29, జనవరి 2023, ఆదివారం

గాయత్రి మంత్ర మహిమ..!!

 🙏గాయత్రి మంత్ర మహిమ..!!


🌿ప్రాచీన కాలంలో నెల్లై నగరాన్ని ముఖ్యనగరంగా

చేసుకొని పాండ్యరాజు ఒకరు

పాలిస్తూ వుండేవారు. 


🌸ఆ రాజుగారు  తీరని కడుపునెప్పి వ్యాధితో  అవస్ధ పడుతూండేవాడు. 

వైద్యులు ఎంత మంది

ప్రయత్నించినా గుణపర్చలేకపోయారు.


🌿అప్పుడు , ఒకనాడు రాజుగారి సభకి ఒక జ్యోతిష్కుడు   వచ్చాడు. మహారాజును చూసి

" తమకి ఏ ఔషధాలు అవసరం లేదు. 


🌸 జాతకరీత్యా వున్న దోష  విముక్తికి పరిహారం చేస్తే చాలు,  అని చెప్పాడు. జ్యోతిష్కుడు 

చెప్పిన ప్రకారం, పరిష్కార పూజ  మొదలయింది. 


🌿మంత్రాలతో ఒక యమధర్మరాజు బొమ్మని చేసి, ఆ బొమ్మ చేతిలో  ఒక  కత్తి ని అమర్చాడు జ్యోతిష్కుడు. 


🌸పిదప , "రాజా !  యీ  యముని బొమ్మ చేతిలో వున్న కత్తిని కింద

పడేట్లు చేసిన వారికి , ధనాన్ని  ,సువర్ణాన్ని  బహుమతిగా ప్రకటించమని

చెప్పాడు . 


🌿రాజావారు అలాగే తన దేశమంతా చాటింపువేయించాడు.

రాజుగారిచ్చే బహుమతి కోసం రాజ్యంలోని ప్రజలంతా

సభకి  వచ్చి  బొమ్మ చేతిలోని కత్తిని క్రింద పడవేసేందుకు ఎంతో ప్రయత్నించారు.


🌸కాని ఒక్కొక్కరు  ఆ బొమ్మ

వద్దకి రాగానే.. ఆ బొమ్మ మూడు వ్రేళ్ళను ఎత్తి చూపేది. వచ్చిన వారికి ఏమీ అర్ధం కాక ఏం చేయాలో తెలియక  తిరిగి వెళ్ళి పోయేవారు. 


🌿ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజ సభకు వచ్చి  తను కూడా ప్రయత్నించి చూద్దామని ఆ మంత్రపు బొమ్మ దగ్గరకు

రాగానే   ప్రతిసారి లాగనే

ఆ బొమ్మ మూడు వేళ్ళు

ఎత్తి చూపింది. 


🌸బ్రాహ్మణుడు అర్ధమైనట్లుగా

" కుదరదు"  అన్నాడు. 

వెంటనే బొమ్మ రెండు వేళ్ళు

చూపించింది.  "అప్పుడు కూడా  ఒప్పుకోను"  అన్నాడు

బ్రాహ్మణుడు.  


🌿తరువాత ఒక్క వేలు మాత్రమే ఎత్తి  చూపించింది బొమ్మ.

దానికి   బ్రాహ్మణుడు 

సరేనని,  దగ్గర వున్న  

పాత్రలోని  నీటిని, తీసుకుని

ఆ నీటి ధారతో దానం చేశాడు.


🌸మరుక్షణమే  యమధర్మరాజు చేతిలోని కత్తి క్రింద పడిపోయింది. మరుక్షణమే 

మహారాజు గారి కడుపునొప్పి  అదృశ్యమై పూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.


🌿పిదప  , ఆ మంత్ర బొమ్మ 

మూడు వ్రేళ్ళ రహస్యం ఏమిటి ? అని రాజు ,బ్రాహ్మణుని అడిగాడు.


🌸రాజా ! .. బొమ్మ మూడు వ్రేళ్ళు ఎత్తి  చూపి  , నేను

మూడు పూటలా చేసే 

గాయత్రి మంత్ర  జప పుణ్యఫలం దానంగా అడిగినట్లు తలచి,  ' వీలుకాదు' అని ఒప్పుకోలేదు.


🌿తరువాత రెండు వ్రేళ్ళను

మాత్రమే చూపింది బొమ్మ, 

అప్పుడు కూడా, రెండు

పూటలా జపించిన గాయత్రి

మంత్ర జప  పుణ్య ఫలాన్ని

అడుగుతున్నదని తలచి

ఇవ్వను అని చెప్పాను. 


🌸ఆఖరికి ఒక వ్రేలు చూపినది

బొమ్మ.   మహారాజావారి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం వెంటనే ఒక  పూట నేను జపించిన గాయత్రీ మంత్ర

పుణ్య ఫలాన్ని  యివ్వడానికి

సమ్మతించి ఆ పుణ్యఫలాన్ని

ధారపోశాను. 


🌿దాని ఫలితంగా 

బొమ్మ కత్తిని క్రింద పడవేసింది.   అని బ్రాహ్మణుడు  వివరించాడు.


🌸రాజు గారు , గాయత్రీ మంత్ర

జప పుణ్యఫలాలను, 

అర్ధం చేసుకొని, బ్రాహ్మణునికి

విలవైన కానుకలను యిచ్చి

సత్కరించాడు.


🌿ఒక పూట గాయత్రీ జపానికే అంతటి మహత్తు వుంటే , నిత్యమూ నియమ నిష్టలతో భక్తితో గాయత్రీ మంత్రాన్ని జపించేవారు మరెంతటి మహిమాన్విత శక్తులు కలిగివుంటారో ఊహించలేము స్వస్తి...🙏💐

🌹ఓం శ్రీ గాయత్రి మాత్రేనమః…🙏


A collection from 

🙏mi Nagaraju Ravula guru swami 🪴🙏

కామెంట్‌లు లేవు: