22, మార్చి 2025, శనివారం

గరుడ పురాణం_*26వ భాగం*

 *గరుడ పురాణం_*26వ భాగం*



_మరొక విష్ణు పూజ వుంది. ఇది భోగమోక్షాలను అలవోకగా అందిస్తుంది. ఈ పూజా విధానంలో సాధకుడు ముందుగా స్నానం చేసి సంధ్య వార్చుకొని యజ్ఞ మండపంలో ప్రవేశించాలి. కాళ్ళూ చేతులూ కడుక్కొని శాస్త్రోక్తంగా ఆచమనం చేసి న్యాస విధిననుసరిస్తూ రెండు చేతుల ద్వారా వ్యాపకరూపంలో మూల మంత్రము యొక్క కరన్యాసం చేయాలి. హే రుద్రదేవా! విష్ణు దేవుని మూలమంత్రం ఇది :_


_*ఓం శ్రీ హ్రీం శ్రీధరాయ విష్ణవే నమః "*_


_ఇది దేవాధిదేవుడు, పరమేశ్వరుడునగు విష్ణువాచకం. ఇది సర్వరోగహర్త, సమస్త గ్రహశమకర్త, సర్వపాప వినాశకం, భక్తి, భుక్తి, ముక్తి ప్రదాయకం._


_*తరువాత "ఓం హాం హృదయాయ నమః " తో మొదలెట్టి "అస్త్రాయ ఫట్ " దాకా గల మంత్రాలతో అంగన్యాసం చేసుకోవాలి.*_


_తరువాత సంయమియై ఆత్మముద్రను ప్రదర్శించాలి. హృదయగుహలో అతులిత కాంతులతో విరాజిల్లుతున్న శంఖ చక్రధారి, కుందపుష్ప, చంద్రకాంతి శోభితుడు, శ్రీవత్స కౌస్తుభ సమన్వితుడు, వనమాల, రత్నహారాలంకృతుడునగు విష్ణుభగవానుని కనులు మూసుకొని, మనసులో మనసుతో చూసి మనసారా ధ్యానించాలి._


_*తరువాత 'విష్ణుమండలస్థితులైన దేవగణులారా, పార్షదులారా, శక్తులారా! మీ అందరినీ ఆదరంతో ఆవాహన చేస్తున్నాను. ఇక్కడికి దయచేయండి' అని ఈ మంత్రాల ద్వారా ఆవాహన చేయాలి.*_


ఓం సమస్త పరివారాయాచ్యుతాయ నమః, ఓం ధాత్రే నమః, ఓం విధాత్రే నమః, ఓం గంగాయై నమః, ఓం యమునాయై నమః, ఓం శంఖ నిధయే నమః ఓం పద్మనిధయే నమః, ఓం చండాయ నమః, ఓం ప్రచండాయ నమః, ఓం ద్వారిశ్రయై నమః, ఓం ఆధార శక్ష్యై నమః, ఓం కూర్మాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం శ్రియై నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం సం సత్త్వాయ నమః, ఓం రం రజసే నమః, ఓం తం తమసే నమః, ఓం కం కందాయ నమః, ఓం నం నాలాయ నమః, ఓం లాం పద్మాయ నమః, ఓం అం అర్క మండలాయ నమః, ఓం సోం సోమమండలాయ నమః, ఓం వం వహ్నిమండలాయ నమః, ఓం విమలాయై నమః, ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం పద్మ్యై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః,

ఓం అనుగ్రహాయై నమః.


_*ఈ నామ మంత్రాలతో, గంధ పుష్పాది ఉపచారాల ద్వారా పైన చెప్పబడిన దేవతలందరినీ నమస్కారపూర్వకంగా పూజించాలి.*_


_తదనంతరం పాప వినాశకుడైన, పరమేశ్వరుడైన విష్ణుభగవానుని మండలంలోకి ఆవాహన చేసి ఈ విధంగా పూజించాలి. ముందు మన శరీరంతో న్యాసం చేసినట్లుగానే ఇప్పుడు ప్రతిమతో చేయాలి. ముద్రాప్రదర్శన, అర్ఘ్య పాద్యాది ఉపచారాలతో పూజ చేసి, ప్రతిమకు, స్నాన, వస్త్ర, ఆచమన, గంధ, పుష్ప, ధూప, దీపాదులను సమర్పించి నైవేద్యంగా 'చరు'ని పెట్టాలి. ఆ మహాదేవునికి భక్తిగా ప్రదక్షిణ చేయాలి. తరువాత ఆయన మూల మంత్రాన్ని నూటయెనిమిది మార్లు జపించి ఆ జపాన్ని కూడా ఆయనకు అర్పించాలి. మరల ఆయన హృదయాదులను (ఓం హం హృదయాయ నమః నుండి హః అస్త్రాయ నమః దాకా) అలంకార, ఆయుధాదులను (శంఖం నుండి శారంగం దాకా)_


_*ఓం శంఖాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం చక్రాయ నమః, ఓం గదాయై నమః, ఓం శ్రీవత్సాయ నమః, ఓం కౌస్తుభాయ నమః, ఓం వనమాలాయై నమః, ఓం పీతాంబరాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం నారదాయ నమః, ఓం గురుభ్యో నమః, ఓం ఇంద్రాయ నమః, ఓం అగ్నయే నమః, ఓం యమాయ నమః, ఓం నిరృతయే నమః, ఓం వరుణాయ నమః, ఓం వాయవే నమః, ఓం సోమాయ నమః, ఓం ఈశానాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం సత్త్వాయ నమః, ఓం రజసే నమః, ఓం తమసే నమః, ఓం విష్వక్సేనాయ నమః ! అని పూజించి ఇతర దేవతలను కూడా ఇలా పూజించాలి.*_


ఓం శరాయ నమః, ఓం బ్రహ్మణే నమః,

ఓం నారదాయ నమః, ఓం పూర్వసిద్ధేభ్యో నమః,

ఓం భగవతేభ్యో నమః, ఓం గురుభ్యో నమః,

ఓం పరమ గురుభ్యో నమః।


_*అనంతరం దిక్పాలకులనూ, అనంతునీ, బ్రహ్మనీ సపరివారంగా ఆహ్వానించి ఈ మంత్రాలతో అర్చించాలి.*_


_ఓం ఇంద్రాయ సురాధిపతే సవాహన పరివారాయ నమః,


ఓం అగ్నయే తేజో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం యమాయ ప్రేతాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం నిరృతయే రక్షో ధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వరుణాయ జలాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వాయవే ప్రాణాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం సోమాయ నక్షత్రాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం ఈశానాయ విద్యాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం అనంతాయ నాగాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం బ్రహ్మణే లోకాధిపతయే సవాహన పరివారాయ నమః,


ఓం వజ్రాయ హుం ఫట్ నమః,


ఓం శక్యై హుం ఫట్ నమః,


ఓం దండాయ హుం ఫట్ నమః,


ఓం ఖడ్గాయ హుం ఫట్ నమః,


ఓం పాశాయ హుం ఫట్ నమః,


ఓం ధ్వజాయ హుం ఫట్ నమః,


ఓం గదాయై హుం ఫట్ నమః,


ఓం త్రిశూలాయ హుం ఫట్ నమః,


ఓం చక్రాయ హుం ఫట్ నమః,


ఓం పద్మాయ హుం ఫట్ నమః, మరియు


ఓం వౌం విష్వక్సేనాయ నమః,


_*ఓం మహాదేవా! ఈ విధంగా అందరినీ మంత్రాల ద్వారా పూజల ద్వారా సంతోష పెట్టిన తరువాత మరల అందరిలోనూ వ్యాపించియున్న వాసుదేవుడైన విష్ణుదేవుని ఇలా స్తుతించాలి.*_


విష్ణవే దేవ దేవాయ నమో వైప్రభవిష్ణవే ॥ 

విష్ణవే వాసుదేవాయ నమః స్థితి కరాయచ । 

గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే ॥ 

దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః । 

మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే ॥ 

జిష్ణవే సర్వ దేవానాం సర్వగాయ మహాత్మనే । 

బ్రహ్మేంద్ర రుద్ర వంద్యాయ సర్వేశాయ నమోనమః ॥ 

సర్వలోక హితార్థాయ లోకాధ్యక్షాయవై నమః । 

సర్వగోప్తే సర్వకర్తే సర్వదుష్ట వినాశినే ॥ 

వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమోనమః | 

శరణ్యాయ సురూపాయ ధర్మకామార్థదాయినే ॥


శంకరదేవా! ఏ విధంగా బ్రహ్మ స్వరూపుడు, అవ్యయుడు, పరాత్పరుడునైన విష్ణుభగవానుని స్తుతించి సాధకుడు తన హృదయంలో ఆయనను చూడగలిగి ధ్యానించాలి. తరువాత మూలమంత్ర జపాన్ని చేస్తూ ధ్యానించాలి. ఈ రకంగా చేయగలిగిన వానికి విష్ణువు వశుడౌతాడు. హే రుద్రదేవా! ఈ విధంగా ఒక రహస్య పూర్ణ పరమగుహ్య, భుక్తి ముక్తి ప్రద, * విష్ణు ఉత్తమ పూజా విధానాన్ని మీరు నాచే పలికించారు. విద్వాంసుడైన పురుషుడీ పూజను పఠించగానే విష్ణుభక్తశ్రేష్ఠుడై వెలుగొందుతాడు. దీనిని విన్నవారు, చెప్పినవారు విష్ణులోక ప్రాప్తి నొందుతారు.

(28-31అధ్యాయాలు సమాప్తం.)

కామెంట్‌లు లేవు: