29, నవంబర్ 2020, ఆదివారం

కార్తిక పురాణం -* *13 వ అధ్యాయము

 *కార్తిక పురాణం -*

*13 వ అధ్యాయము*

🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉🌺🕉


 *కన్యాదాన ఫలము*


ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై అలకి౦పుము.


కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒక వేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షణ తా౦బూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనము చేసిన యెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, అ పాపములన్నియు పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన౦దువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంత కన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తి శ్రద్దలతో కన్యాదానము చేసిన యెడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడ తరింపజేసినవాడగును. ఇందులకొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్దగా అలకి౦పుము.


*🕉సువీర చరిత్రము🕉*


ద్వాపర యుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన "సువీరు"డను ఒక రాజుండెను. అతనికి రూపవతియను భార్యకలదు. ఒక సారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమందోక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. అ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన అ బాలికను ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికి శుక్ల పక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతిగారబముతో పెరుగుచుండెను, ఆమె చూచు వారలకు కనులపండువుగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడిచినకొలదీ, బాలికకు నిండు యౌవనదశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడా బాలికనుగాంచి ఆమె అందచందములకు పరవశుడై అ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు "ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతు"నని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైననూ లేకపోవుటచే బాలిక పైనున్న మక్కువతో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోరతపమాచరించి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాది౦చెను. రాజు అ పాత్రను పుచ్చుకొని, సంతోషించి, తన కుమార్తెను ముని కుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులనిద్దరినీ అత్తవారింటికి పంపెను.


అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను. సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖముగా వుండెను. అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరుల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను.


ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని "ఓయీ! నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సుచూడ రాజవంశమునందు జన్మించిన వానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?" అని ప్రశ్నించగా, సువీరుడు "మహానుభావా! నేను వంగదేశమును నేలుచుండెడిది సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులాక్రమించుటచే భార్యాసమేతముగా నీ యడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదియునూ లేదు. పుత్రశోకముకంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్ఠుడనియినందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను. నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునకిచ్చి, వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని. దానితోనే యింత వరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచి౦పక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించిన వారు 'అసిపత్రవన' మను నరక మనుభవి౦తురు. ఆ ద్రవ్యములతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశి౦తురు. అదియునుగాక కన్యావిక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్రసంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థధర్మములు వ్యర్ధమగుటయేగాక అతడు మహా నరకమనుభవి౦చును. కన్యావిక్రయము జేసినా వారికీ యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణి౦చియే యున్నారు. కావున, రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధి గల వానికి కన్యాదానము చేయుము. అటుల చేసిన యెడల గంగాస్నాన మొనరించిన ఫలము, అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలిగిపోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి "ఓ మునివర్యా! దేహసుఖము కంటె దానధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జారవిడువమా౦టారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణి౦పగలరు కానీ ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్క చిక్కి శల్యమైయున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు. కాన, నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యాదానము మాత్రము చేయను" అని నిక్కచిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను.


మరి కొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవనమను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతిచెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి.


అంతటా శ్రుతకీర్తి "నేనెరిగున్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదులొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?"నని మనమునందుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి "ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు, ధర్మముర్తివి, బుద్దిశాలివి. ప్రాణకోటినంతను సమ౦గా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసియుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయపడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి "శ్రుతకీర్తి! నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు. అయిననేమి? నీ వంశియుడగు సువీరుడు తన జ్యేష్టపుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనే వారి పూర్వీకులు యిటు మూడు తరములవారు అటు మూడు తరములవారున్ను వారెంతటి పుణ్యపురుషులైనను నరకమనుభావించుటయేగాక, నిచజన్మలెత్తవలసియుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదునుగాన, నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పోయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమాసమున సాల౦కృతముగా కన్యాదానము చేయించుము. అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వికులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కెగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను, లేక విధివిధానముగా ఆబోతునకు వివాహమొనర్చినను కన్యాదాన ఫలమబ్భును. కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింతురు, పోయిరమ్ము" అని పలికెను.


శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటిరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి, సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి, కార్తీకమాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలసికొనెను.


కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీకమాసమున కన్యాదానము చేయవలయునని దీక్షభూని ఆచరించినవాడు. విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును.


*ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి త్రయోదశాధ్యాయము - పదమూడో రోజు పారాయణము సమాప్తము.*

🙏🙏🙏🙏🙏🙏

అరుణగిరిపై కార్తిక దీపం🔥🙏

 ఈ రోజు సరిగ్గా సాయంత్రం 6 pm కు అరుణగిరిపై కార్తిక దీపం🔥🙏


🔥🪔🔥🪔🔥🪔🔥


🔥 కార్తిక పౌర్ణమి🔥


‘అ-రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని కూడా అర్థం చెబుతారు. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని రమణ మహర్షి పేర్కొన్నారు.

 

పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలేశ్వర లింగం. బ్రహ్మ, మురారుల తగవు తీర్చడం కోసం వారిద్దరి మధ్యా అగ్ని లింగంగా మహాశివుడు ఆవిర్భవించాడు. కోటానుకోట్ల సూర్యప్రకాశాన్ని మించిన ఆ కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు దేవతలందరూ ప్రార్థించగా, శిలారూపంలో శివుడు సాక్షాత్కరించాడు. అదే ‘అరుణాచలం’. తమిళులు ‘అణ్ణామలై’ అంటారు.

 

‘అణ్ణాల్‌’ అనే తమిళ పదానికి ‘అగ్ని’ లేదా ‘కాంతి’ అని అర్థం. అగ్నిరూపంలో వెలసిన పర్వతం కనుక ‘అణ్ణామలై’ అనే పేరు ప్రసిద్ధి పొందింది. పర్వత పరిమాణంలో ఉన్న అంత పెద్ద లింగాన్ని ఆరాధించడం సాధ్యం కాదు కనుక... చిన్న లింగంగా సాక్షాత్కరించాల్సిందిగా దేవతలు ప్రార్థించారు. ఆ మేరకు అరుణాచల సానువులో చిన్న లింగంగా శివుడు రూపాంతరం చెందాడు. కృతయుగంలో అగ్నిలింగంగా ఉన్న శివుడు త్రేతా యుగంలో రత్న (పర్వత) లింగంగా, ద్వాపర యుగంలో తామ్ర (పర్వత) లింగంగా, కలియుగంలో శిలా పర్వతంగా మారాడని అంటారు. అరుణాచలాన్ని శోణ పర్వతంగా గౌతమ, అగస్త్య మునులు వర్ణించారు. ‘అరుణం’ అంటే ఎరుపు వర్ణం. ‘శోణము’ అన్నా కూడా అదే అర్థం! ఒక పర్వతమే మహాశివలింగం కావడం విశేషం.

 

అడుగడుగునా విశిష్టతలు

ఆ పర్వత పాదాల దగ్గర అరుణాచలేశ్వర ఆలయం ఉంది. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మితమైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. దీనికి అడుగడుగునా విశిష్టతలు కనిపిస్తాయి. నాలుగు దిక్కుల్లో ఎత్తైన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 217 అడుగుల ఎత్తులో, పదకొండు అంతస్థుల్లో ఎంతో దూరం నుంచి కనిపిస్తుంది. మిగిలిన గోపురాలు కూడా సుమారు అంతే ఎత్తులో ఉంటాయి. ఇక్కడ శివుని దేవేరి అపిత కుచలాంబాదేవి. స్వామికి ఎడమవైపున ఆమె కొలువై ఉంటుంది. గజానన, షడాననులకు విడివిడిగా ఆలయాలున్నాయి.

 

ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో అలరాలే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచీ భక్తులు వస్తూ ఉంటారు. వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివగంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. పదహారేళ్ళ వయసులోనే మౌనమునిగా ప్రసిద్ధి పొందారు. అరుణాచలం 48 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉంటుంది. దాదాపు 800 మీటర్ల ఎత్తైన గిరి చుట్టూ 14 కిలోమీటర్ల నడక మార్గం ఉంది. ఎనిమిది దిక్కుల్లోనూ దిక్పాలకుల లింగాలు ఉన్నాయి. ఈ శోణగిరిని ‘మహామేరువు’ అని ఆదిశంకరాచార్యులు అభివర్ణించారు. అరుణగిరి చుట్టూ నిత్యం వేలాది భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పున్నమి రోజుల్లో, ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

 

మహాసాలగ్రామం

అరుణచలం శివస్వరూపంగా విఖ్యాతి పొందినా శ్రీచక్రమే పర్వత రూపంగా వెలసిందని వైష్ణవ ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని ‘మహాసాలగ్రామం’గా భగవద్రామానుజులు పేర్కొన్నారు. అగ్ని క్షేత్రమైన అరుణాచల జ్యోతిర్లింగం గురించి ‘స్కాంద పురాణం’ విస్తృతంగా వర్ణించింది. అందులో ‘అరుణాచలేశ్వర మహాత్మ్యం’ అని ప్రత్యేక అధ్యాయం ఉంది. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాగా తొమ్మిది-పది శతాబ్దాల మధ్య చోళ రాజులు నిర్మించినట్టు శాసనాలున్నాయి. అనంతరం పల్లవులు, విజయనగర సార్వభౌములు ఎంతగానో అభివృద్ధి పరిచారు. దక్షిణ భారతంలో ఉన్న పెద్ద శైవాలయాల్లో ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది.

 

దీప ప్రజ్వలనం- గిరి ప్రదక్షిణం

అరుణాచలేశ్వరునికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షిక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. శివుడి ఆజ్ఞ మేరకు గౌతమ మహర్షి వీటికి రూపకల్పన చేశాడని పురాణ కథనం. వీటితో పాటు కార్తిక మాసంలో ‘కార్తిక దీపోత్సవం’ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అగ్ని నక్షత్రమైన కృత్తిక, పున్నమి కలిసిన మాసాన్ని ‘కార్తిక మాసం’ అంటారు. పౌర్ణమికి ముందురోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం వెలిగిస్తారు. పౌర్ణమి నాటి ప్రదోష సమయంలో, వృషభారూఢుడైన అరుణాచలేశ్వరుణ్ణి అపిత కుచలాంబాదేవి, గణపతి, షణ్ముఖులతో ఊరేగింపు జరిపి, గిరిపై ఏర్పాటు చేసిన కార్తిక మహా దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. తమిళులు దీన్ని ‘కార్తిగై దీపం’గా వ్యవహరిస్తారు. ఈ మహాదీపోత్సవంలో మూడున్నర టన్నుల ఆవు నెయ్యి వినియోగిస్తారు. అద్భుతమైన ఈ దీపకాంతి కొన్ని కిలోమీటర్ల వరకూ కనిపిస్తుంది. అది పున్నమి చంద్రుడి కాంతిని మించిపోతుంది. ఈ దీపం పదిరోజుల వరకూ వెలుగుతూనే ఉంటుంది.

 

దీపోత్సవాన్ని దర్శించడానికీ, గిరి ప్రదక్షిణకూ లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ‘అరుణాచల శివా’ అంటూ భక్తులు చేసే నినాదాలతో అంబరం 

ప్రతిధ్వనిస్తుంది.


🙏అరుణాచల శివ🙏

నమ్మకం

 🌹🌷🙏🪔🪔🪔🪔🙏🌷🌹


💐💐💐 *నమ్మకం* 💐💐💐


ఒక చిన్న గదిలో *నాలుగు  మైనపు దీపాలు* వెలుగుతూ ఉన్నాయి.

ఇంతలో పెద్దగా గాలి💨 రావడం  మొదలయింది.  


*ప్రశాంతత* అనే మైనం:- ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని  బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.


*ప్రేమ* అనే మైనం:- కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.   


*తెలివి* అనే దీపం:- నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.


నాలుగో దీపం మాత్రం:- నేను ఎలాగైనా *ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి* ఆరిపోకూడదు అని తన  వంతు ప్రయత్నం తాను చేసింది.   ఆ గాలిని ఎదిరించి వెలిగింది.  


దీపాలు ఉన్న గదిలోకి  చిన్న పిల్లవాడు  వచ్చి అయ్యో మూడు  దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు.


బాధ పడుతున్న అబ్బాయిని  చూసి దీపం ఇలా చెప్పింది.

*బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో*  అన్నదట...


 సంతోషంతో  ఆ పిల్లవాడు  ఆ నాలుగో దీపాన్ని  నీ పేరేంటి  అని అడిగాడు.

నా పేరు *నమ్మకం* అని చెప్పింది... ఆ దీపం.


*అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటె చాలు  పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం*


🌹🌹🌹🌹🌹🌹🌹


*ఒక పిరికివాడు ఓ స్మశానం దాటాల్సి వచ్చింది. ఎవరన్నా వచ్చేవరకు కొంచెంసేపు ఆగి కొంచెం దూరంలో ఎవరో వస్తుంటే అతనితో కలిసి ధైర్యంగా స్మశానం దాటేసాడు.. ఇంతకీ ఆ రెండో వ్యక్తి కూడా వీడికన్నా పిరికివాడట! కాని కేవలం వాడికి వీడు, వీడికి వాడు తోడు ఉన్నారు అనే ఒకే ఒక్క భరోసా వాళ్ళని స్మశానం దాటేలా చేసింది.*


*నిజ జీవితంలో కూడా మనిషికి కావాల్సింది అలాంటి భరోసానే.. నేను ఉన్నాను అనే భరోసా ఒక మాట సాయం...ఏమి కాదు నేను ఉన్నా అనే చిన్న మాట చెప్పి చూడు..మనిషికి ఎంత బలం వస్తుందో...ఆ బలంతో ఆ మనిషి ఏదైనా చేయగలడు.*


*ఓ సారి ఒకాయన తన కారులో ఓ గ్రామానికెళ్తుంటే, కారు దారిలో ఓ బురదగుంటలో దిగబడిపోయింది. సాయంకోసం చుట్టూచూస్తే ఓరైతు కనపడ్డాడు. పరిస్థితిచూసిన రైతు, "ఉండండి, నా ఎద్దుతో కారును బైటికి లాగుదాం" అని దగ్గరలోని తన పొలంనుంచి తన ముసలి ఎద్దును తోలుకొచ్చాడు. దాన్నిచూస్తూనే ఆ పెద్దమనిషి నిరాశతో ఉసూరుమన్నాడు!*


*రైతు ఎద్దుని కారు ముందు తాడుతో కట్టి, "ఓరేయ్ రాజూ, అంజీ, నందీ! ఎంటిరా* *ఆలోచిస్తున్నరూ, తిన్నదంతా ఏమైంది, బండిని లాగండిరా" అని ఉత్సాహంగా* *అదిలించాడు. అంతే!    రాజు ఆ కారుని ఒక్క ఊపుతో బైటికి లాగేసింది.*

*పెద్దాయన ఆశ్చర్యంతో, " సర్, ఉన్నది ఒక ఎద్దేకదా, మీరేంటీ‌, అన్ని ఎడ్లు ఉన్నట్టు అదిలించారు?"*

*రైతు, "ఈ రాజు బక్కదే కాదండి, గుడ్డిది కూడా!* *ఐతే, తనుకాక ఇంకా చాలా ఎడ్లున్నాయనే ధైర్యంతో తన బలాన్నంతా పెట్టింది, అంతే! పూర్తి నమ్మకంతో చేస్తే, ఎంత కష్టమైన పనైనా తేలిగ్గా చేయచ్చు!"*

*రైతు తెలివికీ, సమయస్ఫూర్తికీ ఆ నగరవాసి తలమునకలయ్యాడు!*


*పూర్వం 10 మంది పిల్లల్ని కని కూడా ఎంతో ధైర్యంతో పెంచి పోషించే వారంటే, అంటే అలాంటి ధైర్యమే కారణం..ఉమ్మడి కుటుంబాలలో 'మేము ఉన్నాం' అనే భరోసా కారణం.*. 

*కాని ఈ రోజుల్లో ఒక్క పిల్లో పిల్లోడో చాలురా దేవుడా అనుకోవటానికి కారణం మేము ఉన్నాం చూస్కోటానికి అని భరోసా ఇచ్చే మనుషులు, బంధువులు మన చుట్టూ లేక పోవటం...*


*కష్టంలో మనిషికి నేనున్నా అనే భరోసా ఇవ్వండి అది కుదరక పోతే కనీసం ఒక మాట సాయం చేయండి..ఎందుకంటే మనిషికి మనిషే భరోసా కాబట్టి..  మనలో ఒకరికి ఒకరు ఐక్యత ముఖ్యం.*


*ప్రతి ఒక్కరి కథా కంచికి చేరుతుంది. ఆలోపునే మనం మనుషులుగా ఎదగాలి*

    🌹🌹🌹🌹🌹🌹

గ్రహాలు

 గ్రహాలు - ముఖ్యమైన విషయాలు


జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు చాలా ప్రధానమైనవి. అనంత విశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, కొన్ని గ్రహాలు, తోకచుక్కలు, గ్రహణాలు ఇవన్నీ ఆకాశంలో చూసి ఆనందించటంతో పాటు పూర్వకాలం వారికీ ఆశ్చర్యం కూడా కలిగేది. ఎంతో ఆసక్తి కూడా ఉండేది. ఈ కాలంలో టెలిస్కోప్, ఇంటర్నెట్ లో అన్ని విషయాలు చాలా సులువుగా తెలుసు కుంటున్నాం కాబట్టి మనకు చాల విషయాలు అద్భుతంగా అనిపించక పొవచ్చు. కానీ పూర్వ కాలం లో వారికీ అన్ని వింతగా, విశేషం గా వారిని ఆకర్షించి, తెలుసుకోవాలి అన్న కుతూహలాన్ని పెంచేవి. ఆ గ్రహాల గురించి కుతూహలం పరిశీలనా , ప్రాణులపై వాటి ప్రభావం వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, వాటికీ మానవ జీవితంతో ఉన్నా సంబంధము మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణం అయ్యాయి. కాబట్టి మానవ జీవనంపై ప్రభావం చూపుతున్న గ్రహాల గురించి మరిన్ని వివరములు తెలుసుకుందాం. 


గ్రహ సమయ వివరాలు

గ్రహ సమయాలు 27. అవి.. 1 స్నానసమయం 2 వస్త్రధారణ 3. తిలకధారణ 4 జపసమయం 5. శివపూజ 6. హోమసమయం 7. విష్ణు పూజా 8. విప్రపూజ 9. నమస్కార 10. అద్రి ప్రదక్షణ 11. వైశ్యదేవ 12 అతిధి పూజ 13. భోజన సమయం 14 విద్యాప్రసంగ 15. అక్రోశ 16. తాంబూల 17 వృపసల్లాప 18 కిరీటధారణ 19. జలపాన 20. అలస్య 21. నయన 22. అమృతాశన 23. అలంకరణ 24 ఫ్రీ సల్లాప 25, భోగ 26. నిద్రా 27. రత్న పరీక్షా సమయం.


గ్రహముల దృష్టి నిర్ణయం

సూర్యాది నవగ్రహములున్నూ 7వ స్థానమును సంపూర్ణ దృష్టితో చూస్తారు. శని 3-4-10 స్థానములను గురుడు 5-9 స్థానములను, కుజుడు 4-8 స్థానములను కూడా చూస్తారు.


గ్రహజప సంఖ్య ఎట్లుండును?

రవికి 6వేలు, చంద్రునికి పదివేలు, కుజునికి 7వేలు రాహువుకి 18వేలు బుధునికి 17వేలు గురునికి 16వేలు శుక్రునికి 20 వేలు శనికి 19వేలు, కేతువునకు 7వేలు.


గ్రహముల స్వభావము

రవి అర్థపాపి, చంద్రుడు శుభుడు, కుజుడు త్రిపాద పాపి బుధుడు అర్ధశుభుడు, గురుడు పూర్ణశుభుడు, శుక్రుడు త్రిపాద శుభుడు, శని, కేతువులు పూర్ణ పాపులు.


గ్రహ రుచులు

రవికి కారం, చంద్రునకు లవణం, కుజుడు చేదు, బుధునకు షడ్రసములు, గురునకు తీపి, శుక్రునకు పులుపు, శనికి వగరు రుచికరమయినవి.


గ్రహగతుల విధము

1. వక్రం 2 అతిచారం 3. స్థంభన 4. అస్తంగత్వం 5. సమాగమము.


గ్రహములకు ఉచ్చరాశులు

సూర్యునకు మేషం, చంద్రునకు వృషభం, కుజునకు మకరం, బుధునకు కన్య గురునకు కర్కాటకం, శుక్రునికి మీనం, శనికి తుల, రాహువునకు వృషభం, కేతువునకు వృశ్చికం.


గ్రహ రత్నములు

రవికి మాణిక్యం, చంద్రునకు ముత్యము, కుజునికి పగడం, బుధునికి మరకతం, గురువునికి, పుష్యరాగం శుక్రునకు వజ్రం, శనికి నీలం, రాహువునకు గోమేధికం. కేతువునకు వైఢూర్యం ప్రీతికరములు. ఇంకా.. రవికీ తామ్రము, చంద్రునకు మణులు కుజునికి బంగారం, బుధునకు ఇత్తడి కంచు, గురువుకు వెండి బంగారము, శుక్రునికి ముత్యములు, శనికి ఇనుము, రాహువుకి సీసం కేతువుకి నీలం, ఈ విధమయిన లోహములు ప్రధానములైనవి.


గ్రహముల కారకత్వములు

రవి పితృకారకుడు. చంద్రుడు మాతృకారకుడు, కుజుడు సోదరకారకుడు, బుధుడు వ్యాపార, సంపదలకు గురు విద్యాపుత్రులకు, శుక్రుడు, కళత్రయమునకు, శని ఆయుర్ధాయమునకు కారకులు.


    ఈ గ్రహములకు స్వక్షేత్రములు రవికి సింహం, చంద్రునకు వృషభం, కుజునకు మేషం, బుధునకు కన్య గురునకు ధనుస్సు, శుక్రునకు తుల, శనికి కుంభం, రాహువనకి సింహం. కేతువునకు కుంభం,


ఏ గ్రహ మెట్టిది ?

రవి స్థిరగ్రహం, చంద్రుడు చరగ్రహం, కుజుడు ఉగ్రగ్రహం. బుధుడు, మిత్ర, గురుడు మృదు, శుక్రుడు లఘు, శని తీవ్రగ్రహం.


గ్రహములకు గల షడ్బలం

1. స్థాన బలం 2. దిగ్బలం 3. చేష్టాబలం 4. కాలబలం 5. నైసర్గిక బలం 6. దిగ్బలం. ఈ ఆరు బలములను పరిశీలించి జాతక ఫలములు చెప్పవీలున్నది.


గ్రహ జాతులు

గురు శుక్రులు బ్రాహ్మణులు, శని కుజులు క్షత్రియులు, చంద్రుడు వైశ్యుడు, బుధుడు శూద్రుడు, శని చండాలుడు, బుధుని వైశ్యునిగ, శనిని శూద్రునిగా, రాహువును మేచునిగా చాలామంది చెబుతారు.


గ్రహకళ

గ్రహ కళలలో సూర్యునికి 30. చంద్రునికి 18, కుజునికి 6, బుధునకు 8, గురునికి 10, శుక్రునకు 12, శనికి 1 చొప్పున కళలు ఉండును.


గ్రహస్ఫుటమంటే..?

గ్రహం స్థితి పొందిన నక్షత్ర ప్రవేశ సమయం నుండి తర్వాత నక్షత్రమందు ప్రవేశించు సమయం వరకును గల మధ్యకాలమే గ్రహస్ఫుటము.


గ్రహావస్థలు

గ్రహావస్థలు 10, అందు 1. దీప్తావస్థ 2 స్వస్థ 3. ముదిత 4 శాంత 5. శక్తి 6. పీడితి 7. దీన 8 వికల 9. కల 10. భీతావస్థలు.


గ్రహ గుణములు

సూర్యచంద్ర గురులు సత్యగుణం గలవారు. కుజ, శని, రాహు, కేతువులు తమోగుణులు, బుధ, శుక్రులు, రజోగుణ ప్రధానులు.


గ్రహాధాతువులు

రవికి ఎముకలు, చంద్రునకు రక్తము, కుజునకు శిరోధాతు, బుధునకు చర్మం, గురునకు మేధస్సు, శుక్రునకు గుహ్యం, శని స్నాయువు ధాతువులు.


గ్రహదిక్కులు

రవి తూర్పు, చంద్రుడు వాయువ్యం, కుజుడు దక్షిణము బుధుడు ఉత్తరం గురుడు ఈశాన్యం. శుక్రుడు ఆగ్నేయం శని పశ్చిమం, రాహువు నైరుతి, కేతువు నైరుతి.


గ్రహపాటు అంటే..?

దీనిని గ్రహపాటు లేదా గ్రహచారం అని కూడా అంటారు. గ్రహస్థితి బాగులేనపుడు ప్రతికూలత ఎదురవుతున్నప్పుడు బాధపడటం సహజం. విధి మనకు రాసిపెట్టిన విధంగా జరుగుతుందిగాని మనమకొన్నట్లు జరుగదు.


గ్రహయుద్దం అంటే..?

బుధ, గురు, శుక్ర, శనులలో ఎవరైనా చేరుటవల్ల గ్రహయుద్ధ మేర్పడును.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557

ధార్మికగీత - 95*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                          *ధార్మికగీత - 95*

                                    *****

          *శ్లో:- అగ్నిహోత్రం,  గృహక్షేత్రే ౹*

                 *గర్భిణీమ్ వృధ్ధబాలకౌ  ౹*

                 *రిక్త హస్తేన నో పేయాత్ ౹*

                 *రాజానం దైవతం గురుమ్ ౹౹*

                                    *****

*భా:- లోకంలో మనం ఉత్త చేతులతో  పోకూడని, పోరాని సందర్భాలు,సన్నివేశాలు ఎనిమిది తారసపడు తుంటాయి. అవి.1. "అగ్ని హోత్రము":- మన పరి సర ప్రాంతాలలో లోకకళ్యాణార్థం జరిగే యజ్ఞ,యాగాల  సందర్శన కోసం వెళ్ళేటప్పుడు హోమ ద్రవ్యాలను భక్తితో అర్పించాలి. యాగఫలం మనకు శుభాల నిస్తుంది. 2."గృహక్షేత్రము":- బంధువుల ఇంటికి వెళ్ళే టప్పుడు పండ్లో,మిఠాయిలో తీసికొని వెళ్లడం మర్యాద సూచకము. 3."గర్భిణీ":- గర్భవతియైన స్త్రీ యోగక్షేమాల పరామర్శకై వెళ్ళేటప్పుడు ఫలమో, ఫలా హారామో ఆత్మీయంగా ఇచ్చి'  శుభా కాంక్షలు అందజేయాలి.4."వృద్ధులు":- వయోవృద్ధులను చూడడానికి వెళ్ళినపుడు,  ప్రేమాదరా భిమానాలతో మాట్లాడి' వారు తినగలిగినవి ఇవ్వాలి. 5."బాలలు":- కల్లా కపటం తెలియని దైవస్వరూపు లైన బాలల  వద్దకు వెళ్ళే టప్పుడు తప్పనిసరిగా  ఫలాలు, మిఠాయిలు ప్రేమతో ఇవ్వాలి. వారి ఆనందానికి మేర ఉండదు. 6."రాజు":- ప్రజల్ని కన్నబిడ్డలుగా, కంటికి రెప్పలా కాపాడే ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా పండ్లు అర్పించాలి. 7. "దేవుడు" :-దేవుని గుడికి వెళ్ళి నప్పుడు టెంకాయ, పండ్లు, పూలు భక్తిగా సమర్పించాలి. 8."గురువు":- జ్ఞానబోధచే జీవాత్మ,పరమాత్మ తత్త్వాన్ని తెలిపి, జీవిత నౌకకు చుక్కాని వంటి గురువు సన్నిధికి వెళ్ళేటప్పుడు సముచిత ద్రవ్యాలను వినమ్రంగా అర్పణ చేయాలి. వీరందరి హార్దిక శుభా శీస్సులు, శుభ కామనలు, శుభా కాంక్షలు మనకు శుభ ప్రదములు , మంగళ ప్రదములై సుఖ జీవనయానానికి రాచ బాట వేయగలుగుతాయి. మన శ్శాంతి నిచ్చి, ఆధ్యాత్మిక పురోగమనానికి  దోహదం చేస్తాయని సారాంశము*.

                                 *****

                 *సమర్పణ   :    పీసపాటి*   

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲 

                  .

శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము

 శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము



భగవానుడు యారీతిగ 

యగుపించియు స్వప్నమందు యానతి నీయన్ 

సగమగు రేయిని భూపతి 

ఖగవాహను దలచుకొనుచు క్షణమున లేచెన్   113


ఉదయ మైనంత వెంటనె నుర్విరేడు 

సభను గావించి తెల్పెను స్వప్న విధము 

సభికు లత్యంత విస్మయ సంభ్రమమున 

సాధు సాధంచు బల్కిరి సంతసమున       114


వసుధేసు డంతట  వర్తకు లిర్వుర 

            బంధముక్తుల జేయ భటుల బంపె 

సభలోని కొచ్చిన సాధువు యల్లుడు 

            భయముతో నుండిరి ప్రభును గాంచి 

అంత నభయమిచ్చి యా వర్తకులతోడ 

            యాప్యాయతంబుగా ననియెనిట్లు 

“వణిజప్రముఖులార ! వగచగా వలదింక 

            కారణంబులు లేక కలుగవేవి 

దైవ ప్రాతికూల్య తరుణంబు నందునే 

సకల యిడుము లెల్ల సంభవించు 

పరమ దైవ కరుణ ప్రసరించి నంతట 

సకల యిడుములెల్ల సమసిపోవు             115


జరిగిన దానికి వగచక 

పరమాత్ముని నమ్ముకొనియు పావన మదితోన్ 

సరగున వెళ్ళుడు నెలవుకు 

సిరితోడను యింక మీరు చింతలు లేకన్ "     116


అంతట భూపతి యా వర్తకులకును 

                ధైర్యంబు జెప్పియు దయను జూపె 

క్షురకర్మ చేయించి కొత్త దుస్తులు బెట్టి 

                భూషణంబుల నిచ్చె భూరిగాను 

రాజాన్నమును బెట్టి రాగంబు జూపించి 

                దయతోడ  రెట్టింపు ధనము  నిచ్చె 

మర్యాద చేసియు మన్నన జూపించి 

                మంచి మాటలు జెప్పె మధురముగను 

పిదప వారల తోడను ప్రియము గాను 

"మదిలొ యెటువంటి దిగులులు మసలనీక 

సొంత గృహమున కెళ్ళుడు సంతసమున "

యనుచు పలికెను కూర్మితొ యనుమతిచ్చి     117


అంత వర్తకు లిర్వురు సంతసిల్లి 

వందనంబులు యర్పించి వసుధపతికి

ధరణినాథుండు యిచ్చిన ధనముపొంది 

వెడలి రటనుండి నెలవుకు వేడ్కతోడ          118

 

               మూడవ అధ్యాయము 

                       సమాప్తము 


                                     సశేషము…


      ✍️గోపాలుని మధుసూదన రావు🙏

. శ్రీ దేవీ మహత్యము

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 29  / Sri Devi Mahatyam - Durga Saptasati - 29 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 8*

*🌻. రక్తబీజ వధ - 3 🌻*


29. ఆ మహాసురులు శివునిచేత తెలుపబడిన దేవీ వాక్యాలు విని రోషపూరితులై కాత్యాయని* ఉన్న చోటికి వెళ్ళారు.


30. అంతట గర్వకోపపూర్ణులైన ఆ సురవైరులు మొదటనే దేవిపై బాణాలను, బల్లాలను, ఈటెలను కురిపించారు.


31. ఆ ప్రయోగింపబడిన బాణాలను, శూలాలను, బల్లాలను, గండ్రగొడ్డండ్లను ఆమె పూర్తిగా లాగబడిన తన వింటి నుండి వెడలేమహాబాణాలతో అవలీలగా ఛేదించివేసింది.


32. అంతట అతని (శుంభుని) ఎదుటే శత్రువులను శూలపుపోట్లతో చీల్చివేస్తూ, పుట్టైపిడి గల బెత్తంతో మర్దిస్తూ, కాళి చరించింది.


33. బ్రహ్మాణి తాను ఎచటికి పోయినా తన కమండలూదకాలను శత్రువులపై చల్లి వారిని ధైర్య, శౌర్య విహీనులనుగా చేస్తోంది.


34. మాహేశ్వరి త్రిశూలంతో, వైష్ణవి చక్రంతో, కౌమారి బల్లెంతో కోపంగా దైత్యులను పరిమార్చారు.


35. ఐంద్రి ప్రయోగించిన వజ్రాయుధంతో చీల్చబడి దైత్యులు దానవులు నూర్లకొలద్దీ నేలకూలారు. వారి నుండి రక్తపునదులు పారాయి.


36. వారాహియొక్క ముట్టెదెబ్బలవలన ధ్వంసము చేయబడి,

కోరలమొనపోటులవలన గుండెలో గాయపడి, చక్రపు తాకుడువలన చీల్చివేయబడి (అసురులు) పడిపోయిరి.


37. నారసింహి ఆకసమును, దిక్కులను తననాదములతో నిండించుచు, తన గోళ్లతో చీల్పబడిన ఇతర మహాసురులను భక్షించుచు యుద్ధములో సంచరించెను.


38. శివదూతి యొక్క భయంకరములగు అట్టహాసముల (పెద్దనవ్వు) వలన ధైర్యముసడలి అసురులు నేలపై కూలిపడుచుండిరి. ఆ కూలినవారిని ఆమె భక్షించుచుండెను.


39. రోషపూరితలైన మాతృకలు - వివిధోపాయాలతో మహాసురులను ఇలా మర్దించడం చూసి సురవైరి సైనికులు పారిపోయారు.


40. మాతృగణం వల్ల పీడింపబడి దైత్యులు పారిపోవడాన్ని చూసి రక్తబీజమహాసురుడు కుపితుడై యుద్ధం చేయడానికి ముందుకు వచ్చాడు.


41. అతని శరీరం నుండి రక్తబిందువు భూమిపై పడినప్పుడల్లా అతనిలాంటి అసురుడొకడు భూమి నుండి లేస్తున్నాడు.


42. ఆ మహాసురుడు గదాహస్తుడై ఇంద్రాణితో పోరాడాడు. ఆమె అంతట తన వజ్రాయుధంతో అతనిని కొట్టింది. 


43. వజ్రాయుధపు దెబ్బవల్ల అతని నుండి వెంటనే రక్తం అతిశయంగా కారింది. ఆ రక్తం నుండి అతని రూపంతో, అతని పరాక్రములైన యుద్ధవీరులు ఉత్పత్తి అవసాగారు.


సశేషం....

🌹 🌹 🌹 🌹

కార్తీక మాస కృత్తికా దీపోత్సవ ఫలితం*

 🌹🌾🌺🥀💐🌸🌷

*కార్తీక మాస కృత్తికా దీపోత్సవ ఫలితం*


*కార్తీక మాసమున దీపదానము (అనగా దీపారాధన) చేసినచో సంవత్సర మంతయూ దీపదానము చేసిన ఫలము కల్గును.*


*కార్తీక మాస పూర్ణిమ రోజున కృత్తికా నక్షత్రం ఉన్ననూ లేకున్ననూ దీపారాధన చేసి దీపదానము చేయవలెను*


*దేవాలయమును శుభ్రపరచి అలంకరించి స్వామికి స్నపన, ఉత్సవ, అర్చనాదులు గావించి సాయంసమయమున నేతితో గాని, నువ్వుల నూనెతో గాని అనేక దీపములను వెలిగించి దేవుని ఉభయపార్శ్వములయందు, ముఖమండప ద్వారములయందు దీపములను ఉంచవలయును.* 


*ఆలయ ఆవరణలయందు దిక్కులలోను విదుక్కులయందు దీపములను ఉంచవలెను.*


 *దీపపాత్ర యందు పెద్ద (అఖండ) దీపమును వెలిగించి ఆరాధించి, బలిపీఠమునకు పశ్చిమ భాగమున దీపమణ్ణపమున ఉంచి "శుభ్రాజ్యోతిరితి” మంత్రముతో దీపదణ్ణాగ్రమున ఉంచవలయును.*


*దేవుని చిత్రవస్త్రములతో అలంకరించి అర్చించి అపూపాది భక్ష్య, భోజ్యములను అనేకములు సమర్పించిన యెడల కోరిన కోరికలు తీరి కీర్తి, ధనము, విజయము లభించి విష్ణులోకమును పొందెదరు.*


                    *భక్తి*

                   M.s.s.k

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



నిఖిలేశ్వరా ! నీదు నిడుపు కేశంబులు

             యాకాశమునకుండ యనిరి " శిఖి " గ

భుజగేంద్రు వాసుకిన్ భూషణంబుగ దాల్చి

             యరయ " కలాపి " గ నైతి వీవు

నతులగు భక్తుల ననయంబు బ్రోచెడి

             ప్రణవంబుతో " కేకి " వైతివీవు.

నగమందు బుట్టిన ఘనకాంతులను గాంచి

             నృత్యంబు చేయును నెమలి యెపుడు

నగజాత పార్వతి ఘనశ్యామ కాంతికి

              పులకించి నృత్యంబు పొందె దీవు.

నెమలి యుద్యానవనమున నృత్యమొందు

నీవు నిగమోపవనమున నిలచి యాడ

" నీల కంఠుని " శబ్దంబు నిక్కమయ్యె

నిన్నె పూజింతు నిరతంబు నీలకంఠ !       53



సరస సంధ్యారంభ సద్వర్ష వేళలో

              ప్రకృతి ప్రశాంతతిన్ పరిఢవిల్ల

శ్రీహరి కరవాద్య సృజనమౌ స్వనములు

              ఘనసంఘ గర్జన కరణి కాగ

నంబరంబందున్న యమరుల దృక్కులే

             విరిసి వెల్లువైన మెఱుపులుగను

భక్తుల పరితోష భాష్పకణంబులే

             వారిద సంభూత వర్షముగను

పార్వతీదేవియే భాసిల్లు చుండెడి

              యాడునెమలి భంగి యలరు చుండ

యే యుమామహేశ్వరునందు విభవముగను

దివ్య తాండవ నృత్యంబు తేజరిల్లు

నట్టి శ్రీనీలకంఠుని యమిత భక్తి

పావనంబగు మదితోడ భజన సేతు          54



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కార్తిక పూర్ణిమ విశేషం*

 🌹🌾🌺🌷💐🌸🥀

*కార్తిక పూర్ణిమ విశేషం*


*కార్తీక పూర్ణిమ భరణీ నక్షత్రముతో గాని, కృత్తిక నక్షత్రముతోగాని, రోహిణి నక్షత్రముతో గాని కలసి వచ్చినచో ఆ పూర్ణిమ దినమును మహాకార్తికీ యందురు.*


*ఈ యోగమును పరవిద్దగా గ్రహించవలెను.*


*భరణీ నక్షత్రయోగము దేవతలకు కూడ దుర్లభమని భవిష్యత్ పురాణమున గలదు.* 


*కృత్తికా యోగము మహాపుణ్యమని రోహిణీ యోగము దేవతలకు కూడ దుర్లభమని బ్రహ్మపురాణమున గలదు*


*విశాఖ మూడవ పాదములో సూర్యుడు సంచరించు చుండగా, చంద్రుడు కృత్తికా నక్షత్రము మొదటిపాదమందు ఉన్నచో ఆ తిథి చాలగొప్పతనము కలిగి 'మహతీ అని, అందురు.*


*ఆతిధి రోజు చేసిన స్నాన, దానములు అనంతఫలదాయకములు అని విష్ణు పురాణమున గలదు. పూర్ణిమ చతుర్దశీ విద్ద కల్గిఉన్నచో దానిని త్యజించి పరవిద్దతో కూడిన దానిని స్వీకరించవలెను అని స్మృత్యంతరమన కలదు.*


*ఆరు ముహూర్తములతో కలసిన చతుర్దశీ వేధ విశేషము. మూడు ముహూర్తములతో కలసిన వేధ సామాన్యము. ఈ రెండింటిని వదలి పాడ్యమీ వేధ గల్గిన పూర్ణిమను స్వీకరించవలెను.*


*పరదినమున పాడ్యమి మూడు మహూర్తములతో పూర్ణిమ వేధ కల్గిననూ లేక తిథి క్షయము వలన సూర్యోదయము కంటే ముందే పూర్తి యైననూ, అప్పుడు పూర్వదినమునే స్వీకరించవలెను.*            


*తిథి వృద్ధిలో ఉన్నయెడల పూర్వదినమున సూర్యోదయ ఆరంభం నుండి పరదినము సూర్యోదయ అనంతరము వరకు వ్యాపించి యుండి పూర్ణిమ రెండు మహూర్తముల పర్యంతము ఉన్నచో అప్పుడు శుద్దమైన తిథియగుటచేత, పూర్ణతిథి యగుటచేత పూర్వదినమే గ్రాహ్యము*

 

                     *భక్తి*

                    M.s.s.k

కార్తీక దీపారాధన శ్లోకము

 కార్తీక దీపారాధన శ్లోకము


 శ్లోకం ||

      కీటా: పతంగా: మశకాశ్చ  వృక్షా:

         జలే స్థలే యే నివసన్తి జీవా:

      దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగిన:

       భవంతి త్వం శ్వపచాహి విప్రా:||


దీప దాన శ్లోకము

 సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం!

దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ !!!🕉️🔥🙏🪔🪔🪔

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సీతమ్మ భక్తి..*


"ఇక మళ్లీ వస్తానో..లేనో..ఈ జన్మకు ఇదే ఆఖరి చూపు అవుతుందేమో..బొత్తిగా శరీరం సహకరించడం లేదు..ఆరోగ్యమూ అంతంత మాత్రం గానే ఉంది..వయసూ మీదబడింది..లేని ఓపిక తెచ్చుకొని..వచ్చాను నాయనా..ఒక్కసారి సమాధి దర్శనం చేసుకొని వస్తాను.." ఎనభై అయిదేళ్ల సీతమ్మ గారు ఈమధ్య మందిరానికి వచ్చినప్పుడు అన్నారు..సరే అన్నాను..మెల్లిగా నడుస్తూ..కొడుకు సహాయంతో శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..సమాధికి తల ఆనించి ప్రార్ధించుకొని..నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..ఆ క్షణం లో ఆవిడ కళ్ళల్లో ఎనలేని తృప్తి కనిపించింది..


సీతమ్మ గారిది నెల్లూరు..శ్రీ స్వామివారిని మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో చూసారు..అప్పటికి ఆవిడ వయసు దగ్గర దగ్గర నలభై ఏళ్లు..సీతమ్మ గారు, ఆవిడ భర్త రాజేశ్వరరావు గారు మాలకొండ లోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శనానికి వచ్చారు..అక్కడ దర్శనం చేసుకున్న తరువాత, శివాలయం, పార్వతీదేవి మఠం చూద్దామని వచ్చారు..శివాలయం లోకి ఆ దంపతులు అడుగుబెట్టే సమయానికి అక్కడ శివలింగం ప్రక్కన శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణమే ఈ దంపతులకు భక్తి భావం ఏర్పడింది..అప్రయత్నంగా చేతులెత్తి నమస్కారం చేశారు..శ్రీ స్వామివారు కుడిచేతితో ఆశీర్వచనం చేసి..వీళ్ళిద్దరిని కూర్చోమన్నట్లు సైగ చేశారు..ఇద్దరూ శ్రీ స్వామివారికి అభిముఖంగా కొద్దిదూరంలో కూర్చున్నారు..


"ఏ ఊరు నుంచి వస్తున్నారు?.." అని శ్రీ స్వామివారు అడిగారు.."నెల్లూరు నుంచి స్వామీ.." అన్నారు..సంతానం గురించి అడిగారు..తమకు ఇద్దరు పిల్లలనీ మొదట అమ్మాయి పుట్టిందని..తరువాత కుమారుడు కలిగాడనీ.. ఇద్దరినీ వాళ్ళ అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి ఈరోజు తాము మాలకొండకు వచ్చామని చెప్పారు..కొద్దిసేపు మౌనంగా ఉన్న తరువాత..మరొక్కసారి ఆ దంపతులను ఆశీర్వదించి..వెళ్ళిరమ్మని చెప్పి పంపించివేసారు శ్రీ స్వామివారు..అక్కడనుంచి తిరిగి నెల్లూరు వచ్చేదాకా ఆ దంపతులకు శ్రీ స్వామివారే పదే పదే గుర్తురాసాగారు..


ఆ తరువాత మరో మూడు నెలలకు మళ్లీ పిల్లలతో సహా మాలకొండకు వచ్చారు సీతమ్మ గారు..ఆరోజు శ్రీ స్వామివారి దర్శనానికి చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది..సాయంత్రానికి శ్రీ స్వామివారు పార్వతీదేవి మఠం లో కలిసారు.. నమస్కారం చేసుకొని వచ్చారు..అలా రెండు మూడు సార్లు శ్రీ స్వామివారిని కలవడం కోసమే మాలకొండకు ఆ దంపతులు వచ్చారు..చిత్రంగా వారు మాలకొండకు వచ్చిన ప్రతిసారీ శ్రీ స్వామివారు దర్శనం ఇచ్చేవారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపాన ఫకీరు మాన్యం లో ఆశ్రమం నిర్మించుకొని నివాసం ఏర్పరచుకొని..తన తపోసాధన చేసుకునే రోజుల్లో సీతమ్మ గారు భర్త తో కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత.. సీతమ్మ గారు అప్పుడప్పుడూ వచ్చి శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకునేవారు..


"మా అమ్మాయి వివాహం కావడం చాలా ఆలస్యం జరిగింది..స్వామివారి సమాధి వద్దకు వచ్చి గట్టిగా ప్రార్ధించాను.. నువ్వు నమ్ము నమ్మకపో నాయనా..సరిగ్గా రెండు వారాల్లో సంబంధం కుదిరింది..నెలలోపే పెళ్లి జరిగిపోయింది..అంతా కల లాగా జరిపించేశాడు మాహానుభావుడు..అట్లాగే దానికి సంతానం కలుగకపోతే..మా అమ్మాయిని అల్లుడిని తీసుకొచ్చి ఐదు వారాల పాటు ప్రతి శనివారం ఇక్కడ నిద్ర చేయించాను..సంవత్సరానికల్లా దానికి కొడుకు పుట్టాడు..ఒకటా..రెండా..ఎన్నని చెప్పను?..అడుగడుగునా మా ముందే వుండేవాడు ఈ స్వామి.."అంటూ కన్నీళ్లతో చెప్పారు సీతమ్మ గారు..రెండేళ్ల క్రిందట సీతమ్మ గారి భర్త రాజేశ్వర రావు గారు మరణించారు..ప్రస్తుతం కుమారుడి దగ్గర చెన్నై లో వుంటున్నారు..


"ఇప్పటికీ మాకు ఏదైనా కష్టం కలిగితే..స్వామివారి పటం ముందు నమస్కారం చేసుకొని..విభూతి ని నుదుటన పెట్టుకుంటాను..చేత్తో తెసేసినట్లుగా ఆ కష్టం తీరిపోతుంది..నువ్వేమీ పెద్దగా పూజలు..ఆర్భాటాలు చేయాల్సినపనిలేదు నాయనా..మనసులో పూర్తి భక్తి విశ్వాసాలతో ఆ స్వామిని కొలువు చాలు..అన్నీ ఆయనే చూసుకుంటాడు!!" అంటుంటారు సీతమ్మ గారు..


ఆ నిష్కళంక భక్తురాలి మాటలు నిజమే కదా!!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

బ్యాచ్ మేట్లను

 ఒక బ్రిటిష్  కల్నల్ సాబ్ తన సిపాయిలతో ఎక్కడికో వెళ్తుండగా పొరపాటున చూసుకోకుండా ... నేలబారున ఉన్న నూతిలో పడిపోయారు .... వెంటనే ఎలర్టయిన సైనికులు ఒక తాడు తీసుకొచ్చి కల్నల్ ని పైకి లాగుతున్నారు .... సచ్చిచెడి కల్నల్ నూతి పై అంచుకొచ్చేసరికి .... నిబంధనలు ఖచ్చితంగా పాటించే సిపాయిలు .... ఎటెన్షన్ లోకి వచ్చి ... తాడు వదిలేసి కల్నల్ కి సెల్యూట్ చేసేసరికి ... కల్నల్ మళ్ళా నూతిలో పడిపోయాడు .... 

           ఇలా .... మూణ్ణాలుగుసార్లు .... తాడట్టుకుని 

కల్నల్ పైకి రావటం ... ఆయన్ని చూసిన జవాన్లు శాల్యూట్ చేసే పనిలోపడి తాడొదిలేయటం .... దొరగారు మళ్ళా నూతిలో పడిపోటం చూసిన నాలాంటి పెద్దయనొకడు ..... అదికాదుగాని అబ్బాయిలు .... ఈయనకంటే పెద్దపీసర్ని పట్టుకురండయ్యా .... ఆయనయితే .... ఈనగారు బైటికొచ్చినప్పుడు శాల్యూట్ సెయ్యడు .... పని జరుగుద్ది ... అనేసరికి ... ఆ ఐడియా నచ్చిన సిపాయిలు ... బ్రిగేడియర్ ని తీసుకొచ్చారు .... 

                   సైనికుల సాయంతో బ్రిగేడియర్ ... తాడట్టుకుని కల్నల్ ని బయటకు లాగుతున్నాడు .... మొత్తానికి పై అంచుకు చేరిన కల్నల్ ... ఇంక పర్లేదు బయటకొచ్చేస్తాడు అనుకుంటుండగా .... అతను తాడు లాగుతున్న బ్రిగేడియర్ని చూశాడు ..... నిబంధనలంటే ప్రాణమిచ్చే కల్నల్ ... వెంటనే తన పై అధికారికి శాల్యూట్ చేశాడు .... ఇంకేముంది మళ్ళా ఎనక్కి నూతిలోకి పడిపోయాడు ..... 

                    ఇదంతా చూసి చిర్రెత్తిపోయిన బ్రిగేడియర్ .... ఒరే బుర్ర తక్కువ దద్దమ్మల్లారా .... వెళ్లి వాడి బ్యాచ్ మాట్ ఎవడైనా ఉన్నాడేమో చూసి అతణ్ణి పట్రండి .... ఆడైతే .... ఆడూ ఈడూ సేమ్ క్యాడర్ కాబట్టి ఈ శాల్యూట్ ల గోలుండదు ....అని హుకుం జారీ చేశాడు .... 

                     వెంటనే స్పందించిన సైనికులు .... కల్నల్ బ్యాచ్ మేట్ ఎవర్నో వెతికి పట్టుకొచ్చి పాపం కల్నల్ని నూతి నుండి బయటకు తీసేసరికి కథ  సుఖాంతం అయ్యిందనుకోండి .... 

 *నీతి : ఎప్పుడూ మీ బ్యాచ్ మేట్లను మాత్రం మర్చిపోకండి ....* 😂🤣🤪

represent Hindus in India...

 20201128-FB:

Congress asks Who gave BJP/RSS the right to represent Hindus in India......

Please read Neil Mexi's answer on quora:

...

But who gave you the right to steal and claim all of India’s freedom struggle as gift/charity to Indian masses by the sole family/nepotistic dynasty - The Gandhis? Aren't you erasing, white washing, mocking the sacrifices of millions of freedom fighters, mass heroes like Bhagat Singh, Chandrashekar Azad, Subash Chandra Bose etc that laid down their lives for the country?


Who gave you right to loot India for 60 years? Who gave you right to name all airports, ports after your nepotistic family? Is India your personal property?


Who gave you right to donate India’s land coco Islands etc to other nations without seeking Indian masses permission? Is India’s land your personal property?


Who gave you right to declare muslims as minority when Parsis, Jains, Jews, Buddhists, are actual minority and muslims the second largest majority?


Who gave you right to tax hindu temples and shrines and use the money for government and expenditure for all religion masses, but exempt tax on muslim and Christian shrines in name of appeasement? Are you punishing hindu faith believers for being hindus?


Who gave you right to segregate common laws meant for all? You reformed Hindu law and don't touch other religion’s law?


Who gave you right to allow muslims to practice polygamy etc but ban other faiths to do it, isn’t this sheer hypocrisy/ open bias towards one religion followers under the pretence of being secular party?


Who gave you right to spend Indian tax payers money on madrassa religious education when you don't pay same amount of funds to other religion followers education?


Who gave you right to fund haj subsidies, provide minority quota etc to them when you don't provide same subsidies to other faiths to visit their shrine or provide minority quota to kashmiri pandits in JK or other 8 states where hindus are in a minority?


Who gave you right to send/ use Indian navy frigate to lay wreath on sea burial of Edwina Mountbatten by her love interest Nehru in his personal capacity at British’s South Coast? Is Indian Navy machinery, your family members personal property?


Who gave you right to provide secret/safe passage to criminal Warren Anderson, Union Carbide CEO who was charged with manslaughter by Indian court and put in custody?


Who gave you right to flee a person from custody who was responsible for blinding and deaths of lakhs of people in Bhopal gas tradegy? Whose generation after generation still suffer deformity and yet received no compensation from them. Wasn't that betrayal and criminal on your part to India?


Who gave you right to mock 26/11 tragedy, strikes at border etc from the likes of Digvijay Singh, Sanjay Nirupam etc?


When Dynasty family can answer all these questions, they can bother questioning others.


" *All Indians should forward to atleast 5 people or groups*"

Vykyanam








 

Pravachanam