19, జూన్ 2021, శనివారం

ప్రార్థన

 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


🌻 *ప్రార్థన* 🌻



🍃🌺 ప్రార్థన అనేది ఒక మానసిక భోజనం లాంటిది. 

శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని చేకూర్చడానికి ఆహారం ఎలా తీసుకుంటున్నామో, మనస్సు కూడా ఆరోగ్యముగా, శక్తివంతముగా స్వచ్ఛముగా ఉండడానికి ప్రార్థన కూడా అంతే అవసరముగా చేస్తుండాలి...


🍃🌺 ప్రార్థన అనేది దేవుని నిర్ణయాన్ని మార్చలేదు కానీ మన మనస్సుని ప్రభావితం చేసి శాంతిని చేకూరుస్తుంది...


🍃🌺కోరికలతో చేసే ప్రార్థనలు దైవమును కదిలించలేవు. అవి వృథాగా పోవాల్సిందే! కానీ దిక్కుతోచని, అతి క్లిష్ట పరిస్థితుల్లో హృదయాంతరాళం నుండి పొంగిపొరలి వచ్చే ప్రార్థనలు వెనువెంటనే దేవుని చేరతాయి.

 

🍃🌺ఫలితాలు కూడా వెనువెంటనే అనుగ్రహించబడవచ్చు కూడా, అయితే కొన్నిసార్లు ఫలితాలు సమయ సందర్భాలకు అనుగుణముగా ఇవ్వడం జరుగవచ్చు.అది కూడా మన మంచికే తప్ప చెడు ఏమీ ఉండదు. 


🍃🌺ఏది ఏమైనా సరే ప్రార్థనను మన జీవితంలో ఒక భాగం చేసుకోవడం చాలా ముఖ్యం. దీని వలన ఇహలోక శాంతులే కాక పరలోక శాంతులు కూడా సొంతమవుతాయి.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.*

 🙂🙂🙂🙂🙂   *కొన్ని ప్రాచీన భారతీయ ఆరోగ్య చిట్కాలు.* 

 1. *అజీర్నే భోజనమ్ విశం.*    ముందు తీసుకున్న లంచ్ జీర్ణం కాకపోతే, డిన్నర్ తీసుకోవడం, పాయిజన్ తీసుకోవడంతో సమానం (మునుపటి ఆహారం జీర్ణమైతే, మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరియు అనుభూతి చెందుతాము. ఆకలి అనేది మునుపటి ఆహారం జీర్ణం కావడానికి ఒక సంకేతం)

 2. *అర్ధరోగహరి నిధ్రా* 

సరైన నిద్ర, మీ వ్యాధులలో సగం నయం చేస్తుంది. 

3. *ముద్గధాలి గధవ్యాలి* 

   అన్ని రకాల పప్పుధాన్యాలలో,  పచ్చ పెసలు (గ్రీన్‌గ్రామ్‌లు)

 ఉత్తమమైనవి.

ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇతర పప్పుధాన్యాలు అన్నీ, ఒకటి లేదా మరొకటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి.

4. *బాగ్నస్తి సంధనకరో రాసోనాహా* 

    వెల్లుల్లి విరిగిన ఎముకలతో కలుస్తుంది. 

5. *అతి సర్వత్రా వర్జయెత్*

    అధికంగా తినేది ఏదైనా, అది మంచి రుచిని కలిగి ఉన్నా, ఆరోగ్యానికి మంచిది కాదు. మితంగా (తక్కువ) తినండి. 

6. *నాస్తిమూలం అనౌషాధం*

   శరీరానికి ఎటువంటి ఔషధ ప్రయోజనం  లేని కూరగాయలు అంటూ లేవు. 

7. *నా వైద్యా ప్రభుయుయుషా*

    ఏ డాక్టర్ కూడా మన దీర్ఘాయువుకు ప్రభువు కాదు. 

వైద్యులకు కొన్ని  పరిమితులు ఉన్నాయి. 

8. *చింతా వ్యాధి ప్రకాషయ*

   చింత అనారోగ్యాన్ని తీవ్రతరం చేస్తుంది. 

9. *వ్యాయమాస్చ సనైహి సనైహి*

   ఏదైనా వ్యాయామం నెమ్మదిగా చేయండి. వేగవంతమైన వ్యాయామం మంచిది కాదు. 

10. *అజవత్ చార్వనం కుర్యాథ్*

  మీరు తినే ఆహారాన్ని మేక లాగా నమలండి. ఎప్పుడూ ఆత్రుత తో ఆహారాన్ని మింగకూడదు. జీర్ణక్రియలో లాలాజలమే మొదట సహాయపడుతుంది. 

11. *స్నానమ్ నామా మనప్రసాధనకరం ధుస్వాప్న విధ్వసం* 

   స్నానం డిప్రెషన్ ను తొలగిస్తుంది. 

ఇది బాడ్ డ్రీమ్స్ (చెడ్డ కలలను) ను దూరం చేస్తుంది. 

12. *నా స్నానం ఆచరేత్ భుక్త్వా*.           ఆహారం తీసుకున్న వెంటనే బాత్ తీసుకోకండి. జీర్ణక్రియ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. 

13. *నాస్తి మేఘసమం తోయం.* 

   స్వచ్ఛతలో వర్షపునీటిని, ఏ నీరు సరిపోలడం లేదు. 

