19, జూన్ 2026, శుక్రవారం

శనివారం,జూన్.20,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శనివారం,జూన్.20,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి రా9.04 వరకు

వారం:శనివారం(స్థిరవాసరే)

నక్షత్రం:మఖ మ2.58 వరకు 

యోగం:వజ్రం సా6.31 వరకు

కరణం:కౌలువ ఉ9.45 వరకు తదుపరి తైతుల రా9.04 వరకు

వర్జ్యం:రా10.52 - 12.27

దుర్ముహూర్తము:ఉ5.30 - 7.14

అమృతకాలం:మ12.38 - 2.11

రాహుకాలం:ఉ9.00 - 10.30

యమగండ/కేతుకాలం:మ1.30 - 3.00

సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:సింహం

సూర్యోదయం:5.30

సూర్యాస్తమయం:6.32

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

చేసిన పాపానికి

 చేసిన పాపానికి పరిహారం ఎలా ? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ?



కపిలమహర్షి తన తల్లి దేవహూతితో


తస్మాత్ పురైవాద్దిహ

పాప నిష్కృతౌ

యతేత మృత్యో

రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. 


పూజలు, జపాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. 


ఏఏ వ్రతాలు చేసుకోవాలి, 

ఏఏ సమయాలలో 

ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను   తెలుసుకుని ఆచరించాలి. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. 


జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


ఏతత్ సర్వం 

శ్రీ పరదేవతార్పణమస్తు.


_శుభమస్తు_

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


జీవన పయనములో 

ఎన్ని వెతలు 

ఎన్ని వేదనలు 

ఎన్ని కష్టాలు 

ఎన్ని నష్టాలు 

ఎన్ని అపజయాలు 

ఎన్ని ఆశా భంగాలు 

ఎన్ని రోదనలు 

ఎన్ని క్లేశములు 

ఎలా తెలుపను తండ్రీ 

నీకు దూరంగా 

ఎదో ఉండి 

సుఖము 

ఆనందము 

విజయాలు 

పొందుతున్నాను అని 

అనుకోవద్దు 

జీవితములో 

అండ 

దండ 

ధైర్యము 

స్థైర్యము 

అన్నీ నీవే 


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర🙏_

చేతులు జోడించి

 *“మీరు చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తారు... నమస్కారమంటే ఏమిటి?”


*“ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించమే నిజమైన నమస్కారం..!”


*“న.. మ..” అనగా 'నాది కాదు' అని అర్థం..!


*“అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం.


*కర్మలను ప్రారంభించే ముందు మీరు కర్మలకు నమస్కరించాలి..!


*“తస్మై నమః కర్మణే”...


*‘ఓ కర్మ దేవతా! నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు’ అని ప్రార్థించాలి.


*నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు, తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థించడమే నమస్కారంనకు అంతరార్థం..!

గొడ్డలి కట్టెలను కొడుతుంది

 గొడ్డలి కట్టెలను కొడుతుంది. అది గొడ్డలి గొప్పతనం కాదు!


కలం గొప్ప గ్రంధాలను వ్రాస్తుంది. అది కలం గొప్పతనం కాదు!!


మనం గొప్ప గొప్ప పనులు చేస్తాం. అది మన గొప్పతనం కాదు..!!!


అన్నింటికి కర్త అయిన ఈశ్వరునిదే ఆ గొప్పతనం! 


‘మనం కేవలం నిమిత్త మాత్రులం. ఈశ్వరుని చేతిలో పనిముట్లం’ అని భావిస్తూ సర్వ కర్మలను, కర్మ ఫలాలను ఈశ్వరునియందు వదిలి భక్తుడు నిశ్చింతుడై యుండాలి.

***********


 అన్ని భారాలు మోసేవాడు ఆ ఈశ్వరుడు. అనవసరంగా అహంకారాన్ని నెత్తిన పెట్టుకొని అన్నీ నేనే మోస్తున్నానని భ్రమ పడుతూ ఉండరాదు. అన్నీ నావల్లనే జరుగుతున్నవి అనుకోరాదు. ఇదంతా ఒట్టి అహంకారం. ఈ అహంకారాన్ని వదిలితేనే భగవంతుని సాన్నిధ్యం లభించేది.

 

కనుక కర్మలన్నింటిని ఈశ్వరుని యందే విడిచిపెట్టాలి.        

అంటే... ఈశ్వరుని స్మరిస్తూ కర్మలు ప్రారంభించు. ఈశ్వరుని స్మరిస్తూనే కర్మలను కొనసాగించు. ఈశ్వరుని స్మరణతోనే కర్మలను ముగించు..!


కర్మఫలాలను గురించి ఆలోచించకు. లభించిన దానిని ప్రసాద బుద్ధితో స్వీకరించు. నేను నిమిత్తమాత్రుడను అని భావించు. కర్త ఈశ్వరుడే అనే నమ్మకంతో ఉండు. ఏమి జరిగినా నిశ్చితంగా ఉండు. నేను చేస్తున్నాను, ఇది నా వల్లనే జరుగుతుంది అనే అహంకారాన్ని వదులు. ఈ అహంకారాన్ని వదలటమే కర్మలను ఈశ్వరుని లో సన్యసించుట.

 

ఇలా సర్వ కర్మలను ఈశ్వరుని తో సన్యసించి, ఈశ్వరుని ధ్యానము నే లక్ష్యంగా పెట్టుకోవాలి...

ఏమీ తెలియని వాడు

  “ఏమీ తెలియని వాడు ఏకాదశి నాడు చస్తే,అన్నీ తెలిసిన వాడు అమావాస్య నాడు చస్తాడు” అనే సామెతను వివరించే ప్రయత్నం చేద్దాం...

```

*అర్థం:*```

ఈ సామెత జీవితం, జ్ఞానం మరియు మరణం మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది.


*ఏమీ తెలియని వాడు (అజ్ఞాని):

ఈ వ్యక్తి జీవితం, మరణం గురించి అవగాహన లేని వ్యక్తి.


*అన్నీ తెలిసిన వాడు (జ్ఞాని):

ఈ వ్యక్తి జీవితం యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించి, మరణాన్ని భయపడని వ్యక్తి.


*ఏకాదశి:

హిందూ సంప్రదాయంలో, ఏకాదశి శుభమైన రోజుగా భావిస్తారు.


*అమావాస్య:

అమావాస్య చీకటికి ప్రతీక, మరణం, అంత్యం అనే భావనను కూడా సూచిస్తుంది.


*వివరణ:

*అజ్ఞాని: అజ్ఞానికి మరణం భయంకరమైనది. అందుకే శుభమైన ఏకాదశి రోజున చనిపోతే బాగుంటుందని భావిస్తారు.


*జ్ఞాని: జ్ఞానికి మరణం జీవితంలో సహజమైన భాగం. అతను మరణాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే అమావాస్య వంటి రోజున చనిపోయినా భయపడడు.


*ఉదాహరణ:

ఒక వ్యక్తి జీవితం గురించి, మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలియక భయపడుతుంటే, అతను అజ్ఞానికి ఉదాహరణ.

*ఒక వ్యక్తి జీవితం యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించి, మరణాన్ని సహజమైనదిగా భావిస్తే, అతను జ్ఞానికి ఉదాహరణ.


*ముఖ్యమైన అంశాలు:

జ్ఞానం మన భయాలను తగ్గిస్తుంది. మరణం జీవితంలో ఒక భాగం మాత్రమే.


జీవితం గురించి ఆలోచించడం ముఖ్యం.


ఈ సామెత ఒక సామాజిక నమ్మకం, ఆధ్యాత్మిక భావనలను ప్రతిబింబిస్తుంది.

శ్రీకూర్మం దేవాలయం

 శ్రీకూర్మం దేవాలయం పూర్తి వివరాలు 🙏

1. ఎక్కడ ఉంది? • ప్రదేశం: శ్రీకూర్మం గ్రామం, గార మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ • దూరం: శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 15 కి.మీ • GPS: 18°16′18.52″N 84°0′22.97″E 2. దేవాలయం ప్రత్యేకతలు • మూల విరాట్: శ్రీ కూర్మనాథస్వామి - శ్రీ మహావిష్ణువు దశావతారాలలో 2వది అయిన కూర్మావతారం • ప్రపంచంలోనే ఏకైక ఆలయం: కూర్మావతారంలో విష్ణుమూర్తికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఇదే • అమ్మవారు: శ్రీమహాలక్ష్మి ఇక్కడ కూర్మనాయకిగా వెలిశారు • విచిత్రాలు: ◦ స్వామి పడమటి ముఖంగా దర్శనమిస్తారు ◦ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి ◦ శిల్పకళ గాంధర్వ శిల్ప కళ శైలిలో ఉంటుంది ◦ 108 దివ్యదేశాలలో ఒకటి 3. శ్రీకూర్మ పురాణ కథ

కూర్మావతార కథ:

దేవతలు, రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మందర పర్వతంతో చిలుకుతుండగా, ఆ పర్వతం సముద్రంలో మునిగిపోయింది. దేవతల ప్రార్థనతో శ్రీమహావిష్ణువు కూర్మ రూపం అంటే తాబేలుగా అవతరించి, తన వీపుపై మందర పర్వతాన్ని మోసి అమృతోత్పాదనకు సహాయం చేశారు. జ్యేష్ఠ బహుళ ద్వాదశి నాడు స్వామి ఈ అవతారం స్వీకరించారని పద్మపురాణం చెబుతోంది.  


స్థల పురాణం:

శ్వేతచక్రవర్తి భార్య విష్ణుప్రియ ఏకాదశి వ్రతంలో ఉండగా, రాజు కామమోహితుడై ఆమెను చేరాడు. వ్రత భంగం కాకుండా కాపాడమని ఆమె విష్ణువును వేడుకోగా, స్వామి ప్రత్యక్షమై గంగను ఉద్భవింపజేశారు. ఆ ప్రదేశమే శ్రీకూర్మ క్షేత్రంగా మారింది.  

4. పుష్కరిణి & విశిష్టత • శ్వేత పుష్కరిణి: ఇక్కడ పితృకార్యం చేస్తే పితృదేవతలకు మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి • దోష నివారణ: స్వామిని దర్శిస్తే శని, కుజ, రాహు, కేతు గ్రహ దోషాలు తొలగుతాయి 5. ఉత్సవాలు & చరిత్ర • ముఖ్య ఉత్సవం: రథసప్తమి • నిర్మాణం: సా.శ. 1281. 11వ శతాబ్దం నాటి శాసనాలు లభించాయి #శ్రీకూర్మం #కూర్మనాథస్వామి #కూర్మావతారం #శ్రీకాకుళం #108దివ్యదేశాలు #విష్ణుదశావతారాలు #కూర్మనాయకి #శ్వేతపుష్కరిణి #పడమటిముఖదైవం #ఏకైకకూర్మక్షేత్రం

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

అమ్మ ఎదురుచూపు*

 *అమ్మ ఎదురుచూపు*

==================

రచన :- సురేష్ వంకాయలపాటి 

==================


శాంతమ్మకు జీవితం చిన్న వయసులోనే పెద్ద పరీక్ష పెట్టింది. భర్త అకస్మాత్తుగా చనిపోవడంతో ఇద్దరు చిన్న పిల్లల బాధ్యత ఆమె భుజాలపై పడింది. పెద్ద కొడుకు రాము ఐదేళ్లు, చిన్న కొడుకు సోము రెండేళ్లు.

ఆ రోజు నుంచి శాంతమ్మ తన జీవితాన్ని పిల్లల కోసం అంకితం చేసింది. పొద్దున్నే కూలి పనికి వెళ్లేది. ఎండలో చెమటోడ్చేది, వానలో తడిసేది. తన కడుపు మాడ్చుకుని అయినా పిల్లల కడుపు నింపేది. తాను పాత చీరలు కట్టుకునేది, కానీ పిల్లలకు కొత్త బట్టలు కొనిపించేది.

"నా పిల్లలు చదువుకుని పెద్దవాళ్లు కావాలి. నేను పడిన కష్టం వాళ్లు పడకూడదు" అని కలలు కనేది.

కాలం గడిచింది. పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగాలు సంపాదించారు. శాంతమ్మ ఆనందానికి అవధులు లేకపోయాయి. "నా కష్టం వృథా కాలేదు" అని దేవుడికి నమస్కరించింది.

కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి.

మొదట్లో అంతా బాగానే ఉండేది. కానీ క్రమంగా పరిస్థితులు మారాయి.

"మీ అమ్మ ఎప్పుడూ మా ఇంట్లోనే ఎందుకు ఉండాలి?" అని పెద్ద కోడలు అడిగేది.

"మా ఇంట్లో కూడా బాధ్యతలు ఉన్నాయి కదా!" అని చిన్న కోడలు అనేది.

ఆ మాటలు గొడవలుగా మారాయి.

చివరికి ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయం తీసుకున్నారు.

"ఆరు నెలలు అన్నయ్య దగ్గర... ఆరు నెలలు నా దగ్గర..."

ఆ మాట విన్న శాంతమ్మ గుండె బాధతో నిండిపోయింది. కానీ ఏమీ మాట్లాడలేదు.

తల్లి ప్రేమకు తన బాధ కంటే పిల్లల సంతోషమే ముఖ్యం.

అలా సంవత్సరాలు గడిచాయి.

ఒక రోజు పెద్ద కోడలు భర్తతో అంది:

"ఇలా ఎన్ని రోజులు? వృద్ధాశ్రమంలో చేరిస్తే బాగుంటుంది."

చిన్న కోడలు కూడా అదే మాట చెప్పింది.

భార్యల ఒత్తిడిని తట్టుకోలేక ఇద్దరు కొడుకులు శాంతమ్మను ఒక అనాథ వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు.

"అమ్మా... అక్కడ నీ వయసు వాళ్లు ఉంటారు. నీకు బాగుంటుంది" అని చెప్పారు.

ఆ మాటల వెనుక నిజం శాంతమ్మకు అర్థమైంది.

అయినా నవ్వుతూ అంది:

"మీకు ఏది మంచిగా అనిపిస్తే అదే చేయండి బాబూ."

ఆమెను ఆశ్రమంలో వదిలేసి ఇద్దరూ వెళ్లిపోయారు.

ఆశ్రమంలో శాంతమ్మకు ఒక చిన్న మంచం ఇచ్చారు.

ప్రతి ఉదయం గేటు దగ్గర కూర్చునేది.

ప్రతి సాయంత్రం రోడ్డువైపు చూసేది.

"ఈ రోజు నా పిల్లలు వస్తారేమో..."

ఒక రోజు...

ఒక వారం...

ఒక నెల...

ఒక సంవత్సరం...

ఎవరూ రాలేదు.

ఆశ్రమ నిర్వాహకుడు గమనించేవాడు.

ఒక రోజు అడిగాడు.

"అమ్మా... ప్రతిరోజూ గేటు దగ్గరే ఎందుకు కూర్చుంటావు?"

శాంతమ్మ చిరునవ్వు నవ్వి చెప్పింది.

"చిన్నప్పుడు నా పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చే దారి కోసం ఎదురు చూసేదాన్ని బాబూ. ఇప్పుడు కూడా అదే అలవాటు పోలేదు."

ఆ మాట విని నిర్వాహకుడి కళ్లలో నీళ్లు తిరిగాయి.

కొన్ని రోజుల తర్వాత శాంతమ్మ ఆరోగ్యం క్షీణించింది.

చివరి క్షణాల్లో కూడా ఆమె చేతిలో తన ఇద్దరు కొడుకుల చిన్ననాటి ఫోటో ఉంది.

ఆమె నెమ్మదిగా అంది:

"నా పిల్లలు సంతోషంగా ఉండాలి..."

అంతే...

ఆమె శాశ్వత నిద్రలోకి జారుకుంది.

శాంతమ్మ మరణించిన తర్వాత ఆమె దిండు కింద ఒక లేఖ దొరికింది.

ఆశ్రమ నిర్వాహకుడు దానిని జాగ్రత్తగా దాచుకున్నాడు.

కొన్ని రోజుల తర్వాత ఇద్దరు కొడుకులను ఆశ్రమానికి పిలిపించాడు.

వారు రాగానే ఆ లేఖను వారి చేతిలో పెట్టాడు.

వణుకుతున్న చేతులతో వారు చదవడం మొదలుపెట్టారు.

"నా ప్రియమైన బిడ్డలారా,

నేను మిమ్మల్ని తొమ్మిది నెలలు నా గర్భంలో మోశాను.

మీరు నిద్రపోతే నేను మేల్కొని ఉండేదాన్ని.

మీరు తింటే చాలు అని నేను ఆకలితో ఉండేదాన్ని.

మీరు నవ్వితే నా కష్టం మరిచిపోయేదాన్ని.

వృద్ధాప్యంలో మీ ప్రేమ కోసం ఎదురుచూశాను.

కానీ మీ జీవితాల్లో నాకు చోటు లేకపోయింది.

అయినా నాకు మీపై కోపం లేదు.

ఎందుకంటే మీరు నా పిల్లలు.

నా చివరి ఆశీర్వాదం కూడా మీకే.

– మీ అమ్మ"

లేఖ పూర్తయ్యేలోపే ఇద్దరి కళ్లలో కన్నీళ్లు ధారపోశాయి.

వారు బోరున ఏడవడం మొదలుపెట్టారు.

అప్పుడు ఆశ్రమ నిర్వాహకుడు వారివైపు చూసి గంభీరంగా అన్నాడు:

"ఇప్పుడు ఏడుస్తున్నారు..."

"కానీ మీ అమ్మ బ్రతికున్నప్పుడు ఆమె కన్నీళ్లు చూశారా?"

"మీ అమ్మకు డబ్బు కావాలా?"

"కాదు."

"ఆమెకు కావలసింది మీ ప్రేమ, మీ పలకరింపు, మీ తోడు."

"మీరు చిన్నప్పుడు పడిపోతే ఆమె పరుగెత్తుకుని వచ్చేది."

"కానీ ఆమె జీవితంలో చివరి రోజుల్లో ఆమె పడిపోయినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు?"

"తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేర్చడం తప్పు కాదు. కానీ వారిని మనసులోంచి తీసేయడం మాత్రం పెద్ద తప్పు."

"చెట్టు ఎండిపోయాక నీళ్లు పోస్తే ఉపయోగం లేదు."

"తల్లి తండ్రులు బ్రతికున్నప్పుడే వారి విలువ తెలుసుకోవాలి."

ఆ మాటలు వారి గుండెల్లో బాణాల్లా గుచ్చుకున్నాయి.

ఇద్దరు కొడుకులు చేతులు జోడించి ఏడుస్తూ అన్నారు:

"సార్... మమ్మల్ని క్షమించండి."

"మా అమ్మను క్షమించమని అడిగే అవకాశం కూడా మాకు దక్కలేదు."

"మేము చేసిన తప్పు జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది."

ఆ రోజు నుంచి వారి జీవితం మారిపోయింది.

ప్రతి వారం ఆశ్రమానికి వెళ్లేవారు.

అక్కడ ఉన్న వృద్ధులతో మాట్లాడేవారు.

వారికి కావాల్సినవి సమకూర్చేవారు.

వారిలో తమ అమ్మను చూసుకునేవారు.

ఒక రోజు ఆశ్రమంలోని వృద్ధులందరి ముందు నిలబడి అన్నారు:

"మా తల్లిని మేము కోల్పోయాం. ఆ తప్పును ఎప్పటికీ సరిదిద్దలేం. కానీ ఇకపై మీలో మా అమ్మను చూసుకుంటాం. మమ్మల్ని క్షమించండి."

ఆశ్రమంలోని వృద్ధులందరూ వారిని ఆశీర్వదించారు.

నీతి

తల్లిదండ్రులు మన కోసం జీవితాన్ని అర్పిస్తారు.

వారి వృద్ధాప్యంలో వారికి కావలసింది సంపద కాదు, సంతానం ప్రేమ.

తల్లి తండ్రులు ఉన్నప్పుడు వారి చేతిని పట్టుకోండి.

వారు వెళ్లిపోయాక వారి ఫోటోను పట్టుకుని ఏడవాల్సిన పరిస్థితి రాకూడదు.

చదరంగం ఆట*

  *చదరంగం ఆట*


నాకు ఎప్పటినుంచో చదరంగం ఆట అంటే ప్రత్యేకమైన ఆకర్షణ.


దానికి కారణం రాజు లేదా రాణి కాదు; ప్రతి పావుకూ ఒక ప్రయోజనం ఉండటమే. రాజు ఆజ్ఞాపిస్తాడు. రాణి శక్తివంతంగా కదులుతుంది. కోట స్థిరంగా నిలుస్తుంది. గుర్రం అనూహ్య మలుపులతో ఆశ్చర్యపరుస్తుంది. చిన్న పావు కూడా నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంది, ఒకరోజు మరింత ఉన్నత స్థాయికి చేరాలనే ఆశతో.


ఈ ఆట విజయాలు, పరాజయాలు, ఆశయాలు, త్యాగాలు, ఆత్మవిశ్వాసం, నిరాశల మధ్య సాగుతుంది. ప్రతి ఎత్తు అర్థవంతంగా అనిపిస్తుంది. ప్రతి పావు ఈ ఆట ఎప్పటికీ కొనసాగుతుందనే భావనతో తన వంతు పోరాటం చేస్తుంది.


కానీ చివరికి ఆట ముగుస్తుంది. బల్ల ఖాళీ చేయబడుతుంది. ఎంతో రక్షణ పొందిన రాజుని, ఎన్నోసార్లు పట్టించుకోని పావుని ఒకే చేయి తీసుకుని ఒకే పెట్టెలో ఉంచుతుంది. జీవితం కూడా అంత భిన్నంగా లేదు.


మన స్థానం కాపాడుకోవడానికి, గుర్తింపు కోసం, మన విలువను నిరూపించుకోవడానికి ఎన్నో సంవత్సరాలు వెచ్చిస్తాం ఈ ఆటకు ముగింపు లేదన్నట్లుగా.


కానీ ఒక రోజు చప్పట్లు ఆగిపోతాయి. బిరుదులు తమ వెలుగును కోల్పోతాయి. పదవులు ప్రాధాన్యత కోల్పోతాయి.


బల్ల నిశ్శబ్దంగా సర్దివేయబడుతుంది. ఆ నిశ్శబ్దంలో ఒక లోతైన సత్యం వెలుగులోకి వస్తుంది.


జీవితం ఎత్తైన గడిలో కూర్చోవడం గురించి కాదు. దాన్ని మనం ఎలా ఆడామన్నదే ముఖ్యం, నిజాయితీతో, కరుణతో, ధైర్యంతో, వినయంతో.


అందువల్ల ఉద్యోగ జీవితంలో పొందిన హోదాల పట్ల అతిశయ భావన అవసరం లేదు. పదవీ విరమణ తర్వాత రాష్ట్రపతిగా ఉన్నా, అటెండర్‌గా ఉన్నా, జనరల్ మేనేజర్‌గా ఉన్నా, చివరికి అందరూ ఒకే పెట్టెలో చేరతారు.


ఇది చేదు నిజం. అంగీకరించడం కష్టమైనా ఇదే వాస్తవం మరి.

చేసిన పాపానికి పరిహారం

  చేసిన పాపానికి పరిహారం ఎలా ? పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా ?



కపిలమహర్షి తన తల్లి దేవహూతితో


తస్మాత్ పురైవాద్దిహ

పాప నిష్కృతౌ

యతేత మృత్యో

రవిపధ్యరాత్మనా " - కపిలగీత


" ఈ జీవితంలోనే మరణానికి ముందే దేహం రోగగ్రస్తం కాకముందే చేసిన పాపాలకు నిష్కృతి చేసుకోవాలి " అని తెలియచేస్తూంది.


రోగాన్ని గుర్తించి వైద్యులు చికిత్స చేసినట్లుగా మనకు మనమే ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. 


పూజలు, జపాలు, తీర్థయాత్రలు, వ్రతాలు చేసుకుంటూంటే పాపాలన్నీ మెల్లి మెల్లిగా క్షయం అవుతూంటాయి. నరక బాధలు తప్పుతాయి.


వ్రతమనగా శాస్త్రములు తెలియచేసిన నియమాలు పాటించడం. 


ఏఏ వ్రతాలు చేసుకోవాలి, 

ఏఏ సమయాలలో 

ఏఏ తిధులలో చేస్తే విశేషఫలితాలు కలుగుతాయి, వ్రతాచరణలో పాటించవలసిన నియమాలు వంటి విషయాలను తెలుసుకుని ఆచరించాలి. ఉదాహరణకు సత్యనారాయణస్వామి వ్రతం ఏరోజయినా చేసుకోవచ్చు. కాని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి నాడు చేసుకుంటే విశేష ఫలితం.


వ్రతం ఎందుకు చేయాలి?. ఆదిశంకరులు " చిత్తస్య శుద్ధయే కర్మ " అన్నారు. చిత్తశుద్ధి కోసం చేసే కర్మ వ్రతం. 


జీవుడి జన్మజన్మల కర్మఫలాలు చిత్తాన్ని ఆవరించుకుని ఉంటాయి. ఆ వాసనలన్నీ క్షయం కావాలి ముక్తి పొందాలంటే.


సాధారణంగా మనం చేసే వ్రతాలన్నీ కామ్యకవ్రతాలు. ఫలానా పని అవాలనో, కోరిక తీరాలనో లేక కోరిక తీరిందనో వ్రతం చేసుకుంటాం. సత్పురుషులు చేసే వ్రతాలు లోకకళ్యాణం కోసం.


" కృతఘ్నస్య నివృత్తయే " అన్నారు. కృతఘ్నతనుంచి తప్పించుకోవడం కోసం వ్రతాలు చేయాలి. మనం అనుభవించేవన్నీ అమ్మవారి అనుగ్రహమే. అలాగే వాటిని అనుభవించడానికి ఉపయోగపడే ఇంద్రియాలను ఇచ్చినవారు కూడా అమ్మవారే. మరి అన్నీ అనుగ్రహించిన అమ్మవారికి కృతజ్ఞత చెప్పుకోవాలిగా. వ్రతాలు ఈ కృతజ్ఞత తెలియచేయడానికే. ఉదాహరణకు కంచిపీఠాధిపతులు చాతుర్మాస్యవ్రతం చేయడం లోకకళ్యాణం కోసం, కృతఘ్నత నివృత్తి కోసం అని తెలుసుకోవాలి.


ఏతత్ సర్వం 

శ్రీ పరదేవతార్పణమస్తు.


_శుభమస్తు_

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః ।

సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే ।। 7 ।।



ప్రతిపదార్థ:



యోగ-యుక్తః — మనస్సు ద్వారా భగవంతునితో కూడియుండి; విశుద్ధ-ఆత్మా — పవిత్రమైన బుద్ధితో; విజిత-ఆత్మా — మనస్సుని జయించినవారు; జిత-ఇంద్రియః — ఇంద్రియములను జయించినవారు; సర్వ-భూత-ఆత్మ-భూత-ఆత్మా — అన్ని ఆత్మల పరమాత్మను ప్రతి ప్రాణిలో దర్శిస్తూ; కుర్వన్ — (కర్మలను) చేస్తూ; అపి — కూడా; న, లిప్యతే — చిక్కుకొనరు.

  

 

 తాత్పర్యము : 



 పరిశుద్ధమైన అంతఃకరణ కలిగి, ఇంద్రియ-మనస్సులను నియంత్రణ చేసే కర్మ యోగులు, ప్రతిప్రాణిలో పరమాత్మను దర్శిస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు.



వివరణ:



వైదిక వాఙ్మయంలో 'ఆత్మ' అనే పదం ఎన్నో రకాల అర్థాలలో వాడబడింది: భగవంతుడు అనే అర్థంలో, ఆత్మ అనే అర్థంలో, మనస్సు అనే అర్థంలో, బుద్ధి అనే అర్థంలో వాడబడినది. ఈ శ్లోకం, వీటన్నిటికీ ఉదాహరణ చూపిస్తున్నది. శ్రీ కృష్ణుడు, ఇక్కడ కర్మ యోగి అంటే యోగ యుక్తుడు (భగవంతునితో ఏకమై ఉన్నవాడు) అని విశదీకరిస్తున్నాడు. అటువంటి మహాత్ముడు 1) విశుద్ధాత్మ - పవిత్రమైన బుద్ధి ఉన్నవాడు 2) విజితాత్మా - మనస్సుని జయించినవాడు, మరియు 3) జితేంద్రియ - ఇంద్రియములను నియంత్రించినవాడు.


ఇటువంటి కర్మ యోగులు, పరిశుద్ధమైన బుద్ధితో, సమస్త ప్రాణుల యందు భగవంతుడినే దర్శిస్తారు మరియు అందరితో గౌరవప్రదంగా మెలుగుతూ, ఎవరితో సంగం లేకుండా ఉంటారు. తమ కార్యకలాపాలు వారి స్వార్థ-ప్రయోజనం కోసం కాదు కాబట్టి వారికి జ్ఞానం క్రమక్రమంగా స్పష్టమగుతుంది. వారి కోరికలు నిర్మూలించబడినవి కాబట్టి, ఇంతకు పూర్వం భౌతిక భోగములకోసం తాపత్రయ పడ్డ ఇంద్రియములు, మనస్సు, మరియు బుద్ధి, ఇప్పుడు నియంత్రణలోకి వస్తాయి. ఈ పరికరములు ఇక ఇప్పుడు భగవత్ సేవకు అందుబాటులోకి వచ్చాయి. భక్తి యుక్త సేవ అంతర్గత విజ్ఞానం వైపు దారి తీస్తుంది. ఈ విధంగా, కర్మ యోగము, సహజ పద్ధతిలో జ్ఞానోదయ దిశగా ఒక్కొక్క మెట్టు పైకి తీస్కువెళుతుంది, కాబట్టి ఇది కర్మ సన్యాసము కంటే భిన్నమైనది కాదు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 15*


*బలాకామాలాభిర్నఖరుచిమయీభిః పరివృతే*

*వినమ్రస్వర్నారీవికచకచకాలాంబుదకులే ।*

*స్ఫురంతః కామాక్షి స్ఫుటదలితబంధూకసుహృద-*

*స్తటిల్లేఖాయంతే తవ చరణపాథోజకిరణాః ॥*


*భావము :*


*జగన్మాతా! దేవలోకములోని స్త్రీలు, నీకు పాదనమస్కారము చేసే సమయంలో వారి నల్లని కేశపాశములు మేఘములవలే, నీ పాదముల నఖముల తెల్లని కాంతి ఆ మేఘములలో విహరించే కొంగల గుంపువలె, తెల్లని మెరుపులవలే గోచరించు చున్నది.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

దేవునికి కృతజ్ఞతలు

 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు*


1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి.


2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు.


3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది.


4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది.


5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.


6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి.


7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది.


8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు.


9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు.


10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి.


దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, యోగ సాధన తో ఆహార నియమములతో శరీరమును కాపాడుకోవాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు.


ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం.

కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. 🙏

శ్రీమన్నారాయణీయము

 *శ్రీమన్నారాయణీయము*


*90వ దశకము - విష్ణుమహత్త్వము - నాలుగవ శ్లోకము*


*334. తం చ త్రిమూర్త్యతిగతం పరపూరుషం త్వాం*

*శర్వాత్మనాపి ఖలు సర్వమయత్వహేతోః*

*శంసంత్యుపాసనవిధౌ తదపి స్వతస్తు*

*త్వద్రూపమిత్యతిదృఢం బహు నః ప్రమాణమ్*


*భావము :*

*పరమాత్మా ! ఆ త్రిమూర్తులయందు పరమ సత్వగుణ సంపన్నమైన రూపాన్ని విష్ణువని అంటారు. అదేవిధంగా, బ్రహ్మదేవుని యందు సత్వగుణము స్వల్పముగాను, రజోగుణము అధికముగాను కనిపిస్తుంది. ఇక శంకర స్వరూపంలో సత్వగుణం అధికముగా ఉన్నా, తమోగుణ ప్రధానమైన చేష్టలు కూడా కనిపిస్తాయి.*


*సర్వస్వరూపా ! త్రిమూర్తుల కంటె పరమైన ఈశ్వరరూపము మరియు పరమాత్మ ( సదాశివ ) రూపంలో ఉన్న నీవు, సమస్త దేవతాస్వరూపుడవు. కాబట్టి, ఉపాసన చేసే సమయంలో, నిన్ను శివుడని అంటారు. ఆ శివస్వరూపం కూడా నీదే అనటానికి చాలా ప్రబలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.*

🙏🙏🙏