1, జులై 2022, శుక్రవారం

రాయితీలు

బ్రాహ్మణ సంక్షేమ వేదిక వార్తలు:
 
బ్రాహ్మణ సంక్షేమ వేదిక  రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నో సంస్థలతో ఒప్పందం కుదుర్చుకొని అనేక మంది బ్రాహ్మణులకు రాయితీలతో సేవలు అందిస్తున్న విషయం మీకు తెలుసు.

అందులో భాగంగా ఈ రోజు  హైదరాబాద్, బంజారా హిల్స్ లో నేత్రం విభాగం లో  సూపర్ స్పెషలిటీ సేవలు అందిస్తున్న High Sight Eye hospital తో మన బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం OP లో 50 %,కేటరాక్ట్ ఆపరేషన్ లో 10 %, కంటి పరీక్షలలో 30% ,అడ్మిట్ అయినవారికి ఉచితంగా రూమ్ ఏర్పాటు చేయడం వంటి రాయితీలు ఉంటాయి. దయచేసి బ్రాహ్మణ బంధు మిత్రులందరూ ఈ సేవలను అందుకోవచ్చు. 

హాస్పిటల్  మేనేజింగ్  డైరెక్టర్ డాక్టర్ చదలవాడ ఉష  గారికి ,మేనేజర్ శ్రీ రాంబాబు గారికి , ఈ ఒప్పందం కోసం కృషి చేసిన శ్రీ టిడివి  ప్రసాద్ గారికి,శ్రీ  సుబ్బారావు గారికి  బ్రాహ్మణ సంక్షేమ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. 
 
ధన్యవాదాలు
బాలశ్రీనివాసులు
వ్యవస్థాపక కార్యదర్శి
బ్రాహ్మణ సంక్షేమ వేదిక
9059550280

నయంచేసే హోమియోపతీ

 సూదులెట్టి పొడిచి సరసరా కోసినా 

ఆంగ్ల వైద్యమేర అధికమనును 

ఐసియూల్లొ జేరి ఐసులే అవుతారు

సకురు అప్పారావు సత్య మిదిర!


భావం:  తియ్యటి బిళ్ళలతో, తియ్యగా, హాయిగా నయంచేసే హోమియోపతీ లాంటి వైద్యాలున్నా కూడా, మనవాళ్ళకు సూదుల్తో పొడిచి, కత్తులతో కోసి ఆపరేషన్ల పేరుతో హింసించినా, పరపరా కోసి పారేసినా అలోపతీ వైద్యమే మెరుగైన వైద్యమని ప్రగాఢ విశ్వాసం. దాని బారినపడి,  ఐసీయూల్లో చేరి ఐసు పుల్లల్లా కరిగిపోయి, వాళ్ళ ఆస్తులన్నీ కరిగించుకోవడానికైనా, ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమే! ఎందుకంటే అది మాత్రమే నిజమైన వైద్యమనీ, మిగిలినవన్నీ వృధాఅనీ వాళ్ళ నమ్మకం!  సకురు అప్పారావు చెప్పేది నిజం!


సకురు అప్పారావు గారు

శతక కవి: హోమియో వైద్యులు

9848025870

🙏🙏🙏