22, ఆగస్టు 2026, శనివారం

నాహంకర్తా



నాహంకర్తా...


2003 జూన్‌ మాసంలో ఒకరోజు...


హైదరాబాదు జూబ్లీహిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన డా॥ మర్రి చెన్నారెడ్డి, మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పి.వి.ఆర్‌.కె ప్రసాద్‌తో సమావేశమయ్యాను. అప్పటివరకు ఒక వారపత్రికలో ‘సర్వసంభవామ్‌’ శీర్షికన ప్రచురితమవుతున్న ప్రసాద్‌గారి వ్యాసాల్ని ఒక పుస్తకంగా (నాహంకర్తా... హరిః కర్తా) ప్రచురించే విషయమై మాట్లాడుతున్నాం. అదే సంస్థలో జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్న ప్రముఖ రచయిత, ఐపిఎస్‌ అధికారి శ్రీ రావులపాటి సీతారామారావు, ప్రసాద్‌గారికి రచనాసహకారం అందించిన శ్రీ జి.వల్లీశ్వర్‌ కూడా ఉన్నారు. 


ఆ వారపత్రికలో సీరియల్‌ ఆఖరి భాగం ఆ రోజు పోస్టుకు వెళ్లాలి. వల్లీశ్వర్‌ ఆ భాగం చదివి వినిపిస్తున్నారు. అందులో - ఇండియన్‌ ఎడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌లోకి వచ్చిన కొత్త రోజుల్లో పివిఆర్‌కె ప్రసాద్‌ ‘సకల కళా వల్లభుడు’గా ఎలా పేరు పడ్డాడో వర్ణించే పేరాలు వచ్చినప్పుడు సీతారామారావు అభ్యంతర పెట్టారు. 

“సర్‌, ఇంతకుముందు అధ్యాయాలన్నిట్లోనూ మీరొక శ్రీనివాసుడి సేవలో తరించి పునీతుడైన వ్యక్తిగా కనిపించారు. ఇప్పుడు ఈ చివరి అధ్యాయంలో ఇలా ‘ఒకప్పుడు నేను సకలకళా వల్లభుణ్ణి’ అని రాస్తే, పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయేమో! ఇది రాయటం అవసరమా?’’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను వింటున్నాను. అలా రాయటం, రాయకపోవటంలో ఉండే ప్రభావాన్ని గురించి ఒక ప్రచురణకర్తగా ఆలోచిస్తున్నాను. 


ప్రసాద్‌గారు తక్షణం స్పందించారు, “సీతారామారావ్‌, ‘నేను ఏమిటి’ అని తీర్పు ఇచ్చేది పైవాడు (భగవంతుడు). పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయన్న కారణంగా ఆ పైవాణ్ణి నేను మోసం చేయగలనా? నో... ఆ పేరాలు అలానే ఉండాలి.’’

ప్రసాద్‌గారిలో నాకొక నిజాయితీ మూర్తీభవించిన రచయిత కనిపించాడు. ఆయన్ని అభినందించకుండా ఉండలేకపోయాను. అలాంటి అనేక సంఘటనలు ఆయన్ని ఎప్పటికప్పుడు ఒక విశిష్ట వ్యక్తిగా ఆవిష్కరిస్తూ వచ్చాయి. 

సానుకూలతా దృక్పథం: విలువలు

ఒక అధికారిగా ఆయనలో ఉట్టిపడే సానుకూలతా దృక్పథాన్ని, పనిరాక్షసత్వాన్ని నేను అనేక సందర్భాల్లో దగ్గరనుండి చూడటం జరిగింది.


చాలామంది అధికారులు ఎవరికి సహాయం చేసినా, దానికి గుర్తింపు కోరుకునేవాళ్లే. సహాయం చేయలేకపోతే చేయలేమని చెప్పకుండా పదేపదే తిప్పుకునేవాళ్లు కొంతమంది. నాకు తెలిసి ప్రసాద్‌గారు తనను కలిసి సహాయం కోరిన ప్రతివాళ్లకీ సహాయం చేశారని చెప్పలేను. కాని ఆయన సహాయం చేయలేకపోయినా ఆయన మాట్లాడే తీరు మనసుకి ఏమాత్రం కష్టం కలిగించదు. పని కాలేదన్న అసంతృప్తినీ మిగల్చదు.

తన దగ్గరికి సహాయం కోసం వచ్చిన వ్యక్తి తన దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నాడు అన్నట్లుగా ప్రవర్తించడంగాని, అవసరం లేకపోయినా పదేపదే తిప్పించుకోవడంగాని ప్రసాద్‌గారి తత్త్వానికి సరిపడదు. ఒక వ్యక్తి తనదగ్గరికి ఓ సబబైన విషయంలో సహాయం కోసం వచ్చాడంటే అతనికి సహాయం చేసే అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించాడు అని విశ్వసించేవారు. అందుకేనేమో ఆయన సహాయం కోరి వెళ్లి, పని జరగనివాళ్లు కూడా ఆయనను ప్రేమిస్తారు.

నాకు తెలిసి ప్రసాద్‌గారి మాట సాయం కోసం వెళ్లిన అనేకమందికి ప్రసాద్‌గారే తిరిగి ఫోన్‌ చేసి, పని అయిందీ, లేనిదీ, వచ్చిన వాళ్లు వెళ్లి ఎవరిని కలవాలి, ఎప్పుడు కలవాలి వగైరా... వివరాలు తనంతతానుగా చెప్పేవారు. చేస్తాను అని మాట ఇచ్చాక, చివరిదాకా ప్రయత్నం చేయటం ప్రసాద్‌గారి తత్త్వం. 


నా గత పదిహేనేళ్ల సాన్నిహిత్యంలో ఆయన ఏ వ్యక్తినీ ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ తూలనాడటం నేనెరగను. అనేక లోపాలు ఉన్న వ్యక్తిని గురించి ప్రస్తావన వచ్చిన సందర్భాల్లోనూ, తనని వ్యతిరేకించినవాళ్లను గురించి ఎవరన్నా మాట్లాడిన సందర్భాల్లోనూ కూడా చతురోక్తులతో ఆ సంభాషణని మరోవైపు మళ్లించేవారు.

ఏదన్నా ఒక బృహత్కార్యానికి చేయూతనివ్వాలని ఏవన్నా సంస్థలు వచ్చి అడిగితే, అది చేయదగిన మంచికార్యం అని భావిస్తే, తనకి శక్తి లేకపోయినా ఏదో రకంగా పనిజరిగే మార్గాన్ని ఎంచుకుని పని జరిపించేవారు. 


“ఎందుకు సార్‌ అంత కష్టపడతారు’’ అని నేనెప్పుడన్నా అడిగితే, ఆయన చెప్పే మాట - “నో.. అని చెప్పడం ఎంతో సులభం విజయకుమార్‌. కాని కార్యం మంచిదైతే చేయడానికి మార్గాన్నీ, శక్తినీ, యుక్తినీ ఆయనే (శ్రీనివాసుడు) కల్పిస్తాడయ్యా.’’ 

ప్రభుత్వంలో ఆయన ఉద్యోగం చేసినా అలానే చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు ఆయన తనకి తానుగా తలకెత్తుకున్న - ‘ప్రభుత్వంలో అన్ని శాఖలలో అన్ని స్థాయిల ఉద్యోగాలకు మాన్యువల్స్‌ తయారుచేసే బృహత్కార్యం’, ‘సుపరిపాలన సంస్కరణలు’ ఇందుకు ఉదాహరణలు.

ఇవ్వాళ విలువలు గురించి ప్రభుత్వంలో ఎక్కువగా ఎవరూ మాట్లాడరు. ఒకవేళ మాట్లాడినా అర్థం వేరేగా ఉంటుంది అని అర్థం చేసుకోవలసిన రోజులివి. 


1987 లో పివిఆర్‌కె ప్రసాద్‌ ఎక్సైజ్‌ కమీషనర్‌గా పనిచేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రసాద్‌ గారింటికి వచ్చి, మర్యాదపూర్వకంగా మాట్లాడి, ఒక స్వీట్‌ పాకెట్‌ ఇచ్చి వెళ్లిపోయారు. కొంతసేపటికి స్కూలు నుంచి వచ్చిన పిల్లలు స్వీట్స్‌ తిందామని పేకెట్‌ ఓపెన్‌ చేస్తే, అందులో కరెన్సీ ఉంది. వెంటనే పిల్లల్ని ప్రసాద్‌గారు ఆ కరెన్సీ ముట్టుకోనీకుండా ఆపేసి, అవినీతి నిరోధక శాఖకి ఫోన్‌ చేశారు. ఎయిర్‌పోర్టులో సుబ్బరామిరెడ్డిగారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పేకెట్‌లో ఉన్న కరెన్సీ విలువ లక్ష రూపాయలు! 


1990 లో... తిరుపతిలో పోర్టు ఛైర్మన్‌ ప్రసాద్‌గారి కుమార్తె వివాహం జరిగినప్పుడు పెళ్లికి కార్లు సరఫరా చేసిన సంస్థకి 24 వేల రూపాయల బిల్లు ఒక గుర్తు తెలియని వ్యక్తి చెల్లించాడు. ఆ బిల్లు చెల్లించింది ఒక పోర్టులో ఒక కాంట్రాక్టరు అని తెలుసుకొని, ప్రసాద్‌గారు ఆ కాంట్రాక్టరు ‘ఎందుకు ఇలా చేశానా’ అని పశ్చాత్తాపపడేలా చేసేదాకా వదలిపెట్టలేదు.


...ఇలాంటి విలువలున్న అధికారుల్ని ఇప్పుడు వెతికి వెతికి చూడాల్సి వస్తోంది. ఉన్నతమైన విలువలు, సేవాభావం, సానుకూలతా దృక్పథాలతో వ్యవహరించే గత తరం అధికారులకి ప్రతీక శ్రీ పివిఆర్‌కె ప్రసాద్‌.


మానవ సంబంధాలు


ప్రసాద్‌గారు భువనగిరి సబ్‌కలెక్టరుగా పనిచేసింది 1960వ దశకం చివర్లో. కాని భువనగిరి ప్రాంతం నుంచి లేదా ఆయన కలెక్టరుగా పనిచేసిన ఖమ్మం జిల్లానుంచి... అవేకాదు, ఆయన గతంలో పనిచేసిన తి.తి.దేవస్థానాలు, పంచాయతీ రాజ్‌, ఎక్సైజ్‌, వైజాగ్‌ పోర్టు, వంటి సంస్థలు లేదా ప్రభుత్వశాఖలనుంచి ఎవరెవరో సిబ్బంది ఇప్పటికీ వస్తూనే ఉన్నారు, ఆయన్ని కలుస్తూనే ఉన్నారు. 

నాకు ఆశ్చర్యం వేసేది. పదేళ్లు పక్కింట్లో ఉన్నవాళ్లే బయటికెళ్తే మనల్ని పలకరించరే! ఈయనకేమిటి ఇంత అభిమాన సందోహం!! 

ఆ వచ్చినవాళ్లు ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ, “మీరున్నప్పుడు ఎంత బావుండేదండీ! ఇప్పుడు అలా లేదండీ’’ అని అర్థం వచ్చేలాగా ఏవో కొన్ని ప్రశంసావాక్యాలు వేస్తుంటారు. వెంటనే ప్రసాద్‌గారు మాట మార్చేసి, “మీ పిల్లలెరా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నీ వ్యాపారం/ఉద్యోగం ఎలా ఉంది?’’ అంటూ ఆ కుటుంబం పట్ల తన కుతూహలాన్ని చూపించేవారు. 


మానవసంబంధాల నిర్వహణలో ప్రసాద్‌గారిది అందె వేసిన చేయి. పనిచేసిన ప్రతిచోటా తనదంటూ ఒక ముద్రవేయటం, ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ తనతో సంబంధం ఉన్న ప్రతిఒక్కరినీ తన సానుకూలతాదృక్పథంతో ప్రభావితం చేయటం, ఎన్ని సంవత్సరాల తరువాతయినా ఆ ప్రతి ఒక్కరినీ గుర్తుంచుకొని పేరుతో సంబోధించడం, వాళ్లు బావుండాలన్న తన తపన వ్యక్తం చేయటం... ఇలాంటి అసాధారణమైన మానవతావిలువలు ప్రసాద్‌గారి ప్రతి అడుగులోనూ కనిపిస్తాయి. 


ఆయనతో కలసి పనిచేసిన ఏ స్థాయి ఉద్యోగిని ఇవాళ కదిలించినా, “ప్రసాద్‌గారితో పనిచేశాక వేరే వాళ్లతో పనిచేయటం కష్టమండి’’ అంటారు.


మానవసంబంధాల నిర్వహణకి ఆయన ఒక నిలువెత్తు దర్పణం అని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద దృష్టాంతాలున్నాయి. ఆయన 1978-82 లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. అప్పుడు దేశంలో కొంతమంది పీఠాధిపతులతో పరిచయాలేర్పడ్డాయి. 1993-94 లో ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు, అయోధ్య రామాలయాన్ని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని పి.వి. నరసింహారావుగారు కోరుకుని ఆ బాధ్యతను తన మీడియా సలహాదారు ప్రసాద్‌కి అప్పగించారు.


 ఆయన దేశంలోని అన్ని పీఠాలు, మఠాలు, అఖాడాలు, గడీలు తదితర ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ తిరిగి కీలకమైన హిందూ ధర్మాచార్యులందరితో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఒక ట్రస్టును రిజిస్టరు చేయించారు. (ఈ విషయం ప్రసాద్‌గారు 2010 లో తన ‘అసలేం జరిగిందంటే..’ వ్యాసాల్లో రాసేదాకా ఎవరికీ తెలియదు).

2006 - 17 మధ్య కాలంలో హిందూధర్మ పరిరక్షణ ఉద్యమం కోసం సుమారు 60 మంది పీఠాధిపతులు, మఠాధిపతులతో తిరుమలలో నాలుగుసార్లు ధార్మిక సదస్సులను విజయవంతంగా నిర్వహించగలిగిన ఏకైకవ్యక్తి పివిఆర్‌కె ప్రసాద్‌. ఆయన ద్వైత శాఖకు చెందిన వ్యక్తి అయినా అన్ని శాఖల ధర్మాచార్యులు ఆయనని ప్రేమిస్తారు, గౌరవిస్తారు, అనుసరిస్తారు.


“ఎలా సాధ్యం?’’ అని అడిగితే, “ఆ మధ్య (1978-82) టి.టి.డి ఈవోగా చేశాను కదా. అప్పటి పరిచయాలే!’’ అని చులాగ్గా అనేస్తారు. ఎంత దుస్సాధ్యం - ఇంతలా మానవసంబంధాల్ని నిర్వహించడం! 

ముఖ్యమంత్రులుగా పనిచేసిన పి.వి. నరసింహారావు, జలగం వెంగళరావు, టి. అంజయ్య, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీ రామారావు, ఎన్‌. జనార్దన రెడ్డి, చంద్రబాబు నాయుడు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్‌ రాజశేఖర రెడ్డి, కె. రోశయ్య లతో సహా తనకు సంబంధించిన ప్రతి మంత్రితో కూడా సత్సంబంధాలు నెరుపుతూనే, తన విశ్వాసం, విలువల విషయంలో రాజీ పడకుండా “అత్యంత సమర్థుడైన అధికారిగా పనిచేశాడు’’ అనిపించుకున్న ఏకైకవ్యక్తి కూడా పివిఆర్‌కె ప్రసాద్‌ గారే. 


ఆగస్టు 21 2017 ఉదయం శ్రీ ప్రసాద్‌గారి భౌతికకాయానికి నమస్కారం పెట్టుకోవటానికి నేను వెళ్లినప్పుడు ప్రసాద్‌ గారి భార్య శ్రీమతి గోపిక గారు గద్గద స్వరంతో ‘నాహంకర్తా హరిః కర్తా... ఇక లేరు’ అన్నారు.


 నాహంకర్తా హరిః కర్తా ఆయన రాసిన పుస్తకం పేరు మాత్రమే కాదు. ఆయన జీవితాన్ని నడిపించిన వాక్యం. 


అందుకే శ్రీప్రసాద్ గారు ఈ తరానికి ఒక స్ఫూర్తి. 


ఆయనతో నాకు కొన్ని అనుభవాలున్నట్లే ఈ సమాజంలో అనేకమందికి గొప్ప అనుభవాలున్నాయి. ఆయనతో గల అనుబంధాన్ని అక్షరరూపంలో పంచుకోవాలనే నా మిత్రులు కొందరి ఆకాంక్ష ఈ పుస్తకానికి నాంది పలికింది. సోదరులు, సీనియర్ పాత్రికేయులు శ్రీ వల్లీశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటంతో ఈ పుస్తక రూపకల్పన మాకు సులభతరం అయింది. కొండంత దేవుడికి కొండంత పత్రితో పూజ చేయలేం కదా! కాని కొండంత ప్రేమతో, భక్తితో పూజ చేయవచ్చు. అందుకే ఆకాశమంత మిత్రుడికి ఈ నివాళి!


ఎమెస్కో విజయకుమార్

[22/08, 2:15 pm] Deekshitulu Chavali: ⬆️ పై వ్యాసం చదవండి కొంచెం పెద్దదైనా. ఎందుకంటే, ఒక మంచి అధికారి వుంటే సొసైటీ ఎంత బాగుపడుతుందన్న విషయం మనకు విశధం అవుతుంది. శ్రీ ప్రసాద్ గారు మధ్వ బ్రాహ్మణులు.

మేనమామ

 *మేనమామ :*


మన బంధుత్వాలలో మేనమామ కు ఎందుకంత ప్రాముఖ్యత కల్పించారు మన పెద్దవాళ్ళు?

ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఒక మనిషి గురించి చెప్పకూడదు, ఒక వ్యవస్థ గురించి చెప్పాలి. మన పెద్దలు మేనమామ అనే వ్యవస్థను ఒక సెక్యూరిటీ లాకర్ లాగా తయారు చేసి పెట్టారు. ఆ లాకర్ తాళం చెవి ఆడబిడ్డ జీవితం మొదటి నుంచి చివరి వరకు పనిచేస్తుంది.


దానికి నాలుగు పదునైన కారణాలున్నాయి.


1. తల్లి బతికి ఉన్నంత వరకు తల్లి, తల్లి లేకపోతే మేనమామ.


మనం తండ్రి గోత్రం తీసుకుంటాం, కానీ తల్లి రక్తం తీసుకుంటాం. తండ్రి వంశం మనకు పేరు ఇస్తే, తల్లి వంశం మనకు రక్ష ఇస్తుంది.


పాత రోజుల్లో మరణాలు ఎక్కువ. చిన్న వయసులోనే తల్లిదండ్రులు పోతే పిల్లలు అనాథలు కాకూడదని, "తల్లిదండ్రులు చనిపోయినా మేనమామ బతికి ఉండాలి" అని దీవించేవారు. ఎందుకంటే అత్త, మామ, పిన్ని, బాబాయి అందరూ ఆస్తి వైపు వాళ్లు, మేనమామ ఒక్కడే అమ్మ వైపు వాడు. వాడు ఆస్తి అడగడు, ప్రేమనే పంచుతాడు. అమ్మ తర్వాత అంత ప్రేమగా "ఒరేయ్" అని పిలిచే హక్కు వాడికే ఉంటుంది.


అందుకే మన సామెత - తల్లి తర్వాత తల్లి లాంటిది మేనమామ ప్రేమ.


2. ప్రతి ముడికీ మొదటి ముడి మేనమామే.


ఆడపిల్ల కానీ, మగపిల్లాడు కానీ - వాళ్ల జీవితంలో మొదటి బట్ట వేసేది మేనమామే.


పుట్టు వెంట్రుకలకు మేనమామ రావాలి.


బారసాలకు ఒళ్లో కూర్చోబెట్టేది మేనమామే.


అక్షరాభ్యాసానికి బలపం పట్టించేది మేనమామే.


పెళ్లిలో పెళ్లికొడుకును భుజం మీద మోసేది, గండం తీసేది, కాళ్లకు చెప్పుల జోడి తెచ్చేది మేనమామే.


నువ్వు అన్నట్టు "అన్నింటికీ ముందు మేనమామ రావాలి" అనే క్లారిటీ మన ఇంట్లో ఉండటానికి కారణం - ఏ శుభకార్యం అయినా తల్లి పుట్టిన ఇంటి సాక్షి లేకుండా మొదలు పెట్టకూడదు అనే నియమం. ఆ సాక్షి సంతకమే మేనమామ.


పెళ్లిలో పప్పు దగ్గర నుంచి తలంబ్రాల వరకు ఆయన పాత్ర లేకపోతే ఆ పెళ్లి అసంపూర్ణమే.


3. సారె, పసుపు కుంకుమ - ఆడబిడ్డకు పుట్టిల్లు ఇచ్చే ధైర్యం


మేనమామ ప్రాముఖ్యతకు అసలైన పరీక్ష ఇక్కడే ఉంటుంది.


సారె: అత్తగారింట్లో ఎన్ని చీరెలు ఉన్నా, పుట్టింటి నుంచి వచ్చిన ఒక్క చీరె ఆడబిడ్డకు పట్టు చీరె కంటే ఎక్కువ. అది చీరె కాదు, ఒక సందేశం - "నువ్వు అక్కడ ఉన్నా, నీకు ఇక్కడ ఒక ఇల్లు ఉంది" అని. ఆ సందేశాన్ని మోసుకొచ్చే పోస్ట్ మాన్ మేనమామ.


పసుపు కుంకుమ : అత్తగారి ఇంటి పసుపు అలంకారం, పుట్టింటి పసుపు దీవెన. "నా పసుపు వెలిసిపోలేదు, నా బొట్టు చెదరలేదు" అని ఆడబిడ్డ తన పుట్టింటికి చెప్పుకునే భాష ఇది. ఆ దీవెన తెచ్చే పూజారి మేనమామ.


4. ఆఖరి చీరె - జీవిత వృత్తాన్ని పూర్తి చేసే మనిషి


ఇదే అత్యంత హృద్యమైన, పదునైన నిజం.


మన ఆచారంలో ఒక ముత్తైదువు చనిపోతే, ఆమెకు కట్టే ఆఖరి చీరె పుట్టింటి నుంచి రావాలి. దాన్ని కడసారి చీరె / పుట్టింటి సారె అంటారు. ఆ చీరె రాకపోతే కర్మ కదలదు, శవాన్ని కూడా కదపరు.


బతికినన్నాళ్లు అత్తగారి పట్టు చీరెలు కట్టినా, ఆఖరి రోజున పుట్టింటి చీరె కట్టి పంపుతారు. ఎందుకంటే ఆమె మొదట ఒక కూతురు, ఆ తర్వాతే కోడలు, భార్య, తల్లి.


లోకం అంతా "అయ్యో వెళ్లిపోయింది" అని ఏడుస్తుంటే, ఆ చీరె మాత్రం "రా తల్లీ, ఇంటికి రా" అని పిలుస్తుంది.


పుట్టినప్పుడు పంచెతో మొదలైన మేనమామ బంధం, పోయినప్పుడు చీరెతో ముగుస్తుంది.


ఆఖరి చీరె తెచ్చే బాధ్యత కోసమే మేనమామ బతికి ఉండాలని పెద్దలు దీవించారు.


మొత్తంగా సంధానం ఏమిటంటే -


మేనమామ అనేది ఒక బంధం పేరు కాదు, అది ఒక బాధ్యత పేరు.


పుట్టినప్పుడు ఒడిలోకి తీసుకునే బాధ్యత,


పెళ్లిలో భుజం మీద మోసే బాధ్యత,


పండక్కి సారె మోసుకొచ్చే బాధ్యత,


చివరకు కడసారి చీరె తెచ్చి తన ఆడబిడ్డను తానే సాగనంపే బాధ్యత.


ఈ నాలుగు బాధ్యతలను మోసే మనిషికి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఎలా ఉంటారు? అందుకే మన ఇంట్లో ప్రతి పనికి ముందు - ముందు మేనమామకు చెప్పండి అంటారు.

పంచాంగం 22.08.2026 Saturday,

  ఈ రోజు పంచాంగం 22.08.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష దశమి తిథి స్థిర వాసర జ్యేష్ఠ నక్షత్రం నిష్కంభ యోగః తైతుల తదుపరి గరజి కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: దశమి.



 

నమస్కా🕉️


పంచాంగము 🌓 22.08.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: శుక్ల - శుద్ధ 


తిథి: దశమి రా.01:50 వరకు

తదుపరి ఏకాదశి

 

వారం: శనివారం - మందవాసరే

 

నక్షత్రం: జ్యేష్ఠ సా.04:06 వరకు

తదుపరి మూల


యోగం: విష్కుంభ రా.తె.05:44 వరకు 

తదుపరి ప్రీతి

 

కరణం: తైతుల ప‌.12:47 వరకు

తదుపరి గరజ రా.01:50 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: లేదు 


దుర్ముహూర్తం: ఉ‌.06:00 - 07:36


రాహు కాలం: ఉ‌.09:09 - 10:44


గుళిక కాలం: ఉ‌.06:00 - 07:35


యమ గండం: ప‌.01:53 - 03:28

 

అభిజిత్: 11:53 - 12:43


సూర్యోదయం: 06:00


సూర్యాస్తమయం: 06:37


చంద్రోదయం: ప‌.02:25


చంద్రాస్తమయం: రా.12:39


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


దిశ శూల: తూర్పు


నక్షత్ర శూల: తూర్పు


🌱 అశాదశమి‌ 🌱


🎋 దశవ్రతం‌ 🎋


💧 ఏకభుక్తము‌ 💧


🥛 ధదివ్రత‌ సంకల్పము 🥛


🏳️ శ్రీ ప్రతాప వేంకటేశ్వర

అవధాని జయన్తి 🏳️


🚩 కాఞ్చీజగద్గురు శ్రీపరమశివేన్ద్ర 

సరస్వతీ స్వామి పుణ్యతిథి🚩


🏳️ శ్రీ పద్మనాభతీర్థ పుణ్యతిథి 🏳️

 (గురు మఠం, కార్వార్)


🪄 తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి

పవిత్రోత్సవ అంకురార్పణ 🪄


🌴 అశ్వత్థ మారుతి పూజ 🌴


🎉 శ్రీ వేంకటేశ్వర వ్రతము 🎉


🎊 మదురై శ్రీ సోమసుందరర్రః

అవని‌ ఉత్సవం 🎊

 

🎊 శ్రీ వైకుంఠం వైకుంఠపతి 

పెరుమాళ్ అభిషేక ఉత్సవం 🎊


🔯 , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।



ప్రతిపదార్థ:



కచ్చిత్ — ఒకవేళ; న — కాదు; ఉభయ — రెండు; విభ్రష్టః — భ్రష్టుడై; ఛిన్న — చెదిరిపోయిన/విడిపోయిన; అభ్రమ్ — మేఘము; ఇవ — లాగా; నశ్యతి — నిశించిన; అప్రతిష్ఠః — ఎటువంటి ఆధారం లేకుండా; మహా-బాహో — గొప్ప బాహువులు కల, కృష్ణా; విమూఢః — దిగ్భ్రమచెందిన; బ్రహ్మణః — భగవత్ ప్రాప్తి యొక్క; పథి — మార్గములో ఉన్న వ్యక్తి.



తాత్పర్యము: 


యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?




వివరణ:


విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం; భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము/కార్యసిధ్ధి రెండు రంగాలలో ఉంటుంది - భౌతిక మైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికప్రపంచం లో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడుతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ, వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.


ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.

చతుర్వేదాల వైభవం — వేదపురుషుల ధ్యానరూపాలు.*"_

 _"*చతుర్వేదాల వైభవం — వేదపురుషుల ధ్యానరూపాలు.*"_


 *వేదం అంటే జ్ఞానం* . 


*భారతీయ వైదిక సంప్రదాయానికి మూలాధారం అయిన చతుర్వేదాలు — "ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం."*


*వేదసాహిత్యంలో సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు వంటి విభాగాలు ఉన్నాయి.*


వేదాలను కేవలం గ్రంథాలుగా మాత్రమే కాకుండా వేదపురుషులుగా, సాకార ధ్యానమూర్తులుగా భావించే సంప్రదాయం కూడా ఉంది. 


శ్రీలక్ష్మీనారాయణ సంహితలో ఈ నాలుగు వేదాల ధ్యానరూపాలు ప్రత్యేకంగా వివరించబడ్డాయి.


━━━━━━━━━━━━━━━━━━

🌿 ౧. *ఋగ్వేదం — వేదజ్ఞానానికి ఆది స్వరూపం* 🌿

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం* :


 *ఋగ్వేదః శ్వేతవర్ణశ్చ* 

 *ద్విభుజో రాసభాననః* ।

 *అక్షమాలాంబుపాత్రం చ* 

 *బిభ్రన్ స్వాధ్యయనే రతః* ॥


 *భావం* :


ఋగ్వేద పురుషుడు శ్వేతవర్ణంతో, రెండు చేతులతో, రాసభం (గాడిద) ముఖంతో ధ్యానించబడతాడు. ఆయన చేతుల్లో అక్షమాల, జలపాత్ర ఉంటాయి. ఆయన ఎల్లప్పుడూ స్వాధ్యాయంలో నిమగ్నుడై ఉంటాడు.


*ఋగ్వేదం యొక్క గొప్పతనం.* ~


ఋగ్వేదం నాలుగు వేదాలలో ప్రాచీనమైనదిగా, విస్తృతమైనదిగా ప్రసిద్ధి చెందింది. దేవతాస్తుతులు, ప్రకృతి, యజ్ఞం, విశ్వతత్త్వం, మానవజీవితం, ఆధ్యాత్మిక చింతన వంటి అనేక అంశాలు ఇందులో కనిపిస్తాయి. భారతీయ మత, తత్త్వ, సాహిత్య వికాసానికి ఋగ్వేదం మూలాధారంగా నిలిచింది.


━━━━━━━━━━━━━━━━━━

🔥 ౨. *యజుర్వేదం — యజ్ఞకర్మకు మార్గదర్శి* 🔥

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *అజాస్యః పీతవర్ణశ్చ* 

 *యజుర్వేదోఽక్షసూత్రవాన్* ।

 *వామే చాంకుశపాణిస్తు* 

 *భూతిదో మంగళావహః* ॥


 *భావం* :


యజుర్వేద పురుషుడు పీతవర్ణంతో, అజముఖంతో (మేక ముఖంతో) ధ్యానించబడతాడు. ఆయన అక్షసూత్రాన్ని ధరించి, చేతిలో అంకుశాన్ని కలిగి, భూతి అంటే ఐశ్వర్యాన్ని, మంగళాన్ని ప్రసాదించేవాడిగా వర్ణించబడ్డాడు.


*యజుర్వేదం యొక్క గొప్పతనం.* ~


యజుర్వేదం ప్రధానంగా యజ్ఞకర్మకు మార్గదర్శకమైన వేదం. యజ్ఞంలో ఏ కర్మను ఎలా నిర్వహించాలి, ఏ మంత్రాన్ని ఎప్పుడు ఉపయోగించాలి వంటి విషయాలకు ఇది ముఖ్యమైన ఆధారం. అధ్వర్యువు అనే యజ్ఞ ఋత్విక్కు యజుర్వేదం ప్రధాన ఆధారం. దర్శపూర్ణమాస, అగ్నిహోత్ర, సోమయాగ, వాజపేయ, అశ్వమేధ వంటి అనేక యజ్ఞవిధానాలకు సంబంధించిన మంత్రాలు ఇందులో ఉన్నాయి.


━━━━━━━━━━━━━━━━━━

🎶 ౩. *సామవేదం — మంత్రానికి సంగీత స్వరూపం* 🎶

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *నీలోత్పలదలాభాసః* 

 *సామవేదో హయాననః* ।

 *అక్షమాలాధరః సవ్యే* 

 *వామే కంబుధరః స వై* ॥


 *భావం:* 


సామవేద పురుషుడు నీలకమల దళంలాంటి కాంతితో, గుర్రముఖంతో ధ్యానించబడతాడు. ఆయన అక్షమాలను ధరించి, మరొక చేతిలో శంఖాన్ని కలిగి ఉన్నవాడిగా వర్ణించబడతాడు.


*సామవేదం యొక్క గొప్పతనం.* ~


సామవేదం నాలుగు వేదాలలో అత్యంత సంక్షిప్తమైనది. ఇందులోని అధిక భాగం మంత్రాలు ఋగ్వేదం నుంచే వచ్చినప్పటికీ, వాటిని ప్రత్యేకమైన సామగాన స్వరపద్ధతిలో ఆలపించడం దీని ప్రత్యేకత. యజ్ఞంలో ఉద్గాతృ ఋత్విక్కు సామవేదం ప్రధాన ఆధారం. భారతీయ సంగీత సంప్రదాయ వికాసంతో సామవేదానికి అత్యంత సన్నిహితమైన సంబంధం ఉంది.


━━━━━━━━━━━━━━━━━━

🌿 ౪. *అథర్వవేదం — లోకక్షేమం, ఆరోగ్యం, శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం* 🌿

━━━━━━━━━━━━━━━━━━


 *ధ్యాన శ్లోకం:* 


 *అథర్వణాభిధో వేదో* 

 *ధవలో మర్కటాననః* ।

 *అక్షసూత్రం చ ఖట్వాంగం* 

 *బిభ్రన్ వై విజయప్రదః* ॥


 *భావం:* 


అథర్వవేద పురుషుడు ధవళవర్ణంతో, మర్కటముఖంతో (కోతి ముఖంతో) ధ్యానించబడతాడు. ఆయన అక్షసూత్రం, ఖట్వాంగాన్ని ధరించి, విజయాన్ని ప్రసాదించేవాడిగా వర్ణించబడ్డాడు.


*అథర్వవేదం యొక్క గొప్పతనం.* ~


అథర్వవేదంలో మానవ జీవితానికి సంబంధించిన అనేక విభిన్న విషయాలు కనిపిస్తాయి. ఆరోగ్యం, ఔషధాలు, రక్షణ, శాంతి, ఐశ్వర్యం, స్నేహం, దీర్ఘాయుష్షు వంటి విషయాలతో పాటు పరమసత్యం, కాలం, మరణం, అమరత్వం వంటి తాత్త్విక అంశాలు కూడా ఉన్నాయి.


భూమి సూక్తం, బ్రహ్మచర్య సూక్తం, కాల సూక్తాలు, వివాహ సూక్తం, సామనస్య సూక్తం వంటి ముఖ్యమైన సూక్తాలు అథర్వవేదంలో ఉన్నాయి. అందువల్ల అథర్వవేదం మానవ జీవనంలోని భౌతిక, సామాజిక, వైద్య, ఆధ్యాత్మిక అంశాలను ప్రతిబింబించే విశిష్ట వేదంగా నిలుస్తుంది.


━━━━━━━━━━━━━━━━━━

🌺 *చతుర్వేదాల సమగ్ర వైభవం* 🌺

━━━━━━━━━━━━━━━━━━


 *ఋగ్వేదం* — జ్ఞానం, స్తుతి, విశ్వచింతనకు ప్రధాన ఆధారం.


 *యజుర్వేదం* — యజ్ఞకర్మ, ఆచరణ, కర్మవిధానానికి ప్రధాన ఆధారం.


 *సామవేదం* — మంత్రాన్ని స్వరంతో, గానంతో యజ్ఞంలో ప్రతిష్ఠించే వైదిక సంప్రదాయం.


 *అథర్వవేదం* — ఆరోగ్యం, శాంతి, రక్షణ, లోకక్షేమం, తాత్త్విక జ్ఞానం వంటి విస్తృత జీవనాంశాలను ప్రతిబింబిస్తుంది.


ఈ నాలుగు వేదాలు పరస్పరం వేర్వేరు అంశాలను ప్రధానంగా ప్రతిపాదించినప్పటికీ, మొత్తం వైదిక సంప్రదాయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అవన్నీ కలిసి ఒక మహత్తర జ్ఞానపారంపర్యాన్ని నిర్మిస్తాయి.


*వేదం కేవలం పఠించవలసిన గ్రంథం మాత్రమే కాదు* —

*జీవితాన్ని ధర్మమార్గంలో నడిపించే జ్ఞానసంపద.*


 *వేదోఽఖిలో ~ ధర్మమూలమ్*


 🙏*ఓం శ్రీం ఓం* 🙏

21, ఆగస్టు 2026, శుక్రవారం

ప్రాపంచిక సుఖానికి

  **తాత్కాలికమైన ప్రాపంచిక సుఖానికి, శాశ్వతమైన అంతర్గత ఆనందానికి మధ్య తేడా ఏమిటి?*


విష్ణు సహస్రనామాలలో **శతానందః”అనే ఎంతో అద్భుతమైన నామం ఉంది. ఆదిశంకరులు దీనికి వందల కొద్దీ ఆనందాలను, అనంతమైన ఆనందాలను పొందినవాడు” అని అర్థం చెప్పారు.


మహాభారతంలో భీష్ముడు మానవాళి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పవిత్రమైన *విష్ణు సహస్రనామాన్ని* అందించాడు. అందులోని “శతానందః” అనే నామం ఆనందం యొక్క అసలైన స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది.


ఆది శంకరులు చెప్పిన వందల కొద్దీ ఆనందాలు అంటే ఏమిటి?


**తైత్తిరీయ ఉపనిషత్తు** ఆనందానికి అనేక స్థాయులు ఉన్నాయని చెబుతుంది. మనిషి పొందగలిగే అత్యున్నత ఆనందాన్ని **మానుషానందం** అంటారు. దానికంటే దేవ-మానవుల ఆనందం వంద రెట్లు ఎక్కువ. దానికంటే గంధర్వుల ఆనందం వంద రెట్లు ఎక్కువ. ఇలా ఒక్కో స్థాయి ఆనందం ముందు స్థాయి కంటే వంద రెట్లు పెరుగుతూ చివరకు *బ్రహ్మానందం*వరకు చేరుతుంది.


ఈ రకరకాల ఆనందాలన్నీ తనలోనే నిండుగా కలిగినవాడే *శతానందః—*

శ్రీ మహావిష్ణువు.


అంటే, మనం ప్రపంచంలో అనుభవించే సుఖాలన్నింటికంటే పరమమైన, శాశ్వతమైన ఆనందం భగవంతుని స్వరూపమే.


**మానుషానందం అంటే ఏమిటి?**


భూమండలాన్నంతటినీ పరిపాలించే ఒక గొప్ప చక్రవర్తిని ఊహించుకోండి. అతనికి శత్రువులు లేరు. అన్నీ అతనికి అనుకూలంగానే ఉన్నాయి. అతను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. చుట్టూ ఉన్నవారంతా అతనితో సంతోషంగా, స్నేహంగా ఉంటున్నారు. అతనికి తీరని కోరికలు కూడా ఏవీ లేవు.


అలాంటి వ్యక్తి అనుభవించే సంపూర్ణ సుఖాన్నే **మానుషానందం** అంటారు. భూమిపై ఇలాంటి ఆనందాన్ని అనుభవించిన వ్యక్తిగా *ధర్మరాజు యుధిష్ఠిరుడిని*

ఆది శంకరులు పేర్కొంటారు.


అయితే మనం రోజువారీ జీవితంలో అనుభవించే సుఖాలు మాత్రం శాశ్వతమైనవి కావు. ఈ రోజు మనకు ఆనందాన్ని ఇచ్చిన విషయం రేపు అదే ఆనందాన్ని ఇవ్వకపోవచ్చు. కొన్నిసార్లు అదే విషయం తర్వాత మనకు బాధను కూడా కలిగించవచ్చు.


అందుకే *ప్రాపంచిక సుఖం తాత్కాలికం, అంతర్గత ఆనందం శాశ్వతం.*


ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవడమే నిజమైన జ్ఞానానికి మొదటి అడుగు. బయట ఉన్న పరిస్థితులు మారినా, మనలోని శాంతి మరియు ఆనందం చెదిరిపోకుండా ఉండే స్థితిని సాధించడానికి మనం ప్రయత్నించాలి.


అప్పుడు జీవితంలో సుఖం కోసం బయట వెతకాల్సిన అవసరం ఉండదు. *నిజమైన ఆనందం మనలోనే ఉందని తెలుసుకుంటాం.*


*శుభమస్తు.*

ఓం స్వస్తి..👌🏼

శ్రీధర్ శర్మ తోటపల్లి..

శ్రీ సద్గురు పీఠం.....👉

చంపేంత కసి...

 గురువును చంపేంత కసి...

పదో తరగతి వయసులోనే ఎందుకు.?


రూపా రెడ్డి హత్య నన్ను వెంటాడుతున్న ప్రశ్నలు...

మన పిల్లలను మనం ఏ దిశలో తీసుకెళ్తున్నాం.?


– వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్


కొన్ని వార్తలు రాసి పక్కన పెట్టేయొచ్చు...


కొన్ని వార్తలు చదివి మరచిపోవచ్చు...


కానీ కొన్ని ఘటనలు మాత్రం మనసులో ప్రశ్నగా మిగిలిపోతాయి.


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు కూడా అలాంటి ఘటనగానే నాకు అనిపించింది.


పోలీసులు వెల్లడించిన వివరాలు విన్న తర్వాత ఒక ప్రశ్న నన్ను తీవ్రంగా కలచివేసింది...


“పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో కత్తులు ఎందుకొచ్చాయి?”


ఇంకా బాధ కలిగించే విషయం...


గురువుగా విద్యాబుద్ధులు చెప్పిన వ్యక్తిపైనే ఆమె వద్ద చదువుకున్న పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం.


ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీగా చదివి ముందుకు వెళ్లిపోవాల్సిన ఘటన కాదు.


ఇది మన కుటుంబ వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన విద్యా వ్యవస్థను ప్రశ్నిస్తోంది.


ఇది మన పిల్లల పెంపకాన్ని ప్రశ్నిస్తోంది.


ఇది మన సమాజాన్ని ప్రశ్నిస్తోంది.


పదో తరగతి వయసులో హత్య ఆలోచన ఎలా వచ్చింది?


పదో తరగతి...


ఒక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైన దశ.


ఈ వయసులో పిల్లలు భవిష్యత్తు గురించి కలలు కనాలి.


డాక్టర్ కావాలని...


ఇంజనీర్ కావాలని...


పోలీస్ కావాలని...


సైన్యంలో చేరాలని...


తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని...


కలలు కనే వయసు ఇది.


అలాంటి వయసులో...


డబ్బు కావాలి... అందుకోసం ఒక మనిషిని చంపాలి అనే ఆలోచన ఎలా వచ్చింది?


ఇది ఒక్కరోజులో పుట్టిన ఆలోచనా?


లేక చాలా కాలంగా పెరుగుతున్న ఏదో ఒక మానసిక పరిస్థితికి ఇది చివరి రూపమా?


డబ్బుపై ఆకర్షణ...


జల్సాలపై ఆసక్తి...


మద్యం వంటి అలవాట్లు...


బైకులపై మోజు...


కోపం...


తప్పు స్నేహాలు...


ఇవన్నీ ఒక బాలుడి ఆలోచనలను ఎంతగా ప్రభావితం చేయగలవు?


మన పిల్లల మార్కులు మనకు తెలుసు... వారి మనసులు తెలుసా?


పిల్లల మార్కులు తగ్గితే మనం వెంటనే గమనిస్తాం.


ర్యాంకు తగ్గితే ఆందోళన చెందుతాం.


చదువులో వెనుకబడితే పాఠశాలకు వెళ్లి మాట్లాడతాం.


కానీ...వారి ప్రవర్తనలో మార్పు వస్తే గమనిస్తున్నామా?


వాళ్లు ఎవరితో స్నేహం చేస్తున్నారు?


ఎక్కడికి వెళ్తున్నారు?


ఎవరితో తిరుగుతున్నారు?


ఎందుకు తరచూ డబ్బు అడుగుతున్నారు?


వారి ఫోన్‌లో ఏం చూస్తున్నారు?


వారి మాటల్లో, ఆలోచనల్లో కోపం పెరుగుతోందా?


మత్తు పదార్థాల వైపు ఆకర్షితులవుతున్నారా?


ఈ ప్రశ్నలను మనం ఎంతవరకు అడుగుతున్నాం?


మార్కులు తగ్గితే గమనిస్తున్నాం...


మరి విలువలు తగ్గితే?


పిల్లలకు ఖరీదైన విద్య ఇస్తున్నాం... కానీ జీవితం నేర్పుతున్నామా?


పిల్లలకు మంచి పాఠశాల కావాలి.


మంచి కాలేజీ కావాలి.


మంచి ఉద్యోగం కావాలి.


మంచి భవిష్యత్తు కావాలి.


ఇవన్నీ కోరుకోవడంలో తప్పు లేదు.


కానీ...వారికి మంచి మనిషిగా ఎలా జీవించాలో కూడా నేర్పుతున్నామా?


డబ్బు సంపాదించడం ఎలా అనేది నేర్పుతున్నాం.


డబ్బు కోసం ఏం చేయకూడదో కూడా నేర్పుతున్నామా?


గెలవడం ఎలా అనేది చెబుతున్నాం.


ఓడిపోయినప్పుడు ఎలా నిలబడాలో చెబుతున్నామా?


కోపం రావడం సహజమే.


ఆ కోపాన్ని ఎలా నియంత్రించాలో నేర్పుతున్నామా?


స్వేచ్ఛ ఇస్తున్నాం.


బాధ్యతను కూడా నేర్పుతున్నామా?


ఒకప్పుడు కుటుంబం ఒక పాఠశాల... ఇప్పుడు?


ఒకప్పుడు పిల్లల పెంపకంలో కుటుంబం పెద్ద పాత్ర పోషించేది.


తాతయ్యలు, అమ్మమ్మలు కథలు చెప్పేవారు.


మంచి–చెడు గురించి మాట్లాడేవారు.


మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలు పిల్లలకు పరిచయం చేసేవారు.


పెద్దలను గౌరవించడం...


చిన్నలను ప్రేమించడం...


ఇతరుల బాధను అర్థం చేసుకోవడం...


తప్పు చేస్తే ఒప్పుకోవడం...


ఇవి జీవితంలో భాగమని చెప్పేవారు.


ఇప్పుడు పిల్లలకు సమయం ఇస్తున్నామా?


లేక...వారికి వస్తువులు ఇస్తూ, సమయాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నామా?


ఖరీదైన ఫోన్ కొనివ్వగలుగుతున్నాం.


ఖరీదైన విద్య అందించగలుగుతున్నాం.


అవసరమైన ప్రతిదీ కొనివ్వగలుగుతున్నాం.


కానీ...వారి పక్కన కూర్చొని 

“నీ మనసులో ఏముంది?” అని అడగడానికి ఎంత సమయం కేటాయిస్తున్నాం?


పాఠశాల బాధ్యత కూడా అంతే ముఖ్యం


పాఠశాల అంటే కేవలం పాఠ్యపుస్తకాలు, పరీక్షలు, మార్కులు కాదు.


అది వ్యక్తిత్వాన్ని నిర్మించే స్థలం.


ఒక విద్యార్థి ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు వస్తే...


కొత్త స్నేహాలు ఏర్పడితే...


అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తే...


మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావం కనిపిస్తే...


కోపం, అసహనం పెరిగితే...


పాఠశాల కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.


అవసరమైతే కౌన్సెలింగ్ ఇవ్వాలి.


ఎందుకంటే...


ఒక విద్యార్థిని పరీక్షలో ఫెయిల్ కాకుండా కాపాడటం ఎంత ముఖ్యమో... అతను జీవితంలో తప్పు దారిలోకి వెళ్లకుండా కాపాడటం అంతకంటే ముఖ్యం.


ఇంతకీ రూపా రెడ్డి కేసులో ఏం జరిగింది?


ఇప్పుడు అసలు కేసు వివరాల్లోకి వస్తే...


నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసులో ఆమె వద్ద చదువుకున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో నిర్ధారించామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


ఈ కేసు దర్యాప్తు కోసం ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, దాదాపు 70 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి హత్యకు గురైన తర్వాత ఆమె చివరిసారిగా తన పిన్నితో మాట్లాడిన సమయంలో “బాబు” అని సంబోధించినట్లు పోలీసులు గుర్తించారు. స్కూల్‌లో కూడా ఆమె విద్యార్థులను అదే విధంగా పిలుస్తుండటంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు.


హత్య అనంతరం స్కూల్‌కు నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. స్కూల్ తిరిగి ప్రారంభమైన తర్వాత గైర్హాజరైన 13 మంది విద్యార్థులను పోలీసులు విచారించారు. వారిలో ఐదుగురు పదో తరగతి విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.


ఆ ఐదుగురిలో ఇద్దరు విద్యార్థులు ఇటీవల డబ్బు ఖర్చు చేస్తూ జల్సాలు చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు పోలీసులు తెలిపారు.


రూ.1.54 లక్షల నగదు.. అక్కడే అనుమానం


విచారణలో నిందితుల్లో ఒకరి వద్ద రూ.1.54 లక్షల నగదు పోలీసులు గుర్తించారు.


అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించగా తల్లిదండ్రులు ఇచ్చారని నిందితుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.


అయితే ఆ నగదు నోట్లపై రక్తపు మరకలు కనిపించడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.


పరీక్షల్లో ఆ రక్తం రూపా రెడ్డికి చెందినదేనని నిర్ధారణ అయినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


దీంతో దర్యాప్తులో కీలక ఆధారం లభించినట్లు పోలీసులు వెల్లడించారు.


హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చడంతో కోపం?


నిందితుల్లో ఒకరు గతంలో హాస్టల్‌లో ఉండేవాడు.


అతనికి మద్యం అలవాటు, బైకులపై మోజు ఉండేదని పోలీసులు గుర్తించారు.


అతని బ్యాగులో నగదు, ఫోన్‌ను గుర్తించిన రూపా రెడ్డి అతడిని మందలించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని హాస్టల్ నుంచి డే స్కాలర్‌గా మార్చినట్లు వెల్లడించారు.


ఆ ఘటన తర్వాత రూపా రెడ్డిపై ఆ విద్యార్థికి కోపం పెరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ తెలిపారు.


నెల రోజుల క్రితమే గోవాకు వెళ్లిన నిందితుడు


పోలీసుల ప్రకారం నిందితుల్లో ఒకరు నెల రోజుల క్రితం గోవాకు వెళ్లాడు.


ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో రూపా రెడ్డి ఇంట్లో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.


హత్యకు ఐదు రోజుల ముందే ఆమె ఇంటి వద్ద రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ వెల్లడించారు.


రూపా రెడ్డి ఇంట్లో స్కూల్ ఫీజులకు సంబంధించిన డబ్బు ఉంటుందని నిందితులకు తెలుసని పోలీసులు తెలిపారు.


మాస్కులు వేసుకుని ఇంట్లోకి.. గుర్తుపట్టడంతో దాడి


ఈ నెల 11న స్కూల్ ముగించుకుని రూపా రెడ్డి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు నిందితులు మాస్కులు ధరించి ఆమె ఇంటి వద్దకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.


గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన సమయంలో వారిలో ఒకరి మాస్క్ కిందపడిపోయిందని, దీంతో అతడిని రూపా రెడ్డి గుర్తించినట్లు దర్యాప్తులో తేలిందని ఎస్పీ తెలిపారు.


ఆమె తమను గుర్తించిందనే భయంతో ఆమెపై కత్తితో 27 సార్లు దాడి చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


అనంతరం కిందపడిపోయిన ఆమె వద్ద నుంచి ఫోన్ తీసుకుని, నగదుతో కలిసి అక్కడి నుంచి పరారైనట్లు ఎస్పీ తెలిపారు.


నిందితుల నుంచి స్వాధీనం


నిందితుల నుంచి:


- రూ.1.54 లక్షల నగదు

- ఒక ఐఫోన్

- రూపా రెడ్డికి చెందిన ఫోన్


స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.


ఇద్దరు నిందితులు మైనర్లు కావడంతో వారిని జువెనైల్ జస్టిస్ కోర్టు ముందు హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.


మళ్లీ అదే ప్రశ్న...


కేసు దర్యాప్తు వివరాలు ఇప్పుడు మనకు తెలిసాయి.


పోలీసులు తమ పని చేశారు.


నిజానిజాలు న్యాయ ప్రక్రియలో తేలాల్సి ఉంది.


చట్టం తన పని చేస్తుంది.


కానీ సమాజం తన పని ఎప్పుడు చేస్తుంది?


పదో తరగతి వయసులోనే ఒక బాలుడి ఆలోచనలు ఇంతటి నేరం వైపు ఎందుకు వెళ్లాయి?


ఈ ప్రశ్నకు సమాధానం కేవలం ఆ ఇద్దరు బాలుర వద్ద వెతికితే సరిపోదు.


కుటుంబంలో వెతకాలి.


పాఠశాలలో వెతకాలి.


స్నేహ వాతావరణంలో వెతకాలి.


మన సమాజంలో వెతకాలి.


పిల్లలు నేరం చేసిన తర్వాత వారిని నిందించడం చాలా సులువు.


కానీ...వాళ్లు నేరం చేసే స్థితికి చేరుకునే ముందే వారి చేతిని పట్టుకోవడమే అసలైన బాధ్యత.


రూపా రెడ్డి మరణం ఒక కుటుంబానికి తీరని విషాదం.


ఇద్దరు బాలలపై హత్య ఆరోపణలు వారి కుటుంబాలకు మరో విషాదం.


కానీ ఈ ఘటనను కేవలం ఒక క్రైమ్ న్యూస్‌గా చూసి మర్చిపోతే...


మనం అసలు పాఠాన్ని కోల్పోయినట్టే.


మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే కాదు... ఆ భవిష్యత్తును మంచి మనుషులుగా నిర్మించాల్సిన బాధ్యత కూడా మనదే.


–వెంకటేశ్వరరావు ఉమ్మిడిశెట్టి

నేషనల్ మీడియా జర్నలిస్ట్

నిజం ఆ రోజులే వేరు !!*

 *నిజం ఆ రోజులే వేరు !!*

*#############*


ఈ 40, 50 ఏళ్ళల్లో మన జీవితాల్లో వచ్చిన మార్పులు పరికిస్తుంటే బోలెడు ఆశ్చర్యం కలుగుతోంది. అప్పట్లో అలా ఉండే జీవనం ఇలా మారిపోయింది ఏమిటా అనే ప్రశ్న కి జవాబు మాత్రం దొరకడం లేదు.


ఉద్యోగం వచ్చి సొంతూరు వదిలేవరకు రైలు పెట్టెల్లా వరుసగా మూడు గదులుండే ఇంటిలో అయిదుగురం ఉండేవాళ్ళం. అప్పట్లో చాలా మంది ఇళ్ళు ఇలాగే ఉండేవి.


ముందు వరండా, వెనుక పడక గది, ఆ వెనుక వంట / భోజనాల గది. ఎవరైనా బంధువులు వచ్చినా అందులోనే సర్దుకునేవాళ్ళం. అందరం కలిసి కిందనే కూచుని అన్నాలు తినేవాళ్ళం. నేల మీద చాపలు, బొంతలు పరుచుకుని ఇంట్లో ఉన్న ఏకైక ceiling fan కింద 

హాయిగా నిద్ర పోయేవాళ్ళం. దోమలు ఉండేవి కావు, చల్లటి గాలి వచ్చేది కిటికీల్లోంచి.


ఇప్పుడు 3 BHK+ 2 car పార్కింగ్ + రెండు బాల్కనీ లున్నా బిక్కు బిక్కు మంటూ ఇంటికి ఇద్దరు లేక నలుగురే. కింగ్ బెడ్లు, ఏసీ లు ఉన్నా నిద్ర కరువే.

ఇక బంధువులు వచ్చినా ప్రైవసీ అంటూ హోటల్ లోనే బస. ఇదివరకటిలా కబుర్లు కాకరకాయలు లేవు. ఇదివరకు మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే మొహం మీదే అడిగేసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కర్టెసీ మాటలే. వాళ్ళేమనుకుంటారో ఆనుకుని పొడి పొడి కబుర్లే. ఆ చుట్టాలు కూడా చుట్టం చూపుగా వచ్చి భోజనం తిన్నాం అనిపించి వెళ్ళిపోడమే.


ఏ కాలమైనా సరే, పొద్దున్నే బావి దగ్గిర నుంచుని బొక్కేనల కొద్దీ నీళ్లు తోడుకుని ఎగురుతూ, గెంతుతూ, అన్నదమ్ములం ఒకరి మీద ఒకరు నీళ్లు జల్లుకుంటూ నూతి గట్టు మీదే స్నానం చేసేవాళ్ళం. వేసవి కాలం చల్లగాను, చలికాలం వెచ్చగాను ఉండేవి బావిలోని నీళ్లు. అంతసేపు నానకండిరా, జలుబు చేస్తుంది అని అమ్మ ఓ పక్కన అరుస్తూనే ఉన్నా వినేవాళ్ళమా, నూతి గట్టు వదిలేవాళ్ళమా? ఇక వేసవికాలం అయితే చెప్పేదేముంది, రోజుకి మూడుసార్లు స్నానం చేసేవాళ్ళం.


ఇప్పుడు చలువరాతి బండలున్న బాత్రూం లో షవర్లు, వెచ్చగా నీళ్లిచ్చే గీజరులున్నా కాకి స్నానంలా ఏదో నాలుగు చెంబులు వంటిమీద తూ తూ మంత్రంలా దిమ్మరించుకుని, తువ్వాలు చుట్టుకుని, జారి పడకుండా గోడకున్న స్టీల్ రాడ్ పట్టుకుని, జాగ్రత్తగా బయట పడి అమ్మయ్య అనుకుంటున్నాం.


ఏ కాలం లో అయినా, బడికి ఎంత దూరమైనా సరే, ఓ పుస్తకాల గుడ్డ సంచీ భుజానికి తగిలించుకుని నడుచుకుంటూనే బడికి పోయేవాళ్ళం.

ఇప్పుడు పిలగాళ్లు ఇంటి ముంగట్లోనే ఏసీ స్కూలు బస్సులు ఎక్కి బడికి పోతున్నారు. వాళ్ళ నాన్నలు పరలాంగ్ దూరానికి కూడా నడవక బళ్ళు తీస్తున్నారు. ఎవ్వరికీ నడకలు ఇష్టం ఉండడం లేదు.


డిగ్రీ చదివేవరకు కూడా చద్దన్నంలో ఆవకాయ కలుపుకుని, ఆఖరన మజ్జిగ పోసుకుని ఆవకాయ పెచ్చు కొరుక్కుని కడుపునిండా తిన్న ఆ అన్నం ముందు నేడు తింటున్న ఖరీదైన ప్రోటీన్లు, ఫైబర్లు, ఆర్గానిక్ ఫుడ్స్, హైబ్రీడ్ కూరలు, కట్టె గానుగ నూనెల తిండి తో అన్న హితవే లేకుండా పోయింది.


ఇంట్లో ఒక సైకిల్ ఉంటే మహా గొప్పగా తలచే రోజులనుంచి ఇంటికి ఒక కారు రెండు స్కూటర్ల స్థాయికి చేరుకున్నా, నాన్నగారు తొక్కుతున్న సైకిల్ వెనక కారియర్ మీద నేనంటే నేను అని అన్నాదమ్ములతో పోట్లాటల మద్య సైకిల్ మీద తిరిగిన రోజులే బాగున్నట్లున్నాయి. రిక్షా ఎక్కినా పుష్పక విమానం ఎక్కిన గొప్ప ఫీలు ఉండేది అప్పట్లో.


సంక్రాంతి పండగకి కుట్టించిన మూడు జతల బట్టలతోటే ఆనందంగా గడిపిన రోజులనుంచి బీరువాల్లో అన్ని బట్టలు మూలుగుతున్నా ఫంక్షన్స్ కి వెళ్లే ఓపిక లేక, ఓపిక చేసుకున్నా ఎడతెగని బట్టల ఎంపిక తో విసుగు తెప్పిస్తున్న రోజులివి.

సాదా బట్టలతో వెళితే చుట్టాలు చెవులు 

కొరుక్కునే, హంగు ఆర్భాటాల డాబుసరి ప్రదర్శనల రోజులివి.


జనరల్ బోగీలో చెక్క బల్లల మీద కిటికీ పక్కన నేనంటే నేను అని తోడ బుట్టిన వారితో కొట్లాడి కిటికి పక్కకు చేరి పరుగెడుతున్న చెట్లని చూస్తూ, కంట్లో బొగ్గు నలకలు పడుతున్నా అమ్మకానికి వచ్చిన పల్లీలు, బఠానీలు ఏడ్చి రాగాలు తీస్తూ కొనిపించుకుని తిన్న ఆనందం, పక్కవారితో మాట్లాడకుండా ఫోనులో ములిగిపోయిన సాటి ప్రయాణీకుల మద్య, అద్దాలు బిగించిన ఏసీ బోగీల్లో బిగుసుకుని కూచుని చేస్తున్న నేటి ప్రయాణాల్లో కనపడడం లేదు. 


అప్పుడే దిగాల్సిన స్టేషన్ రాకూడదు అనుకున్న రోజుల నుంచి ఇంకెంతసేపురా బాబూ అనిపించే మౌన ప్రయాణపు రోజులివి.


ప్రయాణంలో దాహం వేస్తే స్టేషన్ రాగానే ఉరుక్కుంటూ వెళ్లి ప్లాట్ఫారం మీదున్న పంపు కింద చేయి పెట్టి ఏమాత్రం సందేహించకుండా నీళ్లు తాగి, మరచెంబుల నిండా నీళ్లు 

పట్టుకుని రైలు ఎక్కిన రోజుల నుంచి, best మినరల్ వాటర్ బాటిల్ అని మల్టీ నేషనల్ కంపెనీవాడు చెప్పినా కూడా సందేహిస్తూనే బోలెడు డబ్బులు పోసి కొనుక్కున్న నీళ్లు తాగుతున్న రోజుల్లో ఉన్నాం.


జలుబో, జ్వరమో, దగ్గో వస్తే RMP డాక్టర్ గారిచ్చిన రంగు నీళ్లు తాగి, బిళ్ళలు మింగగానే ఇట్టే తగ్గిపోయిన రోగాలు ఇప్పుడు సీబీపీ లాంటి రక్త పరీక్షలు, MRI, CT స్కాన్ లు చేయించుకుని ఖరీదైన మందులు మింగుతున్నా ఒక పట్టాన తగ్గడం లేదేమిటో!


పెళ్ళికి అయిదురోజుల ముందు వెళ్లి పచ్చటి కొబ్బరాకుల పందిరి ఆటల చుట్టూ అందరి బంధువుల పిల్లలతో కలిసి ఆడిన ఆటలు, బంక్తి భోజనాలు చేసి, ఏదో మూల పరిచిన చాప/దుప్పట్ల మీద వళ్ళు తెలియకుండా పడుకున్న రోజులు నుంచి , నేటి పెళ్లిళ్ళల్లో ముహూర్తం టైం కి వెళ్ళామా, మండపం ఎక్కి అక్షింతలు వేశామా, గిఫ్ట్ కవర్ ఇచ్చామా, ఫొటోలో పడ్డామా,

ప్లేట్ పట్టుకుని గుంపులో గోవిందాలాగా ఏదో కతికామా, రిటర్న్ గిఫ్ట్ అందుకున్నామా, అనే రోజులకి వచ్చాం. పెళ్లి మండంపం లో కన్నా రానూ పోను ప్రయాణ ట్రాఫిక్లో గడుపుతున్న టైమే ఎక్కువ ఉంటున్న రోజులివి.


పోతే, ఇలా ఇప్పుడు అప్పుడు అంటూ పోలికలు చేసుకోడం, ఆ రోజులే బాగున్నాయి, అవి మళ్ళీ వస్తే బాగుండును అని అనుకోడానికి తప్ప ఈ రాతల వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. నిజంగానే టైమ్ మెషిన్

ఎక్కి వెనక్కి వెళ్లినా, ఇప్పుడు మనకున్న రోగాలతో, సుఖాలు మరిగిన కాయాలతో, ఒక్కరోజు దాటి ఉండలేము. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో, నేటి ఉరుకుల పరుగుల జీవనంలో అప్పట్లా ఉండడం అస్సలు కుదరదు అనుకోండి. ఏదో కాస్త ఇలా పోల్చుకుంటూ ఆ రోజులు జ్ఞాపకం తెచ్చుకుంటూ, ఆ ఘనమైన గతాన్ని తలుచుకుంటూ, తృప్తి పడడమే మిగిలింది మనకి.


 ఇప్పుడు మానవ సంబంధాలు తగ్గిపోయి యాంత్రికంగా అయిపోతున్నాం, చుట్టూ గిరి గీసుకుని ఉండిపోతున్నాం. ఇదివరకటి స్నేహాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, తోడబుట్టిన వారిలో కూడా నెమ్మదిగా కనుమరుగు అవుతున్న రోజులివి.

మన జనరేషన్ మాత్రమే అనుభవించిన అనుభవిస్తున్న - కాలంతో పరుగు తీయలేక నిస్సహాయంగా వెళ్లబుచ్చుతున్న నగ్న సత్యాలు.

ఏమంటారు కాదంటారా??

సంసార సాగరం నుండి ఎలా బయట పడాలి?*

 *సంసార సాగరం నుండి ఎలా బయట పడాలి?*


ఈ సంసారం అంటే ఒక ముళ్ళ మంచం లాంటిది. అడుగడుగునా గుచ్చుతుంది.  

ఈ లోకమంతా దుఃఖాలతో నిండి ఉంది. మన శరీరం కూడా రోగాలతో నిండినదే.


ఈ సంసార బాధలకు భయపడే సూర్యుడు, చంద్రుడు కూడా ఆకాశంలోనే తిరుగుతున్నారు.  

శివుడు ఈ లోక గొడవలు వద్దని కైలాస పర్వతాన్ని తన ఇల్లు చేసుకున్నాడు.  


విష్ణువు పాల సముద్రంలో ఆదిశేషుని పడవలా చేసుకొని దానిపై పడుకున్నాడు.  


బ్రహ్మ దేవుడు కూడా నీటిపై ఉన్న కమలాన్నే తన సీటుగా ఎంచుకున్నాడు. 


ఇదంతా సరదాగా చెప్పిన మాట.


ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి వరకు కేవలం పొట్ట నింపుకోవడం కోసం, 

డబ్బు సంపాదించడం కోసం పరిగెడితే... 

మన జీవితానికి అర్థమే ఉండదు. 

అది పూర్తిగా వృధా అయిపోతుంది.


ఈ లోకంలోని చిన్న చిన్న సుఖాల వెంట పడితే, మనకు నిజమైన ఆనందాన్ని ఇచ్చే దేవుడు దొరకడు.


అబద్ధమైన ఈ ప్రపంచాన్ని నెత్తిన పెట్టుకుని, బాధపడుతూ, దుఃఖంలో మునిగి చివరికి చనిపోతే... మిగిలేది గుప్పెడు బూడిద మాత్రమే.


మనిషిగా పుట్టినందుకు మనం ఈ లోకంలో గొప్పగా సాధించింది ఏముంది? 


మన బంధువులు, స్నేహితులు, డబ్బు, ఆస్తి, ఇల్లు, కారు... వీటిలో ఏదీ మనతో పాటు రాదు.


మనం బతికుండగా చేసిన మంచి పనులు, చెడు పనులు మాత్రమే మన వెంట వస్తాయి.


*సారాంశం ఒకే లైన్ లో:*  

లోకంలో ఉంటూనే, లోకానికి అతుక్కోకుండా, మంచి చేస్తూ, దేవుణ్ణి గుర్తుంచుకుంటూ బతకడమే సంసార సాగరం నుండి బయటపడే మార్గం.


శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం*🪷

 🪷

*ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం*🪷


*ప్రజలు తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం, భయాలను అధిగమించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడే అనేక పుస్తకాలు, వ్యాసాలు ఉన్నాయి. అయితే, ఆత్మవిశ్వాసం చాలాసార్లు మన ప్రాపంచిక విజయాలపై, ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది. అంటే, నేను ఏమి సాధించాను, నా వద్ద ఏమి ఉంది, నేను ఏ స్థాయిలో లేదా ఏ పదవిలో ఉన్నాను అనే విషయాలపై అది ఆధారపడి ఉంటుంది.*


*నేను ఆ పదవిలో లేనప్పుడు, ఇతరులు నా గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు లేదా నేను కూడబెట్టుకున్న ఆస్తులు, వస్తువులు నా వద్ద లేనప్పుడు కూడా నా ఆత్మవిశ్వాసం అలాగే ఉంటేనే అది నిజమైన ఆత్మవిశ్వాసం. ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం అనేది నేను ఏమిటి అనే దానిపై కాదు, నేను ఎవరు అనే అవగాహనపై ఆధారపడి ఉంటుంది. ఆ అవగాహనను ఎవరూ నా నుండి దూరం చేయలేరు.*


*ఒక వ్యక్తి ఎంతో ఉన్నత విద్యావంతుడై, విజయవంతుడై ఉండవచ్చు. అయినప్పటికీ, అతని అంతరంగంలో అభద్రతా భావం ఉండవచ్చు. మరోవైపు, చాలా తక్కువ వనరులు ఉన్న కొందరు తమ నిజమైన ఆధ్యాత్మిక స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని ప్రసరింపజేయగలరు.*


*ఇది “నేను ఎవరు?” అనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా కలిగే నిశ్శబ్దమైన విశ్వాసం నుంచి ఉద్భవిస్తుంది. నేను శాశ్వతమైన ఆత్మను. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం నా సహజ స్వభావాలు. పరమాత్మ అయిన భగవంతుడు నా శాశ్వత సహచరుడు. ప్రతి పరిస్థితిని ఎదుర్కొనే అంతర్గత శక్తి నాలో ఉంది.*


*ఇలాంటి ఆత్మవిశ్వాసం ప్రశాంతంగా, వినయంగా ఉంటుంది. దీనికి ఇతరుల ఆమోదం లేదా గుర్తింపు అవసరం ఉండదు.*


*సవాళ్లు ఎదురైన సమయంలో కూడా ఈ అవగాహనను నిలుపుకోగలగడం నుంచే ఆత్మవిశ్వాసం వస్తుంది. మనందరిలోనూ ఉండే అంతర్గత స్వరం నుంచే అంతర్గత మార్గదర్శకత్వం లభిస్తుంది. దానిని మనం అంతఃప్రజ్ఞ లేదా మనస్సాక్షి అని పిలవవచ్చు.*


*మనస్సు ప్రశాంతంగా, బుద్ధి స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఈ అంతర్గత మార్గదర్శకత్వం ఎంతో స్పష్టంగా ఉంటుంది. కోపం, అహంకారం లేదా ఆందోళనతో మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు, ఆ అంతర్గత మార్గదర్శకత్వాన్ని స్పష్టంగా వినలేం.*


*నీటిలో అలలు ఎక్కువగా ఉన్నప్పుడు అందులో మన ముఖ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడటం ఎంత కష్టమో మనకు తెలుసు. నీరు నిశ్చలంగా మారినప్పుడు మన ప్రతిబింబాన్ని స్పష్టంగా చూడగలుగుతాం. అదే విధంగా, ధ్యానం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారినప్పుడు, అంతర్గత స్వరం మనకు సరైన మార్గాన్ని స్పష్టంగా చూపించడం ప్రారంభిస్తుంది.*


*చాలామంది ఇతరుల అభిప్రాయాలపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తమను తాము అనుమానించుకుంటారు. అందువల్ల అంతర్గత స్వరాన్ని స్పష్టంగా వినడం, దానిపై విశ్వాసం ఉంచడం బదులు, “ప్రజలు ఏమనుకుంటారు?”, “నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా?”, “నేను విఫలమైతే ఏమవుతుంది?” అని ఆలోచిస్తుంటారు.*


*మన స్వంత ఆధ్యాత్మిక జ్ఞానం కంటే ప్రపంచాన్ని ఎక్కువగా నమ్మడం ప్రారంభించాం. అయితే, మన నిజమైన స్వరూపం గురించి మనం ఎంత ఎక్కువగా అవగాహన పెంచుకుంటామో, అంతర్గత స్వరం అంత స్పష్టంగా వినిపిస్తుంది. మన ఆలోచనలు, మాటలు, చర్యలు మనకు మరియు ఇతరులకు మేలు చేసే ఫలితాలను అందించడంతో మన ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.*


*క్రమంగా మన అంతర్గత మార్గదర్శకత్వాన్ని విశ్వసించడం ప్రారంభిస్తాం. మన ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని దశలవారీగా పెంపొందించుకోవచ్చు.*


*ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసాన్ని పెంచుకునే మార్గాలు*


1. *నేను చైతన్యంతో కూడిన కాంతి శక్తి అయిన ఆత్మను అనే విషయాన్ని తెలుసుకోవాలి.*


2. *ప్రతిరోజూ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినాలి, అధ్యయనం చేయాలి.*


3. *మౌనం అంటే కేవలం మాటలు మాట్లాడకపోవడం కాదు. ప్రతి రోజు ప్రారంభంలో కొన్ని క్షణాలు మౌనంగా ఉండాలి. అలాగే, రోజు ముగింపులో కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవాలి.*


4. *ప్రతి ఉన్నతమైన ఆలోచనను ఆచరణలో పెట్టాలి ఎందుకంటే ప్రతి సానుకూల అనుభవం మన ఆత్మవిశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది.*


*మన అంతర్గత స్వరాన్ని విన్న తర్వాత, అది నిజమైన అంతర్గత మార్గదర్శకత్వమా లేదా మన స్వంత కోరికల ప్రభావమా అని తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలను మనం వేసుకోవచ్చు.*


*ధ్యానంలో పరమాత్మతో అనుసంధానమైనప్పుడు, బుద్ధి స్వచ్ఛంగా మారుతుంది, హృదయం బలపడుతుంది, జీవితం అర్థవంతంగా మారుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసం మన సహజ స్వభావంగా మారుతుంది.*



 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

*సర్వేజనా సుఖినోభవంతు*

*లోకాస్సమస్తాః సుఖినోభవంతు*

*సమస్త సన్మంగళాని భవంతు*

 *శుభం భూయాత్*

 *శుభమస్తు*

*ఓం శాంతి శాంతి శాంతిః*

*స్వస్తి*

పంచాంగం 21.08.2026 Friday,

   ఈ రోజు పంచాంగం 21.08.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష నవమి తిథి భృగు వాసర అనురాధ నక్షత్రం వైధృతి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: నవమి.



 

నమస్కా⚛️


పంచాంగము 🌓 21.08.2026


🪔 శ్రీ ధన్యాశ్రీధరాయనమః‌ 🪔 


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: శుక్ల - శుద్ధ 


తిథి: నవమి రా.11:56 వరకు

తదుపరి దశమి

 

వారం: శుక్రవారం - భృగువాసరే

 

నక్షత్రం: అనూరాధ ప‌.01:36 వరకు 

తదుపరి జ్యేష్ఠ


యోగం: వైధృతి రా.తె.04:46 వరకు 

తదుపరి విష్కుంభ

 

కరణం: బాలవ ఉ‌.11:01 వరకు

తదుపరి కౌలువ రా.11:56 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.07:47 - 09:33 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:22 

మరియు ప‌.12:44 - 01:34


రాహు కాలం: ఉ‌.10:44 - 12:19


గుళిక కాలం: ఉ‌.07:34 - 09:09


యమ గండం: ప‌.03:28 - 05:03

 

అభిజిత్: 11:54 - 12:44


సూర్యోదయం: 06:00


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: ప‌.01:32


చంద్రాస్తమయం: రా.12:39


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: వృశ్చికం


దిశ శూల: పశ్చిమం


🎊 శ్రీ వరమహాలక్ష్మి వ్రతం 🎊


🌼 జర - జీవంతికా పూజ 🌼


💦 వైధృతి‌ శ్రాద్ధము 💦


📿 దేవి పవిత్రారోపణం‌ 📿


🎉 నకుల‌ నవమి 🎉


🌷 కౌమారి పూజ 🌷


🏳️ కులైసిరై నాయనార్ 

గురుపూజ‌ 🏳️


🚩 నారాయణ్ మహరాజ్ 

పుణ్యతిథి‌ 🚩


🏳️ తఱిగొండ‌ వెంగమాంబ 

వర్ధంతి 🏳️


🎉 మదురై చొక్కనాథర్ 

పానన్ ఉత్సవం 🎉


🔯రః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



కచ్చిన్నోభయవిభ్రష్టః ఛిన్నాభ్రమివ నశ్యతి ।

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః పథి ।। 38 ।।



ప్రతిపదార్థ:



కచ్చిత్ — ఒకవేళ; న — కాదు; ఉభయ — రెండు; విభ్రష్టః — భ్రష్టుడై; ఛిన్న — చెదిరిపోయిన/విడిపోయిన; అభ్రమ్ — మేఘము; ఇవ — లాగా; నశ్యతి — నిశించిన; అప్రతిష్ఠః — ఎటువంటి ఆధారం లేకుండా; మహా-బాహో — గొప్ప బాహువులు కల, కృష్ణా; విమూఢః — దిగ్భ్రమచెందిన; బ్రహ్మణః — భగవత్ ప్రాప్తి యొక్క; పథి — మార్గములో ఉన్న వ్యక్తి.



తాత్పర్యము: 



యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాల రెండింటి నుండి భ్రష్టుడై పోడా? ఓ మహా బాహువులు గల కృష్ణా, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూకాకుండా పోడా?



వివరణ:



విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం; భగవంతుడు సర్వ-పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలము లాగే పరిపూర్ణంగా, విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము/కార్యసిధ్ధి రెండు రంగాలలో ఉంటుంది - భౌతిక మైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతికప్రపంచం లో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడుతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు, భౌతిక ప్రయాసలని విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసమే పాటుపడతారు. కానీ, ఇంటువంటి ఆధ్యాత్మిక వాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవటం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ, వారి స్థితి ఒక విడిపోయి చెదిరిపోయిన మేఘము మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.


ఒక మేఘము, తన గుంపు నుండి విడిపోతే, అది నిరర్థకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు, దాని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే, ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు.

18, ఆగస్టు 2026, మంగళవారం

శ్రీమద్భాగవతం - 22/42*

 *


    *శ్రీమద్భాగవతం - 22/42* 


*మత్స్యావతారం, సూర్యవంశం & అంబరీషుని ఏకాదశి వ్రతం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో

నిన్నటి రోజున వామనావతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మత్స్యావతార వృత్తాంతం (సత్యవ్రతుని కథ), సూర్యవంశ ఆరంభం మరియు అంబరీష మహారాజు ఏకాదశి వ్రతం / దుర్వాస మహర్షి గర్వభంగం** గురించిన వివరాలు యథాతథంగా తెలుసుకుందాం.


#1. మత్స్యావతార ఆవిర్భావం & సత్యవ్రతుడు


చాక్షుష మన్వంతరాంతంలో 'సత్యవ్రతుడు' అనే రాజర్షి (ఈయనే తర్వాతి జన్మలో అంటే ప్రస్తుతం జరిగే మన్వంతరం లో వివస్వంతునీ పుత్రుడు గా పుట్టి వైవస్వత మనువు అయ్యాడు) కృతమాల నదిలో జల తర్పణాలు ఇస్తుండగా, ఆయన దోసిలి నీటిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది.దాన్ని నీటితో సహా మళ్ళీ నదిలోకి జారవిడిచాడు సత్యవ్రతుడు. 


* **రక్షణ కోరిన చేప:** ఆ చిన్న చేపమిక్కిలి దైన్య స్వరంతో"రాజా! నన్ను ఈ పెద్ద చేపల నుండి రక్షించు" అని వేడుకొనగా, సత్యవ్రతుడు దయతో దాన్ని తన కమండలంలో వేశాడు.


* **రూప పెరుగుదల:** మరుసటి రోజుకి ఆ చేప కమండలానికి పట్టనంతగా పెరిగింది. రాజా నాకు ఉండుటకు చోటు చాలడం లేదు కాస్త పెద్ద స్థానం ఏర్పాటు చేయి అని వేడుకోగా రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు, అందులో వేసిన క్షణాల్లోనే అది మూడు మూరలు పెరిగింది రాజా నాకు ఇది కూడా చాలటం లేదు అంటే సరస్సులో వేశాడు అందులో కూడా క్షణాల్లో పెరిగితే, నీరు బాగా సమృద్ధిగా ఉండే పెద్ద తటాకం లో వేసాడు,ఇక ఎక్కడ ఉంచాలో అర్దం కాలేదు సముద్రమే అనంతం కనుక అందులో వదులుతూ ఉండగా లీలా మత్స్యం ఇలా అన్నది రాజా సముద్రం లో మొసళ్ళు ఉంటాయి నన్ను తినేస్తాయి వదలకు అన్నది.


ఆ మత్స్యము యొక్క మధురమైన పలుకులు విని సత్యవ్రతుడు ఇలా అన్నాడు. నన్ను మోహం లో ముంచిన నీవు ఎవరు, ఒకేరోజు లో వందయోజనల సరస్సు ఆక్రమించావు. ఇలాంటి జలచరం ఎక్కడ కనలేదు వినలేదు. నీవు తప్పక సర్వాంతర్యామి అయిన శ్రీహరే జీవులను అనుగ్రహించుటకు ఇలా మత్స్య రూపం ధరించావు అని స్వామికి ప్రణమిల్లగా, మత్స్యరూపి అయిన స్వామి ఇలా ఆజ్ఞాపించాడు:


"సత్యవ్రతా! ఇక్కడికి ఏడో రోజున ప్రళయం వచ్చి ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. ఆ సమయంలో ఒక పెద్ద నౌక (పడవ) నీ వద్దకు వస్తుంది. నువ్వు సకల ప్రాణుల సూక్ష్మ శరీరాలు వెంటపెట్టుకుని, సమస్త ఓషధులను, ధాన్యాలను, సప్తరుషులను ఆ నౌకలోకి ఎక్కించు. నేను ఈ సముద్రంలో కొమ్ము కలిగిన దివ్య మత్స్యరూపంలో ఈదుకుంటూ వస్తాను.వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసి, ఆ పడవను నా కొమ్ముకు కట్టివేయి. ప్రళయాంతం వరకు మిమ్మల్ని రక్షిస్తాను."


ఆ సమయమున చుట్టూ మహాసాగరజలములే యుండును. ఏ మాత్రమూ వెలుతురు ఉండదు. కేవలము ఋషులయొక్క దివ్యకాంతుల సహాయమున ఎట్టి తడ బాటూ లేకుండ నీవు ఆ నావపైన ఎక్కి నలువైపుల విహరించుచుండవలెను. ప్రచండవాయువుల కారణముగా ఆనావ ఇటునటు కదలుచుండును. అప్పుడు నేను ఈ మత్స్యరూపమున నేను దాన్ని రక్షిస్తూ ఉంటాను.


మహారాజా!అలా బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతోసహా నిన్ను ఆ నావను లాగుచు సముద్రమున విహరించెదను. 


ప్రళయ జలధిలో మత్స్యభగవానుడు సత్యవ్రతునికి, సప్తరుషులకు పరమ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు (దీనినే **'మత్స్య పురాణం'** అంటారు). అలాగే హయగ్రీవాసురుడు అపహరించిన వేదాలను సంహరించి బ్రహ్మదేవునికి అప్పగించాడు.


#2. నవమ స్కంధ ప్రవేశం – సూర్యవంశ వర్ణన (9వ స్కంధం – 1, 2, 3, 4 అధ్యాయాలు)


సత్యవ్రతుడు ప్రళయాంతంలో 'వైవస్వత మనువు' అయ్యాడు. వైవస్వత మనువు కుమారులలో **ఇక్ష్వాకువు, శర్యాతి, నాభాగుడు** మొదలైనవారు ప్రముఖులు.


* **ఇల వృత్తాంతం:** మనువు పెద్ద కుమారుడైన 'ఇలుడు' పరమశివుని శాపం వల్ల స్త్రీగా (ఇలగా) మారి, బుధుని వివాహమాడి పురూరవునికి జన్మనిచ్చాడు.

* **శర్యాతి & సుకన్య:** శర్యాతి చక్రవర్తి కుమార్తె సుకన్య పొరపాటున చ్యవన మహర్షి కళ్లను దర్భతో పొడిచింది. తప్పు తెలుసుకుని ముసలివాడైన చ్యవనుడిని వివాహం చేసుకుని పతిసేవ చేసింది. అశ్విని దేవతలు ప్రసన్నులై చ్యవనునికి నవయౌవనాన్ని అనుగ్రహించారు.


#3. అంబరీష మహారాజు భక్తి నిష్ఠ (9వ స్కంధం – 4వ అధ్యాయం)


సూర్యవంశంలో నాభాగుని కుమారుడైన **అంబరీష మహారాజు** మహాభాగవతోత్తముడు. సకల భూమండలానికి అధిపతి అయినప్పటికీ, ఐశ్వర్యాన్ని మిథ్యగా భావించి తన సకల ఇంద్రియాలను శ్రీహరి సేవలోనే నియోగించాడు: **"స వై మనః కృష్ణపదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే..."** *మనస్సును కృష్ణుని పాదపద్మాలపై, వాక్కును హరి గుణగానంపై, చేతులను హరి మందిర మార్జనంపై, చెవులను హరికథా శ్రవణంపై, నేత్రాలను విష్ణు విగ్రహ దర్శనంపై నిలిపి జీవించాడు.*


అంబరీషుని నిశ్చల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, ఆయన రాజ్యానికి ఏ ఆపదా రాకుండా తన **'సుదర్శన చక్రాన్ని'** రక్షణగా ఇచ్చి వెళ్లాడు.


#4. ఏకాదశి వ్రతం & దుర్వాస మహర్షి ఆగమనం (4, 5 అధ్యాయాలు)


అంబరీష మహారాజు తన భార్యతో కలిసి సంవత్సరం పాటు **'ద్వాదశి (ఏకాదశి) వ్రతాన్ని'** నియమబద్ధంగా ఆచరించాడు. వ్రత ముగింపు రోజున దానధర్మాలు పూర్తి చేసి పారణ (భోజనం) చేయడానికి సిద్ధపడుతుండగా, **దుర్వాస మహర్షి** తన శిష్యులతో అక్కడకు వచ్చాడు.


* **కాలపరిమితి ధర్మసంకటం:** అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించగా, మహర్షి యమునా నదిలో స్నానానికి వెళ్లాడు. ద్వాదశి ఘడియలు ముగిసిపోతున్నాయి. ద్వాదశి దాటితే వ్రతభంగం అవుతుంది, బ్రాహ్మణుడు రాకముందే తింటే అతిథి అవమానం అవుతుంది.

* **తీర్థ ప్రాశనం:** పండితుల సలహా మేరకు అంబరీషుడు కేవలం **తులసి తీర్థాన్ని మాత్రమే** పుచ్చుకుని ద్వాదశిని కాపాడుకున్నాడు.

* **దుర్వాసుని ఆగ్రహం & కృత్యోత్పత్తి:** తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టితో విషయగ్రహణం చేసి: "నన్ను కాదని భోజనం చేస్తావా!" అని తీవ్ర ఆగ్రహంతో తన జటను పీకి భూమిపై కొట్టాడు. దాని నుండి అంబరీషుడిని దహించడానికి భయంకరమైన **'కృత్య' (రాక్షసి)** ఆవిర్భవించింది.


#5. సుదర్శన చక్ర విక్రమం & దుర్వాసుని శరణాగతి (5వ అధ్యాయం)


అంబరీషుడు భయపడకుండా శ్రీహరిని ధ్యానిస్తూ నిలబడ్డాడు. మరుక్షణమే అంబరీషునికి రక్షణగా ఉన్న **సుదర్శన చక్రం** జ్వాలలను చిమ్ముతూ వచ్చి ఆ కృత్యను క్షణంలో బూడిద చేసింది. ఆ తర్వాత దుర్వాసుడిని సంహరించడానికి ఆయన వెంట పడింది.


* **ముల్లోకాల ప్రయాణం:** దుర్వాసుడు భయంతో దిక్కులు పిక్కటిల్లేలా పరిగెత్తాడు.

#1. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ: "విష్ణుచక్రాన్ని ఆపే శక్తి నాకు లేదు" అన్నాడు.

#2. కైలాసానికి వెళ్లి పరమశివుడిని వేడుకున్నాడు. శివుడు: "నేను కూడా శ్రీహరి ఆజ్ఞకు బద్ధుడనే, నన్ను రక్షించలేను" అన్నాడు.

#3. వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువు పాదాలపై పడ్డాడు. **శ్రీహరి జవాబు (భక్త పరాధీనత):** **"అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ |**

**సాధుభిర్గ్రసితహృదయో భక్తైర్భక్తజనప్రియః ||"** "మునిశ్రేష్ఠా! నేను భక్తులకు పరాధీనుడను (దాసుడను). నా హృదయం సాధువుల యందు నిలిచి ఉంది. నా భక్తులు నా కోసం సమస్తాన్ని త్యజించారు. వారిని సాధించే వారిని నేను రక్షించలేను. నువ్వు వెంటనే వెళ్లి **ఆ అంబరీషుని పాదాలు పట్టుకో!** ఆయన క్షమిస్తేనే సుదర్శనం శాంతిస్తుంది."


దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుని పాదాలపై పడ్డాడు. పరమ భాగవతుడైన అంబరీషుడు సంకోచించి, సుదర్శన చక్రాన్ని స్తుతించి మహర్షికి ఏ ఆపదా రాకుండా శాంతింపజేశాడు. దుర్వాసుడు అంబరీషుని భక్తిని, ఉదారత్వాన్ని కొనియాడి ఆశీర్వదించాడు.


📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:


1. **ఏకాదశి వ్రత మహత్యం:** ద్వాదశి పారణ సమయం ఎంత పవిత్రమైనదో, అంబరీషుని వ్రతనిష్ఠ మనకు తెలియజేస్తుంది.

2. **భక్త పరాధీనత:** పరమాత్మ తన భక్తుల పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉంటాడో భాగవతంలో అత్యంత స్పష్టంగా చాటే శ్లోకం "అహం భక్తపరాధీనః".

3. **వైష్ణవ క్షమాగుణం:** తనను చంపడానికి రాక్షసిని సృష్టించిన దుర్వాసుడిని కూడా అంబరీషుడు క్షమించి, ఆపద నుండి రక్షించాడు.


*(రేపటి **రోజు 23** లో: నవమ స్కంధ మధ్య భాగం – సూర్యవంశంలో పవిత్ర రఘువంశ చరిత్ర (శ్రీరామావతార సంగ్రహం) & చంద్రవంశ వర్ణన (యయాతి, పురూరవుల వైరాగ్య కథలు) యథాతథంగా తెలుసుకుందాం!)*


రేపు భాగవతంలో రామాయణం రాబోతుంది తెలుసుకుని, ఏమి అదృష్టం అండి చాతుర్మాస్య కాలంలో శ్రావణ మాసంలో భాగవతం చదివే భాగం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది మనం అనుకుంటే అయ్యేది కాదు,ఆయన అనుగ్రహిస్తే జరిగేది ఎన్ని జన్మల సుకృతమో చదువుకుని తరిద్దాం, మనమేన నలుగురికి షేర్ చేసి వారు కూడా చదివేలా చేసి వారిని కూడా తరింపచేద్దాం 


....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శ్రీమద్భాగవతం - 23/42*

  *


*శ్రీమద్భాగవతం - 23/42* 


*రఘువంశ చరిత్ర (శ్రీరామావతారం) & చంద్రవంశం (యయాతి చరిత్ర)*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

నిన్నటి రోజున మత్స్యావతార లీల, సూర్యవంశ ప్రాభవం మరియు అంబరీషుని ఏకాదశి వ్రతం గురించి తెలుసుకున్నాం. ఈరోజు సూర్యవంశం,శ్రీరామావతార సంగ్రహం మరియు చంద్రవంశ ఆరంభం (యయాతి వైరాగ్య చరిత్ర)** గురించి తెలుసుకుందాం.


* **వైవస్వత మనువు & ఇక్ష్వాకుడు:** సూర్యుని కుమారుడైన వైవస్వత మనువు నుండి సూర్యవంశం ప్రారంభమైంది. ఆయన కుమారుడు **ఇక్ష్వాకుడు** అయోధ్యా రాజ్యాన్ని స్థాపించి ఇక్ష్వాకు వంశ మూలపురుషుడయ్యాడు.


* **వికుక్షి (శశాదుడు):** ఇక్ష్వాకువు కుమారుడు. పితృకార్యం కోసం వేటాడిన సమయంలో ఆకలికి తాళలేక ఒక కుందేలును (శశమును) తినివేయడం వల్ల 'శశాదుడు' అనే పేరు వచ్చింది.


* **పురంజయుడు (కకుత్స్థుడు):** వికుక్షి కుమారుడు. దేవతలకు సహాయంగా రాక్షసులతో యుద్ధం చేస్తూ, ఇంద్రుడే ఎద్దు రూపం దాల్చగా ఆ ఎద్దు మూపురం (కకుత్) పై కూర్చుని యుద్ధం చేసి గెలిచాడు. అందుకే ఆయనకు **కకుత్స్థుడు** అనే పేరు వచ్చింది (ఈయన వంశమే 'కాకుత్స్థ వంశం').


* **అనేనసుడు – పృథువు – శ్రావస్తుడు:** కకుత్స్థుని పరంపరలో వచ్చిన శ్రావస్తుడు 'శ్రావస్తి' అనే ప్రసిద్ధ నగరాన్ని నిర్మించాడు.


* **కువలాశ్వుడు (ధుంధుమారుడు):** లోక కళ్యాణం కోసం 'ధుంధువు' అనే రాక్షసుడిని సంహరించి **ధుంధుమారుడు**గా ఖ్యాతికెక్కాడు.


* **యువనాశ్వుడు:** కువలాశ్వుని వంశంలో వచ్చిన యువనాశ్వుడికి సంతానం కలగకపోవడంతో మునులు పుత్రకామేష్టి చేశారు.రాత్రివేళ తీవ్ర దాహంతో ఆయన మునులు మంత్రించిన యాగజలాన్ని స్వయంగా తాగడంతో, ఆ గర్భం నుంచే మహాబలశాలియైన **మాంధాత** జన్మించాడు.


* **మాంధాత జననం & పాలన:** పుట్టగానే పాలకోసం ఏడిస్తే ఇంద్రుడే అమృతం ఇచ్చాడు.ఇంద్రుని అమృతంతో పెరిగిన మాంధాత అఖండ భూమండలాన్ని ధర్మంతో పాలించిన మహాచక్రవర్తి అయ్యాడు.


* **సౌభరి మహర్షి వైరాగ్యం:** నీటిలో చేపల సంసారాన్ని చూసి మోహించి, మాంధాత 50 మంది కుమార్తెలను పెళ్ళాడిన సౌభరి ముని... ఎన్ని భోగాలు అనుభవించినా తృప్తి ఉండదని తెలుసుకుని చివరకు వైరాగ్యంతో మోక్షం పొందాడు.


* **సత్యహరిశ్చంద్రుని సత్యనిష్ఠ:** మాంధాత వంశంలో వచ్చిన హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్ని, భార్యాబిడ్డలను త్యజించి, శ్మశానంలో కాపరిగా ఉంటూ సమస్త కష్టాలను ఓర్చి సత్యధర్మాన్ని నిలబెట్టాడు.


* **శునశ్శేపుని విముక్తి:** హరిశ్చంద్రుని కుమారుడు రోహితుని స్థానంలో బలి ఇవ్వబడబోయిన శునశ్శేపుడు, విశ్వామిత్రుని ఉపదేశంతో దేవతలను ప్రార్థించి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు.


* **సగర చక్రవర్తి ప్రవేశం:** హరిశ్చంద్రుని పరంపరలో వచ్చిన బాహుకుని కుమారుడే సగరుడు. ఈయన సవతి తల్లులు పెట్టిన విషంతో పుట్టి 'స-గరుడు' (విషంతో ఉన్నవాడు) అని పేరు పొందాడు. ఆ తర్వాత పరశురాముని గురువైన ఔర్వ మహర్షి అనుగ్రహంతో చక్రవర్తి అయి అశ్వమేధ యాగం ప్రారంభించాడు.


సగర చక్రవర్తి & గంగావతరణం – భగీరథుని తపస్సు


 **సగర చక్రవర్తి** అశ్వమేధ యగాన్ని ప్రారంభించగా, ఇంద్రుడు యజ్ఞ అశ్వాన్ని దొంగిలించి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేశాడు. సగరుని అరవైవేల మంది కుమారులు భూమిని తవ్వి కపిలుని వద్ద గుర్రాన్ని చూసి, ఆయననే దొంగగా భావించి నిందించారు. కపిల మహర్షి కన్ను విప్పేసరికి సగర పుత్రులంతా కాలి బూడిదయ్యాడు.


* **భగీరథుని సుదీర్ఘ తపస్సు:** సగర పుత్రుల అస్థికలకు పవిత్రత కలగడానికి, వారి ఆత్మలకు ఉత్తమ గతులు కలగడానికి సగరుని ప్రపౌత్రుడైన **భగీరథుడు** ఘోరమైన తపస్సు చేశాడు.


* **భూమిపైకి గంగానది:** భగీరథుని తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుని కమండలం నుండి ప్రవహించిన **గంగాదేవిని** పరమశివుడు తన జటాజూటంలో బంధించి, అనంతరం నేలపైకి విడుదల చేశాడు. భగీరథుడి రథం వెంట ప్రవహించిన గంగాభవాని సగర పుత్రుల బూడిదను స్పృశించగానే వారందరికీ దివ్య లోకాలు సిద్ధించాయి.


పవిత్ర రఘువంశము & శ్రీరామావతార సంగ్రహం


సూర్యవంశంలో భగీరథుని తర్వాత ఖట్వాంగుడు, దీర్ఘబాహుడు, రఘు మహారాజు, అజుడు, దశరథుడు జన్మించారు. సత్య ధర్మ రక్షణ కోసం సాక్షాత్తు శ్రీమహావిష్ణువు తన చతుర్వ్యూహాలతో (రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులుగా) దశరథుని ఇంట ఆవిర్భవించాడు.


* **శ్రీరామ లీలలు:** శుకమహర్షి శ్రీరాముని పవిత్ర చరిత్రను సంక్షేపంగా కీర్తించారు:


* విశ్వామిత్రుని యాగాన్ని రక్షించి తాటక వధ, సుబాహు వధ చేయడం.


* జనకుని యజ్ఞశాలలో త్రయంబక ధనుర్భంగం చేసి **సీతాదేవిని** పరిణయమాడటం.


* పితృవాక్య పరిపాలన కోసం 14 ఏళ్లు లక్ష్మణ, సీతలతో కలిసి దండకారణ్యానికి వెళ్లడం.


* శూర్పణఖ ముక్కుచెవులు కోయడం, ఖరదూషణాదుల వధ, మారీచ సంహారం.


* రావణుడు సీతమ్మను అపహరించగా... సుగ్రీవ మైత్రి, హనుమంతుని లంకానగరం దహనం, సముద్రంపై సేతు నిర్మాణం.


* లంకా యుద్ధంలో కుంభకర్ణ, మేఘనాథ, రావణాసురుల వధ చేసి విభీషణునికి లంకా రాజ్యాన్ని పట్టాభిషేకం చేయడం.


* **రామరాజ్యం:** అయోధ్యకు తిరిగి వచ్చి శ్రీరాముడు పట్టాభిషిక్తుడై **'రామరాజ్యాన్ని'** స్థాపించాడు. శ్రీరాముని పాలనలో క్షామం, వ్యాధులు, వృద్ధాప్య భయం లేకుండా ప్రజలంతా ధర్మబద్ధంగా జీవించారు. అనంతరం ఉత్తర రామాయణ లీలలను పూర్తి చేసి శ్రీరాముడు తన ధామానికి వేంచేశాడు.


* **కుశ-లవుల పరంపర:** శ్రీరామచంద్రుని కుమారులైన కుశుడు, లవుల నుండి సూర్యవంశం ఎలా ముందుకు సాగిందో కూడా శుకమహర్షి వివరిస్తాడు. కుశుని కుమారుడు అతిథి, అక్కడి నుండి నిషధుడు, నభుడు, పుండరీకుడు, క్షేమధన్వుడు వంటి ఎందరో ధర్మపరులైన రాజులు జన్మించారు.


* **భవిష్యత్ రాజులు:** ఈ వంశంలోనే బృహద్బలుడు (మహాభారత యుద్ధంలో అభిమన్యుని చేతిలో మరణించినవాడు), చివరకు సుమిత్రుడు అనే రాజు వరకు వంశ క్రమం కొనసాగుతుంది.


* సుమిత్రునితో ఇక్ష్వాకు/సూర్యవంశం ముగుస్తుందని చెబుతూ సూర్యవంశ చరిత్ర పరిసమాప్తమవుతుంది.


నిమి చక్రవర్తి శాపం & జనక (విదేహ) వంశ ఆవిర్భావం


* **నిమి చక్రవర్తి – వశిష్ఠుల శాపం:** ఇక్ష్వాకువు కుమారుడైన నిమి మహారాజు యజ్ఞం చేయదలచి వశిష్ఠుడిని ఆహ్వానించాడు. వశిష్ఠుడు ఇంద్రుని యజ్ఞం ముగించుకుని వస్తానని చెప్పగా, సమయం మించిపోతోందని నిమి గౌతమ మహర్షితో యజ్ఞం ప్రారంభించాడు. ఆగ్రహించిన వశిష్ఠుడు నిమి దేహం నశించాలని శపించగా, ప్రతిగా నిమి కూడా వశిష్ఠుని దేహాన్ని శపించాడు.


* **దేహాభిమానం లేని స్థితి:** యజ్ఞం పూర్తయ్యాక దేవతలు నిమిని తిరిగి శరీరంలో ప్రవేశించమన్నారు. కానీ నిమి, *"శరీరం దుఃఖభాజనం, నాకు మళ్లీ ఈ భౌతిక దేహం వద్దు"* అని నిరాకరించి, సమస్త ప్రాణుల నేత్రాల రెప్పలపై (నిమిషాలుగా) సూక్ష్మరూపంలో ఉండిపోయాడు.


* **మిథిల & జనక వంశ స్థాపన:** సంతానం లేని నిమి దేహాన్ని మహర్షులు అరణిలా మథించగా ఒక తేజోవంతుడైన బాలుడు జన్మించాడు.


* మథించడం వల్ల పుట్టాడు కాబట్టి **మిథి** (ఈయన నిర్మించినదే 'మిథిలా నగరం').


* తండ్రి శరీరం లేని స్థితిలో జన్మించాడు కాబట్టి **వైదేహుడు** (విదేహ రాజ్యం).


* స్వయంగా పుట్టినవాడు కాబట్టి **జనకుడు** అయ్యాడు.


* ఈ మిథి/జనకుని వంశంలోనే సీతాదేవి తండ్రియైన శిరధ్వజ జనకుడు మరియు ఆత్మజ్ఞానులైన అనేకమంది 'జనక' మహారాజులు జన్మించారు.(ఈ వంశం లోని రాజుల అందరిని జనకుడు అనే అంటారు)


*చంద్రవంశ ఆవిర్భావం & పురూరవ-ఊర్వశుల కథ


సూర్యవంశ వర్ణన ముగిసిన అనంతరం శుకమహర్షి **చంద్రవంశాన్ని** వర్ణించారు. 


* **చంద్రవంశ మూలం:** అత్రినేత్రం నుండి చంద్రుడు, చంద్రునికి తార ద్వారా బుధుడు, ఆ బుధునికి ఇళ ద్వారా **పురూరవుడు** జన్మించారు. దీంతో చంద్రవంశం ఆరంభమైంది.


* **ఊర్వశీ శోభ:** దేవలోక అప్సరసయైన **ఊర్వశి** భూలోకానికి వచ్చి పురూరవుని సౌందర్యానికి ముగ్ధురాలై కొన్ని నియమాలతో ఆయనతో జీవించింది.


* **వియోగం & జ్ఞానం:** నియమ భంగం జరగడంతో ఊర్వశి అంతర్ధానమైంది. ఆమె వియోగంతో తల్లడిల్లిన పురూరవునికి చివరకు వైరాగ్యం కలిగి, యజ్ఞాగ్నిని మథించి దేవతల లోకాన్ని పొందాడు.


పరశురామావతార ఆవిర్భావం & కార్తవీర్యార్జునుడు


* **భార్గవ వంశం:** పురూరవుని వంశంలో గాధి (విశ్వామిత్రుని తండ్రి), సత్యవతి, జమదగ్ని మహర్షి జన్మించారు. జమదగ్ని–రేణుకల కుమారుడిగా సాక్షాత్ శ్రీమహావిష్ణువు **పరశురాముడిగా** అవతరించాడు.


* **కార్తవీర్యార్జునుని దౌర్జన్యం:** వెయ్యి చేతులు గల కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, ఆతిథ్యం పొంది కూడా దురాశతో కోరిన కోర్కెలిచ్చే కామధేనువును బలవంతంగా అపహరించుకుపోయాడు.


* పరశురాముడు అతనిని వెంబడించి, అతని వెయ్యి చేతులను నరికి సంహరించి ఆవును తిరిగి తీసుకొచ్చాడు.


21 సార్లు క్షత్రియ సంహారం & విశ్వామిత్ర చరిత్ర


* **జమదగ్ని వధ – పరశురాముని ప్రతీకారం:** కార్తవీర్యార్జునుని కుమారులు ప్రతీకారంతో తపస్సులో ఉన్న జమదగ్ని మహర్షిని దారుణంగా చంపేశారు. తీవ్ర క్రోధంతో పరశురాముడు భూమండలంపై ఉన్న దుష్ట క్షత్రియులందరినీ **21 సార్లు** తుదముట్టించి రక్తతర్పణం చేశాడు.


* ఆ తర్వాత కశ్యప మహర్షికి భూమినంతా దానం చేసి మహేంద్ర పర్వతంపై తపస్సుకు ఉపక్రమించాడు.


* **విశ్వామిత్రుల వైభవం:** ఇదే అధ్యాయంలో క్షత్రియుడైన విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారిన వృత్తాంతం, శునశ్శేపుడిని దేవరాతుడిగా స్వీకరించి తన 101 మంది కుమారులలో అగ్రస్థానం ఇచ్చిన వివరాలు వస్తాయి.


కాశీ వంశం & యయాతి పూర్వీకులు


* పురూరవుని కుమారుడైన ఆయువు ద్వారా నహుషుడు, క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి, అనేనసుడు జన్మించారు.


* ఈ వంశ శాఖల నుండి ధన్వంతరి (ఆయుర్వేద ప్రవర్తకుడు), దివోదాసు, ప్రతర్దనుడు వంటి కాశీ రాజులు ఉద్భవించారు.


* నహుషునికి జన్మించిన ఐదుగురు కుమారులలో **యయాతి** ప్రధాన చక్రవర్తి అయ్యాడు.


యయాతి – దేవయాని, శర్మిష్ఠ & శుక్రాచార్యుని శాపం


* **వివాహాలు:** రాక్షస గురువైన శుక్రాచార్యుని కుమార్తె **దేవయానిని**, వృషపర్వుని కుమార్తె అయిన **శర్మిష్ఠను** యయాతి వివాహం చేసుకున్నాడు.


* **ముసలితనపు శాపం:** దేవయాని పట్ల అన్యాయం జరిగిందని ఆగ్రహించిన శుక్రాచార్యుడు యయాతికి యవ్వనంలోనే ముసలితనం వచ్చేలా శపించాడు.


* పరితపించిన యయాతి ప్రార్థించగా, *"నీ ముసలితనాన్ని ఎవరైనా కుమారుడు స్వీకరిస్తే అతని యవ్వనాన్ని నీవు తీసుకోవచ్చు"* అని శుక్రుడు ఉపశమనం చెప్పాడు.


* పెద్ద కుమారులు యవ్వనాన్ని ఇవ్వడానికి నిరాకరించగా, శర్మిష్ఠ చిన్న కుమారుడైన **పూరుడు** తండ్రి ముసలితనాన్ని తాను స్వీకరించి, తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చాడు.


* **యయాతి వైరాగ్య బోధ:** పూరుని యౌవనంతో యయాతి వేయ్యేళ్లు సకల భోగాలను అనుభవించాడు. కానీ కామవాంఛలు ఏమాత్రం శమించకపోగా మరింత ప్రజ్వరిల్లాయి. చివరకు యయాతికి అద్భుతమైన జ్ఞానోదయం కలిగింది:


 **"న జాతూ కామః కామానాముపభోగేన శామ్యతి |**

 **హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏవాభివర్ధతే ||"**


**తాత్పర్యం:** "అగ్నిలో నెయ్యి వేసేకొద్దీ అది మరింత ప్రజ్వరిల్లుతుందే తప్ప శాంతించదు! అలాగే భౌతిక భోగాలను అనుభవించేకొద్దీ మానవుడి ఆశ, తృష్ణ పెరుగుతుందే తప్ప ఏనాటికీ శాంతించవు!"


ఈ పరమ సత్యాన్ని గ్రహించిన యయాతి తన కుమారుడైన పూరునికి యౌవనాన్ని తిరిగి ఇచ్చి, ఆయనకు పట్టాభిషేకం చేసి అడవులకు వెళ్లి తీవ్రమైన తపస్సుతో ముక్తిని పొందాడు. (ఈ పూరుని వంశంలోనే కురు, పాండవులు ఆవిర్భవించారు).


దుష్యంతుడు – శకుంతల & భరత చక్రవర్తి


* **పూరు వంశ విస్తరణ:** యయాతి కుమారుడైన పూరుని వంశంలో దుష్యంతుడు జన్మించాడు.


* **శకుంతలా పరిణయం:** వేటకు వెళ్లిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమంలో మేనక-విశ్వామిత్రుల కుమార్తె అయిన శకుంతలను గాంధర్వ వివాహం చేసుకున్నాడు.


* **భరతుని జననం:** వీరిద్దరికీ పుట్టిన కుమారుడే **భరతుడు**. సింహాలతో ఆడుకునే అపార పరాక్రమవంతుడైన ఈ భరతుని పేరు మీదుగానే మన దేశానికి **'భారతదేశం'** అనే పేరు వచ్చింది.


* భరతుడు అనేక అశ్వమేధ యాగాలు చేసి, తన కుమారులు పాలనకు అర్హులు కారని భావించి భరద్వాజ మహర్షిని దత్తపుత్రుడిగా స్వీకరించాడు.


రంతిదేవుని పరమ కరుణ & త్యాగనిరతి


* **రంతిదేవుని చరిత్ర:** భరతుని పరంపరలో వచ్చిన రంతిదేవుడు నిస్వార్థ భక్తికి, పరమ దయకు ప్రతీక. తనకున్న సంపదనంతా దానం చేసి నిరుపేదగా మారాడు.


* **ఆకలి పరీక్ష:** కుటుంబంతో సహా 48 రోజులు అన్నపానీయాలు లేక అలమటించిన రంతిదేవుడికి 49వ రోజు కొంత ఆహారం, నీరు లభించాయి.


* ఆ సమయంలో వరుసగా వచ్చిన బ్రాహ్మణుడికి, శూద్రుడికి, కుక్కలతో వచ్చిన వ్యక్తికి, చివరకు దాహంతో ఉన్న కుక్కలకు తన ఆఖరి నీటిబొట్టును కూడా ఇచ్చివేశాడు.


* **దేవతల అనుగ్రహం:** త్రిమూర్తులే ఆ రూపాల్లో వచ్చి పరీక్షించారని గ్రహించిన రంతిదేవుడు మోక్షాన్ని కూడా కోరక, కేవలం సర్వ ప్రాణుల దుఃఖ నివారణనే కోరి పరమపదాన్ని పొందాడు.


కురువంశం, పాండవ-కౌరవ మూలాలు & పరీక్షిత్తు


* **హస్తినాపుర స్థాపన:** ఇదే వంశంలో హస్తిన అనే రాజు 'హస్తినాపురం' నిర్మించాడు. కురురాజు వల్ల ఈ వంశానికి **'కురువంశం'** అనే పేరు వచ్చింది.


* **శంతనుడు & భీష్ముడు:** శంతనునికి గంగాదేవి ద్వారా భీష్ముడు, సత్యవతి ద్వారా చిత్రాంగద, విచిత్రవీర్యులు జన్మించారు.


* **వ్యాస మహర్షి అనుగ్రహం:** విచిత్రవీర్యుని భార్యల ద్వారా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించారు.


* పాండవులు, కౌరవుల జననం, మహాభారత యుద్ధం, అభిమన్యుని కుమారుడైన **పరీక్షిన్మహారాజు** (శ్రీమద్భాగవతం వింటున్న శ్రోత) జననంతో కురువంశ క్రమం పూర్తవుతుంది.


అనువు, ద్రుహ్యుడు, తుర్వసుల వంశాలు & జరాసంధుడు


* యయాతి ఇతర కుమారులైన తుర్వసుడు, ద్రుహ్యుడు, అనువుల వంశ శాఖల వర్ణన కూడా ఇక్కడ క్లుప్తంగా చెప్తాడు మహర్షి.


శిబి చక్రవర్తి త్యాగనిరతి


యయాతి కుమారుడైన అనువు వంశంలో జన్మించిన **శిబి చక్రవర్తి** పరమ ధర్మమూర్తి, అపర త్యాగశీలి.


* **పరీక్ష:** ఇంద్రుడు డేగ రూపంలో, అగ్నిదేవుడు పావురం రూపంలో వచ్చి శిబి ధర్మనిష్ఠను పరీక్షించారు. ప్రాణభయంతో శరణుజొచ్చిన పావురాన్ని కాపాడటానికి శిబి పూనుకున్నాడు.


* **ఆత్మత్యాగం:** డేగ తన ఆకలి తీర్చమని కోరగా, శరణార్థిని రక్షించడం రాజధర్మమని భావించి, ఆ పావురం బరువుకు సమానంగా **తన స్వంత శరీర మాంసాన్ని కోసి త్రాసులో తూచి** సమర్పించాడు.

* ఆయన నిరుపమాన త్యాగానికి దేవతలు పరవశించి యథారూపాలతో ప్రత్యక్షమై, ఆయనకు శాశ్వత కీర్తిని, ఉత్తమ లోకాలను అనుగ్రహించారు.


* ఈయన కుమారులైన మద్ర, కేకయుల పేర్ల మీదుగానే ప్రసిద్ధమైన **మద్ర, కేకయ రాజ్యాలు** ఏర్పడ్డాయి.


* **తుర్వసు, ద్రుహ్యుల శాఖలు:** తుర్వసుని వంశం పూరు వంశంలో విలీనమవగా, ద్రుహ్యుని పరంపరలో ఉత్తర సరిహద్దుల్లో గాంధార తదితర రాజ్యాలు ఏర్పడ్డాయి.


* **ప్రాచీన రాజ్యాల స్థాపన:** అనువు పరంపరలోనే దీర్ఘతమస్సు మహర్షి అనుగ్రహంతో జన్మించిన ఆరుగురు కుమారుల పేర్లతో


 **అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, సుహ్మ, పుండ్ర** దేశాలు విస్తరించాయి.


* **రోమపాదుడు & ఋష్యశృంగుడు:** అంగ రాజైన రోమపాదుడు తన రాజ్య కరవును పోగొట్టడానికి ఋష్యశృంగ మహర్షితో యజ్ఞం చేయించి, తన దత్తపుత్రిక శాంతను ఆయనకిచ్చి వివాహం చేశాడు.


యదువంశం & శ్రీకృష్ణావతార పీఠిక (నవమ స్కంధ ముగింపు)


* **యదువంశ వైభవం:** యయాతి పెద్ద కుమారుడైన **యదువు** వంశంలో కార్తవీర్యార్జునుడు, వృష్ణి, శూరసేనుడు ఉద్భవించారు.


* **వసుదేవ జననం:** శూరసేనుని కుమారుడే వసుదేవుడు (ఈయన పుట్టినప్పుడు ఆనకదుందుభులు మోగాయి కాబట్టి 'ఆనకదుందుభి' అని కూడా అంటారు).


* **దశమ స్కంధానికి నాంది:** వసుదేవుడు – దేవకీదేవిల వివాహం, భూభారాన్ని హరించడానికి శ్రీమహావిష్ణువు స్వయంగా

 **శ్రీకృష్ణుడిగా**, ఆదిశేషుడు **బలరాముడిగా** అవతరించడానికి రంగం సిద్ధం కావడంతో నవమ స్కంధం పరిపూర్ణమవుతుంది.

 

📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భగీరథ ప్రయత్నం:** సత్కార్యం సాధించడానికి ఎంతటి అవరోధాలు వచ్చినా వెనకడుగు వేయకుండా సాధించడమే 'భగీరథ ప్రయత్నం'.


2. **రామరాజ్యం - ధర్మ మూలం:** శ్రీరాముని అవతారం మానవ మాత్రుడిగా ధర్మాన్ని ఎలా ఆచరించాలో నేర్పించిన మహోన్నత ఆదర్శం.


3. **ఆశకు సరిహద్దు లేదు:** యయాతి జీవితం నిరూపించినట్లుగా... వయస్సు పైబడ్డా కోరికలు చావవు. కేవలం ఆత్మజ్ఞానం, వైరాగ్యం మాత్రమే మానవుడికి పరిపూర్ణ శాంతిని ఇస్తాయి.


ఇందులో అనేక వంశాల వివరణ ఉంది అదంతా వివరిస్తే అదే దాదాపు 20 రోజుల వరకు పడుతుంది, అంతే కాదు ఇందులో అనేక విషయాలు గతములో రామాయణం చదువుకున్న సందర్భంగా వచ్చినవే అందుకే పూర్తిగా వదిలి వేయకుండా ఎంతవరకు అందించగలనో అంత ఇచ్చాను, భాగవతం చిన్న గ్రంథం కాదు మహాత్గ్రంధం ప్రతి విషయం వివరంగా చెపుతూ వెళ్ళాలి అంటే నెలలు, సంవత్సరాలు కూడా పట్టవచ్చు,దాన్ని 42 రోజుల్లో పూర్తిగా చెప్పటం అసాధ్యం కానీ ఇక్కడ వీలైనంత వరకు ఏ అధ్యాయంలో ఏం ఉందో చెప్తూ ముఖ్య కథ మాత్రం వివరంగా అందించే ప్రయత్నం చేస్తున్నాను.


భాగవతం చెప్పడం మహా మహా పండితులకే సాద్యం కాదు, నేనెంత అల్పుణ్ణి, అల్పుడు చేసే స్వల్ప ప్రయత్నం గా భావించి స్వీకరించండి, రాయగలిగే శక్తి నాకు లేదు రాయించే స్వామి నా వెనుక ఉన్నాడు అన్నదే నా దైర్యం. ప్రతి అక్షరం ఈశ్వరానుగ్రహం నాదేమి లేదు.. 


రేపటి నుండి శ్రీకృష్ణ లీలామృతం ప్రారంభం అవుతుంది చదివి తరించండి..


శ్రీ కృష్ణ శరణం మమ


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శ్రీమద్భాగవతం - 24/42*

  **శ్రీమద్భాగవతం - 24/42* 


*దశమ స్కంధ ప్రవేశం – కృష్ణ జన్మ పూర్వరంగం & దేవతల గర్భస్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

 శ్రీమద్భాగవతానికే ప్రాణమైన దశమస్కందం లోకి ప్రవేశిస్తూ ఉన్నాం ఇందులో నారాయణుని పూర్ణావతర స్వరూపుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ అవతార విశేషాలు, లీలలు సమగ్రంగా ఇవ్వబడ్డాయి, కృష్ అంటే ఆకర్షించేవాడు ఆయన లీలలు,కథలు మనసును తొందరగా ఆకర్షిస్తాయి,అలా ఆకర్షించి మనకే తెలియకుండా మన మనస్సు అనే వెన్న దోచి,ఇంద్రియాలు అనే అయిదు తలలపై నాట్యం చేసి, నేను నేను అనే విషాన్ని విరిచి అంతా తానే అనే అయి మనల్ని ఆయనలో కలిపేసుకుంటాడు, అందుకు భాగవతం వినడం, చదవడం. కేవలం స్మరణ చేత ముక్తి ఇచ్చే ఏకైక గ్రంథం భాగవతం..


స్వామి చేసే పనులు చిలిపిగా ఇలా ఉన్నాయి ఏంటండీ అనేట్టు కనపడతాయి.అలా చూసే వాడు దాన్ని విమర్శించే నెపం తో అయినా నన్ను పట్టుకున్నాడు అలానే వాడికి ముక్తి ఇస్తాను అంటాడు స్వామి.


 అలాగని అలా చేయమని అనటం లేదు ఇవన్ని ఈశ్వర లీలలు అనే విషయం మనసులో ఉంచుకుని చదవండి అని చెప్తున్నాను ఇక్కడ అంత పెద్దలు ఉన్నారు అన్ని తెలిసిన వారే అయిన చెప్పటం నా బాధ్యత కనుక చెప్తున్న.


 లీల అర్దం అయితే అయినట్టు చదవండి, అర్దం అవ్వకపోతే నమస్కారం చేయండి, అంతే కానీ అబ్బే ఇలా చేస్తాడా అండి అని అనకండి ఈశ్వర చర్యలు ఊహలకు అందవు, అన్ని వివరించే అవకాశం నాకు రావచ్చు, రాకపోవచ్చు(అన్ని తెలిసిన పండితుని కూడా కాదు నేను) అయినా మీకు అలాంటి అనుమానం రాకుండానే చెప్పే ప్రయత్నం చేస్తాను,అలా స్వామి నా చేత చెప్పించాలి అని ప్రార్ధిస్తున్నాను..


కానీ ముందుగానే మీకు విషయం చెప్పి ప్రారంభం చేస్తే మీకు స్పష్టత ఉంటుంది అని ఇక కథలోకి వెళ్దాం.. శ్రీ కృష్ణ శరణం మమ 


1. దశమ స్కంధ విశిష్టత & భూదేవి ఆర్తనాదం 


శ్రీమద్భాగవతంలోని పన్నెండు స్కంధాలలో **దశమ స్కంధం** సాక్షాత్తు భగవంతుని **హృదయం (ఆశ్రయ తత్త్వం)** గా భావిస్తారు. పరీక్షిత్తు మహారాజు శుకమహర్షిని ప్రాధేయపడుతూ: "మహర్షీ! చంద్రవంశంలో అవతరించిన స్వయం భగవానుడైన శ్రీకృష్ణుని దివ్య లీలలను సమగ్రంగా, యథాతథంగా నాకు వినిపించండి" అని వేడుకున్నాడు.


ద్వాపరయుగాంతంలో రాక్షసాంశలతో జన్మించిన రాజుల సైన్యాల భారానికి తాళలేక భూదేవి గోరూపాన్ని (ఆవు రూపాన్ని)ధరించి కన్నీళ్లతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకుంది.


* **క్షీరసాగర తీరాన ప్రార్థన:** బ్రహ్మదేవుడు, పరమశివుడు మరియు దేవతలను వెంటబెట్టుకుని క్షీరసాగర తీరానికి వెళ్లి 'పురుష సూక్తం'తో శ్రీమహావిష్ణువును స్తుతించారు.


ఆ సమయంలో బ్రహ్మదేవునికి సమాధి స్థితిలో భగవంతుని దివ్యవాణి వినిపించింది


"దేవతలారా! భూదేవి దుఃఖాన్ని నేను ఎరుగుదును. నేను స్వయంగా యదువంశంలో వసుదేవుని ఇంట దేవకీ గర్భాన ఆవిర్భవిస్తాను. దేవతలందరూ భూలోకంలో యదువంశీయులుగా, గోపాలురుగా జన్మించి నా లీలలలో భాగస్వాములు కండి!"అని చెపితే ఆ విషయాలు బ్రహ్మగారు దేవతలకు చెప్పి, స్వయంగా నారాయణుడే నీ బాధా తీరుస్తాను అన్నాడు అని భూదేవిని ఊరడించి తన లోకానికి తిరిగి వెళ్ళాడు


2. దేవకీ-వసుదేవుల వివాహం


పూర్వం యధువంశ ప్రభువైన శూరసేనుడు మధురా నగరంలో నివసిస్తూ ఉన్నాడు, యాదవ మహారాజులు అందరికీ మధురా నగరం రాజధాని.


ఒకానొక సమయంలో శూరసేన మహారాజు కుమారుడైన వసుదేవునికి ఉగ్రసేన మహారాజు సోదరుడైన దేవకుని కుమార్తె దేవకీదేవితో అత్యంత వైభవంగా వివాహం జరిగింది.


చెల్లెలు అయిన దేవకి అంటే కంసునికి ఎంతో అభిమానం. ఆమెకు సంతోషం చేకూర్చడం కోసం వివాహానంతరం నూతన దంపతులను తన రథంపై కూర్చోబెట్టుకుని, స్వయంగా తానే రథసారథియై మధురా నగరంలో ఊరేగిస్తున్నాడు. దేవకుడు కూడా ఎన్నో విలువైన ఆభరణాలు, దాసీలను కూతురు పై ప్రేమతో ఇచ్చాడు.


చక్కగా శంఖా నాదాలు, మృదంగ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగావెళ్తూ రథం మధ్య మార్గంలో ఉండగా, ఆకాశం నుండి భయంకరమైన గంభీర ధ్వనితో ఆకాశవాణి పలికింది:


 *"ఓరి మూర్ఖుడా! కంసా! ఎవరినైతే ఇంత గారాబంగా రథంపై ఊరేగిస్తున్నావో... **ఆమె ఎనిమిదో గర్భం (8వ సంతానం) నిన్ను సంహరిస్తుంది!**"*అన్నది.


 3. కంసుని క్రూరత్వం & వసుదేవుని సత్య ప్రతిజ్ఞ 


ఆకాశవాణి మాటలు విన్న కంసుడు తీవ్రమైన భయంతో, ఆగ్రహంతో రగిలిపోయాడు.కంసుడు సహజంగా క్రూర స్వభావం గల వాడు, వంశానికే మచ్చ తెచ్చిన దూర్తుడు,ఆ మహాపాపి ఆ మాటలు విన్నంతనే తన ఖడ్గాన్ని దూసి, తోబుట్టువైన దేవకి జుట్టు పట్టుకుని ఆమె తలను నరకడానికి సిద్ధమయ్యాడు.


అది చూసి పరమ ధర్మాత్ముడుఅయిన వసుదేవుడు. కంసుని శాంతింపజేయడానికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఎంతో నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు.అయినా ఆ క్రూరుడు వినలేదు దాంతో..


 "కంసరాజా! దేవకి నీ ప్రియమైన సోదరి. స్త్రీహత్య మహాపాపం. పైగా నీకు భయం దేవకి వల్ల కాదు, ఆమెకు పుట్టబోయే కుమారుల వల్లనే కదా! మాకు పుట్టిన సంతానాన్ని పుట్టిన వెంటనే నీ చేతుల్లో పెడతాను. ఆమెను విడిచిపెట్టు!"అన్నాడు.


వసుదేవుని సత్యవాక్పరిపాలనను ఎరిగిన కంసుడు ఆ సమయానికి దేవకిని విడిచిపెట్టాడు.


కాలక్రమేణా దేవకి, వసుదేవులకు ప్రతి సంవత్సరం కి ఒక పుత్రుడు చొప్పున వరుసగా ఎనిమిది మంది కుమారులు, పిదప ఒక కుమార్తెను కన్నది.


వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటి కుమారుడు జన్మించిన వెంటనే కంసునికి అప్పగించాడు. కంసుడు మొదట "నాకు ఎనిమిదో వాడితోనే భయం కదా"తీసుకువెళ్ళు బావా అన్నాడు. కానీ వసుదేవునికి మనసులో అనుమానం గానే ఉంది కంసుడు దుష్టుడు, పైగా మనసు నిలకడలేనివాడు, ఇతని వల్ల ఎప్పుడూ ఏ ముప్పు వస్తుందో అని చింతిస్తూనే ఉన్నాడు.


ఒకానొకప్పుడు నారదమహర్షి కంసుని దగ్గరకు వచ్చి - "కంసా! గోకులమునందు ఉండె నందుడు మొదలగు గోపాలురు, వారి భార్యలు, వృష్టివంశమునకు చెందిన వసుదేవుడు మొదలగువారు, యదువంశమునకు చెందిన దేవకి మొదలగు స్త్రీలు, నంద వసుదేవులయొక్క | (ఉభయ వంశములకు చెందిన) జ్ఞాతులు, బంధుమిత్రులు అందరును దైవాంశసంభూతులు. నిన్ను సేవించుచున్న వారందరు అసురులు. (ఆసురీసంపదగలవారు). ఆసురీస్వభావముతో భూమికి భారమైన ఈ దైత్యులను వధించే ప్రయత్నము దేవతల వలన జరుగుచున్నది”.అని చెప్పి వెళ్ళిపోయాడు.


అది విని భయంతో ఉన్మాదియైన కంసుడు తన తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి తానే రాజయ్యాడు. దేవకీ-వసుదేవులకు సంకెళ్లు వేసి కారాగారంలో బంధించాడు. దేవకికి పుట్టిన మొదటి ఆరుగురు శిశువులను (షట్గర్భులను) రాతిపై వేసి క్రూరంగా సంహరించాడు! (వీరు పూర్వజన్మలో బ్రహ్మదేవుని శాపం పొందిన మరిచి పుత్రులైన కాలనేమి సంతానం).


* **ఏడవ గర్భం – శ్రీ బలరాముడు:** దేవకి ఏడవసారి గర్భం దాల్చగా, అది ఆదిశేషుని అంశ. భగవంతుడు తన యోగమాయనుఆజ్ఞాపించి: "నువ్వు దేవకి గర్భంలో ఉన్న పిండాన్ని గోకులంలో నందుని పాలనలో ఆశ్రయం పొందుతూ ఉన్న వసుదేవుని భార్య అయిన రోహిణీ దేవి గర్భంలోకి సంకర్షణ (మార్పిడి) చేయి. నేనూ స్వయంగ పూర్ణ అంశతో దేవకి దేవికి తదుపరి గర్భంలో జన్మిస్తాను,అలాగే నీవు స్వయంగ నంద గోవుని భార్య యశోద గర్భాన ఆవిర్భవించు" అని ఆదేశించి లోకుల కోర్కెలు తీరుస్తావు.భూలోకమునందలి మానవులు నిన్ను దుర్గ, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక మొదలగు నామములతో ఆయా ప్రదేశములలో ప్రస్తుతించుచుందురు.


దేవకీదేవి గర్భమునుండి సంకర్షణమువలన (వెలికితీయబడుటవలన) 'సంకర్షణుడు' అనియు, లోకులను రంజింపజేయువాడు గావున, 'రాముడు' అనియు, బలవంతులలో మేటియగుటవలన 'బలభద్రుడు' అనియు, అతడు (బలరాముడు) భూతలమున వ్యవహరింపబడును.


సర్వేశ్వరుడైన శ్రీహరి ఆదేశమును అందుకొనిన పిదప 'సరే' అని ఆయన ఆజ్ఞను శిరసావహించి, ఆ ప్రభువునకు ప్రదక్షిణమొనర్చి, యోగమాయ భూలోకమునకు చేరి భగవంతుని ఆనతిని నెరవేర్చెను


లోకులు దేవకికి గర్భస్రావం అయిందని భావించారు. ఆ పిండం నుండే బలరాముడు ఆవిర్భవించాడు.


5. ఎనిమిదవ గర్భం – దివ్య గర్భస్తుతి


ఆ తర్వాత స్వయం భగవానుడైన శ్రీహరి దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు. దేవకీదేవి ముఖంలో సూర్యచంద్రుల తేజస్సు వెల్లివిరిసింది. ఆమె ఉన్న కారాగారమే ఒక దివ్య దేవాలయంలా ప్రకాశించసాగింది. అది చూసి కంసుడు ఆమె వద్దకు రావడానికి కూడా భయపడసాగాడు.


దేవకీదేవి కడుపులో శ్రీహరి తన దివ్యాంశతో పెరుగుచుండెను. ఆమెముఖమునందు దరహాసశోభలు వెల్లివిరియుచుండెను ఆమె దేహకాంతులు చెఱసాల మందిరమున వెలుగులను నింపుచుండెను.


అటు కంసుడు భగవంతుడైన శ్రీహరియెడ వైరభావమును వీడక ఆ స్వామి జన్మించుటకై అనుక్షణము నిరీక్షించుచుండెను.


 శ్రీహరిపైగల వైర కారణముగా కంసునకు ఇతర ధ్యాసయే లేకుండెను. తిరుగుచున్నను, ఆహారము తినుచున్నను, పానీయములను త్రాగుచున్నను, అటునిటు కదలుచున్నను, కూర్చొనియున్నను, లేచినను, ఇంత ఏల, నిరంతరము ఎంతకును చల్లారని పగతో అతడు శ్రీహరినే తలంచుచుండెను. ఈ 'జగత్తంతయును, హరిమయమే' అని అతనికి అనిపింపసాగెను.


పిమ్మట బ్రహ్మదేవుడు, పరమశివుడు, సమస్త దేవతలు మరియు నారదాది మహర్షులు అదృశ్య రూపాలలో ఆ కారాగారానికి వచ్చి, దేవకీ గర్భంలో ఉన్న జగన్నాథుని దివ్యంగా 'గర్భస్తుతి' చేశారు:


**"సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం నిహితం చ సత్యే |**

**సత్యస్య సత్యమృతసత్యనేత్రం సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః ||"**


**తాత్పర్యం:** "ఓ పరమాత్మా! నీవు సత్యస్వరూపుడవు. సృష్టి, స్థితి, లయములలో మార్పులేని త్రిసత్యానివి. సత్యానికి జన్మస్థానానివి. అట్టి పరమ సత్య స్వరూపుడవైన నిన్ను మేము శరణువేడుతున్నాము! భూభారాన్ని హరించి, ధర్మాన్ని రక్షించడానికి త్వరగా ఆవిర్భవించు ప్రభో!"అని స్తుతించి వారి వారి లోకాలకు వెళ్ళి పోయారు..


అఖిలాండకోటి బ్రహ్మాండ లోకాలను ఉదరంలో దాచుకునే పరమాత్మ పసిబిడ్డగా దేవకి దేవి గర్భంలో దాగి ఉన్నాడు. ,జన్మలు, కర్మలు లేని స్వామి మన కర్మ బంధాలు తెంచడం కోసం అవతారాలు స్వీకరించాడు.


మనవి కర్మ జనిత శరీరాలు, స్వామివి మన జనన మరణ చక్రానికి స్వస్తి చెప్పే అవతారాలు.అంతటి కరుణతో ఆయన వచ్చింది మనకోసం ఆయన గురించి చెప్పుకుని,విని, చదవడం ద్వారా ఇక మళ్ళీ పుట్టుక చావు లేని స్థితి పొందటమే ఈ జన్మకు సార్థకత. 


కోరికలు కోట్లకొలది ఉంటాయి కానీ అవి శాంతిని ఇవ్వలేవు భగవత్ కథలు మనసుకు శాంతిని, జీవుడికి శాశ్వతత్వాన్ని ఇస్తాయి.. కనుక విని తరించే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ 🙏 


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **ఆశ్రయ తత్త్వం:** దశమ స్కంధం శ్రీకృష్ణ లీలామృతం. ఇక్కడ ప్రతి లీల జీవుడిని భౌతిక బంధాల నుండి విముక్తం చేసి భగవంతుని పాదాల చెంత ఆశ్రయం కల్పిస్తుంది.


2. **వసుదేవుని సత్యనిష్ఠ:** ప్రాణాపాయ స్థితిలో కూడా సత్యాన్ని, ధర్మాన్ని వీడకపోవడమే భగవంతుడు తన ఇంట అవతరించడానికి మార్గం సుగమం చేసింది.


3. **సత్యమే దైవం:** దేవతలు చేసిన గర్భస్తుతి మనకు భగవంతుని నిత్య సత్య తత్వాన్ని, అచంచల శరణాగతిని బోధిస్తుంది.


రేపు శ్రీమద్భాగవతంలోనే అత్యంత ఆనందదాయకమైన పరమ మహోత్సవం – శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి శ్రీ కృష్ణ పరమాత్మ ఆవిర్భావం విని తరిద్దాం వేచి ఉండండి...


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

మంగళవారం*🍁 *🌹18ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

*🌹18ఆగష్టు2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం* 

             

       *ఈనాటి పర్వం* 

    *మంగళగౌరీ వ్రతం* 

         *ప్రారంభం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : షష్ఠి* సా 05.50 వరకు ఉపరి *సప్తమి*

*వారం   : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : స్వాతి* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*యోగం : శుక్ల* రా 03.23 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : తైతుల* సా 05.50 ఉపరి *గరజి* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ09.30-11.00 సా05.00-06.00*

అమృత కాలం  : *రా 09.19 - 11.02*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*

*వర్జ్యం    : ఉ 11.00 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.24 - 09.14 రా 11.03 - 11.49*

*రాహు కాలం :మ03.21 -04.56*

గుళికకాళం      : *మ 12.11 - 01.46*

యమగండం    : *ఉ 09.02 - 10.36*

సూర్యరాశి : *సింహం*                          

చంద్రరాశి : *తుల*

సూర్యోదయం :*ఉ 06.00*

సూర్యాస్తమయం :*సా 06.40*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.52- 08.24*

సంగవ కాలం       :*08.24 - 10.55*

మధ్యాహ్న కాలం    : *10.55 - 01.27*

అపరాహ్న కాలం : *మ 01.27- 03.59*

*ఆబ్ధికం తిధి    : శ్రావణ శుద్ధ షష్ఠి*

సాయంకాలం    : *సా 03.59-06.30*

ప్రదోష కాలం      : *సా 06.30-08.47*

రాత్రి కాలం        : *రా 08.47-11.49*

నిశీధి కాలం        : *రా 11.49 -12.34*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.07*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 25/42*

 *


*శ్రీమద్భాగవతం - 25/42* 


*శ్రీకృష్ణ పరమాత్మ ఆవిర్భావం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


నిన్నటి రోజున దశమ స్కంధములోకి ప్రవేశించాము, శ్రీ కృష్ణ పరమాత్మ పరిపూర్ణ అంశ తో దేవకీ దేవి గర్భంలో పెరుగుతున్నాడు, దేవతలు కారాగారం దగ్గరకే వచ్చి పరమాత్మని స్తుతించడం వరకు తెలుసుకున్నాం ఈరోజు శ్రీమద్భాగవతానికే పరమ మహోత్సవమైన **శ్రీకృష్ణ పరమాత్మ దివ్యావిర్భావం, యమునా నది దాటుట, యోగమాయ హెచ్చరిక మరియు గోకులంలో నందోత్సవ వైభవం** గురించి తెలుసుకుందాం.


---


1. శ్రీకృష్ణ దివ్యావిర్భావం – చతుర్భుజ రూపం


జన్మరహితుడు అయిన శ్రీహరి ఆవిర్భవించు సమయం ఆసన్నమైంది.ఆ సమయంలో చంద్రుడు రోహిణీ నక్షత్రము లో ఉన్నాడు, యావత్ భూమండలం మొత్తం మంగళ మయమై నిర్మలంగా ఉంది, కంసుని భయంతో ఆగిపోయిన అగ్నిహోత్రాలు ప్రజ్వరిల్లాయి. అసురుల బాధలతో తల్లడిల్లి పోతున్న దేవతల, సాధు పురుషుల హృదయాల్లో శాంతి నెలకొంది. దేవతలు పుష్ప వర్షం కురిపిస్తూ ఉండగా, విద్యాధర స్త్రీలు నాట్యం చేస్తుండగా

శ్రావణ బహుళ అష్టమి తిథి, రోహిణీ నక్షత్ర యుక్త అర్ధరాత్రి వేళ, నిబిడమైన అంధకారంలో ఉన్న సమస్త దిక్కుల చీకట్లను తొలగించే అఖండ ఆత్మ స్వరూపుడు అయిన శ్రీహరి  కారాగారంలో దేవకీదేవి గర్భం నుండి నాలుగు చేతులలో శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించి వక్షః స్థలంలో శ్రీవత్స చిహ్నం తో, కంఠం లో కౌస్తుభమణి మెరుస్తూ ఉండగా, పట్టు పీతాంబరలు ధరించి శ్యామసుందర దేహుడై,కిరీటం, కుండలాల కాంతులు ఇంపు కొలుపుతూ ఉండగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ పూర్ణ పురుషోత్తమ రూపంతో శ్రీహరి వసుదేవుడుకి దర్శనమిచ్చాడు.


* **తల్లిదండ్రుల స్తుతి:**

స్వామిని చూసినంత మాత్రం చేత వారికి కంస భయం,బంధనాలు తొలగి పోయాయి ఆ దివ్యరూపాన్ని చూసి దేవకీ-వసుదేవులు చేతులు జోడించి పరమానందంతో స్తుతించారు. 


అయితే కంసుని క్రూరత్వం గుర్తొచ్చి, "స్వామీ! కంసుడి నుండి నిన్ను దాచడం మా వల్ల కాదు. నీ ఈ దివ్య చతుర్భుజ రూపాన్ని ఉపసంహరించి, సాధారణ పసిబాలుని రూపాన్ని ధరించు" అని ప్రార్థించారు. 


భగవంతుడు చిరునవ్వుతో తల్లి స్వాయంభువ మన్వంతరం లో నీవు ప్రుశ్ని అను సాధ్వీమణివి, మహాత్ముడైన ఈ వసుదేవుడు సుతపుడు అను ప్రజాపతి, మీరు ఇద్దరు సృష్టి విస్తరణ కోసం బ్రహ్మ గారి ఆదేశం మేరకు ఘోర తపస్సు ఆచరించారు అది అనితర సాధ్యమైన తపస్సు, దానికి మెచ్చి నేను ప్రత్యక్షం అయ్యాను మీరు నా వంటి పుత్రుడు కావాలీ అని కోరారు,నా వంటి పరమాత్మ ప్రత్యక్షం అయినా మోక్షం కోరక నా మాయ చేత విషయ సుఖాలు కోరారు.అది నా సంకల్పం.శీల,గుణ సంపదలో నావంటి వారు మరొకరు లేరు కనుక నేనీ ప్రుశ్నీగర్భుడు అనే పేరుతో ఖ్యాతి వహించి మీకు పుత్రుడను అయ్యను.


ఆ తదుపరి జన్మలో నీవు అదితిగా,వసుదేవుడు కశ్యపుడు గా వచ్చారు అప్పుడు ఉపేంద్రుడు అను పేర వామన అవతారం లో మీకు జన్మించాను.


ఇక ఇది మూడవ జన్మ ఈసారి మీ కోరిక పరిపూర్ణం చేసి మిమ్ము అనుగ్రహించడం కోసం పూర్ణంగా చతుర్భుజాలతో అవతరించాను,ఆ విషయాలు మీకు తెలుపుట కోసమే ఈ రూపంలో కనపడ్డాను. మళ్ళీ సాధారణ శిశు రూపంలోకి వచ్చాక మీకు నా అవతార వైశిష్ట్యం గుర్తుకు ఉండదు.


మీరు ఎల్లపుడు పుత్ర వాత్సల్యం ప్రదర్శిస్తూనే అప్పుడపుడు నన్ను పరబ్రహ్మంగా భావిస్తే ఇక మీకు నా పరంధామం లభిస్తుంది అని చెప్పి పరమాత్మ పసిపాపగా మానవ శిశువుగా మారిపోయాడు..


---


2. యమునా నది దాటుట – గోకులానికి ప్రయాణ


ఆ తరువాత వెంటనే భగవంతుని సంకల్పంతో అద్భుతాలు జరిగాయి:

1. కారాగార కావలిభటులందరూ మాయ చేత గాఢ నిద్రలోకి జారుకున్నారు.

2. వసుదేవుని కాళ్లకు, చేతులకు ఉన్న ఇనుప సంకెళ్లు తమంతట తామే విడిపోయాయి.

3. తాళాలు వేసి ఉన్న బరువైన రాతి తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి.


వసుదేవుడు భగవంతుని ప్రేరణ మేరకు పసికందును ఒక వెదురు బుట్టలో పెట్టుకుని, తలపై ఎత్తుకుని గోకులం వైపు నడిచాడు.


* **ఆదిశేషుని గొడుగు:** కుండపోతగా వర్షం కురుస్తుండగా, భగవంతునికి వర్షపు చినుకులు తగలకుండా సాక్షాత్తు ఆదిశేషుడు తన వేయి పడగలను గొడుగులా విప్పి వసుదేవుని వెనుక నడిచాడు.


* **యమునా నది దారి ఇచ్చుట:** ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది పరమాత్మ పాదస్పర్శ కాగానే రెండు పాయలుగా విడిపోయి మోకాలి లోతుకు తగ్గి వసుదేవునికి మార్గం ఇచ్చింది.


---


3. గోకులంలో శిశువుల మార్పిడి


వసుదేవుడు అర్ధరాత్రి వేళ గోకులంలోని నందమహారాజు భవనానికి చేరుకున్నాడు. యోగమాయ ప్రభావంతో యశోదతో సహా గోకులమంతా గాఢ నిద్రలో ఉంది. యశోద అప్పుడే ఒక ఆడశిశువుకు (యోగమాయకు) జన్మనిచ్చి అలసటతో నిద్రపోతోంది.


వసుదేవుడు నిశ్శబ్దంగా బాలకృష్ణుడిని యశోద పక్కన పడుకోబెట్టి, ఆమె పక్కనున్న ఆడపిల్లను తీసుకుని తిరిగి మధురా నగర కారాగారానికి వచ్చాడు. వసుదేవుడు లోపలికి రాగానే తలుపులు మళ్లీ మూసుకున్నాయి, సంకెళ్లు పడ్డాయి. మునుపటి వలె ఉన్నాడు.


---


4. కంసుని రాక & యోగమాయ దివ్య హెచ్చరిక 


వసుదేవుడు మరలి వచ్చిన తరువాత మళ్ళీ ద్వారాలు, బంధనాలు యధాతద స్తితిలో మూసుకున్నాయి అప్పుడు ఆడశిశువు ఏడుపు వినగానే కావలిభటులు మేల్కొని కంసునికి సమాచారం అందించారు.మృతుభీతిలో కంసుడు పిచ్చివాడిలా పరుగెత్తుకుంటూ వచ్చి, దేవకి ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆ పసికందును లాక్కున్నాడు. అన్నా అనుంగు కోడలు పుట్టెను విడువు అన్నా వినకుండా..శిశువు కాళ్లు పట్టుకుని రాతిబండపై కొట్టడానికి పైకి ఎత్తాడు. కానీ ఆ శిశువు కంసుని చేతుల నుండి జారి ఆకాశంలోకి ఎగిరిపోయింది! అంతట విష్ణు సోదరి అయిన యోగమాయ దేవి. .


* **అష్టభుజ దుర్గాదేవి:** ఆ శిశువు ఎనిమిది చేతులలో శంఖ, చక్ర, త్రిశూలాది ఆయుధాలను ధరించిన దివ్యమైన **యోగమాయగా (దుర్గాదేవిగా)** ఆవిర్భవించింది.


* **కంసునికి హెచ్చరిక:**

 **"కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృత్ |**

**యత్ర క్వ వా పూర్వశత్రుర్మా హింసీః కృపణాన్ వృథా ||"**


*"ఓరి మూర్ఖుడా! కంసా! నన్ను చంపి నువ్వు సాధించేది ఏమీ లేదు. **నిన్ను సంహరించే నీ పూర్వశత్రువు వేరొక చోట ఇప్పటికే జన్మించాడు!** అమాయకులైన ఈ దేవకీ-వసుదేవులను హింసించకు!"*


అలా పలికి యోగమాయ అంతర్థానమైంది.(ఈ తల్లి భూతలం లో అనేక పేర్లతో ప్రసిద్ధి వహించింది)


కంసుడు భయంతో వణికిపోయి దేవకీ-వసుదేవులను తాత్కాలికంగా విడుదల చేశాడు.


మరుసటి రోజు మంత్రులతో ఆలోచించి, రాజ్యంలో పుట్టిన పసిపిల్లలందరినీ సంహరించడానికి రాక్షసులను ఆజ్ఞాపించాడు.


---


5. గోకులంలో నందోత్సవం – ఆనంద తాండవం


మరుసటి రోజు ఉదయం యశోదకు పండంటి మగపిల్లాడు పుట్టాడని తెలిసి గోకులమంతా ఆనంద సాగరంలో మునిగిపోయింది. **నంద మహారాజు** బ్రాహ్మణులకు వేలాది గోవులను, సువర్ణాన్ని దానం చేసి జాతకర్మలు నిర్వహించాడు.


* **గోపికల ఆనందం:** గోపికలు దివ్యాంబరాలు, నగలు ధరించి పెరుగు, పాలు, పసుపు నీళ్లను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ నాట్యాలు చేశారు. ఆరోజు నంద వ్రజము మొత్తం పండగ లా చేశారు. ప్రతి ఇల్లు అలంకరించారు, గోపికలు చిన్నారి కన్నయ్య ను చూడటం కోసం తరలి వచ్చారు. రక్షణ కోసం దైవ ప్రార్థన చేశారు, జోలపాటలు పాడారు.


* నారదుడు, దేవతలు ఆకాశం నుండి వీక్షిస్తూ ఆనందించారు. పరమాత్మ తన లీలలతో గోకులాన్ని వైకుంఠంగా మార్చివేశాడు!


రాజా! శ్రీకృష్ణుడు అవతరించినప్పటి నుండియు, ఆ నందగోకులము పాడిపంటలతో, సమస్త ధనకనక వస్తువాహనములతో కలకలలాడసాగెను. శ్రీహరి అవతారమైన కృష్ణపరమాత్మయొక్క నివాసమునకు నోచుకొనుటతో ఆ ప్రదేశము లక్ష్మీదేవికి విహారభూమి అయింది.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **హరి రాకతో బంధనాల విముక్తి:** భగవంతుడు హృదయంలోకి ప్రవేశించగానే కర్మ బంధాలు (సంకెళ్లు), అజ్ఞానమనే తలుపులు తమంతట తామే తెరుచుకుంటాయి.


2. **భగవద్రక్షణ:** భగవంతుడిని తలపై మోసే భక్తునికి (వసుదేవునికి) ఉప్పొంగే యమున(కాలం) కూడా దారి ఇస్తుంది; ఆదిశేషుడే గొడుగు పడతాడు.


3. **కర్మఫలం అమోఘం:** అధర్మాత్ముడైన కంసుడు ఎంత ప్రయత్నించినా భగవత్ సంకల్పాన్ని, మృత్యువును తప్పించుకోలేకపోయాడు.


రేపటి నుంచి స్వామి లీలలు ప్రారంభం తెలుసుకుని తరిద్దాం రండి🙏


....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

పంచాంగం 18.08.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 18.08.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష షష్ఠి తిథి భౌమ వాసర స్వాతి నక్షత్రం శుక్ల యోగః తైతుల కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: షష్ఠి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



శ్రీ భగవానువాచ ।

అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్ ।

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే ।। 35 ।।



ప్రతిపదార్థ:


శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ కృష్ణ పరమాత్మ పలికెను; అసంశయం — నిస్సందేహముగా; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; మనః — మనస్సు; దుర్నిగ్రహం — నిగ్రహించుటకు కష్టమైనది; చలం — చంచలమైనది; అభ్యాసేన — అభ్యాసం చేత; తు — కానీ; కౌంతేయ — అర్జునా, కుంతీ పుత్రుడా; వైరాగ్యేణ — వైరాగ్యముచే; చ — మరియు; గృహ్యతే — నియంత్రించవచ్చు.



తాత్పర్యము: 


శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అన్నాడు: ఓ మహా బాహువులుగల కుంతీ పుత్రుడా, నీవు చెప్పింది నిజమే; మనస్సు అనేది నిగ్రహించటానికి నిజముగా చాలా కష్టమైనది. కానీ, అభ్యాసము మరియు వైరాగ్యములచే దానిని నిగ్రహించవచ్చు.



వివరణ:


శ్రీ కృష్ణుడు అర్జునుడి మాటలకు జవాబు చెప్తూ, అతన్ని 'మహాబాహో' అంటే ‘గొప్ప బాహువులు కలవాడా.’ అని అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, ‘ఓ అర్జునా, నీవు యుద్ధములో అత్యంత సాహాసోపేత వీరులను ఓడగోట్టావు, ఈ మనస్సుని ఓడించలేవా?’ అని.


శ్రీ కృష్ణుడు, ఇలా, ‘అర్జునా, ఏంటి అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నావు? మనస్సుని సునాయాసముగా నియంత్రించవచ్చు.’ అని చెప్పి ఈ సమస్యను ఖండించలేదు. పైగా, నియంత్రించటానికి మనస్సు నిజంగా క్లిష్టతరమైనది అన్న అర్జునుడి మాటలతో ఏకీభవించాడు. కానీ, ప్రపంచంలో కష్టతరమైన పనులు ఎన్నో ఉన్నాయి, అయినా మనం అధైర్య పడకుండా ముందుకు సాగుతాము. ఉదాహరణకి, సముద్రం ప్రమాదకరమైనది మరియు భయంకర తుఫానులు వచ్చే అవకాశం ఉంటుంది అని నావికులకు తెలుసు. అయినా, ఒడ్డునే ఉండిపోయేలా చేయటానికి ఈ కారణాలు వారికి తగినట్టు ఎప్పుడూ అనిపించలేదు. కాబట్టి, శ్రీ కృష్ణుడు, అర్జునుడికి, వైరాగ్యము మరియు అభ్యాసము ద్వారా మనస్సుని నియంత్రించవచ్చు అని హామీ ఇస్తున్నాడు.


వైరాగ్యము అంటే ఆంగ్లములో డిటాచ్మెంట్ (detachment). అనంతమైన పూర్వ జన్మల నుండీ ఉన్న మమకారాసక్తుల చేత, మనస్సుకు, తనకు అనురక్తి ఉన్న వస్తువిషయముల దిశలో పరుగులు పెట్టడం అలవాటైపోయింది. ఈ మమకార-ఆసక్తిని తీసివేయటం అనేది మనస్సు యొక్క అనవసరమైన పరిభ్రమణాన్ని నిర్మూలిస్తుంది.


అభ్యాసము అంటే ఆంగ్లములో ప్రాక్టీసు (practice). అంటే, పాత అలవాట్లను మార్చి, కొత్త వాటిని పెంపొందించుకునే ఏకాగ్రతతో కూడిన పరిశ్రమ. అభ్యాసము అనేది సాధకులకు ఒక ముఖ్యమైన పదం. సమస్త మానవ పరిశ్రమలలో, నైపుణ్యానికి, ప్రావీణ్యతకి, శ్రేష్ఠతకి దారితీసే ప్రముఖ విషయం ఈ అభ్యాసమే. ఉదాహరణకి ఒక అతి సామాన్య విషయమైన టైపింగ్ తీసుకోండి. మొదటి సారి టైపింగ్ ప్రారంభిస్తున్నప్పుడు, ఒక నిమిషానికి ఒక పదమే టైపు చేయగలుగుతారు. కానీ, ఒక సంవత్సరం టైపు చేసిన తరువాత, వారి చేతివేళ్లు సునాయాసంగా తిప్పుతూ నిమిషానికి ఎనభై పదాలు టైపు చేయగలుగుతారు. ఈ నైపుణ్యం కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యము. ఇదే విధంగా, మూర్ఖమైన మరియు అల్లకల్లోలమైన మనస్సుని అభ్యాసము ద్వారా ఆ భగవంతుని చరణారవిందముల పైనే నిలుపాలి. మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీయాలి - ఇదే వైరాగ్యము - మరియు - మనస్సుని భగవంతుని మీదే నిలుపాలి - ఇది అభ్యాసము. పతంజలి మహర్షి ఇదే ఉపదేశం చెప్పాడు:


అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః (యోగ దర్శనం 1.12)


‘నిరంతర అభ్యాసము, వైరాగ్యముల ద్వారా మనస్సు యొక్క ఆందోళనలను నియంత్రించవచ్చు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 49*


*భవాంభోధౌ నౌకాం జడిమవిపినే పావకశిఖా-*

*మమర్త్యేంద్రాదీనామధిముకుటముత్తంసకలికామ్ ।*

*జగత్తాపే జ్యోత్స్నామకృతకవచఃపంజరపుటే*

*శుకస్త్రీం కామాక్ష్యా మనసి కలయే పాదయుగలీమ్ ॥*


*భావము :*


*తల్లీ! ఈ సంసారము ఒక మహా సాగరమైతే, దానిని దాటించే నౌక నీ పాదములు. మా బుద్ది హీనతను తొలగించే, ఔషధము నీ పాదములు. దేవతల కిరీటమునకు అలంకారములు, నీ పాదములు. వేదములనే పంజరములోని ఆడ చిలుక నీ పాదములు. అలాంటి పాద యుగళమును ధ్యానిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