14, జూన్ 2026, ఆదివారం

రత్నాలబాల–జ్ఞానమాల

  రత్నాలబాల–జ్ఞానమాల: తెలుగు సాహిత్యానికి సంపూర్ణ సాంకేతిక విప్లవం!

సాహిత్యం × సాంకేతికత = తెలుగు జ్ఞానానికి నూతన సాంకేతిక మార్గం. 


మన అమ్మభాషను నేటి తరానికి, ముఖ్యంగా పిల్లలకు సరికొత్తగా పరిచయం చేస్తూ, కృత్రిమ మేధ సాంకేతికతతో సందీప్ మిరియాల రూపొందించిన ఒక సంపూర్ణ సాంకేతిక ఆవిష్కరణ 'రత్నాలబాల–జ్ఞానమాల'.


పరిశోధన మరియు అభ్యాసానికి అనుకూలంగా, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా పదిహేను అద్భుతమైన విభాగాళ్లను ఒకే చోట చేర్చి ఈ ఉచిత వేదికను నిర్మించాను!


🔥 ఈ సాంకేతిక వేదికలోని ముఖ్యమైన విభాగాలు:

🔤 1. బాలల డిజిటల్ అభ్యాసం (పిల్లల కోసం)

అక్షరమాల & గుణింతాల మాల: కేవలం చూడటం కాదు, స్క్రీన్‌పై అక్షరాన్ని తాకితే చాలు, స్పష్టమైన వాయిస్ వినిపిస్తుంది. ఇందులో ముప్పై నాలుగు వ్యంజనాలకు, పదహారు గుణింత రూపాల ఆడియో అమరిక ఉంది!


పదాల మాల & సామెతల మాల: అరవై మూడు రెండక్షరాల పదాలు, ఎనభై రెండు మూడక్షరాల పదాలు మరియు అక్షర క్రమంలో అమర్చిన సామెతలతో పిల్లలు ఆటపాటల మధ్య తెలుగు నేర్చుకోవచ్చు.


👶 2. కథామాల (నూట ముప్పై కి పైగా సరికొత్త కథలు)

స్మృతిమాల (పింగళి సీతమామ సిరీస్): నా చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా, కృత్రిమ మేధ మరియు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ సాయంతో నేను స్వయంగా రాసిన నూట ముప్పై నైతిక విలువల పిల్లల కథలు. ఇవి నాలుగు వేర్వేరు వయస్సుల పిల్లలకు అనుకూలంగా వర్గీకరించబడ్డాయి.


🔊 3. అక్షరాల నిధి & సంప్రదాయ సాహిత్యం

రత్నాలబాల: నా తాతగారు, ప్రముఖ కవి మిరియాల వెంకటరత్నం గారి ముప్పై నాలుగు అమూల్యమైన సంప్రదాయ పద్యాల డిజిటల్ రూపం.


మిరా పద్యాలు: ప్రముఖ రచయిత, మా పెద్దనాన్నగారు అయిన డాక్టర్ మిరియాల రామకృష్ణ గారి అద్భుతమైన పద్యాల సంకలనం (ప్రస్తుతం నిర్మాణంలో ఉంది).


శతకాలమాల (వెయ్యికి పైగా పద్యాలు): పది ప్రసిద్ధ శతకాల డిజిటల్ వేదిక. సాంకేతికత సాయంతో ఈ పద్యాలను వినడమే కాకుండా.. నేరుగా ఆడియో, దృశ్యరూపం, మరియు చిత్రంగా మార్చుకోవచ్చు!


పరాభవమాల (ఉగాది శతకం): అత్యాధునిక కృత్రిమ మేధ సాంకేతికత మరియు ఛందమ్ పరికరాల సాయంతో.. దిలీప్ మిరియాల గారి విత్తు, పరికరాల అమరిక, నిర్మాణం, పర్యవేక్షణ సృష్టించిన నూట ఎనిమిది పద్యాల ఉగాది శతకం. ప్రకృతి మార్పులను, జీవన సత్యాలను వివరిస్తూ సాగే ఈ శతకంలో ప్రతి పద్యం చివర "రా ఉగాది" అనే ఆప్యాయ మకుటం ఉంటుంది.


🔏 4. తెలుగు వ్యాకరణం

సంధి మాల & సమాస మాల: విద్యార్థులకు మరియు పరిశోధకులకు ఉపయోగపడేలా.. తెలుగు వ్యాకరణంలోని ఇరవై ఆరు సంధి నియమాలు, సమాసాల నిర్వచనాలు, రకాలు మరియు విగ్రహ వాక్యాల పూర్తి వివరణలు.


🎨 5. కవులు & రచయితల కోసం అత్యాధునిక టూల్స్

చిత్రమాల పద్య యంత్రం: మీ పద్యాలను లేదా కొటేషన్లను గురజాడ, ఎన్టీఆర్, వేటూరి, సిరివెన్నెల, తెనాలి రామకృష్ణ లాంటి పన్నెండు కి పైగా ప్రసిద్ధ తెలుగు ఫాంట్స్‌తో అందమైన డిజిటల్ పోస్టర్లుగా మార్చే అద్భుతమైన సాధనం.


స్వరమాల (వాయిస్-టు-టెక్స్ట్): తెలుగులో మాట్లాడితే చాలు, క్షణాల్లో అది అక్షరాలుగా మారుతుంది. దాన్ని ఎడిట్ చేసుకొని, నచ్చిన ఫాంట్‌తో పోస్టర్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


లిపిమాల (తెలుగు అక్షర గుర్తింపు సాధనం): టైపింగ్ కష్టం లేకుండా.. పాత పుస్తకాల ఫోటోలు లేదా చేతిరాత పత్రాలను అప్‌లోడ్ చేస్తే, అందులోని తెలుగు అక్షరాలను గుర్తించి ఎడిట్ చేయదగిన డిజిటల్ టెక్స్ట్‌గా మార్చే స్మార్ట్ సాధనం.


ఖతిమాల: ఆటో-సేవ్ (ఆఫ్‌లైన్) సపోర్ట్ మరియు యాభై కి పైగా తెలుగు ఫాంట్లతో కూడిన పవర్‌ఫుల్ రైటింగ్ టూల్. మీరు రాసిన పాఠ్యాన్ని పీడీఎఫ్ లేదా వర్డ్ ఫైల్‌గా వెంటనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


🔒 గోప్యత గమనిక (నూరు శాతం ప్రైవసీ)

ఈ వేదిక యొక్క అతిపెద్ద ప్రాధాన్యత – మీ గోప్యత. మీ డేటా, మీరు టైప్ చేసే పద్యాలు, లేదా అప్‌లోడ్ చేసే చిత్రాలు మా సర్వర్లలో ఎక్కడా సేవ్ అవ్వవు. అంతా నూరు శాతం మీ డివైస్ లోనే అత్యంత వేగంగా ఆఫ్‌లైన్‌లో ప్రాసెస్ అవుతుంది!


ఎటువంటి లాగిన్స్ లేకుండా, ఎటువంటి ప్రకటనలు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా.. కేవలం ఒకే ఒక్క క్లిక్‌తో ఇప్పుడే ఈ అద్భుతమైన తెలుగు సాంకేతిక వేదికను సందర్శించండి! 


🌐 లింక్: https://ratnalabala.vercel.app/


మన భాషను కాపాడుకుందాం – మన సాంకేతికతను వాడుకుందాం! ❤️


— సందీప్ మిరియాల

హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

సదాశివ సమారంభాం ,

  🕉️ సదాశివ సమారంభాం ,, 

🚩 శంకరాచార్య మధ్యమాం /

☘️ అస్మదాచార్య పర్యంతాం ,, 

🙏 వందే గురు పరంపరామ్ //

🇮🇳 Ch.S.గోపాలరావు, RCPM. 🫡

శ్రీమద్భగవద్గీత

 శ్రీమద్భగవద్గీత: ఒకటవ అధ్యాయం 

అర్జునవిషాద యోగం: అర్జున ఉవాచ


తస్మాన్నార్హా వయం హంతుం

ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ |

స్వజనం హి కథం హత్వా

సుఖిన స్స్యామ మాధవ || (37)


అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కనుక ఓ మాధవా, బంధువులైన దుర్యోధనాదులను చంపటానికి మనం అర్హులం కాదు. సొంత వారిని చంపి మనం సుఖంగా ఎలా ఉండగలం.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

ఆచార్య సద్బోధన:*

 


             *ఆచార్య సద్బోధన:*

                 ➖➖➖✍️

```

*ఆరోగ్యాన్ని పునరుద్ధరించి రోగిని మరలా ఆరోగ్యవంతునిగా చేయడం అనేది ఒక సృజనాత్మకమైన చర్య.


*నాశనము లేకుండా సృష్టి జరగదు కాబట్టి వినాశనము అనేది చెడ్డదీ కాదు తప్పూ కాదు! దాని వెనుకనున్న ముఖ్య ఉద్దేశం ఏమిటన్నదే పరిశీలించాలి.


*మనస్సులో ఏవిధమైన నాశనభావమూ ఉద్వేగమూ ఉండరాదు! ఆలా ఉండడం తప్పు!


*సైనికుడు వ్యక్తిగత ద్వేషం లేకుండా చంపుతాడు. నిజానికి తను ఎవరిని చంపుతున్నాడో కూడా తెలియదు. తాను చంపే వ్యక్తులపట్ల ఆ సైనికుని మనస్సులో ఎటువంటి పగ ఉండదు. ఇతడు కేవలం తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు.


*అదేవిధంగా తాను నిర్మూలించే క్రిములపై ఆ డాక్టరుకు ఏ విధమైన పగ గానీ లేదు. కానీ రోగి ప్రాణాన్ని పరిరక్షించడానికి, అతడలా చేయవలసిందే!


*ఒక పాము మీ పిల్లాడిని కరవడానికి వస్తూ ఉందనుకోండి, మీరు చూస్తూ ఊరుకుంటారా?


*అటువంటి అహింస కేవలం మూర్ఖత్వమే అవుతుంది.(నా గురువర్యులు పుస్తకం నుండి.✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఇలాంటి మంచి విషయాలకోసం…

“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

ఇంద్రకీలాద్రిపై

 *ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి రహస్యం ఈ దేవిని దర్శిస్తే చాలు.. జీవితమే మారిపోతుంది?*


*జీవితంలో మనం ఎన్నో లక్ష్యాలను పెట్టుకుంటాం. కానీ మన ప్రయత్నంలో ఉన్న చిన్న చిన్న లోపాలు లేదా అనుకోని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు విజయానికి దూరమవుతుంటాం.*


*ఎంత కృషి చేసినా ఫలితం రాకపోతే, "ఇక్కడ దైవ అనుగ్రహం అవసరం" అనే భావన మనసులో కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో అపరాజిత దేవిని ప్రార్థిస్తే తప్పకుండా విజయం లభిస్తుందని భక్తుల విశ్వాసం.*


*🍀 ఇంద్రకీలాద్రిపై అపరాజిత దేవి దర్శనం..🍀*


*విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత, గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఒక చిన్న అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఆమెనే అపరాజిత దేవి అని పిలుస్తారు. చాలామందికి ఈ విగ్రహం వెనుక ఉన్న మహాత్మ్యం తెలియకపోవచ్చు. కొందరు అక్కడ కుంకుమ, పసుపు వంటివి విసిరే విధంగా ప్రవర్తిస్తారు, కానీ అది సరైన పద్ధతి కాదని భక్తులు చెబుతారు. అపరాజిత దేవి చాలా శక్తివంతమైన దైవ స్వరూపం.*


*🌻 అపరాజిత దేవి ప్రాముఖ్యత 🌻*


*మన జీవితంలో విద్య, ఉద్యోగం, కుటుంబ స్థిరత్వం, సామాజిక గౌరవం వంటి విజయాలు క్రమంగా రావాలని మనం కోరుకుంటాం. ఈ అన్ని విజయాలను క్రమంగా ప్రసాదించే శక్తిగా అపరాజిత దేవిని భావిస్తారు. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో అడ్డంకులు తగ్గి ముందుకు సాగడానికి మార్గం సులభమవుతుందని నమ్మకం.*


*🕉 అపరాజిత దేవి ఆవిర్భావ కథ 🕉*


*దేవీ భాగవతం, చండీ సప్తశతి ప్రకారం, ఒకప్పుడు దేవతలు, అసురుల మధ్య భీకర యుద్ధం జరుగుతుండగా దేవతలు విజయం కోసం పరమ శక్తిని ప్రార్థించారు. ఆ ప్రార్థనకు ప్రతిస్పందనగా పరాశక్తి ఒక ప్రత్యేక రూపంలో ప్రత్యక్షమై దేవతలకు విజయాన్ని ప్రసాదించింది. ఆ దివ్య స్వరూపమే అపరాజిత దేవి అని చెబుతారు.*


*🔥 అపరాజిత దేవి స్తోత్రం మహిమ 🔥*


*చండీ సప్తశతిలో పేర్కొన్న అపరాజిత దేవి స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే మన చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్మకం. ఈ కవచం వల్ల ప్రతికూల శక్తులు, ఆటంకాలు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. అలాగే సంక్షోభ పరిస్థితుల్లో సరైన మార్గం కనిపించడానికి ఇది సహాయపడుతుందని చెబుతారు. ప్రతిరోజు లేదా శుక్రవారం సాయంత్రం దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని చదవడం మంచిదని ఆచారం. ఇలా భక్తితో పఠిస్తే మనసులో స్థిరత్వం పెరిగి, ఆత్మవిశ్వాసం బలపడుతుందని భావిస్తారు.*


*🪷 అపరాజిత దేవి అనుగ్రహ ఫలితాలు 🪷*


*కష్టసమయంలో ధైర్యం కోల్పోయినప్పుడు, సమస్యలు ఎలా పరిష్కరించాలో అర్థం కానప్పుడు అపరాజిత దేవిని ప్రార్థిస్తే మార్గదర్శనం లభిస్తుందని భక్తుల నమ్మకం. విద్యలో ఏకాగ్రత పెరగడం, పరీక్షల్లో మంచి ఫలితాలు రావడం వంటి అనుభవాలు కూడా చాలామంది చెబుతారు.*


*🍛 నైవేద్యం, ఆచారాలు 🍛*


*శుక్రవారం రోజున లేదా ప్రత్యేక సందర్భాల్లో అపరాజిత దేవికి పాలు, ఏలకులు కలిపిన నైవేద్యం లేదా పటిక బెల్లం సమర్పించడం ఆచారంగా ఉంటుంది. భక్తిశ్రద్ధలతో చేసిన ప్రార్థనలు, ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది. చివరగా, అపరాజిత దేవి ఆరాధన మనలో ధైర్యాన్ని పెంచి, జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించడానికి మానసిక బలం అందిస్తుందని భక్తులు నమ్ముతారు.*

రమణోదయం

 🙏 *రమణోదయం* 🙏


*స్థూల సూక్ష్మములు, శూన్యత్వ పూర్ణత్వములు, ధైర్యాధైర్యములు మొదలయిన ద్వంద్వాలన్నింటినీ ఎఱిగే జ్ఞాన మొకటి ఉంది. అది అన్నింటికీ మూలమై ప్రకాశిస్తోంది. "అనంతంగా ఉన్న ఆ జ్ఞానమే ఆత్మ (నేను)".*


*భగవాన్ శ్రీరమణ మహర్షి*

(భగవాన్ ఉపదేశాలు *"శ్రీ మురుగనార్"* వచనములలో - సం.1043)

సేకరణ: *"గురూపదేశ రత్నమాల"* నుండి 

🪷🪷🦚🦚🪷🪷

 *స్మరణ మాత్రముననె పరముక్తి ఫలద* |

 *కరుణామృత జలధి యరుణాచలమిది*|| 

            

🌹🌹🙏🙏 🌹🌹

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      🌞 *ఆదివారం*🌞

  *🌹14, జూన్, 2026🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : చతుర్దశి* మ 12.19 వరకు ఉపరి *అమావాస్య*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : రోహిణి* రా 10.14 వరకు ఉపరి *మృగశిర*

*యోగం : ధృతి* మ 01.15 వరకు ఉపరి *శూల*

*కరణం  : శకుని* మ 12.19 *చతుష్పాద* రా 10.21 ఉపరి *నాగ*

*సాధారణ శుభ సమయాలు:*

          *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  :*రా07.26 - 08.50*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*  

*వర్జ్యం    : మ 03.14 - 04.38 & రా 03.06 - 04.30*

*దుర్ముహూర్తం :సా04.56- 05.48*

*రాహు కాలం :సా 05.03- 06.41*

గుళికకాళం    : *మ 03.24 - 05.03*

యమగండం    : *మ 12.08 - 01.46*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *వృషభం*

సూర్యోదయం :*ఉ 05.42*   

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   :  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం     :  *ఉ 05.35- 08.12*

సంగవ కాలం      :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం  :*10.49 - 01.26*

అపరాహ్న కాలం   :*మ 01.26- 04.04*

*ఆబ్ధికం తిధి       : అధిక జ్యేష్ఠ అమావాస్య*

సాయంకాలం      :*సా 04.04 - 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41 - 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం        :*రా11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>

         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

పుణ్యభూమి ఐన మన భారతదేశం

 *అమెరికా పర్యటనలో ఉన్న ఒక సీనియర్ సిటిజన్ ఇస్తున్న సలహా:*

ప్రియమైన మిత్రులారా,

మేము గత రెండు నెలలుగా అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఉన్న సియాటెల్ నగరంలో ఉంటున్నాము. భారతదేశం నుండి వచ్చేటప్పుడే నా భార్యకు శ్వాసకోస సంబంధిత సమస్య తీవ్రంగా ఉంది. ఆమె పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మేము భారత్ నుండి తగినన్ని మందులను వెంట తెచ్చుకున్నాము. అమెరికాలో ఆ మందులు వాడిన తర్వాత ఆమె దాదాపు కోలుకుంది.

అయితే, తెచ్చుకున్న మందులు అయిపోవడంతో, మా పర్యటన సమయంలో ఆమెకు మళ్లీ శ్వాసకోస సమస్య వస్తుందేమోనని నేను ఆందోళన చెందాను. అందుకే, సియాటెల్‌లోని ఒక పల్మనాలజిస్ట్ (శ్వాసకోస నిపుణుడు) అపాయింట్‌మెంట్ తీసుకోమని నా కుమార్తెను కోరాను.

కానీ, నేరుగా నిపుణుడిని కలవడానికి వీల్లేదని, ముందుగా జనరల్ ఫిజీషియన్‌ను కలవాలని నా కుమార్తెకు చెప్పారు. దాని కోసం మాకు వారం రోజుల తర్వాత అపాయింట్‌మెంట్ ఇచ్చారు, అది కూడా కేవలం వీడియో కాల్ ద్వారా మాత్రమే.

మేము ఫోన్‌లో సుమారు 10 నిమిషాల పాటు డాక్టరుతో మాట్లాడి, ఇండియాలో నా భార్య వాడుతున్న మందుల గురించి వివరించాము. ఆయన సమస్యను అర్థం చేసుకున్నానని చెబుతూ, అందుకు తగ్గట్టుగా మందులు రాసిచ్చారు. ఆ మందులను మెడికల్ స్టోర్ నుండి తీసుకోవచ్చని చెప్పారు. తీరా మేము స్టోర్‌లో విచారించగా, ఆ మందులు వెంటనే అందుబాటులో లేవని, రావడానికి 4-5 రోజులు పడుతుందని చెప్పారు.

చివరికి ఐదో రోజున మాకు ఆ మందులు అందాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ మందులను 'సిప్లా' (Cipla) కంపెనీ తయారు చేసింది మరియు వాటిపై 'మేడ్ ఇన్ ఇండియా' అని రాసి ఉంది. అమెరికాలో తీసుకున్న మెడికల్ ఇన్సూరెన్స్ వల్ల 50% రాయితీ లభించిన తర్వాత కూడా మేము ₹21,000 చెల్లించాల్సి వచ్చింది. అంటే, ఇండియాలో కేవలం ₹2,500 ఖరీదు చేసే మందులు, అమెరికాలో అక్షరాలా ₹42,000 అన్నమాట.

భారతదేశంలో మందుల దుకాణాల్లో నేరుగా దొరికే మందులను ఇక్కడ పొందడానికి మాకు 12 రోజుల సమయం పట్టింది. వారం రోజుల తర్వాత, డాక్టర్ సంప్రదింపుల ఫీజు (కన్సల్టేషన్) కోసం మాకు $283 (సుమారు ₹23,000) బిల్లు వచ్చింది.

భారతదేశంలో వైద్య సదుపాయాలు చాలా అధ్వాన్నంగా ఉన్నాయని భావించే నా భారతీయ మిత్రుల కోసం నా ఈ అనుభవాన్ని పంచుకుంటున్నాను.

మీ విశ్రాంత జీవితంలో మీరు భారతదేశంలో నివసిస్తున్నందుకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా భావించండి.


పుణ్యభూమి ఐన మన భారతదేశం లో మనం ప్రశాంతంగా బ్రతుకుతున్నందుకు సంతోషించండి. 


సేకరణ

సమస్యాపూరణం

 సమస్యాపూరణం.

సమస్య. "సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్".




సంస్కృత మందు గౌరవము, సాధన, శోధన ,సుంతలేని -దు

స్సంస్కృతి నేటి జాడ్యమయె, 

సంస్కృత మెంచగ శాస్త్ర మూలమౌ,

సంస్కృతి లేనివారలె య సత్యము లిట్టుల బల్కుచుంద్రుగా

"సంస్కృత భాషచేఁ జెడెను సంస్కృతి సర్వము భారతావనిన్"


సురభి శంకరశర్మ.



పాఠకులు కూడా ఈ సమస్యను   వారి కవితా పాఠవాన్ని అనుసరించి ఊరించి ఇక్కడ  కామెంట్ రూపంలో ఇక్కడ పోస్ట్ చేయవచ్చు

శ్రీమహావిష్ణుపురాణం

 116f4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀1️⃣1️⃣5️⃣



       *శ్రీమహావిష్ణుపురాణం:*

               ➖➖➖✍️

             115 వ భాగం 


*శ్రీకృష్ణావతారము-17* 

*జాంబవతి, సత్యభామలతో వివాహం..```

యదువంశానికి ఉపవంశమైన వృష్ణి వంశియుడైన సత్రాజిత్తు బలరామ కృష్ణులకు గల పేరు ప్రఖ్యాతులను చూసి అసూయ చెందేవాడు. బలరామ కృష్ణుల కన్నా ఎక్కువగా పేరురావాలని, యదువంశంలో అత్యంత ధన సంపన్నుడిని కావాలని సూర్యుని ఆరాధిస్తూ కఠోర తపస్సు చేసాడు. 

సూర్యుడు తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. 

సత్రాజిత్తు “నేను తేజోసంపన్నుడు, ధనసంపన్నుడు కావాలని" కోరిక కోరాడు.


సూర్యుడు తన కంఠంలో ఉన్న శ్యమంతకమణిని తీసి సత్రాజిత్తుకి ఇచ్చి "ఈ మణినిధరించినవాడు సూర్యుని వలె తేజో సంపన్నుడు అవుతాడు. ఈ మణి ఉన్న ప్రదేశంలో వర్షాలు సకాలంలో కురిసి పంటలు బాగా పండుతాయి. ఈతిబాధలు, అరిష్టాలు ఉండవు. రోజుకి ఎనిమిది బారువుల బంగారం ప్రసాదిస్తుంది. మణిని, బంగా రాన్ని దుర్వినియోగం చేయకుండా ఉండాలి. నిత్యం మణిని పూజించు!శుభం కలుగుతుంది” అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


తపస్సు ముగించి, శ్యమంతక మణి హారం మెడలో ధరించి సత్రాజిత్తు తన గొప్పదనం చూపించాలని ద్వారకవచ్చాడు. సూర్యుని వలె ప్రకా శిస్తు తేజస్సుతో రాజవీధులలో వస్తున్న సత్రాజిత్తుని చూసి ద్వారక ప్రజలు సాక్షాత్తు సూర్యుడే కృష్ణుడి దర్శనానికి వచ్చాడు అని భ్రమించారు. 


భటులు వెళ్లి రాజసభలో సభికుల మధ్యలో ఉన్న కృష్ణుడికి సూర్యుడు దర్శనానికి వస్తున్నాడని చెప్పి పక్కకు తప్పుకుని నిలిచారు.


కృష్ణుడు నవ్వుకుని "వచ్చే వ్యక్తి సూర్యుడు కాదు. వృష్ణి వంశీయుడైన సత్రాజిత్తు. సూర్యుని తపస్సుతో మెప్పించి శ్యమంతక మణి అనే అనర్ఘమణిని అనగా అపూర్వ శక్తి గల మణిని పొందాడు. ధరించిన వ్యక్తిని 

ఆ మణి సూర్యుని వలె ప్రకాశవంతుని చేస్తుంది. అంతేకాదు, దినమునకు ఎనిమిది బారువుల బంగారం ఇచ్చే శ్యమంతకమణి ఉన్నచోట ఈతిబాధలు ఉండవు. అరిష్టాలు ఉండవు. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు" అని చెప్పగా సభికులు ఆశ్చర్యం చెందారు.


అటువంటి మణిని శ్రీకృష్ణునికి ఇవ్వడానికి వస్తున్నాడేమో అని అందరు భావించారు. 


శ్రీకృష్ణుడు వారి అభిప్రాయాలను గ్రహించి సభకు వచ్చిన సత్రాజిత్తుని సాదరంగా ఆహ్వానించి ఉచితాసనుని చేశాడు. సత్రాజిత్తు కంఠంలోని శ్యమంతక మణిని తీసి అందరికి చూపించి "సూర్యుడు తన తపస్సుకి మెచ్చి ఇవ్వడం, శ్యమంతకమణి గొప్పదనం, ప్రసాదించే బంగారం గురించి గొప్పగా చెప్పాడు. తను యదు వంశంలో అందరి కన్నా గొప్ప వాడిని,తేజోవంతునిఅయ్యాను కనుక బలరామ కృష్ణులు, ద్వారకా ప్రజలు తన గొప్ప దనాన్నిగుర్తించిసత్కరించాలనిగర్వంగా ప్రకటించాడు.


సభలోని వారుసత్రాజిత్తుఅహం కారానికి ఆశ్చర్యపడ్డారు. శ్రీకృష్ణుడు సత్రాజిత్తు వద్దకు వచ్చి "మీరు నిజంగాచాలాగొప్పవారు,మహి మాన్వితులు అనడంలో సందే హం లేదు. కఠోర తపస్సు చేసి సూర్యదేవుని మెప్పించి శ్యమంతకమణిని పొందారు. ఒకసారి సూర్యదేవుడు మణినిస్తూ చెప్పిన మాటలు గుర్తు చేసుకోండి.


వ్యక్తుల వద్ద ఇటువంటి మహిమ గల మణి ఉండటం అనేక సమస్యలు వస్తాయి. ఇచ్చే బంగారం కోసం ఆశపడే స్వార్ధపరులు

మీకు ప్రాణహాని కూడా తల పెట్టవచ్చును. కనుక తమరుఈ శ్యమంత కమణిని మహరాజు ఉగ్రసేనునికిఇవ్వండి.కోశాగారం లో భద్రముగా ఉంటుంది. రోజు ఇచ్చే బంగారం తమరే తీసుకోవచ్చును. మీ మంచి కోరి సలహా ఇస్తున్నాను. తరు వాత మీ ఇష్టం" అని చెప్పాడు.


కృష్ణుడు తన మణిని తీసుకో వాలని అలా చెబుతున్నాడు అని భావించి సత్రాజిత్తు తిరస్కరించాడు. నేను కఠోర తపస్సు చేసి సంపాదించినది నా దగ్గరే ఉండాలి అని ప్రకటించి సత్రాజిత్తు కోపంగా ఇంటికి వెళ్లి పోయాడు. ఇంటికి భద్రత పెంచుకున్నాడు.శ్యమంతకమణిని పూజ సమయంలో తప్ప మిగిలిన సమయంలో తను మెడలో వేసుకునేవాడు.


ఒకరోజు అత్యవసర పనిమీద బయటకు వెళ్లవలసినఅవసరం రావడంతో మణిని సంరక్షించే బాధ్యతనుసత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుడికి ఇచ్చి వెళ్లాడు. ప్రసే నుడుమణినికంఠంలోధరించి అడవికి వేటకు వెళ్లాడు.అక్కడ ఒక సింహం ప్రసేనుడికి మెడలో ఎర్రగా ప్రకాశించేమణిమాంసపు ముక్క అని భావించి అతని పై దూకి హతమార్చింది. మణిని నోట కరచుకుని సింహంపారిపో తుంటే జాంబవంతుడు అనే భల్లూకం చూసి సింహాన్ని చంపి మణిని తీసుకుని తన కుమార్తె జాంబవతికిఆడుకునేవస్తువుగా ఇచ్చాడు.

శ్యమంతకమణి ధరించి వెళ్లిన ప్రసేనుడు అడవి నుంచి తిరిగి రాకపోవడంతో, సత్రాజిత్తు రాజసభకు వచ్చి "మణి అడిగినప్పుడు ఇవ్వలేదని కృష్ణుడే వేటకు వెళ్లిన తన తమ్ముడు ప్రసేనుని చంపి అపహరించాడని" ఆరోపణ చేశాడు. తన మణిని తనకు ఇప్పించమనిఉగ్రసేనునికోరాడు. సభలోని వారు కృష్ణుని పై నిందవేసినందుకు సత్రాజిత్తుపై దాడి చేయబోతుంటే కృష్ణుడు ఆపి "తన పై వచ్చిన ఆరోపణ అసత్యం అనినిరూపించడానికి అడవికి వెళ్లి శ్యమంతకమణిని తెస్తానని" ప్రకటించి అడవికి వెళ్లాడు.


అడవిలో ప్రసేనుడి కళేబరం, కొంతదూరం వెళ్లిన తర్వాత సింహపు కళేబరం, అక్కడ నుంచి ఎలుగుబంటి అడుగు జాడలు పర్వతపు గుహలోకి వెళ్లడం గమనించాడు. తన వారిని గుహ బయటఉండమని లోపలికి వెళ్లాడు. అక్కడ ఆట వస్తువుగా ఉయ్యాలకు కట్టిన మణిని చూశాడు. ఆ ఉయ్యా లలో జాంబవతి పడుకుని ఉంది. నిద్రాభంగం కాకుండా మణిని తీసుకుని వస్తుంటే అక్కడకు వచ్చిన దాది చూసి భయపడి గట్టిగా అరిచింది.


అరుపులకు జాంబవతి నిద్ర లేచి కృష్ణుని జగన్మోహనరూపం చూస్తూనిలబడింది.జాంబవంతుడు దాది అరుపులకు అక్కడకు వచ్చి కృష్ణుడితో యుద్దానికితలపడ్డాడు.ఇరువురి మధ్య నెల రోజులు ద్వంద్వ యుద్ధం జరిగింది. ఓడి అలసి నీరసించిపోయినజాంబవతుడు తనతో పోరాడినవాడు త్రేతాయుగపు శ్రీరాముడిగా గుర్తించాడు.


శ్రీకృష్ణుడి పాదాలకు నమస్కరించి దేవా నాడుత్రేతాయుగంలో నీతో ద్వంద్వయుద్ధంచేయాలని కోరాను.ఆకోరికద్వాపరయుగంలో తీర్చావు. కృష్ణుడివి నీవే! రాముడివి నీవే! నారాయణుడివి నీవే! నా అవివేకానికి మన్నించు!" అని ప్రార్ధించాడు.శ్యమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతి ని సమర్పించాడు.


శ్యమంతకమణితో, జాంబవతి తో ద్వారకకు వచ్చి కృష్ణుడు రాజసభ ఏర్పాటు చేశాడు. సత్రాజిత్తుని పిలిపించి అందరి ముందు జరిగింది చెప్పి మణిని సత్రాజిత్తుకిఇచ్చాడు.సత్రాజిత్తు కృష్ణుడిపై అసత్య ఆరోపణ చేసినందుకు క్మార్పణచెప్పాడు. ప్రాయశ్చిత్తంగా తన కుమార్తె సత్యభామను,శ్యమంతకమణిని స్వీకరించమని ప్రార్ధించాడు.


అంతకు ముందు సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామ శ్రీకృష్ణుని ఇష్టపడుతుందని తెలిసినా, కృష్ణుడి పై కోపంతో కృతవర్మ తమ్ముడు శతధ్వనుడికి ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడు. ఇప్పుడు కృష్ణునికి ఇచ్చి చేయడంతో శతధ్వనుడు సత్రాజిత్తు పై కోపం పెంచుకున్నాడు. కానీ బలరామ కృష్ణుల బలపరాక్ర ములకు భయపడి మౌనంగా ఉండిపోయాడు. 


శుభ ముహుర్తంలో శ్రీకృష్ణుడికి జాంబవతితో, సత్యభామతో వివాహం జరిగింది. శ్రీకృష్ణుడు వీరినే కాకుండా కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్ష్మణ అనే ఐదుగురిని వివాహమాడి అష్టభార్యలు కలిగి ఉన్నాడు.✍️(సశేషం)

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.. 

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

సుందరకాండ-హనుమ*

  


      *సుందరకాండ-హనుమ*

                ➖➖➖✍️


*నమోస్తు రామాయ సలక్ష్మణాయ*

*దేవ్యైచ తస్యై జనకాత్మజాయై*

*నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో*

*నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః*

```

*రావణుడు తన మధుర వాక్కులతో ప్రణయ ప్రార్థన ప్రారంభించాడు.. 

“ఓ సుందరీ నీకెందుకింత భయం? భయంతో నీ సౌందర్యాన్ని దేనికి దాచుకుంటావు? సర్వలోకాలనూ ఆకర్షించే నీ అందాన్ని అర్థిస్తున్నాను. నన్ను ఆదరించి ప్రేమించు. ఇక్కడ మానవ ప్రాణి లేదు. వీరికెవ్వరికీ కామరూప శక్తి లేదు. మీ లాగే మాకు కూడా ధర్మభీతి చాలా వుంది. పరస్త్రీలను బలాత్కరించడం, వారితో భోగించడం రాక్షస జాతి ధర్మం. ఈ ధర్మ నిర్వహణలో నేను అప్రమత్తంగా వుంటాను. నీ మనసు నన్ను కోరేవరకు నిన్ను నేను తాకను, మదన తాపం నా మనసును యెంత వేధించినా నేను నిన్ను ముట్టను. 

నీకు అంగీకారం అయ్యే వరకు వేచియుంటాను. ఎందుకింత భయం? సుఖంగా నన్ను ప్రేమించు. భోగాలు అనుభవించు. కటిక నేలపై మలిన వస్త్రంతో నిష్కారణంగా ఉపవాసాలతో ఏకవేణితో, యెందుకు దీర్ఘాలోచన చేస్తున్నావు. హాయిగా నా మాట విని నన్ను ఆదరించు. స్వర్ణాభరణాలు, సుగంధ, సుమమాలలు, చీనాంబరాలు, మణిమయ పీఠాలు, మధురమైన పానీయాలు, నృత్యాలు, గానాలు, వినోదాలు, హంసతూలికా తల్పాలు అన్నీ అనుభవించు. వెనక్కి రాని నదీ ప్రవాహంలా పోయిన యవ్వనం మళ్ళీ రాదు. సృష్టికర్త సర్వసౌందర్యరాశిగా నిన్ను సృష్టించి విశ్రాంతి తీసుకున్నాడా? పితామహుడైన బ్రహ్మకు కూడా కన్ను చెదిరే అందం నీది. నీ శరీరంలో అణువణువూ అత్యంత మనోహరమైన నా కనులకు బంధం వేస్తున్నది. నన్ను కాదనకు, నా మాట విని నన్ను గ్రహించి నా రాణీ వాసానికి పట్టమహిషి వై వుండు. దిగ్విజయ యాత్రలో నేను సాధించిన ఐశ్వర్యమంతా నీ ముందు వుంచుతాను, నేను నీ ఆధీనంలో వుంటాను. ఈ భూమండలంలో నన్నెదిరించి నిలిచే వీరుడు లేడు. నాకు శత్రువై బ్రతికిన వాడు లేడు.

ఈ మలిన వస్త్రమును వీడి సర్వాలంకార భూషితవై యదేచ్ఛగా నాతో కూడి పానక్రీడలు సాగించు. 

నీ చిత్తం వచ్చినట్లు దాన ధర్మాలు చేయు. నా సంపదలను ఐశ్వర్యాన్ని చూసావుగా యిన్ని భోగాలను అనుభవించక నారవసత్రంతో అడవుల్లో తిరిగే రామునికోసం బాధపడతావెందుకు. రామునికి సంపదలేదు, వనవాసం, కటిక నేలపై శయనం. నాకు చిక్కిన నీవు రాముని పొందలేవు. ఓ చారునేత్రీ గరుత్మంతుడు సర్పములు పట్టినట్లు నీవు, నీ సౌందర్యం నన్ను హరిస్తున్నాయి. ఈ దశలో నిను చూసిన తరువాత నా మనసు వికలమై నా అనుంగు భార్యలను కూడా ఆదరించలేకపోతున్నాను. దేవలోకంలో లక్ష్మీదేవిని ఆరాధించినట్లు నా నారీజనం నిను పూజిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు. నా ఐశ్వర్యం కుబేరుని కన్నా మించి వుంది. అదంతా నీ సొంతం చేస్తాను. నా తపోబల శక్తికి కాని, సంపదలకు గాని రాముడు నాకు ఏ మాత్రం సరితూగడు. ఓ లలనా, హాయిగా స్వేచ్ఛగా నాతో కలిసి విహారాలు చేస్తూ భూమండలంలో కనీవినీ ఎరుగని సమస్త భోగభాగ్యాలను అనుభవించు. నీతో పాటు నీ బంధుకోటికి ఈ సమస్త భోగాలను అనుభవించే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించు. సర్వాలంకారభూషితవై నాతో సర్వసుఖాలు అనుభవించు," యని పెక్కు విధముల రావణాసురుడు సీతమ్మను ప్రలోభపెట్టి తన వశం చేసుకోవడానికి ప్రయత్నించాడు. కాని సీతమ్మ తల్లి తనకున్నటువంటి ప్రతికూల పరిస్థితుల్లో శ్రీరాముని పాదములను మనసులో వుంచి తపస్సు చేస్తూ వుంది. పది నెలలు గడిచినా మనుష్యకాంతగా జీవిస్తోంది. ఆమెకు దేవేంద్రుడు ప్రతి దినం పాయసాన్ని దేవతలచే పంపించగా ఈ భూమండలం పై యెక్కడా వున్నా రామలక్ష్మణులకు చెందుగాక యని వారి ప్రీత్యర్థం కొంత పాయసాన్ని భూమిపై వుంచి మరికొంత కేవలం తన రాముడు వచ్చే వరకు జీవించడం కోసం, శరీరాన్ని నిలబెట్టడం కోసం కొంత పాయసాన్ని భుజిస్తూ రామునికోసం ఎదురుచూస్తోంది. 

పది నెలలు గడిచినా రావణాసురుని ఆధీనంలో వున్న సీతమ్మ ఒక్క పండు కాని ఒక మెతుకు కాని ముట్టుకోలేదు. ఇది అనర్థం, తన యింట వున్న సాధ్వీ మణి ఉపవాసం చేస్తున్నది అది నీ లంకకు చేటు అని ఎందరు చెప్పినా వినని మూర్ఖుడు రావణుడు కామాంధుడై బుద్ధి నశించిన వాడై విజ్ఞతా విచక్షణలు మరచి ప్రవర్తిస్తున్నాడు రావణుడు.✍️(సశేషం)

*జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్*

*జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్🙏*```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

శ్రీ ఓతండీశ్వరర్ ఆలయం

 🕉 మన గుడి : నెం 1507


⚜  తమిళనాడు : తిరుమజిసై - చెన్నై


⚜  శ్రీ ఓతండీశ్వరర్ ఆలయం



💠 తమిళనాడులో చెన్నై నగర పరిధిలో ఉన్న తిరుమళిసైలో కొలువైన ఓతాండీశ్వరర్ ఆలయం శివునికి అంకితం చేయబడింది. 


💠 ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయాన్ని, 11వ శతాబ్దంలో చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు II నిర్మించారు. 


💠 ఇక్కడ శివుడు 'ఓతాండీశ్వరర్'గానూ, ఆయన దేవి పార్వతి 'కుళిర్వితనాయకి'గానూ ఆరాధించబడతారు.


🌀 స్థల పురాణం


💠 స్థల పురాణం ప్రకారం, చోళ చక్రవర్తి కులోత్తుంగ చోళుడు II ఒకసారి అడవిలో  మరో ప్రదేశంలో శివ దర్శనం చేసుకోవడానికి తన ఏనుగుపై ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో, ఏనుగు ఒక కాలు ఒక తీగలో చిక్కుకుంది. 

ఎంత ప్రయత్నించినా అది పొద నుండి బయటకు లాగలేకపోయింది. 


💠 రాజు తన చేతులతో ఆ పొదను తొలగించడానికి ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు.

అతను తన కత్తితో ఆ పొదను నరకడం ప్రారంభించగా, అతనికి రక్తస్రావం మొదలైంది. ఆశ్చర్యపోయిన రాజు, పొదల కింద దాగి ఉన్న ఒక శివలింగాన్ని కనుగొన్నాడు. 


💠 తాను భగవంతునికి అపచారం చేశానని గ్రహించిన రాజు, ఏమాత్రం సంకోచించకుండా అదే కత్తితో తన చేతిని నరుక్కోగా, భగవంతుడు తన నందిపై అమ్మవారితో కలిసి అతని ముందు ప్రత్యక్షమై, మునుపటిలాగే అతని చేతిని బాగుచేశాడు.


💠 రాజు యొక్క ఈ అచంచల భక్తికి మెచ్చిన శివుడు, ఆ ప్రదేశంలోనే తన దేవి పార్వతి (కుళిర్వితనాయకి)తో కలిసి 'ఓతాండీశ్వరర్' రూపంలో ఆయనకు ప్రత్యక్షమయ్యారు. 


💠 ఓతాండీశ్వరర్ కులోత్తుంగ చోళుని చేతిని తిరిగి యథాస్థితికి తెచ్చారు; 

ఈ కారణంగానే ఆయనకు 'కై తంత పిరాన్' (చేయి ప్రసాదించిన దైవం) అనే నామం కూడా ఏర్పడింది.


💠 ఈ ఆలయంలోని మూలవిరాట్టుపై ఇప్పటికీ ఒక మచ్చ ఉందని భక్తులు విశ్వసిస్తారు.

మరొక ఐతిహ్యం ప్రకారం, ఈ మూలవిరాట్టు భక్తుల శాపాలను తొలగించి వారికి బలాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి, ఈ దైవాన్ని 'మనువానుకూలేశ్వరర్' అని కూడా పిలుస్తారు.


💠 అమ్మవారు రాజుకు శివ భక్తుల కథలను చెప్పి అతని మనసును శాంతపరిచారు. 

ఈ సందర్భంలో తమిళంలో 'కుళిర్వితల్' అంటే భక్తుల దుఃఖాలను చల్లార్చేది అని అర్థం, అందుకే ఆమెను 'కుళిర్విత నాయకి' అని కీర్తిస్తారు.


💠 చరిత్ర : 

ఈ ఆలయంలో 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి అనేక శాసనాలు ఉన్నాయి. 

కులోత్తుంగ చోళుడు II ఈ ఆలయాన్ని మరియు అందులోని ఉపాలయాలను ప్రస్తుత రూపంలో నిర్మించాడని భావిస్తారు. 

విష్ణుమూర్తి ఉపాలయం తర్వాతి కాలంలో నిర్మించబడిందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. 

సెంగుంద ముదలియార్లు ఈ ఆలయంలో అనేక ఉపాలయాలను నిర్మించి, ఆలయ పుష్కరిణిని (కోనేరును) పునరుద్ధరించారు. 

ఈ ప్రాంతాన్ని పరిపాలించిన విజయనగర రాజులు ఆలయానికి అనేక దానధర్మాలు చేశారు. 


💠 ఓతండేశ్వరర్ ఆలయం ఏడు అంతస్తుల రాజగోపురాన్ని కలిగి ఉంది; మూలవిరాట్టు అయిన ఓతండేశ్వరర్, లింగ రూపంలో గర్భగుడిలో కొలువై ఉన్నారు. 

ప్రధాన ద్వారం నుండి ధ్వజస్తంభ మండపం, మహా మండపం మరియు అర్థ మండపం గుండా గర్భగుడిని చేరుకోవచ్చు. 

ధ్వజస్తంభం, గర్భగుడికి సరిగ్గా ఎదురుగా (అక్షరేఖపై) ఉన్న ధ్వజస్తంభ మండపంలో నెలకొల్పబడి ఉంది. 

మహా మండపంలో, ప్రధాన గర్భగుడికి అభిముఖంగా నంది విగ్రహం ఉంటుంది. 

మహా మండపానికి ముందు వినాయక మరియు మురుగన్ ఉపాలయాలు ఉన్నాయి; గర్భగుడికి ఇరువైపులా ద్వారపాలకులు కాపలాగా నిలుస్తారు.


💠 'కులిర్వితనాయకి' ఉపాలయం ఆలయ రెండవ ప్రాకారంలో ఉంది. ఈ ఆలయంలో నటరాజు (శివుని నాట్య రూపం) మరియు ఆయన దేవి శివకామి ఒకరికొకరు అభిముఖంగా ఉన్న ఉపాలయం కూడా ఉంది. 

గర్భగుడిపై ఉండే విమానం (శిఖరం), 'గజపృష్ట' శైలిలో నిర్మించబడింది; ఇది కూర్చున్న ఏనుగు ఆకారాన్ని పోలి ఉంటుంది. 


💠 ఈ ఆలయంలోని వినాయకుడిని 'ప్రసన్న వినాయకుడు' అని పిలుస్తారు. 

రెండవ ప్రాకారంలో విష్ణుమూర్తికి ఒక ఉపాలయం ఉంది. 

గర్భగుడి చుట్టూ శని, వృషభ, దుర్గ, చండికేశ్వర, దక్షిణామూర్తి మరియు నవగ్రహాల ఉపాలయాలు కూడా ఉన్నాయి.


💠 ఆలయంలోని వినాయక స్వామిని ప్రసన్న వినాయకుడిగా పూజిస్తారు.

నటరాజ స్వామి, అంబికా అమ్మవారు ఒకరినొకరు చూసుకుంటూ పూజిస్తే, ఆ దంపతుల ఐక్యత మరింత బలపడి, వారి జీవితంలో ఆనందం కలుగుతుందని భక్తులలో ప్రగాఢ విశ్వాసం ఉంది. 


💠 ఒతందీశ్వరార్ ఆలయానికి అతి సమీపంలో, జగన్నాథ పెరుమాళ్ ఆలయం అని పిలువబడే విష్ణువు ఆలయం. వినిపిస్తున్నట్లుగా, పేరు పూరీ జగన్నాథుడిని పోలి ఉంటుంది.

ఇక్కడి జగన్నాథుడిని మధ్య జగన్నాథ అని, పూరిలో ఒకటి అర్ధ జగన్నాథ అని మరియు తిరుపుల్లనైలో ఉన్నవాడు ఆది జగన్నాథ అని చెబుతారు. 

ఇక్కడ జగన్నాథ స్వామి, శ్రీకృష్ణుని రూపంలో మరియు ఆయన భార్యలైన రుక్మిణి, సత్యభామలతో కనిపిస్తారు. 


💠 తమిళ మాసమైన 'పంగుణి' (మార్చి - ఏప్రిల్) నెలలో జరిగే 'బ్రహ్మోత్సవం' మరియు 'శని పెయర్చి' (శని గ్రహ సంచారం) ఉత్సవాలు అత్యంత ప్రముఖమైనవి.



💠  చెన్నై నుండి 22 కి.మీ దూరంలో ఉంది.



రచన

©️ Santosh Kumar

ఆంగ్ల వైద్యమందు

 ఆంగ్ల వైద్యమందు నక్రమా లెరిగినా

సైడెఫెక్ట్ల గూర్చి సర్వ మెరిగి

పోరు దాని నొదిలి పోగాలమే గదా

సకురు అప్ప రావు సత్య 

మిదిర!


భావం: ఇంగ్లీష్ వైద్యంలోని మందులు విపరీతమైన సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయనీ, వ్యాధులను సంపూర్ణ నివారణ చెయ్యకుండా తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తూ, దీర్ఘకాలంలో వ్యాధులను ముదరబెట్టి, అనవసర మందుల వాడకంతో కిడ్నీ, లివర్ పాడు చెయ్యడంతో పాటు కేన్సర్ లాంటి వ్యాధులను సైతం పుట్టిస్తుందనీ, మెడికల్ మాఫియా మాయాజాలంతో అవసరం లేని ఆపరేషన్లతో పార్ట్లు తొలగించి, ఇంప్లాంట్స్ వేయడం, అవసరం లేకపోయినా స్టెంట్లు వేయడం, విపరీతంగా అనవసరమైన టెస్ట్లు చేయించడం, పేషెంట్లను బెదరగొట్టి, అనవసరమైన ట్రీట్మెంట్లు, ఆపరేషన్లు చెయ్యడం, సాధారణ పేషెంటును సైతం ఐసీయూలో పెట్టి, అడ్డదిడ్డమైన మెషీన్లు తగిలించి, బిల్లు పెంచడం, వంటి ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతీ ఒక్కరికీ తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరకే ఈగల్లాగా పోతూ, వాళ్ల వలన నానా అగచాట్లకూ గురవ్వటం పోయే కాలం కాకపోతే ఇంకేమిటి? దీపపు పురుగులకూ, వీళ్ళకూ పెద్ద తేడా లేదు! హోమియో, ఆయుర్వేదం, యోగా, ప్రకృతి వైద్యంలో వీళ్ళ సమస్యలకు, ఎమర్జెన్సీలకూ మందులూ, తగిన పరిష్కారమూ ఉంటాయని ఎంత అరిచి చెప్పినా అస్సలు వినిపించుకోరు! ఇదంతా వాళ్ళ ఖర్మ కాకపోతే ఇంకేమిటి? 


సకురు అప్పారావూ ఇది ఏమీ చెయ్యలేక, వీళ్ళ మైండ్ సెట్ మార్చలేక, తల బాదుకుంటూ కూర్చోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

నిజదారసుతోదర పోషణార్ధమై.

 శ్రీనాథమహాకవికి బమ్మెర పోతరాజునకు బావమరదుల సంబంధము చెప్పబడుచున్నది. శ్రీనాథుడు కావ్యములను వ్రాసి రాజులకునిచ్చి ధనముగొనుటలో యిష్టుడు. పోతన మాత్రము ఇట్టి కార్యమును నీచమైనదిగా భావించువాడు. పోతన దారిద్య్ర బాధల ననుభవించినప్పటికిని కావ్యము రాజదత్తము కానిచ్చుట కిష్టపడని వాడు. శ్రీనాథుడీ దరిద్ర బాధలు జూచి పోతనకు కావ్యము రాసి ధనము సంపాదించుమని సలహాయిచ్చినాడు.


కం. “కమ్మని” గ్రంథంబొక్కటి


యిమ్ముగ నే నృపతికైన గృతి యిచ్చినఁ "గై 


కొమ్మని” యీయరె యర్ధం


బిమ్మహి దున్నంగనేల యిట్టి మహాత్ముల్?


దానికి పోతన జవాబిచ్చినాడు.


ఉ: బాల రసాల సాల నవపల్లవ కోమల కావ్య కన్యకన్


కూళలకిచ్చి యప్పడుపు కూడు భుజించుట కంటె సత్కవుల్


హాలికులైననేమి గహనాంతర సీమల కందమూలకౌ


ద్దాలికులైననేమి నిజదారసుతోదర పోషణార్ధమై.


శ్రీనాధుని సలహాకు జవాబుగా పోతన చెప్పినాడన్న ఈ చాటువు మంచన “కేయూర బాహు చరిత్ర”యoదున్నది.


పోతన్న పొలము దున్నుకొని బతికినాడని శ్రీనాథుని చాటువు వలనను, పోతన జవాబు (పై రెండు పద్యముల) వలనను తెలియుచున్నది. కావ్యము "బాల రసాలసాల నవపల్లవ కోమలయైన కన్య” వలె పోతనకు దోచినది. స్వంత కుమార్తెను దుర్మార్గులైన రాజులకిచ్చి వివాహముచేయుట కిచ్చగింపడు పోతన. రాజదూషణ మునుబట్టి సర్వజ్ఞ సింగ భూపాలునికి పోతనతో వైరము కథగా చెప్పబడుచున్నది.

💥💥💥💥💥💥💥💥

వివేకచూడామణి

  *వివేకచూడామణి*


 *శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*80. విషయఖ్యగ్రహో యేన సువిరక్త్యసినా హతః*

*స గచ్ఛతి భవాంభోధే పారం ప్రత్యూహవర్జితః*


*పదవిభజన :*

*విషయ + ఆఖ్య గ్రహః + యేన - సువిరక్త్యసినా - హతః - స - గచ్ఛతి - భవ + అంబోధేః - పారం - ప్రత్యూహవర్జితః*


*భావము :*

*పరిపూర్ణ వైరాగ్యమనే ఖడ్గంతో విషయ వాసనలనే మకరాన్ని ఎవరైతే నరికివేయగలరో, వారే సంసారసాగరాన్ని దాటగలరు.*


*వివరణ :*

*విషయమనే మొసలి, ఏ పురుషునిచే దృఢతరమైన వైరాగ్యమనే కత్తిచే నశింపజేయబడుతుందో, ఆ పురుషుడు సంసార సాగరాన్ని దాటటంలో విఘ్నములు లేనివాడై, జనన మరణాది కల్లోలములతో వ్యాకులమైన సంసార సముద్రం యొక్క అంతమును - అంటే విష్ణువు యొక్క పరమపదమును పొందుతాడు. ముక్తుడవుతాడు.*

*ఇంకా, అటువంటి పురుషుని గురించి 'కఠోపనిషత్తు' ఏమి చెప్పిందంటే :*

*యస్త్వవిజ్ఞానవానవతి అమనస్కః సదా(అ )శుచిః*

*న స తత్పదమాప్నోతి సంసారం చాధిగచ్ఛతి*

*యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదాశుచిః*

*స తు పదమాప్నోతి యస్మాద్భూయో న జాయతే*


*ఎవడు విజ్ఞానము లేనివాడై, మనోనిగ్రహము లేనివాడై, సర్వదా అశుచియై ఉంటాడో, అతడు ఆస్థానాన్ని పొందడు. సంసారాన్ని పొందుతాడు. ఎవడు విజ్ఞానవంతుడై, నిగృహీతమనస్కుడై, సర్వదా శుచియై ఉంటాడో, అతడు దేనిని చేరిన పదప మరల జన్మ పొందడో, అటువంటి పదాన్ని పొందుతాడు.*

🙏🙏🙏

పాదారవిందశతకము

 *శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*


 *పాదారవిందశతకము* 


 **14 వ శ్లోకము* 


 *పవిత్రీకుర్యు ర్నః పదతలభువః పాటలరుచః* 


 *పరాగాస్తే పాపప్రశమన ధురీణాః పరశివే !*

 

 *కణం లబ్ధుం యేషాం నిజశిరసి కామాక్షి ! వివశా* 

 *వలంతోహ్యాతన్వంత్యహమహమికాం మాధవముఖాః*

 

 

*భావము :*


*నీ చరణ పరాగాన్ని తలపై దాల్చుటకు విష్ణ్వాదులు తహతహలాడుతూ తొందరపాటుతో ప్రతిచోటా సంచరిస్తున్నారు. అమ్మా కామాక్షీదేవి ! పాపపరిహారంచేసే నీ పాదధూళులు మమ్ములను పావనం చేయాలి సుమా !*


*అమ్మ పాదదూళి మాహాత్మ్యం వివరిస్తూ జగద్గురువులు చెప్పిన 'సౌందర్యలహరి'లో చెప్పిన 3 వ శ్లోకం, భావం :*

 

*అవిద్యానామంత-స్తిమిర-మిహిర ద్వీపనగరీ*

*జడానాం చైతన్య-స్తబక మకరంద శ్రుతిఝరీ*

*దరిద్రాణాం - చింతామణిగుణనికా జన్మజలధౌ*

*నిమగ్నానాం దంష్ట్రా - మురరిపు వరాహస్య భవతి*

 *అమ్మా ! నీ దివ్యచరణారవిందముల పాదధూళి, అజ్ఞానమనే చీకటిలో ఉన్నవానికి కాంతులతో నిండిన సూర్యోదయ పట్టణమువంటిది.(అనగా నీ పాదసేవ వలన అజ్ఞానము తొలగి జ్ఞానం కలుగుతుంది). అదేవిధంగా, తెలివిలేని మందబుద్దులైన కదలలే‌ని బద్దకస్తుల పాలిట వారికి చైతన్యము కలిగించే కల్పవృక్ష పుష్పగుచ్ఛమునుండి*

 *జాలువారే మకరందము వంటిది.( నీపాదభక్తి జడులను చైతన్యవంతులను చేస్తుంది). ఇక కోరికలు తీరని దరిద్రులపాలిట సకల కోరికలనూ తీర్చే చింతామణి వంటిది.( నీ పాదపూజ దరిద్రాన్ని పోగొట్టి కోరికలను తీరుస్తుంది). సంసార సాగరములో మునిగిపోవువారి పాలిట, వారిని ఉద్దరించే విష్ణు అవతారమై భూమిని ఉద్దరించిన యజ్ఞవరాహము యొక్క కోరలవంటిది.( నీ పాదస్మరణ భవసాగరమును దాటించి ముక్తిని ప్రసాదిస్తుంది).*

 

*ఆ తల్లి* 

*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏

వంటింటి చిట్కాలు part 2

   వంటింటి చిట్కాలు part 2

=================

పోపుల పెట్టె లో దాగున్న మరిన్ని ఆరోగ్య రహస్యాలు మరికొన్ని మనం తెలుసుకుందాం. వాస్తవానికి ఇవి అన్నీ మనకి తెలిసినవే అయినా మనం పాటించడం మానేసాము.


పేరిన నెయ్యి లో కాసింత బెల్లం వేసుకుని తింటే గొంతు గర గర తగ్గుతుంది. అదే విధంగా తమలపాకులు పరగడుపునే తింటే కఫం తగ్గుతుంది అని చెప్పేవారు. తమలపాకులు తడిపి నుదిటిపై పెట్టుకుంటే తల నొప్పి మటు మాయం అవుతుంది. ఈ మధ్య పెళ్ళిళ్ల ల్లో తములపాకుల బజ్జిలు వేయడం ఎక్కువ అయ్యింది.మంచిదే తమలపాకులు ఎక్కువ వాడటం. అయితే అతి సర్వత్రా వర్జినియేత్ మరువకండి...దేనికీ అతి పని చేయదు.


అన్నం అరుగుదలకు కూడా తమలపాకులు బాగా పనిచేస్తాయి. అందుకే పూర్వం భోజనం తరువాత తాంబూలం తప్పనిసరిగా వేసుకునే వారు.


ఐరన్ లోపం ఉంటే తమలపాకులు లో పాత బెల్లం వేసుకుని రెండు ఆకులు తింటే నీరసం తగ్గుతుందని చెప్పెవారు.

 అందుకే ప్రతి ఇంట్లో తమలపాకులు పాదు ఉండాలి. పెంచడం కూడా చాలా సులభం.


పిల్లలు పుట్టని దంపతులకి మినప సున్ని ఉండలు పెట్టే వారు. పాలు లొ యాలకులు వేసి ఇస్తే మంచి ఫలితం ఉంటుంది.


పిలల్లు నీరసం గా, బలం లేకుండా ఉంటే ప్రతీ రోజు పప్పు అన్నం లో ఆవు నెయ్యి ఎక్కువ గా వేసి పెట్టే వారు.ఆవు నెయ్యి ఎక్కువ గా పిల్లలకు పెట్టడం వల్ల మేధస్సు పెరుగుతుంది.


 బలం తక్కువగా ఉండి ఎప్పుడు నీరసం గా, చె లాకీ తనం లేకుండా ఉండే వారికి వారం లో రెండు మూడు రోజులు గారెలు నేతిలో లో వేయించి పెట్టిన మంచి బలం కలుగు తుందని చెప్పేవారు. మరి ఎక్కువ గా తింటే కడుపు ఉబ్బరం తగ్గడానికి అల్లం రసం లేదా అల్లం పచ్చడి వాడమని చెప్పేవారు.


ఇంతకు ముందు తరం బలం గా ఆరోగ్యం గా ఉండటానికి కారణం వారు తీసుకునే బలమైన ఆహారంమే.


కాళ్ళు నొప్పులు గా ఉంటే కొబ్బరి నూనె తో కాళ్ళు మర్ధనా చేసుకుని వేడినీటిలో నిమ్మకాయ చెక్క పిండి ఒక పదినిముషాలు కాళ్ళు మునిగే వరకూ వేడి నీటిలో ఉంచితే కాళ్ళు నొప్పులు తగ్గుతాయని చెబితే అర్చర్యం కలుగుతుంది....నిమ్మకాయ బదులు ఉప్పు వేసుకుంటే కాళ్ళు పగుళ్ళు తాగుతాయి.


ఇలా ఇలా అనేక చిట్కాలు... నేను స్వయంగా చూసాను...వీలైతే తప్పకుండ ఆచరించండి...

వంటింటి చిట్కాలు మరువ కండి. ఇది పెద్దలు మనకి ఇచ్చిన ఆస్తి.....


సురేష్ వంకాయలపాటి

పోపుల పెట్టె

  పోపుల పెట్టె

=========

రచన:- వంకాయలపాటి వెంకట సూర్య నారాయణ ( సురేష్) పిఠాపురం

==================


అమ్మ ప్రేమతో నిండిన వంటింటి మూలన

నవ్వుతూ నిల్చున్న పోపుల పెట్టె.

చిన్నదే కానీ లోపల

రుచుల ప్రపంచం నింపుకొని,

విస్మయం కలిగించే

మందుల గుట్ట....


జీలకర్ర సువాసనల జ్ఞాపకాలు,

ఆవాల ఆత్మీయతతో,

మెంతుల గుబాళింపుల తిరుగుమోతతో

పదిలంగా దాచుకున్న

పసిడి మూటలా మెరిసే పెట్టె.....


పసిడి లాంటి పసుపు,

ఆత్మీయంగా కలిసే లవణం,

ధనియాల ధ్వనిలో

మనసుకు మధుర సంగీతం వినిపించే

ఆ చిన్న లోకం.....


పొయ్యి పొగలోనూ

అమ్మ ప్రేమ పరిమళం;

పోపుల పెట్టె తెరిచినప్పుడల్లా

ఇంటంతా పండుగ వాతావర నం.


చిన్న పెట్టె అయినా

చెప్పే కథలెన్నో;

చిన్నదే అయినా

తగ్గించే రోగాలెన్నో....

13, జూన్ 2026, శనివారం

*మన్రో గంగాళాలు

 🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀


              *మన్రో గంగాళాలు*

                 ➖➖➖✍️



*"మన్రో గంగాళాలు" అంటే  ఏవో తెలుసా..??*


కడుపు నొప్పికి మంత్రం *శ్రీవారి పులిహోరే...*

```

తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు ఇలాంటి గంగాళంలో మాత్రమే ఎందుకు నివేదింప బడుతున్నాయి.?? 


ఈ గంగాళం వెనక ఉన్న కథ ఏమిటి..??


1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలు వాడేవారు. 


అప్పట్లో భక్తులకు హోటల్స్ లేవు కనుక.... తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. 


అక్కడక్కడా రామానుజ కూటముల ద్వారా కూడ అన్న సంతర్పణ జరిగినా ఆలయంలో పంచి పెట్టే ప్రసాదాలే ఆ నాటి భక్తులకు ప్రధాన ఆహారం.


1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ లో పని చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీ లో గవర్నర్ గా పని చేసిన అధికారి పేరు.. “THOMOS MUNRO” ..


దక్షిణ భారతదేశం మరియూ ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కింద ఉండేది.


ఈయన నిక్కచ్చిగా క్రైస్తవ పద్ధతులు పాటించే విదేశీయుడు.

మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవ భావం లేనివాడు.


ఉద్యోగ రీత్యా చాలా సార్లు తిరుమల వచ్చినా... ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోయేవాడు.


అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు (అవే వారికి భోజనాలు).


అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహారా, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు (అప్పటికి లడ్డు ప్రధాన ప్రసాదం కాదు). 


ఆ ప్రసాదాలను భక్త్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద  కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంలో తినడం చూసి థామస్ మన్రోకి ఒకరకమైన అసహ్యం వేసింది.


స్వతహాగా విదేశీయుడు కావున... అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యకరమైన పద్దతి కాదు అని, శుచి శుభ్రత లేకుండా అలా అందరూ కలిసి ఓకేదగ్గర నేరుగా ప్రసాదాలు చేతితో తినడం వల్ల లేనిపోని అంటు వ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి అని.... మన ఆలయ సంప్రదాయం, ప్రసాదాలు పట్ల ఒకింత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారం ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలు ఇచ్చాడు.


శ్రీవారి లీల ప్రభావంతో  ఏ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేశారో... అదే  తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకి వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా ఆతని ఆరోగ్యం క్షీణించి, పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టినాడు. 


అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారి మీద ఎనలేని భక్తి, శ్రద్ధ గురి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరక యాతన అనుభవించేవాడు. 


అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల  శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పుని తెలియజేసి, శ్రీవారి క్షేత్ర మహిమని వివరించారు. 


శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారి పులిహార నేరుగా తన చేతితో తిన్న వెంటనే కడుపునొప్పి మటుమాయం అయింది..


తప్పు తెలుసుకున్న థామస్ మన్రో... శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాలు సమర్పణ కోసం  చాలా గంగాళాలు సమర్పించాడు మరియూ తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్ళీ మునుపటి లాగా ప్రసాదాలు పంచి పెట్టేలా వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గరే తినేలా తిరిగి ఉత్తర్వులు ఇచ్చాడు.


ఎంత పశ్చాత్తాప పడినా, ఎన్ని గంగాళాలు దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు.


మనోవ్యధతో మంచం పట్టి “నేరుగా 

నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామీ” అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827 లో ప్రాణం వదిలాడు. 


అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుండి ఈనాటి వరకు తన అన్ని రకాల ప్రసాదాలను కేవలం ఆ గంగాళాలులోనే స్వీకరిస్తున్నాడు... 


ఈ గంగాళలను ఇప్పటికీ ```

*"మన్రో గంగాళాలు"*  ```అనే పేరుతో  దేవస్థాన పూజా కైంకర్యాలలో చలామణీలో ఉన్నాయి.


శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకోకపోయినా ఆయన పేరు మీదే ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరకీర్తి  ప్రసాదించాడు. 


తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గూర్చే కాదు ఆ పరమాత్మునికి నివేదించే ప్రసాదాలలోనే కాక ఆ ప్రసాదాల పాత్రల వెనక కూడా ఎంతో విలువైన ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారు లీలలు, చరిత్ర  కలదు. 


భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున, ప్రతి గడపకి, ప్రతి చెట్టుకి ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనక ఎంతో తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది...```


*శ్రీనివాసుడి గురించి తెలుసుకోండి ... నలుగురికి తెలియజెప్పండి...*✍️

     *ఓం నమో వెంకటేశాయ!*

          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

పెళ్లిళ్ల వరుస

 పూర్వం పెళ్లిళ్ల వరుస ఇలా ఉండేది


"వర విక్రయం" నాటకంలో లింగరాజు గారు కట్నం తీసుకుని రశీదు రాసిచ్చిన వైనం చూడండి ....


"బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి సింగరాజు లింగరాజు వ్రాసియిచ్చిన రశీదు. మీకొమార్తె చి॥ సౌ॥ కాళిందిని, నాకొమారుడు చి॥ బసవరాజునకు చేసికొనుటకు, అందులకై మీరు మాకు కట్నం క్రింద ఐదువేలు యైదువందల రూపాయల రొక్కము, రవ్వల ఉంగరము, వెండిచెంబులు, వెండికంచము, వెండిపావుకోళ్ళు, పట్టుతాబితాలు, వియ్యపురాలు వియ్యంకుల లాంఛనములు యధావిధిగా ఇచ్చుటకున్నూ, ప్రతిపూఁటఁ పెండ్లివారిని బ్యాండుతో పిలుచుటకున్నూ, రాకపోకలకు బండ్లు, రాత్రులు దివిటీలు నేర్పాటు చేయుటకున్నూ, రెండుసారులు పిండివంటలతో భోజనములు, మూడుసారులు కాఫీ, సోడా, ఉప్మా, యిడ్డెన, దోసె, రవ్వలడ్డు, కాజా, మైసూరు .... మైసూరు పాకాలతో ఫలహారములు చొప్పున మా యిష్టానుసారము ఐదు దినములు మమ్ము గౌరవించుటకున్నూ, అంపకాలనాడు మాకు పట్టుబట్టలు, మాతో వచ్చువారికి ఉప్పాడ బట్టలు ఇచ్చుటకున్నూ నిర్ణయించుకొని బజానా క్రింద పదిరూపాయలు ఇచ్చినారు గాన ముట్టినవి .... అయ్యా .... ఇట్లు .... సింగరాజు లింగరాజు వ్రాలు" .... చాలునా?


పేర:- చాలు బాబూ! చాలు! మచ్చుకోసం దాచిపెట్టుకోవలసిన మతలబు!


పెండ్లి సమయంలో వియ్యపురాలికి చేయవలసిన మర్యాదల గురించి కాళ్ళకూరి నారాయణ రావు గారి చమత్కారం చూద్దాం.


"వియ్యపురాలు గారికి తెలివిరాగానే కళ్ళు తుడవాలి; కాళ్ళు మడవాలి; కోక సర్దాలి; కిందకు దింపాలి; పెరట్లోకి పంపాలి; నీళ్ళచెంబందివ్వాలి; రాగానే కాళ్ళు కడగాలి; పండ్లు తోమాలి; మొహం తొలవాలి; నీళ్ళు పోయాలి; వళ్ళు తుడవాలి; తల దువ్వాలి; కొత్తచీర కట్టాలి; కుర్చీ వెయ్యాలి; కూర్చోబెట్టాలి; పారాణి రాయాలి; గంధం పుయ్యాలి; అత్తర్లివ్వాలి; పన్నీరు చల్లాలి; మొహాన్ని మొహరీలద్దాలి! కళ్ళకు కాసులద్దాలి! వంటిని వరహాలద్దాలి; వెండి పలుపు వెనకను కట్టాలి; బంగారుపలుపు పక్కను చుట్టాలి; దిష్టి తియ్యాలి; హార తివ్వాలి; అధ్వాన్న మివ్వాలి; నా పిండాకూడివ్వాలి ....యిల్లాంటివింకా నా తలవెంట్రుక లన్ని వున్నాయి. ఆలస్యమైతే అలక కట్నం చెల్లించ వలసి వస్తుంది".


మొగ పెళ్లి వారికి చేయ వలసిన మర్యాదల్లో లోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి ....


"నిన్నటి వుప్మాలో నిమ్మపళ్లరసమే లేదట. ఇడ్డెన్లలో అల్లం ముక్కలు లేవట. కాఫీలో పంచదార లేదట. ఈ పూటయినా కాస్త యింపుగా వుండకపోతే పట్టుకు వచ్చిన వాళ్ళ మొహాన్ని పెట్టికొట్టాలని పదిమందీ ఆలోచిస్తూన్నారు. ఖారాఖిల్లీలు కాస్త యెక్కువగా పంపండి. చుట్టలూ, సిగరెట్లూ, బీడీలూ కూడా కాస్త శుభ్రమైనవి చూడండి. నిన్న పంపిన చీట్లపేకలు నిన్ననే చిరిగిపోయాయి. ఈపూటింకో నాలు గెక్కువ పంపండి. మదరాసు నశ్యం మాట మరిచిపోకండి. శలవు. మఱి ఆలస్యమైతే మాటదక్కదు".


పెళ్ళైన తరువాత పదహారు రోజుల పండుగ అంటే ఏమిటో చూద్దాం. 


"తొలినాడు హడావడి, మలినాడు ఆయాసం; మూడు మంగళాష్టకాలు; నాలుగు సిగపట్ల గోత్రాలు; అయిదు అప్పగింతలు; ఆరు అంపకాలు; ఏడు వంట బ్రాహ్మల తగువు; ఎనిమిది ఋణదాత నోటీసు; తొమ్మిది జవాబు; పది దావా; పదకొండు స్టేటుమెంటు; పన్నెండు విచారణ; పదమూడు డిక్రీ; పద్ధానుగు టమటమా; పదిహేను వేలం; పదహారు చిప్ప. 

ఈ రోజుల్లో యిదే పదహారు రోజుల పండగ.


ఇది చదివితే అప్పటి పెళ్లిళ్ల సరళి గుర్తొస్తుంది కదా!

Have a great week end 🙏

పంచాంగం 13.06.2026 Saturday,

 ఈ రోజు పంచాంగం 13.06.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధికజ్యేష్ఠ మాస కృష్ణ పక్ష త్రయోదశి తిథి స్థిర వాసర కృత్తిక నక్షత్రం సుకర్మ యోగః గరజి తదుపరి వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: త్రయోదశి.


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము


అర్జున ఉవాచ ।

సంన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి ।

యఛ్చ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితమ్ ।। 1 ।।



ప్రతిపదార్థ:

 

.అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సన్న్యాసం — సన్యాసము; కర్మణాం — కర్మల యొక్క; కృష్ణ — శ్రీ కృష్ణ; పునః — మరల; యోగం — కర్మ యోగం గురించి; చ — మరియు; శంససి — ప్రశంసించావు; యత్ — ఏదైతే; శ్రేయః — ఎక్కువ శేయస్కరమో; ఏతయో — ఈ రెంటిలో; ఏకం — ఒకటి; తత్ — అది; మే — నాకు; బ్రూహి — దయచేసి చెప్పుము; సు-నిశ్చితమ్ — నిర్ణయాత్మకముగా.

 


 తాత్పర్యము : 



అర్జునుడు అన్నాడు : ఓ శ్రీ కృష్ణా, నీవు కర్మ సన్యాసమును (పనులను త్యజించుట) ప్రశంసించావు మరియు కర్మ యోగమును (భక్తితో పనిచేయుట) కూడా చేయమన్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో ఖచ్చితముగా తేల్చి చెప్పుము?



వివరణ:


అర్జునుడు అడిగిన పదహారు ప్రశ్నలలో ఇది ఐదవది. శ్రీ కృష్ణుడు పనులను త్యజించటమును మరియు భక్తితో పని చేయటమును రెంటినీ ప్రశంసించాడు. పైకి విరుద్ధంగా అనిపించే ఈ రెండు ఉపదేశములతో అర్జునుడు తికమక పడి, ఈ రెంటిలో ఏది తనకు ఎక్కువ శ్రేయస్సుని కలుగచేసేదో తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఈ ప్రశ్న ఏ సందర్భంలో వచ్చిందో ఒకసారి చూద్దాం.


మొదటి అధ్యాయం, అర్జునుడి శోకం యొక్క తీరు వివరించి, శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపదేశించటానికి ఒక చక్కటి వాతావరణం కలిగించింది. రెండవ అధ్యాయంలో, శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఆత్మ జ్ఞానాన్ని తెలియపరిచాడు; ఆత్మ నిత్యమైనది, నాశము లేనిది కాబట్టి, ఎవరూ నిజానికి యుద్ధంలో చనిపోరు, కాబట్టి శోకించటం తెలివితక్కువ పని అని చెప్పాడు. తదుపరి, అర్జునుడికి ఒక వీరుడిగా తన కర్మ (సామాజిక విధి), యుద్ధంలో ధర్మ పక్షం వైపు పోరాడటమే అని చెప్పాడు. కానీ, కర్మ అనేది వ్యక్తులను కర్మ-ఫల బంధములకు కట్టివేస్తుంది కాబట్టి అర్జునుడిని తన కర్మ ఫలములను భగవత్ అర్పితము చేయమన్నాడు, శ్రీ కృష్ణుడు. అప్పుడు అతని పనులు కర్మ యోగమవుతాయి, అంటే ‘పనుల ద్వారా భగవత్ సంయోగము.’


మూడవ అధ్యాయంలో, కర్తవ్య నిర్వహణ చేయటం అవశ్యకమైనది ఎందుకంటే అది మన అంతఃకరణ శుద్ధికి చాలా దోహద పడుతుంది అని ఆ పరమాత్మ చెప్పాడు. కానీ, అంతఃకరణ శుద్ధి సాధించిన వ్యక్తి ఎలాంటి సామాజిక విధులను నిర్వర్తించే అవసరం లేదు అని కూడా చెప్పాడు (శ్లోకం 3.17).


నాలుగవ అధ్యాయంలో భగవంతుడు చాల రకాల యజ్ఞముల (భగవత్ ప్రీతి కొరకు చేసే కార్యములు) గురించి విశదీకరించాడు. యాంత్రికమైన కర్మకాండలతో కూడిన యజ్ఞము కంటే జ్ఞానముతో కూడిన యజ్ఞము శ్రేయస్కరమైనదని చెప్పాడు. అన్ని యజ్ఞములు కూడా చివరకి మనకు భగవంతునితో ఉన్న సంబంధము యొక్క జ్ఞానాన్ని తెలియజేయుటకే దారి తీస్తాయి అని చెప్పాడు. చివరికి 4.41వ శ్లోకంలో, కర్మ సన్యాస విషయాన్ని పరిచయం చేసాడు; దీనిలో కర్మకాండలు మరియు సామాజిక విధులు త్యజించి వ్యక్తి పూర్తిగా శరీరము, మనస్సు, మరియు ఆత్మతో భక్తి పూరిత సేవలోనే నిమగ్నమౌతాడు.


ఈ ఉపదేశాలన్నీ అర్జునుడిని అయోమయానికి గురి చేసాయి. అతను కర్మ సన్యాసము మరియు కర్మ యోగము రెండూ విరుద్ధ స్వభావాలతో కూడినవి అనుకున్నాడు, మరియు ఈ రెంటినీ ఒకేసారి చేయలేమనుకున్నాడు. కాబట్టి, తన సందేహాన్ని శ్రీ కృష్ణుని దగ్గర వ్యక్తం చేస్తున్నాడు.

పువ్వులలోని ఆరొగ్య రహస్యాలు -

 పువ్వులలోని ఆరొగ్య రహస్యాలు -


మందార పువ్వులు -


ఈ మందార పువ్వులు స్త్రీలకు అత్యంత ప్రీతికరం. ఆయుర్వేదం ప్రకారం ఇవి చాలా విలువయిన పుష్పములు. ఈ పువ్వుల రసమును ఆలివ్ నూనే లొ గాని , కొబ్బరి నూనే లొ గాని కలిపి పొయ్యి మీద పెట్టి రసం ఇగిరి పోయి నూనే మాత్రం మిగిలే వరకు కాచాలి. ఆ తరువాత ఆ నూనెను వడపోసుకొని రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోయి , బాగా గుబురుగా నల్లగా నిగనిగ లాడుతూ వెంట్రుకలు పొడవుగా పెరుగుతాయి. తలలో వచ్చే చుండ్రు, దురద, కురుపులు తగ్గిపోయి , వెంట్రుకలు పుర్తిగా ఉడిపోయిన చోట కుడా మళ్ళి మొలుస్తాయి. మందార పువ్వుల ను ఎండబెట్టి చూర్ణం చేసి లోపలి కి వాడితే మూత్ర రోగాలు , స్త్రీల ఋతు రక్త దోషాలు మేహా రోగాలు హరించి పొతాయి.


మల్లె పువ్వులు -


వీటిని తలలో ధరించడం వలన నేత్ర వ్యాదులు, శ్లేష్మ వ్యాధులు హరించి పోతాయి . వెంట్రుకలు మృదువు గా , దట్టం గా పెరుగుతాయి. స్త్రీల స్థనాల పైన లేచే గడ్డలకు ( పాలు గడ్డ గా తయారు అయ్యి స్తనాలలో విపరీత మయిన బాధ ఉంటుంది.) ఈ పువ్వులను గడ్డల మీద వేసి కడతారు.


గులాబీ పువ్వులు -


ఇది సువాసన కలిగిన పుష్పము. శరీరమునకు మంచి బలం, చల్లదనం ఇస్తుంది. శరీరం లొని వాత పిత్త , కఫ అనే త్రిదోషములను హరించే శక్తి ఈ పువ్వులకు ఉంది. ఈ పువ్వులను ఎండబెట్టి నెయ్యిలో దోరగా వేయించి అన్నం తినేప్పుడు మొదటి ముద్దలో తగినంత కలుపుకుని తింటూ ఉంటే మలబద్ధక వ్యాధి హరించి పొతుంది .ఇంకా మేహా రోగాలని నశింప చేస్తుంది .నోటి పూత తగ్గిపొతుంది.

ఈ పువ్వుల సారం తోటి "అత్తరు" అనే పేరు గల సుగంద ద్రవ్యం తయారు చెస్తారు. అలాగే ఈ పువ్వులతో షర్బత్ గూడా తయారు చెస్తారు.ఇది ఎంతో రుచిగా ఉండి మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.


పల్లేరు పువ్వులు -


పల్లేరు పువ్వులలో మధుర రసం, చలువ స్వభావం ఉన్నాయి . జట రాగ్నిని వృద్ధి చేస్తుంది . బలం కలిగిస్తుంది. ముత్రా శయం ను శుద్ధి చేస్తూంది . లొపలికి వాడిన వెంటనే వీర్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. వాత రోగాల్ని , మూత్రం లొని రాళ్ళను హరింప జేస్తుంది. గుండె జబ్బులను శమింప జేస్తుంది.

పల్లేరు పువ్వులను ఒక కప్పు ఆవు పాలతో ఉడకబెట్టి తగినంత చెక్కర కలుపుకుని తాగుతూ ఉంటే మూత్రం లొని చురుకు, మంట, వేడి వెంటనే తగ్గిపోతాయి.

పల్లేరు పువ్వులు , కాయలు, నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణం గా తయారు చేసుకోని దాన్ని రోజుకీ రెండు పూటలా 5 గ్రా మోతాదు గా ఒక గ్లాస్ గొర్రె పాలు , ఒక స్పూన్ తేనే కలిపి వాడుతూ ఉంటే వారం రొజుల్లొ రాళ్ళు కరిగి పొతాయి.



మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.



 *🌺 అష్టాంగ ప్రణామము 🌺*


*అష్టాంగ ప్రణామము అనగా భగవంతునికి సంపూర్ణ శరణాగతితో శరీరంలోని ఎనిమిది అంగాలను భూమికి తాకిస్తూ చేసే నమస్కారం. "అష్ట" అంటే ఎనిమిది, "అంగ" అంటే అవయవాలు.*


*శాస్త్రోక్తంగా:*


*"ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా ।*

*పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే ॥"*


*అంటే హృదయం, శిరస్సు, దృష్టి, మనస్సు, వాక్కు, పాదాలు, చేతులు, మోకాళ్ళతో చేసే నమస్కారాన్ని అష్టాంగ ప్రణామం అంటారు.*


*1️⃣ కరములు (చేతులు)*

*చేతులను జోడించి భూమిపై ఉంచడం.*

*"నా కర్మలన్నీ భగవంతునికి సమర్పితం" అనే భావన.*


*2️⃣ పాదములు*

*రెండు పాదాలు భూమిని తాకుతూ ఉండాలి.*

*జీవిత ప్రయాణం ధర్మమార్గంలో సాగాలని సంకల్పం.*


*3️⃣ తొమ్ము (ఛాతి / వక్షస్థలం)*

*వక్షస్థలాన్ని భూమికి ఆనించడం.*

*హృదయంలోని అహంకారం, మమకారాన్ని భగవంతుని పాదాల వద్ద సమర్పించడం.*


*4️⃣ ఉదరము*

*ఉదర భాగం భూమిని* *తాకుతుంది.*

*భౌతిక కోరికలు, భోగాసక్తులను దైవానికి అర్పించడం.*


*5️⃣ లలాటము*

*నుదిటిని భూమికి ఆనించడం.*

*బుద్ధి, జ్ఞానం, ఆలోచనలన్నీ దైవానుగ్రహంతో నడవాలని ప్రార్థన.*


*6️⃣ నేత్రములు*

*దృష్టిని భగవంతుని* *పాదాలపై కేంద్రీకరించడం.*

*ప్రపంచ విషయాల కంటే దైవదర్శనమే శ్రేష్ఠమని సూచిస్తుంది.*


*7️⃣ భుజములు*

*భుజాలను భూమికి ఆనించడం.*

*"నా శక్తి, బాధ్యతలన్నీ దైవసంకల్పానుసారమే" అనే శరణాగతి.*


*8️⃣ కటి (నడుము భాగం)*

*శరీరమంతా వినయంతో వంగి ఉండడం.*

*అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి భగవంతునికి లొంగిపోవడం.*


*అష్టాంగ ప్రణామం వల్ల కలిగే ఫలితాలు*

*✅ వినయం పెరుగుతుంది*

*✅ భక్తి గాఢమవుతుంది*

*✅ మనస్సు* ప్రశాంతమవుతుంది*

*✅ అహంకారం తగ్గుతుంది*

*✅ దైవసాన్నిధ్యం* అనుభూతి కలుగుతుంది*

*✅ పుణ్యఫలం లభిస్తుంది*


*అష్టాంగ ప్రణామము అనేది శరీరంతో చేసే నమస్కారం మాత్రమే కాదు; మనస్సు, బుద్ధి, హృదయం, కర్మలు అన్నింటినీ భగవంతుని పాదాలకు సమర్పించే సంపూర్ణ శరణాగతి యోగం.*


*"నమస్కారమే భక్తికి ద్వారం, శరణాగతియే మోక్షానికి మార్గం."*


*┈┉┅━❀꧁హరేకృష్ణ꧂❀━┅┉┈*

          *ఆధ్యాత్మిక అన్వేషకులు*

🍁📚🍁 🙏🕉️🙏 🍁📚🍁

చింత చిగురు ఆరోగ్యం

 చింత చిగురు

దాని వల్ల కలిగే ప్రయోజనాలు ...


చింత చచ్చినా పులుపు చావలేదు… అన్న సామెతను మీరు వినే ఉంటారు.


చింత చిగురుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. 


1. చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకం సమస్య తొలగిపోతుంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు బాగానే పనిచేస్తుంది.


2. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట రాల్ను తగ్గించి అదే క్రమంలో మంచి కొలెస్ట రాల్ను పెంచుతుంది.


3. వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి.


4. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


5. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది.


6. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


7. కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.


8. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది.


9. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంట్లో ఉన్నాయి.


10. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.


11. తరచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి.


12. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


13. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.


14. ఆల్కహాల్ను ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది.


15. చింత చిగురును పేస్ట్లా చేసి దాన్ని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.


16. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది.


17. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.

ఇంటి పని కాదు

 *"ఇంటి పని కాదు, అది ఇంటి యోగం" – ఒక తరాల కథ*


తెల్లవారుజామున 4 గంటలు. 65 ఏళ్ల మహిళ నిద్దుర లేచింది.


*మొదటి ఆసనం - మాలాసనం*: వంగి ముగ్గు వేస్తుంది. 21 చుక్కలు. ఒక్కో గీతకు వెన్నెముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి. డాక్టర్ చెప్పిన "Squat Exercise" బామ్మకు 60 ఏళ్లుగా తెలుసు. "ముగ్గు వేస్తే మోకాళ్ల నొప్పులు రావు" అనేది.


*రెండో ఆసనం - ఉత్కటాసనం*: బట్టలు ఉతకడం. రెండు కాళ్లూ కొంచెం వంచి, నడుము నిటారుగా పెట్టి, చేతులతో బట్టను రాయికి బాదడం. 20 నిమిషాలు. భుజాలు, చేతులు, నడుము అన్నీ ఒకేసారి వ్యాయామం. జిమ్‌లో "Chair Pose + Arm Workout" కి అవ్వ పెట్టిన పేరు - 'చీర ఉతకడం'.


*మూడో ఆసనం - త్రికోణాసనం*: తడి బట్టలు పిండి, దండెం మీద ఆరేయడం. కాలు ఒకవైపు, చేయి పైకి, నడుము వంచడం. శరీరం పక్కకి సాగుతుంది. లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి.


*నాలుగో ఆసనం - అధోముఖ శ్వానాసనం*: వంగి ఇల్లు కసువు ఊడవడం. రక్తప్రసరణ తలకు ఎక్కుతుంది. మెదడు చురుకవుతుంది.

*ఐదో ఆసనం - మార్జరాసనం*: కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం. మణికట్టు, వేళ్లు తిరుగుతాయి. ఆర్థరైటిస్ రాదు. బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమిసంహారిణి.


మనవడు రవి అడిగాడు: బామ్మ, నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావ్? ఒకరిని పెట్టుకోవచ్చుగా?"


బామ్మ నవ్వింది: "పనిమనిషా? రా, నేను కాదురా. ఇది నా *ఇంటి యోగం*. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది."


లచ్చమ్మ కోడలు దీప. సాఫ్ట్‌వేర్. ఉదయం లేవగానే Washing Machine ఆన్, Dishwasher ఆన్, Robot Vacuum ఆన్.


8 గంటలు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం. మెడ నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్. సాయంత్రం జిమ్‌కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. ట్రైనర్ చెప్తాడు: "మేడం, 20 స్క్వాట్స్ చేయండి, 15 నిమిషాలు Arm Rotation చేయండి, Bend అయ్యి Sweep చేయండి."


దీపకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన: "అరే, ఇవన్నీ మా అత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా! మేము దాన్ని 'పని' అని హేళన చేశాం. వాళ్ళు దాన్ని 'ఆరోగ్యం' అని బతికారు."


ఆ రోజు నుంచి దీప మారింది. మెషిన్ ఉన్నా, ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. "అమ్మా, ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం" అని పిల్లలకు చెప్పింది.


### *3. అసలు తప్పు ఎక్కడ జరిగింది?*


మనం రెండు తప్పులు చేశాం:


*తప్పు 1: పేరు మార్చేశాం.*


వంగి ముగ్గు వేస్తే 'మాలాసనం'. ఇంట్లో వేస్తే 'పనిమనిషి పని'.


బయట జిమ్‌లో చేస్తే 'Fitness'. ఇంట్లో చేస్తే 'Chores'.


పేరు మారగానే గౌరవం మారిపోయింది.


*తప్పు 2: ఉద్దేశం మర్చిపోయాం.*


అవ్వ ముగ్గు వేసింది 'ఇల్లు అందంగా ఉండాలి' అని కాదు.


*"నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి, మంచి మూడ్‌తో రోజు మొదలుపెట్టాలి"* అనే ప్రేమతో.


అన్నం వండింది 'ఆకలి తీర్చడానికి' కాదు.


*"నా చేత్తో తింటే నా బిడ్డకు నా ప్రేమ, నా శక్తి అందాలి"* అనే తపనతో.


ఇల్లు ఊడ్చింది 'దుమ్ము పోతుంది' అని కాదు.


*"నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు"* అనే బాధ్యతతో.


మనం 'పని'ని మాత్రమే చూశాం. దాని వెనకాల ఉన్న *'ప్రేమ'* ని చూడలేదు. అదే మన తప్పు.


### *4. యోగం అంటే ఏంటి?*


పతంజలి అష్టాంగ యోగంలో చెప్పాడు: "యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం."/


మన అవ్వలు అదే చేశారు:


ఇంటి పని యోగాసనం శరీరానికి లాభం మనసుకు లాభం


**ముగ్గు వేయడం** మాలాసనం, పద్మాసనం మోకాళ్లు, వెన్నెముక బలం ఏకాగ్రత, సృజనాత్మకత


**బట్టలు ఉతకడం** ఉత్కటాసనం, భుజంగాసనం చేతులు, భుజాలు, నడుము ఓర్పు, కష్టే ఫలి అనే తృప్తి


**కసువు ఊడవడం** అధోముఖ శ్వానాసనం రక్తప్రసరణ, జీర్ణశక్తి ఇల్లు శుభ్రం అయ్యిందనే ప్రశాంతత


**రుబ్బురోలు తిప్పడం** చక్రాసనం చేతులు, ఛాతి బలం సొంతంగా చేసుకున్నాం అనే ఆత్మవిశ్వాసం


**గిన్నెలు తోమడం** వజ్రాసనం అరిగే శక్తి, మణికట్టు కుటుంబం కోసం అనే సేవాభావం


వీళ్ళకి 'Yoga Mat' అవసరం లేదు. *నేలే యోగా మ్యాట్. ఇల్లే యోగా స్టూడియో. కుటుంబమే యోగా గురువు.*


### *చివరి మాట: నీ తప్పు కాదు, మనందరి తప్పు*


"ఇది పనిమనిషి పని" అని మనం అన్నప్పుడు, మనం ఒక తల్లి ప్రేమను అవమానించాం.


"Time Waste" అన్నప్పుడు, 5000 ఏళ్ల సైన్స్‌ను చెత్తబుట్టలో వేశాం.


*గుర్తుంచుకో:*


ఇంటి పని అనేది 'పని' కాదు. అది *'ప్రేమను పంచే పద్ధతి'*.


వంట చేయడం అంటే *'రుచిని కాదు, ఆయుష్షుని వడ్డించడం'*.


ఇల్లు శుభ్రం చేయడం అంటే *'చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం'*.


ఇకనుంచి ఎవరైనా "అమ్మా, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావ్?" అని అడిగితే ఇలా చెప్పు:


*"నేను పనులు చేయడం లేదు నాన్నా. నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్లకి యోగం చేస్తున్నాను. ఇది నా పూజ."*


ఎందుకంటే *భారతీయ సంస్కృతిలో 'పని' వేరు, 'సేవ' వేరు.*


పని చేస్తే అలసట వస్తుంది. సేవ చేస్తే ఆనందం వస్తుంది.


మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్‌కి వెళ్లి కాదు, *ఇంటినే గుడిగా, పనినే యోగంగా* మార్చుకుని.


మరి రేపటి నుంచి నీ ఇంట్లో 'పని' ఉంటుందా? లేక 'యోగం' మొదలవుతుందా?

12, జూన్ 2026, శుక్రవారం

పంచాంగము

 


శనివారం*🍁 *🌹13, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

       🍁 *శనివారం*🍁

  *🌹13, జూన్, 2026🌹*

    *దృగ్గణిత పంచాంగం* 

              

       *ఈనాటి పర్వం*

  *🔱మాస శివరాత్రి🔱*


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి      : త్రయోదశి* సా 04.07 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం   :శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం   : కృత్తిక* రా 01.16 వరకు ఉపరి *రోహిణి*

*యోగం  : సుకర్మ* సా 05.28 వరకు ఉపరి *ధృతి*

*కరణం   : గరజి* ఉ 05.55 *వణజి* సా 04.07. ఉపరి *భద్ర* రా 02.15 వరకు ఆపైన *శకుని*

*సాధారణ శుభ సమయాలు:*

             *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  : *రా 11.09 - 12.34*

 అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.34*  

*వర్జ్యం         : మ 02.41 - 04.05*

*దుర్ముహూర్తం :ఉ 05.34- 07.19*

*రాహు కాలం  :ఉ 08.51 - 10.29*

గుళికకాళం      : *ఉ 05.34 - 07.13*

యమగండం   : *మ 01.46 - 03.24*

సూర్యరాశి : *వృషభం*               

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.42*  

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.34- 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :*10.49 - 01.26*

అపరాహ్న కాలం  :*మ 01.26- 04.03*

*ఆబ్ధికం తిధి    :త్రయోదశి / చతుర్ధశి*

సాయంకాలం    :*సా 04.03- 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41 - 08.51*

రాత్రి కాలం         :*రా 08.51 - 11.46*

నిశీధి కాలం        :*రా 11.46 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శాంతులు

 🔔 *సనాతనం* 🔔


*గ్రంథాలలో చెప్పబడిన శాంతులు*

"55వ పుట్టిన రోజు - భీమ శాంతి"


"60వ పుట్టిన రోజు - ఉగ్ర రథ శాంతి"


"61వ పుట్టిన రోజు - షష్టి పూర్తి"


"70వ పుట్టిన రోజు - భీమ రథ శాంతి"


"72వ పుట్టిన‌ రోజు - రథ శాంతి"


"78వ పుట్టిన రోజు - విజయశాంతి" (77 సంవత్సరాల 7 నెలల 7 రోజులు)


"80వ పుట్టిన రోజు - శతాభిషేకం" (80 సంవత్సరాల 8 నెలల 8 రోజులు)


"85వ పుట్టిన రోజు - మృత్యుంజయ" శాంతి 


"88 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - దేవ రథ" శాంతి 


"99 సంవత్సరాల 9 నెలల 9 రోజులు - దివ్య రథ" శాంతి 


"100వ పుట్టిన రోజు - పూర్ణాభిషేకం" 


"105 సంవత్సరాల 8 నెలల 8 రోజులు *మహా దివ్య రథ* శాంతి 


ఇది చదివిన, విన్న ప్రతి ఒక్కరూ "మహా దివ్య రథ" శాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను*


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

యమనియమములు

 💐💐💐💐💐💐

*యమనియమములు*

💐💐💐💐💐💐

*యమనియమములు* అంటే యోగశాస్త్రంలో చెప్పబడిన ఆచరణధర్మాలు. ఇవి పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగయోగంలో మొదటి రెండు అంగాలు.


*అష్టాంగయోగం:*

యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.


*యమములు* — సమాజంలో పాటించవలసిన నియమాలు


*పతంజలి యోగసూత్రం 2.30**లో ఐదు యమములు చెప్పబడ్డాయి:


> *“అహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః”*


అవి:


1. *అహింస* — మనసా, వాచా, కర్మణా ఎవరికీ హాని చేయకపోవడం.


2. *సత్యం* — నిజం మాట్లాడడం; కానీ హితంగా, ధర్మబద్ధంగా మాట్లాడడం.


3. *అస్తేయం* — ఇతరుల వస్తువు, హక్కు, పేరు, కీర్తి, సమయం దొంగిలించకపోవడం.


4. *బ్రహ్మచర్యం* — ఇంద్రియనిగ్రహం, శక్తిని ధర్మమార్గంలో నిలుపుకోవడం.


5. *అపరిగ్రహం* — అవసరానికి మించి సేకరించకపోవడం; లోభం తగ్గించడం.


*నియమములు* — వ్యక్తిగత ఆత్మశుద్ధి నియమాలు


*పతంజలి యోగసూత్రం 2.32**లో ఐదు నియమములు చెప్పబడ్డాయి:


> *“శౌచసంతోషతపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః”*


అవి:


1. *శౌచం* — బాహ్యశుద్ధి, అంతఃకరణశుద్ధి.


2. *సంతోషం* — లభించిన దానిలో ధర్మబద్ధమైన తృప్తి.


3. *తపస్సు* — శరీర, వాక్కు, మనస్సును నియంత్రించి శ్రేయోమార్గంలో నిలుపుకోవడం.


4. *స్వాధ్యాయం* — శాస్త్రపఠనం, మంత్రజపం, ఆత్మపరిశీలన.


5. *ఈశ్వరప్రణిధానం* — ప్రతి కర్మను భగవంతునికి అర్పించడం; దైవశరణాగతి.


*సరళంగా చెప్పాలంటే:*


*యమములు* —

> ఇతరులతో మన ప్రవర్తనను శుద్ధి చేస్తాయి.


*నియమములు*— 

> మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి.


*యమ నియమాలు* లేకుండా యోగం కేవలం శరీరవ్యాయామంగా మిగిలిపోతుంది. 


*యమ నియమాలు* ఉంటే జీవితం యోగమార్గంగా మారుతుంది.

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

చర్మరక్షణ కొరకు

 చర్మరక్షణ కొరకు , సౌందర్యం కొరకు మూలికా యోగములు -


• టంకణం ( borax ) , పసుపు సమానంగా కలిపి కొబ్బరినూనెలో కలిపి పైకి రాయుచున్న కాలిపగుళ్లు , పెదాల పగుళ్లు క్రమేణా నివారణ అగును.


• శ్రీ గంథం , అగరు , వట్టివేళ్లు సమానంగా తీసుకుని మిశ్రమం చేసి ఆ చూర్ణమును పాలు లేదా పన్నీరు కలిపి రాయుచున్న ముఖవర్చస్సు పెరుగుతుంది .


• చందనం , కుంకుమపువ్వు మరియు కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేపనం చేయుచున్న ముఖవర్చస్సు పెరుగును .


• శనగలు , పెసలు , కచ్చురాలు , చందనం , కస్తూరి పసుపు మొదలైన ద్రవ్యాలను కలిపి సిద్దం చేసుకున్న " సున్నిపిండి " శరీరానికి పట్టించి మర్దన చేసుకుని ఒక గంట తరువాత స్నానం చేయుచున్న మనస్సుకి ఆహ్లాదం కలిగించడంతో పాటు చర్మరోగాలు రానివ్వకుండా కాపాడును.


• సీతాఫలం గింజలను వేపనూనెలో మర్దించి పైకి లేపనం చేయుచున్న తలలో చుండ్రు హరించును .


• ఒక కప్పు పాలల్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మరునాడు ఉదయం గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుగుకొనుచున్న క్రమేణా ముఖం మీద మచ్చలు తగ్గును.


• గసగసాలు పాలలో మర్దించి తలకు పట్టించి తలస్నానం ఆచరించిన చుండ్రు హరిస్తుంది.


• కాలిన గాయాల వలన ఏర్పడిన మచ్చలు పోవడానికి బంతి ఆకుల రసమును పైకి పట్టించుచుండిన మచ్చలు తగ్గును. స్వచ్చమైన తేనె రాసినను కాలిన గాయపు మచ్చలు తగ్గును.


• మామిడి ఆకుల ఈనెలు సేకరించి నీడలో ఆరబెట్టి మెత్తటి చూర్ణం సిద్దం చేసుకుని అందులో కొంచం బట్టలసోడా , కొద్దిగా సున్నం కలిపి పైన పట్టించుచుండిన పులిపిర్లు క్రమేణా నశించును .


• వేపబెరడు గాని వేపచిగుళ్ళు గాని తీసుకుని పసుపు కలిపి నీటితో నూరి శరీరముకు పట్టించి గంట తరువాత స్నానం చేయుచుండిన చెమటకాయలు క్రమేణా తగ్గిపోవును 


• కుప్పింట ఆకు రసం రెండు చెంచాలు కడుపులోకి ఇస్తే నులిపురుగులు చచ్చిపడిపొవును .


• నిమ్మరసం మరియు తులసి ఆకు రసం సమానంగా తీసుకుని బాగా కలిపి పైన రాయుచున్న గజ్జలలో దురదతో కూడి బిళ్లలుగా జనియించే రింగ్ వార్మ్ అనే చర్మవ్యాధి నశించును.


• జాజికాయ , చందనం మరియు మిరియాలు సమానంగా గ్రహించి గోరువెచ్చని నీళ్లతో మెత్తగా నూరి ఆ గంధమును పైకి రాయిచున్న మోటిమలు నివారణ అగును.


• ఒక కప్పు పెరుగు నందు అర టీస్పూను నిమ్మరసం , అర టీస్పూను పటిక చూర్ణం కలిపి తలకు మర్దన చేసుకుని స్నానం చేయుచున్న చుండ్రు , తలలో పేలు హరించును .


• కాలిన గాయాలకు కలబంద రసములో కొద్దిగా పసుపు కలిపి పైన పట్టిస్తే త్వరగా మానుతాయి. కాలిన గాయాలకు వెంటనే తేనెను రాస్తే తీవ్రమైన వేదన , మంట శాంతిస్తాయి.


• నిమ్మరసం , కొబ్బరిపాలు కలిపి బాగా గిలకొడితే తెల్లటి మీగడ వంటి పదార్థం తయారగును దీనికి ముఖానికి పట్టిస్తే ముఖవర్చస్సు పెంపొందును.పైన చెప్పినవాటిలో కొన్ని మూలికలు మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును. 


మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.



దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత -

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 

శంఖములలో రెండు రకాలు కలవు . అవి

• వామావర్తి శంఖము .

• దక్షిణావర్తి శంఖము .


       పైన చెప్పిన రెండురకాల శంఖాలలో దక్షిణావర్తి శంఖం సులభముగా లభ్యం అగును. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు . దీనిని పూజలలో మహాలక్ష్మితో సమానంగా భావించెదరు .తంత్రగ్రంధాల ప్రకారం వామావర్తి అంటే ఎడమ చేయి వైపు "కడుపు" కలది అనగా ఎడమచేయి వైపు తెరిచి ఉండేది అని దక్షిణావర్తి అంటే కుడివైపు తెరచి ఉండేదని అర్థం . ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ మీకు ఇస్తాను . శంఖం అనేది " ఘోoఘా " అనే సముద్రజాతికి చెందిన జంతువు . ఇది తెరుచుకొని ఉన్న భాగమే దీని కడుపు లేక నోరు . తలవలే ఉండి ఊదే భాగం దానియొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం లేక తోకభాగం . దీనికే గుండ్రని కన్నం చేసి నోటితో ఊదుతారు. దక్షిణవర్తి శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు . సముద్రము నందు జన్మించడం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడిన వస్తువు . సమస్త సిరులు , భోగభాగ్యాలు ప్రసాదించును . శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయము నందు తప్ప మిగిలిన సమయాలలో పూజా మందిరము నందు ఉంచి పూజించేవారు . దీనిని లక్ష్మీదేవి సహోదరిగా చెప్పుదురు . ఇది అరుదుగా లభ్యం అగును . రామేశ్వరం , కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశాలలో దొరకదు . ఈ దక్షిణావర్తి శంఖం మోగదు . మోగేది దొరుకుట అదృష్టము మరియు కష్టం . దోషయుక్తం అనగా పగిలిన మరియు విరిగిన శంఖం ఇంటి యందు ఉంచరాదు .  


 ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం.  ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .) అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి .


మంత్రం -


"ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః ".

 

ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది .

దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు -

• ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు .

• గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును .

• అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును .

• దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును .

• నెగిటివ్ శక్తి నశించును .పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను .

దోషములు గురించి వివరణ -

• పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు .

• శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు .

• మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు .

• శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు .శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది . 


                       సమాప్తం  



       మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


గమనిక -



నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

 ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 9885030034 మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

. కాళహస్తి వేంకటేశ్వరరావు .

. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

. 9885030034

నిర్మాల్యం ఏం చేయాలి?*

 *శాస్త్ర వచనం* 


*నిర్మాల్యం ఏం చేయాలి?*


*దేవతా పూజలలో ఉపయోగించిన పువ్వులను నిర్మల్యాన్ని ఏ రకంగా విసర్జించాలి తెలుసుకుందాము*


*శ్రీమద్దేవీభాగవత పురాణే*

నిర్మల్యం శిరసా వంద్యం నదీతోయే విసర్జయేత్ ।

అథవా భూమిగర్తే చ స్థాపయేత్ ప్రయతో నరః ॥


 దేవ నిర్మల్యాన్ని మొదట భక్తితో కళ్లకు అద్దుకుని (శిరస్సుపై వంచుకుని), ఆ తర్వాత పవిత్రమైన నదీ జలాల్లో విసర్జించాలి. ఒకవేళ నది లేదా ప్రవహించే జలాశయం అందుబాటులో లేకపోతే, భూమిలో ఒక చిన్న గుంత తీసి అందులో భద్రంగా నిక్షిప్తం (పాతిపెట్టడం) చేయాలి.


*పద్మ పురాణే*

దేవస్య నిర్మల్యం సర్వం వృక్షమూలేషు నిక్షిపేత్ ।

పవిత్రే చ జలే వాపి న కదాచిత్ చతుష్పథే ॥


 దేవుని నిర్మల్య మొత్తాన్ని పవిత్రమైన వృక్షాల (రావి, మర్రి, ఉసిరి లేదా పూల మొక్కల) మొదట్లో వేయాలి లేదా పవిత్ర జలంలో కలపాలి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చతుష్పథే (నాలుగు రోడ్ల కూడలిలో/రహదారులపై) లేదా జనులు నడిచే దారిలో వేయకూడదు.


*స్కాంద పురాణే*

నిర్మల్యమన్యథా కుర్యాత్ గంగాయాం వా హ్రదేషు చ ।

శుచౌ దేశే చ నిఖనేత్ న పాదైః స్పృశ్యతే యథా ॥


పూజా ద్రవ్యాలను గంగానది వంటి పుణ్యనదులలో గానీ, చెరువులలో గానీ విడవాలి. లేదా ఎవరి పాదాలూ తగలని ఒక స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రదేశంలో భూమిలో పాతిపెట్టాలి.


*స్మృతి ముక్తాఫల వైద్యనాథ దీక్షితీయ ధర్మశాస్త్రే*


దేవతార్చన నిర్మల్యం న త్యజేదశుచౌ స్థలే ।

నదీతీరే వృక్షమూలే కూపే వా తద్విసర్జయేత్ ॥


దేవతార్చన చేసిన నిర్మల్యాన్ని అపవిత్రమైన స్థలాలలో (ఉదాహరణకు మురికి కాలువలు, చెత్తకుండీలు) పడేయకూడదు. నదీతీరంలో గానీ, పెద్ద వృక్షాల మొదళ్లలో గానీ, లేదా బావులలో గానీ (ఉపయోగించని పాడుబడ్డ బావులు/నీటి వనరులు) విసర్జించాలి.


*అగ్ని సంస్కారము స్కాంద పురాణే*


అలాభే సర్వతీర్థానాం శుచౌ దేశే చ నిఖనేత్ ।

అగ్నౌ వా ప్రక్షిపేత్ ప్రాజ్ఞః తద్భస్మ శిరసా వహేత్ ॥


ఏ తీర్థాలు (నదులు) అందుబాటులో లేనప్పుడు, పవిత్రమైన స్థలంలో భూమిలో పాతిపెట్టాలి. అది కూడా వీలు కానప్పుడు, బుద్ధిమంతుడైనవాడు ఆ నిర్మల్యాన్ని అగ్నిలో వేసి దహనం చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆ పవిత్ర భస్మాన్ని (బూడిదను) శిరస్సున ధరించాలి లేదా మొక్కలకు వేయాలి.


*స్వగృహే ఆవాపనమ్ స్మృతిముక్తాఫల ధర్మశాస్త్రే*


నదీ వృక్షాద్యలాభే తు స్వగృహే వస్త్రపూతకే ।

మృత్పాశే వా ఘటే క్షిప్త్వా భూమౌ తత్ పరిపాచయేత్ ॥


నది, వృక్షాలు లభించనప్పుడు, తన ఇంట్లోనే ఒక మట్టి పాత్రలో గానీ (మృత్పాశే), కుండలో గానీ మట్టిని వేసి, అందులో నిర్మల్యాన్ని వేసి పరిపాచనం (కుళ్లిపోయేలా/ఎరువుగా మారేలా) చేయాలి.


*వాయు విసర్జన – పరాశర స్మృత్యాం*


శుష్కం నిర్మల్యమాదాయ చూర్ణయిత్వా తు వాయునా ।

వికీర్యేత్ పావనే దేశే న దోషో మనురబ్రవీత్ ॥


నిర్మల్యాన్ని బాగా ఎండబెట్టి (శుష్కం), ఆ తర్వాత దాన్ని చేతులతో నలిపి పొడి (చూర్ణం) చేయాలి. ఆ పొడిని గాలి ద్వారా ఎవరూ తొక్కని పవిత్రమైన ప్రకృతి ప్రదేశంలో లేదా చిన్న మొక్కలపైన చల్లవచ్చు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదని మనువు చెప్పారు.


*గుడిలో భక్తులకు ప్రసాదంగా పువ్వులు పూలమాల లభిస్తే ఎక్కడ వదిలివేయాలి?


నిర్మాల్యం పూజితం దేవైః శిరసా ధార్యతే నరైః |

తత్త్వమ్భసి నదీతోయే క్షిపేద్వా వృక్షమూలకే ||


దేవతల చేత పూజించబడిన నిర్మాల్యాన్ని మనుషులు భక్తితో శిరస్సున ధరించాలి. ఆ తర్వాత దానిని పవిత్రమైన నదీ జలాలలో (ప్రవహించే నీటిలో) కానీ లేదా ఎవరి పాదాలు తగలని పెద్ద వృక్షాల మొదట్లో (చెట్ల వేర్ల వద్ద) కానీ సమర్పించాలి.


*నిర్మాల్యం లంఘయేన్నైవ న పద్భ్యాం సంస్పృశేత్ క్వచిత్*


దేవ నిర్మాల్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు (దాటడం అంటే అవమానించడం) మరియు కాలితో తొక్కకూడదు.

కాబట్టి, మురికి కాలువలలో, చెత్త కుండీలలో లేదా నలుగురు నడిచే దారులలో దేవతా ప్రసాదమైన పూలను అస్సలు పడేయకూడదు. ఇది దోషంగా పరిగణించబడుతుంది.


*ఆధునిక అనుకూలత*


*ఇంట్లోనే ఒక చిన్న పాత్ర లేదా కుండీ పెట్టుకుని, ఎండిపోయిన పూజా పూలను అందులో వేసి కర్పూరంతో లేదా నెయ్యితో కాల్చివేయవచ్చు. ఆ బూడిదను నుదుట బొట్టుగా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లోని చిన్న మొక్కల కుండీలలో వేయవచ్చు.


*ఫ్లాట్లలో లేదా అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ఒక మట్టి కుండీని కేవలం నిర్మల్య విసర్జన కోసమే కేటాయించవచ్చు. అందులో కొద్దిగా మట్టి, పూజా పువ్వులు వేస్తూ ఉంటే, కొద్ది రోజులకు అది పవిత్రమైన "నిర్మల్య ఖాదము" (Holy Compost) గా మారుతుంది. దీన్ని ఇంట్లోని మొక్కలకే వాడుకోవచ్చు.

 

*పూజా పుష్పాలను పడేయకుండా ఒక కవర్ లోనో, గిన్నెలోనో వేసి ఎండబెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత పొడి చేసి, ఇంట్లో ఉండే చిన్న మొక్కల కుండీలలో చల్లితే అవి మట్టిలో కలిసిపోతాయి.

బ్రహ్మాండాన్ని నడిపించే -

 బ్రహ్మాండాన్ని నడిపించే గురుత్వాకర్షణ శక్తి - అమ్మవారి "పాశ హస్తం" మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం..........!!

​శ్రీ లలితా త్రిపురసుందరి దేవి చేతుల్లో ఉండే ఆయుధాలలో, ఆమె ఎడమ వైపు పైచేతిలో ఉండే "పాశం" (తాడు) అనే ఆయుధం.. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన బ్రహ్మాండ రహస్యాన్ని తనలో దాచుకుంది!

​ఆధ్యాత్మిక గ్రంథాలలో, ఈ పాశాన్ని అమ్మవారు అసురులను (రాక్షసులను) బంధించడానికి ఉపయోగించే ఒక ఆయుధంగా వర్ణించినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలైన తత్త్వం ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో (Modern Science) అచ్చుగుద్దినట్లు సరిపోలుతుంది.


​దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం ఇదిగో:

​గురుత్వాకర్షణ శక్తి - జగన్మాత పాశం:

ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఈ విశ్వంలో ఉన్న కోట్లాది సూర్యుళ్లు, గ్రహాలు, నక్షత్రాలు తమ కక్ష్యలను (Orbits) దాటిపోకుండా ఒకదానితో ఒకటి బంధించబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి (Gravity). ఈ శక్తి గనుక లేకపోతే, విశ్వం ముక్కలై నశించిపోతుంది.

​ఈ అండసరాచరాలన్నీ చెల్లాచెదురు కాకుండా, ప్రేమానురాగాలనే తాడుతో ఒకదానితో ఒకటి కట్టి, తనలోనే ఉంచుకున్న మహాశక్తి యొక్క పరాక్రమమే అమ్మవారి చేతిలో ఉన్న 'పాశం'. ఆమె సృష్టించిన ఆకర్షణ శక్తి వల్లే ఈ జగత్తంతా నడుస్తోంది!


​మానవ శరీరంలో పాశం యొక్క ప్రాముఖ్యత:

తమిళంలో "పాశం" అనే పదానికి 'అன்பు' (ప్రేమ), 'ஆசை' (ఆశ/కోరిక), 'பிணைப்பு' (బంధం) అని అనేక అర్థాలు ఉన్నాయి. ఈ ఆయుధం మానవ శరీరంలో మన "కోరికలను" సూచిస్తుంది.

​మనం దేనినైతే తీవ్రంగా కోరుకుంటామో, దేనిపై ఎక్కువ ప్రేమను పెంచుకుంటామో... దానిని మనవైపు లాక్కునే ఒక అయస్కాంత శక్తి (Magnetic energy) మన మనస్సుకు ఉంది. మనం ప్రాపంచిక వస్తువులపై పాశాన్ని (మోహాన్ని) పెంచుకుంటే అది మనల్ని సంసార బంధాలలో నెట్టేస్తుంది; అదే పాశాన్ని (భక్తిని) అమ్మవారిపై ఉంచితే, అది మనల్ని పరమానంద స్థితికి తీసుకెళ్తుందని సిద్ధుల వాక్కు.

​ఇచ్ఛాశక్తి మహాపాశం:

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి పాశాన్ని "ఇచ్ఛాశక్తి మహాపాశాయై నమః" అని కీర్తిస్తుంది. అంటే, మనుషులలో ఉండే 'అనుకున్నది సాధించే మహా శక్తి' ఆమె స్వరూపమే. మనకు కావలసిన వాటిని ఆకర్షించుకునే శక్తిని అమ్మవారు ఈ ఆయుధం ద్వారా మనకు ప్రసాదిస్తుంది.

అమ్మవారి చేతిలో ఉన్న పాశం మనల్ని శిక్షించడానికి కాదు; విశ్వంలోని ప్రతి అణువునూ ప్రేమతో ముడిపెట్టి ఉంచడానికి! మనలో ఉన్న పవిత్రమైన ప్రేమానురాగాలు, లోతైన ఆకర్షణ శక్తి.. అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగినవే అని గ్రహించడమే నిజమైన "శాక్త జ్ఞానం"!

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏


12-06-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.  

---------------------------------------


వృషభం


రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. 

---------------------------------------


సింహం


నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


కన్య


రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.

---------------------------------------


తుల


ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------


ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


మకరం


వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కుంభం


ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


మీనం

 

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన శుభకార్యల విషయమై ప్రస్తావన వస్తుంది.

---------------------------------------

11, జూన్ 2026, గురువారం

పంచాంగము


 

అధరం మధురం

  అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం | హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 1 ||


వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం | చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 2 ||


వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ | నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 3 ||


గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం | రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 4 ||

శుక్రవారం🌹* *🪷12,జూన్, 2026🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹* 

 *🪷12,జూన్, 2026🪷*       

   *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి      : ద్వాదశి* రా 07.36 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : అశ్విని* ఉ 06.28 *భరణి* రా.తె 04.05 వరకు

*యోగం  : అతిగండ* రా 09.26 వరకు ఉపరి *సుకర్మ* 

*కరణం   : కౌలువ* ఉ 09.10 *తైతుల* రా 07.36 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

        *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  : *రా 11.46 - 01.12*

 అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.34*

*వర్జ్యం      : మ 03.07 - 04.33*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.04 మ 12.34 - 01.28*

*రాహు కాలం  :ఉ10.29 - 12.07*

గుళికకాళం      :*ఉ 07.13 - 08.51*

యమగండం    : *మ 03.24- 05.02*

సూర్యరాశి : *వృషభం*                 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 05.41*  

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34- 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :*10.49 - 01.26*

అపరాహ్న కాలం  :*మ 01.26- 04.03*

*ఆబ్ధికం తిధి        : అధిక జ్యేష్ఠ బహుళ ద్వాదశి*

సాయంకాలం  :*సా 04.03 - 06.40*

ప్రదోష కాలం      :*సా 06.40 - 08.51*

రాత్రి కాలం       :*రా 08.51 - 11.46*

నిశీధి కాలం      :*రా 11.46 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

              *🪷ఓం🪷* 

*🌷శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


         🌷*సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

గొప్ప తరం

 *ఒక గొప్ప తరం వెళ్ళిపోతోంది.!*


     గొప్పగా బతికిన వారు ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక గొప్పతరం కనుమరుగవుతోంది.


    అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. 

   ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. బాధ్యతల్ని ఎరిగిన తరం. 

   'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. 


  డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. 

    గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. 


    ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం. 

    కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. 

    మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. 

   TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. 

    GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం. 

    సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం. 

   ACలు, కూలర్లు లేకున్నా

ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. 

     మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం. 

   పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. 


      రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. 

     ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 

    ఏడు ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. 

     కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. 

    క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. 

    వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. 


    సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం. 

ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. 

     పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. 

     బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. 

    ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. 

     ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. 

   భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం. 


     వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. 

    నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం. 

    రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం. 


    కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. 

   హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం. 

   బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం. 

    లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. 

   కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. 

    ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. 

   ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. 

పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. 

     త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. 

    కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. 


   అలాంటి తరంలోని అపురూపమైన గొప్పవ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. 

వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. 

   వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!

  *అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు *

🙏🙏

ఏ వ్యాధి వస్తుంది

 మానవులకు ఏ గ్రహం వలన ఏ వ్యాధి వస్తుంది .


• టై ఫా యి డు దీనిని సన్నిపాత జ్వరం అంటారు.ఇది గురు - బుద గ్రహాల సంభందం వలన వస్తుంది.


• డ య బె టిక్ అనగా మధు మేహం ఇది గురు - బుద గ్రహాల వలన వస్తుంది.


• జాండిస్ అనగా కామెర్లు అంటారు. ఇది గురు - శుక్ర గ్రహాల వలన వస్తుంది.


• రాచ పుండు ఇది రవి గ్రహం వలన వస్తుంది.


• మలేరియా ఇది శని గ్రహం వలన వస్తుంది.


• అతిసారం ఈ వ్యాధి కుజుడు, బుదుడు,శని, కేతువు మొదలయిన గ్రహాల సంభందం వలన వస్తుంది.


• మొలల వ్యాధి కుజ - రాహు గ్రహాల సంభందం వలన వస్తుంది.


• అజీర్ణ వ్యాధి ఇది శని గ్రహం వలన వస్తుంది.


• క్షయ వ్యాధి శుక్ర గ్రహ ప్రభావం వలన వస్తుంది.


• ఉబ్బసం శని, బుదుడు, కేతువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• ఉన్మాదం రవి , కుజుడు, శని కలయిక వలన వస్తుంది.


• ధనుర్వాతం ఇది రవి, కుజుడు, శని కలయిక వలన వస్తుంది.


• పక్షవాతం ఇది శని ప్రభావం వలన వస్తుంది.


• కుంటి తనం శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.అన్ని రకాల వాతాలకు శని గ్రహ ప్రభావమే కారణం.


• ముగతనం ఇది బుద, కేతు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• గౌట్ దీనిని వాత రక్త వ్యాధి అంటారు.ఇది రవి, శుక్ర గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• శూల నొప్పి ఇవి శని, కుజ, రాహు గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• గుండె రోగాలు ఇవి శుక్ర గ్రహ ప్రభావం వలన కలుగుతాయి.


• హెర్నియా దీనిని బు డ్డ గిలక అంటారు.ఇది బుద గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• బుడ్డ ( వరిబీజము) ఇది బుద గ్రహం వలన ఏర్పడుతుంది.


• భయంకర చర్మ వ్యాధులు ఇవి కేతువు , శుక్ర , చంద్ర గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• దంత రోగాలు ఇవి గురు, శని గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• చెవుడు ఇది శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• తలనొప్పి ఇది కుజుడు, రాహువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• ఉబ్బు రోగాలు ఇవి కేతువు గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• కాన్సర్ ఈ భయంకర వ్యాధి రవి, కుజ,గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• స్త్రీ తెల్ల బట్ట ఇది కుజుడు , శుక్రుడు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• స్త్రీల ఎర్రబట్ట ఇది రవి, కుజుడు గ్రహల వలన వస్తుంది.


• గోడ్డ్రాలితనం ఇది కుజ ,శని,బుద,శుక్ర గ్రహాల కలయిక వలన వస్తుంది.పైన చెప్పిన వ్యాదులు మందులు వాడుతున్నా తగ్గక పొతే ఆయా గ్రహాలకు శాంతులు, జపాలు చేయించడం వలన వ్యాధి ప్రభావం నుంచి బయట పడవచ్చు. 


       మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.