15, ఆగస్టు 2026, శనివారం

వృద్ధాప్యంలో

 వృద్ధాప్యంలో మీరు ఒంటరిగా మిగిలిపోకూడదని, ఎవరికీ భారం కాకూడదని అనుకుంటే, ఇప్పుడే ఈ విషయాలను గ్రహించండి. 


01. భూమి గొడవల్లో చిక్కుకోకండి:"పక్కింటి వాడికి బుద్ధి చెప్పాలి" అనే ఒకే ఒక్క మొండి పట్టుదలతో మీ జీవితాన్ని కోర్టు మెట్ల చుట్టూ వృథా చేసుకోకండి. ఆ కేసు తెమలక ముందే మీ ఆయుష్షు తీరిపోవచ్చు. మీరు పోరాడి ఆ భూమిని గెలిచినా, అనుభవించడానికి మీరుండరు — అక్కడ శాశ్వతంగా స్థిరపడేది కేవలం లాయర్లు మాత్రమే.


2. పాత వాహనాలు భారం కావచ్చు:ఐదు లక్షల లాభం వస్తుందనే ఆశతో పాత వాహనాన్ని ఇంటికి తెచ్చే తప్పు చేయకండి. ఆ బండి రోడ్డు మీద కంటే ఎక్కువ రోజులు గ్యారేజీలోనే గడిపితే, గుండెపోటు ఆ వాహనానికి రాదు — మీకే వస్తుంది.


3.. ఆస్తులను ఇప్పుడే పిల్లల పేరిట రాయకండి:ఈ రోజు మీ పిల్లలు మీకు "దైవ సమానులు"గా కనిపించినా, మీ ఆస్తి మొత్తాన్ని వారి పేరిట రాసిచ్చిన మరుక్షణమే, అదే ఇంట్లో మీరు ఒక "పనికిరాని వస్తువు"లా మారిపోవచ్చు. పిల్లలు చెడ్డవారు కాదు, కానీ ఈ ప్రపంచం చాలా క్రూరమైనది. మీ చివరి శ్వాస వరకు ఏదో ఒకటి మీ పేరు మీదనే ఉంచుకోండి.


 04. మీ చివరి పొదుపును జాగ్రత్తగా దాచుకోండి:30 ఏళ్ల కష్టార్జితమైన మీ పెన్షన్ డబ్బును పిల్లల వ్యాపారాల కోసం ఇచ్చేయకండి. చివరికి మీ మందుల ఖర్చుల కోసం కూడా అదే పిల్లల ముందు చేతులు చాచాల్సిన పరిస్థితి రావచ్చు.


 05. పిల్లల జీవితాల్లో అతిగా తలదూర్చకండి:"మన పిల్లలే కదా" అని వారి వ్యక్తిగత విషయాలలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. అతిగా దగ్గరవడం వల్ల మీ ప్రేమ వారికి చికాకుగా మారవచ్చు. మీకంటూ ఒక చిన్న స్థానాన్ని ఏర్పరచుకుని, స్వతంత్రంగా జీవించడం అలవాటు చేసుకోండి.


 06. తీర్థయాత్రలకు తీసుకెళ్తారని పిల్లల కోసం ఎదురుచూడకండి:"పిల్లలకు సెలవులు దొరికినప్పుడు తీసుకెళ్తారు" అని ఆశగా కూర్చోకండి. వారికి సమయం దొరికే సరికి, కనీసం మీరు నడవలేని స్థితికి చేరుకోవచ్చు. ఒంట్లో సత్తా ఉన్నప్పుడే మీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్లండి — అవసరమైతే ఒంటరిగానైనా సరే ప్రయాణించండి.


 07. తినాలనిపించింది ఈ రోజే తినండి:మోతాదు మించకుండా!

 08. మీకంటూ కాస్త విశ్రాంతిని కేటాయించుకోండి:చనిపోయే రోజు వరకు బాధ్యతల భారాన్ని మోస్తూనే ఉండకండి. పొద్దున్న నుంచి రాత్రి వరకు నిరంతరం పరిగెడుతూనే ఉంటే, చివరికి మీరు సాధించేది ఏమీ ఉండదు. మీ శరీరానికి కావలసిన విశ్రాంతిని ఇవ్వండి.


 09. నిద్రను మించిన మందు లేదు:అనవసరమైన ఆలోచనలతో నిద్రలేమిని కొనితెచ్చుకోకండి, ప్రశాంతంగా నిద్రపోండి. రేపు మీరు అనారోగ్యానికి గురైతే, మీ బాధను ఎవరూ పంచుకోలేరు — మీరే ఒంటరిగా భరించాలి.


 10. మీరు ఒంటరిగానే వచ్చారని ఎన్నడూ మరువకండి:ఎవరైనా మీ కోసం ఏదో ఒకటి చేస్తారనే అంచనాలను తగ్గించుకోండి. ఒకరోజు మీ నీడ కూడా మిమ్మల్ని వదిలేస్తుంది. మరణం కూడా ఒంటరిగానే వస్తుంది — కాబట్టి ఒంటరిగా ఉన్నా సంతోషంగా జీవించడం నేర్చుకోండి.   ఆనందం అనేది ఎవరో ఇచ్చేది కాదు; అది మీ అంతట మీరే అంతరంగంలో సృష్టించుకోవాల్సింది.


11. మీ భార్య లేదా భర్త ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఇంట్లోని చిన్న పెద్ద పనులన్నీ మీ స్వహస్తాలతో చేసుకోవడం నేర్చుకోవడానికి వెనుకాడకండి.


12.  మీరు ఒకవేళ విల్లు (Will) రాసినప్పటికీ, దానిని ఎప్పుడైనా మార్చే పూర్తి హక్కు మీకు ఉంటుందని గుర్తుంచుకోండి.


13. మీ వారసులు మిమ్మల్ని వేధిస్తున్నా లేదా వేలెత్తి చూపిస్తున్నా, ఈ రోజు చట్టం మరియు జిల్లా యంత్రాంగం (డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్) మీ వైపు ఉన్నాయని మరువకండి.


14.. ప్రతిరోజూ నడకను అలవాటు చేసుకోండి. మీ పాత స్నేహితులు లేదా బంధువులు ఉంటే, వారితో కలిసి మీ చిన్ననాటి తీపి గుర్తులను పంచుకోవడానికి వెనుకాడకండి.


15. ఏ రోజైనా జీవితపు లెక్కలు ముగిసిపోతాయని గుర్తుంచుకోండి, ఆ చివరి రోజు కోసం మానసికంగా ఎప్పుడూ సిద్ధంగా ఉండండి.


16. చివరికి మీరు ఈ ప్రపంచం నుండి ఏమీ తీసుకెళ్లలేరని గ్రహించండి, అందుకే అందరితో ప్రేమగా, స్నేహపూర్వకంగా మెలగండి. అవసరమైన వారికి సహాయం చేస్తూ మిమ్మల్ని మీరు ఒక మంచి మనిషిగా  జీవించేలా చేసుకోండి.  🙏🙏

Revathi MS Goud 

Bengaluru 💞


సేకరణ 🌹

14, ఆగస్టు 2026, శుక్రవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।

సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।



ప్రతిపదార్థ:


సర్వ-భూత-స్థితం — అన్ని ప్రాణుల యందు స్థితుడనై ఉన్న; యః — ఎవరైతే; మాం — నన్ను; భజతి — ఆరాధించునో; ఏకత్వం — ఏకమై ఉండి; ఆస్థితః — స్థితుడై; సర్వథా — అన్ని రకాలలో; వర్త-మానః — ఉండినా; అపి — కూడా; సః — అతను; యోగీ — ఒక యోగి; మయి — నాయందే; వర్తతే — నివసించును.



తాత్పర్యము: 


నా యందే ఏకత్వంలో స్థితుడై ఉండి, మరియు నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే నివసించును.



వివరణ:


భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన సర్వభూతముల హృదయములలో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. 18.61వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘నేను సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్నాను.’ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ.


వ్యక్తుల ఆధ్యాత్మిక పరిణితి బట్టి ఇది ప్రధానంగా నాలుగు స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది


1. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు, మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశపౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నముగా చూస్తారు.


2. అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు, అందుకే 5.18వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘దివ్య జ్ఞాన చక్షువులుకల నిజమైన పండితులు - ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని, మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు’


3. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తుని గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు, అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి.


4. అత్యునత స్థాయి యోగులని 'పరమహంస' లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు, వారికి ఈ ప్రపంచం స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వేదవ్యాస తనయుడైన శుకదేవుని విజ్ఞాన స్థాయి ఇదే.


యం ప్రవ్రజంతమనుపేతమ్ అపేత కృత్యం,

ద్వైపాయనో విరహ-కాతర ఆజుహావ

పుత్రేతి, తన్-మయతయా తరవో ఽభినేదుస్

తం సర్వ-భూత-హృదయం మునిమానతోఽస్మి (1.2.2)


చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ, శుకదేవుడు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు, ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచంపు స్పృహే లేదు. ఆయన అటుగా వెళ్తూ, కొలనులో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించనేలేదు. ఆయన చూసినది అంతా భగవంతుడినే; ఆయన విన్నది అంతా భగవంతుడినే; ఆయన తలచినది అంతా భగవంతుడినే, అని ఈ శ్లోకం పేర్కొంటున్నది.


ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పైన పేర్కొనబడిన స్థాయిల్లో, మూడవ, నాలుగవ స్థాయిలో ఉన్న పరిపూర్ణ సిద్ది సాధించిన యోగుల గురించి మాట్లాడుతున్నాడు.

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

14-08-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.      

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


మిధునం


సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. 

---------------------------------------


కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


ధనస్సు


నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------


మకరం


ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. 

---------------------------------------


కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

---------------------------------------


మీనం


చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  

---------------------------------------

13, ఆగస్టు 2026, గురువారం

ప్రతి రోజు చావొద్దు

 “చావు ఒకరోజు వస్తుంది… కానీ ఆసుపత్రి మంచంపై ప్రతి రోజు చావొద్దు!”




“ఏది పడితే అది తిను…

జీవితం ఒక్కసారే వస్తుంది…”


ఈ మాటలు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు.


కానీ…


షుగర్ వచ్చిన తర్వాత టాబ్లెట్ మీ కోసం వాళ్లు మింగరు.

బీపీ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ వాళ్లు వేయించుకోరు.

కిడ్నీ పాడైతే డయాలసిస్‌కు వాళ్లు వెళ్లరు.

లివర్ దెబ్బతింటే బాధ వాళ్లది కాదు.


బాధంతా మీదే…


ఒకప్పుడు నేనూ ఇదే తప్పు చేశాను.


93 కిలోల బరువు…


ప్రీ-డయాబెటిస్…


గ్రేడ్-3 ఫ్యాటీ లివర్…


కిడ్నీలో రాళ్లు…


నాలుగు నెలలకు ఒకసారి ఆసుపత్రి.


స్కాన్లు…

బ్లడ్ టెస్టులు…

మందులు…

మళ్లీ అదే సమస్య.


అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది.


“మందులు మార్చాలా… లేక నా జీవితాన్నే మార్చాలా?”


నేను రెండో దారిని ఎంచుకున్నాను.


ఆ రోజు నుంచి ఆసుపత్రిపై కాదు…

నా అలవాట్లపై నమ్మకం పెట్టుకున్నాను.


ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం అర్థమైంది.


మన శరీరాన్ని చంపేది వయసు కాదు… మన నిర్లక్ష్యం.



నా జీవితాన్ని మార్చిన 10 అలవాట్లు


1. ప్రతి రోజు నడవడం


వాచ్‌లో 10,000 స్టెప్స్ వచ్చాయని కాదు.


బాత్రూమ్‌కు వెళ్లినవి…

ఇంట్లో తిరిగినవి…

వంట చేసినవి…


అవి వ్యాయామం కావు.


రోజుకు కనీసం 30–60 నిమిషాలు ఆగకుండా నడవండి.


మీ గుండె పని చేయాలి.

చెమట పట్టాలి.

అప్పుడే కొవ్వు కరుగుతుంది.



2. ప్లేట్‌లో రంగులు పెంచండి


తెల్ల అన్నం తగ్గించండి.


ఆకుకూరలు…

కూరగాయలు…

పప్పులు…

గుడ్లు…

పెరుగు…

చేపలు లేదా మంచి ప్రోటీన్ ఆహారం పెంచండి.


ప్రతి భోజనంలో…


40% ప్రోటీన్


30% మంచి కార్బోహైడ్రేట్స్


30% కూరగాయలు, ఫైబర్


మీ ప్లేట్ మారితే…

మీ రక్తం మారుతుంది.

మీ శరీరం మారుతుంది.



