15, డిసెంబర్ 2021, బుధవారం

తేయాకు

 తేయాకు గురించి సంపూర్ణ వివరణ - లాభనష్టాలు .


    తేయాకులో రెండు జాతులు కలవు. ఒకటి ఆకుపచ్చగా ఉంటుంది. దీనిని ఆంగ్లము నందు Viridis అంటారు. రెండొవది నలుపురంగులో ఉండును. దీనిని Bohea అని పిలుస్తారు . నల్లని తేయాకు చైనా , జపాన్ దేశముల పంట .ఈ మధ్యకాలంలో జావా దీవి యందు బ్రెజిల్ దేశము నందు కూడా ఈ రకము సాగుచేస్తున్నారు.


              200 సంవత్సరాల వరకు కూడా తేయాకు గురించి యూరపు ఖండములో తెలీదు .1664 వ సంవత్సరములో ఈస్టిండియా కంపెనీ వారు తేయాకును యూరపు ఖండంనకు పరిచయం చేసి దిగుమతి చేసినారు. మొట్టమొదట బ్రిటిష్ రాజుగారికి బహుమానంగా రెండు పౌనుల రెండు ఔన్సుల తేయాకును తెచ్చి ఇచ్చారు. ఫ్రెంచ్ దేశములో తేయాకు వాడకం తక్కువ కాని కాఫీ , పొగాకు , వైన్ వాడకం ఎక్కువ. నిద్రమత్తు వదలడానికి , శరీరంలో నూతన ఉత్తేజం నింపడానికి తేయాకు పానీయం వాడుతారు. తేయాకు పానియం లో ఎటువంటి పోషకవిలువలు లేవు కాకుంటే దంతబాధతో ఉన్నప్పుడు తేనీరు పాలు కలపకుండా తీసుకోవడం వలన దంత బాధ నుంచి కొంతమేర ఉపశమనం కలుగును.


             తేనీరు వలన లాభాల కంటే నష్టాలు ఎక్కువ కలవు. అలసట , బలహీనత, రక్తహీనత కలిగిన రోగులు తేనీరు సేవించినచో ఎక్కువ నష్టం జరుగును. తేనీరు ఉదయాన్నే ముఖప్రక్షాళన పిదప సేవించినచొ కొంతకాలం పిదప ఉదరము నందు వాయువును పుట్టించును మరియు మంట కలిగించును. సర్వరోగములకు మూలకారణం అగును. ఆకలిని చంపును. నల్లని తేయాకు మరియు కాఫీ ఇంకా ఎక్కువ దుష్పరిణామాలు కలుగచేయును. నాడి ఎక్కువ కొట్టుకొనును. గుండెవేగం పెరుగును . మూత్రపిండాలపైన ప్రభావం ఎక్కువ చూపడం వలన మూత్రము ఎక్కువ వచ్చును. ఎక్కువ కాలం తేనీరు అధిక మోతాదులో సేవించిన చర్మం శీఘ్రముగా పాలిపోవును. శరీరం నందు అమితమైన వేడిని పెంచును. కన్నులు లోతుకు పోవును . నాడి బలహీనం అగును.


           శరీరం నందు ఏదైనా వ్యాధి వృద్ది చెందే సమయంలో తేనీరు అధికంగా సేవించుచున్న కాళ్లు , చేతులు చల్లబడి చెమట పుట్టును . జీర్ణాశయం పైన అత్యధిక ప్రభావం చూపును. కొన్ని ప్రాంతాలలో ఈ తేయాకును కూడా కల్తి చేయుచున్నారు. నల్లని ముతక తేయాకును ఇనప పెనం పైన కొంచం వేడి చేసి ఆకుపచ్చని రంగుకు మార్చి దానికి నీలిమందు , తెల్లసీసం మిశ్రమమును చేర్చి తద్వారా రేగుపండు రంగు వలే నవనవలాడే కోమలమైన ఆకుపచ్చని తేయాకు వలే ఉంగరములుగా చుట్టుకొని ఉండునట్లు సిద్ధము చేయుచున్నారు ఇది అత్యంత ప్రమాదకరం . ఈ విధానములో ఎక్కువుగా కల్తి చైనాలోని కాంటస్ అనే ప్రదేశములో ఎక్కువుగా తయారుచేయుచున్నారు.


                  తేయాకు దంతములకు కానరాని హాని చేయును . అకాల దంతక్షయం కలుగచేయును . తేనీరు తీక్షణ తత్వం ఎక్కువ. వేడిగా ఉండగా తేనీరు సేవించుతాం అందువలన చిగుళ్లకు కూడా తీవ్రమైన నష్టం కలుగును. చిగుళ్లకు రోగం పుట్టించి దంతముల లోపల పుచ్చు వ్యాధిని కలుగచేయును . ఒక సన్నటిపొర నోటిలోపల ఉండును. అదే పొర పొట్టవరకు వ్యాపించి ఉండును. పొట్టలోపల కూడా అదే పొర ఉండును. పొట్టకు కీడుచేయు పదార్దాలు అన్నియు దంతములకు కీడు చేయును . వేడివేడి పానీయాలు మరియు అతి చల్లటి పదార్దాలు పొట్ట మరియు దంతములు రెండింటికి కీడు చేయును . తేనీటిని ప్రతినిత్యం సేవించువారి సంతానం వంశపారంపర్యంగా "గండమాల" అను వ్యాధి సంప్రాప్తిచ్చును . స్త్రీ అధికంగా తేనీరు సేవించుట వలన నాడీదౌర్భల్యం సంభవించును. ముఖ్యంగా గర్భనాడులను దుర్భలపరుచును. దీనివలన ఆ స్త్రీకి కలుగు సంతానముకు వంశపారంపర్య వ్యాధులు సంక్రమించును. ముఖ్యంగా క్షయ , గండమాల వంటి వ్యాధులు సంభంవించును. 


          పైన చెప్పిన విధముగా టీ మరియు కాఫీలను పూర్తిగా నిషేధించి ఆరోగ్యాన్ని కాపాడుకొనగలరు.


       గమనిక -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు " అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ధృతరాష్ట్రులమేనా

 *మనమంతా ధృతరాష్ట్రులమేనా.....❓*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


💫 *వ్యాస మహర్షి ఏ ఉద్దేశ్యంతో భగవద్గీత ప్రారంభంలోనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి? మనకు ఇస్తున్న సూచన ఏమిటి?*


💫 *వ్యాఖ్యానం :* 

సూక్ష్మంగా ధృతరాష్ట్రుని ప్రశ్నతో భగవద్గీత ప్రారంభమవుతున్నది.  


*ధృతరాష్ట్ర ఉవాచ*:


*శ్లో* ॥ 

*ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |*

*మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ! || (1)*


*వ్యాఖ్య* :


*'ధృతరాష్ట్ర ఉవాచ'* : 


💫 *శుభమా అని గీతాధ్యయనం ప్రారంభిస్తూ, దుష్టుడైన గ్రుడ్డిరాజు ధృతరాష్ట్రుని తలచుకోవటమా? ఇదేమిటి? ఎందుకిలా జరిగింది? మహామేధావి, మహాజ్ఞాని ఐన వ్యాసుడు ఎందుకిలా ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చాడు ప్రారంభంలోనే? ఏమిటి ఇందులోని ఆంతర్యం?*


💫 *వ్యాసమహర్షి ఎంతో నేర్పుతో, కావాలనే ధృతరాష్ట్ర ప్రసక్తి తెచ్చి ఉండాలి. దీనిలో ఎంతో లోతైన భావం ఉంది.* 


💫 *అసలు ధృతరాష్ట్రునికి ఆ పేరు పెట్టినవాడు వ్యాసమహర్షే.*


💫 *ఒక్క ధృతరాష్ట్రునికే గాదు, మహాభారతంలో చాలామందికి నామకరణం చేసింది ఆయనే. నామకరణం చేయటంలో ఆయన సిద్ధహస్తుడు. పేరు వినగానే వాడి గుణగణాలు, బుద్ధులు అన్నీ తెలిసిపోతాయి.*


💫 *మనమూ పెడుతుంటాం పేర్లు బాలసారె రోజున. 'సత్యనారాయణ' అని పెడతాం. వాడు చచ్చినా నిజం చెప్పడు. 'ఆనందరావు' అంటాం. ఎప్పుడూ ఆముదం త్రాగిన ముఖం పెట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. 'సుందరమ్మ' అని పెడతాం పేరు. పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తుంది. 'అన్నపూర్ణ' అంటాం. ఎంగిలిచేత్తో కాకిని తోలదు, పిల్లికి బిచ్చం పెట్టదు. 'శాంతాదేవి' అని పెడతాం. ఎప్పుడూ అశాంతే. సన్యాసం పుచ్చుకున్న తర్వాత 'స్వామి ఆత్మానంద' అని పేరు పెట్టుకుంటారు. ఆత్మానందం మాట దేవుడెరుగు, ఎప్పుడూ చిటపటలే, నిప్పుమీది మిరపకాయలే.*


💫 *కాని, వ్యాసుడు చేసే నామకరణం అలా ఉండదు. చక్కగా అతికినట్టు సరిపోతుంది.*


💫 *'ధృతరాష్ట్రుడు' అంటే తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు అని. నిజంగా ధృతరాష్ట్రుడు చేసింది అదే. చేతికి చిక్కింది గదా అని పాండవుల రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నాడు. ఆఖరుకు శ్రీకృష్ణుడే వచ్చి చెప్పినా ఏవో సాకులు చెప్పి తప్పించుకున్నాడు.*  


💫 *ఈ ధృతరాష్ట్రునికి గీతను బోధించినవాడు సంజయుడు. 'సంజయుడు' అంటే, 'సమ్యక్ జయం' పొందినవాడు. అంటే ఇంద్రియాలను చక్కగా జయించినవాడు అని. అట్టివాడు గనుకనే వ్యాసులవారి అనుగ్రహంతో దివ్యనేత్రాన్ని పొంది శ్రీకృష్ణుని గీతాబోధను సాక్షాత్తుగా విన్నాడు. ఆయన విశ్వరూపాన్ని దివ్యనేత్రంతో తిలకించి పులకించిపోయాడు.*


💫 *అట్టి సంజయుని ద్వారా గీతా బోధను విన్నా, ధృతరాష్ట్రునికి ఏమీ ప్రయోజనం కలగలేదు. కాని అర్జునునికి మాత్రం గీతా బోధతో మోహం తొలగింది, స్మృతి కలిగింది. ఇద్దరూ విన్నది ఒకే విషయం.*


💫 అయినా ఎందుకీ తేడా? *అర్హతలోనే తేడా. కనుక ధృతరాష్ట్రుని లాగా వినవద్దు - విన్నా ప్రయోజనం ఉండదు అని చెప్పటమే ధృతరాష్ట్ర ప్రసక్తిలోని ఆంతర్యం.*


💫 అంతేకాదు, *మనందరం ధృతరాష్ట్రులమే. కనుకనే ఈ హెచ్చరిక. ఎలా? తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకు కూర్చున్నవాడు గదా ధృతరాష్ట్రుడు అంటే - మరి మనం చేస్తున్నదేమిటి? ఎన్నో హీన జన్మలెత్తిన తర్వాత, ఆ జన్మలన్నీ వ్యర్థం గనుక, మోక్షాన్ని పొందటానికి తగిన మానవజన్మను ఇవ్వమని భగవంతుని ప్రార్థించి, ఈ జన్మను తెచ్చుకున్నాం. ఈ శరీరమనే రాజ్యానికి ప్రభువయ్యాం. అంతే. ఇక భగవంతుని మరచిపోయి, మనం ఎందుకు ఈ దేహాన్ని తెచ్చుకున్నామో మరచిపోయి, ఇది ఒక అద్దె కొంప లాంటిదని, జాగ్రత్తగా వాడుకుంటూ, సమయం రాగానే ఆయన ఇచ్చినదాన్ని ఆయనకు అప్పగించి వెళ్ళాలనే జ్ఞానం లేకుండా, ఇది నాదేనని, అసలు నేనేనని గట్టిగా పట్టుకు కూర్చున్నాం. శాస్త్రాలు, పెద్దలు "ఈ దేహాత్మ బుద్ధి' ని వదలరా బాబూ, నీవు దేహానివి కాదు, నీవు ఆత్మవు; ఈ దేహాన్ని నీవు వాడుకోవటానికి భగవంతుడిచ్చిన పరికరం మాత్రమే" అని ఎంత చెప్పినా వినిపించుకోం.*


💫 *సంపాదించుకోవటం, తినటం, తిరగటం, దాచుకోవటం, దోచుకోవటం - ఇదే మన పవిత్ర కర్తవ్యం అనుకుంటూ, వ్యర్థమైన పనులకు మాత్రమే దీనిని వినియోగించుకుంటున్నాం. ఒకవేళ భగవంతుడు 'నేనిచ్చిన దేహాన్ని నాకివ్వమని' బలవంతంగా లాగివేస్తే తిరిగి మళ్ళీ మళ్ళీ ఈ దేహాలను తెచ్చుకొనేందుకు వీలుగా కర్మలు చేస్తూ, జన్మ కర్మ వలయంలో పడిపోయి, తిరిగి తిరిగి ఈ దేహాలను తెచ్చుకుంటున్నాం. మరి ఇలా గట్టిగా ఈ దేహమనే రాజ్యాన్ని పట్టుక కూర్చున్న మనం ధృతరాష్ట్రులం కాదా?*


 💫 *అందుకే ఓ ధృతరాష్ట్రులారా! మీరు కూడా ఆ ధృతరాష్ట్రుని లాగానే ఈ అద్భుత జ్ఞానాన్ని వింటే, ఆయనకెలాగైతే విన్న జ్ఞానం వంటబట్టక వృథా అయిందో, మీకూ అంతే. కనుక అర్జునునిలాగా మారి వినండి. భగవంతుని చేరుకోవాలనే తపనతో; నావాళ్ళు, నా రాజ్యం అంటూ మమకారం పెట్టుకోకుండా; మనస్సును నిర్మలం చేసుకొని, బుద్ధిని సూక్ష్మం చేసుకొని వినండి అని చెప్పటానికే 'ధృతరాష్ట్ర ఉవాచ' అని గ్రుడ్డిరాజును గుర్తు చేయటం.*



*సేకరణ:* ఆధ్యాత్మిక భక్తిప్రపంచం 

🙏🙏🙏🙏🙏

సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము

 సూర్యుడు నెలకు ఒక రాసి చొప్పున 12 నెలలు 12 రాశులలో సంచరిస్తాడు. ఆ విధంగా సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే సమయాన్ని ధనుర్మాసము అని పిలుస్తారు. ధనుర్మాసము దక్షిణాయణంలో చివరి మాసము. ఈనెల 16న ప్రారంభమయ్యే ధనుర్మాసము జనవరి 13 న ముగుస్తుంది. సూర్యుడు రాశిలో ప్రవేశించే సమయాన్ని సంక్రమణము అంటారు. సూర్యుడు జనవరి 14న మకర రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు సంచరించే పన్నెండు నెలలు కలిపి దేవతలకు ఒక సంవత్సరం.


ఒక సంవత్సరాన్ని రెండు ఆయనములుగా విభజించారు. మొదటిది ఉత్తరాయణం రెండోది దక్షిణ దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి, ఉత్తరాయణం అంటే దేవతలకు పగలు. దక్షిణాయణం అంటే రాత్రి వదలి పగలు ప్రవేశించే సమయం, ప్రాంతః కాలం వంటిది. మకర సంక్రాంతి రోజున, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించటంతో దక్షిణాయణం ముగిసి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది.ధనుర్మాసంలో, ప్రతి ఇంటి ముందు సాయంత్రము రంగవల్లులు వేసి మరుసటి ఉదయం ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలను రంగవల్లుల మధ్యలో ఉంచి పూజించడం ఆనవాయితీ. మద్యలో ఉన్న పెద్ద గొబ్బెమ్మను మహాలక్ష్మిగాను చుట్టూ ఉన్న గొబ్బెమ్మలను గోపికలు గాను భావించి, పాటలు పాడుతూ చుట్టూ తిరుగుతూ కొలుస్తారు. ఈ విధంగా గొబ్బెమ్మలను పూజించడం వల్ల పెళ్లి కాని కన్యలకు, త్వరగా మంచి మొగుడు లభించి వివాహమవుతుందని నమ్మకం.


హరిదాసులు, గుమ్మడి కాయ వంటి గిన్నెను నెత్తిన పెట్టుకొని, హరి సంకీర్తనలతో ప్రతి ఉదయము ఇంటి ముందుకు రావటం ధనుర్మాసం ప్రత్యేకత. హరి సంకీర్తనలతో శ్రీ మహావిష్ణువు కటాక్షం లభిస్తుంది. భూమిని నెత్తిన పెట్టుకొని వచ్చిన సాక్షాత్తు శ్రీమహావిష్ణుగా హరిదాసును భావిస్తారు.

* "వాదః ప్రవదతామహమ్

 ॐ గీతా జయంతి 


                        సందేశం - 2 


* "వాదః ప్రవదతామహమ్" 

      - వాదించువారిలో వాదించు శక్తి నేనే. 

       I am the logic among controversialists. 

          - Bhagawadgeetha 10/32 

 

వివరణ 


    ఒక్కొక్కడు ఒక్కొక్క విషయాన్నిగూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తన నమ్మకాలని గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తన కోరికలని గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తనకు వ్యామోహమున్న వస్తువులను గూర్చి వాదిస్తాడు. 

* ఒకడు తాను సత్యమనుకొన్నదానిని గురించి వాదిస్తాడు. 

    ఎవడు దేనిని గూర్చి వాదిస్తాడో, వాడక్కడ నుండి బయలుదేరి, అంతర్యామిని అనుభవించదానికి ప్రయాణం కడుతున్నాడు. 

    వాదించుచున్నది తానే కనుక, వాదన నుండి బయలుదేరి, వాదించుచున్న తన వద్దకు చేరుకుని, అందలి తనను తెలుసుకొని, ఈ మొత్తం తానే అని దర్శిస్తాడు. 

    కాబట్టి వాదించు వారిలో వాదించు శక్తి దేవుని వైభవము. 


    వాదము "వాద - జల్ప - వితండ" అని మూడు విధాలు. 


1. రాగద్వేషాలు లేకుండా, కేవలం తత్త్వాన్ని తెలుసుకొనే అభిలాషతో చేయబడే ప్రశ్నోత్తరాలని "వాదము" అంటారు. 


2. పరులు ప్రతిపాదించిన విషయాలను ఖండించి, తన ప్రతిపాదిత విషయాలను స్థాపించుకొని, ఇతరులని జయించాలని చేసే ప్రసంగం "జల్పం" అనబడుతుంది. 


3. కేవలం పరుల ప్రతిపాదిత విషయాలను దూషించు ఉద్దేశ్యంతో చేయబడేది "వితండం". 


    By the word "controversialists", we should here understand the various kinds of people using various kinds of argumentation in logic such as "Vada, Jalpa and Vitanda". 


1. Vada is a way of arguing by which one gets at the truth of a certain question. 

     The aspirants who are free from Raga - Dvesha and jealousy raise amongst themselves questions and answers and enter into discussions on philosophical problems in order to ascertain and understand the nature of the Truth. 

    They do not argue in order to gain victory over one another. This is Vada. 


2 Jalpa: 

      Jalpa is wrangling in which one ascerts his own opinion and refutes that of his opponent.


3. Vitanda: 

      Vitanda is idle carping at the arguments of one's opponents. 

      No attempt is made to establish the other side of the question. 


       In Jalpa and Vitanda one tries to defeat another. There is desire for victory. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

             భద్రాచలం

మొట్టమొదటి మహిళా కళాశాల

 ఆంధ్రాలో మొట్టమొదటి మహిళా కళాశాల...శ్రీ పద్మావతీ మహిళా కళాశాల, తిరుపతి.........

అదెలా వచ్చిందంటే.....ఆ కాలేజీ అంత గొప్ప గా ఎలా అయిందంటే....

 అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో...

అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది.


-  స్వాతంత్ర్యం వచ్చి నాలుగేళ్ళు.  స్త్రీ విద్యకు ఆదిలోనే గండిపడింది. తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది. 


- ఈ గండిని పూడ్చడానికి, 1952లో టీటీడీ ' శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల'ను స్థాపించింది. ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల. 


- రంగనాయకమ్మ మొదటి ప్రిన్సిపాల్ గా కాలేజీని నెట్టుకొచ్చి,  రెండేళ్ళ తరువాత నిష్క్రమించారు.


- స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది. 

అక్కడ రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రెండో ప్రిన్సిపాల్ రాజేశ్వరి మూర్తి 1954 లో మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా  పగ్గాలు చేపట్టారు. 


అంతే.. ఆ కళాశాల పరుగులంఘించింది. 


-  శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా 'శ్రీపద్మావతి మహిళా కళాశాల' (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు 1956లో డిగ్రీ కళాశాలయ్యింది. 


-  అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టి కల్స్  కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది.  మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? అన్నీ రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్పీడబ్ల్యు కళాశాల ఇలా రూపుదాల్చింది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు.


-  కాకినాడకు సమీపంలోని  పెద్దాపురానికి చెందిన ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు. పెళ్ళి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు. 


- రాత్రి, పగలు అనకుండా కళాశాలే ఆమెకు  ఇల్లు అయిపోయింది. అదే  ఆమెకు జీవితం అయిపోయింది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు; ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో, వాటి కోసం  ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ వినియోగించారు.


-  విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు. కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు. 


- రాష్ట్రంలోనేఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే, అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు.


- టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం నిషేధం .రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహారాన్ని బైట ఒండించి విద్యార్థినులకు  పెట్టించారు.


- ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు, “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే , ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు. 


-  తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొల ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాహహులను కళాశాలకు రప్పించారు. ఒక ఆడ బిడ్డను,  తల్లి   తీర్చిదిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె  అలా తీర్చిదిద్దారు.


- కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు ఈ కళాశాలవే. టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి. 


-  మరొక ఈవో తో ఆమెకు భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు.


- అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు.


- కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది.  తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు. 


- ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు.


- ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు.


న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు!


PROF. RAJESWARI MURTHY గారు

శత వసంతాలు. తొలి మహిళా కళాశాల రూపుశిల్పి.. డిసెంబర్ 10 వ తేదీన శత జన్మదినం.


ఆ కాలపు అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞాన తృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాటలు వేశారు.


న్యూయార్క్ లో ఇప్పటికీ  సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటున్నారు.


ఈ రోజు మనం గొప్పగా చూసే ప్రతి గొప్ప వ్యవస్ధ వెనకాల ఒక తెలియని వ్యక్తి యొక్క శ్రమ, త్యాగం ఉంటుంది అనేది అక్షర సత్యం...! ఆ గొప్ప వ్యక్తుల్లో ఆంధ్ర వరకు అయినా, రాజేశ్వరి మూర్తి గారు వుంటారు....!!(Thanks for reading 🙏)

సేవా భాగ్యం

 ఇది రామానుజులవారి వృద్ధాప్యంలో జరిగినదంటారు.ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి వారిని ."స్వామీ! మీ సేవా భాగ్యం కలుగ జేయండి" అంటూ ప్రార్థిస్తాడు.


రామానుజులు విని నవ్వుతూ అంటారు...

అయ్యా! నేనే నేడో రేపో అని పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్న వాణ్ణి. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి ఇంకెవరినన్నా ఆశ్రయించండి.


వృద్ధుడు ఒప్పుకోడు. జగద్గురువులైన దేవరవారు కాదంటే నాకింకో దిక్కులేదని ప్రార్థిస్తాడు. చివరికి రామానుజుల వారికి ఒప్పుకోక తప్ప లేదు.


వృద్ధుడికి ఇలా చెబుతారు...

అయ్యా! తమరు అంతగా అంటున్నారు కదా! ఐతే నాకు ఒక ఉపకారం చేయండి. నేను రోజూ ఉదయం కావేరిలో స్నానం చేసి, సంధ్యాదులు పూర్తి చేసుకున్న తరువాత, ఒక భాగవతోత్తమునికి పాదప్రక్షాళనం చేసి ఆనీటిని తలపై చల్లుకొని పునీతుణ్ణి కావాలని చాలాకాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి దేవరవారు ప్రతిదినం ఉదయం కావేరి తీరానికి వేంచేసి నాకీ సేవ అందించండి.


వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు.అప్పటినుండి ప్రతిరోజూ ఉదయాన్నే ఆ వృద్ధుడు కావేరీతీరం చేరడం, స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం, తరువాత స్వామి ఆ వృద్ధునికి పాద ప్రక్షాళన చేసి పాదోదకం తలజల్లుకోవడం వారికి నిత్యకృత్యమయింది.


దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి దూషించని వాడు శ్రీరంగంలో లేడు. సహజంగానే లోకులందరికీ ఆచార్యలపట్ల అసహ్య అపరాధంగా తోచింది.ఆ వృద్ధుణ్ణి వెలివేసారు.


అయినా ఆ వృద్ధుడు పట్డించుకోలేదు. రామానుజులూ పట్టించుకోలేదు. నిత్యకృత్యం నిరాటంకంగా సాగిపోతుంది.


ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్యవిధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు. రెండు రోజులలా గడిచాయి. రామానుజుల ఆరోగ్యం కుదుట పడలేదు. వర్షం ఆగలేదు.


మూడోరోజు ఉదయం, వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోదిస్తూ ఆ కుంభవృష్డిలో రామానుజుల వద్దకు వచ్చి చెబుతుంది...


స్వామీ! మూడు రోజుల క్రింద ఉదయం యథా ప్రకారం దేవరవారి వద్దకు నా భర్త బయలుదేరాడు. ఇప్పటిదాక ఇంటికి చేరలేదు. దేవరవారికి   వారి ఆచూకి తెలుస్తుందని వచ్చాను.స్వామికి నోట మాట రాలేదు.


అనారోగ్యం మరిచి పోయాడు. దండమెక్కడో. పవిత్ర మెక్కెడో. ఒక్క ఉదుటున కావేరివైపు పరుగు! స్వామి వెనుక శిష్యులు! ఆ వెనుక శ్రీరంగ వాసులందరూ! వారిని చూసి రంగడూ బయలుదేరి ఉండొచ్చు! 


పరుగెత్తి వచ్చిన స్వామికి కావేరి ఒడ్డున, వర్షంలో తడిసి, ఆకలి దప్పులు లెక్కజేయక, జ్వరంతో వణుకుతూ  యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. 


స్వామీ! వేంచేయండి. దేవరవారిసేవా భాగ్యం కృపచేయండి.* అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్ళు ముందుకు చాచాడు.


అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ శిష్యనిదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ ఆచార్యులదే!!

అహోభాగ్యమ్! భాగ్యమంటే ఆ సంఘటన కనులారా సేవించిన రంగపుర వాసులదే!!


పరమ విరాగి యైన రామానుజుల కన్నులు గంగోత్రులైనాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేర్లయినాయి.

శ్రీ రంగనాథుడు స్థాణువైనాడు.


ఇదండీ చరమపర్వ నిష్ఠ!

శేషత్వమంటే ఇది. అది భగవత్ శేషత్వం కానీ, ఆచార్య శేషత్వంకానీ, భాగవత శేషత్వం కానీ. శేషత్వమంటే ఇది!


ఆచార్యులు తనను యథేచ్చగా వినియోగించుకొనే విధంగా స్వరూపముండడము. పాపపుణ్యములతో సంబంధము లేదు.


అపరాధ నిరపరాధములు లేవు. అసలు మనకంటూ అభిప్రాయమే అవసరం లేదు. ఆచార్యులకు చేతిలో ఒక ఉపకరణం కావడం అదే భాగ్యం కదా.....

యుగపురుషుడు

 యుగపురుషుడు నరేంద్ర మోడీ


13-12-2021 మార్గశిర శుక్ల దశమి సోమవారం - భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించవలసిన రోజు.


కాలగమనంలో పనికిరాని మనుషులు కోట్లకొద్దీ పురుగులలాగా పుట్టి పోతూ ఉంటారు. కానీ వెయ్యేళ్ళ కొకసారి మాత్రమే పుట్టే కారణజన్ములు కొందరుంటారు. అలాంటివారిలో ఒకరు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు. నేనిలా అనడానికి ఎన్నో కారణాలున్నాయి.


75 ఏళ్లుగా రావణకాష్టంలా మండుతున్న కాశ్మీర్ సమస్యను ఒక కొలిక్కి తెచ్చింది ఆయనే కాబట్టి.


వెయ్యేళ్ళుగా కోట్లాది హిందువుల హృదయాలను మెలిపెడుతున్న బాధకు కారణమైన కాశీ విశ్వనాధాలయ దీనావస్థను రూపుమాపింది కూడా ఆయనే కాబట్టి. 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో ఉన్నాయి ఆయన చేసిన గొప్ప పనులు. కానీ ఈ రెండు చాలు, భారతజాతి మొత్తం ఆయనకు శిరసు వంచి పాదాభివందనం చేయడానికి. పొద్దున్నే లేవగానే తలచుకుని నమస్కరించడానికి. 

తరతరాలకూ గుర్తుండిపోతారు కొందరు. ఉదయాన్నే, వారిని మనం తలచుకుని భక్తితో చేతులను జోడించి నమస్కరిస్తాము. వారినే ప్రాతఃస్మరణీయులంటారు. అలాంటి వారిలో ఆదిశంకరులు, వివేకానందస్వామి వంటి వారు ప్రముఖులు. నా దృష్టిలో నరేంద్రమోడీగారిని ఆ వరుసలో ఉంచాలి. భారతజాతి ఆయనకంతగా ఋణపడి పోయింది.


'దివ్యకాశీ భవ్యకాశీ' అంటూ శ్రీ నరేంద్రమోదీగారు రెండేళ్ల క్రితం తలపెట్టిన ప్రాజెక్ట్ మొదటి దశ పూర్తయింది. అంతకు ముందే సంకల్పించిన గంగా ప్రక్షాళన ప్రాజెక్ట్ కూడా పూర్తయింది. నేడు కాశీలో జరిగిన అద్భుతమైన కార్యక్రమంలో కాశీ విశ్వనాధ్ కారిడార్ ను మోడీగారు జాతికి అంకితం చేశారు.


గంగామాత శుభ్రపడింది. సరాసరి నదినుండి విశ్వనాధాలయానికి వెళ్లే దారి సుగమమైంది. కోట్లాది హిందువుల బాధ మాయమైంది. దేశం పులకరించింది. 


ఈ సందర్భంలో ఆయనిచ్చిన ఉపన్యాసాన్ని మొదటినుండీ చివరివరకూ వినమని అందరినీ నేను కోరుతున్నాను. అలాంటి అద్భుతమైన ప్రసంగాన్ని మనము కొన్నిసార్లు మాత్రమే వింటాము. గొప్ప గొప్ప స్వామీజీలు కూడా అలాంటి ప్రసంగం ఇవ్వడాన్ని నేను చూడలేదు. ఆ ఉపన్యాసం వింటే, మోడీగారిలోని దేశభక్తుడు మాత్రమే గాక, ఒక గొప్ప ఉన్నతమైన స్థితిని అందుకున్న కర్మయోగి మనకు దర్శనమిస్తాడు. ఒక యోగి, ఒక ఆధ్యాత్మికవేత్త మన కళ్ళముందు కనిపిస్తాడు. వినేవారి ఒళ్ళు పులకరించి, కళ్ళు చెమర్చే అద్భుతమైన ఉపన్యాసమది. ప్రేక్షకులలో ఉన్న 6000 మంది స్వామీజీలలో చాలామంది కళ్ళు తుడుచుకోవడం నేను గమనించాను.


విశ్వనాధాలయాన్ని ముస్లిములు ఎంత అపవిత్రం చేశారో, ఎంతగా భారతీయుల హృదయాలను గాయపరచారో తెలియాలంటే చరిత్రలోకి తొంగి చూడాలి.


అది క్రీ. శ. 1194 వ సంవత్సరం. ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైన మహమ్మద్ ఘోరీ సైన్యాధిపతి కుతుబుద్దీన్ ఐబక్ తన తురక మూకలతో కాశీని ముట్టడించి, భవ్యమైన విశ్వనాధుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. దానికి సపోర్ట్, ఖురాన్లో మహమ్మద్ చెప్పిన మతిలేని హింసాత్మక సూక్తులు. దాని తర్వాత క్రీ. శ 1240 ప్రాంతంలో ఒక గుజరాతీ వైశ్యుడు ఆలయాన్ని మళ్ళీ నిర్మించాడు. మళ్ళీ దానిని 1400-1500 మధ్యకాలంలో సికందర్ లోడీ పాలనాకాలంలో కూలగొట్టారు. అక్బర్ పాలించే సమయంలో 1585 లో రాజా మాన్ సింగ్, రాజా తోడర్ మల్లులు మళ్ళీ దానిని నిర్మించారు. తరువాత ఔరంగజేబు అనే నీచుడు మన దేశాన్ని 50 ఏళ్లపాటు పాలించాడు. వాడి పాలనాకాలంలో 1669 లో ఆలయాన్ని మళ్ళీ కూలగొట్టి, మసీదును కట్టించాడు. 1780 లో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్, మసీదును కదిలించకుండా ప్రక్కనే ఆలయాన్ని కట్టించింది. 1835 లో మహారాజా రంజిత్ సింగ్ , ఈ ఆలయానికి బంగారు పూత పూయించాడు.


ఈనాటికి, ప్రధానమంత్రి నరేంద్రమోడీగారి పుణ్యమా అని, కాశీ విశ్వనాధాలయం తన పూర్వ వైభవాన్ని పొందింది. వెయ్యేళ్ళ హిందువుల తపస్సు ఈ రోజున ఫలించింది.


ఇదొక్కటేనా? ఈ క్రమంలో ఇంకా చాలా జరిగాయి.


ముస్లిముల రాక్షస పాలనాకాలంలో, అసలైన అన్నపూర్ణాదేవి విగ్రహం దొంగలచేత పెకలించబడి, అమ్ముకోబడి, చివరకు సముద్రాలను దాటి కెనడాలో తేలింది. దానిని మళ్ళీ వెనుకకు తెప్పించి, పునః ప్రతిష్ట చేసిన పుణ్యాత్ముడు నరేంద్ర మోడీ గారు.


అంతే కాదు. కాశీ సందుగొందులను వెడల్పు చేసే పనిలో, దాదాపు 1500 మంది కుటుంబాలను వేరే చోట స్థలాలిచ్చి తరలించారు. ఆ ఇళ్ల మధ్యలో, చరిత్ర ప్రసిద్ధి గాంచిన 40 ఆలయాలు బయటపడ్డాయి. మన పురాణాలలో వీటి ప్రస్తావనలున్నాయి. కానీ, కాశీలో ఇవి ఎక్కడా కనిపించడం లేదు. ఏమంటే, ఆక్రమణలకు గురై ఇళ్లలో ఇళ్ళుగా మారిపోయాయి. ఇపుడా 40 ఆలయాలు మళ్ళీ తమ పూర్వవైభవాన్ని సంతరించుకున్నాయి.


ఎంతటి పుణ్యాత్ముడో మోడీగారు? ఇటువంటి కారణజన్ములు ప్రతితరంలోనూ పుట్టనుగాక పుట్టరు.


'పందికేం తెలుస్తుంది పన్నీటి వాసన?' అన్నట్లు వావీ వరసలూ, నీతీనియమాలూ లేని ఆఫ్ఘన్, ఇరాన్, పాకిస్తాన్ దొంగలగుంపులకు హిందూమతం యొక్క ఔన్నత్యం ఎలా అర్ధమౌతుంది? మన దేవాలయాల గొప్పదనమేంటో, నీతీజాతీ లేని అలాంటి నీచులకెలా అర్ధమౌతుంది?


స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లకు కూడా మన దేవాలయాలను మనం స్వాధీనం చేసుకోలేకపోవడానికి, ధ్వంసం చేయబడిన ఆలయాలను మళ్ళీ కట్టుకోలేకపోవడానికి, సోకాల్డ్ గాంధీ నెహ్రూలూ, ఘనత వహించిన కాపీ రాజ్యాంగ నిర్మాతలూ, మతప్రాతిపదికన దేశాన్ని విడగొట్టికూడా, మన దేవాలయాలను స్వాధీనం చేసుకోకుండా వాటినలాగే వదిలేసిన సోకాల్డ్ నాయకులే కారకులు. ఈ మహాపాపం వారిదే.


యువకునిగా ఉన్నపుడు వైరాగ్యపూరితుడై, ఉన్నతాదర్శప్రేరితుడై, రామకృష్ణా మిషన్ లో బ్రహ్మచారిగా చేరుదామని ప్రయత్నించిన మోడీగారిని ఆపి, 'నీ కార్యరంగం సమాజమే గాని ఆశ్రమం కాదు. దేశానికి నీవు చేయవలసినది చాలా ఉంది. సన్యాసం నీదారి కాదు. వెళ్ళు. భరతమాతకు నీ సేవలందించు' అంటూ వెనుకకు త్రిప్పి పంపిన రామకృష్ణా మిషన్ అధ్యక్షులు శ్రీమత్ స్వామి ఆత్మస్థానందగారి దూరదృష్టి, దివ్యదృష్టి ఫలితాలను ఈనాడు మనం కన్నులారా చూస్తున్నాం. 


మనమే కాదు, రాబోయే వేలాది తరాల భారతీయులందరూ నరేంద్రమోడీ గారి ఫోటోను ఇళ్లలో పెట్టుకుని ప్రతిరోజూ పూజించాలి. ఖచ్చితంగా ఆయన కారణజన్ముడే కాదు, భరతమాత ముద్దుబిడ్డా, మన హిందూధర్మాన్ని మళ్ళీ నిలబెట్టిన యుగపురుషుడు కూడా ! ఇలాంటి మనుషులు వెయ్యేళ్లకు ఒక్కరే పుడతారు. ఆయనలో ఒక జనకమహారాజూ, ఒక శంకరుడూ, ఒక వివేకానందుడూ నాకు కనిపిస్తున్నారు.


భారతదేశం ఆయనకు శాశ్వతంగా ఋణపడిపోయింది ! ఇంకొక నూరేళ్ళపాటు ఆయనే మన ప్రధానమంత్రిగా ఉండాలి!


---------------------------------


source: teluguyogi.net

శ్రీమాన్ రుపెనుగుంట్ల సత్యనారాయణ శర్మ గారు