2, ఫిబ్రవరి 2021, మంగళవారం

కాగితం పడవలు*

 *📖 మన ఇతిహాసాలు 📓*



*కాగితం పడవలు*



రామయ్యది వెంకటాపురం. భూస్వామి భూపతి దగ్గర పాలేరుగా పని చేస్తున్నాడు. మంచి పనిమంతుడు. నమ్మకస్తుడు. అందుకే అతనంటే భూపతికి ప్రత్యేకమైన అభిమానం.


నమ్మకంగా వుంటూ, ఇంటిని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే మనిషి వుంటే పంపించమని పట్నంలో వ్యాపారం చేస్తున్న భూపతి కొడుకు మహేష్ ఉత్తరం రాశాడు. ఆ పనికి రామయ్యే సరైనవాడని భూపతికి తెలుసు. అదే మాట రామయ్యతో అన్నాడు. ముందూ వెనుక ఎవరూ లేకపోవడంతో రామయ్య కూడా అంగీకరించాడు. అలా రామయ్య వెంకటాపురం వదిలి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. ప్రశాంతమైన పల్లె వాతావరణానికి అలవాటుపడిన రామయ్యకు రణగొణ ధ్వనుల మధ్య జీవించడం కొంచెం కష్టంగానే ఉంది. అయినా అలాగే సర్దుకుపోతున్నాడు.


భూపతి కొడుకు రాహుల్, కోడలు రమ్య, వాళ్లిద్దరూ వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు. పిల్లలు వంశీ, వసుధ. వంశీ ఆరవ తరగతి చదువుతున్నాడు. వసుధ నాలుగవ తరగతి. పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఎటు వాళ్లు అటు వెళ్లిపోతారు.


రమ్యకు ఇంటి పనుల్లో సాయం చేయడం, బజారుకెళ్లి కావాల్సిన సరుకులు తీసుకురావడం, పిల్లలకు కావాల్సినవి అమర్చడం, ఇంటిని కనిపెట్టుకొని వుండడం.. ఇది రామయ్య దినచర్య. రామయ్యకు వెంకటాపురంలోకంటే ఇక్కడే పని తక్కువగా ఉంది. కాకపోతే ఒక్కటే చిక్కు. కాయకష్టానికి అలవాటుపడిన మనిషిని ఖాళీగా వుండమంటే ఉండలేడు. ఇప్పుడు రామయ్య పరిస్ధితీ అదే.


ఓ రోజు ఏ కారణం చేతనో ట్యూషన్ మాష్టారు రాలేదు. పిల్లలకు కావాల్సినంత తీరుబడి దొరికింది. ఆ బజారులోని తోటి పిల్లలందర్నీ పోగు చేశారు. వాళ్లతో ఇంట్లోనే ఆటలు మొదలుపెట్టారు. రామయ్య కూడా వాళ్లతో కలిసిపోయాడు. కాసేపటికి వర్షం మొదలయ్యింది. డాబా మీద కురిసిన వాన నీళ్లు కాలువలా పెరట్లో నుండి పోతున్నాయి. రామయ్యకు ఓ ఆలోచన వచ్చింది.

"వంశీ బాబూ! నీకి కాగితాలతో పడవలు తయారుచేయడం వచ్చా?" అడిగాడు రామయ్య .

"రాదు. ఏం?"

"మేం చిన్నప్పుడు కాగితాలతో పడవలు తయారుచేసి వాన నీళ్లల్లో వదిలేవాళ్లం. మునగకుండా ఎవరి పడవ ఎక్కువ దూరం వెళ్తుందో వాళ్లు గెలిచినట్టు. ఆ ఆట భలే సరదాగా ఉంటుంది" చెప్పాడు రామయ్య.

"అయితే త్వరగా వెళ్లి కాగితాలు తీసుకురా తాతా..." అంది వసుధ.

"కాగితాలు నాన్నగారి గదిలో ఉంటాయి" వెంటనే అందుకున్నాడు వంశీ.


రామయ్య రాహుల్ గదిలోకి వెళ్లాడు. అక్కడ తెల్ల కాగితాలు, రాసిన కాగితాలు విడివిడిగా ఉన్నాయి. తెల్ల కాగితాలైతే రాసుకోవచ్చు. అదే వాడిన కాగితాలు తీసుకున్నా ఫర్వాలేదు ' అనుకున్నాడు రామయ్య రాసిన కాగితాలు తీసుకొని పిల్లల దగ్గరకొచ్చాడు. వాటితో పడవలు తయారుచేసి, పిల్లలకిచ్చాడు. వాళ్లు వాటిని నీళ్లల్లో వదులుతూ ఆనందించారు. కాసేపటి తర్వాత వర్షం ఆగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. పిల్లలు అన్నం తిని, నిద్రపోయారు. రాత్రి తొమ్మిది గంటలకు భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. వచ్చీరాగానే రాహుల్ తన గదిలోకి వెళ్లాడు. ఏవో ముఖ్యమైన కాగితాల కోసం చాలాసేపు వెతికాడు. ఎంత వెతికినా అవి కనిపించలేదు.

రామయ్యను పిలిచి, "టేబుల్ మీద నేను కొన్ని ముఖ్యమైన కాగితాలు పెట్టాను. అవేమైనా చూశావా?" అని అడిగాడు రాహుల్.

"నల్ల సిరాతో ఏదో రాసి ఉంది. అవేనా బాబుగారూ?" అడిగాడు రామయ్య.

"అవును. అవే...ఎక్కడ పెట్టావు?" ఆతృతగా అడిగాడు రాహుల్.

"అవి పనికిరాని కాగితాలు అనుకొని..."

"అనుకొని... నీళ్లు నమలడం మాని ఏం చేశావో చెప్పు" కోపంగా అన్నాడు రాహుల్.

"ఇందాక పిల్లలకు పడవలు చేసిచ్చాను" భయం భయంగా చెప్పాడు రామయ్య.


"అసలు వాటి జోలికెందుకువెళ్లావు? పక్కన అన్ని తెల్లకాగితాలు ఉన్నాయి. అవి తీసుకోవచ్చుగా. అయినా పాత న్యూస్ పేపర్లతో పడవలు చెయ్యోచ్చు కదా. అసలు ఆ పేపర్ల విలువేంటో తెలుసా నీకు?" ఆవేశంగా అన్నాడు రాహుల్.


రామయ్య దిగాలుగా ముఖం పెట్టి. "అయ్యా! నాకు చదువురాదు. అందుకే వాటి మీద ఏం రాసి వుందో తెలీలేదు. తెలిస్తే... వాటితో పడవలు చేసేవాణ్ణే కాదు. క్షమించండి" అన్నాడు.


"ఎలా క్షమించమంటావు? అవేమైనా పాతిక రూపాయలు పెడ్తే వచ్చే కాగితాలనుకున్నావా? కొత్తగా తీసుకున్న ఉద్యోగులతో కుదుర్చుకున్న ఒప్పందం కాగితాలు" అరిచాడు రాహుల్. రాహుల్ అరుపుల విన్న రమ్య ఆ గదిలోకి వచ్చింది.


విషయాన్ని గ్రహించి, "ఊరుకో రాహుల్. అంత ముఖ్యమైన కాగితాలను నిర్లక్ష్యంగా టేబుల్ మీద పడేసి వెళ్లిపోవడం నీ తప్పు. అవి మామూలు కాగితాలు అనుకొని రామయ్య పడవలు చేసి ఉంటాడు. జరిగిందేదో జరిగిపోయింది. మళ్లీ వాళ్లతో అగ్రిమెంట్ రాయించుకుంటే సరిపోతుంది" అంటూ సర్ధిచెప్పింది.

రామయ్యవైపు తిరిగి, "రామయ్య... నువ్వు వెళ్లి భోం చేసి పడుకో" అని చెప్పింది. రామయ్య అక్కడి నుండి వెళ్లిపోయాడు.

మర్నాడు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు రామయ్య కోసం ఓ ప్యాకెట్ తీసుకొచ్చింది రమ్య. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అయోమయంగా చూశాడు రామయ్య.

"ఇవి నీ కోసమే రామయ్య రేపటి నుండి నువ్వు కూడా చదువుకోవాలి. పిల్లలతోపాటు నీక్కూడా ట్యూషన్ మాష్టారే చదువు చెప్తారు. మరి శ్రద్ధగా చదువుకుంటావు కదూ" అంది రమ్య.

రామయ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తాను చేసిన తప్పు గుర్తొచ్చింది. ఇకమీదట అలాంటి తప్పు చేయకుండా వుండాలంటే చదువుకోవడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాడు.

*వాలి

 *📖 మన ఇతిహాసాలు 📓*



*వాలి*

(రామాయణం లో పాత్ర)



రామాయణం కావ్యంలో వాలి (Vali) ఒక వానర రాజు. సుగ్రీవునకు అన్న. మహా బలవంతుడు. కిష్కింధ కాండలో వాలి కథ వస్తుంది.


*వాలి సుగ్రీవుల జననం*


వాలి, సుగ్రీవుడు వృక్షవ్రజస్సు (ఋక్షరజుడు?) అనే గొప్ప వానర రాజుకి పుట్టిన ఔరస సంతానం. ఒకసారి వృక్షవ్రజస్సు ఒక తటాకంలో స్నానం చేస్తాడు, ఆ తటాకంకి ఉన్న శాపప్రభావం వల్ల వృక్షవ్రజస్సు ఒక అప్సరసగా మారిపోతాడు అప్పుడు ఆ ప్రదేశంలో సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరసగా ఉన్న వృక్షవ్రజస్సు చూసి మోహితుడై వాలభాగం లోను, కంఠభాగం లోను వీర్యాన్ని విడిచి పెడతారు. దానికి వృక్షవ్రజస్సు కంగారు పడుతున్న సమయములో బ్రహ్మ వచ్చి వీర్యం విడవడం వల్ల వాలి సుగ్రీవులు జన్మిస్తారు. వాల భాగములో వీర్యం వదలడం వల్ల వాలి, కంఠ భాగం లలో వదిలిన వీర్యం వల్ల సుగ్రీవుడు జన్మిస్తారు.


*వాలి పరాక్రమం*


వాలి పరాక్రమాన్ని గురించి సుగ్రీవుడు రామునితో ఇలా చెప్పాడు - వాలి మహా బలవంతుడు. పెద్ద పెద్ద కొండ శిఖరాలను బంతుల్లాగా విసిరేయడం అతనికి ఆటగా ఉండేది. దృఢమైన చెట్లను ఇష్టమొచ్చినట్లు పీకి పారేశేవాడు. ఒకమారు దుందుభి అనే రాక్షసుడు సముద్రుడు, వాయువు వంటి వారితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. వారు అతనితో పోరాడలేమని చెప్పి వాలిదగ్గరకు వెళ్ళమన్నారు. తన రణ కండూతి తీర్చుకోవడానికి పెద్ద దున్నపోతు ఆకారంలో కిష్కింధకు వచ్చి పెడబొబ్బలు పెట్ట సాగాడు. అనవుసరంగా ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని ఆ రాక్షసునికి వాలి నచ్చచెప్పబోయాడు గాని వాడు వినిపించుకోలేదు. దాంతో వాలి కోపించి ఆ రాక్షసుడి కొమ్మలు పట్టి మెలిద్రిప్పి విసిరేశాడు. రక్తం కారుతూ ఆ రాక్షసుడు మరణించాడు. అయితే ఆ రక్తం ఋష్యమూక పర్వతంపై తపస్సు చేసికొనే మతంగముని ఆశ్రమంలో చెల్లా చెదురుగా పడింది. దానితో కోపించిన ముని వాలిని శపించాడు - ఆ పర్వతం మీదకు వస్తే తల పగిలి చస్తాడని. అందువలన వాలి ఆ పర్వతం పరిసరాలకు వెళ్ళడు.


తనను మించిన వీరుడు లేడని విర్రవీగే రావణుడు కూడా వాలితో యుద్ధానికి తలపడి, వాలి చేతిలో ఓడిపోయి అతనికి మిత్రునిగా సంధి చేసుకొన్నాడు. ఇంద్రుడిచ్చిన కాంచనమాల వర ప్రభావం వలన వాలికి ఎదురుగా పోరాడే వారి బలంలోంచి సగం వాలికి సంక్రమిస్తుంది.


*వాలి, సుగ్రీవుల మధ్య వైరం*


సుగ్రీవుడు అన్నకు విధేయుడైన సేవకుడు. ఒకమారు మాయావి అనే రాక్షసుడు (దుందుభి కొడుకు) వాలిపై యుద్ధానికి వచ్చాడు. వాలి, మాయావి యుద్ధం చేస్తూ ఒక కొండ గుహలోకి వెళ్ళారు. సుగ్రీవుడిని బయటే కాపలా ఉండమని వాలి చెప్పాడు. నెల కాలం గడచినా వారు బయటకు రాలేదు. పెడ బొబ్బలు ఆగిపోయాయి. వాలి మరణించి ఉంటాడని సుగ్రీవుడు భయపడ్డాడు. రాక్షసుడు బయటకు రాకుండా గుహకు పెద్ద బండరాయి అడ్డంగా పెట్టి, దుఃఖిస్తూ కిష్కింధకు తిరిగి వచ్చాడు. మంత్రుల కోరికపై రాజ్యానికి రాజుగా అభిషిక్తుడయ్యాడు.


అయితే కొంత కాలానికి వాలి తిరిగి వచ్చాడు. దుర్బుద్ధితో సుగ్రీవుడు కొండ బిలాన్ని మూసివేశాడని దూషించి అతన్ని రాజ్యంలోంచి తరిమేశాడు. తన అనుచరులైన హనుమంతుడు, మరి కొద్ది మంది పరివారంతో సుగ్రీవుడు ఋష్యమూక పర్వతంపై తల దాచుకొన్నాడు.


*శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి*


శ్రీరాముడు, సుగ్రీవుల మైత్రి

సీతాన్వేషణలో శ్రీరాముడు, లక్ష్మణుడు ఋష్యశృంగ పర్వత ప్రాంతానికి వచ్చారు. మహా ధనుర్ధారులైన రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయం చెందాడు. వారిని గురించి తెలిసికోమని హనుమంతుని పంపాడు.


హనుమంతుడు తన మృదువైన మాటలతో వారిని గురించి తెలిసికొన్నాడు. లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్ధులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. హనుమంతుడు తన నిజరూపం ధరించి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవునివద్దకు తీసికొనివెళ్ళాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని, సీతమ్మను వెదకడానికి తాను సహాయపడగలన్నాడు. రాముడూ సుగ్రీవుడూ అగ్నిసాక్షిగా మైత్రి నెరపుకొన్నారు. సీతను వెదకి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతిన బూనాడు.


రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకూ తన అన్నకూ వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట యిచ్చాడు. వాలి అసమాన బల పరాక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునకు నమ్మకం కలిగించడానికి రాముడు కొండ లాంటి దుందుభి అనే రాక్షసుని కళేబరాన్ని పది క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించాడు. సుగ్రీవుడిని ఆలింగనం చేసుకొని, అతనికి అభయమిచ్చాడు.


*సుగ్రీవుడు, వాలి పోరాటం*


రాముడి అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిచాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. రెండు కొండల్లా ఢీకొంటున్న వారిరువురూ ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేక రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతనిని తీవ్రంగా దండించి తరిమేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధసమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకొన్నాడు సుగ్రీవుడు.


అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజపుష్పి లతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్ళీ సుగ్రీవుడు కిష్కింధకు వెళ్ళి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బయలు దేరిన వాలిని అతని భార్య తార వారింప ప్రయత్నించింది. అంతకు ముందే దెబ్బలు తిన్న సుగ్రీవుడు మళ్ళీ యుద్ధానికి రావడానికి అయోధ్యా రాకుమారుల అండయే కారణం కావచ్చు అని హితం పలికింది. కాని వాలి వినలేదు. తనకు ఇక్ష్వాకు రాకుమారులతో వైరం లేదు గనుక ఆ ధర్మపరులు తనకు హాని చేయరన్నాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు.


అన్నదమ్ములు మళ్ళీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాలా వర ప్రభావం వలన ఎదురుగా పోరాడే వారి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్రసమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మూర్ఛపోయాడు.


*శ్రీరాముని వాలి దూషించుట*



కొంత సేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలనుండి రక్తం ధారలుగా పారుతోంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరుప్రక్కలా లక్ష్మణుడూ, సుగ్రీవుడూ కనుపించారు. నీరసంగా రాముని చూచి వాలి ఇలా నిందించాడు.--


రామా! నీవు మహా తేజోవంతుడవు. కాని నీవు చేసిన ఈ నీచమైన పని వలన నీ వంశానికీ, తండ్రికీ అపకీర్తి తెచ్చావు. నేను నీకుగాని, వీ దేశానికి గాని ఏ విధమైన కీడూ చేయలేదు. అయినా న్ను వధిస్తున్నావు. నీవు సౌమ్య మూర్తిగా నటిస్తున్న మాయమయుడివి. ఇంద్రియ లోభాలకు వశుడవయ్యావు. అన్ని దోషాలు నీలో కనబడుతున్నాయి. నీవు క్షుద్రుడవు, మహాపాపివి.


నా చర్మం, గోళ్ళు, రోమాలు, రక్తమాంసాలు నీకు నిరుపయోగం కనుక నన్ను మృగయావినోదం కోసం చంపావనే సాకు కూడా నీకు చెల్లదు. నీ కపటత్వం గ్రహించే నా ఇల్లాలు తార నన్ను ఎన్నో విధాలుగా వారించింది. కాని పోగాలం దాపురించిన నేను ఆమె హితవాక్యాలను పెడచెవినబెట్టాను.


నా యెదుటపడి యుద్ధం చేసే లావు నీకు లేదు. మద్యపాన మత్తుడై నిద్రపోయేవాడిని పాము కాటు వేసినట్లుగా చెట్టుమాటునుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగడంలేదా! నా సహాయమే కోరి వుంటే క్షణాలమీద రావణుడిని నీ కాళ్ళవద్ద పడవేసి నీ భార్యను నీకు అప్పగించేవాడిని.


నేను చావుకు భయపడేవాడిని కాను. సుగ్రీవుడు నా అనంతరం రాజ్యార్హుడే. కాని ఇలా కుట్రతో నన్ను చంపి నా తమ్ముడికి రాజ్యం కట్టబెట్టడం నీకు తగినపని కాదు. నీ చేతలను ఎలా సమర్ధించుకొంటావు? నా గొంతు ఎండుకు పోతోంది. ఈ బాణం నా ప్రాణాలు హరిస్తున్నది. నిస్సత్తువలో ఎక్కువ మాట్లాడలేను. కాని నీ సమాధానాన్ని వినగలను. – అని వాలి అన్నాడు.


*రాముని సమాధానం*


వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు – ఇంద్ర నందనా! నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును.


నేను వేట మిష మీద నిన్ను చంపలేదు కనుక భష్యాభక్ష్య విచికిత్స అనవుసరం. ధర్మ రక్షణార్ధమే నిన్ను చంపాను. ప్రభువైన భరతుని ప్రతినిధులం గనుక మా రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యతా, హక్కూ మాకున్నాయి. నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యను నీవు వశం చేసుకొన్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణ దండనయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్ర తత్వాలుండవని కిష్కింధకు రాజైన నీకు తెలుసు.


ఇక చెట్టుమాటునుండి చంపడం గురించి. నీ మెడలోని కాంచనా మాలా వర ప్రభావాన్ని నేను మన్నించాలి గనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరాఙ్ముఖుడైన వధ్యుని వధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకో దగదు. అన్యుల సహాయం పైని ఆధారపడేవాడిని కానని నా చరిత్రే చెబుతుంది. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాననుకోవడం అవివేకం.


నీ వధకు మరొక అలౌకిక పరమార్ధ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టి కర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుడి మిత్రుడవయ్యావు. కనుక నీవు నాకు సహాయ పడితే మిత్ర ద్రోహివవుతావు. రావణుడి పక్షాన ఉంటే పితృద్రోహివవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలిసికొని చిత్త క్షోభను వర్జించి శాంతిని పొందు.


*వాలి చివరి కోరికలు*


వాలి ఇలా అన్నాడు– రామా! సర్వజ్ఞుడవైన నీకు బదులు చెప్పగలిగేవాడను కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వ జన్మ సుకృతం. గారాబంగా పెరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగానే నీవు రక్షించు. నామీద వున్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపననూ, అపరాధాలనూ మన్నించు.


తరువాత వాలి సుగ్రీవుని పిలచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని స్వంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తార హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు.


పిన తండ్రిని కూడా తండ్రిని లాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు. దేశ కాలాలు గుర్తించి ప్రభువు పట్ల విధేయుడై ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహమూ, తీవ్ర వైరమూ మంచివికావన్నాడు. అందరి వద్దా సెలవు తీసికొని, నోరు తెరచియే మరణించాడు.


అందరూ గొల్లుమన్నారు. తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. సుగ్రీవుడు పశ్చాత్తాపంతో కుమిలి పోయి తాను కూడా మరణిస్తానన్నాడు. అందరినీ ఓదార్చి రాముడు వాలికి అంత్య క్రియలను జరపమన్నాడు. అనంతరం రాముని ఆనతిపై రాజుగా సుగ్రీవుడు, యువరాజుగా అంగదుడు అభిషిక్తులయ్యారు. తన వనవాస నియమం ప్రకారం పదునాలుగు సంవత్సరాలు నగరంలో ప్రవేశించకూడదు గనుక రాముడు కిష్కింధకు వెళ్ళలేదు.


9⃣4⃣4⃣1⃣7⃣6⃣4⃣4⃣7⃣7⃣

జయమంత్రాన్ని

 ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామికి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది!!  మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి! 


 ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడిని కీర్తిస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం ఇది!!


జయత్యతి బలో రామః 

లక్ష్మణస్య మహా బలః !

రాజా జయతి సుగ్రీవో 

రాఘవేణాభి పాలితః !!


దాసోహం కౌసలేంద్రస్య 

రామస్యా క్లిష్ఠ కర్మణః !

హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!


నరావణ సహస్రం మే 

యుధ్ధే ప్రతిబలం భవేత్ !

శిలాభిస్తు ప్రహారతః

పాదపైశ్చ సహస్రశః !!


అర్ధయిత్వాం పురీం లంకాం 

మభివాద్యచ మైథిలీం !

సమృధ్ధార్థ్యో గమిష్యామి 

మిషతాం సర్వ రక్షసాం !!


అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.


శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుధ్ధ రంగమున రంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశన మొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.


ఇది పఠించిన వారికి జయం తధ్యం !!

 జయశ్రీ రామ!!  శుభమ్ భూయాత్!!!!

(సేకరణ)

సప్తపది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సప్తపది!*

                     ➖➖➖✍️


మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?


సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.


వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.


"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"


ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...


మొదటి అడుగు:

*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"


రెండవ అడుగు..

*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక


మూడవ అడుగు:

*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.


నాలుగవ అడుగు:

*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.


ఐదవ అడుగు:

*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.


ఆరవ అడుగు:

*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"* 

ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.


ఏడవ అడుగు:

*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

ఏది శాశ్వతం

 🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘


      _*👌*మనిషి జీవితంలో ఏది శాశ్వతం. నీవు సంపాదించిన ఆస్తి పాస్తుల, ధనధాన్యాల, సిరిసంపదల, నీ ఇల్లా, చివరికి నీ శరీరమా? మరి ఏది శాశ్వతము. ఒకసారి పరిశీలిద్దామా..*_👌


     _**సమయం ఉదయం ఎనిమిది గంటలు, సుబ్బారావు తన ఇంటిముందు వసారాలో కూర్చొని ప్రస్తుతం వాడి వేడిగా నడుస్తున్న రాజకీయ ఎత్తుగడల గురించి న్యూస్ పేపర్ లోని వార్తలను ఆసక్తిగా చదువుతున్నాడు. ఇంతలో గేటు దగ్గర ఒక బిచ్చగాడు నిలబడి, "భవతీ భిక్షాందేహి " అంటూ కేక వేశాడు. వార్తలు చదవడంలో మునిగి తేలుతున్న సుబ్బారావు ఆ కేక విని చిరాకు పడుతూ, "ఇదేమైనా సత్రం అనుకున్నావా ! పొద్దున్నే తగలడ్డావ్, నీకింకేమ్ పని పాట లేవా.. వెళ్ళవయ్యా వెళ్ళు ..ఛీ.. ఛీ.. ఏదైనా పని చేసుకొని చావొచ్చు కదా అవతలికి పో..పో.." అంటూ చిరాకు పడ్డాడు.*_


     _**అప్పుడా బిచ్చగాడు చాలా శాంతంగా సుబ్బారావుతో అయ్యా కొంచెం మీతో మాట్లాడొచ్చా అని అడుగగా సుబ్బారావు ఏ విషయం గురించి అన్నాడు. అయ్యా "ఈ ఇంటిని ఎవరు కట్టించారు స్వామీ !" అని అడిగాడు బిచ్చగాడు. సుబ్బారావు "ఇది నా ముత్తాతల ఇల్లు. నా తాత తరువాత మా నాయన, ఇప్పుడు నేను నివసిస్తున్న ఇల్లు ఇది. ఇప్పుడు మాత్రం ఇది నా ఇల్లే " ఇప్పుడు ఇది నాకు శాశ్వతం అని చాలా గర్వంగా అన్నాడు.*_


     _**అప్పుడు బిచ్చగాడు.. "మీ తాత తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. తరువాత మీ నాన్న తానున్నంతకాలం ఈ ఇల్లు నాది నాది అన్నాడు. ఇప్పుడు నీవు ఈ ఇల్లు నాది నాది అంటున్నావు. మీ వారందరూ కొంతకాలము ఇది నా ఇల్లు నా ఇల్లు " అని చెప్పుకొని, తరువాత ఈ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు కదా.. రేపు నువ్వు పోతే కూడా నీ కొడుకు ఇది నా ఇల్లు నా ఇల్లు అంటాడు కదా.. మరి ఈ ఇంట్లో ఎవరు కూడా శాశ్వతంగా ఉండలేరు కదా.. చివరికి ఎవరు శాశ్వతం, ఏది శాశ్వతం. ఏది శాశ్వతం కాదు. రేపు నీవు చనిపోతే నీ శరీరం కూడా నీది కాదు, ఈ నీ ఇల్లు, నీ శరీరం, నీ భార్య, పిల్లలు ఎవరూ కూడా నీ వెంట రారే. అటువంటప్పుడు ఈ కట్టడము నీకెలా శాశ్వతం అవుతుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 'సత్రం' కాక మరేమిటి " అని ప్రశ్నించాడు.*_


      _**ఈ జగత్తులో ఏది శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. మన కంటికి కనపడే ఈ జగత్సంబధమైన విషయములు అన్నీ కూడా తాత్కాలికములే.. శాశ్వతమైనది ఒక్కటే.. అదే "భగవంతుని సాన్నిధ్యం". అందుకే ఆయన సన్నిధికి చేరుకొనే మార్గాన్ని మనం తెలుసుకొని దాన్నే ఎంచుకొని అనుసరించాలి. ఆ మార్గమే "మానవ సేవే మాధవ సేవ ". చివరికి నిన్ను ఆ భగవంతుడి సన్నిధికి చేరవేసేది ఇతరులకు నీవు చేసిన మేలు, సహాయమే. అందుకే ఆకలై నీ ఇంటి ముందుకొచ్చిన అన్నార్తుల ఆకలిని తీర్చాలి. సహాయం కోరి నీ ఇంటి ముందుకొచ్చిన వారికి నీ చేతనైనంత సహాయం చేయాలి. చేయూతనిచ్చి వారికి ఉపశమనం కలిగించాలి.*_


      _**చూడండి మనిషి జీవితాన్ని కన్నీళ్లతో భాగిస్తే, మిగిలేవి బాధలు భయాలే. భవిష్యత్తును ఊహలతో కూడితే, వచ్చేది మొత్తం కలతలే. ఆఖరికి కొస ప్రాణాలను చివరి కోరికతో గుణిస్తే, దక్కేది శ్మశానమే. అందుకే జీవించే కొద్దికాలం సేవాభావంతో ఇతరులకు నీ చేతనైన సహాయం చేస్తూ జీవించాలి. భగవంతుడు మనిషికి ప్రత్యేకంగా తెలివిని, మంచి బుద్ధిని, ప్రేమను పంచే హృదయాన్ని ఇచ్చాడు. వీటికి విజ్ఞత, విద్య, వినయం, సేవాతత్పరత తోడైతే వాళ్ళ జీవితం కళ్యాణమయమే. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది. కానీ, విలువలు, వ్యక్తిత్వం, సేవా దృక్పథం ఎప్పుడూ మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా, నువ్వు దయామయుడుగా ఉండడమే నీవు నీ జీవితంలో సాధించ గలిగే గొప్ప విజయం.*_


    _**కాబట్టి ఇంటింటికీ తిరిగి భిక్షాటన చేస్తున్న బిచ్చగాడిని చులకనగా చూడకండి. ఎందుకంటే.. ఆ బిచ్చగాడు మనకు ఒక హెచ్చరికను చేస్తూనే ఉంటాడు. అదేమిటంటే, "నేను పూర్వజన్మమున ఎవరికీ బిచ్చము పెట్టక, ఈ జన్మమున ఇటుల భిక్షగాడినయ్యాను. నా వలెనే మీరూ అవకండి అని.. కాబట్టి అందరూ దానధర్మాలు చేయండి " అని అంటూ గృహస్థులను మేలు కొలుపు తుంటాను అన్నాడు ఆ బిచ్చగాడు..*_

 

     _**ఇదంతా నోరెళ్ళబెట్టి వింటున్న సుబ్బారావు వెంటనే లోపలి కెళ్ళి దోసిటితో బియ్యాన్ని తెచ్చి ఆ బిచ్చగాడి జోలెలో వేసి అతడికి రెండు చేతులు జోడించి నమస్కరించాడు. కాబట్టి మిత్రులారా ! అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే "మనిషి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. నీవు సంపాదించిన ధనధాన్యాలు, సిరిసంపదలు, ఆస్తి పాస్తులు, నీ ఇల్లు, నీ శరీరం ఇవేవీ శాశ్వతం కాదు. ఇతరులకు నీవు చేసే మేలు, సహాయం, సేవలు ఇవి మాత్రమే శాశ్వతం అని తెలుసుకొన్నారు కదా.. కాబట్టి మీరందరూ కూడా సేవా దృక్పథంతో, మీకు చేతనైనంత దానధర్మాలు చేస్తూ ఆ భగవంతుడి కృపకు పాత్రులై ఆయన సన్నిధికి చేరుకొంటారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ.. శుభం భూయాత్..*_👌


_*🤘*లోకాసమస్తాసుఖినోభవన్తు**_🤘


_*🤘*సర్వే జనా సుఖినోభవంతు**_🤘


       _*👌*ధర్మో రక్షతి రక్షతః **_👌


      

                   


                                         _

జ్ఞాపక శక్తి పెరగాలంటే

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



         *జ్ఞాపక శక్తి పెరగాలంటే*

                 ➖➖➖✍️


*మతి మరపు సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతూంటారు.*


*అలాగే విద్యార్థులు జ్ఞాపకశక్తి లేకపోవడం వల్ల విద్యలో తీవ్రంగా నష్టపోతుంటారు.*


*ఇలాంటి వారు ఈ  శ్లోకాన్ని నిత్యం ఉదయం సాయంత్రం మీకు వీలైనన్ని సార్లు పఠించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది.*


*ముఖ్యంగా విద్యార్థులు ఈ శ్లోకం ప్రతి రోజూ పఠించడం ఎంతో మంచిది.*


*శ్రీదత్తో నారదో వ్యాసః శుకశ్చ పవనాత్మజః కార్తవీర్యశ్చ గోరక్షో సప్తైతే స్మృతిగామినః*


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

పురుష ప్రయత్నం!*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


          *పురుష ప్రయత్నం!*

               ➖➖➖✍️


*జీవితంలో  పురుషప్రయత్నం ప్రాధాన్యం గురించి రామకృష్ణ పరమహంస చక్కని దృష్టాంతాన్ని చెబుతారు.*


* మైదానంలో తాడుతో కట్టేసిన ఆవును ఉదాహరణగా చూపుతూ వివరిస్తారు. *


*మెడకు కట్టిన తాడు ఆ గోవు స్వేచ్చకు ప్రతిబంధకమే! దాని కదలికలకు అది పరిమితిని విధిస్తుంది.*


 *తొలుత అంత వరకే తన స్వతంత్రేచ్ఛ (ఫ్రీవిల్‌) అనుకొని ఆ గంగిగోవు కూడా తనను తాను సమాధాన పరుచుకుంటుంది.* 


*అందుకే తన పరిధి మేరకు గడ్డి మేస్తూ కాలం గడిపేస్తుంది. *అక్కడ ఇక తనకు గ్రాసం లభించదని రూఢి అయ్యాక దూరంగా ఉన్న గడ్డిపైకి దృష్టి మళ్లిస్తుంది. మెడకు కట్టిన తాడును విదిలించుకొని ఆ పచ్చిక వైపు పరుగులు తీసేందుకు పరిపరివిధాలా ప్రయత్నిస్తుంది.*


* అప్పుడు ఆ మూగజీవి తపనను యజమాని గమనిస్తాడు. అది తాడును వదిలించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు అతడు గుర్తిస్తాడు.*


* ఆ ఆవు ఆరాటాన్ని అర్థం చేసుకొని దాని మెడకు కట్టిన తాడును విప్పేసి మైదానంలోకి వదులుతాడు.*


* ఆ గోవుకు కట్టిన బంధనం లాంటిదే మన తలరాత. తెంచుకోవాలని ప్రయత్నించడమే పురుషార్థం. ఆ యజమానే భగవంతుడు.*


* విధికి దీటుగా మనిషి ఎంత తీవ్రంగా పోరాడితే, అంత త్వరగా ఆ శృంఖలాల నుంచి బయటపడగలడు.*✍️


                        🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

గుండె జబ్బులు

 గుండె జబ్బులు  -  ఆహార నియమాలు - ఔషధాలు 


 గుండెజబ్బు రావడానికి గల కారణాలు -


 *  అతిగా ఆవేశపడటం.

 

 *  ఎక్కువుగా ఉన్న వేడి పదార్దాలు తినడం.

 

 *  పులుసు , వగరు ఉన్న రుచులు ఎక్కువ ఉన్న పదార్దాలు తినడం.


 *  విచ్చలవిడిగా కామకలాపాలు సాగించడం .


 *  అతిసారం 


 *  జీర్ణకోశం లో  వ్రణాలు .

 

 *  విషపదార్దాల సేవనం .

 

 *  మానసిక ఆందోళన .


 *  రక్తపోటు .


 *  కొవ్వు పేరుకొని పోవడం.


 *  అధికంగా గోంగూర వాడటం.


   మొదలైన వాటివల్ల గుండె జబ్బులు వస్తాయి.


   గుండె రోగులు పాటించవలసిన నియమాలు -


 *  ఎప్పుడు పాత బియ్యమే ఆహారంగా ఉపయోగించాలి. దంపుడు బియ్యమే శ్రేష్టం .


 *  మేక మాంసం , అడివి పక్షుల మాంసం , అడివి మృగాల మాంసం తో తయారైన మాంస రసాలు త్రాగవచ్చు. 


 *  అల్లం, ఉప్పు, కొద్ది కారం , కొద్దిగా యాలుక్కాయలు , లవంగాలు , దాల్చిన చెక్క, ఇవన్ని కలిపి నూరి ఆ మిశ్రమాన్ని మాంసం ముక్కలకు రాసి ఎండబెట్టాలి. ఎండిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆవునేయ్యిలో వేయించుకొని తినవచ్చు.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  కందికట్టు, పెసరు కట్టు, ఉలవ కట్టు వాడవచ్చు.


 *  బీర, కాకర, క్యాబేజీ , టమాటో , లేత ముల్లంగి పొట్లకాయ , లేత అరటికాయ , పొన్నగంటి కూర , పెరుగుతోట కూర , మెంతి కూర , సొరకాయ , దోసకాయ తినాలి .


 *  మామిడి పండ్లు, దానిమ్మ పండ్లు , బత్తాయి రసం ( కలకండ రసం కలిపింది.) నారింజ రసం , ద్రాక్ష రసం వాడవచ్చు.


 *  ఆవుపాలు, ఆవునెయ్యి , ఆవుమజ్జిగ , పాతబెల్లం , తేనె , ద్రాక్షారిష్ట, అర్జునారిష్ట , వెల్లుల్లి , అల్లం వాడవచ్చు. 


   గుండె రోగులు మానుకోవలసినవి   - 


 *  కొత్తబియ్యం అన్నం తినకూడదు .


 *  పెరుగు వాడరాదు . మజ్జిగ వాడవలెను.


 *  పులుపు, వగరు రుచులు బాగా తగ్గించాలి.


 *  ఎప్పుడు దాహం , వాంతి రాకుండా చూసుకోవాలి .


 *  మలమూత్రాలు ఎక్కువసేపు ఆపకుండా వచ్చినవెంటనే విసర్జించాలి.


 *  దగ్గు, తేన్పులు , అపానవాయువు వీటిని ఆపకూడదు .


 *  పుల్లలతో పండ్లు తోముకోకుడదు.


 *  పొగత్రాగటం పూర్తిగా మానుకోవాలి.


 *  మద్యం, గేదపాలు అసలు పనికిరావు.


 *  తాంబూలం వేసుకొకుడదు .


 *  ఆవకాయ తినడం అత్యంత ప్రమాదకరం .


       పైన చెప్పిన ఆకుకూరలు తప్ప మిగిలనవి బాగా తగ్గించడం శ్రేయష్కరం .


గుండె నొప్పి మరియు గుండెబలమునకు సిద్ధఔషధ యోగాలు  - 


 *  తమలపాకు జీర్ణాశయమునకు మరియు హృదయమునకు బలాన్ని కలిగించును. 


 *  మునగచెక్క రసము నందు కొంచం ఇంగువ చేర్చి ఇచ్చిన గుండెనొప్పి తగ్గును. 


 *  గులాబీల నుండి తయారుచేసిన పన్నీరు గుండెదడ , గుండెపోటు , ఆయాసములను తగ్గించును . 


 *  అంజూర పండ్ల రసమును రోజుకు ఒకసారి తీసుకున్నచో గుండెకి , ఊపిరితిత్తులకు బలాన్ని కలుగచేయును . 


 *  ద్రాక్షపండ్ల రసము గుండెకు , మూత్రపిండాలకు బలాన్ని కలుగచేయును . 


 *  ఒక ఔన్స్ సొంపు కషాయంలో రెండు చెంచాల పంచదార కలిపి రోజుకు రెండుసార్లు పుచ్చుకున్న ఛాతినొప్పి , ఉపిరి తీసుకునేప్పుడు నొప్పి , గుండెనొప్పి తగ్గును. 


 *  ఖర్జుర పండు గుండె , ఊపిరితిత్తులు , మూత్రపిండములు , లివర్ మొదలగు శరీరావయములకు మిక్కిలి ఉత్తేజాన్ని కలిగించి బలమును , పుష్టిని ఇచ్చును . 


 * ప్రతినిత్యం ఉదయాన్నే ఒక అంజూరపండు తినుచున్న గుండెదడ , ఆయాసం తగ్గును. 


  

 

       మరిన్ని సులభయోగాలు నా గ్రంథాల యందు ఇవ్వడం జరిగినది.

 

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అభిషేక జలం

 గుడిలో అభిషేక జలం పోవు మార్గాన్ని ఏమంటారు ?


ప్రాచీన దేవాలయాన్ని ముఖమండపం, రంగమండపం, అంతరాళం, గర్భగుడి అనే భాగాలుగా విభజించవచ్చు.

భక్తులు మొదట ప్రవేశించేది ముఖమండపంలోనికే. ముఖమండపం అందమైన శిల్పస్థంభాలతో అలరారుతూవుంటుంది. ఇక్కడే ద్వారపాలకులు అటు ఇటు కొలువైవుంటారు.

రంగమంటపం కూడా శిల్పస్థంబాలతో శోభిల్లుతూవుంటుంది.

రంగమంటపంలోనే నృత్యగాన సంగీతభజనలుంటాయి.

రంగమంటప వాకిలి పైన లక్ష్మీదేవికి ఏనుగులు పూలమాలలతో  అర్చిస్తూవుంటాయి.


అంతరాళం గర్భగుడికి అనుకొనేవుంటుంది. ఎత్తైన అరుగులుంటాయి. 

ఈ అరుగులు కూడా శిలాశిల్ప స్థంబాలతో వుంటాయి.

గర్భగుడి ద్వారానికి అటుఇటుగా ద్వారపాలకులుంటారు.

గర్భగుడిలో పానవట్టం లేదా అధిష్టానం పై శిలామూర్తైన మూలవిరాట్టు విగ్రహం వుంటుంది.


విమానమంటే గర్భగుడిపై గల గోపురం. గర్భగుడిలోని మూలవిరాట్టు ఎత్తును బట్టి విమానం రూపురేఖలు ఎత్తు నిర్ణయిస్తారు.


విమానగోపురాలలో దాదాపు 20 రకాలున్నాయి.అవి


(1) మేరువు 

(2) మందరం 

(3) కైలాసం

(4) విమానం 

(5) నందనం 


(6) సముద్గం

(7) పద్మం

(8) గారుడం

(9) నందిని

(10) కుంజరం


(11) వర్ధనం

(12) గృహరాజం

(13) వృషభం

(14) హంస

(15) ఘటము


(16) సర్వతోభద్రం

(17) సింహం

(18) మహేంద్ర

(19) రాజహంస

(20) స్వస్తికం


దేవుడి అభిషేకజలం పోవుమార్గాన్ని *సోమసూత్రం* అంటారు.


దేవుడిని ప్రతిష్టించే అధిష్టానానం నాలుగు లేదా లేదా ఎనిమిది లేదా పదహారు ముఖములు కలిగివుండాలి.లేదా గుండ్రంగా వుండాలి.

ప్రధానదేవుడి అధిష్టానం, ఉత్సవ విగ్రహాలకు అధిష్టానం వేరువేరుగా వుంటాయి.


ఈ దేవతాపీఠాలు లేదా మూలవిగ్రహాపీఠాలు (1) పద్మపీఠం, (2)శేషపీఠం, (3) కుముదపీఠం (4) సోమపీఠం (5) ద్వాదశాశ్రమం అని 5 రకాలు.


ఘంటానాదం వలె  గంభీరంగా మ్రోగేది పురుషశిల.

సంగీతంలోని లయతాళములవలే  మ్రోగునది స్త్రీ శిల.

స్వరంపీలగా, హీనంగావుండునది నపుంసకశిల.


పురుషశిలతో మూర్తిని, స్త్రీ శిలతో పీఠాన్ని, నపుంసకశిలతో పాదపీఠం చేయడం ఉత్తమo...