29, జనవరి 2023, ఆదివారం

శ్లోకం

: శ్లోకం:☝️

*నిన్దన్తు నీతినిపుణా యది వా స్తువన్తు*

*లక్ష్మీః స్థిరా భవతు గచ్ఛతు వా యథేష్టం l*

*అద్యైవ వా మరణమస్తు యుగాన్తరే వా*

*న్యాయాత్పథః ప్రవిచలన్తి పదం న ధీరాః ॥*


భావం: నీతి నిపుణులు విమర్శించినా లేక ప్రశంసించినా, ధనం స్ధిరంగా ఉన్నా లేకపోయినా, మరణం ఈ రోజు వచ్చినా లేక యుగాంతంలో సంభవించినా, ధీరులు న్యాయమార్గం నుండి ఎన్నడూ వెనక్కి తగ్గరు.

: *కాశీ ఖండం - 11*


🌹🌹🌹🌹🌹🌹🌹🌹


 *నైరుతి, వరుణ లోక వర్ణన* 


 శివశర్మ నైరుతి మొదలైన లోకాలను గురించి తెలియ జేయమని, విష్ణు దూతలను కోరగా, వివరిస్తున్నారు. 


 మొదటిది నైరుతి. పుణ్యవతి పుణ్య జనులకు ఆవాసం.

వేద మార్గాన్ని అనుసరించే వారు ఇక్కడికి వస్తారు. దయా ధర్మాలతో ప్రవర్తించే అన్త్యజులకు కూడా, ఈ లోకంలభిస్తుంది, అని, పింగాక్షుని ఉపాఖ్యానాన్ని తెలిపారు

                                               *పింగాక్షోపాఖ్యానం*  


 వింధ్యాటవిలో ఒక పల్లెకు పింగాక్షుడు ప్రభువు. మంచి శూరుడు. క్రూరకర్మలంటే అయిష్టం. నిర్దాక్షిణ్యంగా జంతువులను, మనుష్యులను చంపే వారిని, కఠినంగా శిక్షించేవాడు. అడవిలో ప్రయాణించే వారిని, వెంట ఉండి దాటిస్తాడు. 


 ఒకసారి ఇతని బంధువు, ప్రయాణీకులను హింసించాడని విన్నాడు. రహస్యంగా వచ్చి, వాడిని పట్టుకొన్నాడు. ఇతరులకు అపకారం చేయవద్దని హెచ్చరించాడు. వాడు దోచుకొన్న దానికి రెట్టింపు ఇచ్చి, గౌరవంగా సాగనంపాడు. ఇంకోసారి మరో బృందం వస్తుంటే, కొందర్ని, వాళ్ళను చంపమని, దోచుకోమనీ, హెచ్చరికలు వచ్చాయి. అప్పుడు వారంతా, తాము పింగాక్షుడున్నాడనే ధైర్యంతో వచ్చామని, కావాలంటే తమ దగ్గరున్నదంతా ఇచ్చేస్తామని, ప్రాణాలను రక్షించమని, యాత్రికులు వేడుకొన్నారు. ఈ మాటలను విన్న పింగాక్షుడు, వారిని భయపడవద్దని అనునయిస్తూ, ఆ చోటుకు చేరుకొన్నాడు. ఇంతలో ఒక భిల్లుడు అక్కడికి వచ్చి, తన అనుచరగణంతో, పింగాక్షుడిని చంపమని ఆదేశించాడు. ఇరువైపులా ఘోర పోరాటం జరిగింది. శత్రువులైన భిల్ల గణాన్ని ఓడించి, బంధించాడు. కాని అతని ధనుస్సు, బాణాలు, ముక్కలు ముక్కలయ్యాయి శత్రువులు అనేకులు అవటంతో, వారి చేతిలో మరణించాడు పింగాక్షుడు.  


 నైరుతి దిక్కు నుండి దేవదూతలు వచ్చి, పింగాక్షుని దేవ విమానంలో తీసుకొని వచ్చి, నైరుతి దిక్కుకు, ప్రభువును చేశారు

                                                  *వరుణ లోక వర్ణన*


 అక్కడి నుండి విష్ణుశర్మను వరుణ లోకానికి, విష్ణు దూతలు తీసుకొని వెళ్లారు. ప్రజలకోసం బావులు, చెరువులు త్రవ్వించిన వారు, వరుణ లోకానికి వస్తారు. ఐశ్వర్య సంపన్నం. దారిలో నీడ కోసం రావి, మద్ది చెట్లను నాటించేవారు, ఈ లోకం చేరుతారు. వేసవిలో విసనకర్రలను దానం చేసినవారు, సుగంధపు చల్లని పానీయాలిచ్చే వారు, చలివేంద్రాలను ఏర్పాటుచేసేవారు, వరుణలోకానికి చేరతారు. జలదారా మండపాలను, నీడనిచ్చే మండపాలను నిర్మించిన వారికి ఇది నెలవు. పుణ్యనదులలో స్నానం చేయటానికి వీలుగా, మెట్ల నిర్మాణం చేసే వారికి, వరుణలోకం ఆవాస భూమి. అన్ని జలాశయాలకు వరుణుడు అదిపతి. అన్ని సముద్రాలకు నీటిని, ప్రాణాన్ని కల్పించేవాడు. కర్మ సాక్షి కూడా


 *వరుణుని జన్మ వృత్తాంతం*


 కర్దమ ప్రజాపతికి 

శుచిష్మoతుడనే కుమారుడు ఉన్నాడు. వినయ శీలి. సుగుణవంతుడు. ధైర్య శాలి. ఒకరోజు ఇతడు కొందరు బాలురతో కలిసి, ఒక సరస్సులో, స్నానానికి వెళ్లాడు. నీటిలో దిగగానే, అతడిని, ఒక మొసలి 

 పట్టుకుంది. ఈ విషయాన్ని, స్నేహితులు, తండ్రికి తెలియజేశారు. 


 ఆయన, అప్పుడు, శివధ్యానంలో ఉన్నాడు. తన సర్వజ్ఞత్వం వల్ల, ఒక సరస్సులో, కొంతమంది మునిబాలురు జలక్రీడలాడటం, కనిపించింది. అందులో రుద్రరూపుడైన, ఒక ముని బాలుడు, ‘’ఓయి సముద్రాధిపా !భక్తుడైన కర్దమ ప్రజాపతి కుమారుడెక్కడ ఉన్నాడు? శివుని సామర్ధ్యం తెలియకుండా, దుష్క్రుత్యానికి పాలుపడ్డావు.‘’ అని గర్జించాడు.  


 సముద్రుడు భయపడి బాలుడిని రత్నాలతో అలంకరించి శిశుమారకమైన మొసలిని కూడా బంధించి తెచ్చి, శివుని పాదాల చెంత పడేసాడు. శివుని పాదాలకు నమస్కరించి, ‘’మహాశివా !నా తప్పేమీ లేదు .ఈ జంతువు వల్లనే, శిశువుకు మరణం సంభవించింది .’’ అని, విన్న వించుకొన్నారు. అప్పుడు శివుడు మన్నించి, ఆ బాలుని తండ్రి, కర్దమ ప్రజాపతి వద్దకు తీసుకొనివెళ్ళి, అప్పగించమని, ప్రమధగణాలకు చెప్పాడు. 


 తండ్రి కుమారుని చూచి, సంతోషంతో కౌగలించుకొని, యోగాక్షేమాలను విచారించాడు. బాలుడు జరిగిన వృత్తాంతం అంతా, తండ్రికి తెలియ జేశాడు. తండ్రి అనుమతి గ్రహించి, బాలుడు, కాశీలో శివలింగాన్ని ప్రతిష్టించి, అయిదు వేల సంవత్సరాలు శిలలాగా నిశ్చలంగా శివుని కోసం, తపస్సు చేశాడు.

మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, వరం కోరుకోమన్నాడు. తనకు జలాలపై ఆధిపత్యం కావాలని, బాలుడు విన్నవించాడు. 


 అప్పుడు భవానీపతి ‘’నువ్వు, వాపీ, కూప, తటాకాది నదీనదాలకు సమస్త జలాలకు 

అధిపతివి అవుతావు. సమస్త రత్నాలకు అధిపతివి నీవే. పశ్చిమదిక్కునకు అధిపత్యం నీదే. పాశపాణివై సమస్త దేవతలకు ఇష్టుడవవుతావు. నువ్వు స్థాపించిన ఈ లింగం ‘’వరుణేశ్వర లింగం‘’ గా ప్రసిద్ధి చెందుతుంది. మణికర్నేశ్వరలింగం నైరుతి దిశలో, సంస్తాపితమై ఉంటుంది. దీనిని అర్చించిన వారికి, అకాలమరణం రాదు. నీరసాలైన అన్నపానాదులు వరుణుని అనుగ్రహంతో సరసములుగా మారుతాయి." అని వరమిచ్చి, అంతర్ధాన మయ్యాడు . 


 శుచిష్మంతుడు అనే ఆ బ్రాహ్మణ బాలుడు, నైరుతి దిశకు అధిపతి అయాడు.


 *కాశీఖండం సశేషం..*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹

*🅰️🅿️SRINU*

: *_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - jan 28._*


 **స్వామి వివేకానంద స్ఫూర్తి* ..*రోజుకో సూక్తి - జనవరి 28* 

 

*దీరులై ఉండండి,* 

*ఆత్మస్థైర్యంతో పని చెయ్యండి,*

*మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే*,*

*పిరికిపందలు ఆత్మస్థైర్యం లేనివారు రోజు మరణిస్తారు* .


बने रहें,

आत्मविश्वास से काम लें,

इंसान सिर्फ एक बार मरता है*,*

बिना संयम के कायर रोज मरते हैं।


stay tuned,

Work with confidence,

Man dies only once*,*

Cowards die every day without self-control.


 __1901 సంవత్సరం మార్చి31వ తేదీన స్వామి వివేకానంద టాక పర్యటనలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మనము పుట్టిన హిందూ మతం సనాతన ధర్మము గురించి_ .. _ఆ సమయంలో ఇచ్చిన ఉపన్యాసం._ 


 *అంశం* : *మనము పుట్టిన* *హిందూ మతం గురించి* ...


 – *స్వామి వివేకానంద*.


🙏*శుభోదయం*🙏


       ***************

🌷మహానీయుని మాట🌷

       ****************


"మనిషిగా జన్మించినoదుకు మనతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుండాలి అని చూడాలి.

ఎదుగుతున్న వారికి ప్రోత్సహించి చేయూతనివ్వాలి.

అప్పుడే మన ఎదుగుదలకు మరో రూపంలో సాయం దొరుకుతుంది."


       *************

💎నేటి మంచి మాట💎

       *************


"మనకు సంబంధం లేని వారి దగ్గర రహస్యాలు చెప్పకూడదు.

మనకు కావలసిన వారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు."


 ❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️🦚🦚❄️

 https://chat.whatsapp.com/DHFVaWgBskTDtEOPfqg83v


🌺 అమృతం గమయ 🌺


*అమృత మనసు*

  

జీవితం అన్నాక సమస్యలు లేకుండా ఎలా ఉంటుంది. వాటి పట్ల మనం స్పందించే తీరు మారాలి.


శ్రద్ధగా రాస్తే చేతివ్రాతే మారినపుడు, శ్రమిస్తే తలరాతలు మారవా.

       

మనం ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం. అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవడం గౌరవం.


నీవు ముళ్ళ మధ్యలో వున్నా అందంగా ఎలా వుండాలో గులాబీని చూసి, బురదలో వున్నా పవిత్రంగా ఎలా వుండాలో తామర పువ్వును చూసి నేర్చుకో. 


ఎందుకంటే, ఎన్ని కష్టాలు, సమస్యలున్నా, వాటిని మనోబలంతో ఎదుర్కొంటూ సంతోషంగా ఉంటూ అందరికీ సంతోషం పంచడమే ఆనందం. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే ఏడిపిస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నవ్వుకుంటారు. 


నీవు బ్రతికి ఉన్నప్పుడు ఎవరినైతే నవ్విస్తావో, వాళ్ళు నీవు చచ్చాక నీ కోసం ఏడుస్తారు. 


రూపాయి అయినా, రూపం అయినా ఎక్కువ రోజులుండవు. 


కానీ, నీ యొక్క మంచితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 


 ప్రశాంతంగా ఉండు.

*మాఘ పురాణం - 8 వ అధ్యాయము*

*29-01-2023 ఆదివారం*


🔥🔥🔥🔥🔥🔥🔥🔥


*దత్తత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట*


దత్తత్రేయుడు బ్రహ్మా , విష్ణు , మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు , త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తత్రేయుని కాలములో కార్తవీర్యర్జునుడను క్షత్రియ వీరుడు *'మాహిష్మతీ యను నగరమును రాజధానిగా జేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తత్రేయులు ,* ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి *"గురువర్యా ! మీ అనుగ్రహమువలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని , కాని మాఘమాసము యొక్క మహత్మ్యమును వినియుండలేదు. కావున , మాఘమాసము యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను , అని దత్తాత్రేయుని కోరెను.* దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధముగా వివరించెను.


*"భూపాలా ! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమండెచ్చటనూలేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దానధర్మములచరించిన యెడల దానివలన కలుగు ఫలము వర్ణించుటకు నాకు కూడ సాధ్యము కాదు. అందునా మాఘమాసమందు నదిలో స్నానము చేసిన గొప్పఫలితము కలుగుటయేకాక జన్మరాహిత్యము కూడ కలుగును. గనుక , యే మానవుడైననూ మాఘమాసములో సూర్యుడు మకర రాశియందుండగా మాఘస్నానముచేసి , ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహపాతకములు చేసినవాడైనను ముక్తి పొందగలడు",* అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి యింకనూ యీవిధముగా చెప్పుచున్నాడు. *"పూర్వకాలమున గంగానదీతీరపు ఉత్తరభాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు కుబేరులువలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు , బంగారునగలు , నాణేములు రాసులకొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను , తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని , యిష్టమువచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరు చెరొక ఉంపుడుకత్తెనూ జేరదీసి , కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురుగలు గ్రక్కుచూ చనిపోయినాడు , ఆ విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయినారు. యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి , పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో యిలా అన్నాడు.*


*"అయ్యా ! మేమిద్దరమూ ఒకేతండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమును , నాకు స్వర్గమును యేల ప్రాప్తించును"* అని అడిగెను. ఆ మాటలకు చిత్రగుప్తుడు *" ఓయీ వైశ్యపుత్రా ! నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము యామెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని యింటికి వెళ్ళి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా కెరటాలజల్లులు నీశిరస్సుపై పడినవి. అందు వలన నీవు పవిత్రుడవైనావు మరొక విష్యమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు , ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడ నశించును. కాన విప్రుని చూచుటవలన నీకు మంచిఫలితమే కలిగినది. అదియునుకాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీదపడినది. గనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను" అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా ! ఏమి నా భాగ్యము గంగాజలము నా మీద పడినంత మాత్రమునే నాకింతటి మోక్షము కలిగినదా"* అని వైశ్యకుమారుడు సంతసించి , దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

🔥🔥🔥🔥🔥🔥🔥🔥

*🅰️🅿️SRINU*

కామెంట్‌లు లేవు: