22, మార్చి 2025, శనివారం

ఊరు మారితే తినే ఫుడ్డు

 ఊరు మారితే  తినే ఫుడ్డు మారుద్ది.పడుకునే బెడ్డు మారుద్ది.

బ్లడ్డెందుకు మారుద్దిరా బ్లడీ ఫూల్!

సేం కలర్....సేం పవర్.


అరవకు. అరిస్తే అరనిముషంలో చస్తావ్!

అరవకపోతే 5 నిముషాలైనా బ్రతుకుతావ్.


ఒక్కొక్కడ్ని కాదు షేర్ ఖాన్...వంద మందిని ఒకేసారి రమ్మను

లెక్క ఎక్కువైనా పరవాలేదు.తగ్గకుండా చూస్కో!


వద్దు...ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు..ఎస్.పి.

చరిత్రంటే మాదే!

చరిత్ర సృష్టించాలన్నా మేమే!

దాన్ని తిరగ రాయాలన్నా మేమే!

వాళ్ళెంత?.... బ్లడీ ఫూల్స్. బురద జాతి!


ఇలాంటి పంచ్ డైలాగ్స్...కొంచెం ప్రయత్నిస్తే.....మనం కూడా వ్రాసేస్తాం అనిపిస్తుంది.


కానీ వేదాంత పరమైన అద్భుత  విషయాలు డైలాగ్స్ లో కూర్చాలంటే....అష్టాదశ పురాణాలని మథించి ఉండాలి.


వాటిపై అద్భుతమైన అవగాహన కావాలి. 


ఆషామాషీ కాదు.


                             ************


శ్రీకృష్ణ పాండవీయంలో సుయోధనుడు:


“పాంచాలీ... పంచ భర్తృకా... నీవా నన్ను పరిహసించునది! 


సకల మహీపాల మకుట మాణిక్య శోభా నీరాజితుడైన రారాజును, నేడొక్క అబల, బంధకి అపహసించుటయా! 


అభిమానధనుడైన సుయోధనుడది విని సహించుటయా... సహించక మరణించుటా!.. 


మరణించి సాధించునది... మచ్చ మాసిపోవునా...పరిహాసాస్పదుడై  ప్రాణత్యాగము చేసికొన్నాడన్న అపనింద వేరొక్కటా...కల్ల... ఈ పరాభవము దాగుట కల్ల...


ఆ పాంచాలి ప్రక్కన నిలచి ఫక్కున నవ్విన ఆ టెక్కులాండ్రలో, యే ఒక్కతైనా ఈ వార్త ప్రక్కవాటుగా నొక్కించక మానునా! 


ఈ అపఖ్యాతి ఆనాటికానాటికి జ్వాజ్వల్యమాన దావానలమై అఖండ భూమండల మావరించి మా శ్రవణపుటభేద్యము కాకమానునా...


శత్రువులని తెలిసి తెలిసి నన్నధిక్షేపించుటకే పన్నిన పన్నాగమని ఎరిగి ఎరిగి మందమతినై, మామ మాటలకు ఏల చెవి ఒగ్గవలె... 


ఈ పాండవ హతకుల ఆహ్వానము నేనేల మన్నించవలె... 


మన్నించితిపో...ఈ మయసభ మాకేల విడిది కావలె...


అయినదిపో...ఈ మందిర సౌందర్య సందర్శనాపేక్ష నాకేల జనించవలె...


జనించెపో... మేమందేల పరిభ్రమించవలె, మనసేల భ్రమించవలె... 


ఆహూతుడన్న ఆదరముంచక, వావివరుసలు గణించక, బంధువని పాటించక, ఆ బంధకి... పాంచాలి... ఏల అపహసించవలె! 


మనుటయా మరణించుటయా’’


                             ***********


ఎవరు నాయనా నీవు? ఎందుకింత ఆవేదన పడుతున్నావు?


జీవిత పరమార్థం తెలుసుకోలేక...ఆర్తి పడుతున్న అంధుణ్ణి.


జీవితానికి...పరమార్థమంటూ ఒకటుందని అనుకుంటున్నావా?


లేదా స్వామీ?...వేద వేదాంగాలను ఎరిగిన మహర్షులు...దేశ దేశాలను జయించిన చక్రవర్తులు...సీదా సాదా...అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే. 


వీరంతా మరణించిన తరువాత...ఏమవుతున్నారు స్వామీ?


పిచ్చివాడా! లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయ పడుతుంటే...


మరణించిన తరువాత ఏమౌతారనే...విచారం నీకెందుకు?

ఆ విచారం వదులుకో. 


నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను. అనుభవించు.


వద్దు స్వామీ. అవన్నీ అనుభవించి...క్షణికములని...క్షుద్రములని...తెలుసుకున్నాను.వాటిపై నాకు వాంఛ లేదు.


నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటే.

మనం ఎక్కడనుంచి వస్తున్నాం? ఎక్కడికి పోతున్నాం?


ఈ రహస్యం తెలుసుకోవడానికి దేవతలకే సాధ్యం కాలేదే! మానవులకు సాధ్యమౌతుందా!


మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే....మాకు దిక్కెవ్వరు స్వామీ? 


మేమీ దు:ఖ భాజనమైన శరీరంతో కృశించి...జనన మరణ ప్రవాహంలో కొట్టుకు పోవలసినదేనా?మానవునికి తరుణోపాయము లేదా స్వామీ?


                                ***********


లేకేం నాయనా.ఉంది.

ఈ శరీరం విద్యావిద్యలు...రెంటితోనూ పుట్టింది.


సంసార యాత్రకు...మోక్ష యాత్రకూ...ఇదే సాధనం.


అవిద్యచే మోహితుడవై...కనిపించే ఈ జగత్తు...సత్యము నిత్యము..అనుకుని....


దు:ఖభాజనుడవై....చావు పుట్టుకల కుమ్మరి సారి లో తిరుగుచున్నావు.


ఇదంతా అనిత్యమని...ఈ నాటకానికంతటికీ కారణమైన.....మహా చైతన్యం వేరే ఉందని....


అది నిత్యము...సత్యము అని తెలుసుకుని....ఆ ఆత్మానుభవం పొందాలి.


ఆ ఆత్మానుభవం...నాకెట్లా కలుగుతుంది స్వామి?


భక్తి మార్గంలో కొందరు...జ్ఞాన మార్గంలో కొందరు...సాధించారు.


కానీ జీవన్ముక్తికి...రాజయోగమే సులభతరమని...పెద్దల మతం.


రాజయోగమా? నాకెవ్వరు ఉపదేశిస్తారు స్వామీ?


ఆ సమయం వచ్చినప్పుడు...పరమాత్మే..సద్గురువై వచ్చి ఉపదేశిస్తాడు.


కారు చీకటిలో దారి తెలియక తిక మక పడుతున్న నాకు....వెలుగు వలె మీరు లభించారు. 


మీరే నా గురువులు...నా దైవం.. ఆయోగ రహస్యం నాకు బోధించి...సత్య స్వరూపం చూపించండి స్వామీ.


                             ***********


అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను. సావధానుడవై వినుము.


రసాన్ని కట్టేస్తేనే కాని...స్వర్ణం కానట్టు,

మనస్సును కట్టేస్తేనే కాని...సత్యము కనిపించదు.


మనస్సే మన బంధానికి...మోక్షానికి కారణం.


మనస్సును స్వాధీనం చేసుకుంటే...నీకు..

స్వాధీనం కానిదేదీ ఉండదు!

ఆ సాధనే యోగమంటారు.


సాంగ యోగాన్ని క్రమంగా సాధించి...

చిత్త వృత్తులనణచి...సమాధి స్థిరుడవైనప్పుడు....,


నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది.

అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు!


ఇంతవరకు ...తనచేత చిక్కించుకుని ఆడించే ప్రకృతి..

నీ స్వాధీనమౌతుంది!


మోక్షం అంటే....అదేనా స్వామీ?


కాదు నాయనా. అది మోక్షానికి మొదటి మెట్టు.


ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక...


సుస్థిర చిత్తుడవై...ధ్యానిస్తే,

స్వయంప్రకాశము...

సచ్చిదానందము....

శాశ్వతము అయిన స్వస్వరూపానుభవము...

కేవలం జ్ఞానరూపంగా... నీవనుభవిస్తావు.


తత్వమసి అంటే అదే. 


అప్పుడు నువ్వు....నేను ఒక్కటే.


రాజయోగం సాధించి...అఖండ బ్రహ్మానందానుభవం పొందు నాయనా.

                               ***********


1947 లో విడుదలైన... యోగివేమన మూవీలోని....


ఈ రాజయోగ రహస్యాల జ్ఞాన పలుకులు.....పామరులకు...పండితులకు కూడా...పంచదార చిలకలే!


మయూఖ చిహ్నితలు......


జ్ఞాన గవాక్షాలు.....


విజ్ఞాన వీచికలు....


సముద్రాల వారి పలుకులు.🙏


                               **********


ఏ కొరనోము నోచుకున్నానో...నేను...

 కూలే...నిరాశై లైలా బ్రతుకే!...


అంటే... ఆచార్యులు గారూ....పర్షియాలో....అరేబియాలో కూడా ఆడవాళ్ళు..నోములు & వ్రతాలు చేస్తారా?!


అడిగేవ్యక్తిని ఓ చూపు చూశారు ఆచార్యుల వారు! 


ఒరే నాయనా! అరేబియా ఆడపిల్ల తెలుగు లో మాట్లాడుతుందారా!? 


అయినా ఇది లైలా- మజ్ఞు తెలుగు చిత్రం....నిర్మాతలకు అనుగుణంగా...వ్రాయడం నా పధ్ధతి......


అంటూ తెలివిగా విషయాన్ని దాటవేశారు సముద్రాల రాఘవాచార్యులు గారు!


ముదావహంబున కడంగడు సంతసించి.....అనేకంటే...


నాకు ఎంతో సంతోషంగా ఉంది.....అనడం బాగుంటుంది కదా! 

ప్రజలకు అర్థమౌతుంది. అనేవారు ఆయన.. 


1937 లో కనకతార మూవీకి మాటలు వ్రాయడంలో ఆ బాణీనే చూపారు సముద్రాల వారు. 


పౌరాణికమా, జానపదమా, సాంఘీకమా అనికాదు......ప్రజలకు అర్థమయ్యే భాషలో వ్రాయాలి కవులు...అనేవారు!


ఎందరో పండితులు నొచ్చుకున్నారు. పామరులు సంతసించారు. 


భాషను భ్రష్టు పట్టిస్తున్నారు ఈ సినిమా రచయితలంటూ...పుంఖాను పుంఖాలుగా...విమర్శలు వస్తున్నా....


వాడుక భాష ను తెలుగు సినిమా కు పరిచయం చేసిన ఘనత....సముద్రాల రాఘవాచార్యుల వారిదే!


                               **********


100 కి పైగా సినిమాలకు రచన, మాటలు & పాటలు వ్రాశారు. 


1000 దాకా పాటలు వ్రాశారు. 


పౌరాణిక, చారిత్రక, జానపద & సాంఘీకాలలో...

శృంగార, శౌర్య, రౌద్ర, హాస్య, భక్తి & శోక రసాల వంటి నవరసాలలోనూ వ్రాశారు. మెప్పించారు!


సంస్కృతాంధ్రాలలో ఉధ్ధండులు. 


బెజవాడలో ఫ్రెండ్స్ & కో అని ఓవ్యాపార సంస్థ నడిపేవారు గూడవల్లి రామబ్రహ్మం గారు. 


స్టేషనరీ, గ్రంథాలు & గడియారాలు అమ్మేవారు. అక్కడ చేరేవారు ఆచార్యులు.


ఎందరో మహానుభావులు బి.ఎన్. రెడ్డి, నాగిరెడ్డి, కె.వి.రెడ్డి...లాంటి మిత్రులు చేరేవారు.  


అక్కడ సాహిత్య గోష్టులు...కవితా చర్చలే జరిగేవి. 


వ్యాపారం కంటే ! ఎవరికి నచ్చింది....వారు తీసుకుని పోయేవారు. ఎవ్వరూ కొనేవారు కాదు!


వ్యాపారం శూన్యమైతే...రామబ్రహ్మం గారు *ప్రజామిత్ర* అనే పత్రిక ప్రారంభించి...


సముద్రాల వారిని రచయితగా తీసుకున్నారు. 


ఆ ప్రజామిత్ర ...మద్రాస్ కు షిఫ్ట్ అయినప్పుడు....సముద్రాల గారు కూడా మద్రాస్ చేరుకుని సినిమాలకు మాటలు & పాటలు వ్రాయడం ప్రారంభించారు.


కనకతార(1937),గృహలక్ష్మి(1938),వందేమాతరం(39),సుమంగళి(40), దేవత(41),భక్త పోతన(42),స్వర్గసీమ(45)యోగివేమన(47) లకు రచన, మాటలు & పాటలు సముద్రాల గారివే!


భక్తి తత్వము & వేదాంత ధోరణి....వ్రాయాలంటే....


సముద్రాల వారే వ్రాయాలి. యోగి వేమన లో అది పరాకాష్టకు చేరుకుందంటే అతిశయోక్తి కాదు.


                               ***********


ఆయన ఎంత బిజీగా ఉండే వారంటే....కొంత మంది రచయితలు...వారికోసం ఘోస్ట్ రచయితలుగా పాటలు వ్రాశారు. 


అందులో మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు & సముద్రాల కుమారుడు రామానుజాచార్య(జూనియర్ సముద్రాల) కూడా ఉండే వారు.


వేరే ఎవరి పాటో ....మీపాటగా చలామణి చేసుకోవడం తప్పు కదండీ?!...అని ఎవరైనా ప్రశ్నిస్తే,....


ఇందులో తప్పేముంది. మల్లాది...నా స్నేహితుడు. నేను బిజీగా ఉన్నాను. సహాయ పడ్డాడు. నేను డబ్బిచ్చాను. 


మా రామానుజం కూడా నాకు సహాయపడ్డాడు! ఇది కేవలం పరస్పర సహకారమే కానీ...మరేం లేదు అనేవారు!


సముద్రాల కు అసలు పద్యాలంటే...ఇష్టముండేది కాదు. 


నాటకాలలోలా...ఇంకా ఏమిటీ పద్యాలు...యుధ్ధం చేసుకుంటూ...రాగాలు తీసుకుంటూ...ఇంకా ఇలా పద్యాలు పాడటం ఏం బాగాలేదు! అనేవారు.


కానీ...నిర్మాతలు ఒప్పుకునేవారు కారు. ప్రజలు ఇంకా పద్యాలు కోరుకుంటున్నారండి. పద్యాలు ఉండాల్సిందే అని బలవంతపెట్టేవారు!


సముద్రాల...నిజంగా  సముద్రమంత వారు. పాండిత్యంలోను, నవరస పోషణా చతురతలోను, సంద్రాన ఎంతటి వైవిధ్యముందో....


అంతటి వైవిధ్యం తన రచనా చమత్కృతిలో చూపేవారు. 


సౌమ్యుడు, నిదానస్తుడు.

ముందు తన అభిప్రాయాలను చెప్పినా...దర్శకనిర్మాతల అభిరుచిమేరకు...రాజీపడి పోయేవారు.


                             **********


లవకుశ...అద్భుత దృశ్య కావ్యం లో సముద్రాల వారి గీతాలు...

ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగిపోయాయంటే....

ఆ రచనా పటిమకు జోహార్లు చెప్పవలసినదే.


రామకథను వినరయ్యా...

శ్రీరాముని చరితమును...

వినుడు వినుడు రామాయణ గాధ...

ఊరకే కన్నీరు నింప....

జగదభిరాముడు శ్రీరాముడే...


ఎన్ని రసగుళికలు....జన్మ చరితార్థం కాదా! వారి సాహిత్యానికి తోడు...ఘంటసాల మాస్టారి స్వర రచనలో....చిరస్థాయిగా నిలిచిపోయాయా గీతాలు.


                                 ***********


నందమూరి కి మిక్కిలి ఇష్టులు సముద్రాల గారు.  ఆ స్నేహం చిరకాలం నిలుపుకున్నారు.


డి.ఎల్. నారాయణ గారి వినోదా పిక్చర్స్ లోను, ఎన్.ఏ.టి లోను భాగస్వామ్యం ఉండేదాయనకు. 


దర్శకుడుగా 3 చిత్రాలు చేశారు. వినాయక చవితి(57), భక్త రఘునాథ్(60) & బభ్రువాహన(64).


సముద్రాల గారి పుణ్యమా అని అలనాటి గ్రాంథిక భాష....వ్యవహారిక భాషగా మారింది. 


ఎన్నెన్ని చక్కటి గీతాలు మనకందించారో. 

అవి ఈ నాటికీ..మనలనలరిస్తూనే ఉన్నాయి. ఉంటాయి.


రేపల్లెలో...19 జూలై మాసాన 1902 లో సముద్రాల వారు జన్మించారు. 


16- 3 - 1968....సముద్రాల వారు....వారి ముద్రనిల వదలి....కీర్తిశేషులైనారు.


ఈ రోజు.....సముద్రాల వేంకట రాఘవాచార్యుల వారి వర్ధంతి.


స్మృత్యంజలి.🙏

       &

నీరాజన సుమగీత పుష్పాంజలి.🌹


                             🌹🙏🌹🙏🌹🙏🌹


రాజయోగ సాధనా జ్ఞానం........యోగి వేమన.


https://youtu.be/aBMPi3HqZfg


ప్రేమే నేరమౌనా, మాపై ఈ పగేలా.........లైలా- మజ్ఞు.


https://youtu.be/wqZEbdagGPw


దినకరా శుభకరా...........వినాయక చవితి.


https://youtu.be/hYQF31wvDYs


వదలజాలరా....వదలజాలరా.........యోగి వేమన.


https://youtu.be/GDIXnR0An_8


ఇదేనా...ఇంతేనా.....జీవితసారమిదేనా.........యోగి వేమన.


https://youtu.be/qWCdhjfe23w


మాయను పడకే మనసా.........యోగి వేమన.


https://youtu.be/qncOmz7Z8-I


జగమే మాయ బ్రతుకే మాయ......దేవదాసు.


https://youtu.be/nZCHsIegkaE


అందాలు చిందేటి నా జ్యోతి......యోగి వేమన.


https://youtu.be/5JY6dAIiSPI


సుందరాంగా...అందుకోరా.........భూకైలాస్.


https://youtu.be/Vsotu67Cbkw


జగదభిరాముడు శ్రీరాముడే.......లవకుశ.


https://youtu.be/9AshdyFBhPs


రాముని అవతారం.......భూకైలాస్.


https://youtu.be/bJGAWx1Dt3Y


ఎందుకోయి తోటమాలి........విప్రనారాయణ.


https://youtu.be/BJEs-Iw6dfU


చిగురాకులలో చిలకమ్మా..........దొంగరాముడు.


https://youtu.be/65gt3xXLNtM


జనని శివకామిని........నర్తనశాల.


https://youtu.be/flGvLGk5CMQ


దేవ దేవ ధవళాచల మందిర........భూకైలాస్.


https://youtu.be/ZZrKQLpQjyE


చూడుమదే చెలియా...కనుల.......విప్రనారాయణ.


https://youtu.be/YdFI1vbSQ6o


సీతారాముల కల్యాణం చూతము రారండి.......సీతారామ కల్యాణం.


https://youtu.be/Ys4k8kqOg4w


జీవితమే సఫలము........అనార్కలి.


https://youtu.be/SvHfiigQbPA


లోకమెరుగని బాల.........బాటసారి.


https://youtu.be/uGsgw6XnZm8


రాజశేఖరా నీపై మోజు తీరలేదురా..........అనార్కలి.


https://youtu.be/VIryMqxwijc


శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా.......లవకుశ.


https://youtu.be/Nu7HI43Dh7g


పాడవే రాగమయీ...వీణా.........సీతారామ కల్యాణం.


https://youtu.be/HP8wnOARaoQ


అడుగడుగో అల్లడుగో..........సారంగధర.


https://youtu.be/4wV9w1bHDPk


సఖియా వివరించవే........నర్తనశాల.


https://youtu.be/aJVXI_i-g1A


నీసరి మనోహరి..........బభ్రువాహన.


https://youtu.be/wBSdl9qjEzA


ఓ బాటసారి...నను మరువకోయి........బాటసారి.


https://youtu.be/-2Bciop6A4Y


సంసారజలధి దాటించే నావ...........భక్త రఘునాథ్.


https://youtu.be/PZ6FZnxnxlA


జీవము నీవే కదా............భక్త ప్రహ్లాద.


https://youtu.be/RM577fnnW0Q


రామ కథ...శ్రీరామ కథ..........శ్రీరామ.కథ(చివరి గీతం.)


https://youtu.be/1di1VykiM2o


🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏 Courtesy:Fb

మధుమేహ నివారణా చూర్ణం

 మధుమేహ నివారణా చూర్ణం  మరియు మధుమేహం గురించి సంపూర్ణ వివరణ ~ 


 మధుమేహము మహారోగములలో ఒకటిగా పేర్కొనబడినది . అధిక ప్రమాణమున మాటిమాటికి మూత్రము ఈ వ్యాధి నందు వెడలుటచే ఇది మేహరోగం అనబడును.  ఈ రోగం జనించుటకు ప్రధానకారణాలు గురించి ప్రాచీన ఆయుర్వేద వైద్యులు అనేక కారణాలు తెలియజేసారు. 


              సుఖముగా ఉండు ఆసనము పైన ఆసీనుడై యుండి ఏ పనిచేయక సోమరిగా ఉండుట , ఎక్కువసేపు సుఖముగా నిద్రించుట , పెరుగు , జలచరమాంసాదులు , పాలు , బెల్లం , తీపివస్తువులు , కఫవర్ధక పదార్థాలు ఎక్కువుగా సేవించుట , కొవ్వుపదార్ధాలు అధికంగా తీసుకొనుట , శరీరానికి శ్రమ లేకపోవుట , పగటినిద్ర  మరియు శీతల , మధుర , స్నిగ్ధ ద్రవముగా ఉండు అన్నపానాదులు అధికంగా సేవించుట వలన ప్రమేహము వచ్చును. 


              ఆరోగ్యవంతుని యందు ఒక పగలు , రాత్రి అంటే 24 గంటల కాలమున విసర్జించబడు మూత్రము యొక్క ప్రమాణము 800 - 2500 మీ.లీ  గా ఉండును. పైన పేర్కొనబడిన సాధారణ ప్రమాణము కన్నా అధికముగా మూత్రవిసర్జన జరిగినచో అది ప్రమేహం అనబడును. ఉదాహరణకు ఉదకమేహము ( Daibetes insipidus ) అను సమస్య నందు 5 - 10 లీటర్లు మూత్రము 24 గంటల కాలంలో విసర్జించబడును. ప్రమేహము నందు మూత్రము నిర్మలముగా ఉండక కలుషితమై కలకపరి ఉండును. 


     

         మధుమేహము కారణములను ఆధారం చేసుకుని రెండు విధములుగా పేర్కొనబడినది . 


      1 - సహజము .


      2 - అపథ్య నిమిత్తజము . 


 *  సహజము  - 


        సహజముగా కలుగు ప్రమేహము తల్లితండ్రుల బీజదోషము వలన కలుగును. శిశువు జన్మకు కారణం అయిన బీజము , శుక్రము యొక్క దోషములు సామాన్యముగా సహజ వ్యాధులకు కారణము. కావున మధుమేహము కూడా బీజదోషముల వలనే జనించును. 


 *   అపథ్య నిమిత్తజము  - 


        ఇది బీజదోష రహితముగా , జన్మించిన తరువాత అపథ్య ఆహార అలవాట్ల వలన జనియించును. ప్రమేహవ్యాధి జనియించినప్పుడు సరైన చికిత్స చేయక ఉపేక్షించిన యడల ప్రమేహములు ( 20 రకాలు ) అన్నియు మధుమేహములుగా మారును. 


                         మధుమేహము నందు మూత్రము కషాయ , మధుర రసములు కలిగి తెలుపుగా ఉండును. ఈ వ్యాధిని నిర్ధారించుటలో మూత్రపరీక్ష మరియు రక్తపరీక్షలు దోహదపడును. ఈ పరీక్షల ఆధారముగా వ్యాధితీవ్రత మరియు చికిత్సా ఫలితములను అంచనా వేయుట సాధ్యపడును. 


       కడుపులో చిన్నపేగు మొదటి భాగమునకు ( Duodenum) , పిత్తాశయం ( Gallblader ) నకు మధ్యభాగములో పైత్యనాళము (Bileduct ) పక్కగా క్లోమము ( Pancrease ) అను వినాళగ్రంధి ఉండును. ఇందులో ఎంజైములు మరియు హార్మోనులు ఉండును. ఎంజైములు ఆహార జీర్ణక్రియలో పాల్గొనును. ఇన్సులిన్ మరియు    గ్లూకాగాన్ అను రెండు హార్మోనులు ఈ క్లోమగ్రంధి యందు ఉండి రక్తములోని గ్లూకోజ్ ప్రమాణమును నియంత్రించుతూ శరీర అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూడును . మధుమేహ రోగికి పలుకారణాల వలన ఇన్సులిన్ అనే హార్మోన్ చురుకుగా లేకపోవడం , కావలిసినంత ప్రమాణముగా అందుబాటులో లేకపోవటం వలన రక్తములో గ్లూకోజ్ స్థాయులు పెరుగును . రక్తములో అధికంగా ఉన్న గ్లూకోజ్ మూత్రపిండాల ద్వారా మూత్రములో బయటకు వెళ్ళును. ఈ విధముగా శరీరంలో పలు జీవక్రియలకు ఆధారమైన మరియు శక్తిని సమకూర్చే గ్లూకోజ్ నిలువలు క్రమేణా తరిగిపోవడం మరియు శరీర అవయవాలు ఉపయోగించుటకు వీలులేని వాతావరణము నెలకొనుట మూలముగా క్రమముగా మధుమేహరోగి కండరాలు క్షీణించి నరముల బలహీనత , కంటిచూపు తగ్గుట మరియు మూత్రపిండముల సామర్ధ్యము తగ్గుట మొదలగు ఉపద్రవములతో మరణించును . సక్రమమైన ఆహారవిహారాలు , క్రమం తప్పకుండా ఔషధసేవన పాటించడం వలన రోగికి వ్యాధి లొంగుబాటులో ఉండి ఆయువును పెంపొందించును.  


.        మధుమేహం మరియు మధుమేహం వలన కలుగు సమస్యలు నివారణ కొరకు "మధుమేహ నివారణ చూర్ణం" అనే పేరుతో 14 రకాల వనమూలికలతో ఈ చూర్ణం నేను రూపొందించాను. ఇది ఒక పురాతన వంశపారంపర్య ఫార్ములా. ఇందులో ప్రతి మూలికను శుద్ధి చేసి కలపడం జరుగుతుంది. ఎటువంటి side affects లేకుండా పూర్తి ప్రకృతి సిద్ధ ఔషధం. 


.         ఈ ఔషదం వాడటం ద్వారా శరీరంలో మధుమేహం నియంత్రణ లోకి వస్తుంది. మధుమేహం వల్ల ఇతర అవయవాల మీద పడే ప్రభావం పోతుంది. శరీరంలో మధుమేహం వల్ల వచ్చే నీరసం, నిస్స త్తువ తగ్గును.  కొత్తగా మధుమేహం నిర్దారించబడినవారు మరియు మధుమేహం రావడానికి అవకాశం ఉన్నవారు ఈ చూర్ణమును వాడుట మూలాన త్వరగా బయటపడుతారు.  


 ఈ చూర్ణంతో పాటు శరీరమును శుద్ధి చేయు ఔషధాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని వల్ల శరీరంలో ఆణువణువు లో ఉన్న "Toxins" మరియు వ్యర్థ పదార్ధాలు బయటకు వెళ్లి శరీరం పూర్తిగా శుభ్రంగా తయారగును. 


.        ఈ "మధుమేహ చూర్ణం"  కావలసిన వారు డైరెక్టుగా 9885030034 నెంబర్ నందు సంప్రదించగలరు.  


.                కాళహస్తి వేంకటేశ్వరరావు 


.          అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


.                     9885030034

గరుడ పురాణం_*26వ భాగం*

 *గరుడ పురాణం_*26వ భాగం*



_మరొక విష్ణు పూజ వుంది. ఇది భోగమోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకొని యజ్ఞ మండపంలో ప్రవేశించాలి. కాళ్ళూ చేతులూ కడుక్కొని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాస విధిననుసరిస్తూ రెండు చేతుల ద్వారా వ్యాపకరూపంలో మూల మంత్రము యొక్క కరన్యాసం చేయాలి. హే రుద్రదేవా! విష్ణు దేవుని మూలమంత్రం ఇది :_


_*ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః "*_


_ఇది దేవాధిదేవుడు, పరమేశ్వరుడునగు విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహశమకర్త, సర్వపాప వినాశకం, భక్తి, భుక్తి, ముక్తి ప్రదాయకం._


_*తరువాత "ఓం హాం హృదయాయ నమః " తో మొదలెట్టి "అస్త్రాయ ఫట్ " దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి.*_


_తరువాత సంయమియై ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయగుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖ చక్రధారి, కుందపుష్ప, చంద్రకాంతి శోభితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల, రత్నహారాలంకృతుడునగు విష్ణుభగవానుని కనులు మూసుకొని, మనసులో మనసుతో చూసి మనసారా ధ్యానించాలి._


_*తరువాత 'విష్ణుమండలస్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా! మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను. ఇక్కడికి దయచేయండి' అని ఈ మంత్రాల ద్వారా ఆవాహన చేయాలి.*_


ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః, ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః, ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం శంఖ నిధయే నమః ఓం పద్మనిధయే నమః, ఓం చండాయ నమః, ఓం ప్రచండాయ నమః, ఓం ద్వారిశ్రయై నమః, ఓం ఆధార శక్ష్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం శ్రియై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం సం సత్త్వాయ నమః, ఓం రం రజసే నమః, ఓం తం తమసే నమః, ఓం కం కందాయ నమః, ఓం నం నాలాయ నమః, ఓం లాం పద్మాయ నమః, ఓం అం అర్క మండలాయ నమః, ఓం సోం సోమమండలాయ నమః, ఓం వం వహ్నిమండలాయ నమః, ఓం విమలాయై నమః, ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం పద్మ్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః,

ఓం అనుగ్రహాయై నమః.


_*ఈ నామ మంత్రాలతో, గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడిన దేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి.*_


_తదనంతరం పాప వినాశకుడైన, పరమేశ్వరుడైన విష్ణుభగవానుని మండలంలోకి ఆవాహన చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చేయాలి. ముద్రాప్రదర్శన, అర్ఘ్య పాద్యాది ఉపచారాలతో పూజ చేసి, ప్రతిమకు, స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా 'చరు'ని పెట్టాలి. ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చేయాలి. తరువాత ఆయన మూల మంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరల ఆయన హృదయాదులను (ఓం హం హృదయాయ నమః నుండి హః అస్త్రాయ నమః దాకా) అలంకార, ఆయుధాదులను (శంఖం నుండి శారంగం దాకా)_


_*ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః, ఓం విష్వక్సేనాయ నమః ! అని పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి.*_


ఓం శరాయ నమః, ఓం బ్రహ్మణే నమః,

ఓం నారదాయ నమః, ఓం పూర్వసిద్ధేభ్యో నమః,

ఓం భగవతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః,

ఓం పరమ గురుభ్యో నమః।


_*అనంతరం దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి.*_


_ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహన పరివారాయ నమః,


ఓం అగ్నయే తేజో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం నిరృతయే రక్షో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వాయవే ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వజ్రాయ హుం ఫట్ నమః,


ఓం శక్యై హుం ఫట్ నమః,


ఓం దండాయ హుం ఫట్ నమః,


ఓం ఖడ్గాయ హుం ఫట్ నమః,


ఓం పాశాయ హుం ఫట్ నమః,


ఓం ధ్వజాయ హుం ఫట్ నమః,


ఓం గదాయై హుం ఫట్ నమః,


ఓం త్రిశూలాయ హుం ఫట్ నమః,


ఓం చక్రాయ హుం ఫట్ నమః,


ఓం పద్మాయ హుం ఫట్ నమః, మరియు


ఓం వౌం విష్వక్సేనాయ నమః,


_*ఓం మహాదేవా! ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోష పెట్టిన తరువాత మరల అందరిలోనూ వ్యాపించియున్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి.*_


విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥ 

విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ । 

గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే ॥ 

దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః । 

మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥ 

జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే । 

బ్రహ్మేంద్ర రుద్ర వంద్యాయ సర్వేశాయ నమోనమః ॥ 

సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః । 

సర్వగోప్తే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ॥ 

వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః | 

శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ॥


శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, * విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు.

(28-31అధ్యాయాలు సమాప్తం.)

గరుడ పురాణం_*25వ

 *గరుడ పురాణం_*25వ భాగం*



_*శ్రీ గోపాలదేవుని పూజ - శ్రీధరపూజ త్రైలోక్యమోహన మంత్రం:*_


_ఋషులారా! నేనిపుడు భోగమోక్షదాయకాలైన విష్ణురూప దైవతములు గోపాల, శ్రీధరుల పూజా విధానాన్ని వినిపిస్తాను. ముందుగా పూజ కొఱకొక మండలాన్నేర్పాటు చేసి దాని ద్వార ప్రదేశంలో గంగాయమునలనూ, బ్రహ్మ యొక్క శక్తులైన ధాత, విధాతలనూ పూజించాలి. తరువాత లక్ష్మి, శంఖం, పద్మనిధి, శారంగధనువు, శరభాలను పూజించాలి. ఆ తరువాత తూర్పు దెసలో భద్ర, సుభద్రలకూ, దక్షిణ దిశలో చండ ప్రచండులకూ, పడమటి దిక్కున బల, ప్రబలులకూ, ఉత్తరం వైపున జయ విజయులకూ పూజలు చేయాలి. పిమ్మట నాలుగు ద్వారాలలో క్రమంగా లక్ష్మి, గణపతి, దుర్గ, సరస్వతమ్మలను పూజించాలి._


_*మండలం ఆగ్నేయాది కోణాల్లో పరమ భాగవతోత్తముడైన నారదునీ, సిద్ధులనూ, గురుగ్రహాన్నీ, నలకూబరునీ స్థాపించి పూజించాలి. తూర్పు వైపు విష్ణువునీ విష్ణుశక్తినీ అర్చించాలి. మండలంలో విష్ణు పరివారాన్ని స్థాపించి పూజించాలి. మండలమధ్యంలో శక్తి కూర్మ, అనంత, పృథ్వి, ధర్మ, జ్ఞాన, వైరాగ్య మూర్తులకు ఆగ్నేయాది కోణాల్లో పూజలు చేయాలి. వాయవ్య కోణంలోనూ ఉత్తర దిశలోనూ ప్రకాశ, ఐశ్వర్యాలను పూజించాలి.*_


_*"గోపీజన వల్లభాయ స్వాహా "*_ 

_ఇది గోపాల మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ మండలంలో తూర్పుతో మొదలెట్టి క్రమంగా ఎనిమిది వైపులా కృష్ణపత్నులైన సుశీల, జాంబతి, రుక్మిణి, సత్యభామ, సునంద, నాగ్నజితి, లక్షణ, మిత్రవిందలను స్థాపించి ఆ తరువాత వారిని పూజించాలి. వెంటనే శ్రీ గోపాలదేవుని శంఖ, చక్ర, గద, పద్మ, ముసల, ఖడ్గ, పాశ, అంకుశ, శ్రీవత్స, కౌస్తుభ, ముకుట, వనమాలాది చిహ్నాలను పూజించాలి. పిమ్మట ఇంద్రాది ధ్వజపాలక దిక్పాలకునూ, విష్వక్సేనునీ, లక్ష్మీసహిత శ్రీకృష్ణ భగవానునీ అర్చించాలి._


_*గోపీ జన వల్లభ మంత్రాన్ని జపించి, ధ్యానించి, సాంగోపాంగంగా ఆయన పూజను పై విధంగా చేసే వారికి సర్వాభీష్ట సిద్ధి కలుగుతుంది.*_


_*త్రైలోక్యమోహన శ్రీధరీయ మంత్రం :*_


_ఓం శ్రీం (లేదా శ్రీః) శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ నమః ।_


_క్లీం పురుషోత్తమాయ త్రైలోక్య మోహనాయ నమః |_


_ఓం విష్ణవే త్రైలోక్య మోహనాయ నమః ।_


_ఓం శ్రీం హ్రీం క్లీం త్రైలోక్యమోహనాయ విష్ణవే నమః ।_


_*ఈ మంత్రం సమస్త ప్రయోజనాలనూ సంపూర్ణంగా కలిగిస్తుంది.*_


_మహర్షులారా! ఇపుడు శ్రీధర భగవానుని అనగా విష్ణుదేవుని మంగళమయమైన పూజా విధానాన్ని వర్ణిస్తాను. సాధకుడు ముందుగా ఈ క్రింది మంత్రాలతో అంగన్యాసమును చేయాలి._


ఓం శ్రాం హృదయాయ నమః, 

ఓం శ్రీం శిరసే స్వాహా, 

ఓం శ్రూం శిఖాయై వషట్, 

ఓం శైం కవచాయ హుం, 

ఓం శ్రౌం నేత్రత్రయాయ వౌషట్, 

ఓం శ్రః అస్త్రాయ ఫట్.


_*అనంతరం శంఖ, చక్ర, గదాది స్వరూపిణీ ముద్రలను ప్రదర్శించి వాటిని ధరించి యున్న ఆత్మస్వరూపుడైన శ్రీధర భగవానుని ఇందాకటి మంత్రంతో ధ్యానించాలి. స్వస్తిక లేదా సర్వతో భద్రమండలాన్ని సిద్ధం చేసి శ్రీ భగవానుని ఆసనాన్ని పూజించి ఆ స్వామిని  "ఓం శ్రీధరాసన దేవతా ఆగచ్ఛత " అని ఆవాహనం చేయాలి.*_


_*ఈ క్రింది మంత్రాలతో ఆసన పూజ చేయాలి._


_*ఓం సమస్త "పరివారాయాచ్యుతా సనాయ నమః " అపై*_


_ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః లతో మొదలెట్టి ధాతా, విధాతా గంగాది దేవతలను ఈ క్రింది మంత్రాలతో పూజించాలి._


ఓం గంగాయై నమః, 

ఓం యమునాయై నమః, 

ఓం ఆధార శక్ష్యై నమః, 

ఓం కూర్మాయ నమః, 

ఓం అనంతాయ నమః, 

ఓం పృథివ్యై నమః, 

ఓం ధర్మాయ నమః, 

ఓం జ్ఞానాయ నమః, 

ఓం వైరాగ్యాయ నమః, 

ఓం ఐశ్వర్యాయ నమః, 

ఓం అధర్మాయ నమః, 

ఓం అజ్ఞానాయ నమః,

ఓం అవైరాగ్యాయ నమః, 

ఓం అనైశ్వర్యాయ నమః, 

ఓం కందాయ నమః, 

ఓం నాలాయ నమః, 

ఓం పద్మాయ నమః, 

ఓం విమలాయై నమః, 

ఓం ఉత్కర్షిణ్యై నమః, 

ఓం జ్ఞానాయై నమః, 

ఓం క్రియాయై నమః, 

ఓం యోగాయై నమః, 

ఓం ప్రహ్ వ్యై నమః, 

ఓం సత్యాయై నమః, 

ఓం ఈశానాయై నమః, 

ఓం అనుగ్రహాయై నమః.


మరల శ్రీధర దేవుని ఇలా అంటూ ఆవాహన చేసి పూజ చేయాలి.


_*ఓం హ్రీం శ్రీధరాయ త్రైలోక్య మోహనాయ విష్ణవే నమః ఆగచ్ఛ ।*_


_ఈ పూజానంతరము లక్ష్మీదేవిని ఓం శ్రియై నమః అంటూ పూజించాలి. ఆ తరువాత_


_*ఈ క్రింది మంత్రాలతో షడంగ న్యాసం చేయాలి.*_


ఓం శ్రాం హృదయాయ నమః,

ఓం శ్రీం శిరసే నమః,

ఓం శ్రూం శిఖాయై నమః,

ఓం శైం కవచాయ నమః,

ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః,

ఓం శ్రః అస్త్రాయ నమః.


_అనంతరము స్వామివారి ఆయుధాలనూ ఆభరణాలనూ అవరోధ వ్రాతము (పరివారము)నూ ఈ మంత్రాలతో అర్చించాలి._


ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః,

ఓం విష్వక్సేనాయ నమః !


_*ఈ దేవస్వరూపాలను షడంగన్యాస, అస్త్రపూజలతో తృప్తిపఱచిన పిమ్మట విష్ణుభగవానుని మూర్తిని అభిషేకించి వస్త్ర యజ్ఞోపవీతాలతో సింగారించి గంధ పుష్ప ధూప దీపాలను నివేదించి ప్రదక్షిణ చేయాలి. నైవేద్యం పెట్టి, మూలమంత్రాన్ని నూట యెనిమిదిమార్లు జపించి దాని ఫలాన్ని కూడా శ్రీధర భగవానునికి సమర్పించి వేయాలి.*_


_ఒక ముహూర్తం పాటు కనులు మూసుకొని సాధకుడు తన హృదయ దేశంలో పరిశుద్ధ స్ఫటిక మణి సమానకాంతులతో విరాజిల్లువాడు, కోట్ల సూర్యుల ప్రభలతో వెలుగొందువాడు, ప్రసన్నముఖుడు, సౌమ్యముద్రలోనుండువాడు, ధవళ మకర కుండలాలతో శోభిల్లువాడు, ముకుటధారి, శుభలక్షణ సంపన్నములైన అంగములు గలవాడు, వన మాలాలంకృతుడునగు శ్రీధర దేవుని పరబ్రహ్మ స్వరూపాన్ని ధ్యానించాలి. తరువాత ఈ క్రింది స్తోత్రాన్ని చదవాలి._


శ్రీనివాసాయ దేవాయ నమః శ్రీపతయే నమఃl 

శ్రీధరాయ సశారంగాయ శ్రీప్రదాయ నమో నమః ॥ 

శ్రీవల్లభాయ శాంతాయ శ్రీమతే చనమో నమఃl 

శ్రీ పర్వత నివాసాయ నమః శ్రేయస్కరాయ చ ॥ 

శ్రేయసాం పతయే చైవ హ్యాశ్రయాయ నమో నమఃl శరణ్యాయ వరేణ్యాయ నమో భూయో నమో నమః ll 

స్తోత్రం కృత్వా నమస్కృత్య దేవదేవం విసర్జయేత్ ll 


_*విష్ణువు శివునికి ఈ విధంగా ఉపదేశించాక శివుడు అత్యంత దుస్తరమైన భవసాగరాన్ని సులువుగా దాటించే పూజా విధానమేదైనా వినిపించుమని అభ్యర్థించాడు. దానికి విష్ణువు ఇలా చెప్పాడు (అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు)*_

*శ్రీ అమరలింగేశ్వర స్వామి* *అమరావతి*

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

    *శ్రీ అమరలింగేశ్వర స్వామి*

              *అమరావతి*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*పంచారామాలలో మొట్టమొదటిది ‘అమరారామం’.* 


*అమరారామము,కొమరారామమ, భీమారామము, ద్రాక్షారామము, క్షీరారామములలో మొదటిది.*


*ఇక్కడ 'అమరేశ్వరస్వామి' కొలువై ఉన్నారు. ఇక్కడ స్వామి ముఖం ‘అఘోర’ రూపంలో ఉంటుంది. అమ్మవారు ‘బాల చాముండేశ్వరి’. ఆమె శాంతి స్వరూపురాలిగా ఇక్కడ కొలవై ఉన్నారు.*


*శంకరుడులో ‘శం’ అంటే శుభాన్ని, ‘కరుడు’ అంటే కలిగించే వాడనే అర్థం దాగుంది.*


*స్థల పురాణం ప్రకారం తారకాసుర సంహారం జరిగినప్పుడు కుమారస్వామి తారకుని కంఠంలో ఉన్న శివలింగాన్ని చేధించగా ఏర్పడిన అయిదు శకలాల్లో (ముక్కలు) పెద్దది, మొదటి శకలం పడిన చోటు ఈ అమరారామం.*


*ఇక్కడ అభించిన శాసనాలలో అమరావతి పూర్వనామం ధష్టుకడ (ధరణికోట) లేక ధాన్యకటకం అన్న పేర్లే కాని అమరావతి అన్న పేరు కన్పించదు. అమరావతిలో ఒకప్పడు బౌద్ధ స్తూపం వుండేది. అది అద్భుత శిల్పకళకు పుట్టినిల్లు. మరుగున పడిపోయిన ఆ స్తూపపు అవశేషాలను వెలికి తీసి ఆంగ్లేయులు చాలవరకు లండన్ మ్యూజియానికి తరలించారు. అమరావతి శిల్పాలు ప్రపంచ ఖ్యాతిని పొందాయి. మిగిలిన కళాఖండాలను ఇక్కడ నెలకొల్పిన మ్యూజియంలో భద్రపరచి ప్రదర్శిస్తున్నారు. ఇక్కడ బుద్ధ భగవానుని ఆస్థికావశేషాలున్న స్ఫటికపు భరిణె లభించింది. భారతీయ శిల్పకళకు అమరావతి కళ శిరోభూషణమని కళాకోవిదులు వ్రాశారు. అమరావతి కళ తనదైన ఒక బాణీని ఏర్పరచుకొని అమరావతి శిల్పరీతిగా ప్రపంచ ప్రస్థిది పొందింది.*


*ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ఠ స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం.*


*కృష్ణా నదీ తీరంలో వెలసిన మహా మహిమాన్విత పుణ్యక్షేత్రం ఇది. ఈ క్షేత్రంలో అమరేశ్వర లింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టించాడు. అందువల్లే ఇక్కడి శివయ్య అమరేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్ర మహత్యం గురించి స్కంధ, బ్రహ్మ, పద్మ పురాణాలలో చెప్పారు.*


*ఈ ఆలయానికి మూడు ప్రాకారాలున్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజ స్తంభాలు వున్నాయి.  ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర, కోసలేశ్వర మొదలగు శివలింగాలే కాక ఇంకా అనేక దేవతా మూర్తులున్నారు. రెండవ ప్రాకారంలో వున్న కాలభైరవుడు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతిలో కాశీ ,శ్రీశైల మల్లికార్జునుడు, వాయువ్య దిశలో విశ్వేశ్వరుడు, ఈశాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డారు.*


*భౌగోళికంగా ఆ పుణ్య క్షేత్రాలు అమరావతికి ఆ దిక్కుల్లోనే వుండటం గమనించదగ్గ విషయం.*


*శివ కేశవులకు బేధము లేదని నిరూపిస్తూ వేణు గోపాల స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో వుంది. దక్షిణ ముఖంగా ముఖ మండపం, తూర్పు ద్వారానికి ఎదురుగా కృష్ణవేణి ప్రవాహం ఉంది. దీనినే "‘పంచాయతన క్షేత్రం"’ అంటారు.*


*రాక్షసులకు మరియు దేవుళ్ళకు జరిగిన యుద్ధములో దేవుళ్ళు ఓడిపోవడంతో పరమ శివుడిని ఆశ్రయించగా అప్పుడు దేవతామూర్తులను ఈ అమరావతిలో ఉంచి రాక్షసులను ఈ ప్రాంతములోనే వధించాడు. అమరులను ఈ ప్రదేశంలో కాపాడాడు కనుక  అమరావతి అని పిలువబడుతుంది.*


*ఈ అమరావతికి ఒక పురాణ కథ కూడా వుంది. దేవేంద్రుడు అహల్యా జారుడై తత్పాప పరిహారార్ధం ఇక్కడ శివలింగమును ప్రతిష్ఠించాడని దేవతల ప్రభువైన సురేంద్రుని చేత ప్రతిష్టించబడినది గాబట్టి ' అమరావతి ' నామము సార్ధకంగా ప్రసిద్ధమయినది అని అంటారు. ఈ శివలింగం ఒకానొక కాలంలో ఆ శ్రీరామచంద్రుని చేత పూజించబడ్డ శివలింగంగా ప్రసిద్ధిగాంచింది.*


*అమరావతి ఆలయంలో లింగం చాల పొడవుగా వుంటుంది. ఇక్కడ ప్రచారంలో వున్న కథ ప్రకారం ఈ లింగం 'పెరుగుతూ వుండేదట. అందువలన ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగుచెంది అర్చకులలో వొకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అంతటితో లింగం పెరుగుదల ఆగిందట. దీనిని నిదర్శనంగా తెల్లని లింగంపై ఎర్రని (నెత్తుటి) చారికలను చూపిస్తారు. మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలన్నమాట. ఈ లింగం 3 అడుగుల చుట్టుకొలతతో 60 అడుగుల ఎత్తు వుంటుంది.*


*ఇక్కడ కొలువుతీరిన అమ్మవారు బాలచాముండిక.  ఈ దేవేరి శక్తి పీఠాలలో ఒకటిగా పరిగణిపబడుతోంది. భక్తుల ఈతి బాధలనుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ప్రసాదించే చల్లని తల్లి అని భక్తులు భావిస్తారు.ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోనూ నూతన శక్తి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం.*


*త్రిలోక ప్రసిద్ధమైన ఈ అమరేశ్వర తీర్థం ఉత్తమమైంది. అమరేశ్వరస్వామిని దర్శించడం వలన వేయి గోవులను దానమిచ్చిన ఫలితంతో పాటు, పునర్జన్మ ఉండదని పురాణ ప్రవచనం. ఇక్కడ శివుణ్ణి ప్రణవేశ్వరుడు, అగస్తేశ్వరుడు, కోసలేశ్వరుడు, సోమేశ్వరుడు, పార్థివేశ్వరుడు అనే నామాలతో కీర్తిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో మూడు రోజులు వరుసగా కృష్ణానదిలో స్నానం చేసి అమరలింగేశ్వరుడిని పూజించిన వారు మరణానంతరం శివ సాన్నిద్యం పొందుతారని భక్తుల విశ్వాసం.*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(83వ రోజు)*

   *(క్రితం భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

*చిన్ని కృష్ణుడు - పూతన సంహారం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నందగోపుడు బంధువు.అతన్ని పలకరించేందుకు వచ్చాడు వసుదేవుడు. వసుదేవుణ్ణి చూస్తూనే నందుడు లేచి కౌగిలించుకున్నాడు. కంసుని చెరలో దేవకీ వసుదేవులు కష్టాలపాలయిన సంగతి తలచుకుని, కన్నీరు పెట్టుకున్నాడు. నందుడు కన్నీరు పెట్టుకోవడం గమనించక ఎటో చూస్తూ ఆందోళన చెందసాగాడు వసుదేవుడు.*


*అతని ఆందోళనను గమనించి ఆశ్చర్యపోయాడు నందుడు. కన్నీరు తుడుచుకుని అడిగాడు.‘‘ఏమైంది వసుదేవా? ఎందుకలా ఆందోళనగా ఉన్నావు?’’ ‘‘గోకులానికి ఏదో కీడు మూడనున్నట్టుగా అపశకునాలు తోస్తున్నాయి. దయచేసి నువ్వు తొందరగా వ్రేపల్లెకు బయల్దేరు.’’ చెప్పాడు వసుదేవుడు. అతని మాటను కాదనలేదు నందుడు. వెంటనే పరివారంతో వ్రేపల్లెకు బయల్దేరాడు.*


*పూతన సంహారం:-*


*కంసుని అనుచరి పూతన. రాక్షసి. పిల్లలను చంపుతుందది. దానిని ‘పూతిక’ అని కూడా అంటారు.*


*ఈ పూతన పూర్వజన్మలో బలి చక్రవర్తి కూతురు. పేరు రత్నమాల. శ్రీహరి వామనమూర్తిగా వచ్చి, బలిచక్రవర్తిని దానం అడిగినప్పుడు చూసిందతన్ని. బాలవటువు బాగున్నాడని ముచ్చటపడింది. పుత్రప్రేమ కలిగిందామెకు. ఇలాంటి బాలుడికి చన్నుకుడిపి, పాలు తాగించే అదృష్టానికి నోచుకుంటే బాగుండుననుకున్నది. ఆ కోరికను గ్రహించిన శ్రీహరి, వచ్చే జన్మలో ఆమె కోరిక తీర్చాలనుకున్నాడు.* 


*ఫలితంగానే పూతన జన్మించింది. కంసుని ఆజ్ఞమేరకు పూతన పల్లెలు, పట్టణాలు తిరుగుతూ కనిపించిన శిశువునల్లా చంపుతూ వస్తోంది. వ్రేపల్లెకు చేరుకుంది.*


*రాక్షసి రూపంలో గాక చక్కని స్త్రీరూపం ధరించి మరీ చేరుకుందక్కడికి. పట్టుచీరె కట్టుకుంది. మల్లెపూలు పెట్టుకుంది. చెవులకు అద్భుతమయిన కుండలాలు ధరించింది. నడుస్తోంటే కుండలాలు ఊగుతూ కాంతులు విరజిమ్ముతోంటే చూసిన ప్రతి ఒక్కరూ పూతనను మామూలు స్త్రీ కాదు, ఎవరో దివ్యాంగన అనుకున్నారు. ఊరంతా తిరిగింది పూతన. ఆఖరికి నందుడి ఇంటికి చేరింది.*


*చిన్ని కృష్ణుణ్ణి చూసిందక్కడ. యశోద, రోహిణి అతన్ని ముద్దు చెయ్యడాన్ని చూసి, ముందుకొచ్చింది. చిన్నికృష్ణుడు అప్పుడు ఉయ్యాలలో పడుకుని ఉన్నాడు. వస్తున్నది పూతన అని తెలుసతనికి. ఆమె రాక్షసి అని తెలుసు. అయినా ఏమీ తెలియని వాడిలా కళ్ళుమూసుకుని, పిడికిళ్ళు బిగించి పడుకున్నాడు*


*‘‘పిల్లాడు ముద్దొస్తున్నాడు.’’ అన్నది పూతన. కృష్ణుని బొజ్జనొక్కి చూసింది. మెత్తగా ఉన్నది.‘‘కడుపులో పాలులేవు. ఆకలి మీద ఉన్నాడు.’’ అన్నది.*


*యశోద అనుమతి కోసం చూడలేదు. రోహిణి ఏమంటుందోనని భయపడలేదు. కృష్ణుణ్ణి అందుకున్నది. ఒడిలో పెట్టుకున్నది. ఏడుస్తున్న కృష్ణుణ్ణి ఓదారుస్తున్నట్టుగా ఎత్తి ఆడిస్తూ, తర్వాత పాలు కుడిపేందుకు రవికె ముడి విప్పింది. చిన్నికృష్ణుని నోటికి చన్ను అందించింది. ఆనందాశ్చర్యాలలో ఉన్నారు యశోద, రోహిణి. మంత్రముగ్ధుల్లా ఇద్దరూ వారించలేదామెను. తనపాలలో విషాన్ని నింపుతుంది పూతన. ఆ పాలను తాగితే చాలు, చనిపోతారు పిల్లలు. చాలా మంది పిల్లల్ని అలాగే చంపింది.*


*ఈ కృష్ణుడో లెక్కా అనుకుంది. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. పూతన పాలనే కాదు, ఆమె ప్రాణాలను కూడా పీల్చేశాడు కృష్ణుడు. బాధను భరించలేకపోయింది పూతన. చన్ను నుంచి చిన్నికృష్ణుణ్ణి వేరు చేసేందుకు ప్రయత్నించింది. వీలుకాలేదు. కృష్ణుడు గట్టిగా పట్టుకున్నాడు.*


*‘‘వదులు కృష్ణా! వదులు’’ అంటూ రోదించింది పూతన. వదల్లేదు కృష్ణుడు. లాగి లాగి ఆఖరికి ఆమె ప్రాణాలను హరించాడు. చెమటలు పట్టిపోయింది పూతన. కాళ్ళూ చేతులూ కొట్టుకుంది. పెద్దగా అరుస్తూ వెల్లకిలా పడిపోయింది. ఆమె అరుపునకు భూమి వణికి పోయింది. కొండలు దద్దరిల్లాయి. ఆకాశం కంపించింది. గ్రహతారకలు ఒక్క క్షణం గతులు తప్పి అంతలోనే సర్దుకున్నాయి. అధోలోకాలు అదిరిపడ్డాయి. దిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కసారిగా వందలాది పిడుగులు పడ్డట్టుగా వినవచ్చిన ఆ శబ్దానికి వ్రేపల్లెవాసులు మూర్ఛపోయారు. చనిపోయిన మరుక్షణం పూతన తన నిజరూపంతో ప్రత్యక్షమయింది. పెద్దపెద్ద కోరలతోనూ, కొండగుహలంత నాసికారంధ్రాలతోనూ, కొండల్లాంటి కుచాలతోనూ, పాడుబడిన బావుల్లాంటి కళ్ళతోనూ, నీళ్ళింకిన చెరువంతటి కడుపుతోనూ, ఎర్రటిజుట్టుతోనూ పూతన నేల మీద వెల్లకిలా పడడంతో చుట్టుపక్కల ఆరుకోసుల వరకూ ఉన్న చెట్లూ, మానులూ ఫెళఫెళా విరిగిపడ్డాయి. పూతన శవాన్ని చూసి పరుగులు పెట్టారు ప్రజలు. చిన్నికృష్ణుడు మాత్రం ఎలాంటి ఆందోళనా చెందక దాని శరీరం మీద ఆడుకోసాగాడు.*


*జరిగింది చూస్తూ యశోదా, రోహిణీ తదితరులు చాలాసేపటి వరకు మనుషులు కాలేకపోయారు. అచేతనులయ్యారు. తర్వాత తేరుకున్నారు. తేరుకుని పరుగుదీసి, పూతన మీద ఆడుకుంటున్న కృష్ణుణ్ణి అందుకున్నారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

శివానందలహరి

 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*జగద్గురు ఆదిశంకరాచార్యులు*

                  *విరచిత*

         *”శివానందలహరి”*

             *రోజూ ఒక శ్లోకం* 

       *తాత్పర్యం, ఆడియోతో*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*భ్రమరాంబా పతియైన మల్లికార్జునుని భ్రమరాధిపతిగా నిరూపించి, ఆభ్రమరాధిపతిని, తన మానస కమలమునందు విహరించుమని శంకరులు ఈ శ్లోకంలో వేడు కుంటున్నారు.*


*శ్లోకం : 51*


*భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధవా*


*హ్లాదోనాదయుతోమహాసితవపుఃపంచేషుణాచాదృతః*


*సత్పక్షస్సుమనోవనేషుస పునస్సాక్షాన్మదీయే మనో*


*రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభుః !!*


*గమనిక:~*


*ఈ శ్లోకంలోని విశేషణములు అన్నీ భ్రమరాంబాధిపతియైన శ్రీశైల మల్లికార్జునునికీ తుమ్మెదల అధిపతికీ అన్వయించేలా శ్లేషలో కూర్చబడ్డాయి.*


*భావము - వివరణ :~*


*ఈ శ్లోకంలో శంకరులు భ్రమరాధిపతి అనగా గండు తుమ్మెదను పోలిక చేసుకొని, భ్రమరాంబాధిపతియైన శ్రీ శైలవాసియైన ప్రభువు మల్లికార్జునుని వర్ణించారు.*


*భ్రమరాధిపతి(తుమ్మెద)  - ఆడుతుమ్మెద ఇచ్ఛననుసరించి సంచరిస్తుంది. శివుడు  _  భృంగి అనే ప్రమథగణములలోనివాడూ, శివద్వార పాలకుడూ అయిన నందికేశ్వరుని ఇచ్ఛననుసరించి నాట్యము చేస్తాడు.*


*భ్రమరపతి(తుమ్మెద) ఏనుగుల మదజలముగ్రహిస్తుంది. శివుడు గజాసురుని మదాన్ని అణచాడు.*


*తుమ్మెద వసంత ఋతువుచే ఆనందిస్తుంది. శివుడు మాధవుని ద్వారా ఆనందించాడు.*


*తుమ్మెద ఝంకారం చేస్తుంది. ఈశ్వరుడు ప్రణవనాదంతో కూడుకున్న వాడు.*


*తుమ్మెద మిక్కిలి నల్లని ఆకృతి కలది. శివుడు తెల్లని ఆకారం గలవాడు*


*తుమ్మెద భ్రమరాధిపతి. శివుడు భ్రమరాంబకు అధిపతి.*


*తుమ్మెద మన్మథునిచే సహాయంగా స్వీకరింప బడుతుంది. శివుడు మన్మథునిచే బాణ లక్ష్యంగా చేసికోబడ్డాడు.*


*తుమ్మెద అనగా భ్రమరాధిపతి పూలతోటలయందాసక్తి గలవాడు.*


*శివుడు కూడా విష్ణువువలె రక్షణకర్తయే. శివుడు కూడా విష్ణువు వలె అనేకావతారములను ధరించాడు. శివుడు దక్షిణామూర్తిగా అవతరించి, సనకాదులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. యక్షరూపాన్ని ధరించి దేవతల అహంకారాన్ని పోగొట్టాడు. కిరాత రూపం ధరించి బ్రహ్మను శిక్షించాడు, అర్జునునికి పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. విష్ణువు అర్చావతారములు ధరించి నట్లుగా శివుడనేక చోట్ల జ్యోతిర్లింగ మూర్తిగా వెలశాడని శాస్త్రములు చెబుతున్నాయి.*


*కాబట్టి అదృష్టవంతులూ, శ్రద్ధ గలవారూ శ్రీశైల మల్లికార్జునుని సేవించి ధన్యులౌతారు.*


*"సర్వః సద్బుద్ధిమ్ ఆప్నోతు " . ప్రతి వ్యక్తికీ శివుణ్ణి పూజించాలనే సద్బుద్ధి కలుగుగాక*


*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*


*ఓం నమఃశివాయ।*

*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

భక్తి మాత్రమే ముఖ్యం!

 *🙏🏿భక్తి మాత్రమే ముఖ్యం!*

                  

*ఒక్కోసారి మనకు అర్ధం పర్దం లేని ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయ్ . పూజానియమాలు తెల్సుకోవడం మంచిదే, పూజలో దోర్లుతున్న తప్పులను సవరించుకోవడం మంచిదే కాని వాటికోసం పూజనే మానివేయడం తప్పు.* 


*దేవుడు ఎంత కారుణ్య మూర్తో చూడండి …*


*భక్తకన్నప్ప పెట్టిన నైవేద్యం ఏమిటి...?  జింక మాంసం..!                           *ఆయన భక్తితో పెట్టిన నైవేద్యం కాబట్టి దేవుడు స్వీకరించాడు. కాని దేవుడు “ఛీ నీచుడా...! నీకు ఏమి నైవేద్యంగా పెట్టాలో తెలియదు. నువ్వు స్నానం చేసావా ముందు.   విభూది కూడా పెట్టుకోలేదు దూరం జరుగు!” అనలేదు. పరమ సంతోషంతో స్వీకరించాడు.* 


*ఇక్కడ అర్ధం చేస్కోవాల్సింది అందర్నీ జింక మాంసం పెట్టమని కాదు శివుడికి జింక మాంసం ఇష్టం అని కాదు. నువ్వు భక్తితో ఏది పెట్టినా భగవంతుడు స్వీకరిస్తాడు అనేది గ్రహించండి.*


*గజేంద్ర మోక్షం లో గజ రాజు ప్రాణం పోతున్న సమయంలో స్వామి వారిని పిలిస్తే వైకుంఠం నుండి పరుగెత్తుకుని మరీ వచ్చాడు ..   పైగా తను నిత్యం ధరించే శంఖు చక్రాలను ధరించకుండా. లక్ష్మి దేవికి కూడా చెప్పకుండా వచ్చి రక్షించాడు. అంతే కాని నీ చిన్నప్పటి నుంచి ఒకసారి కూడా పూజ చేయలేదు. ఈ ఆపద వేళలో మాత్రమే నీకు గుర్తుకు వచ్చానా .. నీ చావు నువ్వు చావు అనలేదు. ఆపదలో ఉన్నవాణ్ణి ఆర్తితో పిలిచినవాడిని, నీవుదప్ప వేరెవరూ లేరని సంపూర్ణ శరణాగతుడవైతే అప్పుడు శ్రీహరి నిన్ను కాపాడటానికి ఏ రూపంలో ఐనా సరే, ఏ సమయంలో నైనా సరే వచ్చి కాపాడతాడు, అదే ఆయన నైజం.*


*ద్రౌపతి వస్త్రాపహారణ వేళ నిండు సభలో రక్షించు వారెవరూ లేనప్పుడు ఇతరులెవ్వరు తనకు అండలేనప్పుడు ‘అన్నా శ్రీ కృష్ణా!’ అంటే వెంటనే వచ్చి వస్త్రాలు ఇచ్చి రక్షించాలేదా...?*


*తరువాత  వస్తాను. అప్పటివరకు నన్ను తలచకు అని చెప్పలేదే. భక్తీతో…”స్వామీ నీవే తప్ప నన్ను రక్షించేది ఎవరు”  అని శరణు వేడితే తప్పకుండా ఏదో ఒక రూపం లో స్వామి పలుకుతాడు. ఇక్కడ మనకు కావలసింది సంపూర్ణ భక్తి మాత్రమే...!*


*పూజ చేసేటప్పుడు ఎన్ని వత్తులు వెయ్యాలి .. అవి ఏ దిక్కుకు తిప్పాలి . ఏ నూనేతో వెలిగించాలి అంటూ పూజ ప్రారంభం లోనే సవాలక్ష ప్రశ్నలతో మొదటిలోనే ఆగిపోతే, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు శరణాగతుడవు కావాలి, అందుకే ఎప్పుడైనా ఒక్కటే గుర్తు పెట్టుకో .. స్వామి కి కావాల్సింది భక్తి తప్ప హంగులూ ఆర్భాటాలు కావు. ఏదైనా పూజలోనో వేరే ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తప్పులు దొర్లితే “స్వామీ ఏదైనా తెలియక తప్పు చేస్తే క్షమించు తండ్రి!” అంటే అయన చిరునవ్వుతో మన్నిస్తాడు. తెలిసి కూడా తప్పుచేసి దాచేద్దాం అనుకుంటూ చేసే పనులు మాత్రం చేయకూడదు, ఎందుకంటే సర్వవ్యాపితుడైన అతని ముందు ఏదీ దాయటం కుదరదు గాక కుదరదు.*✍️


.                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి

 🙏 ఇచ్చాశక్తి -- జ్ఞానశక్తి -- క్రియా శక్తి🙏


"ఇచ్చాశక్తి - జ్ఞానశక్తి --క్రియా శక్తి స్వరూపిణి "

అని లలితా సహస్రంలో వాగ్దేవతలు చెప్పారు..


యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపము.ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.అవి

1) ఇచ్ఛాశక్తి

2) జ్ఞానశక్తి

3) క్రియాశక్తి.


ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే 'ఇచ్ఛ' (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎలా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరుపుటయే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు.


. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయికే.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రం లోని త్రికోణంలో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే..


 మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తు లన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది


సదాశివశక్తుల యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనునవి మనోవాక్కాయ కర్మములు. ఇవి పార్వతి, సరస్వతి, లక్ష్మి అను మూర్తిత్రయములు. వేరువేరుగా పిలవబడుచున్న ఏకత్వ లక్షణముల గల శక్తి మాత్రమే. ఈ మూడు శక్తి రూపములు ‘శారదా తిలకము’ నందు – ‘బిందు పుమాన్ శివః ప్రోక్తః స్వర్గః శక్తిర్నిశాకరః’ – ఏది శక్తితో కూడా యున్నదో అది సృష్టి రచనా శక్తి కలిగియున్నదని చెపుతోంది..

ప్రపంచంలో ఉన్న చైతన్యం వెనుక శక్తి నిబిడీకృతమై వుంటుంది. అంటే భౌతికమైనది మాత్రమే కాదు, మానసిక చలనం కూడా కదలికే. అందుకే చైతన్యశక్తి- ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా మూడు రకాలుగా ఉటుందని మన పురాణాలు పేర్కొన్నాయి.

ఏదైనా పని జరగాలంటే ముందు ఆ పని చేయాలనే కోరిక (ఇచ్ఛ) పుట్టాలి. అదే ఇచ్ఛాశక్తి. కోరిక కలిగాక ఆ పని ఎలా చేయాలో జ్ఞానం కలగాలి. అదే జ్ఞానశక్తి. ఇచ్ఛ, జ్ఞానం రెండూ కలిగిన తరువాత పని జరగాలి. అదే క్రియాశక్తి.

ఈ ప్రపంచం మొత్తం ఒక కుండగా భావిస్తే దీన్ని సృష్టించేది సృష్టికర్త. ఆయన ‘సృష్టి’ స్పందనను పొందాలంటే ఈ మూడు శక్తుల కలయిక తప్పనిసరి. అంటే సృష్టి మొత్తం కూడా ఈ మూడు శక్తుల విపరిణామం. మనకు కనిపించేదంతా క్రియాశక్తి రూపాంతరం. దీనివెనుక జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తులున్నాయి. ఈ మూడూ కలిసిన సంపూర్ణశక్తే పరాశక్తి. ఈ జగత్తు మొత్తానికి పరాశక్తియే తల్లి అని శాస్త్రాలు నిర్ణయించాయి. సాక్షాత్తు జన్మనిచ్చేది తల్లి. తండ్రికాదు. అందుకే శక్తిని జగన్మాతగా దర్శించారు మన మహర్షులు.

అందువల్లనే శంకరాచార్యులవారు ”శివశ్శ్యక్త్యాయుక్తోయది భవతి శక్త: ప్రభవితుం”’ అనే శ్లోకంలో ఆ శక్తిని హరిహర బ్రహ్మాదులంతా ఆరాధన చేస్తున్నారు అని చెప్పారు.

బ్రహ్మలో ఆ పరాశక్తి సృష్టిని కలిగిస్తోంది. విష్ణువులో అదే పరాశక్తి స్థితిని కలిగిస్తోంది. రుద్రుడిలో అదే పరాశక్తి సంహారాన్ని కలిగిస్తోంది. అందుకే, ఆ ముగ్గురూ కూడా ఆ శక్తిమాతనే ఆరాధిస్తున్నారు. అందుకే మనం కూడా ఆ తల్లినే ఆరాధిస్తున్నాము. అయితే, మనం శుద్ధ స్వరూపంలో శక్తిమాతను దర్శించలేము. ఊహించనైనా లేము. అందుకోసమే శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. ఆ తర్వాత వివిధ దేవీరూపాలను స్వీకరించి మన ఉపాసనకు సౌలభ్యం కల్పించింది. శ్రీచక్రముతో సకల చరాచర జగ త్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుతున్నది.

పరాశక్తికి శ్రీచక్రానికి ఏమాత్రం భేదం లేదు. శ్రీదేవియే శ్రీచక్రము. శ్రీమాత. శ్రీవిద్య. శ్రీచక్రములు వేరువేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీలలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

శివుని త్రిశూలం మూడు శక్తులకు ప్రతీక.అల్లాగే సుబ్రహ్మణ్య స్వామి (జ్ఞాన శక్తి). భూమి మీద పుట్టిన భార్య వల్లీదేవి (ఇచ్ఛా శక్తి) మరియు అతని దైవిక( దేవతా సంబంధమైన) భార్య దేవసేన (క్రియా శక్తి)తో కలిసి జ్ఞానాన్ని (సుబ్రహ్మణ్య స్వామి ) సృష్టించడానికి ఇచ్చా మరియు క్రియల కలయికను సూచిస్తారు.ఇది సుబ్రహ్మణ్య తత్త్వముగా చెప్పబడింది.

 కృష్ణుడు (జ్ఞాన శక్తి) కృష్ణుని యొక్క ప్రేమ స్వరూపిణి అయిన రాధా దేవి (ఇచ్ఛా శక్తి), మరియు ఆయన భార్య, రుక్మిణి దేవి (క్రియా శక్తి)అని కృష్ణ తత్త్వముగా చెప్పబడింది. తత్వశాస్త్రంలో, ఇడా నాడి (ఇచ్ఛా శక్తి) మరియు పింగళ నాడి (క్రియా శక్తి) సమతుల్యతలో ఉన్నప్పుడు సుష్మ నాడి (జ్ఞాన శక్తి)లోకి శక్తిని ప్రవహించటానికి అనుమతిస్తాయి

సారాంశం మళ్ళీ చెబుతున్నాను 

దేవతాశక్తి యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.

అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే

 సాధ్యం.

శ్రీచక్రంలో బిందువు ఇచ్చాశక్తి, త్రికోణం జ్ఞానశక్తి

మిగిలిన చక్రాలు క్రియాశక్తి అని గ్రహించాలి.


సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సలహాలు ఇవ్వడం

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏             🏵️లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలు ఇవ్వడం.. ఒకటి అడిగితే వెయ్యి చెబుతారు.. కానీ అన్నింటికంటే కష్టమైన పని..సలహా ఇచ్చినోడు దానిని అమలపరచడం🏵️నీ పరిస్థితులు నీకు ఎంత వ్యతిరేకంగా ఉన్నా నీ ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్ గా ఉంటే అవి నీ పరిస్థితులను నీకు అనుకూలంగా మారుస్తాయి.. అలాగే మనిషి తనలోని ప్రేమను ఎంత పెంచుకుంటే అంత మంచి చేస్తోంది.. తనలోని ద్వేషాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మనశాంతి చేకూరుతుంది🏵️ఎదుటి వారి కంటే గొప్పగా ఉండాలని అనుకోకు.. నీవు గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలనుకో..ఎందుకంటే కోరికలు పుట్టినంత త్వరగా అవకాశాలు పుట్టవు.. కావున కష్టపడుతూ పైకి ఎదగాలే కానీ ఒక్క సరిగా పైకి ఎగరాలని ప్రయత్నం చేయకు🏵️స్వేచకు శత్రువులు,  నిరంకుశత్వానికి మిత్రులు ఎప్పుడు విజయం సాధించలేరు.. మనం ఎంత పని చేయబోతున్నాము అనేది ముఖ్యం కాదు.. ఆ పని ఎలా చేయబోతున్నామనదే ముఖ్యం..కాలం మనకు ఏమీ నేర్పించదు.. మనకు ఎదురయ్యే మనుషులు ఎదుర్కొనే పరిస్థితుల నుంచే మనం నేర్చుకోవాలి🏵️🏵️మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ &జనరల్ ఏజన్సీస్  D.29-2-4గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593 9182075510*🙏🙏🙏

చేసేవాడు,చేయించేవాడు

 కర్తా కారయితా చైవ ప్రేరక శ్చానుమోదకః 

సుకృతం దుష్కృతం చైవ చత్వారస్సమ భాగినః


అర్థము:-చేసేవాడు,చేయించేవాడు,ప్రేరేపించేవాడు, ఆమోదించువాడు ఈ నలుగురూ కూడా పుణ్య,పాప కార్యము లన్నింటిలోనూ సమభాగులే. (ఈ శ్లోకం పంచతంత్రం లోనిది)


జాడ్యం హ్రీ మతిగణ్యతే వ్రతరతే ద౦భః శుచౌ కైతవం 

శూరే నిర్ఘృణతామునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని 

తేజస్వి న్నవలి స్తతా ముఖరతావక్త ర్యా శక్తి: స్థిరే 

తత్కోనామ గుణో భవే త్సుగుణినాం యో దుర్జనై ర్నా౦కితః 

(భర్తృహరి సుభాషితము)

గుణవంతులయందున్న సుగుణములను కూడా దుష్టుడు దోషములుగానే యెంచుతాడు.

బిడియపడేవాడిని రోగియని, వ్రతశీలుని దంభాచారపరుడనీ, శుచిశీలిని కపటియని,

పరాక్రమవంతుని దయాహీనుడని, మౌనిని మతిపోయినవాడని, తేజోవంతుని అహంకారియని, చక్కగా మాట్లాడగలవాడిని వాచాలుడనీ స్థైర్యము గలవానిని అశక్తుడనీ,

ఈ రీతిగా ప్రతివారి యందును దోషములనే ఎంచుట దుర్జనులకు పరిపాటి..,


వాంఛా సజ్జన సంగతౌ పరగుణే ప్రీతి ర్గురౌ నమ్రతా 

విద్యాయాం వ్యసనం స్వయోషితి రతిః లోకాపవాదాద్భయం 

భక్తి శూలిని శక్తి రాత్మ దమనే సంసర్గ ముక్తి: ఖలై:

ఏతే యేషు వసంతి నిర్మల గుణాః తేభ్యో నమః కుర్మహే


అర్థము:-సత్సాహవాసము నందు కోరిక, పరుల గుణముల యందు ప్రీతి, పెద్దల యెడ వినయము, విద్యాలయందు ఆసక్తి, స్వభార్య యందే యనురాగము, లోకనిండా అంటే భయము, శివుని యందు భక్తి, ఆత్మనిగ్రహ శక్తి, దుష్టులకు దూరముగా నుండుట, యను 

నీ నిర్మల గుణములు యెవ్వరియందు యున్నవో అట్టి మహాత్ములకు కైమోడ్పులు.

-------------------------------

ఏది జపియింప నమృతమై యొసగు చుండు 

నేది సద్ధర్మ పథమని యెరుగదగిన

దదియే సద్భక్తి యోగంబు నలవరించు 

మూర్తిమంతంబగు దా హరికీర్తనంబు

అర్థము:- ఏ నామము జపించిన కొద్దీ అమృతమై అతిశయమై అలరారు తూ వుంటుందో, ఏది ఉత్తమమైన ధర్మ మార్గమో అదియే హరినామ సంకీర్తనము.మూర్తీభవించిన భక్తి యోగమే హరినామ జపము అంటాడు అన్నమాచార్యులు. కలియుగ ధర్మం ప్రకారం దేవుని నామ జపమే మోక్ష దాయకము.

.

ఆకసాన లేదు మోక్ష మటు పాతాళమున లేదు 

ఈ కడ భూలోకమందు యెందు లేదు 

పై కొని యాస లెల్లపారద్రోలి వెదికితే 

శ్రీకాంతు పొగిడేటి చిత్తములో నున్నది

అర్థము:-ముక్తి ఎక్కడో ఆకాశము లోనో,పాతాళము లోనో.భూమిపైన నో లేదు.ఆశలవలయం లో చిక్కుకోకుండా ఆ శ్రీకాంతుని స్మరించుకునే మనస్సు లోనే మోక్షము వుంది.మనో నైర్మల్యమే ముక్తికి దారి..

ఇతరులు స్పందించనపుడు

 *2046*

*కం*

ఇతరులు స్పందించనపుడు

నితరులకుపకారమొనరు నిష్ఠల యందున్

హితముల కన్నను నెక్కువ

వెతలుమిగిలి తుదకు సడలు విలువలు సుజనా.

*భావం*:-- ఓ సుజనా!ఇతరులు స్పందించనపుడు ఇతరులకు ఉపకారం చేసే నిబద్ధత లలో మంచి కన్నా ఎక్కువగా కష్టాలు మిగిలి చివరకు విలువలు కూడా పోతాయి.

*భావం*:-- ఇష్టంగానీ,ప్రతి స్పందన గానీలేని వారికి ఉపకారం చేయడానికి ప్రయత్నాలు చేయడం వలన ఇబ్బందులే మిగులుతాయి.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నిత్యకర్మకు, నైమిత్తిక కర్మకు

 ప్ర : నిత్యకర్మకు, నైమిత్తిక కర్మకు తేడా ఏమిటి?


జ : నిత్యకర్మకు ఫలితం ఉండదు. రోజూ స్నానం చేయడం, రోజూ సంధ్యావందనం చేయడం, వీటికి ప్రత్యేక ఫలితాలు ఉండవు. చేయకపోతే దోషాలుంటాయి. రోజూ ఎందుకు చేయడం అంటే చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ అంటే ప్రత్యేకంగా ఒక తిథినాడు చేసేటటువంటి పని. ఆ తిథినాడు ఆ పని చేస్తే ఒక ప్రత్యేకమైన ఫలితం వస్తుంది. దీపావళి పండుగనాడు తెల్లవారు ఝామున తలస్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినట్లే. ఎందుకంటే గంగ ఆ రోజున భూమండలంలో అన్ని నీళ్ళల్లోకి వస్తుంది. అందుకని ’జలే గంగా’. ’తైలే లక్ష్మీ’ - ఒంటికి నూనె రాసుకుంటే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ఆరోజున. అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది. నైమిత్తిక తిథినాడు చేసేపనికి ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. నిత్యం చేసే కర్మకి చిత్తశుద్ధి ఒక్కటే దాని ప్రయోజనం. కాబట్టి నిత్యకర్మ చిత్తశుద్ధి కొరకు. నైమిత్తిక కర్మ పరమ పుణ్యాన్ని సంపాదించుకోవడం కోసం. ఇది నిత్యకర్మకీ, నైమిత్తిక కర్మకీ

శ్రీ రామదూత

 శ్రీ రామదూత...🕉️

*🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀


ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః* 


రేపు *అనగాష్టమి* కావున దత్త భక్తులు దయచేసి దత్త నామం జపిస్తూ ఉండండి. మరియు *సిద్ధ మంగళ సొత్రం* చదవండి.

 


#శ్రీ దత్తాత్రేయ స్వామి  అర్ధాంగి కి “అనఘాదేవి” అని పేరు.

అఘము అనగా పాపము అనఘ అనగా పాపము లేనిది పాపము మూడు విధాలు మనసు తో, బుద్దితో, ఇంద్రియములతో, మూడు విధాల పాపములు పోగట్టునది అనఘ


#ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారము. #అనఘాదేవి లో శ్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నాయి. #అనఘస్వామి లో బ్రహ్మ,రుద్ర, విష్ణు లక్షణాలు ఉన్నాయి. #అనఘుడు విష్ణు స్వరూపుడు, అనఘాదేవి లక్ష్మి స్వరూపము. #ఈ దంపతులిద్దరూ నిత్యమూ తపోమయమైన జీవనం గడుపుతూ భక్తులకు తత్వ జ్ఞానాన్ని అనుగ్రహించే అతి ప్రాచీన, ఆది దంపతులు. #వారికే అష్టసిద్ధులు (అణిమా,లఘిమా, ప్రాప్తి, ప్రాకామ్యం ,ఈశిత్వం, వశిత్వం, కామావసాయితా, మహిమా ) పుత్రులై అవతరించారు .


#అనఘాదేవి యోగేశ్వరి, జగన్మాత, యోగంనందు ప్రీతి గలది. గృహం, పతి, పత్ని, పుత్రులను అనుగ్రహిస్తుంది. #వంశవృద్ధిని కలిగిస్తుంది. #సమస్త కోరికలను సిద్ధింపజేస్తుంది, కవితా శక్తిని, కళలను ఇస్తుంది. #ఈమెకే “మధుమతి ” అనే పేరు కూడా కలదు. ఈమె అనఘస్వామి భ్రూమద్య నుండి ఉద్భవించినది. #దత్తాత్రేయుడు అనఘను వామభాగమున ధరించి ఉన్న శాక్త రూపము . “అఘము” అంటే పాపము, ఇది మూడు రకాలు. అనఘము అంటే ఆ మూడు రకాల పాపాలను నశింపజేయడం.


*దత్తుని రూపంలో అంతరార్థం:*

శ్రీ దత్తమూర్తి మూడు శిరస్సులతో, ఆరుభుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే •


#1. మూడు శిరస్సులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సృష్టి, స్థితి, లయములు, ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము.


#2. నాలుగు కుక్కలు: నాలుగు వేదములు ఇవి. దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు.


#3. ఆవు: మనసే మాయాశక్తి. సంకల్ప, వికల్పములకు, సుఖదుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు.


#4. మాల: అక్షరమాల, సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు,సాహిత్యసంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము.


#5. త్రిశూలము : ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి.


#6. చక్రము: అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును.


#7. డమరు: సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి.


#8. కమండలము: సమస్త బాధలను పోగొట్టును. శుభములను సమకూర్చును.


#దత్త తత్వం:

దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !

తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!


#దత్తాత్రేయుని భక్తితో స్మరిమ్చినవారికి సమస్త పాపములు నశిస్తాయి. #దీనిలో సందేహం లేదని‘ దత్త హృదయం ’లో చెప్పబడింది. #దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. #తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు, ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చుతాడని నమ్మకం.#శ్రీభాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో భగవంతుని 21 అవతారములలో ఆరవ అవతారం దత్తాత్రేయుని అవతారమని చెప్పబడింది. 


*శ్రీ సిద్దమంగళ స్తోత్రం* 


#1. శ్రీ మదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#2. శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#3. మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయశ్రీ పాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#5. సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#6. దో చౌపాతీ దేవ్‌లక్ష్మీ ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#7. పుణ్యరూపిణీ రాజమాంబ సుతగర్భ పుణ్యఫల సంజాతా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#8. సుమతీ నందన నరహరినందన దత్తదేవ ప్రభు శ్రీపాదా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#9. పీఠికాపుర నిత్యవిహారా మధుమతి దత్తా మంగళరూపా

జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభవ


#పరమ పవిత్రమయిన యీ సిద్ధ మంగళ స్తోత్రమును పఠించిన అనఘాష్టమీ వ్రతము చేసి సహస్ర సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. #మండల దీక్ష వహించి ఏక భుక్తం చేయుచూ, కాయకష్టముతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర #సద్భ్రాహ్మణ్యమునకు భోజనం పెట్టిన ఫలము లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠించబడును. #దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన, స్పర్శనములు లభించును. #మనసున తలచిన కోరికలు నెరవేరును. #మనసా, వాచా కర్మణా దత్తారాధన చేయు భక్తులు యీ స్తోత్రమును పఠించినంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులగుదురు.


#ఈ స్తోత్రమును పఠించిన చోట సూక్ష్మ వాయుమండలము నందలి సిద్ధులు అదృశ్యరూపమున సంచరించుదురు.


*ఓం ద్రాo దత్తాత్రేయాయ నమః*


🙏🙏🙏


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️🍀