3. చక్కెర ఒక మెల్లి విషం


టీలో వేసే చక్కెర మాత్రమే కాదు…


బిస్కెట్లు…

కూల్‌డ్రింక్స్…

స్వీట్లు…

బేకరీ పదార్థాలు…


ఇవి కూడా శరీరానికి భారమే.


ఒక్క రోజు తింటే ఏమీ కాదు.


కానీ…

రోజూ తింటే శరీరం నిశ్శబ్దంగా కూలిపోతుంది.



4. రాత్రి భోజనం త్వరగా ముగించండి


సాధ్యమైతే సాయంత్రం 7 గంటలలోపు.


అవకాశముంటే వారంలో కొన్ని రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి.


శరీరానికి కూడా విశ్రాంతి అవసరం.



5. నిద్రను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు


మొబైల్‌కు ఛార్జింగ్ పెడతాం.


కానీ మన శరీరానికి ఛార్జింగ్ అయిన నిద్రను దూరం చేస్తున్నాం.


రోజుకు 7–8 గంటలు నిద్రపోండి.


నిద్రే శరీరానికి సహజ వైద్యుడు.



6. యోగా… ధ్యానం… శ్వాస


రోజుకు 10 నిమిషాలు అయినా కళ్లుమూసుకుని ప్రశాంతంగా కూర్చోండి.


ప్రాణాయామం చేయండి.


ధ్యానం చేయండి.


మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.



7. కోపం తగ్గించండి


ఇంట్లో గొడవలు…

ఆఫీసులో ఒత్తిడి…


ఇవి కూడా ఒక రకమైన విషమే.


ఒత్తిడి పెరిగితే…


బీపీ పెరుగుతుంది.


బరువు పెరుగుతుంది.


షుగర్ ప్రమాదం పెరుగుతుంది.


మనసు ప్రశాంతంగా ఉంటే సగం వ్యాధులు దూరమవుతాయి.



8. ఉప్పు తగ్గించండి


అధిక ఉప్పు అంటే…


అధిక బీపీ…


శరీరంలో నీరు నిల్వ…


గుండెపై ఒత్తిడి…


రుచికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు.



9. నీళ్లు తాగండి… శరీరాన్ని కదిలించండి


లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి.


దగ్గర దూరాలకు నడవండి.


ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు.


ప్రతి గంటకోసారి లేచి కదలండి.


శరీరం కదిలితేనే జీవితం కదులుతుంది.



10. మీ కుటుంబానికి మీరు అవసరం


మీరు అనారోగ్యానికి గురైతే…


ముందుగా ఏడ్చేది మీ అమ్మ.


నిద్రపోకుండా చూసేది మీ భార్య.


భయపడేది మీ పిల్లలు.


మీరు ఆరోగ్యంగా ఉంటేనే…


మీ కుటుంబానికి వెన్నెముక.


డబ్బు సంపాదించడం గొప్ప కాదు.


ఆ డబ్బును ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టకుండా ఉండడం గొప్ప.



చివరిగా…


నేను డాక్టర్‌ను కాదు.


కానీ…


ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న మనిషిని.


మందుల విలువ తెలిసిన మనిషిని.


ఆరోగ్యం పోతే జీవితం ఎలా మారిపోతుందో చూసిన మనిషిని.


అందుకే చెబుతున్నాను…


40 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు సంపాదించడం మాత్రమే కాదు… ఆరోగ్యాన్ని కూడా సంపాదించాలి.


శరీరాన్ని ప్రేమించండి.


మనసును ప్రశాంతంగా ఉంచండి.


ఆహారాన్ని మందుగా మార్చుకోండి.


లేకపోతే…


ఒక రోజు మందులనే ఆహారంగా తినాల్సి వస్తుంది.


చనిపోవడం తప్పదు…


కానీ చావు వచ్చే వరకు ఆసుపత్రి కారిడార్లలో తిరుగుతూ బతకడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.


ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి.


“నా ఆరోగ్యం… నా బాధ్యత.”


ఈ వ్యాసం మీకు ఉపయోగపడితే…


ఒక్కసారి షేర్ చేయండి.


మీ ఒక్క షేర్ వల్ల…


ఒక వ్యక్తి బరువు తగ్గవచ్చు.


ఒక కుటుంబం షుగర్ నుంచి బయటపడవచ్చు.


ఒక తండ్రి తన పిల్లలతో ఇంకొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు.


ఆరోగ్యాన్ని పంచండి… ఈ వ్యాసాన్ని కూడా పంచండి.

ఇది చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్న...

ఓ మనిషి..

తనతో గుండె చెప్పింది🌱🍀🍀🙏

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐

 

శుక్రవారం, ఆగష్టు 14, 2026


శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం- వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ రా8.31 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:మఖ ఉ6.55 వరకు

యోగం:పరిఘము మ12.45 వరకు

కరణం:బాలువ ఉ9.14 వరకు తదుపరి కౌలువ రా8.31 వరకు


వర్జ్యం:మ2.45 - 4.19

దుర్ముహూర్తము:ఉ8.15 - 9.08

మరల మ12.30 - 1.20

అమృతకాలం:ఉ6.09 వరకు మరల రా12.09 - 1.43

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30


సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి:సింహం


సూర్యోదయం:5.46

సూర్యాస్తమయం:6.24


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


అభిప్రాయాలను తెలపండి

  మీ అభిప్రాయాలను తెలపండి 


మన బ్లాగును దేశ విదేశాల నుండి అనేకమంది వీక్షకులు చూస్తున్నట్లుగా నాకు సమాచారం అందుతున్నది.


 కానీ ఎవరికి ఏ పోస్ట్ నచ్చుచున్నది ఎందుకు నచ్చుచున్నది ఏ పోస్ట్ నచ్చటం లేదు ఎందుకు నచ్చటం లేదు మొదలైన విషయాలు మాత్రం నాకు తెలియటం లేదు కాబట్టి నేను ప్రతి వారిని కోరేది ఏమిటంటే మీకు ఏ పోస్ట్ నచ్చినా నచ్చకపోయినా దాన్ని  వివరణ ఆత్మకంగా దానికి సంబంధించినటువంటి కామెంట్లు చేయగలరు.


మీరు చేసే కామెంట్ల  ఈ బ్లాగును ఇంకా మంచిగా తీర్చేదించడానికి అనువుగా ఉంటుందన్న విషయం మరచిపోవద్దు 

స్నేహానికి కూడా మాంద్యం

 #######################

*స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది!*

 ######################

వేల మంది పరిచయస్తులు…``` 

కానీ ఒక్క ఫోన్ చేయడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని పరిస్థితి! 

ఒకప్పుడు మనిషికి డబ్బు లేకపోతే పేదవాడు అనేవారు. ఇప్పుడు?


డబ్బు ఉంది. ఉద్యోగం ఉంది. మంచి ఇల్లు ఉంది. ఖరీదైన కారు ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ… రాత్రి పదకొండు గంటలకు మనసు బాగోలేకపోతే ఫోన్ చేసి “రా… కాసేపు మాట్లాడాలి” అని చెప్పగలిగే స్నేహితుడు లేడు.


ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సంక్షోభం. 

Friendship Recession. అంటే ఆర్థిక మాంద్యం కాదు… స్నేహాల మాంద్యం.


అమెరికాలో 1990లో కేవలం 3 శాతం మంది మాత్రమే తమకు ఒక్క సన్నిహిత స్నేహితుడు కూడా లేడని చెప్పారు. 2021 నాటికి ఆ సంఖ్య 12 శాతానికి చేరింది. ఇదే సమయంలో 10 మందికి పైగా సన్నిహిత స్నేహితులున్నవారి శాతం 33 నుంచి 13కి పడిపోయింది.


తాజా 2024 గణాంకాలను చూస్తే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా కనిపిస్తోంది. సన్నిహిత స్నేహితులు లేరని చెప్పేవారి శాతం 17కి చేరినట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.


అంటే…

సోషల్ నెట్‌వర్క్ పెరుగుతోంది.

సోషల్ కనెక్షన్ తగ్గుతోంది.


ఇదే అసలు విషాదం.


ఫేస్‌బుక్‌లో 5 వేల మంది… కానీ మనసులో ఒక్కరూ లేరా?


ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం స్నేహం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండేది కాదు.


టీ కొట్టులో కూర్చుంటే పక్కన కూర్చున్న వ్యక్తితో మాట కలిసేది.


బస్సులో ప్రయాణిస్తే పక్క సీట్లో ఉన్నవారితో పరిచయం అయ్యేది.


కాలేజీలో, ఆఫీసులో, క్లబ్‌లో, ఆట మైదానంలో… ఎక్కడైనా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు.

అలా పరిచయం స్నేహంగా మారేది.

స్నేహం అనుబంధంగా మారేది.


ఇప్పుడు?

కాఫీ షాపులో పక్క టేబుల్‌లో ముగ్గురు కూర్చున్నారు.

ముగ్గురి చేతుల్లో మూడు ఫోన్లు.

ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో.

మరొకరు యూట్యూబ్‌లో.

ఇంకొకరు వాట్సాప్‌లో.

ముగ్గురు మనుషులు ఒకే టేబుల్ దగ్గర ఉన్నారు.

కానీ ముగ్గురు మూడు ప్రపంచాల్లో ఉన్నారు.

ఇది కేవలం అమెరికా కథ కాదు.

మన నగరాల్లో కూడా ఇదే మార్పు కనిపిస్తోంది.


పరిచయాలు పెరిగాయి.

కాంటాక్ట్స్ పెరిగాయి.

ఫాలోవర్లు పెరిగారు.

వాట్సాప్ గ్రూపులు పెరిగాయి.

కానీ…

“నిజంగా నా మనిషి ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవారి సంఖ్య తగ్గుతోంది.```

*friendship recession*```

ఒంటరిగా తినడం కూడా ఒక సంకేతమే!

అమెరికాలో ఒంటరిగా భోజనం చేసే వారి సంఖ్య చాలా కాలంగా పెరుగుతోంది.

2023లో దాదాపు ప్రతి నలుగురు అమెరికన్ పెద్దల్లో ఒకరు—26 శాతం—తాము ముందు రోజు రోజంతా భోజనాలన్నీ ఒంటరిగానే చేశామని చెప్పారు. 2003తో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా పెరుగుదల.


ఇది “ఒంటరిగా తినడం తప్పు” అనే విషయం కాదు.

ఒక్కోసారి ఒంటరిగా కాఫీ తాగడం, భోజనం చేయడం, సినిమా చూడడం చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిగత సమయం కావచ్చు.

కానీ ఒక సమాజంలో కలిసి తినే సంస్కృతి తగ్గిపోవడం మాత్రం ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతం.

ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు.

అది సంభాషణ.

అది అనుబంధం.

అది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే ఒక చిన్న సామాజిక ఆచారం.

అందుకే ప్రపంచ సంతోష నివేదికలు కూడా ఇతరులతో కలిసి భోజనం చేసే అలవాటుకు మెరుగైన శ్రేయస్సుతో సంబంధం ఉందని చూపిస్తున్నాయి.


మనకు స్నేహితులు లేరా? లేక సమయం లేదా?

ఇది అసలు ప్రశ్న.


నిజానికి చాలామందికి స్నేహితులు కావాలనే ఉంటుంది.

కానీ సమయం ఉండదు.

ఉదయం ఆఫీసు.

సాయంత్రం ట్రాఫిక్.డ

ఇంటికి వచ్చేసరికి అలసట.

మిగిలిన సమయం ఫోన్.

వీకెండ్ వస్తే వ్యక్తిగత పనులు.

అలా నెలలు గడుస్తాయి.

తర్వాత…

“అరే! వాడితో మాట్లాడి చాలా కాలమైపోయింది కదా!”

అని గుర్తొస్తుంది.

కాల్ చేయాలనిపిస్తుంది.

కానీ…

“ఇప్పుడు చేస్తే ఏం అనుకుంటాడు?”

అని ఆలోచిస్తాం., లేదా వాడు చేయచ్చు కదా అని ఇగో 

అదే స్నేహానికి మొదటి శత్రువు.

సమయం లేకపోవడం కాదు.

స్నేహానికి సమయం కేటాయించకపోవడం.

సోషల్ మీడియా మనల్ని కలిపిందా? విడదీసిందా?

సోషల్ మీడియా వచ్చినప్పుడు ప్రపంచం దగ్గరైపోతుందని అనుకున్నాం.

నిజమే.

దూరంగా ఉన్న మనిషిని ఒక్క క్షణంలో పలకరించగలిగాం.

కానీ ఒక విచిత్రమైన పరిణామం జరిగింది.

మనకు ఇప్పుడు ఎక్కువ మంది పరిచయం.

తక్కువ మంది స్నేహితులు.

వందల మంది పోస్టులు చూస్తున్నారు.

వేల మంది మన పోస్టులు చూస్తున్నారు.

కానీ మన బాధను చూసేవారు ఎంతమంది?

మన విజయాన్ని నిజంగా సంతోషించేవారు ఎంతమంది?

మన ఓటమిలో మన పక్కన నిలబడేవారు ఎంతమంది?

ఇదే అసలు స్నేహానికి పరీక్ష.


లైక్ కొట్టేవాడు స్నేహితుడు కాదు.

కామెంట్ చేసేవాడు స్నేహితుడు కాదు.

ప్రతిరోజూ మెసేజ్ చేసేవాడు కూడా తప్పనిసరిగా స్నేహితుడు కాదు.

మనకు ఏమీ ఇవ్వలేని సమయంలో కూడా మనతో ఉండేవాడే స్నేహితుడు.

ఒంటరితనం కేవలం భావోద్వేగ సమస్య కాదు.

ఇక్కడే ఈ విషయం మరింత సీరియస్ అవుతుంది.

అమెరికా సర్జన్ జనరల్ 2023లో సామాజిక అనుబంధం లేకపోవడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. వారి నివేదిక ప్రకారం ఒంటరితనం, సామాజిక దూరం గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, డిమెన్షియా, ఆందోళన, డిప్రెషన్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. సామాజిక అనుబంధం లేకపోవడం వల్ల అకాల మరణ ప్రమాదం కూడా పెరుగుతుంది.


“రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం” అనే ప్రసిద్ధ పోలిక కూడా ఇదే నివేదిక నుంచి వచ్చింది.

అయితే దీన్ని “ఒంటరితనం = రోజూ 15 సిగరెట్లు” అనే వైద్య సమీకరణంగా తీసుకోవడం సరికాదు. ఇది అకాల మరణ ప్రమాదాన్ని పోల్చి చెప్పే ఒక ఆరోగ్య హెచ్చరిక.


అంటే…

స్నేహం ఒక విలాసం కాదు.

మనిషి ఆరోగ్యానికి అవసరమైన సామాజిక పోషకం.

80 ఏళ్ల పరిశోధన చెప్పిన విషయం ఇదే!


డబ్బు సంపాదించాలి.

కెరీర్‌లో ఎదగాలి.

పేరు తెచ్చుకోవాలి.

స్థానం సంపాదించాలి.

ఇవన్నీ జీవితంలో అవసరమే.


కానీ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న Harvard Study of Adult Development మనిషి దీర్ఘకాలిక సంతోషం, ఆరోగ్యంతో మంచి సంబంధాల ప్రాముఖ్యతను పదేపదే చూపించింది.


అంటే చివరికి మనిషి జీవితాన్ని నిలబెట్టేది బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు.

ఎవరితో జీవించాం?

ఎవరిని ప్రేమించాం?

ఎవరికి మనసు విప్పి మాట్లాడాం?

మన కష్టకాలంలో ఎవరు మన పక్కన నిలబడ్డారు?

అవే ముఖ్యమైన ప్రశ్నలు.


ఒకప్పుడు స్నేహం కోసం గంటలు కేటాయించేవాళ్లం…

మన తరం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది.

సాయంత్రం ఇంటి ముందు నాలుగు కుర్చీలు.

ఒకడు టీ తీసుకొస్తాడు.

మరొకడు బిస్కెట్లు తెస్తాడు.

మరొకడు ఏదో రాజకీయ వాదన మొదలుపెడతాడు.

రాత్రి ఎప్పుడైందో తెలియదు.

ఇప్పుడు అదే నలుగురు స్నేహితులు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు.

రోజుకు వంద మెసేజీలు వస్తాయి.

కానీ నాలుగు నెలలుగా ఎవరూ ఒకరిని ఒకరు కలవలేదు.

టెక్నాలజీ మన సంభాషణను పెంచింది.

కానీ మన అనుబంధాన్ని పెంచలేదు.

స్నేహానికి కూడా “మెయింటెనెన్స్” కావాలి

కారు సర్వీసింగ్ చేయాలి.

ఇంటికి పెయింటింగ్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి.

శరీరాన్ని వ్యాయామంతో చూసుకోవాలి.

మరి స్నేహాన్ని?


దానిని మాత్రం “అది అలాగే ఉంటుంది” అని వదిలేస్తాం.


అలా ఉండదు.

ఎప్పుడో కలిసిన స్నేహితుడికి ఒక ఫోన్ చేయాలి.

“ఎలా ఉన్నావు?” అని అడగాలి.

అవసరం లేకపోయినా కలవాలి.

పాత గొడవలు ఉంటే కొన్ని మర్చిపోవాలి.

మన స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు అతని దగ్గరకు వెళ్లాలి.

ఎందుకంటే…

స్నేహం కూడా ఒక మొక్కలాంటిదే.

నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది.

చివరికి మనిషి ఏం మిగుల్చుకుంటాడు?

ఇల్లు ఉండొచ్చు.

డబ్బు ఉండొచ్చు.

పదవి ఉండొచ్చు.

పేరు ఉండొచ్చు.


కానీ జీవితంలో ఒక దశకు వచ్చాక మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటాడు.


అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్‌తో మాట్లాడలేడు.

పదవితో నవ్వలేడు.

ఫాలోవర్లతో కౌగిలించుకోలేడు.

అప్పుడు గుర్తొచ్చేది…

“ఆ రోజుల్లో మనం ఎంత నవ్వుకున్నాం!”

అని చెప్పగలిగే మనుషులే.

అందుకే ఈ “Friendship Recession” కథనం కేవలం అమెరికా గణాంకాల కథ కాదు.

మన ఇళ్లలోకి కూడా నెమ్మదిగా వస్తున్న ఒక సామాజిక మార్పు గురించి హెచ్చరిక!


మన దగ్గరున్న మంచి స్నేహితుడిని కోల్పోయిన తర్వాత కొత్త స్నేహితుడిని సంపాదించడం కష్టం.


అందుకే…

ఈరోజే ఒక స్నేహితుడికి ఫోన్ చేయండి.

ఎటువంటి పని లేకుండా.

ఎటువంటి అవసరం లేకుండా.

కేవలం…

“ఏరా… ఎలా ఉన్నావ్?”

అని అడగండి.

బహుశా ఆ ఒక్క ఫోన్ కాల్ మీ స్నేహితుడికే కాదు…

మీ జీవితానికీ అవసరమై ఉండొచ్చు.

పరిచయాలు జీవితాన్ని నింపవు.

నిజమైన స్నేహాలే నింపుతాయి.

స్నేహితులను సంపాదించండి.

ఉన్న స్నేహాలను కాపాడుకోండి.

ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.

పదవి పోతే మళ్లీ రావచ్చు.


కానీ…

మనసుకు దగ్గరైన ఒక నిజమైన స్నేహితుడు దూరమైతే ఆ ఖాళీని పూరించడం అంత సులభం కాదు.

పెయిను కిల్లరేసి

 పెయిను కిల్లరేసి పిట్టలా తిరిగేస్తె

ముడుకు లరిగి మీరు మూలకెళ్ళు

నమ్ము హోమియోను నయమౌను నిజముగా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్ (మెడ నొప్పి), సయాటికా, నడుం నొప్పి, అలాగే ఇతర నొప్పులకూ పెయిన్ కిల్లర్లూ, పై పూతలు(పెయిన్ బామ్, ఆయింట్ మెంటూ), స్టెరాయిడ్ ఇంజక్షన్లూ వాడేసి, సమస్య తగ్గిపోయిందనుకుని ఆనందంగా తిరిగేస్తే, అది మీ పిచ్చితనమే! ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టిక్కర్ అంటించి, ఏడుపు సౌండు లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లర్ తో సమస్య తగ్గిందనుకోవడం కూడా భ్రమే! క్రమంగా ముడుకులు,కీళ్ళు అరిగిపోయి, పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరుకుంటారు! అంతేగాక తప్పుడు ఇంగ్లీషు మందుల వాడకంతో అల్సర్, కిడ్నీ ట్రబుల్, బి.పి, షుగర్, లివర్ ప్రోబ్లమ్, కేన్సర్ మొదలైన జబ్బులు అదనపు బోనస్ గా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది! కాబట్టి హోమియో మందులు వాడుకుంటే నాలుగు రోజులు సమయం పట్టినా, చక్కగా కీలు సందులో కార్టిలేజ్ తయారై, కీలు సక్రమంగా రిపేరై, సహజంగా తిరగ గలుగుతారు! ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు! 

సకురు అప్పారావూ ఇది నిజంగా నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

గురువారం🌹* *🌷13ఆగష్టు2026🌷* *దృగ్గణిత పంచాంగం*

  


  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹గురువారం🌹*

 *🌷13ఆగష్టు2026🌷*  

  *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : పాడ్యమి* రా 08.41 వరకు ఉపరి *విదియ*

*వారం  : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* ఉ 06.06 ఉపరి *మఖ* రా.తె 04.38 వరకు

*యోగం : వరీయాన్* మ 12.16 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : కింస్తుఘ్న* ఉ 09.50 *బవ* రా 08.41 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు;*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.53*

 అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.38*

*వర్జ్యం    :సా 05.22- 06.52*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.01*

*రాహు కాలం  : మ 01.48- 03.23*

గుళికకాళం      : *ఉ 09.02 - 10.37*

యమగండం    : *ఉ 05.51 - 07.26*

సూర్యరాశి : *కర్కాటకం*                               

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.51- 08.23*

సంగవ కాలం       : *08.23- 10.56*

మధ్యాహ్న కాలం   : *10.56 - 01.28*

అపరాహ్న కాలం  : *మ 01.28-04.01*

*ఆబ్ధికం తిధి       : శ్రావణ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం     : *సా 04.01- 06.34*

ప్రదోష కాలం     : *సా 06.34- 08.49*

రాత్రి కాలం        : *రా 08.49- 11.50*

నిశీధి కాలం       : *రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సౌఖ్యమా... అదెక్కడ?

  సౌఖ్యమా... అదెక్కడ?


జీవితానికి రెండే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం, మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన- ఇలా ఎన్నో మూలాలున్నాయి దానికి. ఉదరపోషణార్థం పనిచేసుకోవడం, ఉద్యోగ వృత్తుల్లో నిమగ్నమవడం సమంజసమే. పదవులకోసం, డబ్బుకోసం, కీర్తికోసం దొడ్డిదారిన పాకులాడటమే మనుగడకు అనర్థమవుతుంది. 


జీవించడం అనేది ఒక కళ. ఆ కళ తెలిసినవాడు సుఖపడతాడు. తెలియనివాడు అగాధంలో పడిపోతాడు. ఈ అనంతకాలంలో మనిషి జీవితకాలం అతిస్వల్పం. వేదాంతపరంగా చెప్పాలంటే జీవితం క్షణభంగురం. ఈ సత్యం తెలిసి కూడా సామాన్యుల నుంచి, మాన్యులవరకూ దేనికోసమో నిత్యం వెంపర్లాడుతూనే ఉంటారు. 


మనిషి ఏడుస్తూ పుట్టాడంటే.. అందర్నీ ఏడిపించడానికి కాదు, ఆనందింప చేయడానికి, నవ్వించడానికి. పాపాలు నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలితం అనుభవించాలన్న సత్యం మనిషి గ్రహించడంలేదు. నూతిలో కప్ప అదే లోకం అనుకున్నట్లు- మనిషి తన భార్య, పిల్లలు బాగుంటే అదే సుఖమనుకుంటున్నాడు. సంఘజీవినని మర్చిపోతున్నాడు. సమాజంతో, గ్రామంతో, రాష్ట్రంతో, దేశంతో ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది. ఎందరో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎన్నెన్నో బాధలూ కష్టాలు పడుతుంటారు. ఆపదల పొదల్లో చిక్కుకుపోయి రోదిస్తున్న వారి వైపు చూడాల్సిన అవసరం మనిషికి లేదా? పరోపకారార్థమిదం శరీరం... అన్న మాట గుర్తుకు రాదా?


సౌఖ్యానికి చిరునామా ఉంది. అది తెలుసుకోవాలి. ధర్మవర్తనలో సుఖముంది. సక్రమార్జనలో సుఖముంది. ప్రేమలో, సేవలో, త్యాగంలో, సంతృప్తిలో సుఖముంది. ప్రతిభను అభినందించి, ప్రోత్సహించడంలో సుఖముంది. మృష్టాన్న భోజనాన్ని కేవలం తానే ఆరగించడం కాదు, పదిమందితో కలిసి పప్పుభోజనం తినడంలో సుఖముంది.


సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకివ్వనన్న అహంకారి దుర్యోధనుడు వెంట ఏం తీసుకుపోయాడు? మనిషి కన్నుమూస్తే ‘అయ్యో, పాపం’ అనిపించుకోవాలి. ‘అమ్మయ్య, శని వదిలింది’ అనిపించుకోకూడదు. అదే మంచి మరణం. ఎంతటి భక్తుడైనా అహంకరిస్తే అంతర్యామి కనికరించడు. గర్వం సర్వం హరించాకగానీ హరి కరిని కాపాడలేదు.


జీవితం ఓ అమూల్య గ్రంథం. దాన్ని చదివే ఆసక్తి ఉన్నవాడు, గ్రహించగలిగినవాడు విజేత అవుతాడు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి. బతికితే సమాజం గౌరవించాలి. మరణిస్తే శత్రువు కూడా కంటతడి పెట్టాలి. అదీ సుఖజీవనమంటే! మనిషి గెలవవచ్చు, గర్వించకూడదు. భయపడవచ్చు, పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కుంగిపోకూడదు. జీవితంలో ఇవన్నీ సహజమే, సహించాలి. పదుగురికి ఉపయోగపడుతూ నడిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుంది.

దక్షిణామూర్తి

                *దక్షిణామూర్తి*

               ➖➖➖✍️

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించి నప్పుడు  ...


ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం...


బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు... ‘బ్రహ్మ జ్ఞానం’ కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు.


అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.

ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.


ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని!


గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.


అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.


స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. 


ఉత్తర భాగాన(అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు.


మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే.*


అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త.


ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు.


శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.


దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.


మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.                 ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.


దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.


విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.


ఆ రూపాలు వరుసగా....


శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.


ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.


పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.


సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షమునకి అధిష్టానం అయి ఉంటాడు.

పద్దెనిమిది పురాణాలు

  “పద్దెనిమిది పురాణాలు 


1. మత్స్య పురాణం, 

2. మార్కండేయ పురాణం, 

3. భవిష్య పురాణం, 

4. భాగవత పురాణం,

5. బ్రహ్మాండ పురాణం, 

6. బ్రహ్మ వైవర్త పురాణం, 

7. బ్రహ్మ పురాణం, 

8. వామన పురాణం,

9. వరాహ పురాణం, 

10. విష్ణు పురాణం, 

11. వాయు పురాణం, 

12. అగ్ని పురాణం, 

13. నారదీయ పురాణం, 

14. పద్మ పురాణం, 

15. లింగ పురాణం, 

16. గరుడ పురాణం, 

17. కూర్మ పురాణం, 

18. స్కంద పురాణం” 

[పద్దెనిమిది పురాణాలను సులభంగా గుర్తు పెట్టుకోవడానికి ఈ శ్లోకం…


”మ” ద్వయం ”భ” ద్వయం చైవ “బ్ర” త్రయం “వ” చతుష్టయం।

“అ” “నా” “ప” “లిం” “గ” “కూ” “స్కా” ని పురాణాని ప్రచక్షతే॥


‘మ’ ద్వయం – ‘మ’ తో రెండు: మత్స్య, మార్కండేయ.


‘భ’ ద్వయం – ‘భ’ తో రెండు: భవిష్య, భాగవతం 


’బ్ర’ త్రయం – ‘బ్ర’ తో మూడు: 

బ్రహ్మ, బ్రహ్మాండ, బ్రహ్మవైవర్త


‘వ’చతుష్టయం – ‘వ’తో నాలుగు: వాయు, విష్ణు, వామన, వరాహ.


‘అ’ ‘నా’ ‘ప’ ‘లిం’ ‘గ’ ‘కూ’ ‘స్కా’ – ఒక్కొక్కటి అగ్ని, నారదీయ, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కాంద పురాణాలు]

పంచాంగం 13.08.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 13.08.2026 Thursday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష ప్రతిపత్తి తిథి బృహస్పతి వాసర ఆశ్రేష తదుపరి మఘ నక్షత్రం వరియాన్ యోగః కింస్తుఘ్నం తదుపరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: పాడ్యమి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।


ప్రతిపదార్థ:



యః — ఎవరైతే; మాం — నన్ను; పశ్యతి — చూచేదరో; సర్వత్ర — అంతటా; సర్వం — సర్వమూ; చ — మరియు; మయి — నా యందు; పశ్యతి — చూచేదరో; తస్య — అతనికి; అహం — నేను; న ప్రణశ్యామి — దూరమవను; సః — ఆ వ్యక్తి; చ — మరియు; మే — నాకు; న ప్రణశ్యతి — దూరమవడు.



తాత్పర్యము: 


ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, నేను వారికి దూరమవను, వారు నాకు దూరం కారు.



వివరణ:


భగవంతుడిని వీడటం అంటే మనస్సుని అయన నుండి దూరంగా తిరగనీయటం, మరియు ఆయనతో ఉండటం అంటే మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి ఒక సులువైన మార్గం ఏమిటంటే ప్రతి విషయాన్ని ఆయన సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధపెట్టారు అనుకుందాం. మనస్సు యొక్క స్వభావం ఏమిటంటే, మనకు హాని చేసిన వారి పట్ల, అది, ద్వేషము, కోపము వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ, అలా కానిస్తే, మన మనస్సు భగవత్ స్పృహ నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం ఆగిపోతుంది. దానికి బదులుగా, ఆ వ్యక్తిలోనే కూర్చొని ఉన్న పరమాత్మను దర్శిస్తే, మనం ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. కానీ, నేను ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను.’ ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని ప్రతికూల/నకారాత్మక ఆలోచనలు బాధించకుండా కాపాడుకోవచ్చు.


అదే విధంగా, మిత్రునితో కానీ లేదా బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు, మనస్సు భగవంతుని నుండి దూరమైపోతుంది. ఇప్పుడు, మనం మనస్సుకు ఆ మనిషిలో భగవంతుడిని దర్శించే శిక్షణ ఇస్తే, ప్రతిసారీ మనస్సు వారి మీదకు పోయినప్పుడు, మనం ఇలా అనుకుంటాము, ‘శ్రీ కృష్ణుడు ఈ వ్యక్తిలో ఉన్నాడు, అందుకే నేను వారి పట్ల ఆకర్షితుడను అవుతున్నాను’ అని. ఈ ప్రకారంగా, మనస్సు పరమాత్మ పట్ల భక్తిభావనలు నిలుపుకోవటం కొనసాగిస్తూనే ఉంటుంది.


కొన్నిసార్లు, మనస్సు పాత విషయాలపై చింతిస్తూ (శోకిస్తూ) ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది, ఎందుకంటే ఈ శోకము మనస్సుని భూతకాలము లోనికి తీస్కువెళ్ళటం వలన వర్తమాన కాలంలో చేయవలసిన హరి, గురు చింతన ఆగిపోతుంది. ఇప్పుడు, ఆయా సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు, మనము ఇలా అనుకుంటాము, ‘భగవంతుడు, కావాలనే, నా కోసం, నేను వైరాగ్యం పెంపొందిచుకోవాలని, కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేసాడు, ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే, తన కృపచేత నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు.’ ఈ విధంగా ఆలోచించటం వల్ల మనం భక్తి యుక్త ధ్యాసను కాపాడుకోవచ్చును. నారద మహర్షి ఇలా అంటున్నాడు:


లోక హానౌ చింతా న కార్యా నివేదితాత్మ లోక వేదత్వాత్


(నారద భక్తి దర్శన్, 61వ సూత్రం)


‘లోకంలో ప్రతికూలత/వ్యతిరేక పరిస్థితి ఎదురైనప్పుడు, దాని గూర్చి శోకించకు, చింతించకు. దానిలో భగవత్ అనుగ్రహాన్ని గుర్తించుము.’ మన స్వార్థ ప్రయోజనం ఎందులో ఉందంటే, ఎదో రకంగా మనస్సుని భగవంతుని యందే నిలపటం లోనే, మరియు దీనికి ఒక సులువైన ఉపాయం ఏమిటంటే ప్రతిదానిలో, ప్రతివ్యక్తిలో భగవంతున్ని చూడటమే. ఇది అభ్యాస స్థాయి, ఇది, ఈ శ్లోకంలో చెప్పబడిన పరిపూర్ణ స్థాయి దిశగా నెమ్మదిగా తీసుకువెళుతుంది, ఇక అప్పుడు మనం భగవంతుడికి దూరంకాము, మరియు భగవంతుడు మనకు దూరం కాడు.

13-08-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

13-08-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.      

---------------------------------------


వృషభం


సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి.

---------------------------------------


మిధునం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. 

---------------------------------------


కర్కాటకం


ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


సింహం


ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటాబయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక చికాకులు కలుగుతాయి. ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార,ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి.

---------------------------------------


వృశ్చికం


గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పని చేసి అధికారుల అనుగ్రహం పొందుతారు.

---------------------------------------


ధనస్సు


కీలక వ్యవహారాలు మందగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సోదరులతో అకారణ కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


మకరం


అనుకున్న పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి చేసే ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ప్రభుత్వ అధికారులతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక మార్పులు కలుగుతాయి. 

---------------------------------------


కుంభం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


మీనం

 

ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు చోటుచేసుకుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.  

---------------------------------------

12, ఆగస్టు 2026, బుధవారం

గురువారం🌹* *🌷13ఆగష్టు2026🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹గురువారం🌹*

 *🌷13ఆగష్టు2026🌷*  

  *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : పాడ్యమి* రా 08.41 వరకు ఉపరి *విదియ*

*వారం  : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* ఉ 06.06 ఉపరి *మఖ* రా.తె 04.38 వరకు

*యోగం : వరీయాన్* మ 12.16 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : కింస్తుఘ్న* ఉ 09.50 *బవ* రా 08.41 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు;*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.53*

 అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.38*

*వర్జ్యం    :సా 05.22- 06.52*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.01*

*రాహు కాలం  : మ 01.48- 03.23*

గుళికకాళం      : *ఉ 09.02 - 10.37*

యమగండం    : *ఉ 05.51 - 07.26*

సూర్యరాశి : *కర్కాటకం*                               

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.51- 08.23*

సంగవ కాలం       : *08.23- 10.56*

మధ్యాహ్న కాలం   : *10.56 - 01.28*

అపరాహ్న కాలం  : *మ 01.28-04.01*

*ఆబ్ధికం తిధి       : శ్రావణ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం     : *సా 04.01- 06.34*

ప్రదోష కాలం     : *సా 06.34- 08.49*

రాత్రి కాలం        : *రా 08.49- 11.50*

నిశీధి కాలం       : *రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సూక్తి

 🌸సూక్తి


మహావీరుడైన అర్జునుడు భారత యుద్ధంలో సైంధవుణ్ణి చంపుతానని గొప్ప ప్రతిజ్ఞ చేసినాడు సైంధవుని చంపటం అంటే మామూలు మాట కాదు (ప్రొద్దుగుంకినట్టు చెయ్యాలిఆయన శిరస్సు భూమి మీద పడకూడదు ఆ శిరస్సును బాణాలతో కొట్టి వాళ్ళ తండ్రి ఒడిలో పడేటట్టు చేయాలి) అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని శిబిరమునకు వచ్చి అర్జునా ఒక్కరోజులోసైంధవుని చంపుట సాధ్యమయ్యే పనేనా గొప్ప ప్రతిజ్ఞ చేసినావుఅని సరే నీవు హాయిగా విశ్రమించు అని చెప్పి తన శిబిరమునకు పోయి ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు శ్రీకృష్ణ భక్తుడైన

అర్జునుడు హాయిగా భగవంతుని మీద భారం వేసి ఆందోళన లేకుండా ఉన్నాడు అలాగే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ప్రయత్నం చేస్తూ మనం భగవంతుని ప్రార్థిస్తూ నీవే దిక్కు స్వామి అని ఆయన మీద భారం వేస్తే ఆయనేతప్పక మనలను కాపాడుతాడు 

స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యా శ్చిన్తయన్తోమాం శ్లోకంలో నా మీద భారవేస్తే వారి యోగక్షేమాలునేనే చూసుకుంటాను అని అంటాడుకదా

జయలక్ష్మి

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 12.08.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి సౌమ్య వాసర పుష్యమి నక్షత్రం వ్యతిపాత యోగః చతుష్పాత్ తదుపరి నాగవం కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: అమావాస్య 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।


ప్రతిపదార్థ:



 సర్వ-భూత-స్థం — సర్వ భూతముల యందు స్థితుడై ఉండి; ఆత్మానం — పరమాత్మ; సర్వ — సమస్త; భూతాని — ప్రాణులు; చ — మరియు; ఆత్మని — భగవంతుని యందు; ఈక్షతే — దర్శించును; యోగ-యుక్త-ఆత్మా — అంతఃకరణలో భగవంతుని తోనే ఏకమై; సర్వత్ర — అన్ని చోట్లా; సమ-దర్శనః — సమత్వ దృష్టి.



తాత్పర్యము: 



నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సమత్వ దృష్టితో సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.



వివరణ:


భారతదేశంలో, దీపావళి పండుగ సమయంలో, పంచదార బిళ్ళలను వేర్వేరు రూపాల్లో తయారుచేసి దుకాణాల్లో అమ్ముతారు - కార్లు, విమానాలు, అబ్బాయిలు, అమ్మాయిలు, జంతువులు, బంతులు, మరియు టోపీలు - మొదలైన ఆకృతులలో. పిల్లలు తమ తల్లిదండ్రులతో కారు కావాలని, ఏనుగు కావాలని, మారాము చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల అమాయకత్వానికి నవ్వుకుంటారు, వారికి తెలుసు, అవన్నీ ఒకే పంచదార నుండి తయారయ్యాయని, అవన్నీ ఒకే రకం తీపిగా ఉంటాయని.


అదే రీతిగా, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో, తన వేర్వేరు శక్తుల రూపంలో ఉన్నది స్వయంగా భగవంతుడే.


ఏక దేశస్థితస్యాగ్నిర్జ్యోత్స్నా విస్తారిణీ యథా

పరస్య బ్రహ్మణః శక్తిస్తథేదమఖిలం జగత్ (నారద పంచరాత్రం)


‘ఎలాగైతే సూర్యుడు ఒకేచోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నిటియందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు.’ పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదాన్నీ భగవత్ సంబంధముగా చూస్తారు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 45*


*అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం*

*నిరస్యన్కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలమ్ ।*

*తులాకోటిద్వందం దధదపి చ గచ్ఛన్నతులతాం*

*గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే ॥*


*భావము :*


*మాతా! నీ పాదములపై నిత్యము అలంకరింపబడే లత్తుక నిన్ను శరణన్న మా పాప పంకిలమును తొలగిస్తుంది. అందియములను ధరించిన సాటిలేని నీ పదములు ఈ జగత్తులో ఎవరికీ లొంగక అన్నిటికీ అతీతముగా ఉంటాయి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః*🙏🙏🙏

11, ఆగస్టు 2026, మంగళవారం

12ఆగష్టు2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷12ఆగష్టు2026🪷*     

  *దృగ్గణిత పంచాంగం* 

                 

          *ఈనాటి పర్వం*

      *గురుమౌఢ్యత్యాగః*    

             *దర్శశ్రాద్ధ*

         *పితృతర్పణం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం*

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం -  బహుళ పక్షం* 


*తిథి       : అమావాస్య* రా 11.06 ఉపరి *శ్రావణమాసారంభః*

*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : పుష్యమి* ఉ 07.59 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం  : వ్యతీపాత* మ 03.26 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం   : చతుష్పాద* మ 12.27 *నాగ* రా 11.06 ఉపరి *కింస్తుఘ్న*

*సాధారణ శుభ సమయాలు*

             *-ఈరోజు లేవు-*

అమృత కాలం :*రా 04.38-06.06తె*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం   :రా 07.47 - 09.15*

*దుర్ముహూర్తం  :ప11.47- 12.38*

*రాహు కాలం   :మ 12.12- 01.48*

గుళికకాళం      : *మ 10.37 - 12.12*

యమగండం    : *ఉ 07.26 - 09.02*

సూర్యరాశి : *కర్కాటకం*                      

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.58*

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.51- 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    : *10.56 - 01.29*

అపరాహ్న కాలం  :*మ 01.29-04.01*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ అమావాస్య*

సాయంకాలం     :*సా 04.01- 06.34*

ప్రదోష కాలం       :*సా 06.34-08.49*

రాత్రి కాలం         :*రా 08.49- 11.50*

నిశీధి కాలం        :*రా 11.50- 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 18/42*


*శ్రీమద్భాగవతం - 18/42*


*శ్రీ నరసింహ ఆవిర్భావం, హిరణ్యకశిప వధ & నరసింహ స్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

నిన్నటి రోజున మహాభక్తుడైన ప్రహ్లాదుని జననం, నవవిధ భక్తి మార్గాలు మరియు హిరణ్యకశిపుడు చేసిన ఘోర రాక్షసృత్యాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు **సప్తమ స్కంధం – అధ్యాయాలు 8 నుండి 10** ఆధారంగా శ్రీమద్భాగవతంలోని పరమ పవిత్రమైన ఘట్టం — **శ్రీ నరసింహావిర్భావం, రౌద్ర రూపంతో హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని నరసింహ స్తుతి మరియు స్వామి ప్రశాంతత** గురించిన  వివరాలుతెలుసుకుందాం.


1. "ఎక్కడున్నాడు నీ హరి?" – హిరణ్యకశిపుని గర్వాంధకారం (7వ స్కంధం – 8వ అధ్యాయం)


ప్రహ్లాదుడిని చంపడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో హిరణ్యకశిపుడు తీవ్రమైన క్రోధంతో రగిలిపోయాడు. 


గురువులు మరొక్కసారి ప్రయత్నం చేస్తాం అని గురుకులానికి తీసుకుపోతే అక్కడ ఉన్న తోటి విద్యార్థులకు కూడా హరి భక్తి మహిమ బోధించాడు ప్రహ్లాదుడు.ఆ విషయాన్ని గురువులు చెప్పగా విన్న హిరణ్య కశిపుడి కోపం కట్టలు తెంచుకుని ఇక స్వయంగా తానే కుమారుని సంహరించాలి అని నిర్ణయం తీసుకునీ ప్రహ్లాదుడిని తన రాజసభలోని ఒక స్వర్ణ స్తంభం ముందుకు తీసుకువచ్చి, ఖడ్గాన్ని దూసి గర్జించాడు:


 "రాక్షసాధమా! నా మాట వినకుండా, నిరంతరం ఆ 'హరి' బలంతోనే నేను బతుకుతున్నానని దంబాలు పలుకుతున్నావు. సమస్త లోకాలకు నేనే ఈశ్వరుడిని! నన్ను మించిన వాడు ఎవడు లేడు, ఎడి నీ హరి ఎక్కడున్నాడు? ఈ సభలో ఉన్నాడా? **ఈ స్తంభంలో ఉన్నాడా?** చూపించు.. లేదా ఈ రోజే నీ తలను నరికి ఆ హరి వద్దకు పంపుతాను!"


ప్రహ్లాదుడు ప్రశాంతంగా, నిశ్చల భక్తితో చేతులు జోడించి ఇలా అన్నాడు:


ఇందుఁ గలఁ డందు లేఁ డని, సందేహము వలదు 

చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన, 

నందందే కలఁడు దానవాగ్రణి వింటే 


 "తండ్రీ! ఆయన ఎక్కడో లేడు. సర్వాంతర్యామి అయిన శ్రీహరి అణువణువునా ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ సమస్త విశ్వంలో ఉన్నాడు... **సాక్షాత్తు నీవు చూపిస్తున్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు!**"నేను అన్ని లోకాలు జయించాను అంటున్నావు కానీ పది ఇంద్రియాలు అనే బందిపోటు దొంగల చేత నీవు ఈడ్చబడుతూ అసలు సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నావు. వీటిని అదుపు చేసినవారికి ఆయన లేని చోటు లేదు అన్నాడు.


 2. *స్తంభ విస్ఫోటనం & లక్ష్మీనరసింహ ఆవిర్భావం* (8వ అధ్యాయం)


ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు అహంకారంతో నవ్వి, "అయితే ఈ స్తంభంలో నీ హరిని చూపించు" అంటూ తన చేతిలోని గదతో **రాతి స్తంభాన్ని గట్టిగా చరిచాడు!**


ఆ క్షణంలోనే... సకల బ్రహ్మాండాలు పగిలిపోతున్నాయా అన్నట్లు ఘోరమైన బ్రహ్మాండ భాండ విస్ఫోటనం (భయంకర శబ్దం) సంభవించింది. దేవతలు, దిక్పాలకులు భయపడ్డారు. స్తంభం మధ్య నుండి ఫెలో ఫెల ఫట ఫట శబ్దాలు వడ్డాయి**సాక్షాత్తు శ్రీమహావిష్ణువు "శ్రీ నరసింహ" రూపాంలో ఆవిర్భవించాడు!**


భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును, తన సర్వవ్యాపకత్వమును నిరూపించడానికి  ఆ స్తంభమునుండియే ఒక విచిత్రరూపముతో ప్రకటితుడు అయ్యెను.  


భగవంతుడు అయిన శ్రీ నృసింహస్వామి భగవాన్ కీ జై!! 


* **రూప విశేషం:** ఆయన నరుడూ కాడు, మృగమూ కాడు! సింహం ముఖం, మానవ శరీరం; భయంకరమైన జ్వాలల వంటి కళ్లు, ఆకాశాన్ని తాకే జటాజూటం, పర్వతాల వంటి దంష్ట్రలు (కోరలు), వేల చేతులలో దివ్యా ఆయుధాలు!


 3. హిరణ్యకశిపుని విచిత్ర సంహారం (8వ అధ్యాయం)


హిరణ్యకశిపుడు ఖడ్గం ధరించి నరసింహస్వామిపైకి లంఘించాడు. స్వామి ఆయనతో కొద్దిసేపు లీలగా యుద్ధం చేసి, సూర్యాస్తమయ సమయం (సంధ్యా సమయం) ఆసన్నమవ్వగానే రాక్షసుడిని పట్టుకున్నాడు.


బ్రహ్మదేవుడు ఇచ్చిన సమస్త వరాలను ఒక్కటి కూడా ఉల్లంఘించకుండా స్వామి సంహారాన్ని పూర్తి చేశాడు:


1. **నరుడు కాడు, మృగం కాడు:** *నరసింహ రూపం (సగం నరుడు, సగం మృగం).*


2. **ఇంట కాడు, బయట కాడు:** *సింహాసన ద్వారం (గడప) మీద కూచుని*


3. **పగలు కాడు, రాత్రి కాడు:** *సంధ్యా సమయంలో.*


4. **భూమిపై కాడు, ఆకాశంలో కాడు:** *తన తొడలపై (తొడలపైన) కూర్చోబెట్టుకున్నాడు.*


5. **దేవ, దానవ, మానవ ఆయుధాలు కావు:** *తన వాడియైన గోళ్లతో (నఖములతో).*(జీవం ఉన్నవి కాదు జీవం లేనివి కాదు)


6. **బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణీ కాడు:** *స్వయంభూ అయిన పరమాత్మ.*


ఇలా నరసింహస్వామి హిరణ్యకశిపుని ఉదరాన్ని తన వాడియైన గోళ్లతో చీల్చి, రాక్షసుడి ప్రేగులను హారంగా ధరించి సంహరించాడు. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు!


4. *రౌద్ర నరసింహుని ప్రశాంతత & ప్రహ్లాద స్తుతి* (9వ అధ్యాయం)


రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శమించలేదు. ఆయన రౌద్ర జ్వాలలకు దేవతలు, బ్రహ్మదేవుడు, పరమశివుడు, లక్ష్మీదేవి సహితం దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.సిద్ధులు, యక్షులు దేవతలు, ఋషులు అందరూ స్వామిని స్తుతించారు. అయినా శాంతించలేదు


అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడిని చూసి "పుత్రా! స్వామి కోపాన్ని శాంతపరచగల సమర్థుడివి నువ్వే" అని చెప్పాడు.


* **ప్రహ్లాదుని శరణాగతి:** ఐదేళ్ల పసిబాలుడైన ప్రహ్లాదుడు ఏమాత్రం భయం లేకుండా ఉగ్ర నరసింహుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశాడు.


* **వాత్సల్యం:** భక్తుడిని చూడగానే నరసింహస్వామి హృదయం ద్రవించింది. రౌద్రం నశించి వాత్సల్యం ఆవహించింది. స్వామి తన దివ్యమైన హస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, అమృతతుల్యంగా నిమిరాడు.


* **దివ్య స్తుతి:** స్వామి స్పర్శతో ప్రహ్లాదుడు మైమరచి, పరమ పవిత్రమైన నరసింహ స్తుతి చేశాడు:(ప్రహ్లాదుడు చేసిన స్తుతి ఎంతో మహత్తరమైనది)


ఆ స్తుతి కి సంతసించి స్వామి అన్నాడు

ప్రహ్లాదా! నీవు పరమకల్యాణ స్వరూపుడవు. నీకు శుభమగుగాక. నీకు ప్రసన్నుడనైతిని. అసురోత్తమా! నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను.


ఆయుష్మంతుడా! నన్ను ప్రసన్నుని చేసికొనని వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము ఐనంతనే ప్రాణుల హృదయముల యందు ఎట్టి పరితాపములు ఉండవు.నేను సమస్తమనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులయన్నింటి ద్వారా నన్నుప్రసన్నుని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.


జనులు ఎక్కువగా ఆశించునట్టి | వరములద్వారా నృసింహ భగవానుడు అసురోత్తముడైన ప్రహ్లాదుని ప్రలోభపెట్టెను. ఐన, భగవంతునియందు ఏకాంతమగు భక్తి కలిగినట్టి ఆ భక్త శిరోమణి ఎట్టి వరములను కోరుకొనలేదు.


స్వామీ! నీవు వరములను అనుగ్రహించుటలో శ్రేష్ఠుడవు. నేను కోరుకొనిన వరమును ప్రసాదింపదలచినచో, నా హృదయమున ఎట్టి కోరిక అంకురింపకుండ చేయుము. ఇదియే నా కోరిక.


 హృదయమునందు ఏదేని ఒక కోరిక కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, లజ్జ, సంపదలు, తేజస్సు, స్మృతి, సత్యము, మొదలగునవి అన్నియును నష్టమైపోవును.


"స్వామీ! కులం, రూపం, ధనం, తపస్సు, విద్యలు భగవంతుని ప్రసన్నం చేసుకోలేవు. కేవలం **నిష్కల్మషమైన భక్తి** మాత్రమే నిన్ను కట్టిపడేస్తుంది.


నా తండ్రి చేసిన సమస్త పాపాలను క్షమించి ఆయనకు ఉత్తమ లోకాలను ప్రసాదించు!"ఇదియే నా ప్రార్థన అన్నాడు.


5. ప్రహ్లాదుని పట్టాభిషేకం & శ్రీహరి ఆశీర్వాదం (10వ అధ్యాయం)


ప్రహ్లాదుని నిష్కామ భక్తికి, ఉదార గుణానికి ప్రసన్నుడైన నరసింహస్వామి: "ప్రహ్లాదా! నీ వంటి భక్తుడు జన్మించిన వంశంలో ఏడు తరాల పూర్వీకులు, ఏడు తరాల భావితరాలు పావనమవుతారు. నీ తండ్రి ముక్తుడయ్యాడు" అని వరమిచ్చాడు.


బ్రహ్మదేవుడు, మునుల సమక్షంలో ప్రహ్లాదునికి రాక్షస రాజ్యానికి పట్టాభిషేకం చేశారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ప్రహ్లాదుడు సుదీర్ఘకాలం పరమ భాగవతోత్తముడిగా రాజ్యాన్ని పాలించి, చివరికి భగవత్సన్నిధిని చేరుకున్నాడు.


పరమపురుషుడైన పరమాత్మయొక్క ఈ నృసింహావతారగాథయు, హిరణ్యకశిపుని యొక్క, ఆయన సేనాపతుల యొక్క వధలును, భక్తశిరోమణియైన ప్రహ్లాదుని పావన చరితము ఏకాగ్రచిత్తముతో వినినవారు, పఠించినవారు భయరహితమైన పరంధామమును పొందుదురు.


నరసింహస్వామి ఉగ్ర రూపం శాంతించాక, ప్రహ్లాదునికి రాజ్యాభిషేకం జరుగాక. అనేక ధర్మ సంబంద విషయాలను ధర్మరాజు నారదుని అడిగాడు(ప్రహ్లాద చరిత్ర ధర్మ రాజు నారద సంవాదం ద్వారా శిశు పాలుడు మరణించిన సందర్భంగా వస్తుంది)


ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారద మహర్షి శ్రీమద్భాగవతం సప్తమ స్కంధం (10-15 అధ్యాయాలు) లో మానవ జీవన మార్గాన్ని స్పష్టం చేశారు. అందులో **5 ముఖ్యమైన సందేశాలు**:


1️⃣ **పుట్టుక కాదు... గుణమే ముఖ్యం (వర్ణ ధర్మాలు):**

మనిషి ప్రాధాన్యత పుట్టుకతో కాదు, అతను పాటించే సత్యం, అహింస, శౌచం, ఇంద్రియ నిగ్రహం వంటి గుణాలతోనే నిర్ణయించబడుతుంది. ఎవరైతే స్వధర్మం ఆచరిస్తారో వారే ఈశ్వర అనుగ్రహం పొందుతారు.

(ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టినా పరమ భాగవతుడయ్యాడు.)


2️⃣ **ఎక్కడైనా భగవంతుణ్ణి చేరవచ్చు (గృహస్థ ధర్మం):**

రాజ్య పాలన చేస్తూ, గృహస్థుడిగా ఉంటూనే ప్రహ్లాదుడు మొదలైన ఎందరో రాజులు ముక్తి పొందారు. సంసారాన్ని వదిలేయాల్సిన పనిలేదు; చేసే ప్రతి పనిని భగవదర్పణంగా చేస్తే గృహస్థాశ్రమమే ముక్తి మార్గమవుతుంది.


3️⃣ **చిన్న ప్రాణి పట్ల కూడా దయ (అజగర వ్రతం):**

అడవిలో కొండచిలువలా ప్రశాంతంగా ఉండే ఒక అవధూత కథ(దత్తాత్రేయ సంవాదం)ద్వారా — "ఎంత లభించినా తృప్తిగా ఉండటం, ఇంట్లో ఉండే చిన్న క్రిమి కీటకాల పట్ల కూడా దయ కలిగి ఉండటం" నేర్పించారు.


4️⃣ **విద్య అంతరార్థం ఇంద్రియ నిగ్రహమే (బ్రహ్మచర్యం):**

నిజమైన చదువు అంటే విజ్ఞానంతో పాటు మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే.

(రాక్షస గురువులు ఎంత చెడు నేర్పించినా ప్రహ్లాదుడు మంచి వైపే నిలబడ్డాడు.)


5️⃣ **నీ ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు:**

ఆత్మారాముడై నిష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము, పెక్కు కోరికలతో లోభియై ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు. నీలోనే నీతోనే ఈశ్వరుడు అనుక్షణం ఉన్నాడు.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **సర్వాంతర్యామి తత్త్వం:** భగవంతుడు అణువణువునా ఉన్నాడనే ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిలబెట్టడానికే స్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడు.


2. **అధర్మ నాశనం - భక్త రక్షణ:** భగవంతుని ఉగ్రరూపం అధర్మాత్ములకే భయంకరం; నిశ్చల భక్తునికి ఆ రూపామే అత్యంత దయామయం, కరుణామయం!


3. **భక్తికి వయస్సు లేదు:** కులం, ధనం, వయస్సులతో సంబంధం లేదు... కేవలం శరణాగతి, నిస్వార్థ భక్తి మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి.


పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా ధర్మం తప్పక, నిష్కామ భక్తితో జీవిస్తే భగవంతుని అనుగ్రహం మనకూ లభిస్తుంది!


.....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

భోజ కాళిదాస కథ

 భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ,కాళిదాసు కవిత్వ మహాత్యాన్నీ ప్రశంసిస్తూ చెప్పేవి.కొన్ని కథల లో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.


   దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారనీ విన్నాడు. దుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో 

దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ 

రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.

సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి పొర్ణమి నాడు తను 

రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి ఈ ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు. 

గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,కాళిదాసు కూ నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింకా కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది.యిదంతా చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ 

ఏమి తెలుస్తాయి?మీరే ఏదైనా మంచి వర్ణన చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను.

 

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన 

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 


అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.

చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.

(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా 

వేశానో అన్నాడు.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం

'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు యే 

భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

తను పప్పులో కాలేశాడు.వీడే తన కవిత్వం లో తప్పులు చూపిస్తున్నాడే అని కొంత ఆందోళన పెరిగింది.

పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు.ఇది అద్భుతమైన ఊహండీ ఏ భాసుడో

సౌమిల్లుడో చెప్పాల్సినంత గొప్ప శ్లోకం.నాకు తెలుసు మీరు కావాలనే తప్పు చెప్పారని. ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.

మీ శ్లోకం లో 'శృంగీ' అన్న దానికి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.దుర్యోధన కవి కంగారు పడ్డాడు. ఆ చలిలో కూడా చెమట పట్టిందిఅయినా పైకి బింకంగా, .కవిత్వం చెప్పడం, 

శ్లోకం పూర్తి చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీమా కాళిదాసు గారి గొడ్ల కాపరి దగ్గర ఇలాంటి శ్లోకాలు పూరించటం నేను రెండు మూడు రోజులు నేర్చుకున్నాను.వాడి శైలి కొంచెం అనుకరించి ఈ శ్లోకం నేను పూరిస్తాను చూడండి. కాళిదాసు గారు పండితులతో ముచ్చటిస్తూ వుంటే విని నాకూ కొంచెం శ్లోకాలు యెలా పూరించాలో అబ్బింది లెండి. ఈ శ్లోకం మిగతా రెండు పాదాలూ వాడైతే బహుశా యిలా పూరిస్తాడు. 

'పరిణిత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ

దిగాపి ఘన కపోతీ హుంకృతై: క్రందతీవః అంటాడు.


మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ 

చెప్తే సరిపోతుంది కదా! అని చెప్పాను .పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'

అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీవ' అంటే పక్షుల పెద్ద పెద్ద అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.

చరమగిరి కురంగీ తుండ కండూయ నేన

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 

పరిణిత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ 

దిగపి ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః

పడమటి కొండ అనే ఆడ లేడి చంద్రుడిలో వుండే హరిణాన్ని తనముట్టెతో దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.యిక తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి. 

దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.తనకు రాజాస్థానం లోపరాభవం తప్పదని 

భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను నిలువ లేనని పించి 

అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.

కాళిదాసు

 ' మాణిక్యవీణా ముపలాలయంతీం'

మదాలసాం మంజుల వాగ్విలాసాం 

మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం 

మాతంగ కన్యాం మనసా స్మరామి' 

అంటూ మునుపెన్న డో తనే రచించిన శ్లోకాలతో కాళీ మాతను స్తుతించు కుంటూ ఇల్లు చేరాడు.

                                                       స్వస్తి

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।



ప్రతిపదార్థ:



యుంజన్ — ఏకమై (ఆత్మ భగవంతునితో); ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానాం — ఆత్మ; యోగీ — ఓ యోగి; విగత — మిముక్తి నొంది; కల్మషః — పాపములు; సుఖేన — సునాయాసముగా; బ్రహ్మ-సంస్పర్శమ్ — నిత్యము పరమాత్మతో ఉండి; అత్యంతం — అత్యున్నతమైన; సుఖమ్ — ఆనందము; అశ్నుతే — పొందును.

 


తాత్పర్యము: 


స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.



వివరణ:


ఆనందము అనేదాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:


సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసం

తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయాం


(భాగవతం 11.25.29)


తామసిక ఆనందం : మాదకద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర, మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం, ఇది.


రాజసిక ఆనందం : మనస్సు మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం, ఇది.


సాత్త్విక ఆనందం : కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన, మరియు మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం, ఇది. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం ఈ కోవకు చెందినదే.


నిర్గుణ ఆనందం : ఇది భగవంతుని దివ్య ఆనందము, ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనినే ఆయన అనంతమైన ఆనందము అని 5.21వ శ్లోకంలో మరియు సర్వోత్కృష్ట ఆనందము అని 6.21వ శ్లోకంలో అన్నాడు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 44*


*గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృతజగ-*

*త్పరిత్రాణౌ శోణౌ మునిహృదయలీలైకనిపుణౌ ।*

*నఖైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ-*

*గ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే ॥*


*భావము :*


*అమ్మా! నీ పాదములను వర్ణించడం ఆదిశేషునకైనా తరమా! అజ్ఞానమును పారద్రోలేవీ, జగద్రక్షణములు, యోగుల హృదయములలో నివసించేవి, సమస్త వేదసారములైనవి, సాంసారిక బాధలను తొలగించేవి అయిన నీ దివ్య పాదములను నిరంతరము ధ్యానిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

10, ఆగస్టు 2026, సోమవారం

వేపచెట్టులోని ఔషధ గుణాలు - imp

 వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

   

. మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.

 

* ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.

 

* వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .

 

* వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.

 

* వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .

 

* ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .

 

* వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.


 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .


 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.


 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.

 

* చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .

 

* వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.

 

* వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.

 

* లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.

 

* వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .

 

* వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.


 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .

 

* వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.

 

* పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.

 

* వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.


 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.

 

* వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.

 

* నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.


 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.

