29, జనవరి 2023, ఆదివారం

శ్లోకం

: శ్లోకం:☝️

*నిన్దన్తు నీతినిపుణా యది వా స్తువన్తు*

*లక్ష్మీః స్థిరా భవతు గచ్ఛతు వా యథేష్టం l*

*అద్యైవ వా మరణమస్తు యుగాన్తరే వా*

*న్యాయాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః ॥*


భావం: నీతి నిపుణులు విమర్శించినా లేక ప్రశంసించినా, ధనం స్ధిరంగా ఉన్నా లేకపోయినా, మరణం ఈ రోజు వచ్చినా లేక యుగాంతంలో సంభవించినా, ధీరులు న్యాయమార్గం నుండి ఎన్నడూ వెనక్కి తగ్గరు.

: *కాశీ ఖండం - 11*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 *నైరుతి, వరుణ లోక వర్ణన* 


 శివశర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని, విష్ణు దూతలను కోరగా, వివరిస్తున్నారు. 


 మొదటిది నైరుతి. పుణ్యవతి పుణ్య జనులకు ఆవాసం.

వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు. దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా, ఈ లోకంలభిస్తుంది, అని, పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు

                                               *పింగాక్షోపాఖ్యానం*  


 వింధ్యాటవిలో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు. మంచి శూరుడు. క్రూరకర్మలంటే అయిష్టం. నిర్దాక్షిణ్యంగా జంతువులను, మనుష్యులను చంపే వారిని, కఠినంగా శిక్షించేవాడు. అడవిలో ప్రయాణించే వారిని, వెంట ఉండి దాటిస్తాడు. 


 ఒకసారి ఇతని బంధువు, ప్రయాణీకులను హింసించాడని విన్నాడు. రహస్యంగా వచ్చి, వాడిని పట్టుకొన్నాడు. ఇతరులకు అపకారం చేయవద్దని హెచ్చరించాడు. వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి, గౌరవంగా సాగనంపాడు. ఇంకోసారి మరో బృందం వస్తుంటే, కొందర్ని, వాళ్ళను చంపమని, దోచుకోమనీ, హెచ్చరికలు వచ్చాయి. అప్పుడు వారంతా, తాము పింగాక్షుడున్నాడనే ధైర్యంతో వచ్చామని, కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని, ప్రాణాలను రక్షించమని, యాత్రికులు వేడుకొన్నారు. ఈ మాటలను విన్న పింగాక్షుడు, వారిని భయపడవద్దని అనునయిస్తూ, ఆ చోటుకు చేరుకొన్నాడు. ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి, తన అనుచరగణంతో, పింగాక్షుడిని చంపమని ఆదేశించాడు. ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది. శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి, బంధించాడు. కాని అతని ధనుస్సు, బాణాలు, ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులు అవటంతో, వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు.  


 నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి, పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి, నైరుతి దిక్కుకు, ప్రభువును చేశారు

                                                  *వరుణ లోక వర్ణన*


 అక్కడి నుండి విష్ణుశర్మను వరుణ లోకానికి, విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు. ప్రజలకోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు, వరుణ లోకానికి వస్తారు. ఐశ్వర్య సంపన్నం. దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించేవారు, ఈ లోకం చేరుతారు. వేసవిలో విసనకర్రలను దానం చేసినవారు, సుగంధపు చల్లని పానీయాలిచ్చే వారు, చలివేంద్రాలను ఏర్పాటుచేసేవారు, వరుణలోకానికి చేరతారు. జలదారా మండపాలను, నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి ఇది నెలవు. పుణ్యనదులలో స్నానం చేయటానికి వీలుగా, మెట్ల నిర్మాణం చేసే వారికి, వరుణలోకం ఆవాస భూమి. అన్ని జలాశయాలకు వరుణుడు అదిపతి. అన్ని సముద్రాలకు నీటిని, ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా


 *వరుణుని జన్మ వృత్తాంతం*


 కర్దమ ప్రజాపతికి 

శుచిష్మoతుడనే కుమారుడు ఉన్నాడు. వినయ శీలి. సుగుణవంతుడు. ధైర్య శాలి. ఒకరోజు ఇతడు కొందరు బాలురతో కలిసి, ఒక సరస్సులో, స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగగానే, అతడిని, ఒక మొసలి 

 పట్టుకుంది. ఈ విషయాన్ని, స్నేహితులు, తండ్రికి తెలియజేశారు. 


 ఆయన, అప్పుడు, శివధ్యానంలో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల, ఒక సరస్సులో, కొంతమంది మునిబాలురు జలక్రీడలాడటం, కనిపించింది. అందులో రుద్రరూపుడైన, ఒక ముని బాలుడు, ‘’ఓయి సముద్రాధిపా !భక్తుడైన కర్దమ ప్రజాపతి కుమారుడెక్కడ ఉన్నాడు? శివుని సామర్ధ్యం తెలియకుండా, దుష్క్రుత్యానికి పాలుపడ్డావు.‘’ అని గర్జించాడు.  


 సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశుమారకమైన మొసలిని కూడా బంధించి తెచ్చి, శివుని పాదాల చెంత పడేసాడు. శివుని పాదాలకు నమస్కరించి, ‘’మహాశివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువు వల్లనే, శిశువుకు మరణం సంభవించింది .’’ అని, విన్న వించుకొన్నారు. అప్పుడు శివుడు మన్నించి, ఆ బాలుని తండ్రి, కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి, అప్పగించమని, ప్రమధగణాలకు చెప్పాడు. 


 తండ్రి కుమారుని చూచి, సంతోషంతో కౌగలించుకొని, యోగాక్షేమాలను విచారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా, తండ్రికి తెలియ జేశాడు. తండ్రి అనుమతి గ్రహించి, బాలుడు, కాశీలో శివలింగాన్ని ప్రతిష్టించి, అయిదు వేల సంవత్సరాలు శిలలాగా నిశ్చలంగా శివుని కోసం, తపస్సు చేశాడు.

మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. తనకు జలాలపై ఆధిపత్యం కావాలని, బాలుడు విన్నవించాడు. 


 అప్పుడు భవానీపతి ‘’నువ్వు, వాపీ, కూప, తటాకాది నదీనదాలకు సమస్త జలాలకు 

అధిపతివి అవుతావు. సమస్త రత్నాలకు అధిపతివి నీవే. పశ్చిమదిక్కునకు అధిపత్యం నీదే. పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు. నువ్వు స్థాపించిన ఈ లింగం ‘’వరుణేశ్వర లింగం‘’ గా ప్రసిద్ధి చెందుతుంది. మణికర్నేశ్వరలింగం నైరుతి దిశలో, సంస్తాపితమై ఉంటుంది. దీనిని అర్చించిన వారికి, అకాలమరణం రాదు. నీరసాలైన అన్నపానాదులు వరుణుని అనుగ్రహంతో సరసములుగా మారుతాయి." అని వరమిచ్చి, అంతర్ధాన మయ్యాడు . 


 శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు, నైరుతి దిశకు అధిపతి అయాడు.


 *కాశీఖండం సశేషం..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🅰️🅿️SRINU*

: *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - jan 28._*


 **స్వామి వివేకానంద స్ఫూర్తి* ..*రోజుకో సూక్తి - జనవరి 28* 

 

*దీరులై ఉండండి,* 

*ఆత్మస్థైర్యంతో పని చెయ్యండి,*

*మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే*,*

*పిరికిపందలు ఆత్మస్థైర్యం లేనివారు రోజు మరణిస్తారు* .


बने रहें,

आत्मविश्वास से काम लें,

इंसान सिर्फ एक बार मरता है*,*

बिना संयम के कायर रोज मरते हैं।


stay tuned,

Work with confidence,

Man dies only once*,*

Cowards die every day without self-control.


 __1901 సంవత్సరం మార్చి31వ తేదీన స్వామి వివేకానంద టాక పర్యటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనము పుట్టిన హిందూ మతం సనాతన ధర్మము గురించి_ .. _ఆ సమయంలో ఇచ్చిన ఉపన్యాసం._ 


 *అంశం* : *మనము పుట్టిన* *హిందూ మతం గురించి* ...


 – *స్వామి వివేకానంద*.


🙏*శుభోదయం*🙏


       ***************

🌷మహానీయుని మాట🌷

       ****************


"మనిషిగా జన్మించినoదుకు మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి అని చూడాలి.

ఎదుగుతున్న వారికి ప్రోత్సహించి చేయూతనివ్వాలి.

అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది."


       *************

💎నేటి మంచి మాట💎

       *************


"మనకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకూడదు.

మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు."


 ❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌺 అమృతం గమయ 🌺


*అమృత మనసు*

  

జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది. వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి.


శ్రద్ధగా రాస్తే చేతివ్రాతే మారినపుడు, శ్రమిస్తే తలరాతలు మారవా.

       

మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


నీవు ముళ్ళ మధ్యలో వున్నా అందంగా ఎలా వుండాలో గులాబీని చూసి, బురదలో వున్నా పవిత్రంగా ఎలా వుండాలో తామర పువ్వును చూసి నేర్చుకో. 


ఎందుకంటే, ఎన్ని కష్టాలు, సమస్యలున్నా, వాటిని మనోబలంతో ఎదుర్కొంటూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం పంచడమే ఆనందం. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నవ్వుకుంటారు. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. 


రూపాయి అయినా, రూపం అయినా ఎక్కువ రోజులుండవు. 


కానీ, నీ యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 


 ప్రశాంతంగా ఉండు.

*మాఘ పురాణం - 8 వ అధ్యాయము*

*29-01-2023 ఆదివారం*


🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


దత్తత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*🅰️🅿️SRINU*

హిందువు కావడానికి

 హిందువు కావడానికి

హిందువుగా బ్రతకాడానికి 101 కారణాలు


1. నేను హిందువుని, ఎందుకంటే భగవంతుడిని గ్రహించడం జీవిత గమ్యం అని నాకు చెబుతుంది.

2. హిందూ ధర్మం నేనే ఆత్మ అని నేర్పుతున్నాను, శరీరం కాదు అని చెప్తుంది.

3. హిందూ ధర్మం నాకు నచ్చిన ఏ పేరు లోనో మరియు ఏ రూపంలోనైనా దేవుణ్ణి ఆరాధించడానికి సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తుంది.

4. హిందూ ధర్మం, దేవుడు బయట మాత్రమే కాదు, నాలో కూడా ఉన్నాడు అని చెప్తుంది.

5. సత్యం మాత్రమే విజయం సాధిస్తుందని హిందూ ధర్మం బోధిస్తుంది.

6. సాధువులు మరియు ఋషులు దేవుని ప్రేమ మరియు దయకు జీవన రుజువులు.

7. నిస్వార్థ సేవ అత్యున్నత కర్తవ్యం అని హిందూ ధర్మం బోధిస్తుంది.

8. నా స్వంత నిజమైన ఆత్మ తత్వాన్ని కనుగొనటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.

9. హిందూ ధర్మం మనలో ఇప్పటికే ఉన్న దైవత్వం యొక్క అభివ్యక్తిగా భావిస్తుంది.

10.శరీరం యొక్క అశాశ్వతతను చూడటానికి హిందూ ధర్మం నాకు సహాయపడుతుంది.

11. హిందూ ధర్మం నాకు అనువైన విధంగా దేవుణ్ణి పూజించే స్వేచ్ఛను ఇస్తుంది.

12. సర్వజ్ఞుడైన భగవంతుడిని చేరుకోవడానికి ఒక్క మార్గం మాత్రమే లేదని హిందూ ధర్మం అంగీకరించింది.

13. జీవితంలోని వివిధ దశలను జరుపుకోవడానికి హిందూ ధర్మం నాకు మార్గనిర్దేశం చేస్తుంది.

14. హిందూ ఋషులు మరియు భక్తుల కథలు చదవడం నాలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది.

15. హిందూ ధర్మం ఆలోచన మరియు హేతుబద్ధీకరణను ప్రోత్సహిస్తుంది.

16. హిందూ పండుగలు అందరికీ ఆనందకరమైన కార్యకలాపాలను అందిస్తాయి.

17. హిందూ ధర్మం ఆరోగ్యకరమైన సాధారణ ఆహారాన్ని ప్రోత్సహిస్తుంది.

18. నేర్చుకున్నవారిని, జ్ఞానులను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

19. ప్రాచీన హిందూ దేవాలయాలు నా పూర్వీకుల విస్మయం మరియు ఆశ్చర్యాన్ని చూపిస్తాయి.

20. దేవుని సృష్టిని సేవించడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.

21. శరీరం మరియు మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి యోగా సహాయపడుతుంది.

22. ధ్యానం మనస్సును శాంతపరుస్తుంది మరియు అంతర్గత శాంతిని ఇస్తుంది.

23. నా శరీరంపై పూర్తి నియంత్రణ సాధించడానికి యోగాసనాలు నాకు సహాయపడతాయి.

24. వేద మంత్రాల శ్లోకం అంతర్గతంగా మరియు బాహ్యంగా సానుకూల ప్రకంపనలను సృష్టిస్తుంది.

25. హిందూ ధర్మం చిన్నది లేదా పెద్దది అనే తేడా లేకుండా జీవులను మన స్వంతంగా సేవ చేయడానికి బోధిస్తుంది.

26. అన్ని జీవులలో మానవులే గొప్పవారని హిందూ ధర్మం చూపిస్తుంది.

27. ఏ పని లౌకిక కాదు కానీ ప్రతి పని ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావచ్చు.

28. జయించడం అంటే త్యజించడం.

29. అత్యధిక లాభం స్వీయ నియంత్రణ సాధించడం.

30. హిందూ ధర్మం ఎవరిపైనా దేనినీ బలవంతం చేయదు.

31. అన్ని మతాలను గౌరవించమని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

32. హిందూ ధర్మం ఏ పాపిని శాశ్వతంగా ఖండించదని భరోసా ఇస్తుంది.

33. నేను ఎల్లప్పుడూ నన్ను సంస్కరించుకుంటాను మరియు పరిపూర్ణతను సాధించగలనని హిందూ ధర్మం నాకు ఆశను ఇస్తుంది.

34. హిందూ ధర్మం నా శరీరానికి, మనసుకు వివిధ విభాగాలను అందిస్తుంది.

35. నా జీవితానికి నేను బాధ్యత వహిస్తానని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.

36. నేను ఎప్పుడూ స్వచ్ఛమైన, ఎప్పుడూ స్వేచ్ఛగా, ఎప్పటికి పరిపూర్ణమైన ఆత్మ అని హిందూ ధర్మం నొక్కి చెబుతుంది.

37. నా కోసం సత్యాన్ని కనుగొనడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.

38. భౌతిక విషయాలలో కూడా దేవుని ఉనికిని అనుభూతి చెందడానికి హిందూ ధర్మం నన్ను అనుమతిస్తుంది.

39. నా మొదటి దేవుడు నా తల్లి అని హిందూ ధర్మం చూపిస్తుంది.

40. గురువును గౌరవించకుండా జ్ఞానం పొందలేరని హిందూ ధర్మం చూపిస్తుంది.

41. పవిత్రమైనా, లౌకికమైనా ప్రతి జ్ఞానం దేవుని నుండే వచ్చిందని హిందూ ధర్మం బోధిస్తుంది.

42. ప్రతి ఒక్కరిలో దేవుడు అంతర్గత మార్గదర్శి అని హిందూ ధర్మం బోధిస్తుంది.

43. ప్రతి స్త్రీ దేవుని శక్తి యొక్క స్వరూపం అని హిందూ ధర్మం బోధిస్తుంది.

44. ఆత్మకు లింగం, జాతి, కులం లేదని హిందూ ధర్మం బోధిస్తుంది.

45. సంపూర్ణంగా మరియు నిస్వార్థంగా చేసిన ప్రతి పని నన్ను పరిపూర్ణంగా చేస్తుంది.

46. ​​నేను నృత్యం ద్వారా భగవంతుడిని చేరుకోగలను.

47. నేను సంగీతం ద్వారా దేవుణ్ణి కనుగొనగలను.

48. నేను కళల ద్వారా దేవుణ్ణి కోరుకుంటాను.

49. మంచి ఎప్పుడూ చెడుపై విజయం సాధిస్తుందని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

50. హిందూ ధర్మం నన్ను దేవుడికి భయపడమని చెప్పదు కాని దేవుణ్ణి ప్రేమించమని చెప్తుంది

51. దేవుడు నా స్నేహితుడు.

52. దేవుడు నా గురువు.

53. దేవుడు నా తల్లి.

54. దేవుడు నా తండ్రి.

55. దేవుడు నా ప్రేమికుడు.

56. దేవుడు నన్ను భరించేవాడు

57. దేవుడు నా బిడ్డలో,నాలో కూడా ఉన్నాడు.

58. దేవుడు ప్రతిదానిలో స్వచ్ఛమైనవాడిగా మరియు అందమైనవాడుగా ఉన్నాడు.

59. దేవుడు కూడా దు దుఃఖమైన స్థితిలో ఉన్నాడు అని చూపించాడు.

60. దేవుడు అంతర్గత నియంత్రిక.

61. దేవుని చిత్తం లేకుండా ఏమీ జరగదు.

62. నేను పరిపూర్ణత సాధించే వరకు జీవితం పుట్టుక మరియు మరణాల పరంపర అని హిందూ ధర్మం బోధిస్తుంది.

63. నా స్వంత సామర్థ్యం ప్రకారం ఉపవాసం మరియు జాగరూకత పాటించటానికి నాకు స్వేచ్ఛ ఉంది.

64. నా మనస్సును భక్తి మరియు స్వచ్ఛతను పెంపొందించడానికి మాంసం మానుకోవాలని హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.

65. భగవంతుడిని ప్రేమించటానికి వినయంగా ఉండటానికి హిందూ ధర్మం నన్ను ప్రోత్సహిస్తుంది.

66. ప్రపంచం మొత్తాన్ని ఒకే కుటుంబంగా చూడమని హిందూ ధర్మం నాకు చెప్తుంది.

67. హిందూ ధర్మం నాకు అహింస మరియు ఇతరులకు గాయపడకుండా ఉండటానికి నేర్పుతుంది.

68. బలహీనులకు, ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడానికి హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

69. దేవుని అనుగ్రహం ద్వారా పాపులను కూడా శుద్ధి చేయవచ్చని హిందూ ధర్మం చూపిస్తుంది.

70. హిందూ ధర్మం నమ్మటంలో కాదు, ఉండటం మరియు మారడం.

71. దేవుడు ప్రతిదీ మరియు ప్రేమతో ఇచ్చిన దేన్నీ అంగీకరిస్తున్నాడని హిందూ ధర్మం చూపిస్తుంది.

72. అధర్మం నుండి ధర్మాన్ని రక్షించమని భగవద్గీతలో దేవుడే స్వయంగా చెప్పాడు.

72. ధర్మం యొక్క మార్గాన్ని చూపించడానికి దేవుడు భూమిపై అవతరించాడని హిందూ ధర్మం చూపిస్తుంది.

73. నన్ను పాపిగా భావించడం దైవదూషణ అని హిందూ ధర్మం చూపిస్తుంది.

74. ప్రతి చర్యకు దాని ప్రతిచర్య ఉందని హిందూ ధర్మం బోధిస్తుంది.

75. ప్రార్థనలు మరియు దేవుని పేరును పునరావృతం చేయడం ద్వారా కర్మను మార్చవచ్చు.

76. పవిత్ర ప్రజలకు, మంచి భక్తులకు సేవ చేయడం ద్వారా నేను దేవునికి సేవ చేయగలను.

77. కర్మ సిద్ధాంతం నేను నా స్వంత విధి యొక్క సృష్టికర్త అని చూపిస్తుంది.

78. వేదాలు నిర్భయతపై బోధిస్తాయి.

79. భగవద్గీత స్వీయ ప్రేరణపై ఉత్తమ మాన్యువల్.

80. పురాణాలు సరళమైన కథలలో గొప్ప సత్యాలను ఇస్తాయి.

81. రామాయణం ఎలా జీవించాలో నాకు చూపిస్తుంది.

82. శ్రీమద్ భాగవతం ఎలా చనిపోవాలో నాకు నిర్దేశిస్తుంది.

83. జీవితంలో కష్టాలను ఎలా ఓడించాలో మహాభారతం నాకు చూపిస్తుంది.

84. ఉపనిషత్తులు నా నిజమైన ఆత్మ గురించి అత్యున్నత సత్యాన్ని నాకు నిర్దేశిస్తాయి.

85. భగవంతుడిని వివిధ మార్గాల్లో ఎలా ఆరాధించాలో అగమాలు నిర్దేశిస్తుంది.

85. ఇతిహాసాలు మరియు పురాణాలు సృజనాత్మకతను పెంపొందించడానికి సహాయపడతాయి.

86. ఇతరులను గాయపరచడం నా స్వయాన్ని గాయపరచడమే అని హిందూ ధర్మం బోధిస్తుంది.

87. నేను మరొకరి స్వాధీనంలో ఉండకూడదని హిందూ ధర్మం బోధిస్తుంది.

88. నా పెద్దలను గౌరవంగా చూడాలని హిందూ ధర్మం నాకు బోధిస్తుంది.

89. హిందూ ధర్మం నాకు జీవితంలోని వివిధ దశలలో వేర్వేరు విధులను నిర్దేశిస్తుంది.

90. ఇతరుల కోసమే స్వార్థాన్ని వదులుకోవడాన్ని హిందూ ధర్మం ప్రశంసించింది.

91. శరీరాన్ని, మనస్సును శుద్ధి చేసే ధర్మ

కర్మగా వివాహాన్ని హిందూ మతం సూచిస్తుంది.

92. హిందూ ధర్మం మరణాన్ని పాత వస్త్రం యొక్క మార్పుతో పోలుస్తుంది.

93. మంచి చర్యలు చేయడం ద్వారా నేను దేవుణ్ణి ఆరాధించగలను.

94. హృదయంలో స్వచ్ఛమైన వారు భగవంతుడిని చూడగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.

95. గొప్ప ప్రయత్నం ద్వారా ఎవరైనా గొప్పతనాన్ని సాధించగలరని హిందూ ధర్మం చూపిస్తుంది.

96. హిందూ ధర్మం ప్రతి ఒక్కరూ - పురుషుడు, స్త్రీ, బిడ్డ మరియు వృద్ధులు గొప్ప సాధువులు మరియు ఋషులు కావచ్చు.

97. హిందూ ధర్మం శిక్షించేది దేవుడే కాదు, మన స్వంత కర్మ అని చూపిస్తుంది.

98. భగవంతుని ప్రేమికులు ఏ జాతికి, కులానికి చెందినవారు కాదని హిందూ ధర్మం చూపిస్తుంది.

99. హిందూ ధర్మం సహనాన్ని మాత్రమే కాకుండా సార్వత్రిక అంగీకారాన్ని బోధిస్తుంది.

100. హిందూ ధర్మం వైవిధ్యంలో ఐక్యతను చూస్తుంది.

101. హిందూ ధర్మం అన్ని మతాలకు తల్లి...

.

హనుమత్కుండం

 #హనుమత్కుండం / హనుమ కుండము:


దక్షిణ మహాసముద్రం తీరంలో రామేశ్వర మహాక్షేత్రంలోని ‘’హనుమత్కుండం" గురించి పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించి చెప్పాడు.


స్కంద పురాణంలో బ్రహ్మఖండంలో రామేశ్వర క్షేత్రంలో 24 తీర్ధాలు ఉన్నట్లు వర్ణించబడింది. అవి 

▫️చక్ర తీర్ధం, 

▫️భేతాళ వరద తీర్ధం, 

▫️పాప వినాశనం, 

▫️సీతా సరస్సు, 

▫️మంగళ తీర్ధం,

▫️అమృత వాపిక, 

▫️బ్రహ్మ కుండము,  

▫️హనుమత్కుండం, 

▫️అగస్త్య తీర్ధం, 

▫️రామ తీర్ధం, 

▫️లక్ష్మణ తీర్ధం, 

▫️జటా తీర్ధం, 

▫️లక్ష్మీ తీర్ధం, 

▫️అగ్ని తీర్ధం, 

▫️శివ తీర్ధం, 

▫️శంఖ తీర్ధం, 

▫️యమునా తీర్ధం, 

▫️గంగా తీర్ధం, 

▫️గయా తీర్ధం, 

▫️కోటి తీర్ధం, 

▫️స్వాధ్యామ్రుత తీర్ధం, 

▫️సర్వ తీర్ధం, 

▫️ధనుష్కోటి తీర్ధం, 

▫️మానస తీర్ధం.


రావణాసురుని చంపిన బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడు అవటానికి శ్రీరాముడు శివలింగ ప్రతిష్టాపనను రామేశ్వరంలో చేయ సంకల్పించాడు. సముద్రానికి ఇవతలి ఒడ్డు అయిన ‘’పుల్ల‘’ గ్రామానికి దగ్గరలో, సేతువుకు సమీపంలో, గంధమాదన పర్వత పాదం వద్ద ఈ లింగాన్ని ప్రతిష్టించాలని రామ సంకల్పం. హనుమంతుని కైలాసం వెళ్లి శివుని అనుగ్రహంతో లింగాన్ని తెమ్మని రాముడు పంపాడు. ముహూర్త విషయాన్ని కూడా తెలిపి, ఆ సమయం లోపలే తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు.


హనుమంతుని రాక ఆలస్యమై ముహూర్తం మించిపోతుండగా, మహర్షుల అనుమతితో సీతాదేవి ఇసుకతో లింగాన్ని చేస్తే, సరిగ్గా ముహూర్త సమయానికి దాన్ని ప్రతిష్టించాడు శ్రీ రామచంద్రుడు. ఆ లింగానికి అభిషేకం జరిపి, పూజ కూడా చేసేశాడు. 


మారుతి శివలింగాన్ని తీసుకొని వచ్చాడు. విషయము తెలిసి బాధపడి తాను తెచ్చిన లింగాన్ని ఏమి చేయాలని రామున్ని ప్రశ్నించాడు. దానికి ఆయన వేరొక చోట ప్రతిష్టించమని చెప్పాడు. హనుమకు కోపం వచ్చి ‘’రామా ! నన్ను అవమానిస్తావా ? సైకత లింగాన్ని ప్రతిష్టించాలి అని అనుకొన్నప్పుడు నన్నెందుకు కైలాసం పంపావు ? ఇంకో చోట ప్రతిష్ట చేయటానికోసమా నేను అంత దూరం వెళ్లి తెచ్చింది ? నాకీ జీవితం వద్దు. నా శరీరాన్ని సముద్రుడికి త్యాగం చేస్తాను‘’ అని దూకబోతుండగా రాముడు వారించాడు ‘’అన్నా హనుమన్నా ! మనిషి తను చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తాడు. ఆత్మను చూడు. దుఖం పొందటం వివేకికి తగని పని దోషాన్ని వదిలి మంచిని గ్రహించు. నువ్వు తెచ్చిన లింగాన్ని వేరే చోట స్తాపిద్దాం. ఈ రెండు లింగాలను దర్శించినా, స్మరించినా, పూజించినా పునర్జన్మ ఉండదు. భక్తులు ముందుగా నువ్వు తెచ్చిన శివలింగాన్ని పూజించి, ఆ తర్వాతే ఇసుక లింగాన్ని పూజిస్తారు. అలా కాకపోతే ఈ సైకత లింగాన్ని పీకేసి సముద్రంలో విసిరెయ్యి‘’ అన్నాడు.


అప్పుడు హనుమ తన తోకను ఇసుక లింగం చుట్టూ బిగించి పెకలించటానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఇసుమంత కూడా కదలలేదు. మళ్ళీ ప్రయత్నం చేసి వీలుగాక నెత్తురు కక్కుకొంటు దూరంగా పడిపోయాడు. పడిన చోట హనుమ ముక్కులు, చెవుల, నోటి నుండి విపరీతంగా రక్తంకారి ఒక సరస్సుగా మారింది. హనుమ స్పృహ కోల్పోయాడు. అప్పుడు రాముడు మారుతి పడి ఉన్న ప్రదేశానికి వెళ్లి, అతని శిరస్సును తన ఒడిలో పెట్టుకొని సేద తీర్చాడు. అతన్ని ఆదరంగా పిలుస్తూ లేవమని కన్నీరు మున్నీరు కార్చాడు దయా సముద్రుడు రామ చంద్రుడు.


కొంత సేపటికి హనుమంతునికి తెలివి వచ్చింది. అప్పుడు హనుమ తెచ్చిన విశ్వేశ్వర లింగాన్ని సీతారాములు ప్రతిష్టించారు. హనుమ పడిన ప్రదేశం అంతా రక్తపు మడుగైంది. అదే ‘’హనుమత్కుండం‘’.


ఇది రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉంది. దీనిలో స్నానం చేస్తే అన్ని పాపాలు నశిస్తాయని రాముడు ప్రకటించాడు. పితృదేవతలకు ఇక్కడ పిండ ప్రదానం చేస్తే స్వర్గానికి వెళ్తారని సీతారాములు అనుగ్రహించారు.

మాఘ పురాణం* *7 వ అధ్యాయము*

 *మాఘ పురాణం*

*7 వ అధ్యాయము*

*28-01-2023 శనివారం*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


*లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము*


వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది , కాని , అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని , దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి , వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు. ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను , ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి , *"తల్లీ ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది , ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను , సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెదను"* అని బ్రతిమలాడెను.


తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి , అందొక తుంగచాపవేసి , కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె  దయార్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి , *"ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా ! ఆ మాఘస్నానమేమి ?* *సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది"* అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని , *"అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు , ఈ మాఘమాసములో నది యందు గాని , తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను , పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను , తరువాత మాఘపురాణము పఠించవలెను.* ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన , దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. *ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ , వృద్దులూ , రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని , ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు , పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను"* అని చెప్పగా , ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.


అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి , వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి *"ఓసీ వెర్రిదానా ! ఎవరు చెప్పినారే నీకీ సంగతి ? మాఘమాసమేమిటి ? స్నానమేమిటి ? వ్రతము , దానములేమిటి ? నీకేమైనా పిచ్చి పట్టినదా ? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా ? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి , పూజలుచేసి , దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి , నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త ! వెళ్ళి పడుకో"*, అని కోపంగా కసిరాడు.


ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి , మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా , ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.


కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.


*"ఓ యమభటులారా ! ఏమిటీ అన్యాయము ? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి ? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి ? ఇద్దరమూ సమానమేగదా"* అని వారి నుద్దేశించి అడుగగా , ఓ అమ్మా ! నీవు మాఘమాసములో ఒక దినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ , నీ భర్త అనేకులను హింసించి , అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.


ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. *"నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా ! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను ?"* అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి , యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని , ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా , ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా , బంగారుశెట్టిని పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతోషమందిరి. రాజా ! వింటివా ! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా ! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుటలో సందేహములేదు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🅰️🅿️SRINU*

అహంకారం వదిలితే

 అహంకారం వదిలితే సర్వం బ్రహ్మ మయం


మనలో అహంకారం నశించినప్పుడు భగవంతుడు మనవాడు అవుతాడు. నేను, నాది, నా అనే అర్థాలకు వాడు, వాడిది, వాడే అనే భావాన్ని జోప్పించాలి. భగవంతుడు తప్ప అన్యం ఏదీ లేదు అనే సత్యానికి మనం దగ్గర కావాలి. ‘సత్య నిష్ఠయే ఈ కలియుగానికి తరుణోపాయం. సత్యం అన్నది సత్ కు సంబంధించినటువంటిది. సత్ పరబ్రహ్మ వస్తువు. సత్ యే ఆనందం. ఆనందమే బ్రహ్మం.

ఒక వ్యక్తి తన స్వగ్రామం నుంచి కాలి బాటలో మరొక గ్రామానికి పని నిమిత్తం వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో చీకటి పడిన కారణంగా దారి తప్పి దురదృష్టవశాత్తూ ఒక పాడుబడిన బావిలో పడ్డాడు. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ అతని చేతికి చెట్టుకొమ్మ ఒకటి దొరికింది. ఆ చెట్టుకొమ్మను పట్టుకు వ్రేలాడుతూ పైకి రావడానికి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యపడక అలాగే వ్రేలాడుతూ ఉండిపోయాడు. ఉదయం వెలుతురు వచ్చిన వెంటనే బావిలో సగం లోతులో వ్రేలాడుతున్న అతను క్రిందకు చూసినప్పుడు పెద్ద పెద్ద బండ రాళ్ళు కనపడ్డాయి. వాటిని చూసి, ‘ఆహా! ఏమి నా అదృష్టం ఈ కొమ్మ దొరికి ఉండకపోతే ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాణ్ణి’ అని అనుకోని భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేశాడు.

ఆపదనుండి బయట పడడానికి ఇంకొకరి సహాయం కోసం ఎంత అరిచినా ఎవరూ రాలేదు. అరిచి అరిచి సొమ్మసిల్లిన అతను వీళ్ళనూ వాళ్ళనూ పిలిచి ప్రయోజనం ఏమిటి భగవంతుణ్ణే పిలుస్తాను అని అనుకొని పిలవడం మొదలెట్టాడు, అంతలో ఒక వ్యక్తి వచ్చి నేను భగవంతుణ్ణి నీవు పిలిచావు కాబట్టి వచ్చాను’ అన్నాడు.

‘అవును, నువ్వు నిజంగా భగవంతుడివే! ఆలస్యం చేయక నన్ను పైకి లాగి కాపాడు’ అని బావిలోకి వ్యక్తి వేడుకున్నాడు. ‘నిన్ను కాపాడడానికి వచ్చాను. అయితే దానికి ముందు నేను వేసే కొన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పవలసి ఉంటుంది’ అన్నాడు. ‘అడగవలసింది ఏమిటో త్వరగా అడుగు’ అన్నాడు లోపలి వ్యక్తి.

నన్ను నిజంగా భగవంతుణ్ణి అని నీవు విశ్వసిస్తున్నావా?’

దానికి బదులుగా బావిలోని వ్యక్తి, ‘విశ్వసిస్తున్నాను, నీవు నిజంగా భగవంతుడివే’ అన్నాడు.

‘నిన్ను కాపాడడం నా వల్ల సాధ్యమవుతుందని నీవు నిజంగా నమ్ముతున్నావా?”

‘నమ్ముతున్నాను’ అన్నాడు.

‘నేను ఏది చెప్పినా చేస్తావా?”

‘కచ్చితంగా చేస్తాను, నా ప్రాణమైనా ఇస్తాను’ అన్నాడు.

‘అలా అయితే నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. నువ్వు ఏ కొమ్మనైతే పట్టుకొని ఉన్నావో, దాన్ని వదిలేయి. నేను నిన్ను కాపాడతాను’ అన్నాడు భగవంతుడు

బావి లోపలి వ్యక్తి బయటి వ్యక్తిని చూసి, ఆయన చేతిలో ఏవిధమైన తాడు కానీ, నిచ్చిన కానీ, మరే విధమైన పరికరం కానీ లేకపోవడంతో సందిగ్ధంలో పడ్డాడు. కొమ్మను వదిలితే భగవంతుడు రక్షించడం మాట అటుంచి, ముందు కిందనున్న బండరాళ్ళ మీద పది, తల పగిలి చస్తానని అనుకున్నాడు.

‘ఇది చాలా కఠినమైన షరతు. కొమ్మను వదలడం తప్ప, నువ్వు ఏం చెప్పినా చేస్తాను’ అన్నాడు బావిలోని వ్యక్తి.

‘నువ్వు ఏమీ చేయనక్కరలేదు. కొమ్మను వదిలితే చాలు’ అన్నాడు భగవంతుడు.

సరిగ్గా ఇదే రీతిగా మనం కూడా అహంకారమనే కొమ్మను పట్టుకొని వ్రేలాడుతున్నాం. ఎప్పుడైతే మనం ఆ అహంకారాన్ని వదులుకుంటామో అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని కాపాడతాడు. కాబట్టి, మనమందరం అహంకార శూన్యులుగా మారాలి.

సద్బోధన

 *సద్బోధన*

            ➖➖➖


*భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం.*


*మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి..!* 


*అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, ఆయన మనకు మంచినే యిస్తాడు.*


*ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...*

                       

         *లోకాః సమస్తాః సుఖినోభవన్తు!*

భీష్మాష్టమి

 🕉️👉 *భీష్మాష్టమి*👈🕉️


*గురుబోధ*

ఈరోజు సంతానార్థులైన వారు భీష్మోద్దేశ్యముగా శ్రాద్ధము ఆచరించవలెను. భీష్మ తర్పణం, అర్ఘ్యం మాత్రము(తల్లి తండ్రులు ఉన్నవారు కూడా) అందరూ చేయవలసినదే. 


వైయాఘ్ర పదగోత్రాయ ౹ సాంకృత్య ప్రవరాయచ ౹౹

గంగాపుత్రాయ భీష్మాయ ౹ ఆజన్మ బ్రహ్మచారిణే౹౹

అపుత్రాయ జలంధద్మి ౹ నమో భీష్మవర్మణే ౹౹

భీష్మశ్శాంతనవో వీరః ౹ సత్యవాదీ జితేంద్రియః ౹౹

అభిరద్భి రవాప్నోతు ౹ పుత్ర పౌత్రోచితాంక్రియామ్ ౹౹


తర్పణ క్రమః


1. వైయాఘ్రపద గోత్రం సాంకృత్య ప్రవరం గంగాపుత్రం భీష్మ వర్మాణం

   తర్పయామి -  3 సార్లు

2. ఆజన్మ బ్రహ్మచారిణం  అపుత్రాయ భీష్మవర్మాణం 

  తర్పయామి - 3సార్లు

3. శంతను తనూభావం వీరం సత్యవాదినం జితేంద్రియం

భీష్మవర్మాణం తర్పయామి - 3సార్లు


ఈ రీతిగా తర్పణమిచ్చి సవ్యంగా ఈ క్రింద శ్లోకంతో అర్ఘ్యం ఇవ్వవలెను.


 శ్లో.  వసూనామవతారాయ ౹ శంతనోరాత్మజాయచ ౹౹ 

అర్ఘ్యం దదామి భీష్మాయ  ౹ ఆబాల్య బ్రహ్మచారిణే ౹౹


ఇతిభీష్మ తర్పణ విధిః


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

గాయత్రి మంత్ర మహిమ..!!

 🙏గాయత్రి మంత్ర మహిమ..!!


🌿ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా

చేసుకొని పాండ్యరాజు ఒకరు

పాలిస్తూ వుండేవారు. 


🌸ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు. 

వైద్యులు ఎంత మంది

ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.


🌿అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు. 


🌸 జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు 

చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 


🌿మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 


🌸పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని

చెప్పాడు . 


🌿రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు.


🌸కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ

వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 


🌿ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు

రాగానే   ప్రతిసారి లాగనే

ఆ బొమ్మ మూడు వేళ్ళు

ఎత్తి చూపింది. 


🌸బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. 

వెంటనే బొమ్మ రెండు వేళ్ళు

చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు.  


🌿తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ.

దానికి   బ్రాహ్మణుడు 

సరేనని,  దగ్గర వున్న  

పాత్రలోని  నీటిని, తీసుకుని

ఆ నీటి ధారతో దానం చేశాడు.


🌸మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే 

మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.


🌿పిదప  , ఆ మంత్ర బొమ్మ 

మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.


🌸రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను

మూడు పూటలా చేసే 

గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.


🌿తరువాత రెండు వ్రేళ్ళను

మాత్రమే చూపింది బొమ్మ, 

అప్పుడు కూడా, రెండు

పూటలా జపించిన గాయత్రి

మంత్ర జప  పుణ్య ఫలాన్ని

అడుగుతున్నదని తలచి

ఇవ్వను అని చెప్పాను. 


🌸ఆఖరికి ఒక వ్రేలు చూపినది

బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర

పుణ్య ఫలాన్ని  యివ్వడానికి

సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని

ధారపోశాను. 


🌿దాని ఫలితంగా 

బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.


🌸రాజు గారు , గాయత్రీ మంత్ర

జప పుణ్యఫలాలను, 

అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి

విలవైన కానుకలను యిచ్చి

సత్కరించాడు.


🌿ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి...🙏💐

🌹ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః…🙏


A collection from 

🙏mi Nagaraju Ravula guru swami 🪴🙏

 *ॐ            श्री आदित्य हृदयम्* 

            *శ్రీ ఆదిత్య హృదయమ్* 

        *SRI ADITYA HRUDAYAM* 


     *(महाकाव्य रामायण में युद्ध कांड से)* 

           *(శ్రీరామాయణాంతర్గతం)* 

   *(FROM SRIMADRAAMAAYAN)* 


                                *శ్లోకం :14/31* 

                        *SLOKAM :14/31* 


*आतपी मण्डली मृत्युः*  *पिङ्गलस्सर्वतापनः ।* 

*कविर्विश्वो महातेजाः*  *रक्तस्सर्वभवोद्भवः ॥१४॥* 


*అతీప మండలీ మృత్యుః* 

*పింగళః సర్వతాపనః I*  

*కవిర్విశ్వో మహాతేజాః* 

*రక్తః సర్వభవోద్భవ ॥* 


    *వేడిని కలిగియుండువాడు,*  

    *వృత్తాకారమైన బింబము గలవాడు,* 

    *విరోధులను రూపుమాపుతాడు.* 

    *ప్రభాతసమయమున పింగళవర్ణము కైగియుండువాడు,* 

    *మధ్యాహ్న సమయమున సర్వప్రాణులను తపింపజేయుచుండువాడు.* 

    *వ్యాకరణాది సమస్త శాస్త్రముల యందును పండితుడు.* 

    *విశ్వమును నిర్వహించువాడు,* 

    *గొప్ప తేజస్సు గలవాడు.*  

    *సకల ప్రాణులయందును అనురక్తి గలిగియుండు వాడు,*  

    *సమస్త ప్రాణుల ఉత్పత్తికి కారణమైనవాడు.*  


   *भगवान सूर्य वह हैं जो अंतरिक्ष के स्वामी हैं,* 

    *वे उत्पन्न करते हैं और गर्मी फैलाते हैं,* 

    *जीवन का निर्माण करते हैं और जीवन का अंत करते हैं।*

    *वह ब्रह्मांड में कार्रवाई को प्रेरित करता है।* 

    *वह सर्वव्यापी है।* 

    *उनकी चमकदार लाल किरणें इस ब्रह्मांड में जीवों को जीवित कर देती हैं।* 


*(Salutations to the Sun God)* 

    *His great orb (Mandala) which is full of Heat is like an incarnation of Death (Mrityu),* 

    *having Reddish Brown colour and burning everything within it.* 

    *He is a Poet who creates the World (by supplying energy for activities);* 

    *His great Fiery Energy, Red in colour, gives rise to this entire Worldly Existence.* 


https://youtu.be/T4CkKYfYhYw


                      *=x=x=x=*


  *— రామాయణం శర్మ* 

           *భద్రాచలం*

ముసలితనం

 శ్లోకం:☝️

*వార్ధక్యం వయసా నాస్తి*

  *మనసా నైవ తద్భవేత్‌ l*

*సంతతోద్యమ శీలస్య*

  *నాస్తి వార్ధక్య పీడనమ్‌ ll*


భావం: ముసలితనం వయసులో లేదు. మనసులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని భావం. 


ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం. దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే. కొంతమంది యాభయ్యవ పడిలోకి రాగానే వృద్ధులయ్యారంటారు. కొందరు అరవై సంవత్సరాలకు ముసలివారనిపించుకుంటారు. 70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు. కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది.


పని చేయడానికి బద్ధకించి పని సామర్థ్యాన్ని కోల్పోతే దాన్ని మించిన వార్ధక్యం మరొకటి లేదు. అటువంటివారు సమాజ ప్రగతికే కాక సొంత ప్రగతికి కూడా శత్రువులే. అతి పిసినారితనం, స్వార్థం, మద్యపానం, ధూమపానం, మత్తుమందుల వాడకం వంటి దురలవాట్లు శరీరంలో అనేక సామర్థ్యాలను బలహీనపరుస్తాయి. అకాల వార్ధక్యానికి దారి తీస్తాయి. ఆయుర్దాయాన్ని తగ్గిస్తాయి. అటువంటి వృద్ధులు తమ కుటుంబాలకు సమాజానికి కూడా భారమే. 


మానసిక ఒత్తిడులు, కుంగుబాటు వల్ల వచ్చే ముసలితనం చెదపురుగులాంటిది. మనిషి భవితను సమూలంగా తినేస్తుంది.


మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు. 


‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక్య పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి. 


భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారు గానీ వయో వార్ధక్యాన్నికాదు. 


భరద్వాజ మహర్షి మూడు ఆయుర్దాయాల కాలం తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించాడని పురాణ ప్రతీతి. 


నిత్యవ్యాయామం, యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం, సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం, ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు.!!


ఓం నమో భగవతే వాసుదేవాయ!🙏