14, ఏప్రిల్ 2026, మంగళవారం

పంచాంగం

 


జీవిత సత్యాలు

 *🙏శుభ మంగళవారం🌹Happy Tuesday 🙏*


       *🤘జీవిత సత్యాలు🤟*

            కలియుగ మహత్యం ఎలా ఉందంటే చెప్పులు షోరూముల్లో, పుస్తకాలు రోడ్లపై ఉంటాయి. కుక్కలు బంగ్లాలో, ఆవులు వీధుల్లో ఉంటాయి. పిల్లలు విదేశాల్లో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉంటారు.

         *👌నిత్య సత్యాలు✍️*

           కలియుగ మహత్యం ఎలా ఉందంటే డబ్బు ఎక్కువ, ప్రేమ తక్కువ ఉంటుంది. చదువు ఎక్కువ, సంస్కారం తక్కువ ఉంటుంది. అందం ముఖ్యం అవుతుంది, ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఉంటుంది..

ఈ ప్రశ్నకు బదులేది 20

  ఈ ప్రశ్నకు బదులేది 20

ఈరోజు మన ప్రశ్న జ్యోతిష్యానికి  సంబంధించింది.

  నక్షత్రములు ఎన్ని ? 

ఒక్కొక్క నక్షత్రమునకు ఎన్ని పాదములు ఉంటాయి ? 

రాశులు ఎన్ని ? 

ఒక్కొక్క రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి? 

వివరంగా వివరించగలరు


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ


గమనిక:: మీ జవాబును క్రింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రపంచం మొత్తం తినిపిస్తుంది

*సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*సోమవారం 13 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           1️⃣9️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *194 వ రోజు*                   

*విరాట పర్వము పంచమాశ్వాసము*


*అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట*```


అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు “ఉత్తరకుమారా! రధాన్ని వారి వైపు పోనివ్వు” అన్నాడు. 


అర్జునుడు తమవైపు రావడం చూసి అశ్వథ్థామ "కర్ణా! అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించ గలిగిన సమర్ధుడవు నువ్వే" అని కర్ణుని పరహాసంగా ముందుకు తోసాడు. 


కర్ణుడు "నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు" అన్నాడు. 


అర్జునుడు కౌరవవీరులందరినీ మట్టి కరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసిపోయి తొలగిపోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునితో "అర్జునా! నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తోంది కనీసం నీళ్ళు త్రాగకుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారధ్యం చేయలేను" అన్నాడు. 


అర్జునుడు "ఉత్తర కుమారా! ఓపిక పట్టు ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధం ఔతున్నట్లు ఉంది. రథం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను. భయపడకు" అన్నాడు. 


సుయోధనుని వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులి వలె సుయోధనునిపై విరుచుకు పడ్డాడు. బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై రెండు బాణాలు వేసాడు. అర్జునిని నుదిటిపై రెండు బాణాలు వేసాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునిపై శరపరంపరను వేసాడు అర్జునుడు. సుయోధనునికి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభ స్థలంపై పిడికిలితో కొట్టాడు. 

ఆదెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రథంపై ఎక్కాడు. 


అర్జునుడు మరలా సుయోధనుని గుండెలను గురి పెట్టి పది బాణాలను వేసాడు. 


సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చిన వారందరిని అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెను తిరిగాడు. 


అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో 

"అర్జునుడు తరుము కొస్తుండగా సుయోధనుడు పారి పోతున్నాడు. మనం అతనిని కాపాడాలి" అన్నాడు. 


కర్ణుని మాటలను భీష్మ , ద్రోణ, కృపాచార్యులు లెక్కచెయ్యలేదు. సుయోధనుడు దీనంగా "అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలి పోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందుతున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా?" అన్నాడు. 


అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి "ఏమిటి సుయోధనా ! అలా పారి పోతున్నావు. ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్న వాడిని ఒంటరిని నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనా వాహినితో వచ్చావు మిత్రులు సాయం ఉన్నారు ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వరా ఇక నీవు హస్థినాపురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు. మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్టుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధనా నా మాట విను యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు; గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు కాని వెను తిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం. జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారి పోవడమేమిటి చీ సిగ్గుగా లేదా?" అని అధిక్షేపించాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*🌹14ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

   🍁 *మంగళవారం*🍁

  *🌹14ఏప్రిల్ 2026🌹*      

   *దృగ్గణిత పంచాంగం*  

               

         *ఈనాటి పర్వం*

 *సౌర/తమిళ సంవత్సరాది*


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : ద్వాదశి* రా 12.12 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : శతభిషం* సా 04.06 వరకు ఉపరి *పూర్వాభాద్ర*

*యోగం : శుక్ల* సా 03.40 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కౌలువ* మ 12.46 *తైతుల* రా 12.12 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:* 

*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*               

అమృత కాలం  : *ఉ 08.53 - 10.29*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 10.18 - 11.51*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.13 రా 10.58 - 11.44*

*రాహు కాలం   : మ 03.15 - 04.49*

గుళికకాళం      : *మ 12.08 - 01.41*

యమగండం    : *ఉ 09.00 - 10.34*

సూర్యరాశి : *మీనం/మేషం* 

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.01*  

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.53- 08.23*

సంగవ కాలం      :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం   :*10.53 - 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ ద్వాదశి*

సాయంకాలం   :*సా 03.53- 06.23*

ప్రదోష కాలం     :*సా 06.23 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.44*

నిశీధి కాలం       :*రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


        *🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*


*రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా*

*లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 13 ఏప్రిల్ 2026*

         *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *56వ భాగం*``


*వామనావతారం*


బలి చక్రవర్తి మూడు అడుగుల దానం - 

వామనుడు బలిని సుతలానికి పంపి స్వర్గలోకం ఇంద్రునికి అప్పగించుట..```

వామనుడు జగత్తు అంతా ఆశ్చర్యం, ఆనందంగా చూస్తుంటే నడుస్తూ 

బలి చక్రవర్తి యాగ ప్రదేశానికి చేరుకున్నాడు.  


తేజస్సుతో ప్రకాశిస్తూ వస్తున్న బాల వటువుని చూసి యాగశాలలో అందరు విష్ణువో శివుడో సూర్యుడో లేక అగ్నిదేవుడో బాలకుని రూపంలో వస్తున్నాడని అనుకున్నారు.


ఋషులు, మహర్షులు, ఋత్వికులు, అతిథులు, రాజ భటులు 

ఆ వామన మోహన రూపం చూసి ఆనందం చెందుతున్నారు. ఎవ్వరు ఆపటం లేదు, అడగటం లేదు. వామనుడు మోహన రూపంతో, ముద్దు ముద్దు మాటలతో అందరిని పలకరిస్తూ, నవ్వ్వుతూ ముందుకు వెళ్ళాడు. 


బలి చక్రవర్తి బాలవటువుని చూసి విస్మయం చెందాడు. ‘భగవంతుడే 

ఈ రూపంలో రాలేదు కదా?’ అని అనుకున్నాడు. వామనుడు 

తన లేత చేతులతో బలిని ఆశీర్వదించాడు.


బలి చక్రవర్తి సతీమణి వింధ్యావళి బాల వటువుని చూసి ముచ్చటపడి దగ్గరకు తీసుకుంది. దంపతులిరువురు వామనుని సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్లెంలో పాదాలుంచి, వింధ్యావళి నీరు పోస్తుంటే పాదాలు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకున్నారు. మెత్తటి వస్త్రంతో పాదాలు తుడిచి శుభ్రపరిచాడు.


రాక్షస గురువు శుక్రచార్యుడు యజ్ఞస్థలి నుంచి అప్పుడే వచ్చి బలి దంపతుల చేత పూజించ బడుతున్న వామనుని చూసాడు. బాలుని దివ్య తేజస్సు చూడగానే అనుమానం వచ్చింది. బాలుని రూపంలో విష్ణువు బలి చక్రవర్తిని మోసం చేయడానికి వచ్చి ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి" అని వామనుని గమనించసాగాడు.


బలి చక్రవర్తి వామనునితో.. "బాల బ్రాహ్మణా! బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న నీ ఆశీస్సులు పొంది నా జన్మ ధన్యమైంది. ఎవరు నీవు? ఎక్కడ నుంచి వచ్చావు? నీవేమి అడిగినా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధనమా, గోవులా, బంగారమా, రత్నాలా, భూములా లేక వేరే ఏమన్నా మనస్సులో ఉంటే చెప్పుము. తప్పక ఇస్తాను" అన్నాడు.


బాల వటువు నవ్వుతూ "నా నామధేయం వామనుడు. బాల బ్రహ్మచారిని. అందరు నా వాళ్లు అయినా నేను మాత్రం ఒంటరి వాడిని. ఒక చోట ఉండక విశ్వమంతా తిరుగుతుంటాను. నాకు ధన సంపదలు వస్తు వాహనాలు స్వర్ణ రత్నాదుల పై మోజు లేదు. అయినా మంచివాడవైన నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక్క చిన్న కోరిక కోరుతాను. ఇదే నా తొలి మరియు తుది కోరిక. సాధ్యమైతే ఇవ్వు లేదన్నా పర్వాలేదు. నాకు మూడు అడుగుల నేల దానంగా ఇవ్వు! చాలు" అని కోరాడు.


బలి చక్రవర్తికి వామనుడి కోరిక విని నవ్వు, కోపము రెండూ వచ్చాయి. "ముల్లోకాల చక్రవర్తినైన నన్ను మూడు అడుగుల నేల అడుగుతావా? దాత గొప్పదనాన్ని గమనించి అడగాలి అని తెలియదా! నీ కోరిక వినడానికే సిగ్గుగా ఉంది" అన్నాడు. 


వామనుడు నవ్వుతూ "నీవు సర్వస్వం అడిగినా ఇవ్వగల మహాదాతవని నాకు తెలుసును! కానీ నేను బాలుడిని! బ్రహ్మచారిని. నాకు మూడడుగుల నేల దానం చాలు. సరిపోతుంది" అని అన్నాడు.


వామనుడి వింత కోరిక విన్న శుక్రచార్యుడికి అనుమానం బలపడింది. వచ్చింది విష్ణువే అనుకుని బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి "రాజా! విష్ణువే ఈ బాల వటువు రూపంలో వచ్చాడు. మూడు అడుగులు నీవు దానమిస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడు. దానం ఇవ్వవద్దు" అని హెచ్చరించాడు.


బలి చక్రవర్తి తిరస్కరిస్తూ "ఆచార్యా! మూడు అడుగులు నేల దానమివ్వలేని అసమర్థుడు అనే చెడ్డ పేరు నాకు వద్దు. మీరన్నట్టు శ్రీహరే ఈ రూపంలో దానమడిగితే అది నాకు గౌరవం, గొప్పదనం తెస్తుంది. భగవంతునికే దానమిచ్చిన దాతగా నా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది" అనడంతో శుక్రచార్యుడు కోపగించి "గురువు మాట కాదన్నందుకు రాజభ్రష్టుడివి అవుతావు" అని పలికాడు.


అయినా దానమాపడానికి శుక్రచార్యుడు ఆఖరి ప్రయత్నంగా బలి వామనునికి దానమివ్వడానికి నీరు పోసే కమండలంలో సూక్ష్మరూపంతో నీరు పడకుండా అడ్డుగా నిలిచాడు.  


వామనుడు గమనించి దర్భపుల్లతో లోపలికి పొడిచాడు. అది శుక్రచార్యుడి కన్నుకి గుచ్ఛుకుంది. బాధతో అరుస్తూ మాయమయ్యాడు. నాటి నుండి శుక్రచార్యుడు ఒక కన్ను పోయి ఒంటి కన్నుతో జీవించాడు.


బలి చక్రవర్తి మూడడుగుల నేలను శాస్త్రోక్తంగా వామనుడి చేతిలో నీరు పోస్తూ దానమిచ్చాడు. మరుక్షణం అద్భుత సంఘటన జరిగింది. బలి చక్రవర్తి, అక్కడి వారు ఆశ్చర్యంగా చూస్తుండగా వామనుడు తన శరీరం పెంచి త్రివిక్రముడు అయ్యి ఆకాశం అంచులు తగిలేంత ఎత్తుకి ఎదిగాడు. ఒక పాదముతో భూమిని, మరొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించాడు. 

బలిని చూసి “నీ విచ్చిన మూడడుగులలో రెండు అడుగులకు భూమి ఆకాశం సరిపోయాయి. మరి నా మూడో అడుగుకి నేల ఎక్కడ ఉంది?" అని అడిగాడు.


బలి చక్రవర్తి మోకాళ్ల పైనుంచుని నమస్కరిస్తూ "బ్రాహ్మణ దేవా! నీవు మహావిష్ణువు అని తెలుసుకున్నాను. అయినా నేను ఇచ్చిన మాట తప్పను. 

నీ మూడో అడుగు నా శిరస్సు పై ఉంచుము" అని తల వంచాడు.  


బలి చక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు అక్కడకు వచ్చి "నారాయణా! నా మనవడు బలి నీ భక్తుడు. నీవే ఇంద్రపదవి ఇచ్చావు. ఇప్పుడు మరల నీవే తీసుకుంటున్నావు. పదవితో వచ్చిన అహంకారాన్ని తొలగించి కరుణించుము" అని ప్రార్ధించాడు. 


బలి చక్రవర్తి అర్థాంగి వింధ్యావళి పతి భిక్ష పెట్టమని ప్రార్ధించింది.


త్రివిక్రముడు నారాయణుడు బలి చక్రవర్తి సత్య సంధతను ప్రశంసిస్తూ "బలి చక్రవర్తీ! నీవు నా ప్రియభక్తుడవి. మూడో అడుగు నీ శిరస్సు పై ఉంచి నిన్ను సుతలానికి పంపుతాను. అక్కడ నీకు సంరక్షణగా ఉండి రక్షిస్తాను. స్వర్గము కన్నా సుఖమైన సుతలంలో సుఖంగా జీవించుము. భవిష్యత్తులో సావర్ణి మనువు కాలంలో నీకు ఇంద్రపదవి మరల లభిస్తుంది. ఆ తరువాత నీవు నా సన్నిధికి చేరుకుంటావు" అని బలిని తన పాదము అతని శిరస్సు పై ఉంచి పాతాళలోకమైన సుతలానికి పంపివేశాడు. 


ఇంద్రాదులకు స్వర్గలోకం ఇచ్చి వేశాడు. వామనావతార ఉద్దేశం నెరవేరడంతో నారాయణుడై వైకుంఠం చేరుకున్నాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

సుందరకాండ మహిమ!*



*చాగంటివారి...*

            *సుందరకాండ మహిమ!*                   

```

ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.


ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్టచివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు.


అందుకే, ప్రత్యేకించి ‘సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు’ అని అంటారు. 


కారణం ఏమంటే శ్రీ రామాయణంలో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది.


సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.


హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు.


రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ! 


అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.


ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే!  


ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. - అలాగే, సుందరాకాండని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.


రామాయణంలో ఒక్క సుందరకాండకొచ్చే సరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు. 


ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు 

కావు. చాలా శ్లోకములు మంత్రములే.

అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే...

```

*పిల్ల పెళ్ళవలేదు...*

     *సుందరకాండ చదువుకోండి!*


*పిల్లాడికి ఉద్యోగం రాలేదు...*

      *సుందరకాండ చదువుకోండి!*


*ఆరోగ్యం బాలేదు...*

     *సుందరకాండ చదువుకోండి!*


*ఏమిటో భయంగా వుంటోంది...*

     *సుందరకాండ చదువుకోండి!*


*భీతి కలిగింది...*

     *సుందరకాండ చదువుకోండి!*


*ఏ కష్టం కలగనీండి...*

      *సుందరకాండ చదువుకోండి!*

```

ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు.


ఎందుకనంటే - లోకంలో ఇంత శక్తిమంతమైనవి రెండే రెండు సాహిత్యంలో వున్నాయని చెబుతారు పెద్దలు. 

ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.    


ఆ రెండూ ఏమిటంటే 

ఒకటి- సుందరకాండ, 

రెండు- సౌందర్య లహరి. 


మూడు ఇక లేదు!

రెండూ సౌందర్యము, సుందరము   

ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి. 

రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందరకాండలో వుంది!


-బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వరరావుగారు.

```

*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

13, ఏప్రిల్ 2026, సోమవారం

ఈ ప్రశ్నకు బదులేది 19

 ఈ ప్రశ్నకు బదులేది 19



ఈరోజు మన ప్రశ్న ఆధ్యాత్మికత కు సంబంధించింది.

 

  ఉపనిషత్ అనగా ఏమిటి ? 

మొట్టమొదటిసారిగా వెలువడిన ఉపనిషత్తు పేరు ఏమిటి? 

అందులోని మొదటి మంత్రము ఏమి  చెబుతున్నది

 మీకు నచ్చిన ఉపనిషత్తు ఏది? 


వివరంగా వివరించగలరు

ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

భగవంతుడు - పూజ - ధ్యానము*

  *భగవంతుడు - పూజ - ధ్యానము*


సభ్యులకు నమస్కారములు.


1) *సామాన్య భక్తి*

భక్తి అనగానే ఆ పరమాత్మను పువ్వులతో పూజచేసి, నారికేళాలు, కదళి ఫలాలు అర్పించి తీర్థ ప్రసాదాలు పంచుకుని ఆరగించడం. *కాని, సర్వమూ భగవద్రూపమే* అన్న విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలు

2) *బద్నాతి ప్రీతిమితి బంధుః* 

భగవంతుడు జీవులకు సర్వ విధ బంధువు.

3) *ప్రీతి పూర్వ మను ధ్యానం భక్తి రిత్యాభిధియతే*. 

ప్రీతి (సంతోషము, ఇష్టము) తో నిరంతరము భావన చేస్తే, ఆ భావన సంపూర్ణ భక్తి అనబడుతుంది. తద్వారా మనకు భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్ పూజలు, ధ్యానము మ్రొక్కుబడిగానో, భయం చేతనో, కోరికలతో లేక ప్రేరణలతో చేయకుండా, ఇష్టముగా, మనః స్పూర్తిగా సంతృప్తి మరియు సంతోషాలతో చేయవలసి ఉన్నది, ఉంటుంది. ప్రార్థన లేక పూజ పూర్తి విశ్వాసము, ఇష్టము మరియు సంతోషములతో చేస్తే భగవంతుడిని కరిగిస్తుంది. భక్తులకు ధర్మాన్ని, బలాన్ని మరియు శుభాలను అందజేస్తుంది. 

4) *ఉపచారాపదేశేన్ కృతాన్ హర హర్మయా,*

*అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ*

స్వామీ పురుషోత్తమా నీకు ఉపచారములు, పూజలు చేసే నెపంతో, ప్రతి రోజు నేను చేసే అపకారములను మన్నించి క్షమించగలవు. భక్తులు ప్రతి రోజు *పూజ లేక భగవత్ ధ్యానము తదుపరి, భగవంతుని పై విధంగా వేడుకొనుట ఒక మర్యాద మరియు సంస్కారము*.

5) *యోగ కర్మ సుకౌశలమ్*

 అంటే సంసారిక జీవనాన్ని అర్థం చేసుకుని, ఇందులో చిక్కుకొనని విధంగా, సర్వ విధ ప్రవృత్తుల్ని, చాలా మెళుకువతో, కౌశల పూర్ణంగా కొనసాగించడం.


పైన తెల్పిన గీతా వచనం బాగా అవగాహనలో ఉండటమే గాక ఆచరణలో ఉండడం గూడా మహానుభావుల విశేష లక్షణం. వీరికి తాము చేసే సంసారిక వ్యవహారాలన్నీ, తమకు అంటకుండా ఉండేలా చేసే విధానం పట్ల అవగాహన ఉన్నదను విషయం స్పష్టం. ఏమిటా అవగాహన.... చేసే ఏ కర్మైనా భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నాం తప్ప, వ్యక్తిగత ప్రయోజనానికి కాదన్న భావన దృఢంగా ఉంటుంది. *అందువలననే తాము చేయవలసిన ధార్మిక, సమాజ హితకర పనులను ఎట్టి అవాంతరాలు ఏర్పడినా భయంతో మానడమొ లేక వైరాగ్య భావనతో పూర్తిగా విడిచి పెట్టడమొ చేయరు*. శాస్త్రం విధించిన సత్కర్మలు చెసి, ఫలాన్ని పరమాత్మకు విడిచిపెడతారు. ఈలా వివేచనతో కర్మాచరణ సాగించడమే వీరి విశిష్టత.


ధన్యవాదములు

*శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం*



 *శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం* 


*అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం.* *రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. శరణాగతి ద్వారా ఎవరైనా పరమాత్మను చేరుకుని, ఆయనతో ఒక్కటిగా కలిసి ఉండవచ్చని తెలిపారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, మోక్షం పొందడానికి ఎవరైనా అర్హులేనని చాటి చెప్పారు.* *ఒకనాడు రామానుజుడు లేకపోతే, ఈ నేలపై విగ్రహాలతో కూడిన ఆలయాలు లేవు. అనేకానేక ఆరాధనా పద్ధతులూ లేవు. ఈనాడు రామానుజుని స్ఫూర్తి మనలో లేకుంటే, సనాతన ధర్మనిష్ఠకు అర్థం లభించదు. ఆచరణ సాధ్యం కాదు...*


*వేయి సంవత్సరములకు పూర్వమే…* 


*మహోన్నతమైన మంత్రాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన సంఘసంస్కర్త వారు...!!!*


*సామాజిక వైషమ్యాలు ఎగచిమ్ముతున్న సమయంలో సమత్వ దృష్టితో, ప్రజలను “మనమంతా ఒక్కటే”నని మమైకం చేసినవారు.*


*వారు ప్రపంచాన్ని వసుదైవ కుటుంబంగా భావించి ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేసి ఆదర్శమయ్యారు.*


*ఒక దేశంలో ఉగ్రవాదం. ఒక దేశంలో వర్ణ వివక్ష. ఒక దేశంలో తీవ్ర దుర్భిక్షం. ఒక దేశంలో ఆటవిక న్యాయం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకూ, మానవాళిని కలవరపెడుతున్న ప్రతి సంక్షోభానికి.. శ్రీమత్‌ రామానుజాచార్యుల బోధనలో పరిష్కారం ఉంది.*


*శేషావతార రూపమశేషజనౌఘాఘహరణచరణాబ్జమ్‌ శ్రీభాష్యకార మమలం కలయే రామానుజం కృపాసింధుమ్‌*


*సముద్రమంత తన అపార కరుణ చేత అశేష జనుల పాపాలను హరించడానికి… శ్రీమన్నారాయణుని శయ్య అయిన ఆదిశేషుడే…. భగవద్రామానుజులుగా, శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు. ఆయన చరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.*

పూజ అంటే,*

  🙏*శుభోదయం*🙏


*పూజ అంటే,*

కేవలం చేతులు జోడించడం కాదు!.

ఆత్మను పరమాత్మతో అనుసంధానించే,

ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక ప్రక్రియ!.


ఇందులో ప్రత్యేకమైన పాత్ర,

పోషిస్తాయి పువ్వులు!.

వాటి రంగు, పరిమళం, సున్నితత్వం,

శోభ వంటి నాలుగు ముఖ్యమైన

లక్షణాలూ అద్భుతంగా కలిసిపోయి,

దేవుడి పూజలో విశిష్టస్థానం పొందాయి!.


'పుష్పం దేవ ప్రియతరం' అని,

పురాణాలు చెబుతున్నాయి!.

దేవుడు పూలనే ఎక్కువ

ఇష్టపడతాడని దానికి అర్థం!.


పువ్వు మన హృదయ భావానికి ప్రతీక!.

ఆయుర్దాయం చాలా తక్కువైనప్పటికీ,

పువ్వు విరిసే క్షణం నుంచీ తన జీవన 

ప్రయోజనాన్ని నెరవేర్చుతుంది!.

భక్తుడి జీవితం కూడా

అలా ఉండాలని చెబుతుంది!.

భగవంతుడి పాదాలపై పూలను ఉంచినట్లు,

మన విశ్వాసాన్ని సమర్పించడమే భక్తిమార్గం!.


పూజలో పువ్వులను ఉపయోగించడానికి,

ప్రధాన కారణం సమర్పణభావం!.

ఆ సమయంలో భక్తుడు వాటి పరిమళాన్ని,

సౌందర్యాన్ని తిరిగి పొందాలని ఆశించడు!.

ఇది నిస్వార్ధమైన భక్తికి ప్రతీక!.


పువ్వు అందంగా, పరిమళభరితంగా 

ఉన్నా త్వరగా వాడిపోతుంది!.

మన శరీరమూ అలాగే అనిత్యమన్న,

గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది!.


ఎంత అందంగా, ఆరోగ్యంగా ఉన్నా,

ఈ భౌతిక శరీరం, ఏదో ఒకరోజు 

వాడిపోక తప్పదు!.

కాబట్టి శాశ్వతమైన ఆత్మపై...

దృష్టి సారించాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని 

పువ్వు అందిస్తుంది!.


తాత్కాలికమైన దేహంలోంచి...

నిత్యమైన భక్తి పుట్టాలని,

ఈ పుష్పార్చన మనకు బోధిస్తుంది!.

దేవుడు అంటే సృష్టి!. సృష్టి అంటే ప్రకృతి!!.

ప్రకృతి ఇచ్చిన దానితో పూజించడమే 

నిజమైన ఆరాధన!.

తెలుసుకుందాం

 *✅ తెలుసుకుందాం ✅*




*రాత్రివేళ పూల నుంచి సువాసనలేల? Good smell to flowers during nights?*


కొన్ని పూలకు ఆకర్షణీయమైన రంగులు ఉంటే మల్లె, నైట్‌క్వీన్‌(రాత్‌కీ రాణి) లాంటి పూలకు మధురమైన సువాసన ఉంటుంది. కొన్ని పూలకు రంగు, సువాసనా రెండూ ఉంటాయి. వీటి వెనుక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. క్రిమికీటకాలు, తేనెటీగలు, తుమ్మెదలు, సీతాకోక చిలుకలు పూలలోని మకరందాన్ని పీల్చుకుని జీవిస్తాయి. ఇవి పూలపై వాలినపుడు వాటి కాళ్లకు, రెక్కలకు పూలలోని పుప్పొడి అంటుకుంటుంది.


ఈ కీటకాలు మరో పువ్వుపై వాలినపుడు పుప్పొడి రేణువులు ఆ పూవు అండాశయాన్ని చేరి ఫలదీకరణం జరుగుతుంది. అపుడే పువ్వు కాయగా మారుతుంది. అవే పండ్లుగా మారి వాటి గింజలు భూమిపై పడి మొలకెత్తి మొక్కలు పెరుగుతాయి. ఈ విధంగా మొక్కలు ఉత్పత్తి కావడానికి ఉపయోగపడే కీటకాలను ఆకర్షించేందుకే పూలకు అందమైన రంగులు, రకరకాల సువాసనలు ఏర్పడతాయి.


కీటకాల్లో కొన్ని పగలు సంచరిస్తే మరికొన్ని రాత్రివేళల్లో తిరుగుతుంటాయి. పగటి వేళ వీటిని ఆకర్షించడానికి వాటి రంగులు దోహదపడతాయి. రాత్రివేళ రంగులు కనబడవు కాబట్టి రాత్రి పూచేపూలు మరింత ఎక్కువగా సువాసనను వెదజల్లుతాయి.


సాయం వేళల్లో, రాత్రులలోని వాతావరణ పరిస్థితులకు మాత్రమే ప్రేరణ పొంది వికసించే జాజి, మల్లె, నైట్‌క్వీన్‌ లాంటి పూలకు మనోహరమైన సువాసన ఉండటానికి కారణం అదే. రాత్రిపూట రంగులతో పని ఉండదు కాబట్టి సాధారణంగా అలాంటి పూలు చీకటిలో కనిపించేందుకు వీలుగా తెల్లని రంగులో ఉంటాయి.

ఆలోచించే వాడు

  ఓ వైశ్య వ్యక్తి, ఓ రెడ్డిగారు , ఓ రావు గారు  ముగ్గురూ ఓ నౌకలో ప్రయాణిస్తున్నారు.సముద్రం మధ్యకి నౌక చేరగానే ఒక సముద్ర రాక్షసుడు వారి ముందు ప్రత్యక్ష మయ్యాడు.మిమల్ని తినేస్తా అని పెద్దగా కేకలు 

పెడుతున్నాడు.


ముగ్గురూ భయంతో వణికి పోతున్నారు.వారు భయపడటం చూసిన రాక్షసుడికి ఒక చిలిపి ఆలోచన వ వచ్చింది.వాళ్ళతో యిలా అన్నాడు,మీ ముగ్గురూ మీకు తోచింది సముద్రం లోకి విసిరి వేయండి.

 

నేను తెచ్చి యిస్తే గెలుపునాదే.వస్తువు తేలేకపోతే గెలుపు మీది వాళ్ళని వదిలేస్తాను.వాళ్లకు నేను జీవితాంతము బానిసగా వుంటాను అన్నాడు.సరే నని 

ముందు రెడ్డిగారు  తన చేతి వజ్రపు ఉంగరం విసిరేశాడు.సముద్రం లో మునిగి కాసేపటికి రాక్షసుడు 

ఆ ఉంగరాన్ని తెచ్చి ఆ వ్యక్తిని మింగేశాడు. రావు గారు తన చేతికున్న ఖరీదైన వాచీ ని నీళ్ళలోకి విసిరేశాడు.


రాక్షసుడు సముద్రం లోకి దూకి దాన్నీ తెచ్చేసి అతన్ని మింగేశాడు.యింక వైశ్య వ్యక్తి వంతు వచ్చింది.


 

అతను కొంచెం యోచన చేసి తన దగ్గరవున్న నీళ్ళ సీసా మూత తీసి అందులోని నీళ్ళను సముద్రం లోకి ధారగా పోశాడు.నా మంచి నీళ్ళను నాకు తెచ్చి యివ్వు అన్నాడు.


ఆ దెబ్బకి రాక్షసుడికి దిమ్మ తిరిగి పోయింది.ఇది వైశ్యవాడిదెబ్బ  ఎలావుంది?అన్నాడు రాక్షసుడి తో.రాక్షసుడు తన ఓటమి ఒప్పుకొని 

అతనికి బానిసగా ఉండటానికి ఒప్పుకున్నాడు.నా స్నేహితుల నిద్దరినీ     బ్రతికించు అని ఆజ్ఞాపించాడు..వాడు వాళ్ళని కక్కేశాడు.


మంచి పని చేశావు.యింక ఎవ్వరినీ యిలా బాధించకుండా వుంటానంటే నిన్ను బానిసత్వం నుంచి విముక్తుడిని చేస్తాను అన్నాడు.రాక్షసుడు అలా చెయ్యనని ప్రమాణం చేసి సముద్రం లోకి దూకి మాయమయ్యాడు.

🙏 *ఎంతటి ఆపద వచ్చిన ఆలోచించే వాడు ఆర్యవైశ్యడు* 🙏

ప్రవృత్తి మార్గం=అభ్యుదయ నివృత్తి మార్గం=నిశ్రేయస

 ప్రవృత్తి మార్గం=అభ్యుదయ 

 నివృత్తి మార్గం=నిశ్రేయస 


🪷🪷🪷🪷🪷🪷🪷🪷🪷

మనిషి జీవితం రెండు ప్రధాన వైఖరుల మధ్య సాగిపోతుంది – ప్రవృత్తి మరియు నివృత్తి. ఇవే మన దైనందిన జీవన ప్రయాణానికి మౌలిక ఆధారాలు.


ప్రవృత్తి మార్గం అంటే లోకంలో కకపదానికి మూలార్థం ప్రవర్తన. అంటే ఎవడైతే ఈ ప్రపంచంలో జీవిస్తూ, పనులు చేస్తూ, బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రవర్తించేవాడో, వాడికి తగిన మార్గమే ప్రవృత్తి మార్గం. ఈ మార్గంలో జీవుడు బాహ్య ప్రపంచపు వాసనలకు లోనై, భోగాల పట్ల ఆశతో, కోరికలతో, భావోద్వేగాలతో జీవిస్తాడు. “ఇది నా దానీ, నాకు అవసరం, నా స్వంతం” అనే భావాలతో అనుభూతులకు లోనవుతాడు. లౌకిక ఆలోచనలు, సంపాదనలు, పేరుప్రతిష్ఠలు, కుటుంబబాధ్యతలు—ఇవన్నీ ప్రవృత్తి మార్గానికి కలిసొచ్చే అంశాలు. దీనినే ప్రేయో మార్గంగా కూడా పిలుస్తారు.


 


ఇదుకు విరుద్ధంగా, నివృత్తి మార్గం లోకానికి వ్యతిరేకత కాదు గాని లోకంలో ఉండీ లోకానికి అసక్తిగా, అంతర్ముఖంగా జీవించే మార్గం. ఈ దారిలో జీవుడు తన మనస్సును అంతర్గతంగా మళ్లించి, ఇంద్రియాలను నియంత్రించి, ధ్యానం, పరిశీలన, పరమార్ధం వైపు ప్రయాణిస్తాడు. నిజమైన ఆనందం బాహ్య లోకంలో కాకుండా, అంతర్లీనంగా ఉన్న పరబ్రహ్మ స్వరూపానికే చెందిందని తెలుసుకుని, లోపల అన్వేషణ ప్రారంభిస్తాడు.


ఈ మార్గంలో అడుగుపెట్టాలంటే మొదటగా మన ఇంద్రియాల స్వేచ్ఛను అణచాలి. ప్రపంచ విషయాలపై ఆకర్షణను తగ్గించాలి. ఏది నిజంగా నిలిచేది? ఏది క్షణికంగా మాయమవేది? అన్న ప్రశ్నలను మనసులో కలిగించాలి. ?మన? కలిసిపోయే దుఃఖాలు, అపార్థాలు మనసు లోతుల్లో వేరుకాలిపోతూ బాధలు కలిగిస్తాయి. వాటిని గుర్తించడానికి జాగ్రత్త అవసరం. వాటి ప్రభావం నుంచి బయటపడాలంటే సంకల్పబలం, ధైర్యం, పట్టుదల అవసరం.


 


నివృత్తి మార్గంలో జీవుడు “నేను ఈ శరీరం కాదు, ఈ మనస్సు కాదు, నేను పరబ్రహ్మ స్వరూపుడను” అనే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఈ బోధకు మూలం సద్గురువు మార్గదర్శనం. అలాగే ఇంద్రియ నియమనం, విషయాలపై నిరాసక్తత, ధ్యానంలో స్థిరత వంటి లక్షణాల ద్వారా ఆత్మశుద్ధి ఏర్పడుతుంది. ఈ మార్గంలో నడిచేవాడికి దైవ అనుగ్రహం లభిస్తుంది. అతడు భయాలూ, అపార్థాలూ లేకుండా జీవించి, ఫలితాలపై ఆశ లేకుండా, కేవలం భగవత్ ప్రీతి కోసం కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాడు. శాంతి, సమత, పరితృప్తి – ఇవే అతని అసలైన సంపదలు.


చివరగా, ప్రవృత్తి – నివృత్తి అనే రెండు మార్గాలు పూర్తిగా విరుద్ధాలు కాదు. అవి ఒకరినొకటి తిరస్కరించవు. జీవితంలో ఇవి పరస్పర అనుసంధానంతో సమతుల్యతను ఏర్పరచుతాయి. స్వార్థాన్ని త్యజించి, ఆత్మబలాన్ని పెంపొందించుకుంటూ, గురువు కృపతో జీవించినవాడే జీవన పరమార్థాన్ని తెలుసుకునే ఆదర్శ జీవి. నివృత్తి మార్గమే అసలైన లోపలి శాంతికి, పరబ్రహ్మానందానికి దారి చూపే మార్గం.


తిరస్కరించవు. జీవితంలో ఇవి పరస్పర అనుసంధానంతో సమతుల్యతను ఏర్పరచుతాయి. స్వార్థాన్ని త్యజించి, ఆత్మబలాన్ని పెంపొందించుకుంటూ, గురువు కృపతో జీవించినవాడే జీవన పరమార్థాన్ని తెలుసుకునే ఆదర్శ జీవి. నివృత్తి మార్గమే అసలైన లోపలి శాంతికి, పరబ్రహ్మానందానికి దారి చూపే మార్గం.

దండం దశగుణం భవేత్

 〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

*దండం దశగుణం భవేత్' అనే వాక్యార్ధము గురించి వివరణ:*


ఈ వాక్యానికి మూడు అర్ధాలు స్ఫురిస్తాయి. మొదటి అర్ధం : దండం (కర్ర) లాగా నేలమీద పడి, సాష్టాంగ నమస్కారం చేస్తే, ఎదుటివారిలో పది మంచి గుణాలు కలిగి, కార్యం సానుకూలం అయ్యే అవకాశం ఉంది. అలా ప్రణిపాతం చెయ్యక, తలవంచి దండం (నమస్కారం) పెట్టినా, ఎదుటివారు, దణ్ణం పెట్టిన వారిని ఆదరించి పనులు చక్కపెట్టవచ్చు ! 


ఇక రెండవ అర్ధంలో దండం (కర్ర) పట్టుకుని నాలుగు వడ్డిస్తే, అలా శిక్షపడిన వాడిలో వినయం, భయం, భక్తి వంటి పది గుణాలు ఆవిర్భవించి పనులు చకచకా పూర్తయ్యే అవకాశం ఉండవచ్చు. చాలామంది ఈ అర్ధంతోనే ఈ వాక్యాన్ని ఉపయోగిస్తూంటారు. 


ఇక మూడవ అర్ధంవచ్చే శ్లోకం ఒకటుంది.


*“విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషుచ అంధ్యే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్.”* ఈ శ్లోకం ప్రతిపదార్ధం చూద్దాం.


వి=పక్షి, శ్వ=కుక్క, అమిత్ర= శత్రువు, అహి=పాము, పశుషు=పశువులను కట్టడి చెయ్యడంలోను, కర్దమేషు=బురదలోను, జలేషుచ=నీటిలోను, అంధ్యే=గ్రుడ్డితనం లోను, తమసి=చీకటిలోను, వార్ధక్యే=ముసలితనంలోను, దండం=కర్ర, దశగుణం భవేత్= ఈ పదివిధాల పనికివస్తుంది. అందువల్ల, కర్ర ఒకటి చేతిలో పట్టుకుంటే, ఆహారం ఎండబెట్టుకుంటే దానిమీద వాలే కాకులవంటి పక్షుల్ని కొట్టవచ్చు. వీధికుక్కల్ని తరిమికొట్టవచ్చు. శత్రువులను భయపెట్టవచ్చు. పాములను, పశువులను కొట్టవచ్చు. బురదలోను, వరద నీటిలోను నడిచి వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. అంతేనా, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలో కూడా కర్రతో నడిచి వెళ్ళవచ్చు. మహాకవి కాళిదాసు అంతఃపుర ఉద్యోగులు చేతితో పట్టుకొనే దండంతో ధర్మాన్ని పోల్చాడు. దానితో అన్ని వయసుల్లో అన్ని కాలాల్లో పని ఉన్నా లేకపోయినా దాన్ని చేతిలో ధరిస్తే, అది అవసరమైన సమయాల్లోను, ముసలితనంలోను మనల్ని కాపాడుతుంది. అలాగే ధర్మంకూడా ! ధర్మాన్ని ఆచరించేవాడిని, ఆ ధర్మమే రక్షిస్తుంది.

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

సోమవారం🕉️* *🌹13ఏప్రిల్2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🕉️సోమవారం🕉️*

*🌹13ఏప్రిల్2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం*  

             

          *ఈనాటి పర్వం*

              *సర్వేషాం* 

        *వరూధిన్యేకాదశి*


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : ఏకాదశి* రా 01.08 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : ధనిష్ఠ* సా 04.03 వరకు ఉపరి *శతభిషం*

*యోగం : శుభ* సా 05.17 వరకు ఉపరి *శుక్ల*

*కరణం  : బవ* మ 01.18 *బాలువ* రా 01.08 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 06.00-07.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *శేషం ఉ 06.57 వరకు*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    : రా 11.16 - 12.52*

*దుర్ముహూర్తం  : మ 12.33 - 01.23 & 03.03 - 03.53*

*రాహు కాలం   : ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.42 - 03.15*

యమగండం    : *ఉ 10.34 - 12.08*

సూర్యరాశి : *మీనం*                     

చంద్రరాశి : *కుంభం*

సూర్యోదయం :*ఉ 06.02*

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.54 - 08.23*

సంగవ కాలం     :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం   :*10.53 - 01.23*

అపరాహ్న కాలం   :*మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి  :చైత్ర బహుళ ఏకాదశి*

సాయంకాలం     :*సా 03.53- 06.22*

ప్రదోష కాలం       :*సా 06.22- 08.40*

రాత్రి కాలం        :*రా 08.40 - 11.45*

నిశీధి కాలం       :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        🌷*ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


         *కరచరణకృతం*  

 *వాక్కాయజం కర్మజం వా*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 12 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *55వ భాగం*``


*దత్తాత్రేయ అవతారం*```


బాల దత్తాత్రేయుడు మునులకు

గురువుగా ఉండటానికి తిరస్కరిస్తూ మునులకు దూరంగా వెళ్లిపోసాగాడు. మునులు వదలకుండా వెంటపడ్డారు. దత్తుడు వారికి దొరకకుండా చాలా దూరం వెళ్లి ఒక సరస్సు పైకి నడచుకుంటూ వెళ్లి మధ్యలో నీటిపై నిలుచున్నాడు.


వెంటపడ్డ మునులు సరస్సు తీరానికి చేరి సరస్సు మధ్యలో నీటిపై నిలిచిన బాల దత్తాత్రేయుని లీల చూసి ఆశ్చర్యంతో కీర్తించసాగారు. ఈత వచ్చిన కొందరు ఋషులు వదలకుండా నీటిలో దిగి ఈదుతూ దత్తాత్రేయుని చేరుకోవడానికి సరస్సు మధ్యకి వెళ్లారు. వారు సమీపానికి రాగానే దత్తుడు మెరుపు మెరసినట్లు అదృశ్యమయ్యి నీటిలోకి వెళ్లిపోయాడు.


అక్కడకి చేరిన మునులు నీటిలో ఎంత వెదికినా దత్తుడి దర్శనం లభించలేదు. తీరానికి తిరిగి వచ్చి ఎలాగైనా దత్తాత్రేయుడి దర్శనం చేసుకోవాలి అని అక్కడే ధ్యానంలో కూర్చున్నారు. కొంతమంది మునులు దత్తాత్రేయుడిని అన్వేషిస్తు భూమండలమంతా పర్యటించటానికి వెళ్లారు. కానీ దత్తాత్రేయుడి జాడ తెలుసు కోలేకపోయారు.


సరోవరం ఒడ్డున ధ్యానం చేస్తున్న మునులకు తపస్సులో నూరు సంవత్సరాలు గడచిపోయాయి. సరోవరం లోపల అడుగున సమాధి స్థితిలో ఉన్న దత్తాత్రేయుడు సమాధి స్థితి నుండి బయటకు వచ్చి నీటిపైకి వచ్చారు. తన శరీరంలో మూలాధార చక్రంనుండి సహస్రార చక్రం వరకు సప్త చక్రాలలో యోగశక్తి రూపంలో ఉన్న శ్రీ మహాలక్ష్మిని సంకల్పించి వెలుపలికి రమ్మన్నాడు.


శ్రీమహాలక్ష్మి ఋషికన్య రూపంలో దత్తాత్రేయుడి శరీరం నుండి బయటకు వచ్చి ఆయనకు నమస్కరించింది. దత్తాత్రేయుడు ఆమెను ‘అనఘా’ అని సంభో దిస్తూ "నీవు నా శక్తివి. నా లోపల యోగశక్తిగా నీవు ఉన్నప్పుడు నేను "దత్తాత్రేయ యతి" గా ఉంటాను. నేను ఇలా గృహస్థ రూపం ధరించినప్పుడు నీవు నా అర్ధాంగి "అనఘాదేవి" ఔతావు. నేను "అనఘుడను" అవుతాను.


నన్ను పూజించే పుణ్యాత్ములకు ‘ఋషిపత్ని’ గా నాతో కలసి దర్శనమిస్తావు" అని ఆమెను తన అంకపీఠం మీద కూర్చో బెట్టుకుని నీటిపై తేలుతూ దత్తాత్రేయుడు తీరానికి చేరుకున్నారు. 


దత్తాత్రేయుడు పరబ్రహ్మమని, అవతార పురుషుడు అని విశ్వసించి చిత్తశుద్ధితో తపస్సు చేసిన వారికి దత్తాత్రేయుడు ‘సచ్చిదానంద సద్గురు బ్రహ్మము’ గా, అనఘాదేవి దత్త యతీశ్వరుల అర్ధాంగిగా దర్శనమిచ్చారు.


చిత్తశుద్ధి లేని మునులకు దత్తుడు అనఘాదేవి సామాన్య దంపతులుగా కనిపించారు. వారు దత్తుడి దర్శనం కోసం అనవసరంగా సమయం వ్యర్థం చేసుకున్నామని అనుకుంటూ వెళ్లిపోయారు. పర బ్రహ్మముగా, అవతార పురుషుడిగా భావించి దర్శించిన మునులు దత్తదంపతులకు పాదాభివందనం చేశారు.


శ్రీ గురుదత్తులు దివ్యాశీస్సులు ఇస్తూ "మునులారా! గురువే బ్రహ్మము, గురువే విష్ణువు, గురువే శివుడు. కనుక త్రిమూర్తుల స్వరూపమైన గురువు నిరంజన నిరాకార పరబ్రహ్మ స్వరూపుడు అవుతాడు. ఈవిధంగా గురువుని భావించి ఆత్మార్పణ చేసుకున్న వారే ఉత్తమ శిష్యులు అవుతారు.


సద్గురువుకి శిష్యుడు, శిష్యుడికి సద్గురువు తప్ప మిగిలిన ప్రపంచం అంతా నిమిత్తమాత్రంగా కనిపిస్తుంది. ఇటువంటి భావనతో నన్ను విశ్వసించి పూజించే భక్తులను నేను దత్తత చేసు కుంటాను. నా భక్తులు ప్రపంచం లో ఎక్కడ ఉన్నా నిర్మల భక్తితో నన్ను స్మరించిన వెంటనే దర్శనమిస్తాను. కష్టాలు తొలగిస్తాను. వారి అంత్యదశలో మోక్షము ప్రసాదిస్తాను.


నన్ను విశ్వసించని విశ్వాసరహితులకు నా దర్శనం లభించదు. బ్రహ్మకల్ప మహాప్రళయం సంభవించే వరకు నేను విశ్వమంతా ఉంటూ నా భక్త జనులను కాపాడుతాను" అని అనుగ్రహ భాషణం చేశారు. మునులందరు "జయహో దత్తగురు దేవా! శ్రీ గురుదత్తా!" అంటూ తన్మయత్వంతో నమస్కరించారు. 


దత్తాత్రేయుడు వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


అప్పటి నుంచి శ్రీ గురుదత్తులు సహ్యాద్రి పర్వతం నివాసం చేసుకుని ఉన్నారు. ప్రతిరోజు ప్రదోషం కాలములో కాశీనగరంలో గంగా స్నానం చేసి గాణుగాపురంలో ధ్యానం చేస్తారు. తిరిగి కుఱుక్షేత్రంలో ఆచమనం చేసి వచ్చి మధ్యాహ్నం గాణుగాపురంలో అనుష్ఠానం చేస్తారు.


ధూతపాపేశ్వరంలో భస్మధారణం, కరహాటలో సంధ్యావందనము, కొల్హాపురంలో భిక్ష, పండరీపురంలో తిలకధారణ, పాంచాలేశ్వరంలో భోజనం, బదరికాశ్రమంలో శ్రవణం, గార్నర్ లో విశ్రాంతి, పశ్చిమ సముద్ర తీరంలో సాయంసంధ్య ఆచరిస్తూ దత్తాత్రేయుల వారు నిత్యసంచారియై నిరంతరం తన భక్తులను అనుగ్ర హిస్తుంటారు...


              *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పిల్లేదైవం

 #పిల్లేదైవం#


ప్రతిదానికీ హేతుబద్ధంగా ఆలోచించే

అప్పారావు గారు రమ్మంటే ఓ రోజు

వారింటికి వెళ్ళాను.


ఆయన కూడా సాహిత్యాభిలాషి,ఆయన గదిలో అడుగు పెట్టగానే నన్ను ఆకర్షించిన

అంశం,గదిలో అందమైన ప్రేములో

గోడకు తగిలించి ఉన్న పిల్లి ఫోటో.


ఆశ్చర్యంగా చూస్తున్న,నాస్సందేహం

అర్ధం చేసుకున్న అప్పారావు గారు

అది నా హేతువాద గురువు.అందుకే దానికి రోజూ ఓ పువ్వు పెట్టి నమస్కరిస్తుంటాను అన్నారు.ఇంకా సందేహంగా చూస్తున్న నాకు పిల్లి ఆయన గురువైన కథ ఇలా చెప్పారు.

*** . ***** ‌‌. ***** ‌‌ ***

నాకు జాతకాలమీద‌ విపరీతమైన నమ్మకం ఉండేది.ఏది చెయ్యాలన్నా

జ్యోతిష్కుణ్ణి అడిగితే కాని చేసే వాణ్ణి కాదు.


నాకు ఏభై ఏళ్ళ వయసులో కళ్ళకి

ఇబ్బందులు వచ్చాయి,ఏ గ్రహప్రభావం ‌వల్లనో తెలుసుకుందామని జ్యోతిష్కుడు

గారి‌ఇంటికి బయలు దేరాను,గేటు

తీసుకొని బయటికి వచ్చేటప్పటికీ

మ్యావు‌ అంటూ పిల్లి ఎదురొచ్చింది.


ఈ వేళ పని కాదు అనుకుని జ్యోతిష్కుడి ఇంటికి వెళ్ళాను,

ఆయన లేరు,వెధవ పిల్లి శకునం అనుకుని ఆయన ఎప్పుడొస్తారని

అడిగితే, ఇంట్లో వారు చెప్పినది

ఏమిటంటే,కళ్ళు మసకలుగా

ఉన్నాయని‌ కంటి డాక్టర్ గారి ‌దగ్గరకు వెళ్ళారుట.


ఆ మాట వినగానే నాలో జ్నాన నేత్రం తెరుచుకుంది.నేనూ కంటి డాక్టర్ గారి ‌దగ్గరకు కదా వెళ్ళాలి

అని.అప్పటినుంచి నేను జాతకాలు

జోలికి పోకుండా సహేతుకంగా

ఆలోచిస్తూ హాయిగా ఉన్నా.దీనంతటికి కారణం నాటి

పిల్లి శకునం అన్నారు.


ఇంతలో ఛాయ్ తీసుకుని వచ్చారు

ఆయన శ్రీ మతి.


ఆయన చెప్పిన పిల్లి కథ విన్నాక

మరో వింత విషయం‌ చెప్పారు.


అదేమిటంటే


ఈ మధ్య‌ యాత్రలకు వెళ్ళి నప్పుడు #వైదీశ్వన్# వెళ్ళడం జరిగిందిట.సరే జాతకాలు వదిలేసి

ఓ ఇరవై‌ఏళ్ళయింది,ఓ సారి చూద్దాం అని నాడీ జ్యోతిషం చూపించుకున్నారట.


అందులో ‌అనేక విషయాలు చెబుతూ,నీకు జాతకాలు మీద

నమ్మకం ఉండదు, కాకపోతే మీ జీవితం ఓ పిల్లి వల్ల మారింది,మీకు

నమ్మకం ఉంటే ఓ పిల్లి ఫోటో కి

రోజూ ఓ పువ్వు పెట్టి, అగరొత్తులు

వెలిగించమన్నాట్ట.


వింతగాలేదండీ‌ ఈ పిల్లి కథ.

                     ***** 

జయంతి లక్ష్మీ నరసింహం

గౌరీశంకర

  🌸గౌరీశంకర లను స్తుతిస్తూ సీస పద్యం🙏


శ్రీపార్వతీవరా! శ్రితజన మందార !

      శ్రీకర ! సుందరా ! శ్రీగిరీశ !

రాజరాజేశ్వరీ ! రజతాద్రి వాసిని

      పాలించు సతతంబు భవుని రాణి!

వేద మంత్రాకార ! విశ్వ సంరక్షకా !

      శివకామసుందరీ చిత్తచోర !

అగ్నిలింగాకార ! అరుణాచలేశ్వరా !

      ఆర్త జనోద్ధార ! యహి విభూష !


తే.గీ:

రమ్ము మముగావ పరమేశ రమ్యదేహ ! 

నిన్ను నమ్మితి నిరతమ్ము నీలకంఠ !

పార్వతీ నాథ! శంకరా పరమపురుష!

శశిధరా ! యీశ ! గౌరీశ శరణు శరణు !


జయలక్ష్మి

కన్యాశుల్కం' తిట్లు'*

 *కనుమరుగైన 'కన్యాశుల్కం' తిట్లు'*

*“నన్ను సప్తవెధవని చేశావు”* అంటాడు రామప్పంతులు మధురవాణితో! 'సప్తవెధవ' అనేది సామాజిక చరిత్రకు సంబంధించిన పదం. పురుషుణ్ణి స్త్రీ ఎంచుకుంటుంది కాబట్టి అతనికి వరుడు అనే పేరొచ్చింది. స్త్రీ అలా వరులను ఏడుసార్లు మార్చుకోవచ్చు. ఏడోసారి కూడా స్త్రీ అతణ్ణి వరించకపోతే అతణ్ణి 'సప్తవెధవ' అంటారు. ( రాంభట్ల కృష్ణమూర్తి 'వేల్పుల కథ)

 

*" నీ ఇంట కోడిని కాల్చా"* అంటాడు అగ్నిహోత్రవదాన్లు. 'మీ ఇంట పీనుగెళ్ళా! అనే తిట్టు లాంటిదే ఇది. పూర్వం కొన్ని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే కోడిని శవం చుట్టూ ముమ్మారు తిప్పి ఆ తరువాత కాల్చేవారు. అనంతరం దాని ఆ ఇంటి చాకలి తీసుకుపోయేవాడు.


*"నా సొమ్మంతా 'ఘటాశ్రాద్ధపు' వెధవల పాలవుతుంది”* అని లుబ్దావధాన్లు, *“రేపు ఇంటికి వెళుతూనే 'ఘటాశ్రాద్ధం' పెట్టేస్తాను”* అనిఅగ్నిహోత్రావధాన్లు వేరువేరు సందర్భాల్లో తిడ

తారు. ఘటం అంటే కుండ. శ్రాద్ధం అంటే పితృదేవతలను ఉద్దేశించి చేసే దానం మొ॥ కార్యాలు. శ్రాద్ధకర్మలుమొత్తం 10 .అవి ఏకోద్దిష్ట , నిత్య, దర్శ, మహాలయ, సపిండి లేక సపిండీకరణ, తీర్థ, నాందీ, హిరణ్య, ఆమ, ఘట. చివరిదైన ఘటశ్రాద్ధం గురించి“పతితుడైనవాడుప్రాయశ్చిత్తానికి ఒప్పుకోకపోగా, అతనిజ్ఞాతులు బతికి ఉండగానే అతనికి ప్రేతకార్యం జరిపి, ఒక కుండను నీటితో నింపి, దాసితో దానిని తన్నించి నీటిని ఒలకపోయించడం అనే అపరకర్మ. 'ఘటనినయం' అనితెలుగుఅకాడమీ వివరించింది.

 

*“దండుముండా'* అని తిడతాడు రామప్పంతులు పూటకూళ్ళమ్మని, 'దండు' అంటే 'సమూహం' అని అర్ధం. దండుముండ అంటే 'బజారుముండ' అని అర్ధం చెప్పాయి కొన్ని నిఘంటువులు.


 మధురవాణి *“ఏం నంగనాచివే!”* అంటుంది ఆడపిల్లవేషంలో ఉన్న కరటకశాస్త్రి శిష్యుడితో. 'నంగనాచి' అంటే సామర్థ్యంఉండి కూడా ఏమీ తెలియనట్టు ఉండటం' అనికొన్ని నిఘంటువుల్లో ఉంది. కానీ “అందరితోనూ ప్రేమకలాపాలు సాగించే పడుచు" అని తెలుగుఅకాడమీ నిఘంటువుసూచిస్తోంది. అసలు ఇది హిందీ నుంచివచ్చిందని పరిశోధకులఅభిప్రాయం. 'నంగా' అంటే 'నగ్నం' అనీ, 'నాచ్‌' అంటేనృత్యంఅనీ అర్ధాలు ఉన్నాయి. సిగ్గు విడిచి నగ్నంగా నృత్యం చేయడంసాహసమే కాబట్టి 'సిగ్గు విడిచినది' అని చెప్పే సందర్భంలో ఈతిట్టు వాడుకలోకి వచ్చి ఉంటుందనిసురవరం ప్రతాపరెడ్డిగారు 'శబ్దాల ముచ్చట' అనే వ్యాసంలో వివరించారు.


*'ధగిడీకె'* అనికరటకశాస్త్రి నోట వెలువడిన తిట్టు ఉర్దూపదం. గోదావరి జిల్లాలో 'గయ్యాళి' అనితిట్టడానికి ఈ మాట వాడేవారు. నీచస్త్రీ, దుష్టుడు అని ఈ మాటకు అర్ధం. సి.పి.బ్రౌన్‌ కాలంనాటికి కూడా ఈ పదం వాడుకలో ఉందేమో! jade, slut,wretch అనే ఇంగ్లిష్‌ అర్థాలు ఇచ్చాడు తన నిఘంటువులో. కానీఈనాడెక్కడా ఈ పదం వాడుకలో వినిపించదు.


*“భష్టాకారిముండా!"* అని తిడతాడు లుబ్ధావధాన్లు తన కూతుర్ని (మీనాక్షిని). ఈ మాటకు రెండర్థాలున్నాయి. “భష్టాకారి' అనేది భ్రష్టఅనే రూపం నుంచి వచ్చింది. భ్రష్టుడు=వెలివేయబడ్డవాడు అనిఅర్థం. ఈస్కమ్మునిటెడ్ అన్నాడు బ్రౌన్ . హిందీలో భ్రష్ట అంటే పతిత అనే అర్ధం ఉంది. 


వితంతువుని పెళ్ళాడానేమో అని ఆందోళన చెందుతున్న లుబ్ధావధాన్లుతో *“ఎందుకీ తంబళ అనుమానం?”* అంటుంది మీనాక్షి. సురవరం ప్రతాపరెడ్డిగారు తంబల జాతివారు పూర్వం గ్రామాలలో తమలపాకులనిచ్చే వృత్తిలో ఉండేవారని అన్నారు. సి.పి.బ్రౌన్‌ “బ్రాహ్మణ స్త్రీ యందు బ్రాహ్మణునికి దొంగతనంచేత పుట్టి, ఆగమాలు చదివి శివార్చన చేసే ద్విజుడు” అన్నారు.(Aman of mixed caste, descended from a female brahmi, by adultery with a man ofthe same tribe. A brahmin who officiates in the temple of Sova) “తంబళ అనుమానం” అనేది జాతీయం.


*“అభాజనుడా!”* అని తిడతాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుని. ఈ తిట్టు ఇపుడెక్కడా వాడుకలో వినిపించదు. అయోగ్యుడు. అసమర్ధుడు అని ఈ మాటకి అర్ధం jade, slut, wretch అనే ఇంగ్లిష్ అర్ధాలిచ్చాడు బ్రౌన్.


“ఇలాంటి *'చాడీకోర్‌'* కబుర్లు చెప్పడానికి యవడికి గుండెఉంది” అంటాడుగిరీశం రామప్పంతులుతో. “చారీఖోర్‌" అనేఉర్దూ పదం దీనికి మూలం. salanderer, a tale bearer, కొండెగాడు, చాడీ కత్తె a busybody, a girl that tells talesఅని వివరించాడు బ్రౌన్‌.


 “మధురవాణి *'సిగ్గోసిరి'* దాన్ని వదిలేస్తాను” అంటాడు రామప్పంతులు. వీళ్ళమ్మా *'శిఖాతరగా'* అంటాడు అగ్నిహోత్రావధాన్లు. ఈ రెండు తిట్లూ ఒకటే. నాటకంలో చాలా సందర్భాల్లో వస్తాయి. “దీని సిగతరగా' అనేది ఈనాటి వ్యవహార రూపం. సిగ్గోసిరి (సిగ+కోసిరి) అన్నా, శిఖ తరగడం అన్నా, సిగతరగా అన్నా శిరోముండనం అనే అర్ధం. అంటే భర్తచనిపోయినపుడ పూర్వకాలం కొన్ని కుటుంబాలలో స్త్రీలకిజరిగేతంతు. ఎదుటి స్త్రీ మీద కోపం వచ్చినపుడు వాడే శాపనార్థంవంటి తిట్టు. కొన్నిసందర్భాలలో ఊతపదంగా కూడా కనిపిస్తుంది.


 “వాడు (గుంటూరుశాస్త్రి) *'పంచాళీ మనిషి'* అనడానికి సందేహం ఏమిటి? అంటాడు రామప్పంతులు లుబ్ధావధాన్లుతో. “పంచాళీ అంటేవదరుబోతు, వాచాలుడు, గయ్యాళి అనే

అర్ధాలున్నాయి. ప్రస్తుతం వాడుకలోవినిపించని తిట్టు ఇది.


“ఈ రామప్పంతులు కథ ' *పైన పటారం లోన లొటారం'* లా కనిపిస్తుంది” అంటుంది స్వగతంగా మధురవాణి. ‘పటారం'అసలు రూపం 'పటీరం'. చందనంఅని దీనికి అర్ధం. 'లొటారం'అంటే రంధ్రం, బిలం అనే అర్థాలున్నాయి. పైపై మెరుగులేతప్పలోపల శూన్యం అనే అర్ధంలో దీన్నిసామెతలా వాడుతుంటారు. 


 ఇలాకన్యాశుల్కం

నాటకంలోని పదాలు వివరించుకుంటూ పోతే పెద్ద గ్రంధం అవుతుంది.

సూర్యో మరీచిమాదత్తే।

  


సూర్యో మరీచిమాదత్తే। సర్వస్మాద్భువనాదధి|

తస్యాః పాకవిశేషేణ| స్మృతం కాలవిశేషణమ్|| 


ఈ మంత్రం కాలం (Time) ఎలా ఏర్పడుతుందో వివరిస్తుంది.


సూర్యః: సూర్యుడు


మరీచిమ్ ఆదత్తే: కిరణాల ద్వారా (శక్తిని/రసాన్ని) గ్రహిస్తాడు.


సర్వస్మాద్ భువనాత్ అధి: ఈ సమస్త లోకము నుండి (భూమిపై ఉన్న జలాన్ని, జీవశక్తిని).


తస్యాః పాక విశేషేణ: ఆ శక్తి పరిపాకము చెందడం వల్ల (మార్పు చెందడం వల్ల)


స్మృతం కాలవిశేషణమ్: వివిధ కాల విభాగాలుగా (క్షణాలు, ముహూర్తాలు, రోజులు, ఋతువులు) పిలువబడుతున్నాయి.


ఈ మంత్రం సూర్యుడికి, కాలానికి ఉన్న సంబంధాన్ని శాస్త్రీయంగా మరియు ఆధ్యాత్మికంగా వివరిస్తుంది:

 

శక్తి గ్రహణం:సూర్యుడు తన కిరణాల ద్వారా ఈ భూమండలం మీద ఉన్న సమస్త రసమును (నీటిని, తేమను) గ్రహిస్తాడు. ఇది భౌతికంగా 'బాష్పీభవనం' (Evaporation) వంటి ప్రక్రియను సూచిస్తుంది.


కాల చక్రం: సూర్యుడు గ్రహించిన ఆ శక్తి, తిరిగి వర్ష రూపంలోనో లేదా ఇతర మార్పుల ద్వారా పరిపాకం (Transformation) చెందుతుంది. సూర్యుడి గమనం మరియు ఈ శక్తి మార్పుల ఆధారంగానే మనకు క్షణం, ముహూర్తం, పగలు, రాత్రి, పక్షం, మాసం, ఋతువు, సంవత్సరం వంటి కాల విభాగాలు ఏర్పడుతున్నాయి.


ఆధ్యాత్మిక అర్థం: సూర్యుడు కేవలం వెలుగునిచ్చే గోళం మాత్రమే కాదు, ఆయనే "కాల స్వరూపుడు". జగత్తులో జరిగే ప్రతి మార్పుకు (పాకము) ఆయనే మూలకారణం. సూర్యుడి చలనం వల్లే కాలం పుడుతోంది, ఆ కాలం వల్లే ప్రాణుల పెరుగుదల, మార్పు సంభవిస్తున్నాయి.

సంక్షిప్తంగా చెప్పాలంటే: సూర్యుడు ఈ లోకం నుండి శక్తిని గ్రహించి, దానిని మళ్ళీ పరివర్తనం చెందించడం ద్వారానే మనం అనుభవించే ఈ 'కాలం' అనేది ఏర్పడుతోంది. అందుకే సూర్యుడిని 'కాలచక్ర ప్రవర్తకుడు' అని పిలుస్తారు.

చైత్ర బహుళ ఏకాదశీ - వరూధిని ఏకాదశీ 𝕝𝕝卐𝕝𝕝_*

 *_𝕝𝕝ॐ𝕝𝕝 13/04/2026 - చైత్ర బహుళ ఏకాదశీ - వరూధిని ఏకాదశీ 𝕝𝕝卐𝕝𝕝_*

*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*


*_వరూధిని ఏకాదశి ప్రాముఖ్యత_*

*┈┉┅━❀꧁ 🔆 ꧂❀━┅┉┈*


చైత్ర మాసం, కృష్ణ పక్ష ఏకాదశిని వరూధిని ఏకాదశి అని అంటారు. ఈ వ్రతం ఉత్తర భారత దేశంలో ఎక్కువగా ప్రచారంలో ఉంది.


పురాణాల ప్రకారం మన తెలుగు మాసాలలో వచ్చే ప్రతి ఏకాదశి మాదిరిగానే ఈ ఏకాదశికి కూడా ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది.


ఈ పవిత్రమైన రోజున అత్యంత నియమ నిష్టలతో శ్రీ మహావిష్ణువును ఆరాధించడం మరియు ఉపవాసం వంటివి చేస్తే మీకు దురదృష్టం పోయి, అదృష్టం వచ్చే అవకాశంతో పాటు మీరు ఇంతవరకు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వరూధిని ఏకాదశి వ్రతం కథ మరియు పూజా విధానాల గురించి తెలుసుకుందాం.


*_పద్మపురాణ ప్రకారం._*


పద్మపురాణం ప్రకారం, ఒకప్పుడు మంధత అనే రాజు నర్మదా నది ఒడ్డున ఉండి తన రాజ్యాన్ని పరిపాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉండేలా పాలించేవాడు.


ఒకరోజు ఆ రాజు అడవిలో తపస్సు చేస్తున్నప్పుడు, ఆ రాజుపై అకస్మాత్తుగా ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసింది. దీంతో ఆ రాజు భయపడ్డాడు. అయితే ఆ రాజు ఆ ఎలుగుబంటిని చంపలేదు. ఆ సమయంలో అతను విష్ణు మూర్తిని ప్రార్థించడం ప్రారంభించాడట. ఆ సమయంలో ఆ భగవంతుడు ప్రత్యక్షమై తన సుదర్శన చక్రంతో ఆ ఎలుగుబంటిని చంపేశాడు.


అయితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యే సరికే రాజు గారి కాలును ఆ ఎలుగుబంటి తినేసిందట. దీంతో ఆ రాజు చాలా నిరాశ చెందాడు. తన రెండు చేతులను జోడించి విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఇలా అడిగాడు. ‘ఓ ప్రభూ, ఇది నాకు ఎందుకు జరిగింది, అప్పుడు రాజు పూర్వ జన్మల పనుల ఫలాలకు ఇదంతా కారణమని చెప్పాడట.


అయితే అదే సమయంలో అదే శ్రీవిష్ణుమూర్తిని తన సమస్యకు పరిష్కారం ఏమిటని కోరాడట. అప్పుడు ఆ నారాయణుడు నా వరాహ అవతార విగ్రహాన్ని పూజించి వరూధిని ఏకాదశిని పాటించాలని చెప్పాడు. ఈరోజు ఉపవాసం ఉంటే మీరు కోల్పోయిన అవయవాలు మళ్లీ మీకు తిరిగి లభిస్తాయని చెప్పాడు.


ఆ దేవ దేవుని ఆదేశాల ప్రకారం ఆ రాజు వరూధిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ఆ దేవుని ఆశీర్వాదంతో తాను కోల్పోయిన అవయవాలను తిరిగి పొందుతాడట.


అప్పటి నుండి వరూధిని ఏకాదశిని హిందువులలో చాలా మంది పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ పర్వదినాన ఎంతో నిష్టతో జరుపుకుంటారు.

 

*_భవిష్యోత్తర పురాణం_*


భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వరూధినీ ఏకాదశి వ్రత మహిమను గురించి చెప్పడం జరిగింది.


'ధర్మరాజా వరూధినీ ఏకాదశి వ్రతం పాటించడం వలన స్త్రీలు మాంగల్య బలాన్ని పొందుతారు. పురుషులు సత్ప్రవర్తననూ, సంఘం లో గౌరవాన్నీ, ధన సంపదలనూ పొందుతారు. అంతే కాదు వరూధినీ ఏకాదశి వ్రతం ఆచరించడం పదివేల సంవత్సరాలు తపస్సు చేయడం తో సమానమైనది. సూర్య గ్రహణ సమయం లో సువర్ణదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. మాంధాత వరూధినీ ఏకాదశిని పాటించడం వలనే కష్టాలనుండీ బయటపడ్డాడు. అని స్వయంగా కృష్ణ భగవానుడే వరూధిని ఏకాదశి మహిమను కొనియాడాడు.


పరమపావనమైన ఈ రోజున ఇంటిలో లక్ష్మినారాయణులను భక్తితో పూజించి, పాలను నైవేద్యంగా ఉంచి, విష్ణు సహస్రనామములను, విష్ణు అష్టోత్తరములను పారాయణ చేసి, పాలు, పండ్ల వంటి సాత్వికాహారం తీసుకొని ఉపవాసం ఉండాలి. 


ఈ రోజున నిత్య పూజ, ఉపవాసాది కార్యక్రమములను చేయడం ద్వారా విశేషమైన సిరిసంపదలు కలుగుతాయి, సమస్త పాపముల నుండి విడివడి వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. 


ఏకాదశి రోజున ఉపవసించి, దైవదర్శనం చేసుకుని జాగరణను పాటించేవారు ఇహలోకంలో సకల శుభాలనూ పొందగలరు. 

వారికి పరలోకం లోనూ సద్గతులు సంప్రాప్తిస్తాయి. ప్రత్యేకించి ఈ వరూధిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది.


*_హరినామ స్మరణం_*

*_సమస్తపాపహరణం_*


 *_𝕝𝕝ॐ𝕝𝕝 oఓo నమో లక్ష్మీనారాయణాయ నమః 𝕝𝕝卐𝕝𝕝_*

12, ఏప్రిల్ 2026, ఆదివారం

పంచాంగం


 

విలువల సంక్షోభాన్ని

 సావడి కబుర్లు -7

వందేమాతరం 


ఈరోజు సహోద్యోగి శ్రీ కొణకంచి వెంకట సుబ్రహ్మణ్యం గారు "ఉఫోరియా" చిత్ర సమీక్ష రాస్తూ సామాజిక పరిస్థితులపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. నిజమే, నేటి సమాజాన్ని పరిశీలిస్తే మనసుకు కలిగే భావన ఒక్కటే, ఆవేదన. అభివృద్ధి, ఆధునికత, స్వేచ్ఛ అనే పదాలు మన జీవన విధానాన్ని మారుస్తున్నప్పటికీ, వాటి వెనుక దాగి ఉన్న విలువల సంక్షోభాన్ని మనం గమనించకపోతున్నాం.


అభివృద్ధి పేరుతో ముందుకు పరుగులు తీస్తున్న మనిషి, విలువలను వెనక్కి నెట్టేశాడు. సమాజం అన్ని దిక్కుల నుంచి బంధాలను తెంచుకుంటూ ప్రత్యేకంగా యువత హక్కులు అనే పేరుతో స్వేచ్ఛను విచ్చలవిడితనంగా అలవాటు చేసుకుంటోంది.‌ ఈ పరిణామం ఒక్క వ్యక్తి లేదా ఒక వర్గానికి సంబంధించినది కాదు. ఇది మొత్తం సమాజ నిర్మాణంలో ఏర్పడిన అసమతుల్యతకు ప్రతిబింబం. ఈ విశృంఖలత్వం ఒక భయంకర దావానలంలా నిశ్శబ్దంగా కాని వేగంగా సంస్కారమనే పచ్చని వనాన్ని దహించేస్తోంది. ఈ దావాగ్నిని ఆర్పకపోతే, రేపటి సమాజం విలువల రహితంగా మారే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి పరిష్కారం ఏమిటి? ఎవరిది బాధ్యత? ఎవరు బాధ్యత వహించాలి?. 


సమాజం అనే నిర్మాణం కుటుంబం, విద్య, సమాజం మరియు సాంస్కృతిక వాతావరణం అనే నాలుగు స్థంభాలపై నిలబడింది. ఈ నాలుగు చోట్లా బలహీనతలు ఏర్పడినప్పుడు, దాని ప్రభావం ప్రత్యక్షంగా యువతపై పడుతుంది. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, విద్యలో నైతికతకు ప్రాధాన్యం తగ్గిపోవడం, మరియు సమాజంలో వినోదం పేరుతో అసంబద్ధ ప్రభావాలు పెరగడం, సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ కలిసి యువతను దారి తప్పిస్తున్నాయి. ఫలితంగా, స్వేచ్ఛకు హద్దులు లేకుండా పోతున్నాయి.ఆత్మ నియంత్రణ అనే గుణం క్రమంగా కనుమరుగవుతోంది.


ఈ పరిణామం ఒక్కరోజులో రాలేదు. కుటుంబంలో విలువల బోధన తగ్గిపోవడం, ఉత్తీర్ణత మాత్రమే అర్హతగా వచ్చిన విద్యా విధానాల్లో మార్పులు, సాంఘిక మాధ్యమాల ప్రభావం అధికం కావడం, స్వేచ్ఛను బాధ్యతల నుండి వేరు చేయడం. ఫలితంగా యువతలో అహంకారం పెరిగింది, ఆత్మ నియంత్రణ తగ్గింది.


ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది కుటుంబంలో పెద్దల పాత్ర. గతంలో పెద్దలు కుటుంబానికి మార్గదర్శకులు, సంస్కారాలకు ప్రతీకలు, అనుభవానికి నిలయాలుగా ఉండేవారు. కానీ నేటి పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. నా బాధ్యతలు నేను నిర్వహించాను. ఇక ఎవరి కుటుంబాల వారివి. నా శేష జీవితాన్ని నాకు అనుకూలంగా, ఎవరికీ అడ్డం లేకుండా నా అభిరుచులకు అనుగుణంగా జీవిస్తాను అన్న దృక్పథం ఎక్కువగా కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో వానప్రస్థంగా భావించబడుతున్నప్పటికీ, శాస్త్రాలు చెప్పిన వానప్రస్థ ధర్మం ఇదికాదు. ఇది ఆధునిక కాలం తనకు అనుకూలంగా నిర్వచించుకున్న వానప్రస్థం. బాధ్యతారాహిత్యానికి వేసుకున్న ఒక చక్కని ముసుగు.


 మన ధర్మశాస్త్రాలు నిర్వచించిన చతుర్వర్ణ ఆశ్రమాల్లో వానప్రస్థం ఒకటి. భౌతిక ఆసక్తుల (ధనం, కుటుంబం) నుంచి విముక్తి‌. అంటే ఎవరు గదిలో వారు కూర్చొని "కృష్ణా రామా" అనుకోవడం కాదు. శాస్త్రాలు అంతవరకే నిర్వచించలేదు, సమాజానికి మార్గదర్శకత్వం వహించడం, తదుపరి తరానికి విలువలను అందించడం, అనుభవాన్ని పంచుకోవడం అనే పవిత్ర కర్తవ్యం వానప్రస్థం. అంటే సమాజం పట్ల పెరిగిన మరింత బాధ్యత. అది సమాజంలో ఆధ్యాత్మిక మరియు సంస్కార చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నించే బాధ్యత. మన పరిధిలో కూర్చుని ఉండటం కంటే, మనం సమాజానికి అందించిన రేపటి తరాన్ని (పిల్లలు, యువత) సరైన సంస్కార మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి. సనాతన ధర్మం ప్రకారం, కుటుంబంలో పెద్దవారు (వృద్ధులు) కుటుంబానికి, సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే *లోకాన్ని వదిలేయడం కాదు, లోకానికి మార్గం చూపడం వానప్రస్థం.*


*తస్మిన్ గృహే భవతి యదా బాల్యం వృద్ధతా ధ్రువా ।*

*తస్య తత్కార్యమాచార్యః ప్రవర్తేత సదా గురుః ॥* 


మనుస్మృతిలో చెప్పినట్లు కుటుంబంలో వృద్ధులు గురువులుగా మారి మార్గదర్శకత్వం వహించాలి. శాస్త్రవాక్యాలు కూడా ఇదే విషయాన్ని బలంగా తెలియజేస్తున్నాయి. కుటుంబంలో బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ప్రతి దశలో పెద్దలు మార్గదర్శకులుగా ఉండాలి. కేవలం మాటలతో మాత్రమే కాదు, ఆచరణతో చూపించే మార్గదర్శకత్వమే నిజమైన ఉపదేశం.


రామాయణంలో దశరథ మహారాజు తన పిల్లలకు ధర్మాన్ని నేర్పించిన విధానం వల్లే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడిగా ఎదిగాడు. సమాజానికి రక్షకుడు అయ్యాడు. పెద్దలు తమ ఆస్తిగా సంస్కారం కూడా పిల్లలకి ఇవ్వాలి. ఇవ్వకపోతే, పిల్లలు "అధర్మ మార్గం"లో పడతారు. అందుకే

పెద్దల సమయోచిత మార్గదర్శనం లేకపోవడమే మహాభారతంలో కౌరవుల వైఫల్యానికి కారణంగా చెప్పవచ్చు,


నేటి సమాజంలో యువత ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఇదే లోపాన్ని సూచిస్తున్నాయి. సాంకేతికత ఒక వరంగా మారాల్సింది, కానీ అది కొంతవరకు వ్యసనంగా మారింది. సోషల్ మీడియా ప్రభావం, అసభ్య కంటెంట్, మాదకద్రవ్యాల ఆకర్షణ ఇవన్నీ యువతను నిశ్శబ్దంగా దారి తప్పిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 2025లో 30% యువత డ్రగ్స్ ప్రభావంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇవి కేవలం వ్యక్తిగత సమస్యలు కావు, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే ప్రమాదకర సంకేతాలు. రేపటి తరాన్ని సంస్కారయుతంగా పెంచడం మన ధర్మం. అప్పుడే మన సమాజం ధర్మభూమిగా మారుతుంది. 


మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఉంది. ఈ సమస్యకు ఒకే వ్యక్తితో పరిష్కారం రాదు, ఇది సమిష్టి బాధ్యత అని తెలుసుకోవాలి. 


ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల బాధ్యత అత్యంత కీలకమైంది. పిల్లలకు మంచి విద్య, సౌకర్యాలు ఇవ్వడం మాత్రమే తల్లిదండ్రుల కర్తవ్యం కాదు.‌ వారికి సంస్కారం, విలువలు, నైతికత అనే బలమైన పునాది అందించాలి. పిల్లలతో సమయం గడపడం, వారి ఆలోచనలను అర్థం చేసుకోవడం, మంచి చెడుల మధ్య తేడాను తెలియజేయడం, స్వేచ్ఛకు పరిమితులు నిర్ధారించుకోవడం నేర్పించాలి. ఇవన్నీ తల్లిదండ్రుల బాధ్యతలో భాగం. ఆస్తి కంటే గొప్పది సంస్కారం. అది ఉంటేనే వ్యక్తి సమాజంలో నిలబడగలడు.


పెద్దలు మార్గదర్శనం చేస్తే, తల్లిదండ్రులు సంస్కార బోధన చేయాలి. గురువులు జ్ఞానంతో పాటు నీతి బోధన చేయాలి, సమాజం మంచి వాతావరణం కల్పించాలి. ఈ నాలుగు స్థంభాలు బలంగా నిలబడితేనే యువత సరైన మార్గంలో నడుస్తుంది. మనము రేపటి తరానికి ఏమి ఇస్తున్నామో ఆలోచించాలి.   


చివరగా, మనం మనకు మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. రేపటి తరానికి మనం ఏమి అందిస్తున్నాం?. కేవలం సౌకర్యాలనేనా, లేక విలువలతో కూడిన జీవన విధానమా? భవిష్యత్తు సాంకేతికతపై కాదు, సంస్కారం మీద నిలబడుతుంది. సంస్కారం ఉన్న చోటే సమాజం నిలుస్తుంది. అది లేకపోతే అభివృద్ధి కూడా అర్థరహితమవుతుంది, సమాజం కూలిపోతుంది అన్న వాస్తవానికి గ్రహించాలి.


మనందరం కలిసి బాధ్యతగా ఆలోచించి, ఆచరించినప్పుడు మాత్రమే ఈ విశృంఖలత్వాన్ని నియంత్రించగలం. అప్పుడే మన సమాజం మళ్లీ ధర్మం, నీతి, సంస్కారం ఆధారంగా నిలిచే ధర్మభూమిగా వికసిస్తుంది.


ఆలోచిద్దాం, అడుగు ముందుకు వేద్దాం.


మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

9849795167

*భక్తి ఎలా వుండాలి???*

  *భక్తి ఎలా వుండాలి???*

భగవంతుడు భావ ప్రియుడు మాత్రమే, 

బాహ్య ప్రియుడు కాదు...


ఈరోజు మన భక్తి అంతా బాహ్యమైనదే, 

ఎంత అలంకరించామా, 

ఎన్ని వంటలు చేసామా, ఎంతమంది మనలను పోగిడారా అనే ఆలోచనే ... 

ఇదంతా అహంకార భక్తి ...


శ్రీకృష్ణుడి వద్దకు ఒకనాడు సత్యభామ బంగారుతట్టలో కొన్ని ఫలములు తెచ్చి కృష్ణుని ముందుంచింది...

" ఇవి నా తోటలో పండిన పండ్లు, ఈ జాతి మరి ఎక్కడనూ లేదు" అని వాటిని గూర్చి గొప్ప గా వర్ణించినది...


కృష్ణుడు ఒక తేలిక నవ్వు నవ్వి, ఒక పండును రుచి చూచి, ఇవి సారహీనములని చప్పరించి పడవేసెను...


ఇంతలో "గుబ్బి" అనుఒక గొల్లపిల్ల దోసిటలో కొన్ని పండ్లు తెచ్చి "స్వామీ!! ఇవి అల్ల నేరేడుపండ్లు, 

స్వామి వలె శ్యామసుందరములు, అందువలన నాకు మిక్కిలి ప్రియములు"!!..

"దయతో గైకొని అనుగ్రహింపవలెను. " అనుచూ పాదముల మ్రోల వ్రాలినది...


కృష్ణుడు వాటి రుచిని అడుగడుగునా మెచ్చుకొనుచూ, అన్నియూ తిని వేసెను. 

నిజానికి సత్యభామ ఇచ్చిన ఫలములు విలువ కలవి, రుచి కలవి... ఐన నేమి?!


 ఆమె అహంభావము స్వాతిశయము మూలమున భగవానుని దృష్టి లో అవి రసహీనము లైనవి...


గోపిక స్వచ్ఛమైన ప్రేమ, అమాయకత్వము, అణుకువ మూలమున అవి భగవంతునికి అత్యంత ప్రియంకరములైనవి...

అందుకు వాటినే స్వీకరించాడు, 


ఈరోజు భగవంతుడు మనము చేసే పూజలు, వ్రతాలు, దానాలు, ధర్మాలు ఎన్ని స్వీకరిస్తున్నారో మనకే అర్థం కావాలి...


స్వస్తి.....✍


           *_శుభమస్తు_*

🙏శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍

సమస్త లోకా సుఖినోభవంతు

ఆచార్యుడు అంటే.. ?

  


ఆచార్యుడు అంటే.. ?


గురువంటే అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. ఆ గురువు ఆచార్యుడిగా ఉంటాడు. ‘‘ఆచార్యః గురూనాం శ్రేష్టః’’ – ఆచార్యుడిని గురువులందరిలోకి శ్రేష్టుడంటారు. అంటే ఎవడు ఆచారాన్ని కలిగున్నాడో ఆయన ఆచార్యుడు. నీవు ఏ విషయాన్నయినా చదువుకుని ఉండవచ్చు. అది విద్యార్థులకు బోధిస్తూ ఉండవచ్చు. ఒకడు నృత్యం నేర్చుకుంటాడు, శిష్యులకు చెపుతూ ఉంటాడు. ఒకడు వాద్యపరికరాన్ని మోగించడంలో నిష్ణాతుడు. సంగీతంలో, విలువిద్యలో, లెక్కలు చెప్పడంలో.. అలా వారివారి రంగాల్లో పాండిత్యం సంపాదించి దానిని శిష్యులకు బోధిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు ఆచార్యులు మాత్రం కారు. కేవలం ‘నీవు ఏం చెబుతున్నావు, ఏ స్థాయిలో చెపుతున్నావన్న దాన్నిబట్టి నీవు ఆచార్యుడివి కాలేవు’ అంటుంది శాస్త్రం.


బోధించే విషయం ఏదయినా ధర్మశాస్త్రం, వేదం బాగా తెలిసున్నవాడై, ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడే ఆయన ఆచార్యుడు అని పిలవబడతాడు. నీకు ధర్మశాస్త్రం తెలిస్తే జీవితంలో ధర్మాన్ని అనుష్ఠానం చేసి చూపిస్తే, పదిమందికి నీవు ఆదర్శవంతుడవయితే, ‘ఆయనలా బతకండి’ అన్న శిష్టాచారానికి నీవు ప్రమాణమైతే అప్పుడు మాత్రమే నీవు ఆచార్యుడివి. విలువిద్య నేర్పిన ద్రోణుడిని ద్రోణాచార్య అన్నారు. అయితే కేవలం ఆయన విలువిద్య నేర్పినందుకు అలా అనలేదు, విద్య నేర్పేటప్పుడు పాత్రత చూసాడు, ధర్మబద్ధంగా నడుచుకున్నాడు కనుక ద్రోణాచార్యుడయ్యాడు...

*కీర్తి మూర్తులు

 🙏🌹 *కీర్తి మూర్తులు* 🌹🙏




మనిషిని సంతోష పెట్టే అనేక లౌకిక విషయాల్లో *కీర్తి ఒకటి*. మనిషి సహజంగానే *కీర్తి కాముకుడు*. ఎవరికైనా కీర్తి వస్తే వారు *ఎంతగానో ఆనందిస్తారు*. దాని నుంచి మరికొంత *స్ఫూర్తినీ పొందుతారు.* కీర్తి స్వభావం అటువంటిది. మంచి పనులు చేసినవారికి మంచి పేరు, తద్వారా కీర్తిప్రతిష్ఠలు తప్పక దక్కుతాయి. *మనం చేసే పనులను* బట్టే కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయనేది సత్యం.


*గురుస్థానంలో* ఉండి ప్రసిద్ధులైన ఎందరో  ఋషులు మనకు కనిపిస్తారు. వ్యాసుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు... ఇలా చాలామంది లోకంలో గురుశ్రేష్ఠులై విలసిల్లారు. ఆధునిక కాలంలోనూ గురుపరంపర కొనసాగుతోంది. యథాశక్తి వారూ పేరుప్రతిష్ఠలు పొందుతున్నారు. మరికొందరు *వారికిష్టమైన పనిలో ప్రావీణ్యం* సంపాదిస్తారు. వారు *ఆ పనిలో నిష్ణాతులై* కీర్తి పొందుతారు. నలమహారాజు, భీమసేనుడు ఈ విధంగా పేరు గడించినవారే. వారు *పాకశాస్త్ర ప్రవీణులు*. లోకంలో నలభీమపాకమనే నానుడి ఉంది.


పాండవులు ఎప్పుడూ ధర్మం వైపే ఉన్నారు. వారు *ఊరికెప్పుడూ ఉపకారమే చేశారు.* సత్కార్యాలతో శాశ్వత కీర్తి గడించారు.     అలాగే చేతికి ఎముక లేకుండా *దానం చేసిన* కర్ణుడు ఎనలేని కీర్తిని పొందాడు. *లోకహిత కరమైన కార్యాలు* చేయడం ద్వారా శిబిచక్రవర్తి, దధీచి మొదలైనవారు ఎంతో కీర్తినార్జించారు. మమ్మటుడు తన 'కావ్య ప్రకాశం' గ్రంథంలో కావ్యాలు రాయడం వల్ల కలిగే ప్రయోజనాల జాబితా ఇచ్చాడు. 'కావ్యం యశనే...' అంటూ, *కావ్యాలు రాయడం* వల్ల కీర్తి వస్తుందని చెప్పాడు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసు, భాసుడు మొదలైన మహాకవులు లోక *ప్రశస్తమైన కృతులు* రాసి ఎంతో కీర్తిని పొందారు. తెలుగు సాహిత్యంలో కవిత్రయం, పోతన, శ్రీనాథుడు గొప్ప *గొప్ప కావ్యాలు* రాసి ఘనమైన కీర్తి సంపాదించుకున్నారు. ఈ పరంపర నేటికీ కొనసాగుతోంది

సమాజంలో కొందరికి *దానం చేయడం* వల్ల కీర్తి దక్కుతుంది. ఇంకొందరికి *మంచి వ్యక్తిత్వం* వల్ల పేరుప్రఖ్యా తులు వస్తాయి. మరికొందరికి వారు చేసే సేవల ద్వారా కీర్తిప్రతిష్ఠలు లభిస్తాయి. శ్రీమతి డొక్కా సీతమ్మ లాంటి వారికి *అన్నదానం* చేయడం వల్ల నిరుపమానమైన కీర్తిప్రతిష్ఠలు లభించాయి. స్వామి వివేకానంద లాంటివారు *ఉన్నతమైన వ్యక్తిత్వం* ద్వారా విశ్వవిఖ్యాత కీర్తి గడిం చారు. మదర్ థెరెసా కు ఆమె *సేవల ద్వారా* ఎనలేని పేరుప్రఖ్యాతులు వచ్చాయి. సమాజంలో ఇప్పుడూ ఎంతోమంది దాతృత్వం వల్ల ప్రఖ్యాతి పొందుతున్నారు.


*చిత్రలేఖనం* వంటి లలితకళలు సైతం కొందరికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టాయి. కేరళకు చెందిన రాజా రవివర్మ, తెలుగువారైన దామెర్ల రామారావు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రకారులు. సిద్ధేంద్రయోగి *నాట్యశాస్త్రం* వల్ల ప్రసిద్ధి చెందారు. ఇటువంటివారి కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం ప్రకాశిస్తుంటాయి. అయితే, సమాజం ఎప్పుడూ ఒకటి గమనించాలి. ఇంతమంది మహానుభావులు ఆయా రంగాల్లో అంతటి విజయాలు సాధించింది కేవలం కీర్తిప్రతిష్ఠలు పొందాలని కాదు. అది వారివారి ప్రతిభా వైదుష్యమని గ్రహించాలి. అర్హులైన వారందరికీ కీర్తి దక్కుతుంది. అర్హత ఉంటే ఎవరినైనా, ఎప్పుడైనా పేరు ప్రఖ్యాతులు వెతుక్కుంటూ వస్తాయి. అందులో *లోక కల్యాణ కారకమైన* పనులు చేసేవారిని *కీర్తి ప్రతిష్ఠలు* తప్పక వరిస్తాయి.


మనందరం కొంత సమయాన్ని *సమాజ సేవకై వినియోగిద్దాము*, కీర్తి మూర్తుల *సరసన స్థానం సంపాయిద్దాము.*


ధన్యవాదములు

*(సేకరణ)*

సహస్రనామ స్తోత్ర పారాయణకు

 హిందూ ధర్మశాస్త్రాలలో, పురాణాలలో దేవతల **సహస్రనామ స్తోత్ర పారాయణకు** అత్యంత ప్రాముఖ్యత ఇవ్వబడింది. నామ సంకీర్తన ద్వారా మనఃశుద్ధి, కార్యసిద్ధి కలుగుతాయని అనేక గ్రంథాలు ఘోషిస్తున్నాయి.


వివిధ పురాణాల నుండి సహస్రనామ పారాయణ విశిష్టతను తెలుసుకుందాము

****************************************

* శ్రీ గణేశ సహస్రనామ స్తోత్రము (గణేశ పురాణం)*


అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురైరపి |

సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః ||


  ఈ సహస్రనామాలను పఠించేవారికి చతుర్విధ పురుషార్థ సిద్ధులు (ధర్మ, అర్థ, కామ, మోక్షాలు) లభిస్తాయని, ముఖ్యంగా విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనం ప్రాప్తిస్తాయని గణేశ పురాణం ద్వారా తెలుస్తుంది.

****************************************


 *శ్రీ సుబ్రహ్మణ్య సహస్రనామము (స్కంద పురాణం)*


శత్రు సైన్య వినాశార్థం భక్తానామభయాయ చ |సహస్రనామముద్గీతం షణ్ముఖస్య మహాత్మనః ||

 

శత్రువుల నుండి భయం ఉన్నప్పుడు, కోర్టు సమస్యలు లేదా కుజ దోష నివారణ కోసం సుబ్రహ్మణ్య సహస్రనామ పారాయణ పరమౌషధంలా పనిచేస్తుంది.

****************************************


*దేవీ భాగవతం - గాయత్రీ సహస్రనామము*


సర్వపాపహరం పుణ్యం సర్వరోగనివారణం |

సహస్రనామపాఠాత్తు బ్రహ్మలోకే మహీయతే ||


ఈ సహస్రనామ పారాయణ సర్వ పాపాలను హరిస్తుంది, రోగాలను నయం చేస్తుంది. ఇది పఠించిన వారు అంతిమంగా బ్రహ్మలోకాన్ని పొందుతారు.


సంధ్యా వందన సమయంలో గాయత్రీ సహస్రనామ పారాయణ చేయడం వల్ల బ్రహ్మతేజస్సు పెరుగుతుందని చెప్పబడింది.

****************************************

*శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము (బ్రహ్మాండ పురాణం)*


సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |

తత్ఫలం కోటిగుణితం భవేన్నామజపాత్సదా ||


 ఇతర స్తోత్రాల కంటే సహస్రనామ పారాయణ విశిష్టమైనదని, అందులోనూ లలితా సహస్రనామ పారాయణ సర్వ పాపహరమని చెప్పబడింది. "సకృదేవ పఠేద్యస్తు సర్వపాపైః ప్రముచ్యతే" ఒక్కసారి పఠించినా సర్వ పాపాలు తొలగిపోతాయని దీని అర్థం.

****************************************


*శ్రీ శివ సహస్రనామ స్తోత్రము (లింగ పురాణం / మహాభారతం)*


ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం వీర్యం బలం తథా |

శివనామ జపాదేవ సర్వమేతన్న సంశయః ||


ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధైర్యం, పరాక్రమం మరియు బలం.. ఇవన్నీ శివ సహస్రనామ పారాయణ వల్ల నిస్సందేహంగా లభిస్తాయి.

****************************************


*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము (మహాభారతం - అనుశాసనిక పర్వం)*


భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన ఈ స్తోత్రం అత్యంత ప్రామాణికమైనది. దీని ఫలశ్రుతిలో పారాయణ ప్రాముఖ్యత ఇలా 


య ఇదం పఠేన్నిత్యం భక్త్యా శ్రద్ధాసమన్వితః |

యుజ్యేతాత్మసుఖక్షాంతి శ్రీధృతిస్మృతికీర్తిభిః ||


ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతిరోజూ ఈ నామాలను పఠిస్తారో, వారు ఆత్మసుఖం, శాంతి, ఐశ్వర్యం, ధైర్యం, జ్ఞాపకశక్తి మరియు కీర్తిని పొందుతారు.


  ఇందులో "న వాసుదేవ భక్తానామ్ అశుభం విద్యతే క్వచిత్" అని చెప్పబడింది. అంటే భగవంతుని నామాన్ని స్మరించేవారికి ఎన్నడూ అశుభం కలగదు.

***************************************


*శ్రీ రామ సహస్రనామ స్తోత్రము (పద్మ పురాణం)*


శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ||


 వేయి నామాలను పఠించడం వల్ల కలిగే ఫలితం కేవలం "రామ" అనే నామాన్ని మూడు సార్లు పఠించడం వల్ల కలుగుతుందని దీని అర్థం. ఇది సహస్రనామాల యొక్క శక్తిని, నామ సంకీర్తన సులభతను తెలియజేస్తుంది.

****************************************


*శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రము (బ్రహ్మ పురాణం)*


మహాలక్ష్మిని స్తుతించే ఈ సహస్రనామ పారాయణ దారిద్ర్య నిర్మూలనకు అత్యంత శక్తివంతమైనదని చెప్పబడింది.


దారిద్ర్య దుఃఖ శమనం సర్వైశ్వర్య ప్రదాయకమ్ |

సహస్రనామ పఠనాత్ లక్ష్మీః సాక్షాత్ ప్రసీదతి ||

 

ఈ సహస్రనామ పఠనం వల్ల దారిద్ర్యం, దుఃఖం శమిస్తాయి. సర్వ ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇది పఠించేవారిపై లక్ష్మీదేవి సాక్షాత్కరించి అనుగ్రహిస్తుంది శుక్రవారం నాడు లేదా పౌర్ణమి నాడు ఈ పారాయణ చేయడం విశేష ఫలితాన్నిస్తుంది.

****************************************


*శ్రీ సూర్య సహస్రనామము (భవిష్య పురాణం)*


నమః సూర్యాయ శాంతాయ సర్వరోగనివారిణే |

ఆయురారోగ్యమైశ్వర్యం దేహి దేవ జగత్పతే ||


 సూర్య సహస్రనామ పారాయణ వల్ల చక్షు రోగ నివారణ (కంటి వ్యాధులు తగ్గడం) మరియు చర్మ వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని భవిష్య పురాణ ప్రోక్తం. "ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని ఆర్యోక్తి.

****************************************

*వరాహ పురాణం - భూదేవి సహస్ర నామ స్తోత్రం*


నామ సంకీర్తనం తస్య సర్వదోషవినాశనం |సహస్రనామ తుల్యం హి నామ ఏకం హరేః స్మృతం 

||


కలియుగంలో భూమిపై నివసించే మనుషులకు భగవంతుని నామమే రక్ష అని, సహస్రనామ పారాయణ చేయడం వల్ల భూమికి సంబంధించిన దోషాలు (వాస్తు దోషాలు వంటివి) కూడా తొలగిపోతాయని వరాహ పురాణం చెబుతోంది.


****************************************

 *స్కంద పురాణం - గంగా సహస్రనామము*


గంగేతి నామ జపతో యోజనానాం శతైరపి |

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం స గచ్ఛతి ||


 గంగా సహస్రనామాన్ని పఠించడం వల్ల వందల యోజనాల దూరంలో ఉన్నా కూడా గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందని స్కంద పురాణం పేర్కొంది.

****************************************

*శ్రీ శ్యామలా సహస్రనామము (సౌభాగ్య లక్ష్మీ కల్పము / బ్రహ్మాండ పురాణం)*


కవిత్వదమ్ చౌదారమ్ చ సర్వసౌభాగ్యదాయకమ్|పఠేత్సహస్రనామేమం వాగ్దేవ్యాః ప్రీతిదాయకమ్ ||


 విద్యార్థులు, కళాకారులు ఈ నామాలను పఠించడం వల్ల వాక్శుద్ధి, సృజనాత్మకత పెరుగుతాయి. ఇది బుద్ధిని ప్రకాశింపజేస్తుంది.

***************************************


*నృసింహ సహస్రనామ స్తోత్రము (నృసింహ పురాణం)*


సర్వరోగ ప్రశమనం సర్వపాప వినాశనమ్ |

శత్రుసంహారకం చైవ నృసింహనామ కీర్తనమ్ ||

 

గ్రహ పీడలు, శత్రు బాధలు, అకాల మృత్యు భయం ఉన్నవారు ఈ నామాలను పారాయణ చేయడం వల్ల వజ్రకవచంలాంటి రక్షణ లభిస్తుంది.

****************************************


 *శ్రీ దక్షిణామూర్తి సహస్రనామము (ఆకాశ భైరవ కల్పము)*

అజ్ఞాన తిమిరచ్ఛేదం జ్ఞానదీప ప్రకాశకమ్ |సహస్రనామ సంకీర్త్యా దేవాచార్యః ప్రసీదతి ||


అజ్ఞానం అనే చీకటిని (తిమిరం) నశింపజేసేది (ఛేదనం) జ్ఞానం అనే దీపాన్ని వెలిగించేది భగవంతుని వేయి నామాలను (సహస్రనామాలను) సంకీర్తన చేయడం ద్వారా దేవతలకు గురువైన వారు లేదా ఆ పరమాత్మ సంతోషించి అనుగ్రహిస్తారు.

****************************************


"సహస్ర" అంటే వెయ్యి అని మాత్రమే కాదు, "అనంతం" అని కూడా అర్థం. భగవంతుని అనంతమైన గుణాలను, శక్తులను స్తుతించడమే సహస్రనామ పారాయణ ఉద్దేశం. ఇది కేవలం పుణ్యం కోసమే కాకుండా, మన అంతరాత్మను శుద్ధి చేసుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం.


అష్టోత్తర శతనామ పారాయణ (108 నామాలు)

సాధారణంగా ప్రతి నిత్య పూజలో "అష్టోత్తరం" తప్పనిసరి. నవగ్రహాల యొక్క ప్రభావం మనపై ఉండడం వల్ల, 9 గ్రహాలు మరియు 12 రాశుల కలయిక (9 \times 12 = 108) ద్వారా కలిగే దోషాలను తొలగించుకోవడానికి 108 నామాలు పఠిస్తారు.


అవకాశం లేనపుడు ** (108), **త్రిశతి** (300), మరియు **సహస్రనామములు** (1000). 

ఏదో ఒక పద్ధతి పారాయణ అర్చన చేయడం మంచిది.

***************************************

*అష్టోత్తరం 108 విశేషం*


*దేవీ భాగవతం*

అష్టోత్తర శతైర్నామభిః అర్చయేత్ పరమేశ్వరీమ్ |

సర్వపాప వినిర్ముక్తః సర్వకల్యాణభాజనమ్ ||


108 నామాలతో అర్చన చేయడం వల్ల తక్షణమే పాప విముక్తి కలిగి, సకల శుభాలు కలుగుతాయి. ఇది దైనందిన సాధనకు (Daily Practice) అనువైనది.


నారద పురాణం

అష్టోత్తర శతం నామ్నాం సర్వపాప ప్రణాశనమ్ |యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వాన్ కామానవాప్నుయాత్ ||


108 అనే సంఖ్య సూర్యుడు, చంద్రుడు మరియు భూమికి మధ్య గల దూరం యొక్క నిష్పత్తికి, అలాగే మనిషిలోని 108 ప్రధాన నాడీ కేంద్రాలకు (Nadi points) సంకేతం. అందుకే అష్టోత్తర పఠనం వల్ల శరీరం మరియు మనస్సు త్వరగా లయబద్ధం (Alignment) అవుతాయి.

*****************************************


*త్రిశతీ 300 విశేషం*


లలితోపాఖ్యానం త్రిశతి నామ పారాయణ (300 నామాలు)


సహస్రనామపాఠాచ్చ యత్ఫలం భవతి ప్రియే |తత్పల్యం కోటిగుణితం త్రిశత్యా జపతో భవేత్ ||


హయగ్రీవ స్వామి అగస్త్యుడితో ఇలా అంటారు


"ఓ అగస్త్యుడా! సహస్రనామ పారాయణ వల్ల కలిగే ఫలితం కంటే, త్రిశతి పారాయణ వల్ల కోటి రెట్లు ఎక్కువ ఫలితం కలుగుతుంది."

 

దీనికి కారణం త్రిశతిలోని నామాలు *మూల మంత్రo* (15 అక్షరాల మంత్రం) తో కూడి ఉండడం. ఇది కేవలం నామ పారాయణమే కాదు, మంత్ర జపంతో సమానం.


***************************************


*సహస్ర( 1008) నామ పారాయణ విశేషం*


సహస్రనామ పారాయణ అనేది యజ్ఞం లాంటిది. "విష్ణు సహస్రనామ" ఫలశ్రుతిలో భీష్ముడు ఇలా అంటారు 


పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః |

పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ||


సహస్రనామాలను పఠించడం వల్ల పరమమైన తేజస్సు, తపస్సు మరియు బ్రహ్మజ్ఞానం లభిస్తాయి. ఇది సంపూర్ణ శరణాగతికి మార్గం.

****************************************


*బ్రహ్మ వైవర్త పురాణం*

నారాయణేతి నామాస్తి వాగస్తి వశవర్తినీ |

తథాపి నరకే ఘోరే పతంతీత్యేతదద్భుతమ్ ||


 భగవంతుని నామాలు ఉన్నాయి, వాటిని పఠించే శక్తి కలిగిన నాలుక ఉంది. అయినప్పటికీ మనుషులు ఘోరమైన నరకానికి (కష్టాలకు) గురవుతున్నారంటే అది విచిత్రం. అంటే, నోరున్న ప్రతి ఒక్కరూ ఈ సహస్ర, త్రిశతి లేదా అష్టోత్తర నామాలను పఠించి తీరాలని దీని ఆంతర్యం.


వీటన్నింటిలోనూ **"భక్తి"** అనేది ప్రధానాధారం. భక్తి లేకుండా చేసే సహస్రనామ పారాయణ కంటే, భక్తితో చేసే ఒక్క నామ స్మరణ మిన్న అని పురాణాలు ఘోషిస్తున్నాయి.


****************************************


*ప్రతీ సహస్ర నామాలలో అంతర్యం*


నామ రూపే లీలా ధామేత్యనుక్రమః |

చిత్తే స్ఫురంతి త్వనిశం భక్త్యా సంకీర్తనే కృతే ||


 *నామ

 భగవంతుని పేరు (ఉదా.. విష్ణు, లలిత, శివ). ఇది ధ్వని రూపం.


 *రూప

 ఆ నామాన్ని పఠిస్తున్నప్పుడు స్ఫురించే దైవ స్వరూపం (శంఖ చక్ర గదాధరుడు లేదా త్రినేత్రుడు).


 *లీల ఆ దైవం చేసిన అద్భుత కృత్యాలు (ఉదా.. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ).


 *ధామ

ఆ దైవం నివసించే పరమపదం (వైకుంఠం, కైలాసం లేదా శ్రీచక్రాంతర్వర్తిని).


*పద్మ పురాణం - నామ చింతామణి*

నామ చింతామణిః కృష్ణశ్చైతన్య రసవిగ్రహః |

పూర్ణః శుద్ధో నిత్యముక్తోఽభిన్నత్వాన్నామ నామినోః ||


భగవంతుని నామం ఒక 'చింతామణి' వంటిది. అది చైతన్య స్వరూపం (రసవిగ్రహం). భగవంతుడికి, ఆయన నామానికి భేదం లేదు. కాబట్టి నామ పారాయణ చేసేటప్పుడు భక్తుడు ఆ దైవంతో ఏకమైపోతాడు. ఇదే సమాధి స్థితికి పునాది.


*సమాధి స్థితికి మార్గం క్రమ పద్ధతి*

సహస్రనామ పారాయణలో ఈ నాలుగు అంశాలు ఒకదాని వెంట ఒకటి ఎలా స్ఫురిస్తాయి అని శాస్త్రం 

 

*నామ స్మరణ 

నాలుకతో నామాన్ని పలకడం (శబ్ద బ్రహ్మ).

 

*రూప ధ్యానం 

నామం వినబడగానే మనస్సులో దైవ రూపం స్థిరపడటం.

 

*లీల చింతన

 ఆ దైవం యొక్క కళ్యాణ గుణాలు, లీలలు గుర్తొచ్చి హృదయం ద్రవించడం.

 

*ధామ ప్రాప్తి 

సర్వం ఆ దైవమయంగా కనిపించే స్థిరమైన స్థితి (సమాధి).


***** నిత్యా ఆచరించే వారికి ఇహ సుఖం తో పాటు పరమ పదం కూడా తథ్యం******

****************************************శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 

*రాళ్ళబండి శర్మ*

సుమన మనోహర రామ*

 *సుమన మనోహర రామ*



సుమన మనోహర రామ

సుందర వదనా రామ

రాజీవ లోచన రామ

రఘుకుల సోమా రామ

దశరథ నందన రామ

కౌసల్యా సుప్రజా రామ

సౌమిత్రి అగ్రజ రామ

వశిష్ఠ శిష్య రామ

కౌశిక మఖ రక్షక రామ

శివధనుర్భంజన రామ

సీతా కళ్యాణ రామ

పితృవాక్య పరిపాలక రామ

గహన విపినచర రామ

మాయా మృగ అనుసరణ రామ

మారీచ మర్దన రామ

జానకీ విరహ రామ

వాలి నిగ్రహ రామ 

సుగ్రీవ రాజ్య ప్రదాత రామ

హనుమత్ సేవిత రామ 

దశకంఠ సంహార రామ

అయోధ్యా పుర వాస రామ

పట్టాభిషేక రామ

రామ కోదండ రామ

సుమన మనోహర రామ

సుందర వదనా రామ



--

 సునీల్ ఆకెళ్ళ

కుటుంబ సమస్యలు - విశ్లేషణ బ్రాహ్మణి దేవి - imp

 సావడి కబుర్లు - 8


వందేమాతరం 


కుటుంబ సమస్యలు - విశ్లేషణ 


*సహృదయం సామనస్యం అవిద్వేషం కృణోమి వః ।*

*అన్యోన్యం అభిహర్యత వత్సం జాతమివాఘ్న్యా ॥*


_మన హృదయాలు ఒకటిగా ఉండాలి, మన భావనలు సమన్వితంగా ఉండాలి, పరస్పర ద్వేషానికి తావు ఉండకూడదు. ఒక ఆవు తన దూడను ఎంత ప్రేమగా ఆదరిస్తుందో అంత ప్రేమతో మనం ఒకరినొకరం ఆదరణతో ఉండాలి_ అంటూ అధర్వణ వేదం రూపంలో వేదమాత మానవ కుటుంబజీవనానికి ఇచ్చిన  అద్భుతమైన ఉపదేశం ఎంతో విలువైనది. అదే నిజమైన కుటుంబ స్వరూపం.


కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో నివసించే రక్తసంబంధాల కలయిక కల వ్యక్తుల సమాహారం మాత్రమే కాదు. ఒకే హృదయస్పందనతో  జీవించే మనసుల సమూహం. అది  ప్రేమ, కర్తవ్య, త్యాగ, క్షమ, సహనం, గౌరవం అనే ఆరు స్తంభాలపై నిలిచే పవిత్ర జీవనవ్యవస్థ. రక్తసంబంధం కుటుంబానికి రూపాన్ని ఇస్తే, ప్రేమ దానికి ప్రాణాన్ని ఇస్తుంది.‌ కర్తవ్యబోధన దానికి స్థిరత్వం ఇస్తుంది.‌ క్షమ దానికి చిరకాలం నిలిచే విశ్వాసాన్నిస్తుంది.

ఒక విధంగా మనిషి జీవితంలో కుటుంబమే  తొలి పాఠశాల. తల్లిదండ్రులే తొలి గురువులు. కుటుంబమే సంస్కార బోధన చేసే తొలి దేవాలయం. అందుకే మన సంస్కృతిలో  గృహాన్ని “ఇల్లు” అని మాత్రమే కాక “గృహస్థాశ్రమం” అని గౌరవంగా సంబోధిస్తారు.‌


అయితే, ఇంత పవిత్రమైన బంధాలలో  ఎందుకు కలహాలు ఏర్పడుతున్నాయి? ప్రేమతో కలిసిన మనసులు ఎందుకు దూరమవుతున్నాయి ?.  కలిసి జీవించాలనే సంకల్పంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి సమాధానం వెతికితే మనకి మానవస్వభావంలోనే  కనిపిస్తుంది.


కుటుంబ కలహాలకు ప్రధాన కారణం ప్రేమ, అపేక్షలు.

 అపేక్షలు అతిగా పెరిగితే అవి బాధకు మూలమవుతాయి. “వారు నన్ను అర్థం చేసుకోవాలి”, “నేను అనుకున్నట్టే ప్రవర్తించాలి”, “నా మనసుకు అనుగుణంగా ఉండాలి” అనే మౌనమైన ఆశలు నెరవేరనప్పుడు అసంతృప్తి పుడుతుంది. ఆ అసంతృప్తి మెల్లగా మనసులో మంటగా మారి కలహాలకు కారణమవుతుంది.


దీనినే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 

*కామాత్ క్రోధోఽభిజాయతే క్రోధాత్ భవతి సంమోహః ।*

*సంమోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః ॥*

అంటూ, అతిశయమైన ఆశల నుంచే క్రోధం పుడుతుంది.  క్రోధం వివేకాన్ని నాశనం చేస్తుంది అని హెచ్చరించాడు. 


కుటుంబ కలహాలకు అపేక్షలు మొదటి కారణమైతే, రెండో ప్రధాన కారణం అహంకారం. ప్రేమ “మనము” అంటే,  అహంకారం “నేను” అంటుంది.  “నేనే ఎందుకు తగ్గాలి?”, “నా మాటే ఎందుకు వినకూడదు?”, “ప్రతి సారి నేనే ఎందుకు క్షమించాలి?” అనే భావనలు ఎప్పుడైతే మనసులో కలుగుతాయో,  అవే కుటుంబంలో చీలికలకు తీసుకొని వస్తాయి. అంటే ప్రేమ తగ్గిన చోట అహం పెరుగుతుంది, అహం పెరిగిన చోట శాంతి నిలవడం కష్టం. 


ఇక మూడవ కారణం సంభాషణలో లోపం.

కుటుంబాలు పెద్ద సమస్యల వలన కూలిపోవు,  చిన్న అపార్థాలను పెద్దవిగా పెంచడం వలన కూలిపోతాయి. చెప్పవలసిన మాట చెప్పకపోవడం, వినవలసిన మాట వినకపోవడం, అర్థం చేసుకోవలసిన సందర్భంలో తీర్పు ఇవ్వడం, ఇవే అనేక బంధాలను దెబ్బతీస్తాయి. మాటలతో సరిచేయవలసిన చోట మౌనం దానిని మరింత కఠినతరం చేస్తుంది.


నాలుగవ ముఖ్య కారణం పోలికలు. “వారి ఇంట్లో ఇలా ఉంది”, “వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు”, “అతని భార్య ఇలా, ఆమె భర్త అలా.." వంటి  పోలికలు కుటుంబాల్లో ఆనందాన్ని హరించి వేయడమే కాక  అసంతృప్తిని పెంచుతాయి. పోలిక ఉన్నచోట కృతజ్ఞత ఉండదు,  కృతజ్ఞత లేని చోట సంతోషం నిలవదు.


ఇక చివరిగా, ఐదవ కారణం  క్షమాభావం లేకపోవడం.

తప్పులేని మనిషి ఉండడు.‌ కలిసి జీవించాలంటే పరస్పరం లోపాలను అర్థం చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో భరించాలి కూడా. ప్రతి చిన్న పొరపాటును మనసులో దాచుకుంటూ పోతే, అది మనుషుల మధ్య సంబంధాన్ని లోపల్నుంచి క్రమంగా క్షీణింపజేస్తుంది. అందుకే *క్షమా వీరస్య భూషణమ్*  క్షమించడం అనేది బలహీనత కాదు, బలం అంటారు.


ఇవే కాక, ఆర్థిక ఒత్తిడులు, సమయాభావం, బాహ్యప్రభావాలు, ధార్మిక విలువలు లేకపోవడం, పరస్పర గౌరవం తగ్గిపోవడం కూడా కుటుంబంలో కలహాలకు కారణం అవుతున్నాయి. ఆధునిక జీవనశైలి సౌకర్యాలను పెంచినా, హృదయాల మధ్య దూరాన్ని కూడా పెంచుతోంది. ఒకే ఇంట్లో నివసిస్తున్నా, మనసులు వేర్వేరు లోకాలలో విహరిస్తున్నాయి. కలిసి భోజనం చేసే అలవాటు తగ్గిపోవడం, మనసు తెలుసుకోవాలనే ఆలోచన లేకపోవడం, బాధ పంచుకునే సంస్కారం తగ్గిపోవడం, నావాళ్లు స్థానంలో నేను అనే భావం పెరిగిపోవడం‌ కూడా కుటుంబ కలహాలకు కారణమవుతున్నాయి.


మరి దీనికి పరిష్కారం లేదా? అంటే ఉంది. మొదట కుటుంబంలో హక్కుల గురించి కాక బాధ్యతల గురించి ఆలోచించడం మొదలుపెట్టాలి. 

“నాకు ఏమి దక్కింది?” అనే ప్రశ్న కంటే “నేను ఏమి ఇచ్చాను?” అనే ఆలోచన కుటుంబాన్ని కాపాడుతుంది.

రెండవది, ముఖ్యంగా వినడం నేర్చుకోవాలి. సంబంధాలు నిలవాలంటే ఎదుటివారి మాటను సమాధానం చెప్పడానికి కాక, అర్థం చేసుకోవడానికి వినాలి.


మూడవది గెలవడం కాదు బలపడడం ముఖ్యం‌ అన్నది గ్రహించాలి.  వాదనలో గెలిచి మనసును కోల్పోవడం మూర్ఖత్వం అవుతుంది. కుటుంబంలో “నేను గెలిచాను” అన్న భావం కన్నా “మన బంధం నిలిచింది” అన్న భావం గొప్పతనం తెలుసుకోవాలి. నాలుగవది, కలిసి ఆచరించే సంస్కృతి పెంపొందించుకోవడం.


ఇక ఐదవది, కృతజ్ఞతాభావాన్ని పెంపొందించుకోవడం. కుటుంబ సభ్యులలోని మంచి లక్షణాలను ప్రశంసించాలి. ప్రశంసించని ప్రేమ క్రమంగా అలసిపోతుంది.

ఆరవది, ఆర్థిక ఒత్తిళ్లు. ధనం కుటుంబాన్ని పోషించడానికి సాధనంగా ఉండాలి కానీ అదే లక్ష్యమైపోతే సంబంధాలు బలహీనమవుతాయి. సంపాదన పెరిగినా సమయం, ప్రేమ, పరస్పర గౌరవం తగ్గితే కుటుంబంలో శూన్యత పెరుగుతుంది.


చివరిగా ముఖ్యమైనది, సహనాన్ని సాధనగా స్వీకరించాలి. కుటుంబంలో కొన్నిసార్లు సత్యం కన్నా శాంతి ముఖ్యమవుతుంది, తర్కం కన్నా ప్రేమ గొప్పదవుతుంది.


కౌరవ వంశం బాహ్య శక్తుల వల్ల కాదు, అంతర్గత ద్వేషం వల్లే నశించింది‌‌. ఇది కుటుంబాన్ని బాహ్య శత్రువులు కన్నా  అంతర్గత విభేదాలే ఎక్కువ నాశనం చేస్తాయి అన్నదానికి  మహాభారతమే మనకు గొప్ప ఉదాహరణ.


కలహాలు రావడం అసహజం కాదు, కానీ కలహాల కంటే బంధం గొప్పదని గుర్తుంచుకొని వాటిని అధిగమించడం సంస్కారం. 


అంతిమంగా, కుటుంబం అనేది సంపూర్ణుల సమూహం కాదు, పరస్పర అపూర్ణతలను ప్రేమతో అంగీకరించిన మనుషుల పవిత్ర బంధం. ఇల్లు ఇటుకలతో నిర్మించబడితే,‌ కుటుంబం హృదయాలతో నిర్మించబడుతుంది.


కుటుంబం నిలవాలంటే ఒకరినొకరు మార్చుకోవాలని కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని ప్రయత్నించాలి.


మన సనాతన హిందూ సంస్కృతీ సంప్రదాయాల కుటుంబ ఐక్యతకు ఒక అందమైన మార్గదర్శక శ్లోకాన్ని‌ ఋగ్వేదం

*సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతామ్ ।*

అంటూ కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, పరస్పరం మనస్సులు తెలుసుకోండి, అని బోధించింది.

ఇదే ఆదర్శమైన కుటుంబ జీవనానికి అవసరమైన సూత్రం.



మృశి

(దశిక ప్రభాకర శాస్త్రి)

9849795167

11.04.2026

బ్రాహ్మణి దేవి -

 *బ్రాహ్మణి దేవి - సృష్టి యొక్క ఆదిశక్తి*

సప్తమాతృకల పవిత్ర క్రమంలో మొదట నిలిచే దేవి బ్రాహ్మణి. ఆమె బ్రహ్మ దేవుడు యొక్క శక్తి స్వరూపిణి. సృష్టి అనే భావన రూపం దాల్చే ముందు మనసులో మెదిలే ఆ మొదటి ఆలోచన స్పూర్తి - అదే బ్రాహ్మణి తత్వం.

ఆమె కేవలం పురాణాలలో ఉన్న దేవత మాత్రమే కాదు; ప్రతి సృజనాత్మక ఆలోచనకు, ప్రతి జ్ఞానోదయానికి మూలమైన చైతన్యశక్తి.

ఐకానోగ్రఫీ మరియు ప్రతీకలు

బ్రాహ్మణి స్వర్ణవర్ణంతో, శాంతస్వరూపంతో, జ్ఞానమయ కాంతితో దర్శనమిస్తుంది. ఆమె రూపంలోని ప్రతి అంశం లోతైన అర్థాన్ని కలిగి ఉంది.

నాలుగు ముఖాలు

బ్రహ్మలాగే బ్రాహ్మణికి కూడా నాలుగు ముఖాలు ఉంటాయి. ఇవి నాలుగు వేదాలను సూచిస్తాయి. సర్వ విద్యల మూలం, జ్ఞానానికి ఆదిప్రేరణ ఆమెనే అన్న సందేశం ఇందులో ఉంది.

హంస వాహనం

ఆమె వాహనం హంస. హంసకు నీటిలో కలిసిన పాలను వేరుచేసే శక్తి ఉందని ఉపమానం. అదే విధంగా బ్రాహ్మణి భక్తునికి మాయ (అసత్యం) నుండి సత్యాన్ని వేరుచేసే వివేకాన్ని ప్రసాదిస్తుంది.

కమండలువు మరియు జపమాల

కమండలువు - సృష్టి విత్తనాల ప్రతీక.

జపమాల - ధ్యానం, ఏకాగ్రత, జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చే సాధన.

మానసిక స్వచ్ఛతకు బ్రాహ్మణి సాధన

ఈ ఆధునిక కాలంలో మనసు ఎన్నో సమాచారాలతో, దృష్టి మరల్చే అంశాలతో నిండిపోతుంది. ఈ కల్లోలంలో బ్రాహ్మణి “దైవిక వడపోత”లా పనిచేస్తుంది.

ఆమె అనుగ్రహం వల్ల:

సృజనాత్మకత పెరుగుతుంది - కళాకారులు, రచయితలు, ఆవిష్కర్తలకు ప్రేరణ.

https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21

మనస్సు పవిత్రమవుతుంది - చిత్తశుద్ధి, సాత్త్విక స్థితి కలుగుతుంది.

బుద్ధి వికాసం - అజ్ఞానాన్ని తొలగించి విద్యా, ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతి.

దైనందిన జీవితానికి సందేశం

ప్రతి గొప్ప సాధనకు మూలం శాంతమైన, నియంత్రితమైన మనస్సు మరియు పవిత్ర సంకల్పం. బ్రాహ్మణిని ఆరాధించడం అంటే కేవలం జ్ఞానం కోరకడం కాదు; ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసే సద్గుణాలను కోరుకోవడం.

ఆమె తత్వాన్ని ధ్యానిస్తే, అస్తవ్యస్తమైన ఆలోచనలు సుసంఘటిత దృష్టిగా మారి, మనలోని సామర్థ్యం సాకారమవుతుంది.

బ్రాహ్మణి అనేది సృష్టిని నిర్మించే శాంతమయ శక్తి - సమాజంలో సౌహార్దాన్ని, మనసులో స్పష్టతను నింపే ఆదిమాతృశక్తి.


https://whatsapp.com/channel/0029Vailh8bGk1FuDeog9W21

నైతికత లోపిస్తున్న యువత*

 *నైతికత లోపిస్తున్న యువత*

****************************


*ఇరిగో చూడండి మన భావి భారత పౌరులు వీరు*

*కన్నవారి కోటి కలల ఆశాదీపాలు...*

*కొండల్ని సైతం పిండిని చేయగల సమర్ధులు*

*శక్తి యుక్తుల్లో అగ్రగణ్యులు*

*అయినా ఇదేం కర్మమో తెలియదు!*


*ఉరుకుపరుగుల దైనందిన జీవితంలో ఆటుపోట్లతో అలసిసొలసిన ముదిమితరం ఒకపక్క గుదిబండలాంటి సంసార సాగరాన్ని ఈదడానికీ ఇప్పటికీ పడిలేచే కేరటంలా తమవంతు చెమటలు చిందిస్తుంటే!*


*సాధనే తమ లక్ష్యమై*

*శోధనే తమ ధ్యేయమై*

*ప్రగతి పథంలో దేశాన్ని నడపవలసిన నేటి యువతరం మాత్రం మన్నుతిన్న పాములా మందకోడిలా.... సాగుతుందిలా*


*చరవాణి మోజులోపడి బానిసలైపోతున్న సోమరిపోతులు ఇంటింటికీ భారంగా తయారవుతున్నారిలా..,!*

*కుటుంబానికి చేయుత నివ్వవలసిన వయస్సు లో ఇలా వ్యసనపరులై బతకటమేమిటి కర్మ కాకుంటే! ?*


*ఉడుకురక్తం ఉప్పొంగుతున్నా చేతకాని చవటల్లా వండిపెడితే తిని కూర్చోవడమేమిటి బ్రతుకు అర్థం తెలియకుండా ! ?*


*వయసు కావరంతో కన్నవాళ్ళు కానరారు*

*ఉన్న ఊరు కంటికానదు*

*వీరికన్నా మృగాలు నయం*

*వాటి ఆహారం అవే కష్టపడి సాధించుకుంటాయి*


*దేశభక్తి లేదు పెద్ద చిన్న తారతమ్యం లేదు మంచి చెడుల విచక్షణ లేదు దుర్జన సహవాసాలతో దేశతిమ్మరులై తిరుగాడు మానవ మృగాలుగా తయారైనారు*


*ఓ..యువత మేలుకో ఇకనైనా మీరు మారకుంటే మహిలో మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోవనుంది జాగ్రత్తసుమ్మి!!*


              *....... 0......*

ఆవు…వేదన !!!

  ఆవు…వేదన !!!


నాయనలారా…మిమ్మల్నే….!


పిలిచేది ఎవరా అని ఆశ్చర్యపోతున్నారా…? మీకు అమ్మపాలు లేక… గుక్కపట్టి ఏడుస్తుంటే… అమ్మపాల బదులు నా పాలు తాగి పెరిగారు గుర్తులేదా..! ఇప్పటికీ పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, మీగడలతో… ఇలా నా పాలతోనే తయారయ్యే అనేక రకాల ఉత్పత్తులతో కండలు పెంచుకుంటున్నారే…! ఆ ఆవునే నేను. దేవుడు ప్రతిచోటా ఉండలేక తల్లిని సృష్టించాడంటారు…ఆ అమ్మేలేని పసిబిడ్డలకు ఆవుపాలు ఎందుకు పోస్తారో తెలుసా…? ఆవుపాలతో బిడ్డ బతికి బట్టకడుతుందని నమ్మకం… అదే నా ప్రత్యేకత. అలాంటిది నన్ను కోసుకుని తింటారా…?


నేను ఏ రోజైనా నోరు తెరచి మిమ్మల్ని ఏదైనా అడిగానా…? ఇంత గడ్డి తిని…ఇంటిల్లిపాదినీ బతికిస్తున్నాను. పాడిసంపద మాత్రమేకాదు నాయనా…! గోమూత్రం, గోమయం…ఇలా నా శరీరంలోని అణువణువూ మీ కోసం… మీ ఆరోగ్యకరమైన జీవనం కోసం … మీ ఇంట్లో సిరులు కురిపించే పంటల కోసం… ధారవోస్తుంటే… అదీ చాలదని నన్ను వండుకుని తింటారా…? పైగా “ బీఫ్ ఫెస్టివల్” అంటూ అమ్మలాంటి నన్ను చంపుకుతినటం… మీకో పండుగా…..?


ఎర్రటి ఎండలో పెట్టినా… మీకు చల్లని మజ్జిగనిస్తున్నా… హోరుమనే వానలో నేను వణికిపోతున్నా…. మీకు మాత్రం వేడివేడి పాలనిస్తున్నా… దొరికిన చెత్తాచెదారమేదో తిని…మీకు మాత్రం పుష్టికరమైన పాడినిస్తున్నా….! చుర్రుమనే కారంతో మీ నోళ్లు మండితే…కమ్మని నెయ్యిని కూడా నేనే ఇస్తున్నా…. మరి నేనేం పాపం చేశానని…నాకీ చిత్రవధ….?


ఏనాడైనా మిమ్మల్ని పొడిచానా…కరిచానా… కనీసం బెదిరించానా… భయపెట్టానా…! మీరు అదిలిస్తే…ఏదో నా బిడ్డలే కదా అని ఓ మూలన పడి ఉన్నా కదా…! నా ఆఖరి శ్వాస దాకా మిమ్మల్నే కనిపెట్టుకుని … పాలిచ్చాను…పాలించాను…


అందుకు నాకు ఇదా బహుమతి…! ఇదేనా…నవనాగరికులమని చెప్పుకునే మీరు చూపించాల్సిన కృతజ్ఞత….?


కడుపులో పెట్టుకుని కాపాడే కన్నతల్లిని ఎవరైనా చంపుకుంటారా…? గ్లాసుడు నీళ్లిస్తేనే…. థ్యాంక్యూ..థ్యాంక్యూ..థ్యాంక్యూ … అంటూ ఆకాశానికి ఎత్తేస్తారే…! అలాంటిది మిమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడే …. నన్ను వండుకుని తినాలనిపించటం మీకు న్యాయమా…? పైగా మీ రుచి కోసం… మీ ఆకలి తీర్చే నన్ను ఆకలితో మాడుస్తారు… తలకిందులుగా వేలాడదీస్తారు… ఒక్కసారి ప్రాణం తీయకుండా…చిత్రవధ చేస్తారు… మనుషులు చేయాల్సిన పనేనా ఇది…?


గోమాతను కాపాడటం అంటే భారతీయ వైభవాన్ని కాపాడుకోవడమే .

డబ్బు మనం పొదుపుగా

  *శ్రీ కిరణం*


*డబ్బు మనం పొదుపుగా వాడుకుంటే కష్ట కాలంలో ఆదుకుంటుంది, అదుపు లేకుండా వాడుకుంటే జీవితంతో ఆడుకుంటుంది.*


*క్రాంతి కిరణాలు*


 *కం. పొదుపుగ ధనమును వాడిన* 

*నది రక్షించును మనలను నాపదలందున్*

*నదుపును తప్పిన వేళల* 

*పదునగు నాయుధము కన్న వాడిగ నుండున్*

శ్రీ సుందరమూర్తి నాయనారు

 శ్రీ సుందరమూర్తి నాయనారు (సంపూర్ణ చరిత్ర)

01. పూర్వజన్మ వృత్తాంతం

కైలాసంలో శివుడికి నిత్యం అలంకరణ చేసే సేవకుడు ఒకరు ఉండేవారు. అతని పేరు "హాలాహల సుందరుడు". ఒకరోజు తోటలో పూలు కోస్తుండగా, పార్వతీ దేవి చెలికత్తెలైన 'కమలిని', 'నిందిత' (అనిందిత) అనే ఇద్దరు అద్భుతమైన సౌందర్యరాశులను చూసి మనసు పారేసుకుంటాడు. ఆ అమ్మాయిలు కూడా సుందరుడిని ఇష్టపడతారు.ఈ విషయం సర్వజ్ఞుడైన శివుడికి తెలుస్తుంది. "కైలాసంలో కామ వాంఛలకు తావు లేదు. మీ కోరికలు తీర్చుకోవడానికి మీరు ముగ్గురూ భూలోకంలో జన్మించండి. మీ ఆశలు తీరాక తిరిగి నా దగ్గరకు వద్దురు గాక" అని ఆశీర్వదించి పంపిస్తాడు.


02. జననం - 

రాజభోగం:శివుడి ఆజ్ఞ మేరకు ఆ సుందరుడు, తమిళనాడులోని 'తిరుమునైపాడి' అనే రాజ్యంలోని 'తిరునైవలూరు' గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు "నంబి ఆరూరార్".అతని అందం చూసి ముచ్చటపడిన ఆ దేశపు రాజు 'నరసింగ మునియరైయార్', బ్రాహ్మణుల అనుమతితో ఆ పిల్లవాడిని దత్తత తీసుకుని రాజకుమారుడిలా పెంచాడు. వేదాలతో పాటు యుద్ధ విద్యలు, రాజభోగాలు అనుభవిస్తూ పెరిగాడు.


3. పెళ్లి మండపంలో గొడవ

యుక్తవయసు రాగానే సుందరుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. సరిగ్గా మాంగళ్యధారణ సమయానికి, ఒక వృద్ధ బ్రాహ్మణుడు (శివుడు) చేతిలో తాటియాకుల గ్రంథం పట్టుకుని అక్కడికి వచ్చాడు.* వృద్ధుడు: "ఆగండి! ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. ఈ వరుడు నా బానిస."* సుందరుడు (కోపంతో): "పిచ్చివాడా (పిత్తా)! ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి బానిస ఎలా అవుతాడు? పో ఇక్కడి నుంచి."* వృద్ధుడు: "ఇదిగో సాక్ష్యం. నీ తాతగారు స్వయంగా రాసిచ్చిన పత్రం ఇది. 'మా వంశం మొత్తం ఈయనకు బానిసలుగా ఉంటాం' అని రాసి ఉంది."సభలోని పెద్దలు ఆ పత్రాన్ని పరిశీలించి, అది నిజమేనని తేల్చారు. సుందరుడు ఓడిపోయాడు. పెళ్లి ఆగిపోయింది. ఆ ముసలివాడి వెంట బానిసగా వెళ్ళాడు


04. జ్ఞానోదయం

 - మొదటి పాట:ఆ వృద్ధుడు సుందరుడిని తీసుకుని 'తిరువెణ్ణైనల్లూర్' శివాలయానికి తీసుకెళ్లి, గర్భగుడిలోకి వెళ్లి మాయమయ్యాడు. అప్పుడు ఆకాశవాణి వినిపించింది."సుందరా! వాదనలో నన్ను పిచ్చివాడా (పిత్తా) అన్నావు కదా! ఆ పేరుతోనే నన్ను స్తుతిస్తూ పాట పాడు. భూమిపై నీ జీవితం ఉన్నంత కాలం నేను నీకు వెన్నంటే ఉంటాను."అప్పుడు సుందరుడు కన్నీళ్లతో "పిత్తా పిరై సూడి..." (ఓ పిచ్చివాడా! నెలవంకను ధరించినవాడా!) అంటూ తన మొదటి "తేవార" గీతాన్ని పాడాడు.


05. ఇద్దరు భార్యలు

 - విచిత్ర దాంపత్యం:భూలోకానికి వచ్చింది పూర్వజన్మలో ఇష్టపడ్డ ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకోవడానికే కదా!* తిరువారూర్ అనే ఊరిలో రుద్రగణిక కులంలో పుట్టిన 'పరవైయార్' (కమలిని అవతారం)ను చూసి ప్రేమించి, శివుడి ఆజ్ఞతో పెళ్లి చేసుకున్నాడు.* కొన్నాళ్ళకు తీర్థయాత్రలకు వెళ్లి తిరువొత్తియూర్ అనే ఊరిలో 'సంకిలియార్' (నిందిత అవతారం)ను చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవడానికి, "నేను నిన్ను వదిలి ఎప్పటికీ వెళ్లను" అని ప్రమాణం చేశాడు. కానీ శివుడి ఉత్సవాలు చూడాలనే ఆత్రుతలో ఆ ఊరు దాటగానే అతనికి కళ్లు పోయాయి (ప్రమాణ భంగం వల్ల)


06. స్నేహితుడిగా శివుడు

సుందరుడి చరిత్రలోముఖ్య ఘట్టం ఇదే. దేవుడిని ఒక ఆత్మమిత్రుడిగా చూశాడు.* బంగారం అడిగాడు: కరువు వచ్చినప్పుడు ప్రజలకు అన్నదానం చేయడానికి, ఇంటి ఖర్చుల కోసం శివుడిని నేరుగా బంగారం అడిగేవాడు. శివుడు ఇచ్చేవాడు కూడా!* శివుడే రాయబారి: మొదటి భార్య పరవైయార్‌కి, సుందరుడు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి కోపం వచ్చింది. ఆమెను శాంతింపజేయడానికి సాక్షాత్తు పరమశివుడిని అర్ధరాత్రి పూట ఆమె ఇంటికి దూతగా పంపాడు సుందరుడు. భక్తుడి కోసం దేవుడు వీధిలో నడిచి వెళ్లి రాజీ కుదిర్చాడు.


07. తిరుత్తొండ త్రొగై (నాయనార్ల చరిత్ర):

తిరువారూర్ దేవాలయంలో భక్తులందరూ ఉండగా, సుందరుడు గర్భగుడి వైపు వెళ్తుంటే "మా భక్తులను గౌరవించని వాడిని దేవుడు కూడా గౌరవించడు" అని విరన్మిండ నాయనారు అంటారు.అప్పుడు శివుడు సుందరుడికి, "నా భక్తుల గొప్పతనం నీకు తెలియదు.. వారి గురించి పాడు" అని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు సుందరుడు "తిరుత్తొండ త్రొగై" అనే పదికాన్ని పాడాడు. ఇందులో 63 మంది నాయనార్ల పేర్లు, వారి గొప్పతనాన్ని ఒక్కో లైన్లో చెప్పాడు. దీని ఆధారంగానే తర్వాత 'పెరియపురాణం' వచ్చింది.


08. కైలాస ప్రాప్తి:

సుందరుడు తన 18వ ఏటనే భూమిపై తన కర్మ పూర్తి చేసుకున్నాడు. శివుడు అతన్ని తీసుకెళ్లడానికి ఐరావతాన్ని (తెల్ల ఏనుగు) పంపాడు. సుందరుడు దానిపై ఎక్కి కైలాసానికి వెళ్తుండగా, అతని మిత్రుడైన 'చేరమాన్ పెరుమాళ్' (మరొక నాయనారు) అది చూసి, తన గుర్రం చెవిలో శివమంత్రం చెప్పి, ఆ గుర్రంతో సహా ఆకాశమార్గాన కైలాసానికి వెళ్ళాడు

ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు

 ముప్పు తిప్ప లెట్టి ముదిరి పోయిన జబ్బు

వస్తె హోమియోలొ వైద్య ముంటె

ముందుగానె వస్తె ముప్పుతిప్పలు నేల

సకురు అప్ప రావు సత్యమిదిర


భావం: అనేక మంది రోగులు వారి బాధలు అర్జెంటుగా తగ్గించేసుకుందామనే పిచ్చి భ్రమతో ఇంగ్లీషు స్పెషలిస్ట్ వైద్యుల చుట్టూ, కార్పొరేట్ హాస్పిటళ్ళ చుట్టూ తిరిగి తిరిగి సమస్యను బాగా ముదరబెట్టుకొని, పరిష్కారం కానంత జటిలం చేసుకుని, జేబులో డబ్బులన్నీ వాళ్ళు పూర్తిగా పిండేసాక, ఇక మీ జబ్బు తగ్గే అవకాశమే లేదని వారు నిరాశకు గురి చేసాక, పూర్తి దీనావస్తకు చేరుకున్న రోగాలను సైతం ఓర్పుగా, నేర్పుగా నయం చేయగలిగే సత్తా కలిగిన హోమియో వైద్యానికి రోగం వచ్చిన వెంటనే వెళ్తే మీకీ తిప్పలూ, తలనొప్పులూ లేకుండా, ఒంట్లో పార్టులు కోయించుకొని, చెడగొట్టు కోకుండా, జేబులో డబ్బులన్నీ గొరిగించుకోకుండా హాయిగా, త్వరగా నయమై, క్షేమంగా మీరు మీ ఇంటిలోనే ఉంటారు కద నాయనా! ఎందుకు, హోమియోను చులకనగా చూసి, మీరు నానా తిప్పలు పడటం? హోమియోను చూసి ఎందుకలా భయపడి దూరంగా ఉంటారు?అదేమైనా మీ శత్రువా? బాగా ముదిరిపోయి, బ్రతుకు మీద ఆశ వదిలేసుకున్న వాళ్ళ రోగాలే నయం చేయగలిగే దమ్మున్నది లేతగా అప్పుడప్పుడే వచ్చిన సమస్యలూ, రోగాలూ నయం చేయలేని తింగరి, చేతకాని వైద్యమనుకుంటున్నారా? 

హోమియో వైద్యమంటే ఒక అద్భుతం, అమృతం! దీనిని అర్థం చేసుకుని, ప్రతీ సందర్భానికీ వాడుకునే వాళ్ళ జన్మ ధన్యం! 

సకురు అప్పారావు చెప్పే ప్రతీ మాటా అక్షర సత్యం!అయినా సరే దానిలో నిజముందో లేదో మీరు కూడా చూడండి, ఆలోచించండి! 

 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

*ఆణి ముత్యాలు

  *ఆణి ముత్యాలు*

ఎక్కువగా ఎవరిని నమ్మకు *మోసపోతావు*

ఎవరికోసం ఆలోచించకు *అలుసైపోతావు*

ఎవరికి ఎక్కువ విలువివ్వకు *గౌరవం కొల్పోతావు*

ఎవరిని ప్రశ్నించకు *శత్రువు అవుతావు*

*యల్లావఝల ఫణి కృష్ణ*

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

క్రాంతి కిరణాలు

 *శ్రీ కిరణం*


 *పెదవులకు సత్యం, కళ్లకు దయ, చేతులకు దానం, ముఖానికి చిరునవ్వు, హృదయానికి ప్రేమ — వీటిని మించిన ఆభరణాలు ఈ సృష్టిలో లేవు.*


 *క్రాంతి కిరణాలు*


*కం. పెదవులపై సత్యంబును* 

*వదనము నందు చిరునవ్వు బాధను మాన్పున్*

*సెద తీర్చెడు చూపులు* 

*నెద యందున ప్రేమ పెంచు మెప్పటికైనన్*

జయతాచ్ఛంకరోగురుః

 *జయతాచ్ఛంకరోగురుః-१९*


   జగత్తు ధర్మానికి అవసరమైనది ప్రవృత్తి మార్గము. ప్రకృష్టమైన ప్రధానమైన ప్రహృష్టమైన ప్రసార యోగ్యమైన వృత్తి ప్రవృత్తి. జగత్తునుంచి తరింౘడానికి అవసరమైన మార్గము నివృత్తి. నిర్వికారమైన నిరపేక్షితమైన నిస్తులమైన నిర్గుణతత్త్వ ప్రసారభూతమైనది నివృత్తి. మన సనాతన ధర్మాచరణకై ఈ రెండు మార్గములు ప్రశస్తములు అనన్యములు. ఎందరో అవతార పురుషులు ఈ రెంటిలో ఏదియో ఒక మార్గమును ప్రధానమైనదిగా మఱియొకటి గౌణమైనదిగా పరిగణించి ఆదరించి ఆచరించి అనుసరింపఁజేసినారు. వారిలో విష్ణుభగవానుని అంశావతారములలో ప్రవృత్తి మార్గము ప్రధానముగా నివృత్తి మార్గము గౌణముగా మనము దర్శింపవౘ్చును. శివ భగవానుడి అంశావతారములలో నివృత్తి మార్గము ముఖ్యతమముగా ప్రవృత్తి మార్గము నిమిత్తమాత్రముగా గోచరింౘును. కాలచక్ర భ్రమణమున కలుగు సృష్టి రక్షణకై ప్రవృత్తి ధర్మస్థాపనలో స్థితి కారకుఁడైన విష్ణు పరమాత్మ అవతారములెట్లనేకములో నివృత్తి ధర్మ ప్రసారమునకై లయ కారకుడైన శంకరదేవుని అవతారములట్లే యనేకములు. ముఖ్యంగా శ్రీరామచంద్రచక్రవర్తి శ్రీకృష్ణభగవానుడు ప్రవృత్తి ధర్మానికి ప్రతీకలుగా శ్రీ దక్షిణామూర్తి ఆదిశంకరభగవత్పాదులు నివృత్తి ధర్మానికి నిదర్శనములుగా మనకు దిశా నిర్దేశనము చేసినారు.

   వేదముల మూలమును అందించినది బ్రహ్మదేవుఁడు. మహర్షులైన బృహస్పతి వశిష్ఠ పరాశర వ్యాస జైమిని గర్గ... వేదమునందలి ఒక్కొక్క భాగమును విస్తరింప జేసిన వరిష్ఠులు. శ్రీ శంకరభగవత్పాదాచార్యులవారు సమస్త వేదస్వరూపులు. అందుకే వారు ఋషి పూర్ణ స్వరూపులని గణుతికెక్కినారు.


*వందే గురు పరంపరామ్*

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝  *వాణీ రసవతీ యస్య* 

         *యస్య శ్రమవతీ క్రియా* l

         *లక్ష్మీః దానవతీ యస్య*

         *సఫలం తస్య జీవనమ్* ll


తా𝕝𝕝 *ఎవడి మాటలు ప్రియకరమై, పరహితమై ఉండునో, శ్రమతో కూడిననూ కర్తవ్యనిష్ఠతో క్రియలను ఆచరించునో, సంపదలు దానధర్మములకై వినియోగించబడునో అతడి జన్మ సార్థకమగుచున్నది... ఫలప్రదమగుచున్నది...*.


✍🌹💐🌸🙏

కామ్యములను తీర్చే దేవతలు*

 *కామ్యములను తీర్చే దేవతలు*


మన సనాతన ధర్మంలో కోరికలను బట్టి ఏ దేవతను ఆరాధించాలో తెలిపే అత్యంత ప్రామాణికమైన గ్రంథం శ్రీమద్భాగవతం లో శుక మహర్షి పరీక్షిత్తు మహారాజుకు ఏ కోరిక ఉన్నవారు ఏ దేవతను పూజించాలో వివరించారు.

****************************************

*శ్రీమద్భాగవతo*

బ్రహ్మవర్చసకామస్తు యజేత బ్రహ్మణస్పతిమ్ |

ఇంద్రమింద్రియకామస్తు ప్రజాకామః ప్రజపతీన్ ||


*బ్రహ్మవర్చస్సు (వేద విజ్ఞానం) కోసం బృహస్పతిని.

*ఇంద్రియ శక్తి కోసం ఇంద్రుడిని.

*సంతానం కోసం ప్రజాపతులను.

****************************************

దేవీం మాయాం తు శ్రీకామః తేజస్కాయో విభావసుం |

వసుకామో వసూన్ రుద్రాన్ వీర్యకామోఽథ వీర్యవాన్ ||


*సంపద (లక్ష్మి) కోసం మాయాదేవిని (దుర్గ/మహాలక్ష్మి).

*తేజస్సు కోసం అగ్ని దేవుడిని.

*ధనం కోసం వసువులను.

*పరాక్రమం కోసం రుద్రులను.

****************************************

అన్నకామస్తు అదితిం స్వర్గకామోఽదితేః సుతాన్ |

రాజ్యకామో విశ్వాందేవాన్ సాధ్యన్ సంసాధకో విశామ్ ||


*ఆహారం (అన్నం) కోసం అదితి దేవిని.

*స్వర్గ ప్రాప్తి కోసం అదితి పుత్రులను (ఆదిత్యులను).

*రాజ్యాధికారం కోసం విశ్వేదేవతలను.

****************************************

ఆయుష్కామోఽశ్వివౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్ |

ప్రతిష్ఠాకామః పురుషో రోదసీ లోకమాతరౌ ||


*ఆయుష్షు కోసం అశ్విని దేవతలను.

*పుష్టి (ఆరోగ్యం) కోసం భూదేవిని.

*గౌరవం/ప్రతిష్ఠ కోసం భూమిని మరియు ఆకాశాన్ని.

***************************************

రూపాభికామో గంధర్వాన్ స్త్రీకామోఽప్సర ఈప్సితాః|

ఆధిపత్యపరః సర్వాన్ యజేత పరమేష్ఠినమ్ ||


*సౌందర్యం కోసం గంధర్వులను.

*ఉత్తమ భార్య/స్త్రీ సుఖం కోసం అప్సరసలను.

*ఆధిపత్యం కోసం బ్రహ్మదేవుడిని.

****************************************

యజ్ఞకామో యజేత్ యజ్ఞం విద్యకామస్తు గిరిశమ్|

దాంపత్యార్థ ఉమాం దేవీం ధర్మార్థ ఉత్తమశ్లోకమ్ ||

*యజ్ఞ ఫలం కోసం యజ్ఞ పురుషుడిని (విష్ణువు).

*విద్య (జ్ఞానం) కోసం పరమశివుడిని.

*దాంపత్య సుఖం కోసం పార్వతీ దేవిని (ఉమా దేవి).

*ధర్మం కోసం ఉత్తమశ్లోకుడైన శ్రీమన్నారాయణుడిని.

****************************************

(పరమ సత్యం)శ్రీమద్భాగవత పురాణం

ఇవన్నీ లౌకిక కోరికల కోసం చెప్పబడినవి. అయితే, అదే భాగవతంలో శుక మహర్షి చివరగా ఒక అత్యున్నతమైన వివరణ*


అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః |

తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్ || 


నీకు ఏ కోరికా లేకపోయినా (అకామ), అన్ని కోరికలు ఉన్నా (సర్వకామ), లేదా మోక్షం కావాలనుకున్నా (మోక్షకామ)... నువ్వు చేయవలసిన పని ఒక్కటే—పరమ పురుషుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మను అనన్యమైన భక్తితో ఆరాధించడం.


****************************************

ఐశ్వర్యం మరియు సంపద కోసం 

శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించాలి.


ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః |

ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే||


 అగ్ని, వాయువు, సూర్యుడు, వసువులు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు - వీరందరూ లక్ష్మీ స్వరూపులే. సంపద కోసం ఈ దేవతలను (ప్రధానంగా మహాలక్ష్మిని) ఆరాధించాలి.

****************************************

శత్రు నాశనం మరియు విజయం కోసం 

షణ్ముఖం పార్వతీపుత్రం క్రౌంచశైల విమర్దనమ్ |

దేవసేనాపతిం దేవం స్కందం వందే శివాత్మజమ్ ||


శత్రువులను జయించడానికి, ఆపదలు తొలగడానికి శివపుత్రుడైన స్కందుడిని (సుబ్రహ్మణ్య స్వామిని) ధ్యానించాలి.

****************************************

*మోక్షం మరియు జ్ఞానం కోసం (దక్షిణామూర్తి/శివుడు/ హయగ్రీవుడు)*


జ్ఞానం మహేశ్వరాదిచ్ఛేత్ ముక్తిమిచ్ఛేత్ జనార్దనాత్ |


జ్ఞానం కావాలనుకునే వారు మహేశ్వరుడిని, మోక్షం కావాలనుకునే వారు విష్ణువును పూజించాలి.

****************************************

 గ్రహ దోషాలు, ముఖ్యంగా శని ప్రభావం తగ్గడానికి హనుమ ఆరాధన శ్రేష్ఠం.

అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్ |

కపీశమక్షహంతారం వందే లంకాభయంకరమ్ ||


భయాలు తొలగడానికి, పనుల్లో విజయం సాధించడానికి హనుమంతుడిని స్మరించాలి.

****************************************

*సంతాన ప్రాప్తి కోసం (బాలకృష్ణుడు)*

హరివంశ పురాణం మరియు భాగవతం ప్రకారం సంతానం కోసం సంతాన గోపాల మంత్రాన్ని లేదా కృష్ణుడిని పూజించాలి.


దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే |

దేహి మే తనయం కృష్ణ త్వామహం శరణం గతః ||


సంతానం కోరుకునే వారు ఈ శ్రీకృష్ణ పరమాత్మను శరణు వేడాలి.

****************************************

ఆయుష్షు మరియు అపమృత్యు దోష నివారణ మృత్యువు నుండి తప్పించుకోవడానికి, పూర్ణాయుష్షు కోసం త్రయంబకేశ్వరుడిని పూజించాలి.

****************************************

శ్రీ గోవింద నారాయణ మహాదేవ 🙏 

*రాళ్ళబండి శర్మ*