  

           

పంచాంగం 10.08.2026 Monday,

 ఈ రోజు పంచాంగం 10.08.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష ద్వాదశి తదుపరి త్రయోదశి తిథి ఇందు వాసర ఆర్ద్ర నక్షత్రం వజ్ర యోగః తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: త్రయోదశి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీతభగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రశాంతమనసం హ్యేనం యోగినం సుఖముత్తమమ్ ।

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషమ్ ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రశాంత — ప్రశాంతమైన; మనసం — మనస్సు; హి — వాస్తవముగా; ఏనం — ఇది; యోగినం — యోగి; సుఖం ఉత్తమమ్ — అత్యున్నతమైన ఆనందము; ఉపైతి — పొందును; శాంత-రజసం — ఎవరి వ్యాకులతలు/ఉద్రేకాలు తగ్గిపోయినవో; బ్రహ్మ-భూతమ్ — భగవత్ ప్రాప్తి నొంది; అకల్మషమ్ — పాప రహితుడై.



తాత్పర్యము: 


మనస్సు ప్రశాంతంగా ఉన్నవాడు, ఆవేశ-ఉద్వేగాలు శాంతించినవాడు, పాపరహితుడు, మరియు అన్నిటినీ భగవత్ సంబంధంగా చూసేవాడు – అయిన యోగికి అత్యున్నత అలౌకిక ఆనందం లభిస్తుంది.


వివరణ:


మనస్సుని ఇంద్రియ విషయముల నుండి ఉపసంహారం చేసి, భగవంతుని యందే స్థితం చేయటానికి అభ్యాసం చేయటాన్ని సాధించిన యోగికి ఆవేశ-ఉద్వేగాలు శాంతిస్తాయి మరియు మనస్సు పరమ శాంతిని పొందుతుంది. ఇంతకు ముందు, భగవంతుని యందు నిలపటానికి పరిశ్రమించవలసి వచ్చేది, కానీ ఇప్పుడు సహజంగానే ఆయన వద్దకు పరుగు తీస్తుంది. ఈ స్థితిలో, ఉన్నతమైన ధ్యానపరుడు అన్నింటినీ భగవత్ సంబంధముగా చూస్తాడు. నారద మహర్షి ఇలా పేర్కొన్నాడు:


తత్ ప్రాప్ర్య తద్ ఏవావలోకయతి తద్ ఏవ శృణోతి

తద్ ఏవ భాషయతి తద్ ఏవ చింతయతి


(నారద భక్తి దర్శన్, 55వ సూత్రము)


‘ఎల్లప్పుడూ భగవంతుని యందే ప్రేమతో మనస్సుని ఏకం చేసిన భక్తుని అంతఃకరణ ఆయన యందే నిమగ్నమైఉంటుంది. అటువంటి భక్తుడు ఎల్లప్పుడూ ఆయననే చూస్తుంటాడు, ఆయన గురించే మాట్లాడుతాడు మరియు ఆలోచిస్తుంటాడు.’ ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా భగవంతుని యందే నిమగ్నమవుతుందో, ఆత్మ తనలో కూర్చుని ఉన్న భగవంతుని అనంతమైన ఆనందాన్ని రుచి చూడటం ప్రారంభిస్తుంది.


సాధకులు తరచుగా అడుగుతుంటారు, తాము ఎంత పురోగమిస్తున్నామో ఎలా తెలుసు కోవాలి అని. దీనికి సమాధానం ఈ శ్లోకం లోనే నిక్షిప్తమై ఉంది. మన అంతర్గత అలౌకిక ఆనందం పెరుగుతూ ఉన్నప్పుడు, అది, మన మనస్సు నియంత్రించబడుతుండటానికి మరియు మన అంతఃకరణ ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నదనుకోవటానికి ఒక నిదర్శనం. ఇక్కడ, మనము 'శాంత-రాజసం' (free from passion) మరియు 'అకల్మశం' (పాప రహితం) అయినప్పుడు మనము 'బ్రహ్మ-భూతం' (భగవత్ ప్రాప్తి) పొందుతాము అని, శ్రీ కృష్ణుడు అంటున్నాడు. ఆ స్థితిలో, మనము ‘సుఖం ఉత్తమం’ (అత్యున్నత ఆనందము) ను అనుభవిస్తాము.

9, ఆగస్టు 2026, ఆదివారం

తొమ్మిది విషయాలను గోప్యంగా ఉంచాలి

 జీవితంలో తొమ్మిది విషయాలను గోప్యంగా ఉంచాలి


👉🏻ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం

మంత్రమౌషధసంగమౌ ।

దానం మానావమానాశ్చ

నవ గోప్యా మనీషిభిః ॥


అని నీతిశాస్త్ర వచనం.


ఆయుష్షు, 

ధనం, 

గృహరహస్యం, 

మంత్రం, 

ఔషధం, 

దాంపత్యసంబంధమైన విషయాలు, 

దానం, 

మానం, అవమానం — 

ఈ తొమ్మిది విషయాలను  అనవసరంగా బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచాలని ఈ శ్లోకం సూచిస్తుంది.


1.ఆయుష్షు — మన జీవితకాలం👇

మనకు ఎంత ఆయుష్షు ఉందో ముందుగానే తెలుసుకోవాలనే ఆతురత మనశ్శాంతిని భంగపరచవచ్చు. మరణం అనివార్యమైనదని తెలిసినా, దాని సమయం ముందుగానే తెలిసిందనే భావన మనిషిని నిరంతరం భయాందోళనలకు గురిచేయవచ్చు.

అందుకే భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించకుండా, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకుంటూ, ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించడం శ్రేయస్కరం.


2.విత్తం — మన సంపద👇

మన వద్ద ఎంత ధనం ఉంది, ఎక్కడ ఉంది, ఎలా సంపాదించాము వంటి విషయాలను అందరి ముందూ వెల్లడించడం వివేకం కాదు.

అవసరానికి మించి సంపద వివరాలను బహిర్గతం చేస్తే ఈర్ష్య, అసూయ, మోసం, దురాశ, అపాయం*వంటి సమస్యలు కలగవచ్చు. అందువల్ల ధనవిషయంలో సంయమనం, గోప్యత అవసరం.


3.గృహచ్ఛిద్రం — ఇంటి రహస్యాలు👇

ఇంటి గుట్టు అనేది బయటివారికి చెప్పకూడని విషయాలకు సంకేతం.

కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, వ్యక్తిగత సమస్యలు, ఆంతరంగిక విషయాలు అనవసరంగా ఇతరులకు తెలియజేస్తే కుటుంబ గౌరవానికి, పరస్పర విశ్వాసానికి భంగం కలగవచ్చు.

కుటుంబ రహస్యం కుటుంబ పరిధిలోనే ఉండాలి.బహిర్గతం కాకూడదు అవుతే చులకన నవ్వుల పాలు అవుతాము


4..మంత్రం👇

మంత్రం అనేది సాధారణంగా అందరికీ ప్రకటించుకోవలసిన విషయం కాదు. 

గురూపదేశంతో, ఆచారనిష్ఠతో విధివిధానపూర్వకంగా** జపించవలసినదే మంత్రం.

తమకు ఉపదేశించబడిన మంత్రాన్ని అనవసరంగా బహిరంగంగా ప్రచారం చేయకుండా, గురువులు నిర్దేశించిన విధానాన్ని పాటించడం సంప్రదాయం.


 5.ఔషధం👇

ఔషధాలను కూడా స్వయంగా నిర్ణయించుకుని, అందరి మాటలు విని ఉపయోగించడం శ్రేయస్కరం కాదు.

ప్రతి వ్యక్తి శరీర స్వభావం, వయస్సు, ఆరోగ్య పరిస్థితి, ఇతర మందుల వినియోగం మొదలైనవి భిన్నంగా ఉంటాయి. కాబట్టి **వైద్యుని సలహాతోనే ఔషధాలను ఉపయోగించాలి.**


6.దాంపత్య రహస్యాలు👇

భార్యాభర్తల మధ్య ఉండే ఆంతరంగిక విషయాలు వారి వ్యక్తిగత పరిధికే పరిమితం కావాలి. వాటిని ఇతరులతో చర్చించడం లేదా బహిరంగంగా వెల్లడించడం దాంపత్య గౌరవానికి, కుటుంబ మర్యాదకు విరుద్ధం. భంగం వాటిల్లుతుంది


7.దానం👇

తాను చేసిన దానధర్మాలను పదేపదే ప్రకటించుకోవడం కన్నా, **గుప్తదానం** చేయడం శ్రేష్ఠమైనదిగా మన ధర్మసంప్రదాయం బోధిస్తుంది.

దానం అనేది కీర్తి కోసం కాకుండా ధర్మబుద్ధితో, సేవాభావంతో, పరహిత సంకల్పంతో చేయాలి.


8.మానం — పొందిన గౌరవం👇

తనకు ఎవరు ఎంత గౌరవం ఇచ్చారు, ఎక్కడ ఎంత సత్కారం లభించింది అనే విషయాలను పదేపదే చెప్పుకోవడం వల్ల అహంకారం పెరగవచ్చు. అందువల్ల గౌరవం లభించినప్పుడు వినయంతో స్వీకరించడం ఉత్తమం.


9.అవమానం👇

అదేవిధంగా తాను పొందిన అవమానాలను అందరికీ చెప్పుకుంటూ తిరగడం కూడా మనశ్శాంతికి మంచిది కాదు.


కొన్ని విషయాలను మరచిపోవడం, క్షమించడం, అవసరమైన చోట మాత్రమే తగిన విధంగా స్పందించడం వివేకానికి, ఆత్మగౌరవానికి సంకేతం...

ఈ శ్లోకం మనకు కేవలం రహస్యంగా ఉంచాలి” అనే నియమాన్ని మాత్రమే చెప్పడం కాదు.

ఏ విషయాన్ని ఎవరితో, ఎంతవరకు, ఎప్పుడు పంచుకోవాలో తెలుసుకోవడమే వివేకం** అని బోధిస్తుంది.


ప్రతి మాటను అందరితో చెప్పడం జ్ఞానం కాదు.

ప్రతి విషయాన్ని దాచడం కూడా జ్ఞానం కాదు.


దేశకాలపాత్రలను అనుసరించి, అవసరమైన విషయాన్ని అవసరమైన వ్యక్తితో మాత్రమే పంచుకోవడం — నిజమైన మానవ వివేకం...


ధర్మం మనకు మార్గదర్శకం కావాలి.

వివేకం మనకు రక్షణ కావాలి.

వినయం మనకు అలంకారం కావాలి.

గోప్యత మనకు సంయమనం కావాలి..

శ్రీ  సద్గురు పీఠం...✍️

బొట్టు పెట్టడంలో

 ఇంటికి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టడంలో ఉన్న విశేషం. వివరణ k.h. విజయ్ బట్టర్ కడప జిల్లా అర్చక పురోహిత సమైక్య అధ్యక్షులు.


మన సనాతన భారతీయ సంస్కృతిలో అతిథిని దేవుని స్వరూపంగా భావించి గౌరవించడం ఒక గొప్ప ధర్మంగా పరిగణించబడింది. 


ముఖ్యంగా ఇంటికి వచ్చిన ముత్తైదువును లక్ష్మీదేవి, పార్వతీదేవి, పరాశక్తి స్వరూపిణిగా భావించి పసుపు, కుంకుమ, తాంబూలాలతో సత్కరించడం అనాదిగా వస్తున్న పవిత్రమైన ఆచారం. 


ఇది కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, మన సంస్కృతిలో స్త్రీకి ఇచ్చిన గౌరవానికి ప్రతీక.


వివాహిత స్త్రీని "గృహలక్ష్మి" అని సంబోధిస్తారు. 


ఆమె అడుగుపెట్టిన చోట మంగళం, శుభం, ఐశ్వర్యం కలుగుతాయని మన పెద్దలు విశ్వసించారు. 


అందుకే ఇంటికి వచ్చిన ముత్తైదువుకు నుదుటిపై కుంకుమ బొట్టు పెట్టి, పసుపు, కుంకుమ, తాంబూలం సమర్పించి సత్కరించడం ద్వారా ఆమెలోని దైవత్వాన్ని ఆరాధించినట్లుగా భావించారు.


నుదుటి మధ్య భాగాన్ని యోగశాస్త్రంలో ఆజ్ఞా చక్ర స్థానం అని పేర్కొన్నారు. 


ఈ ప్రాంతంలో కుంకుమ ధరించడం మంగళానికి, శక్తికి, సౌభాగ్యానికి సంకేతంగా భావించబడింది. 


పసుపు లక్ష్మీ కటాక్షానికి, పవిత్రతకు ప్రతీక కాగా, కుంకుమ ఆదిపరాశక్తి స్వరూపాన్ని సూచిస్తుంది. 


తాంబూలం గౌరవానికి, సంపూర్ణ ఆతిథ్యానికి చిహ్నంగా భావించబడుతుంది. 


అందుకే ఈ మూడింటిని కలిసి సమర్పించడం ఒక మంగళకరమైన ఆచారంగా కొనసాగుతోంది.


ఈ ఆచారం ద్వారా ఇంటికి వచ్చిన స్త్రీని గౌరవించడమే కాకుండా, కుటుంబంలో ప్రేమ, పరస్పర గౌరవం, మంగళం, ఐకమత్యం పెంపొందుతాయని మన సంప్రదాయం చెబుతోంది.


ఇంటిలో లక్ష్మీ కటాక్షం నిలవాలని, కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ ఈ సత్కారాన్ని చేస్తారు.


శుక్రవారాలు, శ్రావణమాసం, వరలక్ష్మీ వ్రతం, నవరాత్రులు, దీపావళి, వివాహాలు, వ్రతాల ఉద్యాపనలు వంటి శుభసందర్భాల్లో ముత్తైదువులను ఆహ్వానించి పసుపు–కుంకుమలు సమర్పించడం ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో ఆచారంగా కొనసాగుతోంది.


ధర్మశాస్త్రాలు, గృహ్యసూత్రాలు, దేవీ ఉపాసనా సంప్రదాయాల్లో సువాసినీ పూజకు విశిష్ట స్థానం ఉంది. 


అయితే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలో ఉన్న కొన్ని శ్లోకాలు నిజంగా స్కాంద పురాణం, దేవీ భాగవతం లేదా పద్మ పురాణంలోని యథాతథ శ్లోకాలేనా అనే విషయాన్ని ప్రామాణిక గ్రంథాల ఆధారంగా పరిశీలించి మాత్రమే పేర్కొనాలి. 


అందువల్ల ఈ ఆచారం యొక్క మూలభావాన్ని మన సంప్రదాయ దృష్టితో అర్థం చేసుకోవడం సముచితం.


మన ఇంటికి వచ్చే ప్రతి స్త్రీని గౌరవిద్దాం. ఆమెను గృహలక్ష్మిగా భావించి పసుపు, కుంకుమలతో సత్కరిద్దాం. 


సనాతన భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని మనమే ఆచరిస్తూ, భావితరాలకు అందిద్దాం.


॥ సర్వే జనాః సుఖినో భవంతు ॥

నీతి శాస్త్రము

_*నీతి శాస్త్రము*_


*తల్లిదండ్రుల ఋణం – ఎన్నటికీ తీర్చలేనిది*


శ్లోకం;


*యం మాతా పితరో క్లేశం*

*సహేతే సంభవే నృణామ్ ।*

*న తస్య నిష్కృతిః శక్యా*

*కర్తుం వర్షశతైరపి ॥*


📖 *మూలం* : శ్రీమద్భాగవత మహాపురాణం – దశమ స్కంధం, 45వ అధ్యాయం, 5వ శ్లోకం.


*_భావము_*


*ఈ సృష్టిలో మనకు ప్రత్యక్ష దైవాలు తల్లిదండ్రులే.*


మనకు జన్మనివ్వడం మాత్రమే కాదు, సద్గుణాలను అలవర్చడం, సంస్కారాన్ని నేర్పించడం, ధర్మమార్గంలో నడిపించడం, సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన విలువలను అందించడం వారి పవిత్రమైన కర్తవ్యం.


తల్లి తన ప్రేమతో, తండ్రి తన బాధ్యతతో సంతానాన్ని సంరక్షిస్తారు.


సంతానం సుఖసంతోషాలు, అభ్యున్నతి, శ్రేయస్సు కోసం వారు తమ స్వార్థాన్ని పక్కనబెట్టి ఎన్నో త్యాగాలు చేస్తారు. వారి ప్రేమకు హద్దులుండవు; 


వారి ఆప్యాయతకు అంతులేదు; వారి ఆశీర్వాదానికి సాటిలేదు.


అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా "తల్లిదండ్రులు సంతానం కోసం అనుభవించిన కష్టాలకు ప్రతిగా వంద సంవత్సరాలు సేవ చేసినా వారి ఋణాన్ని పూర్తిగా తీర్చడం సాధ్యం కాదు" అని ఉపదేశించాడు.


*వేదం మనకు "మాతృదేవో భవ । పితృదేవో భవ ।" అని ఆజ్ఞాపించింది.*


తల్లిని దేవతగా, తండ్రిని దేవుడిగా భావించి సేవించడం సనాతన ధర్మం. 


తల్లిదండ్రుల సేవలోనే దైవసేవ దాగి ఉంది. వారిని గౌరవించడం, వారి మాటను ఆదరించడం, వృద్ధాప్యంలో ప్రేమతో సేవించడం ప్రతి సంతానపు పరమధర్మం.


*ధర్మశాస్త్రాలు చెబుతున్న ప్రకారం, తల్లిదండ్రుల మనస్సును సంతోషపరిచినవారిపై దేవతల అనుగ్రహం, పితృదేవతల కృప, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి*. 


తల్లిదండ్రుల ఆశీర్వాదం జీవితం మొత్తం శుభమార్గంలో నడిపించే దివ్యశక్తి.


మనం దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి ఆరాధిస్తాం. అయితే మన ఇంట్లోనే ఉన్న తల్లిదండ్రులను గౌరవించి, సేవించడం కూడా అదే దైవారాధన అని సనాతన ధర్మం బోధిస్తోంది. 


వారి సంతోషంలోనే మన శ్రేయస్సు ఉంది; వారి ఆశీర్వాదంలోనే మన జీవిత విజయానికి బలమైన పునాది ఉంది.


*_ఆధ్యాత్మిక సందేశం_*


తల్లి గర్భమే మనకు మొదటి దేవాలయం.

తండ్రి భుజమే మనకు మొదటి రక్షణ.

వారి ప్రేమే మనకు మొదటి వరం.

వారి ఆశీర్వాదమే మన జీవితానికి మొదటి సంపద.


తల్లిదండ్రులను గౌరవించడం ధర్మం.

వారిని సేవించడం పుణ్యం.

వారిని సంతోషపరచడం భగవంతుని ఆరాధించడం వంటిదే.


ఈ జన్మలో మనం వారికి చేయగలిగే గొప్ప ఉపకారం, వారిని ప్రేమతో చూసుకోవడం, గౌరవించడం, వారి హృదయాన్ని నొప్పించకుండా జీవించడం.


*_నీతి_*


తల్లిదండ్రుల ప్రేమకు ధర లేదు.

వారి త్యాగానికి కొలమానం లేదు.

వారి ఋణానికి తీర్చుబాటు లేదు.

వారి ఆశీర్వాదానికి సమానమైన సంపద ఈ లోకంలో మరొకటి లేదు.


తల్లిదండ్రులను గౌరవిద్దాం.

వారిని ప్రేమతో సేవిద్దాం.

వారి ఆశీర్వాదంతో మన


* ।

ఆంధ్రుల గురించిన

 ఆంధ్రుల గురించిన చారిత్రిక ప్రస్తావనలు

పాత రాతి యుగం:

కడప, కర్నూల్, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, నల్గొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పాత రాతి పనిముట్లు అసంఖ్యాకంగా దొరికినాయి. 

డోర్నకల్ సమీపంలో నందికనుమ (గిద్దలూరు) ప్రాంతం పాత రాతి పనిముట్ల పరిశ్రమకు కేంద్రం అని శాస్త్రవేత్తల అంచనా.

నవ (నవీన) శిలాయుగం, తామ్రయుగం లకు సంబంధించి కూడా కొన్ని ఆధారాలు లభించాయి.

వైదీక సంస్కృతి:

ఋగ్వేద ప్రజలకు దక్షిణాపథం గురించి స్పష్టమైన పరిజ్ఞానం లేదు. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఆంధ్ర ప్రాంతం గురించి దక్షిణాపథం (దక్షిణానికి దారి అనే అర్థం లో) అని చాలా చోట్ల ప్రస్తావించబడినది.

" ఆ సముద్రాత్తువై పూర్వదా సముద్రాత్తు పశ్చిమా తయోరేవాంత రంగిర్యో ఆర్యావర్తం విదుర్భదాః "


ఐతరేయ బ్రాహ్మణం విదర్భ రాజ్యాన్ని పేర్కొంటున్నది. అదే బ్రాహ్మణంలో శునశేఫదేవరాతుని కథలో ఆంధ్ర, శబర, మూతిబ, పుళింద, పుండ్ర తెగల ప్రస్తావన ఉంది.

అలాగే పాణిని అష్టధ్యాయి లో దక్షిణాపథంలోని కళింగ, అస్మక రాజ్యాలను పేర్కొతెలుగు భాష సంస్కృతానికి నుడికారం. సంస్కృతానికి డు, ము, వు, లు చెరిస్తే తెలుగయింది. మనది ద్రవిడ భాష కాదు. మనం ద్రవిడములు కాదు, మన భాష ద్రవిడ భాష కాదు. 

 తెలుగు భాషకు గుర్తించలేక సెంట్రల్ లింగ్విస్టిక్ మినిస్ట్రీలో 

 మనది ద్రవిడ్ భాష గాని పేర్కొన్నారు. తెలుగు వారంతా ఆర్యులు. వైదిక ధర్మాన్ని ఔపోసన పట్టిన వాళ్ళు. ద్రవిడులు శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు. రామేశ్వరం దగ్గర 13 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక హద్దులు ఉంటాయి. 

 మరల అయ్యంగార్లు ఆర్యులె. మన తెలుగు పదాల్లో ద్రవిడ పదాలు లేనే లేవు. ఒకప్పుడు మాదిరాజు అగ్రహరం తర్వాత కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు పలకలేక మద్రాస్ గా మార్చారు. అక్కడున్న వాళ్ళందరూ శ్రీలంక వాళ్లే. వాళ్ల సంగతి మనకెందుకు గాని మన భాష మాత్రం ద్రవిడ భాష కాదు.న్నారు.

పంచాంగం 09.08.2026 Sunday

 ఈ రోజు పంచాంగం 09.08.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి భాను వాసర మృగశిర నక్షత్రం హర్షణ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి 



 

నమస్కారఃఈ రోజు పంచాంగం 09.08.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష ఏకాదశి తిథి భాను వాసర మృగశిర నక్షత్రం హర్షణ యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి 



 

నమస్కారః , శుభోదయం , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।


ప్రతిపదార్థ:


యతః యతః — ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడికైతే; నిశ్చరతి — సంచరించునో; మనః — మనస్సు; చంచలం — చంచలమైన; అస్థిరం — నిలకడ లేని; తతః తతః — అక్కడ నుండి; నియమ్య — నిగ్రహింపబడి; ఏతత్ — ఇది; ఆత్మని — భగవంతునిపై; ఏవ — తప్పకుండా; వశం — వశములోనికి; నయేత్ — తీస్కురావలెను.



తాత్పర్యము: 


 

ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.



వివరణ:


ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు; పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. దీన్ని ఎదుర్కోవటానికి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:


- బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.


- మరల, బుద్ధి యొక్క విచక్షణా శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.


- మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.


       ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, ‘భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.’ అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు బహు చంచలమైనది, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.


ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల, మనస్సు యొక్క మమకారాసక్తి పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరమ్ ।

తతస్తతో నియమ్యైతదాత్మన్యేవ వశం నయేత్ ।। 26 ।।


ప్రతిపదార్థ:


యతః యతః — ఎప్పుడెప్పుడైతే, ఎక్కడెక్కడికైతే; నిశ్చరతి — సంచరించునో; మనః — మనస్సు; చంచలం — చంచలమైన; అస్థిరం — నిలకడ లేని; తతః తతః — అక్కడ నుండి; నియమ్య — నిగ్రహింపబడి; ఏతత్ — ఇది; ఆత్మని — భగవంతునిపై; ఏవ — తప్పకుండా; వశం — వశములోనికి; నయేత్ — తీస్కురావలెను.



తాత్పర్యము: 


 

ఎప్పుడెప్పుడైతే ఎక్కడెక్కడికైతే ఈ చంచలమైన నిలకడ లేని మనస్సు పరిభ్రమిస్తుందో దానిని తిరిగి తెచ్చి నిరంతరం భగవంతుని మీదనే కేంద్రీకరించాలి.



వివరణ:


ధ్యానంలో విజయం ఒక్క రోజులో రాదు; పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది. భగవంతునిపై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది. దీన్ని ఎదుర్కోవటానికి, ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది:


- బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం.


- మరల, బుద్ధి యొక్క విచక్షణా శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని, మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతునిపైనే కేంద్రీకరించాలి. దీనికి కూడా పరిశ్రమ అవసరం.


- మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది.


       ఎప్పుడైతే ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, ‘భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.’ అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు. మనస్సు బహు చంచలమైనది, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది. కానీ, అది చంచలమైపోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకివస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించుకోవాలి.


ఈ సాధనని మరల మరల చేయాలి. అప్పుడు క్రమక్రమంగా భగవంతుని పట్ల, మనస్సు యొక్క మమకారాసక్తి పెరగటం మొదలవుతుంది. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది. ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి. తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి.