడై బంధకారకమైన సంసారచింతను త్యజింపవలెను.


*13.30 (ముప్పదియవ శ్లోకము)*


*యావన్నానార్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః|*


*జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా॥12716॥*


*దేహమే ఆత్మ* యని భావించెడి నానాత్వభ్రమ తొలగనంతవరకు, జీవుడు మేల్కొనియున్నను అజ్ఞానమనెడి నిద్రలో మునిగి యున్నవాడే అగును. అజ్ఞాని స్వప్నజగత్తులో సంభవించునట్టి సుఖదుఃఖములను సత్యములని భావించునట్లు, జాగ్రదవస్థయందుగూడ క్షణికములైన సాంసారిక సుఖ దుఃఖములు యదార్థములని భ్రమించుచుండును.


*13.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*అసత్త్వాదాత్మనోఽన్యేషాం భావానాం తత్కృతా భిదా|*


*గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా॥12717॥*


వాస్తవముగా ఆత్మకు దప్ప అన్యమైన దేహాది నామరూపాత్మకమైన ప్రపంచమునకు మరి దేనికిని *ఉనికి* లేదు. కావున స్వప్నావస్థలోనున్న వాని క్రియలన్నియును మిథ్యలైనట్లే, భేదబుద్ధి కారణముగా కలుగునట్టి వర్ణాశ్రమాది భేదములు, స్వర్గాది ఫలములు, వాటి కారణములగు కర్మలు ఇవన్నియును మిథ్యలే. ఆత్మజ్ఞానము కలిగినంతనే ఈ నానాత్వభ్రమ తొలగిపోవును.


*13.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*యో జాగరే బహిరనుక్షణధర్మిణోఽర్థాన్ భుంక్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్|*


*స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః స్మృత్యన్వయాత్త్రిగుణవృత్తిదృగింద్రియేశః॥12718॥*


జాగ్రదవస్థయందు సమస్త ఇంద్రియములద్వారా బాహ్యముగ గోచరించెడి క్షణభంగురములైన పదార్థములను అన్నింటిని అనుభవించువాడు (విశ్వుడు) స్వప్నావస్థలో హృదయమునందే, జాగ్రదావస్థలో చూచిన పదార్థములను పోలినవాటి వలనే వాసనామయ విషయములను అనుభవించును (తైజసుడు). ఇక సుషుప్తి అవస్థలో ఆ విషయములను అన్నింటినీ ఉపసంహరించుకొని వాటి లయమును కూడా అనుభవించును (ప్రాజ్ఞుడు). ఈ ముడింటిని అనుభవించినది ఒక్కడే. జాగ్రదవస్థయొక్క ఇంద్రియములకు, స్వప్నావస్థలోని మనస్సునకు, సుషుప్తియొక్క సంస్కరింపబడిన బుద్ధికి కూడా అతడే స్వామి. ఏలనన, త్రిగుణాత్మకములగు ఈ త్రివిధ అవస్థలకు అతడే సాక్షిగా ఉండును. స్వప్నము చూసిన నేనే, గాఢనిద్ర (సుషుప్తి) లో ఉన్నాను. ప్రస్తుతము మెలకువతో (జాగ్రదవస్థలో) ఉన్నది కూడా నేనే - అను ఇట్టి స్మృతి యొక్క బలమువలన ఒకేఒక ఆత్మ అవస్థలన్నింటిలోనూ ఉండునని స్పష్టముగ ఋజువగుచున్నది.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదమూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*445వ నామ మంత్రము* 10.10.2021


*ఓం మత్యై నమః*


అనంతకోటి జీవరాశులలో మతి (బుద్ధి) స్వరూపిణిగా ఉన్న పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మతిః* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం మత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకులకు ఆ తల్లి చక్కని బుద్ధిని (మతిని) కలుగజేసి, అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదను సంప్రాప్తింపజేసికొను దిశగా వారి సాధనను కొనసాగునటులు అనుగ్రహించును.


*యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:॥*


'అనంతకోటి జీవరాశులలో బుద్ధిరూపములో విలసిల్లు పరమేశ్వరికి నమస్కరిస్తున్నాను' 


'వేదప్రమాణమునందు ఆసక్తిగలదియు, మంగళప్రదమైనదియు, శ్రేష్ఠమగు అనుభవరూపమగు ఏ మతి (బుద్ధి) గలదో అదియే శివా (పార్వతీ) స్వరూపురాలు. ఆమె కేశవుడు మొదలగువారిచే సేవింపబడుతున్నది. ఆమె అత్యంత కైవల్య సుఖమును కలిగించునది. అటువంటి దేవికి నమస్కరించుచున్నాను' అని సూతసంహితయందు గలదు.


 అనంతకోటి జీవరాశులలో ఆ పరమేశ్వరి బుద్ధిరూపంలో ఉన్నది గనుకనే కంటికి దృశ్యశక్తి, నాసికకు ఘ్రాణశక్తి, నాలుకకు రసశక్తి, చర్మానికి స్పర్శశక్తి, చెవులకు శ్రవణశక్తి - ఇలా ఆయా ఇంద్రియాలలో ఆయాశక్తుల రూపాలలో ఉంటూ ఇంద్రియములను పనిచేయిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మనసునందు బుద్ధిరూపంలో ఉన్నప్పుడు ఆయా జీవుల కర్మవాసనలననుసరించి ప్రవర్తించుట జరుగుతుంది.


సాధకులు అంతర్ముఖంగా సాధనచేయునపుడు జీవాత్మ, పరమాత్మల ఐక్యత అను అద్వైతభావనాజ్ఞానము కలిగించి సాధనాపటుత్వము ద్వారా పరబ్రహ్మతత్త్వమును పొందు దిశగా సాధనకొనసాగింపజేయును గనుకనే పరమేశ్వరి *మతిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మత్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కలిసుందాం

 *కలిసుందాం..రా…!!!*

          

*మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై... సంవత్సరాలు బ్రతుకుతాం.*


*కావున కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!*


*పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న. బంధుత్వాలు తెంచుకోవడం నిముషం పడుతుంది. అదే నిలుపుకోవాలంటే?*


*తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని, తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్ళు తాము సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్థులు కూడబెట్టి తమపిల్లలకు ఇస్తే, తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే, కొందరు, తమ తల్లిదండ్రులు కాలం చేశాక, మరికొందరు వివిధ రకాల కారణాలతో రక్త సంబంధీకులందరూ ఒకరికొకరు శాశ్వతంగా దూరమవుతున్నారు.*


*బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలుకూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తామూ అశాంతితో జీవిస్తూ తనవారిని కూడా అశాంతి పాలు చేస్తున్నారు.*


*ఎవరి కోసం..?*

*ఎందుకోసం..??*

*దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..???*


*జీవితాంతం ఒకేరక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై, ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా పిల్చుకోకుండా, హాజరుకాకుండా, చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేని శోకతప్తులై గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు.*


*కొంతమంది తమ తల్లిదండ్రులనుకూడా ఈ ఆస్థిపంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో కన్నవారు పడే వేదన వర్ణనాతీతం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?*


*పంతాలు, పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకం*


*దీనికి కావల్సింది ప్రశాంతంగా ఆలోచించడం, విచక్షణ, పట్టుదలలు సడలించుకోవడం. ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి...*


*ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు.*


*ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే? కాబట్టి ఆలోచించండి, అందర్నీ కలుపుకుని, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగాలు, ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..*


      🌹లోకాసమస్త సుఖినోభవంతుః🌹🙏🙏🙏

*ప్రతీది నాకు ఆదర్శమే

 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

 

*శుభోదయం*


*ప్రతీది నాకు ఆదర్శమే* 

.................................................


✍పడగొట్టిన వాడి పైన పగ పట్టకుండా దారం దారం పోగేసుకొని మరో గూడు కట్టుకొనే 🕸 *సాలె పురుగు* నాకు ఆదర్శం.


✍ఎన్ని సార్లు పడినా పౌరుషంతో మళ్ళీ లేసే 🌊 *అలలు* నాకు ఆదర్శం.


✍మొలకెత్తడం కోసం భూమిని సైతం చీల్చుకొని వచ్చే 🌱 *మొక్క* నాకు ఆదర్శం.


✍ఎదురుగా ఏ అడ్డంకులున్నా లక్ష్యం వైపే దూసుకెళ్లే 🏹 *బాణం* నాకు ఆదర్శం.


✍ప్రత్యర్ధి పెద్దదైన సరే సూర్యుడిని సైతం కప్పి ఉంచే ⛅ *మేఘాలు* నాకు ఆదర్శం.


✍అసాధ్యం అని తెలిసినా ఆకాశాన్ని అందుకోవాలని ప్రయత్నించే 🔶 *గాలిపటం* నాకు ఆదర్శం.


✍తానున్న పరిసరాల చుట్టూ పరిమళాలు నింపే 🌹 *పువ్వు* నాకు ఆదర్శం.


✍ఎంతటి వేడిని అయిన తాను భరిస్తూ మనకు మటుకు చల్లని నీడనిచ్చే🌴 *చెట్టు* నాకు ఆదర్శం.


✍ఎప్పుడు విడిపోయిన ఇద్దర్ని కలపడానికి తాపత్రయ పడే 📍 *సూది* నాకు ఆదర్శం.


✍తన మూలంగా లోకం చీకటి అవకూడదు అని రోజంతా వెలుగునిచ్చే 🌞 *సూర్యుడు* నాకు ఆదర్శం.


✍తను ఎంత చిన్నదైనా తన వంతు భూదాహాన్ని తీర్చే 💧 *చినుకు* నాకు ఆదర్శం.


✍చుట్టూ చీకటే ఉన్నా చల్లని వెన్నెల పంచే 🌝 *చంద్రుడు* నాకు ఆదర్శం.


✍ఒక్క సారి అన్నం పెడితే జన్మంత విశ్వాసంగా ఉండే 🐩 *శునకం* నాకు ఆదర్శం.


✍జీవించేది కొంత కాలమైన అనుక్షణం ఆనందంగా ఉండే 🦋 *సీతాకోకచిలుక* నాకు ఆదర్శం.


✍ప్రతి దానిలో మంచిని మాత్రమే గ్రహించాలని చెప్తూ పాలనీటి మిశ్రమంలో పాలను మాత్రమే తాగే *హంస* నాకు ఆదర్శం.


🙏🌹🙏🌹

బాలా త్రిపుర సుందరి

 బాలా త్రిపుర సుందరి అమ్మవారు అనగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. మన తెలుగు నేలన ఈ మధ్యకాలంలో నడయాడిన గొప్ప బాల ఉపాసకుల లో తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు అగ్రగణ్యులు... వారి జీవితంలోని ఒక సంఘటన.


*దుష్టులపై కూడా సద్గరుని అనుగ్రహం‌*


*దొంగలు దొరలయ్యారు*


ఒకసారి శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కొన్ని రోజులు ఖాజీపాలెంలో రాత్రి వేళ పురాణమును చెప్పి ప్రతిరోజూ అర్థరాత్రి సమయాన కాలినడకన చందోలు చేరుతుండేవారు.


అది అడవి మార్గం. ఆ మార్గంలో దోపిడిదొంగలు అధికం. అనుకున్నట్లే శాస్త్రిగారిని దొంగలు వెంబడించసాగారు. శాస్త్రిగారు ముందు నడుస్తుంటే, దొంగలు వెనుక కర్రలతో పరుగులు పెడుతూ ఉన్నారు. ఆయన నడక మాములుగా ఉంటే, ఆయనను దోచుకునేందుకు సిద్దమైన దొంగలు పరుగెడుత్తుతూనే ఉన్నారు. కానీ ఆయనను అందుకోలేక పోతున్నారు.


చివరకు ఒకచోట శాస్త్రిగారు ఆగి వెనుదిరిగి " ఎవరు మీరు?" అని ప్రశ్నించారు.


వెంటనే వారందరూ కర్రలు క్రింద పడేసి నేలమీద సాగిలాపడి, లెంపలు వేసుకుంటూ "అయ్యా! మీ ఒంటిపై తళతళలాడుతున్న ఆభరణాలు దోచుకుందామని దుర్బుద్ధితో వెంబడించాము. మేము దొంగలం. కానీ అదేమి చిత్తమో, మీ మహిమోగానీ, ఏ అడుగుకు ఆ అడుగులో మిమ్ము దోచుకుందామని మైలుదూరము పైగా వెంబడించాము. మిమ్మల్ని కేకలు వేసి భయపెట్టేందుకు మాకు మాట పెగల్లేదు. చేతుల్లో ఉన్న కర్రలు, కత్తులతో మీపై దాడి చేద్దామంటే చేతులు రావు. అసలు ఏమీ తోచకుండానే ఇంత వరకు వెంబడించాము. తమరు దయతలచి క్షమిస్తే మా దారి మేము పోతాము" అని దీనంగా పలికారు. 


"మీరు ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా గౌరవముగా జీవిస్తే నాకు సంతోషంగా ఉంటుంది" అని పలికారు శాస్త్రిగారు.


అంతట ఆ దొంగలు " దొరవారూ! మీ ఆన మేరకు మేమందరం నేటితో ఈ నీచవృత్తి వదిలేస్తాము. మా చుట్టుప్రక్కల గల దారిదోపిడీగాండ్లందరినీ హెచ్చరిస్తాము. మిమ్మల్ని కన్నెత్తి చూచేవాడుండడు. ప్రొద్దుపోయింది. పోయి రండి" అని గౌరవముగా వంగి నమస్కారాలు చేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ దోపిడీ దొంగలు.


ఆ దొంగలు దోపిడీలు మానుకొని పనులు చేసుకుని జీవించసాగారు.

ఆ అమ్మాయి లలితాదేవి,వారింట్లో తిరుగుతూ ఆయన కోసం వారింటికి వచ్చిన వారికి నాన్నగారు జపంలో ఉన్నారు అని చెప్పేది.

*సద్గురు కృప మాసపత్రిక నుంచి*


*2018 మే సంచిక*

 రావణుడిని చంపాలనుకొన్న శూర్పనఖ కుమారుడెవరు ?

_________________________


(1) కడుపులో అమృతభాండం కలవాడెవరు ?


(అ) విష్ణువు

(ఆ) వశిష్టుడు

(ఇ) రావణుడు

(ఈ) నలకుబరుడు


(2) శ్రీరాముడి సోదరి పేరేమిటి ?


(అ) దశరథి

(ఆ) శాంత

(ఇ) సుకన్య

(ఈ) రూప


(3) "లక్షణ" దుర్యోధనుని కూతురు.లక్షణను పెండ్లాడిన శ్రీకృష్ణుని కొడుకెవరు ?


(అ) సాంబుడు

(ఆ) ప్రద్యుమ్నుడు

(ఇ) సుధేష్ణుడు

(ఈ) చారుచంద్రుడు


(4) గంధమాదనపర్వతం ఎక్కడుండేది ?


(అ) కిష్కింధ

(ఆ) దండకారణ్యం

(ఇ) నేటి గోండ్వానా ప్రాంతం

(ఈ) శ్రీలంక


(5) కాశీవిశ్వేశ్వరుని సతి పేరేమిటి ?


(అ) అపర్ణ

(ఆ) మీనాక్షి

(ఇ) కాత్యాయని

(ఈ) అన్నపూర్ణ


(6) ఇంద్రుడి ఉద్యానవనం పేరేమిటి ?


(అ) ఇంద్రవనం

(ఆ) బృందావనం

(ఇ) నందనవనం

(ఈ) పారిజాతవనం


(7) కాశీలో ఒకతను హరిశ్చంద్రమహరాజును దాసునిగా పొందాడు. ఎవరతను ?


(అ) కాలకౌశికుడు

(ఆ) వీరదాసుడు

(ఇ) కాలకౌక్షేయుడు

(ఈ) వీరబాహువు


(8) శ్రీకృష్ణుడు చంపిన కవలయాపీడము ఏమిటి ?


(అ) బకం

(అ) రాక్షసి

(ఇ) సర్పం

(ఈ) ఏనుగు


(9) ద్రౌపతి వస్త్రాపహరణం ధర్మసమ్మతం కాదని వాదించిన దుర్యోధనుడి తమ్ముడెవరు ?


(అ) వికర్ణుడు

(ఆ) దుశ్చలుడు

(ఇ) విరోచనుడు

(ఈ) వికర్ణకుడు


(10) రావణుడిని చంపాలని తపస్సు చేసిన రావణుడి మేనల్లుడు (శూర్పనఖ కొడుకు) ఎవరు ?


(అ) ఘంటాకర్ణుడు

(ఆ) జంబుమాలి

(ఇ) జంబుకుమారుడు

(ఈ) జంబుకేయుడు

___________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

మంత్ర పుష్పం

 *మంత్ర పుష్పం - సందర్భం*

                ➖➖➖✍️


*హిందూ ఆలయాలలో పూజల చివరిలో పూజారి గారు అక్కడ ఉన్న అందరికి తలో ఒక పుష్పం ఇచ్చి వేదం లోని 'మంత్రపుష్పం' చదువుతారు.*


*ఆ తరువాత ఆ పుష్పాలను భక్తుల నుండి స్వీకరించి గర్భగుడిలోని దైవానికి సమర్పిస్తారు.* 


*వేదంలో భాగమైనది మంత్ర పుష్పం. ఇది దైవం గురించి దైవ విశిష్టతను, భగవంతుడి యొక్క ప్రాతినిధ్యం గురించి తెలుపుతుంది.* 


*మంత్రపుష్పం చదవనిదే, ఏ పూజ, పునస్కారం పరిసమాప్తి కాదు. మంత్రపుష్పం చివరిలో చదవాల్సిందే తప్పనిసరిగా.*


*మూలం : వేదం.*

 

*మంత్ర పుష్పం - 1.*


*ఓం ధాతా పురస్తాద్య ముదా జహార*

*శక్రః ప్రవిద్వాన్ ప్రదిశః చతస్రః*

*తమేవం విద్వానమృతమిహ భవతి*

*నాన్యః పంథా అయనాయ విద్యతే*


*తెలుగు భావం:*

*అన్ని దిక్కుల నుండి రక్షించువానిని ముందు బ్రహ్మ పూజించి సుఖించెను.*

 

*‘ఆ ఆది దైవమును తెలిసిన చాలును అదే అందరికి అమృత మార్గము వేరేది లేద’ని ఇంద్రుడు ప్రకటించెను.* 

 


*మంత్ర పుష్పం - 2.*


*సహస్ర శీర్షం దేవం*

*విశ్వాక్షం విశ్వశంభువం*

*విశ్వం నారాయణం దేవం*

*అక్షరం పరమం పదం*


*తెలుగు భావం:* 

 *అంతటా తలలున్న దైవము* 

*అంతటా కనులున్న దైవము*

*అన్ని లోకాల శుభ దైవము*

*విశ్వమంతానిండిన దైవము*    

*నశించని నారాయణుడే*

*ముక్తి నీయు పరంధాముడే*


*మంత్ర పుష్పం - 3.*


*విశ్వతః పరమాన్నిత్యమ్*

*విశ్వం నారాయణగ్ం హరిమ్*

*విశ్వమే వేదం పురుషస్త*

 *ద్విశ్వ ముపజీవతి*


*తెలుగు. భావం:*

*విశ్వము కన్నా ఉన్నతుడు*

*అందరిలోనుండు ఆత్మయు*

*శాశ్వత పోషకుడు హరే.*

*సర్వాత్మడు పరమాత్ముడే.*

*ఈ విశ్వ లోకాల కారకుడోయి*

*ఆ దైవమే విశ్వానికి తోడోయి.*

 

*మంత్రపుష్పం - 4.*


*పతిం విశ్వస్యాత్యే శ్వరగ్ం*

*శాశ్వతగ్ంశివమచ్యుతమ్*

*నారాయణం మహాజ్ఞ్యేయమ్*

*విశ్వాత్మానం పరాయణం*


*తెలుగు భావం:*

*పతిలా పోషించువాడు*

*లోకాలకు ఈశ్వరుడు*

*శాశ్వితుడు శుభకరుడు*

*సకలలోక ఉన్నతుడు*

*సకల జీవ నాయకుడు*

*అతడు నారాయణుడు*

*అతడు మహా దేవుడు *

*లోకమంత ఆత్మ వాడు*

*పూజింప తగు దేవుడు*

 

*మంత్ర పుష్పం - 5.*


*నారాయణ పరో*

*జ్యోతి రాత్మా*

 *నారాయణః పరః*

*నారాయణ పరమ్*

*బ్రహ్మ తత్వం*

*నారాయణః పరః*

*నారాయణ పరో*

*ధ్యాతా ధ్యానం*

*నారాయణః పరః*


*తెలుగు భావం:*


*నారాయణుడే పరమలోకము*

*నారాయణుడే జ్యోతిరూపము*

 *నారాయణుడే ఆత్మ రూపము*

*నారాయణుడే పరబ్రహ్మము*

*నారాయణునే ధ్యానిoచుము*✍️


        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                      🌷🙏🌷

relation of Hinduism with science

 : We get 50% of molecular DNA from the mother and 50% from the father.

But we get 100% mitochondrial DNA from the mother. Mitochondria and their DNA only come from the mother to the baby. Mitochondria produce ATP. ATP is the source of energy in our body. So, we receive power from our mother. And our mother gets it from her mother and our father also gets it from his mother.


Do you now realize the relation of Hinduism with science that the god of power is mother - Adi Shakti or Maa Shakti, our mother. Our scientific understanding over the ages and years very clear. 

All the Vedic pujas and yagnas and the perfect mantra of Maa Durga work on a subtle level to excite and empower us. 


*Wish you and your family a very happy Navratri once again.* 🙏🏻

[: The contribution of father is only one cell that to half of chromosomes rest of all including blood bones skine strength is the gift of mother


Don't neglect mother

Without mother no existence


Respect mother love mother

god of power

 We get 50% of molecular DNA from the mother and 50% from the father.

But we get 100% mitochondrial DNA from the mother. Mitochondria and their DNA only come from the mother to the baby. Mitochondria produce ATP. ATP is the source of energy in our body. So, we receive power from our mother. And our mother gets it from her mother and our father also gets it from his mother.


Do you now realize the relation of Hinduism with science that the god of power is mother - Adi Shakti or Maa Shakti, our mother. Our scientific understanding over the ages and years very clear. 

All the Vedic pujas and yagnas and the perfect mantra of Maa Durga work on a subtle level to excite and empower us. 


*Wish you and your family a very happy Navratri once again.* 🙏🏻