14. *అజీర్నే భేజాజం వారీ*

     త్రాగునీరు తీసుకోవడం ద్వారా అజీర్ణాన్ని పరిష్కరించవచ్చు. 

15. *సర్వత్ర నూతనం శాస్తం సేవకన్న పురతనం.* 

   తాజా విషయాలను ఎల్లప్పుడూ ఇష్టపడండి. 

ఓల్డ్ రైస్ మరియు ఓల్డ్ సర్వెంట్‌ను కొత్తగా మార్చాల్సిన అవసరం ఉంది. (ఇక్కడ సేవకుడి విషయంలో అసలు అర్థం ఏమిటంటే: అతని విధులను మార్చండికానీ, ముగించవద్దు.) 

16. *నిత్యామ్ సర్వ రసభ్యాసహా.* 

   ఉప్పు, తీపి, చేదు, పులుపు, ఆస్ట్రింజెంట్ మరియు పంజెంట్) అన్ని రుచులు కలిగి ఉన్న పూర్తి ఆహారాన్ని తీసుకోండి. 

17. *జతారామ్ పూరైధార్ధమ్ అన్నాహి*

 మీ కడుపు అరవంతు ఘనపదార్థాలతో, పావువంతు నీటితో నింపండి మరియు మిగిలినది ఖాళీగా ఉంచండి. 

18. *భుక్త్వోపా విసస్థాంద్ర*

  ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఎప్పుడూ పనిలేకుండా కూర్చోవద్దు. కనీసం అరగంటైనా నడవండి. 

19. *క్షుత్ సాధూతం జనయతి*

  ఆకలి, ఆహార రుచిని పెంచుతుంది. (ఇంకా చెప్పాలంటే, ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి.)

 20. *చింతా జరానామ్ మనుష్యానమ్* 

    చింతించడం అనేది  వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తుంది. 

21. *సతం విహయ భోక్తవ్యం*

   ఆహారం తీసుకొనే  సమయం వచ్చినప్పుడు, 100 ఉద్యోగాలను కూడా పక్కన పెట్టండి. 

22. *సర్వ ధర్మేశు మధ్యమామ్*. 

  ఎల్లప్పుడూ మధ్యే మార్గాన్ని ఎంచుకోండి. దేనిలోనైనా విపరీతంగా వెళ్లడం మానుకోండి.

🙏 ఓం తత్ సత్ 🙏🏻

అస్తి.. భాతి.. ప్రియం..

 *అస్తి.. భాతి.. ప్రియం..*




నామరూపాత్మకమైన ఈ జగత్తంతా నిజానికి బ్రహ్మమే. మనలను ఆవరించి ఉన్న మాయ మనలను ఆ బ్రహ్మాన్ని గుర్తించకుండా చేస్తుంది. మాయకు ఆవరణ శక్తి విక్షేప శక్తి అని రెండు శక్తులు ఉన్నాయి ఆ శక్తుల వల్ల లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు మనకు కనిపిస్తుంది. ఈ మాయా శక్తిని తొలగించుకుని అసలైన బ్రహ్మాన్ని కనిపెట్టడానికి బ్రహ్మ యొక్క తత్వాన్ని ఉపనిషత్తుల ద్వారా తెలుసుకోవాలి.


బ్రహ్మ తత్వాన్ని ఉపనిషత్తులు కూడా స్పష్టంగా నిర్వచించ లేవు. బ్రహ్మం కానిది ఏమిటో ఉపనిషత్తులు  స్పష్టంగా చెప్తాయి. షడ్ వికారాలు బ్రహ్మానికి లేవు. షడ్ వికారాలు అంటే పుట్టుక, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, కృశించుట, మరణించుట. ఇవన్నీ ప్రాణి ధర్మాలు. ఈ మాటలలో ఉండుట అనేదానికి నిజానికి ఉండకపోవుట అనేది అర్థం. అంటే ఒకప్పుడు ఉండి మరొకప్పుడు ఉండకపోవడం. మనకు కనబడేదంతా నామరూపాత్మకమైన జగత్తు. కనబడే వాటిని గ్రహించడంలో విశేషం లేదు. మనం చూడనటువంటి వాటిని ఇతరులు వర్ణించి చెబితే ఆ వర్ణనను బట్టి మనం ఆ వస్తువును ఊహించి తెలుసుకుంటాము. ఇలా తెలుసుకొన్న వస్తువులను కూడా కలుపుకుంటే నే ప్రపంచం అవుతుంది. ప్రేమ ద్వేషము ప్రతీకారము వంటి విషయాలు కనపడవు. చేతికి దొరకవు. కానీ వాటి పేర్లను బట్టి మనము వాటిని గుర్తిస్తాము. కాబట్టి ఈ ప్రపంచంలో ఉండే వస్తువులు మొత్తం నామరూపాత్మక మైనవి. నామరూపాత్మకమైన వస్తువులన్నీ షడ్ వికారాలకు లోనవుతాయి. కాబట్టి మనకు కనిపించే లేదా మనం ఊహించి తెలుసుకుననే ఈ ప్రపంచమంతా మాయ అని తెలుసుకోవాలి.


ఇక బ్రహ్మ యొక్క లక్షణాలు సత్ చిత్ ఆనందాలు. ఈ లక్షణాలనే మరొక విధంగా అస్తి, భాతి, ప్రియం అని కూడా అంటారు. అస్తి (సత్) అంటే మూడు కాలాల్లోనూ షడ్ వికారాలకు లోనుకాకుండా స్థిరంగా ఉండేది అని.


చిత్ అంటే చైతన్యము. ఈ గుణము బ్రహ్మాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తుంది. భాతి అంటే ప్రకాశిస్తుంది అని అర్థము. మామూలుగా అయితే మన ఇంద్రియాల ద్వారా మనము గ్రహింప గలిగేది అని అర్థము. బ్రహ్మము అట్లా ఇంద్రియాల ద్వారా గ్రహింప గలిగేది కాదు. అంతకరణ ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే గ్రహింప గలిగేది. ఏదో ఒక విధంగా గ్రహింపగలం కాబట్టి భాతి అనే పదం వాడుతున్నాము.


ఆనందం అనే పదం బ్రహ్మానికి వర్తిస్తుంది.  సృష్టిలో పదార్థాలకంటే జీవుడికి తన మీదనే మక్కువ ఎక్కువ. మంచి భోజనము సౌకర్యాలు మొదలైనవి శరీరానికి అంటే అన్నమయ కోశానికి కోరుకుంటాము. సత్కర్మలు చేసి ఉత్తమ లోకాలకు వెళ్లాలని కోరుకోవడం జీవాత్మకు అంటే విజ్ఞానమయ కోశానికి సంబంధించిన కోరిక. అది దాటితే ఆనందమయ కోశం వస్తుంది. ఉపనిషత్తులు బ్రహ్మాన్ని ఆనందమయంగా వర్ణిస్తాయి. అంటే ఆత్మ లేదా బ్రహ్మము అనే దాని ముఖ్య గుణము ఆనందము అని తేలుతుంది. ఈ ఆనంద తత్వాన్ని ప్రియం అనే పదం సూచిస్తుంది.


నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి. వాటిలోంచి నామ రూపాలను తీసేస్తే మాయ తొలగిపోతుంది. మిగిలిన అస్తి భాతి ప్రియం అనే మూడు గుణాలు కలిగిన వస్తువు అంటే సత్ చిత్ ఆనంద మయమైన  కేవల బ్రహ్మము. అది మిగిలిపోతుంది.


నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాలు మాయ ఆవరించిన బ్రహ్మాన్ని సూచిస్తాయి అని పైన చెప్పుకున్నాము. సగుణోపాసన చేయడానికి నామరూపాలు కలిగిన భగవంతుడిని ఆధారంగా స్వీకరిస్తాము. శుద్ధ బ్రహ్మాన్ని ఆ విధంగా ఉపాసించ లేము.


దృగ్ దృశ్య వివేకమనే వేదాంత గ్రంథం లో ఈ నామ రూపాలు, అస్తి భాతి ప్రియం, అనే ఐదు పదాల వివరణ ఉన్నది. శ్రీ విద్యారణ్యులు ( సాయణ భాష్యం, పంచదశి మొదలైన గ్రంధాలు రాసిన వారు) ఈ పుస్తకాన్ని రాశా రంటారు. చాలా వేదాంత గ్రంథాల తాలూకు వ్యాఖ్యానాలలో ఈ పదాల చర్చ వస్తుంది. వాటిని బట్టి ఈవివరణ తయారుచేశాను. 



*పవని నాగ ప్రదీప్*


అక్కడ అందరు బ్రాహ్మలే

 అక్కడ అందరు బ్రాహ్మలే 

సత్ ప్రవర్తన, సాత్వికాహార భోనజం, నిత్య దైవ ధ్యానము, సదాచారం, సనాతన సాంప్రదాయ అనుసరణ, శిఖ ధారణ,  మొదలగునవి బ్రాహ్మణ లక్షణాలుగా మనం తీసుకుంటే అక్కడ ఉన్నవారంతా నిస్సందేహంగా బ్రాహ్మలే అనేక తప్పదు. 

అదే సూక్ష్మం గా ఇస్కోన్ అని పిలిచే అంతర్జాతీయ శ్రీకృష్ణ చెతన్య సంఘం. అక్కడి సాధువులు అందరు నిత్యం సాత్విక ఆహరం భుజిస్తూ, శిఖను ధరిస్తూ, పంఛను కట్టుకొని ముమ్మూర్తులా ఒక సదాచార బ్రాహ్మణుల వలెనె ఉంటారన్నది సత్యం. నిరంతర హరినామ స్మరణము చేస్తూ వారి చేతులలో జప మాల తిరుగుతూ ఉంటుంది, శ్రీమత్ భగవత్ గీత పారాయణమే వారి నిత్యా కృత్యం.  శ్రీకృష్ణ చెతన్య సంఘం శాఖలు ప్రపంచం మొత్తం చాలా దేశాలలో విస్తరించి వున్నాయి. వారు ఆచరించే భజనలు కానీ, కృతనాలు కానీ, పండగలు కానీ, ప్రవచనాలు కానీ చూపరుల మనస్సు దోచుకొంటుంది అంటే అతిశయోక్తి లేదు.  జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిని జీవితం మీద విరక్తి కలిగిన వారు ఎందరో ఈ రోజు శ్రీకృష్ణ చెతన్య సంఘం లో చేరి భగవాన్ శ్రీకృష్ణ పాద సన్నిధిలో ఆనందంగా జీవనం గడుపుతున్నారు. మీరు ఏ మతానికి చెందిన వారు, ఏ కులానికి, వర్ణానికి చెందిన వారు అన్నది అక్కడ చూడరు.  అందరు భగవాను శ్రీకృష్ణ పాద దాసులే. మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ISCON టెంపులుకు వెళ్ళారా లేకపోతె ఒక ఆదివారం మీకు అందుబాటులోని  ISCON  గుడికి వెళ్ళండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక భజనలు, కిర్తనలు, ప్రవచనాలు చూసే మీ రెండు కళ్ళు చాలవు. మధ్యాన్నం పూర్తి సాత్విక మైన భోజనం ఉచితంగా వితరణ చేస్తారు. 

ISCON  ఎలా పుట్టింది. 

1966 వ సంవస్త్సరము న్యూయార్క్ నగరంలో భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద స్థాపించారు అది 40 సంవత్సరాలలో చాలా దేశాలలో  మరియు ముఖ్యమైన  నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏ లాంటి లాభాపేక్ష లేని ఈ సంవస్ధ శ్రీ కృష్ణ భగవానుని దివ్య సంకీర్తనా ఉద్యమాన్ని ప్రతి పట్టణానికి గ్రామానికి అందుబాటులోకి తీసుకొని పోవటం అనే లక్ష్యంతో పనిచేస్తున్నది. ఆంగ్ల వర్ణమాలలో A- Z అక్షరాలతో మొదలయ్యే అన్ని దేశాలలోను ఈ సంఘం వ్యాపించింది అంటే ఈ సంఘ కార్యకర్తలు ఎంతగా కృషి చేసి వుంటారో మనం ఊహించగలం. ప్రతి సభ్యుని అకుంఠిత దీక్ష, నిరంతర కృషి, కృష్ణ భగవానుని ఫై వున్న నమ్మకం ఈ నాడు ఈ సంఘం ఇంతగా వృద్ధి చెంది కోట్లాది మంది నేడు శ్రీ కృష్ణ భగవానుని శరణ్ పొందే విధంగా ప్రోత్సహించిందంటే అందులోని ప్రతి సభ్యుడు అభినందనీయుడే. కృష్ణ భక్తితో మోక్ష సాధన పొంద వచ్చానే వారి తలంపు సర్వదా ప్రశంసనీయం.  ఈ సంఘం దిన దినాభివృధి చెంది విశ్వవ్యాప్తంగా మనహిందూ జ్ఞాన సంపదను విస్తరింపచేయాలని మనమంతా కోరుకుందాము. 

ఇంటర్ నెట్ వెతుకగా  నాకు దొరికిన సమాచారం మేరకు ఈ సంఘం క్రింది దేశాలలో విస్తరించి వున్నది.  

A : Argentina, Australia, Azerbaijan,  

B: Bangladesh, Belarus, Belgium, Bolivia, Botswana, Brazil, Bulgaria, Burma(Myanmar),  

C : Canada, Chile, Colombia, Costa Rica, Croatia, Czech Republic,  

D : Denmark, Dominican Republic 

E: Ecuador, El Salvador, Estonia,  

F: Fiji,Finland,France, 

G: Georgia,Germany,Ghana,Guyana,

H :Hong Kong,Hungary, 

I :India,Indonesia,Ireland,Israel,Italy,Ivory Coast, 

J : Japan, 

K: Kenya,Kyrgyzstan 

L: Latvia,Lithuania 

M: Macedonia,Malaysia,Mauritius,Mexico,Moldova, 

N :Nepal,Netherland,Nigeria,Norway, 

P:Panamá,Paraguay,Peru,Philippines,Poland,Portugal,

R: Romania,Russia, 

S: Scotland,Singapore,Slovakia,South Africa,Spain,Sri Lanka,Suriname,Swaziland,Sweden,,Switzerland 

T: Taiwan,Tajikistan,Thailand,Togo, 

U:Uganda,Ukraine,United Kingdom,United States Of America,Uruguay,Uzbekistan 

V: Venezuela

W: West Indies, 

Z:Zimbabwe

 



పూరీ జగన్నాథ్ ఆలయంలో

 *🛕పూరీ జగన్నాథ్ ఆలయంలో  సైంటిస్టులనే ఆశ్చర్యపరిచే 7 మిస్టరీలు🛕*


ఒడిశాలోని పూరీ జగన్నాథ్ ఆలయం దేశంలోనే పేరెన్నిక గన్నది. ఇక్కడ ఏటా జరిగే రథయాత్రకు లక్షలసంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ అపురూప దృశ్యాన్ని కవర్ చేసేందుకు దేశ, విదేశాల నుంచి మీడియా ప్రతినిధులు వస్తుంటారు.


అయితే ఇంతటి ప్రతిష్ట , ప్రాశస్త్యం ఉన్న పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎన్నో విశిష్టతలు ప్రత్యేకతలూ వున్నాయి. దేశంలోని మరే ఇతర ఆలయంలో లేనన్ని అద్భుతాలు ఇక్కడ జరుగు తున్నాయి. అవి శాస్త్రవేత్తల మేధస్సుకు కూడా అంతు పట్టకపోవడం విశేషం.  అవేంటో ఒకసారి మీరే చదవండి ...


*🛕మొదటిది... తనంతట తానే ఆగిపోయే రథం*


ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథ యాత్రలో ఊరేగింపు గుండీజా ఆలయానికి ఊరేగింపు రాగానే  రథం తనంతట తానే ఆగిపోతుంది. ఇందులో ఎవరి ప్రమేయం వుండదు.


*🛕రెండవది...నీడ కనిపించని గోపురం*


జగన్నాథ ఆలయం ప్రధాన ద్వారం గోపురం నీడ కనిపించదు . సూర్యుడు వచ్చినా నీడ పడదు . 

ఏ సమయంలోనూ గోపురం నీడ మాత్రం కనిపించదు ఇది శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.


*🛕మూడవది...గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా*


ఎక్కడైనా జండా గాలికి అనుకూలంగా ఎగురు తుంటుంది. కానీ  పూరీ ఆలయ గోపురం పైన వుండే జెండాకు మాత్రం గాలి వస్తున్న వైపు కాకుండా వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది .


*🛕నాలుగవది...మనవైపే చూసే చక్రం*


పూరీ జగన్నాథ్ ఆలయం గోపురం పైన సుదర్శన చక్రం ఉంటుంది. ఈ చక్రం ఎటువైపు వెళ్లి చూసినా  అది మనవైపే చూస్తున్నట్టు వుంటుంది .


*🛕ఐదవది...ఈ ఆలయంపై ఎగరని పక్షులు*


ఇది మరో వింత. ఈ జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు. ఎందుకు పక్షులు అక్కడ ఎగరవు  అనే విషయం మాత్రం అంతు పట్టడం లేదు.


*🛕ఆరవది...ఆలయం లోకి వినిపించని అలల సవ్వడి*


ఇదో విచిత్రం..సముద్ర తీరాన కొలువుతీరిన ఈ ఆలయం సింహద్వారంలో అడుగు పెట్టగానే అప్పటివరకూ వినిపించిన సముద్రపు హోరు ఆలయంలో వినిపించదు. మళ్లీ ఆలయం నుంచి అడుగు బయపెట్టగానే అలల శబ్దం వినిపిస్తుంది.


*🛕ఏడోది... ఘుమఘుమల ప్రసాదం*


పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. అయితే  ప్రసాదాన్ని, అన్న ప్రసాదాన్ని తయారు చేస్తున్నప్పుడు ఎలాంటి వాసనా రాదు. దేవుడికి ప్రసాదం నివేదించిన తర్వాత మాత్రం ప్రసాదాలు మంచి సువాసనతో ఘుమ ఘుమ లాడుతుంటాయి.

🛕

3. అరణ్యక మహర్షి

 *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

3. అరణ్యక మహర్షి 

అరణ్యక మహర్షి 

అరణ్యం అంటే అర్థం మీకు తెలుసుకదా ... అరణ్యం అంటే దట్టమయిన అడవి అని . అరణ్యక మహర్షి పుట్టింది అడవిలోనే , పెరిగింది అడవిలోనే , తపస్సు చేసిందీ అడవిలోనే . ఆయనకి అడవి తప్ప వేరే ప్రదేశాలు ఏమీ తెలియవు . అందుకనే ఆయనకి అరణ్యక మహర్షి అని పేరు వచ్చింది . ఈ మహర్షి ఆశ్రమం రేవానదీ ఒడ్డున ఉండేది . చాలా ప్రశాంతంగా ఉండేది . పెద్ద పెద్ద జంతువులు కూడ అక్కడ కలిసి మెలిసి ఉండేవి . ఆయన ఎప్పుడూ రామనామం చేస్తూ ఉండేవాడు . ఆయన రామనామ జపం ఎప్పుడూ చెయ్యడం వల్ల ఆశ్రమంలో ఎప్పుడూ రామనామం వినపడుతూ ఉండేది . అది ఎలా వినపడుంది ? అని మీ సందేహం కదూ ... నేను చెప్తాను కదా .... ! పండిపోయిన ఆకులు రాలి పడుతున్నప్పుడు , ఎండిపోయిన పుల్లలు విరిగి కింద  యుకున్నప్పుడు , చీమలు పాకుతున్నప్పుడు , గాలి వేసినప్పుడు , చెట్లు ఊగుతున్నప్పుడు


ఏం జరుగుతున్నా రామనామమే వినిపించేది . అంటే అరణ్యక మహర్షికి రామ మంత్రం , రామ ధ్యానం , రామ స్మరణం , రామ పూజనం , రామ చింతనం , రామ మననం , మొత్తం రామ మయంగా ఉండేవాడు . ఒకసారి శత్రుఘ్నుడు ఆయన ఆశ్రమానికి వచ్చి నమస్కరించి , ఆయన రామ భక్తి చూసి స్వామీ ! నేను ఎప్పుడు రాముడితోనే ఉంటాను , అయినా నాకంటే మీకే ఎక్కువ రామ భక్తి ఎలా వచ్చింది ? అని అడిగాడు . అరణ్యక మహర్షి శత్రుఘ్నుడికి ఏం చెప్పాడో చదవండి మరి .... నేను ఎప్పుడు ఈ అడవి వదిలి ఎక్కడికీ వెళ్లలేదు . అయినా నాకు చిన్నప్పటి నుంచి జ్ఞానం సంపాదించాలని కోరిక ఉంది . కాని నాకు గురువు లేడు కదా ... ఇలా అనుకుంటూ ఉండగా లోమశ మహర్షి వచ్చి నీకు గొప్ప మంత్రం , సంసార సాగరం నుంచి బయట పడేసేది చెప్తాను అని మంత్రం ఉపదేశించాడు . ఆ మంత్రం ఏమిటో మీకు తెలుసా ... ' రామనామం ' . ' రామ ' అనే రెండు అక్షరాల్ని ఎప్పుడూ మనస్సులో జపిస్తూ వుంటే వేరే వ్రతాలు , పూజలు , యాగాలు , దానాలు , మౌనవ్రతాలు ఇలాంటివి ఏమీ అక్కర్లేదు . అందుకని ' రామ నామం జపించుకో అని చెప్పాడు . తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని  రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు . 



తర్వాత అరణ్యక మహర్షి లోమశ మహర్షిని అడిగి రామకథ అంతా తెలుసుకుని ఆయన రూపురేఖలు ఎలా ఉంటాయో తెలుసుకుని రామ నామం చేసుకుంటున్నాడు . ఇదంతా విన్నాక శత్రుఘ్నుడు అరణ్యక మహర్షికి సాష్టాంగనమస్కారం చేసి ఆయన్ని అయోధ్యకి పంపించాడు . ఆ సమయంలో శ్రీరాముడు అశ్వమేధయాగం చేస్తున్నాడు . అరణ్యక మహర్షి సరయూనది ఒడ్డున యజ్ఞదీక్షలో ఉన్న రాముడ్ని చూసి ఆనందంతో కళ్లనుంచి జలజల నీళ్ళు రాలుతుంటే భక్తితో ఆయన తన దేహాన్నే మరిచిపోయాడు . శ్రీరాముడు అరణ్యక మహర్షిని చూసి ఎదురు వెళ్ళి మహర్షిని కౌగిలించుకుని , చేతులు పట్టుకుని తీసుకువచ్చి కూర్చో పెట్టాడు . అరణ్యక మహర్షి శ్రీరాముడి పాదాలమీద పడి నమస్కారం చేసి స్వామీ ! ఈ క్షణం కోసమే నేను ఎదురు చూస్తున్నాను . నా తపస్సు పండింది . నా జన్మధన్యమైంది . నాకు మోక్షం ప్రసాదించు అన్నాడు . వెంటనే ఆయన కపాలం పగిలి అందులోంచి ఒక తేజస్సు శ్రీరాముడిలో కలిసిపోయింది . చూశారా ! అరణ్యక మహర్షి ' రామ ' అనే నామంతోనే భగవంతుడిలో ఎలా కలిసిపోయాడో !

                             3. అరణ్యక 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏🏻

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..


*ఆత్మ త్యాగం..కపాలమోక్షం..*


*(అరవై మూడవ రోజు)*


ఒక వారం రోజుల పాటు ఎవ్వరినీ ఆశ్రమానికి రావొద్దన్న శ్రీ స్వామివారు కఠోర సాధన లో పూర్తిగా లీనమై పోయారు..ప్రధాన గది లో గల నేలమాళిగ లోనే తపస్సు కొనసాగించారు..


1976, మే నెల 6వతేదీ నాటి ఉదయం 9గంటల వేళ.. గొర్రెలు కాచుకునే ఎరుకలయ్య అనే మొగలిచెర్ల గ్రామానికి చెందిన వ్యక్తి..కుతూహలం కొద్దీ..ప్రహరీ గోడ మీదుగా ఆశ్రమం లోకి తొంగి చూసాడు..ఆశ్రమ వరండా ముందు వున్న పందిరి క్రింద..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చుని ధ్యానం లో వున్నారు..అలా ధ్యాన ముద్రలో ఆరుబైట శ్రీ స్వామివారు ఎన్నడూ కూర్చోలేదు..


ఎరుకలయ్య కొద్దిసేపు అక్కడే తచ్చాడి..మళ్లీ చూసాడు..శ్రీ స్వామివారు అదే స్థితి లో అలానే కూర్చుని వున్నారు..ఈరోజు స్వామి బైట తపస్సు చేసుకుంటున్నాడేమో..అనుకోని ఎరుకలయ్య తన పని లో తానుండి పోయాడు..కానీ మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు ఎరుకలయ్య..మళ్లీ చూసాడు..ఈసారి శ్రీ స్వామివారి దేహం ప్రక్కకు ఒరిగి ఉన్నది..ఎరుకలయ్య కు ఎందుకో అనుమానం వచ్చింది..ఒక్క నిమిషం లోనే అతని మనసు కీడు శంకించి..వెంటనే ఆలస్యం చేయకుండా పరుగు పరుగునా.. మొగలిచెర్ల చేరి..శ్రీధరరావు గారి ఇంటికి వెళ్లి..శ్రీధరరావు గారితో..తాను చూసిన విషయాన్ని మొత్తం చెప్పేసాడు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఒక్కసారిగా అనిపించింది..శ్రీ స్వామివారు తాను అనుకున్న విధంగా ప్రాణత్యాగం చేసారేమో..అని..వెంటనే బండి సిద్ధం చేయమని చెప్పారు..ఈలోపల..శ్రీధరరావు గారి కుమారుడు ప్రసాద్, మరికొంతమంది గ్రామస్థులు సుమారు 30 మంది గబ గబా ఆశ్రమానికి నడచి వెళ్లారు..


ఆశ్రమం పైన..నిండుగా రామ చిలుకలు వాలి ఉన్నాయి..ప్రధాన ద్వారం తీసుకొని లోపలికి వెళ్లి చూసేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం లోనే వున్నారు కానీ..దేహం ఎడమ ప్రక్కకు ఒరిగి ఉన్నది..శ్వాస లేదు..


శ్రీ స్వామివారి శరీరం ప్రక్కనే..కమండలం నీటితో నిండి ఉన్నది..కమండలం ప్రక్కన..ఒక చిన్న రాయి క్రింద..ఒక చీటీ..పెట్టి ఉన్నది..అందులో.."నేను శ్రీ దత్తాత్రేయ స్వామి అవతారంగా మారిపోయాను.. ఇక నుంచీ నన్ను అందరూ దత్తాత్రేయ స్వామి అని వ్యవహరించండి..శనివారాల్లో తప్ప మిగిలిన అన్నిరోజుల్లో నా మందిర ద్వారాలు తెరచి ఉంచండి.." అని వ్రాసి వున్నది.. 


ప్రసాద్ తో సహా చూసిన వారందరూ శ్రీ స్వామివారు మరణించారని భావించారు..శ్రీ స్వామివారి దేహాన్ని ముట్టుకోవడానికి అందరూ జంకారు..


శ్రీధరరావు గారి ఇంటి ప్రక్కనే కాపురం వుండే గోపిశెట్టి బలరామయ్య అనే వ్యక్తి "స్వామి వారి శరీరాన్ని ..మనం  సరిగ్గా ఉంచాలి కదా.." అంటూ..తన రెండు చేతులతో శ్రీ స్వామివారి దేహాన్ని ఎత్తుకొని..వరండాలో గోడకు ఆనించి..శ్రీ స్వామివారు కూర్చున్న పద్మాసనం స్థితి లోనే ఉంచాడు..అప్పటికి కూడా శ్రీ స్వామివారి శరీరం బిగుసుకుపోలేదు..మామూలు గానే ఉన్నది..


మరి కొద్ది సేపటికే.. శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చారు..శ్రీ స్వామివారిని చూసి వారికి దుఃఖం ఆగలేదు..శ్రీధరరావు గారు త్వరగా తేరుకొని..ఒక మనిషిని పిలచి..శ్రీ స్వామివారి సోదరులకు కబురు అందించి..వారిని వెంటబెట్టుకు రమ్మనమని చెప్పి పంపారు..ఈలోపల మొగలిచెర్ల గ్రామస్థులు అందరూ అక్కడ గుమిగూడారు..అప్పటికి సమయం మధ్యాహ్నం 4 గంటలు కావొస్తోంది..


ఆరోజు ఉదయం తిథి..వైశాఖ శుద్ధ సప్తమి..శ్రీ స్వామివారు చెప్పిన వారం రోజుల గడువు ఆరోజుతో ముగిసింది..శ్రీ స్వామివారు తనను సజీవ సమాధి చేయమని పదే పదే  చెప్పిన మాటల్లోని అంతరార్ధం అప్పటికి ఆ దంపతులకు అర్ధమైంది..


క్రమంగా సాయంత్రం కావొచ్చి..చీకట్లు వ్యాపిస్తున్నాయి..శ్రీధరరావు గారు ఇక చేయవలసిన ఏర్పాట్ల గురించి ఆలోచించసాగారు..రెండు మూడు పెద్ద పెట్రోమాక్స్ లైట్ల ను తెప్పించారు..శ్రీ స్వామివారి కుటుంబ సభ్యుల రాక కోసం ఎదురు చూడసాగారు..రాత్రి 9.30 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారి సోదరులు తల్లి వచ్చారు..పద్మయ్య నాయుడు తనకు శ్రీ స్వామివారు తనతో  చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకొని..శ్రీధరరావు గారితో ఆ సారాంశమంతా వివరించి చెప్పారు.. 


రాత్రి 11 గంటల సమయం..అప్పుడు..ఎవ్వరూ ఊహించని సంఘటన జరిగింది..


శ్రీ స్వామివారి కపాలమోక్షం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

విటమిన్లు

 విటమిన్లు మరియు అవి లభించే పదార్ధాలు -  1.


* A విటమిన్  - 


   అనేక రకాలైన శాకాహారం  నుంచి కెరొటిన్ రూపములో లభిస్తుంది. క్యారట్ , బొప్పాయి , టమాటో , బటాణీ , మామిడిపళ్ళు , బచ్చలి , మునగ , కరివేపాకు , కొత్తిమీర వంటి ఆకుపచ్చ , పసుపు రంగు కలిగిన కూరగాయలలో కెరొటిన్ లభించును . మాంసాహారంలో లివరు మరియు గుడ్డులో లభించును . 


 *  B విటమిన్  - థయమిన్ . 


    తృణధాన్యాలు , గోధుమలు , ఉప్పుడు బియ్యం , దంపుడు బియ్యం , తైదలు , జొన్నలు , పెసలు , శెనగలు , మినుములు , కందులు వంటి పప్పు దినుసులలోను , నువ్వులు , వేరుశెనగలు , జీడిపప్పు , పిస్తా , బాదం , బటాణీ వంటి గింజలలోను , సోయా చిక్కుడు , చిక్కుడు , బీట్రూట్ , బంగాళాదుంప , గుడ్డు మొదలైన వాటిలో థయమిన్ లభ్యం అగును. 


 *  B2 విటమిన్ - రైబోఫ్లేవిన్ . 


     పాలు , పెరుగు , పాలకోవా , పాలపొడి వంటి పాలఉత్పత్తులలో , గోధుమపిండి , రాగులు , జొన్నలు , సజ్జలు , బార్లి, బియ్యం లాంటి తృణధాన్యాలలో వేరుశెనగ , కంది , మినప , పెసర , సోయాబీన్ , శెనగ లాంటి పప్పు గింజలలో విటమిన్ B2 లభ్యం అగును. 


 *  B3 విటమిన్  -  నియాసిన్ . 


      గోధుమలు , బియ్యం , జొన్నలు , మొక్కజొన్నలు వంటి తృణధాన్యాలలో వేరుశెనగ మిగతా పప్పు దినుసులలో , కాలేయం , మాంసం , చేపలు లాంటి మాంసాహారాలలో నియాసిన్ లభ్యం అగును. 


       తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం అందిస్తాను . 


     గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . మీకు కొరియర్ ద్వారా వస్తాయి.  పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు . రెండు గ్రంథముల ఖరీదు కొరియర్ ఛార్జీలతో కలిపి 900 రూపాయలు . 


                 కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                         9885030034

 https://www.facebook.com/groups/105046320203671/?ref=share

పద్య కవిత్వోత్సవం

 మె.ర.సం. పద్య కవిత్వోత్సవం--2.

~~~~~~

కవి పేరు-భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

తేది-18-06-2021.

ప్రాంతం-కుషాయిగూడ,హైదరాబాద్.

శీర్షిక-దైవభక్తి.

చరవాణి సంఖ్య-944౦౦44142.

హామీ-ఈ పద్యాలు నా స్వీయరచన.

~~~~~~~

ఆ.వె:-

*******

కోట్ల జీవులందు గొప్ప మనుజ జన్మ

మట్టి జన్మనందినట్టి మనము

జన్మనిడిన దైవ సంసేవనమ్మును

చేసినపుడు చాల క్షేమమబ్బు.--1.

~~~~~~~~

ఆ.వె:-

******

సౌఖ్యమందజేయు సంపద లిచ్చిన,

వినయమందజేయు విద్యనిడిన

దైవ పూజలనిన తగు నమ్మకములేని

వాని జీవితమ్ము వ్యర్థమగును.--2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿


మె.ర.సం పద్యోత్సవం--2.

 కవి పేరు-చన్ద్రశేఖర శర్మ.

తేది-17-6-2021.

అంశం-తొలకరి.

చరవాణి సంఖ్య-944౦౦44142.

హామీ-ఈ పద్యాలు నా సొంతరచన.

~~~~~~~~~

కందం:-

*******

తొలకరి చినుకులు కరిసెను

సలసల కాగిన ధరణియె చలువకు వచ్చెన్

మెలుకువ జేసెను మృగశిర

బిలబిల రైతులు తరలిరి బీళ్ళను దున్నన్.--1.

~~~~~~~~

తే.గీ:-

*******

తొలకరి చినుకులను జూచి తోషమంది

రైతులందరు చల్లిరి రత్నములను-

పోలి యుండెడి విత్తనాల్ పుడమి యందు

పసిడి పంటలన్ భూమాత! వారికిడుత!.--2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿


పద్యకవిత్వోత్సవం.2.


కవిపేరు:భోగయగారి. చన్ద్రశేఖర శర్మ.

తేది:16--06--2021.

ప్రాంతం:కుషాయిగూడ, హైదరాబాద్.

అంశం:ఆయుర్వేదం.

చరవాణి సంఖ్య:944౦౦44142.

హామీ:ఈ పద్యాలు నా స్వీయరచన.

~~~~~~~~

కందం:-

********

ఆయుర్వేదపు మందులు

ఆయుషమునధికముగ జేయునద్భుత రీతిన్

ప్రాయము మీరిననైనను

సాయ పడును మూలికలవి జనులకు వరమై---1.

ఆ.వె:-

*******

వంట యింటిలోన వాడు వెచ్చాలన్ని

ఔషధీయ గుణములంద జేయు

చిన్న చిన్నవైన చిట్కాలవి ఘనము

వైద్యునడిగి మనము వాడవలెను.---

2.

౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿౿





message from S. Court.

 V.V.IMP message from Supreme Court. 

This is definitely going to save ur money..   


Dear All,


This is to inform you that medicines are prescribed (by doctors) by brand name & not by the generics (Ingredients). Hence we end up paying more money for the same medicine.


Follow these few steps to know more & start saving on your medical bills.


1. Simply go to www.Manddo.com (Medicines and Doctors online) go to medicines secton


2. Search the medicine name


3. Type the medicine name which you are using (e. g. Lyrica 75mg (Pfizer company)


4. It will show u medicine company, prices and Ingredients


5. Now main point CLICK ON 'SUBSTITUTE'


6. Don't be surprised to see that same drug is available at very low cost also. And that to,.. by other reputed manufacturer. e. g. Lyrica by pfizer is for Rs. 768.56 for 14 tab (54.89 per tab). Whereas same drug by Cipla (Prebaxe) is available ONLY @ Rs. 59.00 for 10 tab (5.9 per tab) 


Please don't delete   without forwarding.


Forward to all the contacts in your phone book.


Let the move by Supreme Court benefit everyone...


There was a big lobby by Pharma companies to stop generic medicines. But court kept the interest of common man and the medical need.


"Kindness Costs Nothing" - please share it with your groups