24, జనవరి 2026, శనివారం

దానం అదొక యోగం.

 దానం అదొక యోగం.... ఎంత సిరులు ఉన్న, ఆస్తులు ఉన్న, మేడలు ఉన్న, భూములు ఉన్న, దాన గుణము లేకపోతే మానవ జన్మ సున్నా. 

అందుకనే పెద్దలు అంటారు 

వంద మందిలో ఒక శూరుడు జన్మిస్తాడు....

వెయ్యి మందిలో ఒక పండితుడు జన్మిస్తాడు....

లక్ష మందిలో ఒక వక్త జన్మిస్తాడు...

కానీ కోటి మందిలో ఒక దానవుడు జన్మిస్తాడు....

💐 దానం చేయాలన్న మొదట దాన గుణం కలిగి ఉండాలి... ఆ తర్వాత దానిపై శ్రద్ధ ఉండాలి, ఆపై తాను చేసే దానం పై యోగ్యత కలిగి... జ్ఞానం కలిగి ఉండాలి.

🙏 భర్తృహరి అంటాడు 

దానము వల్ల చేతులు ప్రకాశిస్తాయని....

🌷 మనుషులకే కాదు ప్రకృతిలో వృక్ష ,పశుపక్షాదుల ,జీవజాలానికి సేవ చేయడం కూడా దానమేఅని కూడా అంటారు 

దానం లోని రకాలు 

ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. 

🌹అసూయ లేకుండా ఇచ్చేదానం..... ధర్మదానం

🌹 యాచకులు ప్రశంసిస్తే.... అర్థదానం

🌹 దానం చేయకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేదానం... భయ దానం 

🌹 ఇష్టమైన వ్యక్తికి ఇస్తే... దానిని కామదానం 

🌹 పేదవాడికి జాలితో ఇచ్చేది... కారుణ్య దానం 

నీ శక్తి కొద్ది తోటి వారికి ఎంతోకొంత ఇవ్వటంలో ఎంతో ఆనందం ఉంటుంది...

👏 నీతి..... చాలామంది అనుకుంటారు తీసుకోవడంలో ఆనందం ఉంటుందని.... అది సరైనది కాదు ఇవ్వటంలోని ఆనందము , పరమానందము ఉంటుంది. 

దానం చేసే వాడి చెయ్యి ఎప్పుడూ పై చేయి గానే ఉంటుంది....

🙏 ధన్యవాదములు.....


Venkateswara Rao

ఇదినిజం

  *“క్షమించాలి ఇదినిజం..!”*

  అది యూరప్,అమెరికా వాళ్ళ అసహాయత..!ఇది మన అనంతమైన అజ్ఞానం!✅ అదేమిటో తెలుసుకుందాం. 


 *1.  తాజా ఆహారం అందుబాటులో లేక,    వండుకోవడానికి సమయం కేటాయించుకో లేక,    ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ    దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద,    బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన  ఖర్మపట్టడం అమెరికా, యూరప్  వాళ్ళ నిస్సహాయత..!


👉 56 రకాల భోజన వంటకాలను పక్కనపెట్టి     ఎవడో ఏనాడో వండి పెట్టిన    రొట్టెని కాలవలో పారెయ్యకుండా,  ఫ్రిజ్  లో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹. 400 / - పెట్టి  మరీ తినడం, ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం..!!!✅



*2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక,   కోట్లూ సూట్లూ వేసుకోవడం ‘వారి నిస్సహాయత..!’


👉వేసవి వేడిలో చెమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు       వెర్రిగా    కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం…!!!✅



*3. తాజా భోజనం    వండేవాళ్ళు లేక ఫ్రిజ్ వాడడం,   అమెరికా, యూరోప్ వాళ్ళ నిస్సహాయత..!


👉 ప్రతిరోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజులు కూరగాయలు ఫ్రీజ్ లో     కుక్కి కుక్కి   అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం..!!!✅



*4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, 

వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో     ఏవేవో మందులు తయారు చేయడం,  వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి  వేరేవేరే రోగాల పాలవ్వడం ‘వారి నిస్సహాయత..!’


👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం     తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా...         కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం..   ‘మన అజ్ఞానం..!!

         -క్షమించాలి ఇదినిజం..!!!✅



*5. సరిపడ ధాన్యం లేక    పంటలు పండక   పళ్ళూ కాయలూ  దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని, నక్కల్ని కూడా చంపి తినడం.. ‘వాళ్ళ నిస్సహాయత...!’


👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా    వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం ‘మన అజ్ఞానం..!!’

       -క్షమించాలి ఇదినిజం!!!✅



*6. కొబ్బరి నీళ్ళూ,  మామిడి రసాలు, బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం ‘వారి నిస్సహాయత...!’

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం ‘మన అజ్ఞానం..!!’

          -క్షమించాలి ఇదినిజం!!!✅



*7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని (PMతో)తిరగడం, 

చలి వలన స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం.. 

 ‘వాళ్ళ నిస్సహాయత...!’

👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  తుడుచుకొని, సెంటేసుకుని (PM)తో తిరగడం .. ‘మన అజ్ఞానం..!!’

        -క్షమించాలి ఇదినిజం!!!✅



*8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం ‘వాళ్ళ బుద్దిహీనత!

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅



*10. చెట్లు పెంచుకోవడానికి   ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు, కేన్సర్లూ  తెచ్చుకోవడం ’వాళ్ళ నిస్సహాయత...!

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా 

ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం ‘మన అజ్ఞానం!!

          -క్షమించాలి ఇదినిజం!!!✅


*11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత ‘మన అజ్ఞానం!!

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం ‘వాళ్ళ నిస్సహాయత...!

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం ‘మన అనంతమైన అజ్ఞానం!! -మరోసారి మళ్ళీ క్షమించాలి. ఇదినిజం!!!✅


*13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం,

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం మన సంస్కారం.  మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం ‘మన అజ్ఞానం.!!      

         -క్షమించాలి ఇదినిజం!!!✅


*14. విపరీతమైన చలికి తట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతో తిరగడం ‘వాళ్ళ నిస్సహాయత.

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం ‘మన అజ్ఞానం!!

      -క్షమించాలి ఇదినిజం!!!✅


 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది, నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది ‘మన అజ్ఞానం!!

       -క్షమించాలి ఇదినిజం!!!✅


జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం..!


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదిలేసుకోవడం మన అజ్ఞానం!

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 కావున*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...!కానీ గుడ్డిగా...మోజుతో

వెర్రిగా...అనాలోచనతో...అనుకరిస్తే...

పోతాం! 

ఏం వచ్చి పోతాం? కరోనా లాంటివి వచ్చి పోతాం!. ✍️

.     *రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పుదాం

          ➖▪️➖

సరస్వతీ ఆవిర్భావ కథ

  సరస్వతీ ఆవిర్భావ కథ


ఒకానొకప్పుడు ఈ చరాచర జగత్తులో ఈరోజు మనం మాట్లాడుకుంటున్న వాక్కు సరిగ్గా లేదు. స్పష్టతలేదు. వ్యాకరణాలు లేవు. ఆకాలంలో లోకమంతా సైగల మీద ఎక్కువగా ఆధారపడేది. అప్పుడు త్రిమూర్తులూ, తక్కినటువంటి దేవతలు కలిసి అమ్మవారిని భక్తితో ప్రార్థించారు. అమ్మా! మాకు స్పష్టమైన వాక్కు కావాలి. వాక్కుకు వ్యాకరణం కావాలి. అటువంటి వ్యాకరణాది విద్యలను ఇచ్చేటువంటి ఒక శక్తిని, ఒక దేవతని మాకు ప్రసాదించు అని జగదంబని ప్రార్థించారు. అప్పుడు జగదంబ ఈశ్వరుడి శరీరం నుంచి ఒక సుందరీమణిని సృష్టించింది. ఆవిడ తెల్లగా ఉంది, తెల్లని చీర కట్టుకుంది. చేతిలో వీణ పట్టుకుంది నాలుగు చేతులతో తెల్ల తామర పువ్వులతో, హంసని వాహనంగా చేసుకుని పుట్టింది. ఆవిడే మహాసరస్వతి.ఆ తల్లి పుట్టింది మూలా నక్షత్రం, శరన్నవరాత్రులు ఏడవ రోజు పుట్టింది. (కానీ మూలా నక్షత్రం ఏరోజు ఉంటే ఆరోజు పూజ చేస్తున్నాం ప్రాచీన కాలంలో మాత్రం శరన్నవరాత్రుల్లో అమ్మవారు మూలా నక్షత్రంలో ఒక రూపం ధరించింది )కానీ పుట్టింది మాఘ శుక్ల పంచమి,కాని మూల నక్షత్రం నాడు లోక శ్రేయస్సు కోసం ఒక రూపం ధరించింది. అవిడే మహా సరస్వతి, ఆ సరస్వతీ దేవిని కృష్ణుడు గోలోకంలో కవచంతో స్తోత్రం చేసి పూజించారు. అమ్మవారి యొక్క తెల్లని విగ్రహం తయారు చేసి, తెల్లని వస్త్రం సమర్పించి, 14 శ్లోకాలతో అమ్మని అర్పించాడు.5 14 శ్లోకాలు శ్రీకృష్ణుడే స్వయంగా రాశారు కాబట్టి చాలా గొప్పవి. దానికి సరస్వతీ కవచం అని పేరు. (ఆదౌ సరస్వతీ పూజా శ్రీకృష్ణన వినిర్మితా యత్వసాదాత్ మునిశ్రేష్ట మూరోభవతి పండిత:.) మొట్ట మొదట సరస్వతీ దేవి పూజని గోలోకంలో శ్రీకృష్ణ పరమాత్మ తయారు చేసారు. ఆ సరస్వతీ పూజా విధానం, ఆ కవచం చదివి, అమ్మవారు సరస్వతిని పూజిస్తే మూర్ఖుడు కూడా పండితుడవుతాడు. అటువంటి కవచం శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు తప్పక చదవాలి. యాజ్ఞవల్క్యుడు గురు ద్రోహం చేసి తన విద్యలన్నీ కోల్పోయి, ఈ సరస్వతీ కవచం పఠించి, మళ్లీ తిరిగి విద్యలను పొందగలిగాడు. సరస్వతీ దేవి యొక్క విగ్రహాన్ని తెల్లని పువ్వులతో, తెల్లని వస్త్రంతో, తెల్లని గంధంతో పూజించాలి. ఈరోజు ఈ సరస్వతీ కవచం యధాశక్తి పారాయణం చేసి పిల్లలచేత చేయిస్తే అందులో " ఐం" అనే ఒక బీజం చాలాసార్లు అందులో మనకు కనబడుతుంది, అది వాక్ బీజం. ఆ వాక్ బీజం వినడం వల్ల ఎందుకూ పనికిరాని వాడు కూడా పండితుడు అవుతాడు. ఒకప్పుడు వాల్మీకి మహర్షి రామాయణం రాసేముందు, ఇంత గొప్ప రామాయణం అనే గ్రంథాన్ని లోకానికి ఇవ్వాలంటే సరస్వతీ కటాక్షం కావాలని, మూలా నక్షత్రం రోజున సరస్వతి ప్రతిమను పెట్టుకుని, ఆవు పాలతో అభిషేకించి. తెల్లని పువ్వులతో పూజించి, సరస్వతీ కవచం చదివాడు. దేవీభాగవతంలో తొమ్మిదవ స్కంధములో ఉంటుంది. వాల్మీకి మహర్షి ఈ కవచం పారాయణం చేసి ఆ పాండిత్యంతో రామాయణం రాసాడు. వేదవ్యాస మహర్షి కూడా సరస్వతీ కవచాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి, అమ్మ పాండిత్యం ఇవ్వగా, అమ్మవారి అనుగ్రహంతో, భాగవతం భారతం అనే 2 ఉద్గ్రంధాలు లోకానికి ఇవ్వగలిగారు. పూర్వం సత్యవ్రతుడు అనేవాడు ఈ సరస్వతీ కవచం ప్రభావంతో 500 శ్లోకాలు రాయగలిగారు.


గురు ద్రోహం చేసిన పాపం నుండి బయటపడటానికి మళ్లీ ఒక గురువుని ఆశ్రయించి సరస్వతీ కవచం ఉపదేశం తీసుకున్న వారు మాత్రమే గురు ద్రోహ పాపం నుండి బయటపడగలుగుతాడు. అలా బయటపడి యాజ్ఞవల్క్యుడు పండితుడయ్యాడు.


ఈ విధంగా  అమ్మవారిని పూజించి కథ విని భక్తులందరూ కూడా అనేక శుభాలు పొందాలని గురువుగారు మంగళా శాసనము చేసారు. 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻


**🙏సేకరణ 🙏**

ద్వాదశ రాశి ఫలాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏


జనవరి 24, 2026 (శనివారం) నాటి ద్వాదశ రాశి ఫలాలు ఇక్కడ ఉన్నాయి. ఈ రోజు శనివారం కావడం వల్ల శని ప్రభావం ఉన్న రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది.


​మేషం (Aries)


​ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

---------------------------------------


​వృషభం (Taurus)


​చాలా ఉత్సాహంగా ఉంటారు. పాత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

---------------------------------------


​మిథునం (Gemini)


​పనుల్లో కొంచెం జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి.

-------------------------------------


​కర్కాటకం (Cancer)


​శుభవార్తలు వింటారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి.

----------------------------------------


​సింహం (Leo)


​ధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది. కొత్త పెట్టుబడులకు ఈ రోజు అనుకూలం. సంతాన పరంగా సంతోషకరమైన వార్తలు వింటారు.

----------------------------------------


​కన్య (Virgo)


​ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.

------------------------------------


​తుల (Libra)


​మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. పని భారం ఎక్కువగా ఉండవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. శనివారం కాబట్టి ఆంజనేయ స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

-------------------------------------


​వృశ్చికం (Scorpio)


​అదృష్టం కలిసి వస్తుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. మిత్రుల సహకారం అందుతుంది. గృహ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

------------------------------------


​ధనుస్సు (Sagittarius)


​మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

-------------------------------------


​మకరం (Capricorn)


​చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండండి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

----------------------------------------


​కుంభం (Aquarius)


​వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి.

----------------------------------------


​మీనం (Pisces)


​ఆదాయ మార్గాలు పెరుగుతాయి. శుభ కార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ముఖ్యమైన డాక్యుమెంట్లను జాగ్రత్తగా చూసుకోండి.

​-------------------------------------

అవస్థా త్రయం --- తురీయావస్తా

 అవస్థా త్రయం --- తురీయావస్తా 🙏

        

ముందుగా మనస్సు స్థితి ఎల్లావుంటుంది చూద్దాము

ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ధ్యానం చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా మరొక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాకుండా ఉందంటే అది నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది.

మనసు చాలా చంచలమైంది. దానిని నిశ్చలం చేయుటకు ఎన్ని పాట్లు పడాలి. ఆలోచనల పరంపరలో సంచారిస్తూ ఉంటుంది.


మనసు, బుద్ది, అహంకారం, చిత్తం ఇది అంతరంగ చతుష్టయం 


శ్రీచక్రార్చనలో మనో బుద్ది చిత్త అహంకారాత్మక అని చతుర్ధావరణలో వస్తుంది. అసలు ఏది మనస్సు? ఏది బుద్ది? ఏది చిత్తం? ఏది అహంకారం తెలుసుకోవాలి 

 అహంకార మమకారాలన్న సంకెళ్లలో మనిషిని బంధించాలన్నా, వాటి నుండి విముక్తి కలిగించాలన్నా, మనసే కారణం’ అంటోంది అమృత బిందూపనిషత్తు. మనిషి ఈ జీవితంలో ఏ కార్యకలాపాల్ని కొన సాగించాలన్నా, ఏ వ్యవహారాల్ని నిర్వహించాలన్నా, ఆతనికి ఉన్న సాధనాలు రెండే రెండు. పంచ కర్మేంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రి యాలతో కూడిన శరీరం అందులో మొదటి బహిరంగ సాధనం. రెండవది అంతరంగం అనబడే సాధనం. ఈ అంతరంగం వాస్తవంగా ఒకటే అయినా, వృత్తి భేదాన్ని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని పిలుస్తుంటారు.


 ఒకే వ్యక్తి ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఉద్యోగి అనీ, ఇంటికి వచ్చినప్పుడు భార్యకు భర్త అనీ, పుత్రునికి తండ్రి అనీ, సహచరునకు మిత్రుడనీ, వ్యవహారాన్ని బట్టి వివిధంగా ఎలా పిలవబడతాడో, అలాగే అంత రంగమే డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు, ఈ పని చేయాలా ఆ పని చేయాలా, అసలు ఏ పనీ చేయకుండా ఉండాలా అని ఆలోచించేటప్పుడు మనస్సు అనీఅంటాము , ఈ పనినే చేద్దాం అని నిశ్చయించుకున్నప్పుడు బుద్ధి అనీఅంటాము , ఆ చేసిన పనిని గుర్తు ఉంచుకునేటప్పుడు చిత్తమనీ అంటాము , ఆ పని ఫలితాన్ని అనుభ వించేటప్పుడు అహంకారమనీ పిలుస్తారు. ఈ అంతరంగం అధీ నంలోనే, బహిరంగ సాధనమైన శరీరం స్పందిస్తుంది

మనసు, బుద్ధి, అహంకారంo, చిత్తం-ఈ నాలుగూ మనసులోని విభిన్న స్థితులు. అవి ఏమిటో వాటి పనులేమిటో చూద్దాం! 


మనసు అన్నది ఇక్కడ చేతన మనసును సూచిస్తుంది. మనం కన్ను, చెవి, ముక్కు మొదలగు ఇంద్రియాలద్వారా బాహ్య జగత్తును అనుభవించటం ఈ మనసు ద్వారానే జరుగుతుంది. ఇంద్రియాలు పంపే సమాచారాన్ని సేకరించి ఈ మనసే మన సుఖ లేక దుఃఖ అనుభూతులకు హేతువు అవుతుంది.


మనసు యొక్క నిర్ణయాత్మకమైన భాగం బుద్ధి అనబడుతుంది. "ఇటుగా వచ్చేది ఎవరు?రాముడేనా లేక భీముడా?" అంటూ తికమక పడేది మనసు. "ఆ వచ్చేది నిశ్చయంగా రాముడే" అని నిర్ణయించేది లేక ద్రువీకరించేది బుద్ధి. 


ఇంద్రియాల ద్వారా మనం అనుక్షణం పొందే అనుభవాలు ప్రతి ఒకటి మన మనసు పొరలలో ఒక్కొక్క విభాగం గా ప్రోగుచేయ బడతాయి. దీనినే చిత్తం అంటారు. మనసు ఒక విషయాన్నీ గురించి నిర్ణయించలేక తికమక పడినప్పుడు, చిత్తం లో ఉన్న పాత అనుభవాలను జోడించి బుద్ధి ఒక నిర్ణయానికి వస్తుంది. "ఇతడా లేక అతడా?" అన్న ప్రశ్న తలెత్తినప్పుడు బుద్ది మనసును సలహా అడుగుతుంది. అతనిని ఇంతకు క్రితమే మనం చూసిన అనుభవం ఉంటె, వాటి తాలూకు గుర్తులు అక్కడ వుంటాయి. దానిని బట్టి "ఇది అతడే!" అని బుద్ధి నిర్ణయానికి వస్తుంది. 


మనం మెలకువగా ఉన్నప్పుడూ, కల కంటున్నప్పుడూ, గాఢ నిద్రపోతున్నప్పుడూ, లేక ఏ స్థితిలో ఉన్నప్పటికీ, 'నేను ఉన్నాను' అన్న స్ఫురణ మనను విడిచిపోదు. అది మన మనసు వెంటే ఎప్పుడూ ఉంటుంది. దీనినే అహం లేక నేను అంటారు. ప్రతి అనుభవానికి ప్రాతిపదిక గా అహం ఉంటుంది. అది లేకుండా మనకు ఏ అనుభవం ఉండదు. కనుక అన్నిటినీ ' నా అనుభవాలు' అంటాము

ఇక విషయంలోకి వద్దాము 

శ్రీం బీజాక్షరానికి ఉన్న అనేక అర్ధములలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ అవస్తా చతుష్టయం అని అర్ధం కూడా ఉంది. త్రిపుటి అనేక అర్ధములలో చెప్పబడిన వాటిలో జాగ్రత్, స్వప్న, సుషుప్తి కూడా ఒకటి.జాగ్రత్, స్వప్న, సుషుప్తి జీవకోటికి సర్వ సాధారణము. తమో గుణానికి ప్రతీక నిద్ర. ఇదే మాయా స్వరూపము.అసలు మాయ అంటే అర్ధం ఏమిటి? " మా " అంటే కాదు అని అర్ధం "యా " అంటే ఏది అని అర్ధం.

ఇప్పుడు తాత్పర్యం చూస్తే..ఏది సత్యం కాదో అది మాయ.


మెలకువలో ఉండడం , కలలుకనడం , గాఢనిద్ర ఈ మూడు స్థితులనూ జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అంటారు . వీటినే అవస్థాత్రయం అంటారు. మెలకువ స్థితిలో బాహ్యప్రపంచ జ్ఞానంతో వ్యవహరిస్తాం. పనులు చేస్తుంటాం. ఇది జాగృతావస్థ.

ఇక స్వప్నా వస్థలో మెలకువగా ఉన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు మనసులో సూక్ష్మసంస్కారాలుగా ఏర్పడి స్వప్నంలో మనకు , క్రమపద్ధతిలోనో లేకపోతే మరొక విధంగానో కనిపిస్తాయి. స్వప్నావస్థను అర్ధసుషుప్తి అని కూడా అంటారు. అంటే సగం నిద్ర అన్నమాట. స్వప్నంలో శరీర అవయవాలకు విశ్రాంతి లభించినా, జ్ఞానేంద్రియాలకు విశ్రాంతి లభించదు.మనస్సు పనిచేస్తూ ఉంటుంది.ఇక సుషుప్తిలో.. అంటే గాఢ నిద్రలో శరీరంతో పాటు ఇంద్రియాలకు కూడా పూర్తి విశ్రాంతి లభిస్తుంది. హాయిగా నిద్రిస్తాం.

జాగృత్ (మెలకువ) స్థితిలో ఆత్మతత్వం అనేది కన్నులయందు.., స్వప్నావస్థలో హృదయమునందు, సుషుప్తిలో ప్రాణమునందు ఉంటుంది. సుషుప్తిలో ఆత్మ శరీరాన్ని ప్రాణాలకు అప్పగించి తాను అంతర్యామితో (జీవాత్మ ) కలిసి సుఖిస్తుంది. అందుకే గాఢనిద్ర నుంచి మేల్కొన్న తర్వాత ‘నేను సుఖంగా నిద్రపోయాను’ అంటాం. ఇది మనందరికీ అనుభవంలోని విషయమే.


అవస్థాత్రయం కాకుండా ఆత్మకు నాల్గవ పాదం ఉన్నది. అది తురీయ స్థితి. తురీయము.. యోగం ద్వారా పొందవలసింది.మనకు అనుభవంలో ఉండదు.

                      

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

ధర్మ సందేహాలు

 ధర్మ సందేహాలు   -  సమాధానాలు . 


 * వాస్తు పురుషుడు ఎప్పుడు జన్మించాడు ?

 

భాద్రపద బహుళ తదియ, మంగళవారము, కృత్తిక నక్షత్రము, వ్యతిపాత యోగము, భద్రనాకరణము గుళికతో కూడిన కాలములో వాస్తు పురుషుడు జన్మించాడు.

 

* ఏడుగురు అప్సరసల పేర్లు ఏవి ?

 

1.రంభ. 2. ఉర్వశి. 3.మేనక  4.తిలోత్తమ. 5.సుకేశి. 6. ఘ్రుతాచి 7. మంజుగోష .


 * సప్త సంతానములు అంటే ఏమిటి ?

 

1. తటాక నిర్మాణం. 2. ధన నిక్షేపం. 3. అగ్రహార ప్రతిష్ట . 4. దేవాలయ ప్రతిష్ట . 5. ప్రభంధ రచన. 

6. స్వసంతానం ( పుత్రుడు ).

 

* తొమ్మిది రకాల ఆత్మలు  ఏవి ?

 1. జీవాత్మ. 2. అంతరాత్మ. 3. పరమాత్మ.

 4. నిర్మలాత్మ. 5. శుద్దాత్మ. 6. జ్ఞానత్మ  

7. మహాధాత్మ . 8. భూతాత్మ . 9. సకలాత్మ.


 * పదిరకాల పాలు ఏవి ?

 1. చనుబాలు. 2. ఆవుపాలు . 3. బర్రెపాలు .

 4. గొర్రె పాలు. 5. మేక పాలు. 6. గుర్రం పాలు.

 7. గాడిద పాలు. 8. ఒంటె పాలు. 9. ఏనుగు పాలు.

 10. లేడి పాలు.


 * యజ్ఞోపవీతం లొ ఎన్నిపోగులు ఉంటాయి?

 యజ్ఞోపవీతం లొ 9 పోగులు ఉంటాయి. ఆ తొమ్మిది పోగుల్లో 9 మంది దేవతలు నివసిస్తారు. వారు  

 1. బ్రహ్మ . 2. అగ్ని. 3. అనంతుడు. 4. చంద్రుడు . 5. పితృ దేవతలు . 6. ప్రజాపతి. 7. వాయువు .

 8. సూర్యుడు . 9. సూర్య దేవతలు .


 * అష్టాదశ ఆయుర్వేద సంహితలు ఏవి ?

 1. చరక సంహిత. 2. శూశ్రుత సంహిత. 3. పరాశర సంహిత. 4. హరిత సంహిత. 5. అగ్నివేశ సంహిత. 6. చ్యవన సంహిత. 7. ఆత్రేయ సంహిత. 8. భోజ సంహిత. 9. బృగు సంహిత. 10. బెడ సంహిత. 

11. అగస్త్య సంహిత. 12. వరాహ సంహిత. 

13. అత్రి సంహిత. 14. నారయణ సంహిత. 

15. చంద్ర సంహిత. 16. నారసింహ సంహిత. 

 17. శివ సంహిత. 18. సూర్య సంహిత.

 

* గృహ నిర్మాణం ఏ విధంగా చేపడితే సర్వ సుఖాలు పొందుతారు?

 1. ఈశాన్యం లొ పూజలు , పవిత్ర కార్యాలును నిర్వర్తించే విధంగా పూజగది ఉండాలి.

 2. ఆగ్నేయం లొ అగ్నికి సంబందించిన వంటావార్పు చేసుకొనే విధంగా వంటగది ఉండాలి.

 3. నైరుతిలో ఆయుధ సామగ్రి మొదలయిన వాటిని పెట్టుకోవడానికి ఒక గది ఉండాలి.

 4. వాయువ్యం లొ స్వతంత్రబిలాష చిహ్నములు .

 5. తూర్పు దిక్కున సూర్యునికి ప్రీతికరమైన పనులు.

 6. యమస్థానం అయిన దక్షిణం వైపు తలపెట్టి నిద్రించుట.

 7. కుభేర స్థానం అయిన ఉత్తరం వైపు చూస్తూ నిద్రలేచుట.

 8. వరుణ స్థానం అయిన పశ్చిమాన పాడిపశువులు పెంచుటకు తగిన స్థలం ఉండవలెను.

 ఈ విధంగా చేయుటవలన ఆయా దిక్కులలోని ఉన్న దేవతలు సంతృప్తి చెంది ఆ గృహములో నివసించేవారికి సర్వసుఖాలు, సర్వ సంపదలు ఇస్తారు.

 

* వివిద ఫలాల నైవేద్యం  -  ఫలితాలు.

 

కొబ్బరి కాయ ( పూర్ణ ఫలం ) - భగవంతుడికి కొబ్బరి కాయను నైవేద్యం గా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిన సులభంగా విజయవంతం అవుతాయి.


 అరటి పండు - భగవంతుడికి అరటిపండు నైవేద్యం గా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది. అరటిపండు గుజ్జుగా చేసి నైవేద్యం గా సమర్పిస్తే అప్పుల బాధనుండి విముక్తి పొందుతారు. చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది. చిన్న అరటిపళ్లు నైవేద్యం గా సమర్పిస్తే మద్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తి అవుతాయి.

 

నేరెడు పండు. - శనీశ్వరునికి నేరెడు పండు నైవేద్యం గా పెట్టి  ఆ ప్రసాదాన్ని తింటే వెన్నునొప్పి, నడుమునొప్పి, మోకాళ్ల నొప్పి వంటివి తొలిగిపోయి ఆరొగ్య వంతులు అవుతారు.


 ద్రాక్ష పండు. - భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండ్లు ముందు చిన్నపిల్లలకు, తరవాత పెద్దలకు పంచినట్లైతే ఎల్లవేళలా సుఖసంతోషాలతో వర్దిల్లుతారు. రోగాలు నశిస్తాయి. కార్యజయం లభిస్తుంది.

 

మామిడి పండు. -  మామిడి పండుని నైవేద్యం గా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది. నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యం గా పెట్టిన మామిడి పండుని దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యం గా పెట్టి అందరికి పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు.

 

అంజూర  పండు. - భగవంతుడికి నైవేద్యం పెట్టిన అన్జురాపండు ను అందరికి పంచిన తరువాత తిన్నవారికి ఆనారోగ్య భాధలు అన్ని తొలగి ఆరొగ్య వంతులు అవుతారు.

 

సపోట పండు. - సపోట పండు నైవేద్యం గా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంభంద విషయాలలో అవాంతరాలు అన్ని తొలగిపోతాయి.

 

యాపిల్ పండు - భగవంతుడికి యపిల్ పండు ని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులు అవుతారు.

 

కమలా పండు. -  భగవంతుడికి కమలా పండు నివేదించి నట్లయితే నిలిచిపోయన పనులు సజావుగా పూర్తి అవుతాయి.


 పనసపండు -  పనసపండు ని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రు నాశనము, రోగావిముక్తి కలిగి సుఖంగా ఉంటారు.


 * పంచవిధ సూతకములు అంటే ఏమిటి ?

 1.జన్మ సూతకము. 2. మృత సుతకము. 3. రజః సూతకం . 4. అంటు (రొగ ) సూతకం . 5. శవదర్శన సూతకం .


 * దేవాలయాల వద్ద గృహ నిర్మాణం చేయడం దోషమా ?

 

శివాలయానికి నూరు బారుల దూరం లొపల, విష్ణువాలయముకు వెనక ఇరవై బారుల దూరం లొపల, శక్తి ఆలయముకు సమీపం లొను గృహనిర్మాణం చేయకూడదు . దీనికి వ్యతిరేఖంగా గృహ నిర్మాణం జరిగితే సఖల సంపదలు నశించి కష్టాలపాలు అవుతారు. గుడి దగ్గర ఉన్న ఇళ్ళకు ఏ వైపునైనా , ఏ మాత్రమైనా గుడి నీడ పడిందంటే దరిద్రం, ప్రాణనష్టం వంటి అనేక కష్టనష్టాలు ఎదుర్కోక తప్పదు.


 * తాంబూలం సేవించేప్పుడు తమలపాకు తొడిమ, చివర్లు ఎందుకు తుంచాలి ?

 తాంబులం వేసుకునే ముందు తమలపాకుల తొడిమలు, చివరలు తుంచివేయాలి. ఎందుకంటే తొడిమను తినడం వ్యాదికారకం అవుతుంది. చిగుర్లు పాపానికి ప్రతీకలు అని అంటారు. కనుక తమలపాకు తొడిమలు , చివరలు తుంచిన తర్వాతే తాంబులం వేసుకొవడం ఆరొగ్య ప్రధమం . అలాగే తమలపాకులో ఉండే ఈనెలు బుద్దిని మందగింప చేస్తాయి. అందుకే తమలపాకును నమిలి మొదటగా నోటిలో ఊరిన రసాన్ని ఉమ్మివేయాలి. తొడిమలు, చివరలు తున్చివేసినా ఇంకా అవి తమలపాకులో శేషించి ఉంటాయి కనుక 


 * శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుంది ఎందుకు ?

 తిరుపతి శ్రీ గొవింద రాజస్వామి వారి సన్నిదిలో కుంచం ఉండటం నిజమే . దీనికి కారణం ఈ విధంగా చెబుతారు. తిరుమల స్వామి శ్రీ వెంకటేశ్వరస్వామి  కుబేరుని వద్ద అప్పు చేసాడట . దానిని తీర్చుట కొరకు ద్రవ్యాన్ని కుంచం తో కొలిసి ఇచ్చేవారట స్వామివారు. స్వామివారి పక్షాన గొవింద రాజస్వామి ఈ కార్యమును సాగించారని ఒక కధ ప్రచారం లొ ఉంది. ఆ కుంచం తన తలక్రింద ఉంచుకున్నాడు అని ప్రతీతి.

 

* నవగ్రహాలకు సంభందించిన సమిధలు ఏవి ?

 1. సూర్యుడు - జిల్లెడు. 2. చంద్రుడు - మొదుగ .

 3. అంగారకుడు - చండ్ర. 4. బుదుడు - ఉత్తరేణి .

 5. బృహస్పతి - రావి . 6. శుక్రుడు - అత్తి .

 7. శని - జమ్మి . 8. రాహువు - దర్భ. 

 9. కేతువు - గరిక .

  * ఎటువంటి స్థలం లొ గృహ నిర్మాణం చేయరాదు .

 1. గోవుల మందలు ఉండే ప్రదేశాలలోనూ .

 2. స్మశాన భూమికి సమీపం లొను .

 3. మలమూత్రాలు విసర్జించు ప్రదేశాలలోను .

 4. ఉప్పు నేలలోను, చవుడు నేలలయందు .

 5. ఎల్లప్పుడు నీటి వుటలు గల ప్రదేశాలలోను .

 6. రాతి భూముల యందు , మిక్కిలి రక్త వర్ణం గల భూమి యందు 

 7. చెరువులను పూడ్చి గృహ నిర్మాణం చేయరాదు అలా చేయడం వలన అనేకములు అయిన పంది జన్మలు ఎత్తి రౌరవాది నరకములు అనుభవించి కష్టాల పాలవుతారు .

 

* పుజాంగాలు  ఎన్ని రకాలు ?

 పుజాంగాలు  5 రకాలు.

 1.అభిగమనము - దైవాన్ని స్మరిస్తూ దేవాలయానికి వెళ్ళుట.

 2. ఉపాధానము - పూజా సామగ్రిని సంపాదించుట

 3. ఇజ్య - దూప, దీప, నైవేద్యములతో పూజించుట.

 4. స్వాద్యాయము - తనకు తానుగా మంత్రోచ్చారణ తో స్తుతించడం.

 5. యోగము - తదేకమైన నిష్టతో ధ్యానించుట .

  

 * ఏయే గృహాలకి ఎటువంటి శంఖువు ప్రతిష్ట చేయాలి ?

 రాతితో కట్టే గృహానికి ఆ రాతితోనే శంఖువు తయారు చేసి శంఖుస్థాపన చేయవలెను . ఇటుకలతో కట్టిన గృహమునకు ఇటుకలతోనే శంఖువు చేసి ప్రతిష్ట చేయవలెను .గోడలు పెట్టక కర్రలతో , నిట్రాట లతో వేయు పాకలకు కర్రతో శంఖువు తయారు చేసి ప్రతిష్ట చేయవలెను . శంఖువును నవరత్న, సువర్ణ, తామ్ర , రజిత నాణేలతో , నవధన్యములతో పూజించి , స్థాపించవలెను . అన్ని రకాల గృహములకు కర్ర శంఖువు ప్రతిష్టించరాదు . కాష్ట శంఖువు భుమిలొ ఎంతకాలం ఉండునో అంతకాలం ఆ గృహం శుబప్రధంగా ఉండును. ఆ తరువాత ఆ గృహములలో నివసించువారికి కష్టాలు కలుగును.కావున కర్రతో చేసిన శంఖువు కంటే రాతితో చేసిన శంఖువు ఉత్తమం అని తెలుస్తుంది.


 * గృహ నిర్మాణం లొ ఇంటి కిటికీలు, ద్వారాలు ఏ విధంగా అమర్చాలి ?

 గృహంలో కిటికీలు, ద్వారములు సమసంఖ్యలో ఉండాలి. వేటికవే విడివిడిగా సమసంఖ్యలొ ఉండాలి. కిటికీలు సరిసంఖ్యలోను , ద్వారాలు సరిసంఖ్యలొను ఉండాలి. అలమారాల గురించి శాస్త్రం లొ ఏమీ చెప్పలేదు. వాటి ఉపయోగాన్ని అనుసరించి సరిసంఖ్యో, బేసి సంఖ్యలొ నో పెట్టుకొవాలి. వాటికి స్థల నిర్ణయం కూడా చెప్పలేదు కిటికీలు , ద్వారాలు సరిసంఖ్యలో ఉన్నా చివరన సున్నా లేకుండా ఉండాలి. అనగా 10,20,30 ఇలా చివరన సున్నా రాకూడదు. అలాగే మొత్తం గృహం లొ ఉన్న ద్వారాలు, కిటికీలు అన్ని లెక్కపెట్టాలి.


 * వివిధ జన్మలు ఏవి ?

 1. దేవతలు . 2. మనుష్యులు. 3. మృగములు.

 4. పక్షులు . 5. పురుగులు. 6. జలచరములు.

 7. వృక్షములు .

 * శ్రీ వెంకటేశ్వరస్వామి వారి ఏడుకొండల పేర్లు ?

 

 1. వ్రుషబాద్రి . 2. నీలాద్రి. 3. గరుడాద్రి. 

 4. అంజనాద్రి. 5. శేషాద్రి. 6. వెంకటాద్రి.

 7. నారాయణాద్రి.

 * ఎవరెవరికి యే విధంగా నమస్కరించాలి?

 1. విష్ణుమూర్తి యెక్క సర్వ అవతారాల విగ్రహాలకు మరియు శివునికి 12 అంగుళాల ఎత్తులొ చేతులు జోడించి శిరస్సు వంచి భక్తి , శ్రద్దలతో వినయంగా నమస్కరించాలి.

 2. ఇతర దేవుళ్ళకు శిరస్సు పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

 3. గురువుకి నోటితో " నమస్కారం " అని చెప్పకుండా రెండు చేతులు జోడించి వినయవిధేయలతో నమస్కరించాలి.

 4. మహానుభావులకు , యోగులకు రెండు చేతులు వక్షస్థలం పై  జోడించి నమస్కరించాలి.

 5. తండ్రికి , పరిపాలకుడికి రెండు చేతులు నోటి మీదగా జోడించి నమస్కరించాలి.

 6. తల్లికి ఉదరం పై రెండు చేతులు జోడించి నమస్కరించాలి.

  * శ్రీ చక్రం నందు గల దేవతలు ఎవరు?

 1. వశిని . 2. కామేశ్వరి. 3. మోదిని . 4. విమల.

 5. అరుణి . 6. జయిని . 7. సర్వేశ్వరీ . 8. కాళిని .


 * ధర్మం అంటే ?

 

  ధృతి, క్షమ , దమము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీ , విద్య, సత్యము, అక్రోధము. ఈ పది లక్షణములు కలిగినదే "ధర్మము"

 

* సహంపక్తి బోజనాల సమయం లొ అందరూ ఒకేసారి లేవాలి అంటారు ఎందుకు ?

 సహంపక్తి బోజనానికి కూర్చున్న వారందరి జీవన ప్రమాణం ఒకేవిధంగా ఉండదు. సహంపక్తి బోజనాలలో రకరకాల వారు ఉంటారు. వారిలొ మంచివారు ఉంటారు. అలాగే చెడు అలవాట్లు ఉన్నవారు ఉంటారు. ఎవరి శరీరాల్లోని విద్యుత్ వారి వారి శరీరపు శక్తిని అనుసరించే పనిచేస్తూ ఉంటుంది . కాని సహపంక్తి లొ కూర్చున్నప్పుడు దాదాపు అందరి శరీరాల్లోని విద్యుత్ నియంత్రణ అందరిలో ఒకేలా ఉంటుంది. అటువంటప్పుడు తక్కువ శక్తితో ఉన్న వ్యక్తీ అందరికంటే ముందుగా లేచినచో మిగిలిన వారి శక్తి అతనికి ఎంతోకొంత వెళ్ళిపోతుంది.

          కనుకనే సహపంక్తి బోజనానినికి కుర్చున్నప్పుడు ఎవరు ముందు తిన్నా , ఎవరు వెనక తిన్నా , అందరూ ఒకేసారి లేవాలన్న నియమం పూర్వకాలం నుండి ఆచరణలో ఉంది.

 

* దేవతా లక్షణాలు ఏవి ?

 1. రెప్పపాటు లేకుండుట . 2. భూమి మీద పాదాలు ఆనించ కుండా ఉండుట.3. వ్యసనం లేకుండా ఉండుట.


 * నవ వ్యాకరణాలు అనగా ఏవి ?

 1. పాణి నీయం . 2. కలాపం. 3. సుపద్మం. 

4. సారస్వతం. 5. ప్రాతిశాఖ్యం ( కుమార వ్యాకరణం ) 6. ఐంద్రం . 7. వ్యాఘ్ర బౌతికం. 

 8. శాఖటా టా యానం . 9.శాకల్యం .

 

* శ్రీ రాముని జన్మనక్షత్రం , మాసం ఎప్పుడు ?

 శ్రీ రాముడు చైత్ర మాసం , నవమి తిధిలో కర్కాటక లగ్నంలో జన్మించాడు. ఆయన జన్మ నక్షత్రం పునర్వసు .

 

* పర్వ దినాలలో వడపప్పుని ఎందుకు పెడతారు 

 భగవంతుడికి ప్రతి పండగనాడు వడపప్పుని , చలిమిడిని తప్పకుండా చేసి పెడతారు. అలాగే తల స్నానం చేసి ఆయా దేవుళ్ళకి ఇష్టమైన పిండి వంటలు చేయడం వల్ల వేడి చేసి తిన్న పిండి వంటలు సరిగ్గా అరగవు . తద్వార అనారోగ్యం కలుగుతుంది.

         

     ఇటువంటి ఉపద్రవాలు తలెత్తకుండా ఉండటానికి కొన్ని ప్రాంతాలలో వడపప్పు, పానకం , చలిమిడి తప్పకుండా చేస్తారు . పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన తిన్న పిండి వంటలు జీర్ణం అయ్యి వేడి చేయకుండా చలువ చేస్తుంది .

 

* శ్రీ వారి సుప్రబాతాన్ని ఎవరు ఎప్పుడు రచించారు.?

 శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ సుప్రబాతాన్ని రచించిన వారు శ్రీ ప్రతివాది భయంకర అన్నన్ అనే ఆచార్యులు. వీరు అష్టదిగ్గజాలుగా ప్రసిద్ధులైన శ్రీ మనవాల మహామునుల శిష్యులలో ప్రముఖులు వీరు క్రీ .శ . 1361 లొ జన్మించి 1454 వరకు అంటే 93 సంవత్సరాలు జీవించి ఉన్నారని పరిశోధకుల అభిప్రాయం.వీరు తమ జీవిత కాలంలో అనేక కృతులు రచించారు. వీరి రచనలలో శ్రీ స్వామివారి సుప్రబాతం అనన్య సామాన్యమైన ప్రచారం పొందింది.


 * పంచ కోశాలు అంటే ఏమిటి ?

 1. అన్నమయ కోశం. 2. ప్రాణమయ కోశం .

 3. మనోమయ కోశం . 4. విజ్ఞానమయ కోశం .

 5. ఆనందమయ కోశం .

 * శౌచమంటే ఏమిటి ?

 శుచి అంటే శుభ్రము , శుద్ధము . ధర్మాది పరీక్షల చేత భాహ్య అంతరములలో పరిశుద్దిని పొందుటయే " శౌచం" అనబడును. శౌచం రెండు విధములు 

 1. బాహ్య శౌచం.

 2. అంతః శౌచం .

 భాహ్య శౌచం - శరీరం పైన ఉండే మలినాలను పోగొట్టుకోవడానికి చేసే స్నానాదులు, శరీరం పరిశుద్ధం గా ఉండేందుకు పూసే సుగంద ద్రవ్యాలు వంటివి. వీటిని భాహ్య శౌచం అంటారు.

 అంతః శౌచం - మనస్సులో ఎటువంటి చెడు భావాలు లేకుండా అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద , వాత్సర్యాలు లేకుండా నిర్మలమైన అంతహకరణను కలిగి ఉండటమే అంతః శౌచం అనబడను. అంతః శౌచం మనస్సుకి సంభందించినది. కాబట్టి దీనికి శాస్త్రాలలో అదిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.


 * ఏయే ప్రదేశాల్లో జపం చేస్తే ఎంతెంత ఫలితం ?

 ఇంట్లో చేసే జపానికి సత్ఫలితమే ఉంటుంది . కాని ఇంట్లో జపం చేస్తే అంతే ఫలితం ఉంటుంది. అదే జపాన్ని నది పరీవాహక ప్రాంతాల్లో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది . గోశాలలో చేసే జపం వల్ల వందరెట్ల ఫలితం ఉంటుంది . యాగశాలలో చేసే జపం వలన వందరెట్ల కంటే అధికమైన ఫలితం వస్తుంది. దేవాలయాలలో , పుణ్య ప్రదేశాలలో చేసే జపం వలన పదివేల రెట్లు ఫలితం కలుగుతుంది. శివాలయాలలో , శివ సాన్నిద్యం నందు చేసే జపం వలన అత్యున్నతమైన ఫలితం దక్కుతుంది.

 

* రావణుడు ప్రతిష్టించిన 6 శివ లింగాలు ఏవి ?

 1. వైద్యనాధ లింగం. 2. వక్రేశ్వర నాద లింగం.

 3. సిద్ధినాద లింగం. 4. తారకేశ్వర లింగం.

 5. ఘటేశ్వర లింగం. 6. కపిలేశ్వర లింగం.


 * పదనాలుగు లోకాలలో ఎవరెవరు ఉంటారు ?

 పదనాలుగు లోకాలలోని మొదటి మూడు లోకాల్లోను అంటే భూలోకం , భువర్లోకం, స్వర్లోకాలను " కృతక లోకాలు " అంటారు. జీవులు తాము చేసుకొన్న కర్మఫలాన్ని బట్టి ఈ మూడు లొకాల్లొను ఉంటారు.

 

 నాల్గొవదైన మహర్లోకం కల్పాన్తములో కూడా నశించదు. ఈ లొకం లొ కల్పాంత జీవులు ఉంటారు.

 అయిదోవది అయిన జనలోకం లొ బ్రహ్మ దేవుని మానస పుత్రులైన సనక సనందన సనత్కుమారాదులు నివసిస్తారు.

 ఆరొవదైన తపోలోకంలో దోష వర్జితులు , దేహ రహితులు అయిన వైరాజులనే వారు ఉంటారు.

 పదనాలుగు లోకములలో ఏడో లొకం మరియు ఊర్ధ్వ లోకములలో ఆఖరది అయిన సత్యలోకం మరణ దర్మం లేని పుణ్య లొకం. ఇందులొ సిద్ధాది మునులు నివసిస్తారు.

 ఎనిమిదొవ లోకం అయిన అతలంలో మయదానవుని సంతతికి చెందిన అసురులు నివశిస్తారు.

 తొమ్మిదొవది అయిన వితలం లొ హోటకేస్వరుడు మరియు ఆయన పరివారం ఉంటారు.

 పదోవది అయిన సుతలం లొ బలిచక్రవర్తి , అతని అనుయాయులు నివశిస్తూ ఉంటారు.

 పదకొండవధి అయిన తలాతలం లొ త్రిపురాధిపతి అయిన యమధర్మ రాజు , మహాదేవ రక్షితుడై ఉంటాడు.

 పన్నెండో వది అయిన మహాతలం లొ క్రదువ సంతతి వారైన నానా శిరస్సులు గల కాద్రవేయులు ఉంటారు. వీరిలో తక్షకుడు, కాలుడు, సుషేణుడు మొదలైనవారు ఉన్నారు .

 పదమూడవధి అయిన రసాతలం లొ "పణి " అనబడే దైత్యులు , రాక్షసులు నివశిస్తూ ఉంటారు. నిరత కవచులు, కాలేయులు, హిరణ్య పురవాసులు వీరే .

 పదనాలుగోవ ది అయిన పాతాళ లొకం లో  శంఖుడు, మహాశంఖుడు, శ్వేతుడు , ధనంజయుడు, శంఖచూడుడు, కంబలుడు, ధృతరాష్ట్రుడు, అశ్వతరుడు, దేవదత్తుడు మొదలయిన సర్వజాతుల వారు నివశిస్తు ఉంటారు.

 

* శరీరానికి సంభందించిన వివిధ అగ్నులు ఏవి ?

 1. క్షుధాగ్ని.( ఆకలి బాధ ). 2. క్రొధాగ్ని ( కొపం ).

 3. కామాగ్ని.( కొరిక ). 4. జట రాగ్ని 

 * అక్షౌహిణి అంటే ఏమిటి ?

 కురుక్షేత్రంలో 18 రోజులు జరిగిన యుద్దంలో కౌరవ పక్షాన 11 అక్షౌహిణి ల సైన్యం , పాండవుల పక్షాన 7 అక్షౌహిణి ల సైన్యం పాల్గోనినట్లు భారతంలో ఉంది. ఒక్క అక్షౌహిణి లొ 21, 870 రధాలు, అంతే సంఖ్యగల ఏనుగులు,  65,610 గుర్రాలు, 1,09350 పదాతి దళాలు ఉండేవి . వీటి సముచ్చయాన్ని ఒక్క అక్షౌహిణి అనేవారు.

 

* ఎటువంటి నీటిని తాగితే దుష్ట పీడలు నశిస్తాయి 

 1. భగవంతుడికి అభిషేకం చేసిన నీటిని,

 2. అర్ఘ్యము ఇవ్వగా మిగిలిన జలమును,

 3. ఆచమనము ఇచ్చిన జలమును,

 4. పాదోదకము ను సేవించినవారికి సర్వ తీర్ధాలలో ను స్నానం ఆచరించినంత పుణ్యం కలుగుతుంది. అన్ని తీర్దాలలోని జలంతో దేవుడుకి అభిషేకం చేసినంత ఫలితాన్ని పొందవచ్చు. పైన పేర్కొన్న జలమును సేవించిన వారికి సర్వపీడలు సమసిపోతాయి.

 

* ద్వాదశ భిక్షాటన ఉపాయాలు ఏమిటి ?

 1. బిగ్గరగా అద్యయనం చేయడం . 2. పురాతన  గాధలు చెప్పడం. 3. ఆడవారితో మాట్లాడటం. 4.పిల్లల్ని లాలించడం. 5. ఆడవారి వంటావార్పు స్తుతించడం. 6. వారి భర్తలను స్తుతించడం . 

 7. దీనత్వం ప్రదర్శించడం. 8. అంగవైకల్యం. 

 9. సాముద్రికం. 10. జ్యోతిష్యం . 11. చిట్కా వైద్యం. 12. గారడీ మంత్ర బాల విద్యలు.

 

* ఎన్ని సంవత్సరాలు కలిస్తే మహాయుగం అవుతుంది ?

 మనందరకి తెలిసిన యుగములు నాలుగు. అవి

 1. కృతయుగం - 17,20,000 సంవత్సరాలు.

 2. త్రేతా యుగం - 12,96,000 సంవత్సరాలు.

 3. ద్వాపర యుగం - 8, 64,000 సంవత్సరాలు .

 4. కలి యుగం -      4,32,000 సంవత్సరాలు.

   ఈ విధంగా మొత్తం నాలుగు యుగాలు కలిస్తే 

43,12,000 సంవత్సరాలు అవుతాయి. ఈ నాలుగు యుగాలు కలిసిన కాలమే ఒక మహాయుగం అవుతుంది.

 

* ఏయే అవయవాల యందు ఎన్నెన్ని రుద్రాక్షలు ధరించాలి ?

 శిఖ యందు 1. కం టం నందు 32, చేతుల యందు 12, తలకి 45, ఒక్కో చెవికి 6 రుద్రాక్షలు చొప్పున ధరించాలి. ఈ విధంగా సంఖ్యను అనుసరించి రుద్రాక్షలు ధరించి , నియమ నిష్టలతో పరమేశ్వరునిని పుజించి నట్లయితే  వారికి అనంతమైన ఫలం దక్కుతుంది అని రుద్రాక్ష శాస్త్రము చెబుతుంది. అంతేకాకుండా 1000 రుద్రాక్షలను ధరించిన వారికి దేవతలు కూడా నమస్కరిస్తారు అని చెబుతుంది.


 * రాక్షసులతో సమానులు ఏవరు ?

 1. రాజాజ్ఞ మీరినవారు.

 2. ఆధారం లేక అప్పు చేసినవారు.

 3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .

 4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.

 5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.

 6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.

 7. నమ్మించి మోసగించేవాడు.

 8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.

 9. నిరసంగా పరిహసించువాడు .

 10. సభకు విగ్నం కలిగించువాడు.

 11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .

 12. హంతకుడు.

 * స్పటిక మాలను గృహస్తులు ధరించావచ్చా ?

 స్పటికమాలను గృహస్తులు ధరించరాదు అని శాస్త్రం చెబుతుంది.


 * అర్జునిడికి గల దశానామాలు ఏవి ?

 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్ధుడు. 

 4. కిరీటి . 5. శ్వేత వాహనుడు. 6. భీభత్సుడు 

 7. విజుయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి.

 10. ధనుంజయుడు.

  గణపతి అనుగ్రహం పొందాలంటే ఏ విధంగా పూజించాలి ?

 ఎట్టి విఘ్నాలు లేకుండా సర్వ కార్యాలు విజయవంతం అవ్వడానికి శీఘ్రమే గణపతి అనుగ్రహం పొందటానికి ప్రతి ఒక్కరూ వినాయకుడ్ని ఈ విధంగా ధ్యానించి పూజించాలి .

    సమస్త గణాలకు అధిపతి అయిన పార్వతీ నందనా ! సకల సౌభాగ్యాలు, సిద్ధులు ప్రసాదించే ఏకదంతం కలవాడా ! గజ ముఖం కలిగిన వాడా !

 మూషిక వాహనా ! నీవు కుమారస్వామికి గురువువి. అటువంటి నీకు నమస్కరిస్తున్నాను. అని ధ్యానించి భక్తి, శ్రద్దలతో పూజ ప్రారంబించాలి. అలా పూజించిన వారికి గణపతి అనుగ్రహము శీఘ్రమే లభిస్తుందని మహేశ్వరుడు మహా శివపురాణం లొ చెప్పాడు.


 * మనోదోషములు ఎన్ని ?

 1. కామము. 2. క్రోధము. 3. లోభము. 

4. మోహము 5. మదము. 6. మాత్స్చార్యము .

 7. రాగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య . 10. అసుయ 

 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము.


 * భగవంతుడికి నివేదించే సమయం లొ గుర్తు ఉంచుకోవలసినవి ?

 భగవంతుడికి నివేధించేప్పుడు ఎటువంటి పొరపాట్లు చేయరాదు . తెలిసి చెసినా,తెలియక చేసినా తప్పు తప్పే అంటారు. కనుక నివేధించేప్పుడు ప్రతివారు తప్పక చేయవలసినవి .

 1. దేవునికి నైవేద్యం గా పెట్టడానికి చేసిన వంటకాలలో నుంచి కొంత విడిగా తీయరాదు .పాత్ర మొత్తాన్ని దేవుని ఎదుట పెట్టాలి .

 2. పదార్ధాలు వేడిగా ఉన్నప్పుడు నివేదిన్చరాదు . చల్లారాక పెట్టాలి .

 3. నివేదనలో మంచినీటిని కుడా తప్పనిసరిగా పెట్టాలి.

 4. నివేదించే వంటకాలలో పంచదారకు బదులు బెల్లం వాడాలి.

 * ఊర్ధ్వ పుండ్ర ములు ఎందుకు ధరిస్తారు ?

 ఆర్య మతంలో ముఖధారణం (బొట్టు ) ఒక ఆర్ష సాంప్రదాయంగా ఏర్పడింది. అది త్రి పుండ్రము , ఊర్ధ్వ పుండ్రము. అని రెండు రకాలుగా విభజించబడింది. వైష్ణవులు ఊర్ధ్వ పుండ్రము లు  ధరిస్తారు . స్త్రీలు తిలకధారణ చేస్తారు . 

     తిరుమణిని నిలువునా మూడు రేఖలుగా ధరించడంనే ఊర్ధ్వ పుండ్ర దారణ అంటారు.ఈ మూడు రేఖలు అకార, ఉకార, మకార స్వరూపమైన ప్రనవాన్ని సూచిస్తాయి. అకారం - సత్వ స్వరుపడైన శ్రీ మహావిష్ణువును , ఉకారం - చిత్వ స్వరూపిణి అయిన మహాలక్ష్మిని , మకారం  భగవద్భాక్తులైన భాగవతులను తెలియజేస్తాయని చెబుతారు.  శైవులు భస్మాన్ని మూడు అడ్డరేకులుగా నుదుట ధరిస్తారు .

    తిరుమణి మట్టికి సంభందించినది . కావున అది మట్టి నుండి కలిగిన ఈ శరీరం చివరికి మట్టిలోనే కలిసిపోతుందని సుచిస్తుంది. ఇందువల్ల వైరాగ్యం కలుగుతుంది. ముక్తి కోరేవానికి వైరాగ్యం చాలా ముఖ్యం. విభూతి దారణ కూడా ఈ శరీరం చివరికి బూడిద అయ్యేది అనే తత్వాన్ని నిర్దేశిస్తుంది. ముఖదారణ లేకుండా చేసే సత్కర్మలు నిరర్ధకాలు అని ఆగమాలు పేర్కొన్నాయి.

  ద్వాదశ (12) ఊర్ధ్వ పుండ్రము లు ధరించడం కూడా కద్దు. నాడులు, హృదయం మొదలయిన శరీర భాగములను చల్లబరుచుటకు కూడా ఆయా స్థానములలో ఊర్ధ్వ పుండ్ర దారణ అవసరమయిన వైజ్ఞానికం గా విశ్లేషణ చేసి కొంతమంది వివరిస్తున్నారు . ఉర్ధ్వ పుండ్రం లొ ఉపయొగించే వస్తువులకు చల్లదనం కలిగించే లక్షణం ఉంది.

 

* నదులలోను, సముద్రాలలోను పవిత్ర స్నానాలు చేసేప్పుడు పాటించవలసిన నియమాలు ఏవి ?

 నదీ స్నానం , సముద్ర స్నానం వంటివి చేసే ముందు నదీ స్నానం అయితే నదీమ తల్లిని, సముద్ర స్నానం అయితే సముద్రున్ని, అనంతరం క్షేత్ర దేవతల్ని, మనస్సులొ స్మరించుకొని సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి .

 

* రాత్రి పూట నిద్రించే టైములో ఒంటిపై ధరించిన వస్త్రాలతో నదిలో మునగరాదు. ఈ బట్టలను విడిచి శుభ్రమైన వస్త్రములను ధరించాలి.


 * పుణ్య నదులలో పాప పరిహారార్ధం చేసే పవిత్ర స్నానముల సమయం లొ ఖచ్చితమైన నియమాలు పాటించి తీరాలి.


 * స్నాన అనంతరం ఆ బట్టల్ని నదుల్లో పిండ రాదు అలాగే సబ్బులను ఉపయొగించి కూడా బట్టలను ఉతకరాదు . 

 

* అభ్యంగ స్నానం అంటే కుంకుళ్ళు , షాంపు లు మొదలయిన వాటిని ఉపయొగించి తలంటు స్నానం చేయరాదు . 


 * పొరబాటున కూడా నదిలోగాని, నదీ తీరాల్లోగాని మలముత్రాలు విసర్జిన్చరాదు . ఈ నియమానికి వ్యతిరేకంగా  చేస్తే పాపం అంటుతుంది.

 

* ఆఖరికి నీళ్లను పుక్కిలించి ఉమ్మి వేసినా కూడా మహా దొషం అవుతుంది.

 * పవిత్ర స్నానములు ఆచరించే సమయంలో అ మంగళ కరమైన మాటలు మాట్లడకుడదు. కసురుకోవడం, కోప్పడటం, వంటివి చేయకూడదు .


 * సముద్ర స్నానం కేవలం పర్వదినములలో  మాత్రమే చేయాలి .మాములు సమయాలలో సముద్రాన్ని తాకకూడదు .


 * స్నానం చెసే ముందు సంకల్పం చెప్పుకోవాలి.

             

    

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .  

 

 గమనిక  -

      

         నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

          

          నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

              

       ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

            

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి  . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 

         

                  కాళహస్తి వేంకటేశ్వరరావు .

              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

                          9885030034

మూక పంచశతి*

  🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 11*


*కాంచీరత్నవిభూషాం కామపి కందర్పసూతికాపాంగీమ్।*

*పరమాం కలాముపాసే పరశివ వామాంక పీఠికాసీనామ్॥*


*భావము :*


*కాంచీపురమునకు మణిహారముగా ప్రకాశించునది, తన క్రీగంటి చూపులతో మన్మధుని పునర్జీవితుని చేసినది, జగదీశ్వరుని వామ భాగమును తన స్థానముగా చేసుకొనినది అయిన జగన్మాతను ప్రార్థిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ ।

బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః ।। 49 ।।


ప్రతిపదార్థ:


దూరేణ — (త్యజించు) దూరము నుండే; హి — నిజముగా; అవరం — నిమ్న స్థాయి లోనున్న; కర్మ — ఫలాపేక్షతో చేసే పనులు; బుద్ధి-యోగాత్ — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము నందే బుద్ధి స్థిరముగా ఉంచి; ధనంజయ — అర్జునా; బుద్ధౌ — ఆధ్యాత్మిక జ్ఞానము, ఆంతర-దృష్టి; శరణం — ఆశ్రయం(శరణము); అన్విచ్ఛ — వెదుకుము; కృపణాః — లోభి/పిసినారి; ఫల-హేతవః — కర్మ ఫలములను ఆశించేవారు.


 తాత్పర్యము :


  దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానమును ఆశ్రయించుము, ఓ అర్జునా, ఫలాపేక్షతో చేసే పనులను త్యజించుము; బుద్ధిని ఆధ్యాత్మిక దివ్యజ్ఞానంలో స్థిరంగా ఉంచి చేసే పనుల కన్నా, అవి నిమ్న స్థాయికి చెందినవి. తమ కర్మ ఫలములను తామే భోగించగోరే వారు లోభులు/పిసినారులు.


 వివరణ:


పనికి రెండు దృష్టికోణాలున్నాయి: 1) మనం బాహ్యంగా చేసే క్రియ 2) దాని పట్ల మన అంతర్గతంగా ఉన్న దృక్పథం. ఉదాహరణకి బృందావన పుణ్యక్షేత్రంలో ఒక దేవాలయం కడుతున్నారనుకోండి. అక్కడి పనివారు ఒక పుణ్య కార్యంలో పాలుపంచుకున్నట్టే, కానీ వారి దృక్పథం ప్రాపంచికమైనది. వారికి వారి జీతం గురించే ఆలోచన. మరొక కాంట్రాక్టర్ ఎక్కువ జీతం ఇస్తానంటే, ఆ కొత్త యజమాని దగ్గరికి వెళ్లడానికి వెనుకాడరు. అక్కడే బృందావనంలో ఉన్న ఒక సాధువు, ఒక గొప్ప గుడి కడుతున్నారని చూసి, భగవత్ సేవ లాగా, 'కర సేవ' (స్వచ్చంద పని) చేస్తాడు. బాహ్యంగా సాధువు చేసే పని, ఆ పనివారు చేసేపని ఒక్కటే అయినా, వారి అంతర్గత దృక్పథంలో చాలా తేడా ఉంది.


ఇక్కడ అర్జునుడికి ఉత్తమమైన ఆంతరంగిక దృక్పథం పెంచుకోమని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. స్వీయ-భోగం కోసం పనులు చేసేవారు పిసినారులు. ఫలములపై ఆశ త్యజించి తమ పనులన్నీ భగవత్ అర్పితం చేసినవారు ఉత్తములు. కర్మ ఫలములను భగవత్ అర్పితం చేసినవారు నిజమైన జ్ఞానం కలిగినవారు.


'కృపణ' (పిసినారి) అన్న పదం ఇక్కడ వాడబడింది. శ్రీమద్ భాగవతం, 'కృపణ' అంటే ఇలా నిర్వచించింది:


న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణ-వస్తు-దృక్

తస్య తాన్ ఇచ్ఛతో యచ్ఛేద్యది సోఽపి తథా విధః (6.9.49)


 


‘భౌతిక ప్రకృతి శక్తి నుండి ఉద్భవించిన ఇంద్రియ విషయములే పరమ సత్యం అని అనుకునే వారే కృపణులు’. మరల శ్రీమద్భాగవతం ఇలా అంటుంది: “కృపణో యో ఽఅజితేంద్రియః’ (11.19.44) ‘ఇంద్రియములపై ఎలాంటి అదుపు లేని వాడే కృపణుడు.’


ఒక వ్యక్తి విజ్ఞాన పై-స్థాయికి వెళ్ళే కొద్దీ, సహజంగానే కర్మ ఫలాలని అనుభోగించాలనే కోరిక విడిచిపెట్టి, సేవా దృక్పథం వైపు వెళతాడు. మైక్రోసాఫ్ట్ సంస్థలో తన పదవీత్యాగం చేసిన తరువాత ఇప్పుడు బిల్ గేట్స్, తన శక్తి సామర్ధ్యాలని సమాజ-సేవ లో వినియోగిస్తున్నాడు. అదే విధంగా, అమెరికా అధ్యక్షుడిగా తన హోదా, అధికారము పూర్తయిన తరువాత, బిల్ క్లింటన్, మానవ సమాజ సేవ యొక్క వైభవాన్ని బోధిస్తున్నాడు, ఇంకా ఆ విషయంపై ఒక పుస్తకం ‘గివింగ్ — హౌ ఈచ్ ఆఫ్ అస్ కెన్ ఛేంజ్ ద వరల్డ్’ (Giving — How Each Of Us Can Change The World.) కూడా రాసాడు. వారి సేవా దృక్పథం పొగడదగినదే, కానీ అది సరిగ్గా ఇంకా సరియైన దిశలో లేదు. మనం చేసే పనులు భగవంతుని ప్రీతి కోసం, భగవత్ అర్పితంగా చేయటం నేర్చుకున్నట్లయితే, ఆ సేవా దృక్పథం లోప (దోష) రహితమవుతుంది.

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 23.01.2026 Friday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస శుక్ల పక్ష పంచమి తిథి భృగు వాసర పూర్వాభాద్ర నక్షత్రం వరియాన్ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు. 



ఈరోజు శ్రీ పంచమి

  


శ్రాద్ధ తిథి: పంచమి


 

నమస్కారః , శుభోదయం