19, జూన్ 2026, శుక్రవారం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।



ప్రతిపదార్థ:



యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో కూడియుండి; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధితో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.

  

 

 తాత్పర్యము : 



 పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.



వివరణ:



వైదిక వాఙ్మయంలో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు, ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.


ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ-ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 15*


*బలాకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతే*

*వినమ్రస్వర్నారీవికచకచకాలాంబుదకులే ।*

*స్ఫురంతః కామాక్షి స్ఫుటదలితబంధూకసుహృద-*

*స్తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః ॥*


*భావము :*


*జగన్మాతా! దేవలోకములోని స్త్రీలు, నీకు పాదనమస్కారము చేసే సమయంలో వారి నల్లని కేశపాశములు మేఘములవలే, నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపువలె, తెల్లని మెరుపులవలే గోచరించు చున్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

దేవునికి కృతజ్ఞతలు

 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు*


1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి.


2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు.


3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది.


4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది.


5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.


6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి.


7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది.


8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు.


9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు.


10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి.


దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, యోగ సాధన తో ఆహార నియమములతో శరీరమును కాపాడుకోవాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు.


ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం.

కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. 🙏

శ్రీమన్నారాయణీయము

 *శ్రీమన్నారాయణీయము*


*90వ దశకము - విష్ణుమహత్త్వము - నాలుగవ శ్లోకము*


*334. తం చ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం*

*శర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః*

*శంసంత్యుపాసనవిధౌ తదపి స్వతస్తు*

*త్వద్రూపమిత్యతిదృఢం బహు నః ప్రమాణమ్*


*భావము :*

*పరమాత్మా ! ఆ త్రిమూర్తులయందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపాన్ని విష్ణువని అంటారు. అదేవిధంగా, బ్రహ్మదేవుని యందు సత్వగుణము స్వల్పముగాను, రజోగుణము అధికముగాను కనిపిస్తుంది. ఇక శంకర స్వరూపంలో సత్వగుణం అధికముగా ఉన్నా, తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపిస్తాయి.*


*సర్వస్వరూపా ! త్రిమూర్తుల కంటె పరమైన ఈశ్వరరూపము మరియు పరమాత్మ ( సదాశివ ) రూపంలో ఉన్న నీవు, సమస్త దేవతాస్వరూపుడవు. కాబట్టి, ఉపాసన చేసే సమయంలో, నిన్ను శివుడని అంటారు. ఆ శివస్వరూపం కూడా నీదే అనటానికి చాలా ప్రబలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.*

🙏🙏🙏