7, మార్చి 2023, మంగళవారం

అంతపెద్దదా

 

 అంతపెద్దదా 

ఒకసారి వర్షాకాలంలో ఒకప్రాంతంలో వర్షాలు విపరీతంగా కురవటంతో ఒక చెరువులోని కప్ప ఆ వరదలలో కొట్టుకొని పోయి ఒక చిన్న బావిలో పడింది.  అక్కడ బావిలో వున్న కప్పు ఈ కప్పని చూసి నీవు ఇక్కడకు యెట్లా వచ్చావు అని అడిగింది. దానికి ఆ కప్పు నేను ఒక పెద్ద చెరువులో ఉండేదానినినిన్న కురిసిన వర్షపు వరదలో పడి ఇక్కడకు వచ్చాను అని అన్నది.  ఏమిటి పెద్ద చెరువులో వుంటావా చెరువు అంటే ఇంత ఉంటుందా అని ఒక నాలుగు సార్లు గెంతి చూపెట్టింది.  కాదు అన్నది ఆ కప్పు అప్పుడు బావిలోని కప్ప భావి ఒక అంచునుంచి ఇంకొక అంచువరకు గెంతి ఇంతదూరం ఉంటుందా అని అడిగింది.  దానికి ఆ కప్ప ఇది భావి చాలా చిన్నగా ఉంటుంది చెరువు అనేది చాలా విశాలంగా ఈ భావితో పోలిస్తే ఎన్నో వేలరెట్లు ఉంటుంది.  అక్కడ వేలకొద్దీ కప్పలు ఇతర జలచరాలు ఉంటాయి అని చెప్పింది.  దానికి ఆ బావిలోని కప్పనవ్వి నీవు నా తో పరాచకాలు ఆడుతున్నావా ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద నీటి వనరు ఉండదు.  నాకు తెలుసు అని చెప్పింది.  అప్పుడు చెరువులోని కప్పు చూడు మిత్రమా నీవు ఈ భావి తప్ప ఇంకొకటి చూసి ఉండకపోవచ్చు అందుకే ఇదే ప్రపంచం అని అనుకుంటున్నావు నిజానికి ప్రపంచం చాలా పెద్దది. నేను నా గ్రహచారం బాగాలేక ఈ బావిలో పడ్డాను కానీ నేను సువిశాల ప్రపంచంలో ఉండేదానిని అని అన్నది. దాని మాటలకు బావిలోని కప్పకు విస్మయం కలిగి జ్ఞ్యానోదయం అయ్యి తానూ యెంతటి చిన్న జాలంలో వుంటున్నదో అదే విధంగా తన భావాలు కూడా చిన్నగా ఉన్నాయని తెలుసుకున్నది. 

ఇది మనం చిన్నప్పటినుండి చదువు ఉన్న సాదారణ కధ.  దీనినే తెలుగులో బావిలోని కప్ప అని  సంస్కృతంలో కూపస్థ మండూకం అని హిందీలో కువేమే మెండాక్ అనే నానుడి మనకు తెలుసు.  మన మిత్రులలో ఎవరైనా సరైన జ్ఞ్యానం లేకుండా అన్ని నాకే తెలుసు అని విర్రవీగుతుంటే వాడు వట్టి బావిలో కప్ప అని మనం అనుకోటం సర్వ సాధారణము. 

నిజానికి మనమంతా ఆ బావిలోని కప్పలకన్నా ఏమాత్రం మెరుగు కాదని చెపితే కోపం రావచ్చు.  కానీ భగవంతుని విషయంలో మాత్రం అది నూటికి నూరు పాళ్ళు నిజం. ప్రతి వారు వారికి తెలిసిన సామాన్యమైన సంకుచితమైన జ్ఞ్యానంతో భగవంతుని చూడాలని, చూశానని అనుకుంటారు.  కానీ వేదాంతం అనేది అంతసులువుగా అర్ధం కాదు. వేదాన్త జ్ఞ్యాననఁ కావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి.జన్మాతరకృత వాసనలు తొలగిపోవాలి.  అదే విధంగా ఈ జన్మలోకూడా మనస్సు పరిశుద్ధంగా వుంది వాసనా రహితంగా ఉండాలి. 

సాధారణంగా చాలామంది విగ్రహారాధనే సర్వస్వము విగ్రహారాధనతోటి మోక్షాన్ని పొందవచ్చని అనుకుంటారు.  అంతేకాకుండా అనేకమంది తాము విగ్రహారాధన చేస్తూ వారి పబ్బం గడుపుకోవటానికి ఇతరులను విగ్రహారాధనకు పురిగొలుపుతారు. నిజానికి ప్రారంభంలో మనస్సుని ఒక క్రమశిక్షణలో ఉంచి ఉంచటానికి విగ్రహారాధన తోడ్పడుతుంది.  కానీ సాధకుని మనస్సు కేవలం విగ్రహారాధన వరకు మాత్రమే పరిమితం కాకూడదు. 

మన ధర్మంలో యజ్ఞ యాగాది క్రతువులను చేయటం కూడా వున్నది. అవి కూడా కొంతవరకే సాధనకు ఉపయోగ పడతాయి కేవలం ఐహిక వాంఛలను నెరవేర్చుకోవటానికి మాత్రం ఉపయోగ పడుతాయి. 

 జపతాపాలు చేయటం. జపం చేయటం కొంతవరకు అభివృద్ధి చెందిన ఆరాధనగా మనం అనుకోవచ్చు. ఎందుకంటె అక్కడ మంత్రం, జపమాల రెండే వున్నాయి. మంత్రం మనస్సులో ఆడుతుంటుంది, మాల చేతిలో తిరుగుతుంటుంది. కొంతవరకు మంత్రజపం ఆధ్యాత్మిక మార్గంలో చాలావరకు తీసుకొని వెళుతుంది.  

తపం అంటే తపస్సు అది ఒక్కటే మనిషిని మాధవుడిగా చేస్తుంది.  కేవలం సాధనవలనే భక్తుడు జ్ఞ్యానై మోక్షాన్ని పొందుతాడు. 

ఇవి తెలియని వారు వారు చేసే ఆరాధనే సర్వోత్తమమైనదని దానితోటె మోక్షం సిద్ధిస్తుందని  జీవితాన్ని గడుపుతారు. కాదని ఎవరైనా చెపితే అప్పుడు మోక్షం అంత పెద్దదా అని  బావిలోని కప్పలాగా ఆశ్చర్యపడతారు.

భార్గవ శర్మ చెప్పేది ఒక్కటే భగవంతుడు బాహ్యంలో లేడు కేవలం హృదయంలోని వున్నడని మన మంత్రపుష్పంలోనే పేర్కొన్నారు. ఉపనిషత్తులు కూడా పవిత్రమైన మహావాక్యాలతో అదే విషయాన్నీ ఉటంకిస్తున్నాయి. అది తెలుసుకోవటమే మోక్షం. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 

ఆయుర్వేదంలో

 శ్లోకం:☝️oil pulling

*అసంచారీ ముఖే పూర్ణే*

  *గండూషః కవలస్చరః l*

*తత్ర ద్రవేణ గండూషః*

  *కల్కేన కవలః స్మృతః ll*

  - సుశ్రుత సంహిత


భావం: ఆయుర్వేదంలో రెండు విధానాలు చెప్పబడ్డాయి.

1. కవలము/ పుక్కిలించడం, నోటిలో ద్రవాన్ని ఊపడం/అటు ఇటు ఆడించడం (ఇది టాక్సిన్‌లను బయటకు లాగుతుంది)

2. గండూషము/ ఎలాంటి కదలిక లేకుండా నోటిని ద్రవంతో నింపి ఏ కదలిక లేకుండా ఉంచడం (ఇది నోటిని లూబ్రికేట్ చేస్తుంది).

నూనెతో పుక్కిలించడం (కవలము) వల్ల నోటిలో చెడు రుచి, చెడు వాసనలు, వాపు, మంట మరియు తిమ్మిరి అనుభూతిని తొలగిస్తుంది. మరియు ముఖ కండరాలకు వ్యాయామం జరిగి ఆహ్లాదకరంగా ఉంటుంది. దంతాలను బలపరుస్తుంది మరియు ఆహారం పట్ల సహజమైన ఆసక్తిని, రుచిని పెంచుతుంది.

ఇంతవరకు నిజం. ఇంతకు మించి "సర్వరోగనివారిణి"గా ఎవరైనా చెబితే నమ్మక్కర్లేదు!🙏

తేళ్ల గురించి

 తేళ్ల గురించి సంపూర్ణ వివరణ  -  చికిత్సలు .


   తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.


              తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి 


  1 - మంద విషము కలిగినవి.


   2 - మధ్యవిషము కలిగినవి.


   3 - తీవ్రవిషము కలిగినవి.


 * మంద విషం కలిగిన తేళ్ల లక్షణాలు  -


        ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.


 *  మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు  -


           ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.


 *  తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు -


          ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .


           ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.


           పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.


 *  పత్ర వృశ్చిక లక్షణాలు  -


          ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.


 *  మండ్రగబ్బ లక్షణములు  -


           ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .


 *  తేలు యొక్క విషం వ్యాపించు విధం -


         తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును. 


 తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు  -


 *  ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .


 *  కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.


 *  గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .


 *  ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .


 *  గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.


 *  తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.


 *  జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .


 *  పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.


 *  రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.


 *  నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును . ఈ పద్ధతితో నేను చికిత్స చేశాను . ఇది నా అనుభవయోగం .


          ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.


         కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .


             మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .