2, ఏప్రిల్ 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 2 ఏప్రిల్ 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*

``              *45వ భాగం*``


*నరసింహావతార కథ ప్రారంభం - ప్రహ్లాదుని జననం*   

```

హిరణ్యకశిపుడు “దేవతల పక్షపాతి విష్ణువును జయించాలంటే విష్ణువు నుండి మరణం లేనివరం పొందాలి. అందుకోసం తపస్సు చేయండి" అన్న నారద మహర్షి సూచన పాటించి భార్యలీలావతిని రాజధానిలో విడిచి తపస్సుకి వెళ్లాడు.


బ్రహ్మదేవుని అనుగ్రహం లభించి కోరిన వరాలు పొందటానికి అనేక వందల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. తపస్సు ప్రభావం ముల్లోకాలపై పడటంతో ఇంద్రుడు తపస్సు భగ్నం చేయాలనుకున్నాడు. అప్సరసలను పంపాడు. విఫలం కావడంతో అగ్నిదేవుడు, వాయుదేవుడు, వరుణదేవులను పంపి తపస్సు చేసే ప్రదేశాన్నితగలబెట్టాడు, సుడిగాలులు సృష్టింప చేశాడు,కుంభవృష్టికురిపించారు.


ఏవీ హిరణ్యకశిపుడి తపస్సుని భగ్నం చేయలేక పోయాయి.  చివరకు బ్రహ్మదేవుడే తపస్సు ఆపటానికి ప్రసన్నుడై ప్రత్యక్ష మైనాడు. దానవరాజుని చూసి బ్రహ్మ దేవుడు "హిరణ్యకశిపా! 

నీ తపస్సుకి సంతష్టుడిని అయ్యాను. వరం ఇస్తున్నాను. మనస్సులో గల  కోరికను చెప్పుము" అని అడిగాడు.


హిరణ్యకశిపుడు "పితామహా! మరణము లేకుండా అమరత్వం సిద్దించే వరము ఇవ్వండి" అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు "భూమి పై పుట్టిన ప్రతి జీవి మరణించవలసిందే. సృష్టి నియమాన్ని ఉల్లఘించే శక్తి ఎవరికి లేదు. మరేదైనా వరము కోరుకొనుము" అనడంతో హిరణ్యకశిపుడు ఆలోచించి ఇలా కోరాడు.

"పితామహా! దేవదానవ మానవాదుల వలన గాని, భూచర, ఖేచర, జలచరముల చేతగాని, ఏ ఆయుధముల చేత గాని, ఇంటిలో గాని, బయటగాని, భూమిపైన గాని, భూమిలో గాని, ఆకాశములో గాని, నీటిలో గాని, నీటిపైన గాని, పగలు కాని రాత్రి కాని నాకు మరణం సంభవించకుండా వరం ఇవ్వండి" అని కోరాడు.


బ్రహ్మదేవుడు "మరణం అనేది ఎలాగైనా వస్తుంది" అని తలచి శ్రీమన్నారాయణుని పై భారం వేసి"తథాస్తు" అని హిరణ్యకశిపుడు కోరిన వరము ఇచ్చి వెళ్లాడు.


హిరణ్యకశిపుడు నగరానికి తిరిగి వచ్చి తనసోదరుడు హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహావతారం ధరించి సంహరించాడు అని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయాడు. దేవతలను, దేవతల పక్షపాతి విష్ణువుని ఓడించి సంహరిస్తాను అనిప్రతిజ్ఞ చేసి సకల లోకాలపై దండయాత్ర చేసాడు. స్వర్గలోకం జయించి దేవతలను బానిసలుగా చేసుకున్నాడు. భూమి పై గల రాజులను, పాతాళ లోకాల అధిపతులను జయించాడు. ముల్లోకాలు జయించిన తరువాత వైకుంఠం పై దండ యాత్రకు వెళ్లాడు. విష్ణుమాయ వలన విష్ణువు, వైకుంఠ వాసులున్నా, హిరణ్యకశిపుని కళ్ళకు వైకుంఠం ఖాళీగా కనిపించింది.


తనకు భయపడి విష్ణువు వైకుంఠం వదలి పారిపోయాడు అని భావించి విజయగర్వంతో హిరణ్యకశిపుడు రాజధానికి తిరిగి వచ్చాడు. దాగి ఉన్నదేవతలను, విష్ణువుని బయటకు రప్పించాలని భూమిపై దేవతల కోసం యజ్ఞయాగాదులు చేయకుండా ఆపివేశాడు. యజ్ఞయాగా దులు చేస్తే హవిస్సులు తనకు అర్పించా లని నిర్భంధం చేశాడు.


మునుల ఆశ్రమాలలో,గురుకులా లలో తన నామ స్మరణ మాత్రమే జరగాలని, విష్ణునామ, శివనామ స్మరణ చేయకూడదని నియమం పెట్టాడు. ఉల్లఘించిన వారికి కఠోర శిక్షలు, మరణ దండన విధించాడు. హిరణ్యకశిపుడు పెట్టే బాధలు భరించలేని మునులు, ప్రజలు, దేవతలు శ్రీహరిని రక్షించమని మనస్సులలో ప్రార్థించసాగారు.


హిరణ్యకశిపుడి భార్య, మహాసాధ్వి లీలావతి గర్భవతి అయ్యింది. నారాయణుని ప్రేరణతో నారద మహర్షి హిరణ్యకశిపుడి వద్దకు వచ్చాడు. అతని బలపరాక్రములు, దేవతల పైన విజయాన్ని ప్రశంసించాడు. ఇన్నాళ్లకు దానవులకు హిరణ్య కశిపుడి వలన ముల్లోకాధిపత్యం లభించింది అని పొగిడాడు. గర్భవతియైన భార్య లీలావతి యోగక్షేమాలు అడిగాడు.


హిరణ్యకశిపుడు నారదుని పొగడ్తలకు ఆనందం చెంది గర్భవతి అయిన భార్య లీలావతిని దానవవంశానికి తగిన వారసుడు జన్మించేలా దీవించమని కోరాడు. హిరణ్య కశిపుడి కోరిక మేరకు నారదుడు అంతపురంలోకి వెళ్లాడు. నారదుని రాక విషయం తెలియని లీలావతి అలసి గాఢ నిద్రలో ఉంది.


నారదుడు తన రాక తెలియజేస్తూ "అమ్మాలీలావతి" అనిపిలిచాడు.  లీలావతికి మెలకువ రాలేదు గానీ ఆమె గర్భంలో ఉన్న శిశువు ఊ అని ప్రత్యుత్తరం ఇచ్చింది. నారదుడు మొదట ఆశ్చర్యం చెంది తనను నారాయణుడు ఇందు కోసమే పంపాడు అన్న విషయం గ్రహించాడు.


శయన తల్పం పక్కన గల ఆసనం పై కూర్చుని లీలావతి గర్భస్థ శిశువుకి విధివిధానంతో అష్టాక్షరి మహామంత్రమైన "ఓం నమో నారాయణాయ" ఉపదేశించాడు. గర్భస్థ శిశువు మంత్రోపదేశం స్వీకరించి "ఓంనమోనారాయణాయ" అని జపించ సాగింది. నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి అక్కడ నుంచి అంతర్దానమయ్యాడు. నారాయణ మంత్రోపదేశం అటు హిరణ్య కశిపునికి, ఇటు లీలావతికి తెలియదు. గర్భస్థ శిశువు మాత్రం వదలకుండా నిరంతరం నారాయణ. నామం ీజపిస్తున్నాడు.


నవమాసాలు నిండి లీలావతి పండంటి బాలునికి జన్మనిచ్చింది. దరహాసం చిలికిస్తూ పూర్ణచంద్రుడి వంటి బాలుని ముఖారవిందం చూసే వారి మనస్సులకు ఆహ్లాదం కలిగిస్తోంది. కుమారుని చూసిన హిరణ్యకశిపుని హృదయానికి ప్రహ్లాదం కలగటం చేత బాలునికి ప్రహ్లాదుడు అని నామకరణం చేశాడు.


ప్రహ్లాదుని తరువాత హిరణ్య కశిపునికి లీలావతికి మరోముగ్గురు కుమారులు జన్మించారు. వారికి అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అని పేర్లు పెట్టారు. ప్రహ్లాదునికి శాంత స్వభావం రాగా మిగిలిన ముగ్గురికి దానవ స్వభావంవచ్చింది. గర్భస్థ శిశువుగా నారాయణ జపం చేసిన ప్రహ్లాదుడు మాటలు రావడంతోనే తల్లి తండ్రి అని పిలవడం బదులు నారాయణ నారాయణ అనసాగాడు.


భార్య లీలావతి బాల్య చేష్టగా నచ్చచెప్పడం వలన, పుత్రవాత్సల్యం వలన కొంతకాలం హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామ స్మరణ సహించాడు. నారాయణ నామం ఎవరు పలికినా హిరణ్యకశిపుడు వారికి మరణదండన విధించేవాడు. కుమారుని విషయంలో కొంత సహనం పాటించాడు.


కానీ పెరిగి పెద్దయ్యే కొద్ది సోదరుల వలె ఆటలు ఆడకుండా నారాయణ నామస్మరణ చేస్తూ ఉండేవాడు. ప్రతి ఆటబొమ్మలో నారాయణ రూపం కనిపించేది. తను స్మరణ చేయడం కాకుండా తన తోటి ఉండేవారి చేత కూడా నారాయణ నామం పలికేలా చేసేవాడు. నారాయణ నామం పలికితేనే శిరస్సు ఖండించే హిరణ్యకశిపుడు కుమారుని శిక్షించే విషయంలో ఆలోచనలో పడ్డాడు. భార్య లీలావతి సలహా పై ఇతర కుమారులతో కలిపి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపాడు.


                *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 1 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                    1️⃣8️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *182 వ రోజు*                   

*విరాట పర్వము చతుర్థాశ్వాసము*


*చతుర్ధాశ్వాసం*```


సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలసి విరాటనగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించలేక పోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. 

గవాధ్యక్షుడు “ఉత్తరకుమారా! కుఱు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకు పడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి” అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమపరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్యపరాక్రమాల గురించి చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను రక్షించండి” అని ప్రార్ధించాడు.```


*ఉత్తరకుమారుని ప్రగల్భాలు*```


గవాధ్యక్షుని పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగి పోయాడు. 

"గవాధ్యక్షా! నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారథి లేడు కదా! అందుకని బాధగా ఉంది. సమర్ధుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య,అశ్వద్దామలను నేను చేసే యుద్ధంతో అర్జునిని తలపింప చేసి ఆలమందలను విడిపించకుంటే నాతండ్రి నాపరివారం నన్ను మెచ్చుతారా. ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకు పోతారు. వెంటనే తగిన సారథిని వెతకండి” అన్నాడు. 


ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తర కుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునిని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. 


అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుక పరచుకొనే సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి "నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యం ఉంది. పూర్వం అర్జునినికి సారథ్యం వహించి అతనికి ఖాండవ వనదహనంలో సహాయం చేసి అతని ప్రశంశలందు కున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు” అన్నాడు. 


ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుని “అమ్మా! మన రాకుమారుడు సారథి కొరకు వెతుకు తున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. ఖాండవ వన దహనంలోను ఇతర సమయాలలోను అర్జునునికి సారథిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి చెప్పు” అన్నది.

```           

              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

02ఏప్రియల్2026* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🌷గురువారం🌷*

   *02ఏప్రియల్2026*  

 *దృగ్గణిత పంచాంగం*                   

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : పూర్ణిమ* ఉ 07.41 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : హస్త* సా 05.38 వరకు ఉపరి *చిత్త*

*యోగం : ధ్రువ* మ 02.20 వరకు ఉపరి *వ్యాఘాత*

*కరణం  : బవ* ఉ 07.41 *బాలువ* రా 08.08 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *ప 11.18 - 12.59*

అభిజిత్ కాలం  : *ప 11.46 - 12.36*

*వర్జ్యం    : రా 02.14 - 03.57*

*దుర్ముహూర్తం  : ఉ 10.08 - 10.57 మ 03.03 - 03.53*

*రాహు కాలం  :మ 01.43- 03.16*

గుళికకాళం      : *ఉ 09.06 - 10.39*

యమగండం    : *ఉ 06.02 - 07.34*

సూర్యరాశి : *మీనం*                

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.10*

సూర్యాస్తమయం :*సా 06.29*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 06.02- 08.29*

సంగవ కాలం       :*08.29 - 10.57*

మధ్యాహ్న కాలం    :*10.57 - 01.25*

అపరాహ్న కాలం  :*మ 01.25- 03.53*

*ఆబ్ధికం తిధి        : చైత్ర బహుళ పాడ్యమి*

సాయంకాలం      :*సా 03.53- 06.20*

ప్రదోష కాలం        :*సా 06.20- 08.41*

రాత్రి కాలం          :*రా 08.41- 11.47*

నిశీధి కాలం       :*రా 11.47 - 12.34*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.28 - 05.14*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః🕉️🌹*


*అవధూతసదానందపరబ్రహ్మస్వరూపిణే*

*విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - శుక్ల పక్షం - ‌పౌర్ణమి -‌ హస్త -‌‌ గురు వాసరే* (02.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భగవద్గీత.

 -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।।



ప్రతిపదార్థ:



శ్రేయాన్ — ఉత్తమమైనది (మంచిది); స్వ-ధర్మః — తన స్వంత ధర్మములు; విగుణః — లోపాలతో కూడి ఉన్నా; పర-ధర్మాత్ — ఇతరుల ధర్మము కంటే; సు-అనుష్ఠితాత్ — చక్కగా ఆచరింపబడిననూ; స్వ-ధర్మే — తన సొంత ధర్మములను చేయటంలో; నిధనం — మరణం; శ్రేయః — మంచిది; పర-ధర్మః — ఇతరుల ధర్మములు; భయ-ఆవహః — భయము కలిగించును.



తాత్పర్యము : 



ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే అత్యుత్తమము. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం (ఇతర ధర్మాన్ని చేయటం) అనుసరించటం ప్రమాదకరమైనది.



 వివరణ:


ఈ శ్లోకం లో 'ధర్మ' అన్న పదం నాలుగు సార్లు వాడబడింది. 'ధర్మ' అన్న పదం హిందూ మతంలో, బౌద్ధ మతంలో తరచుగా వాడబడుతుంటుంది. కానీ అది ఆంగ్ల భాషలోకి అనువదించటానికి అత్యంత క్లిష్టమైన పదం. Righteousness, good conduct, duty, noble quality, మొదలైన ఆంగ్ల పదాలు ఆ పదం యొక్క కొంత అర్థాన్ని మాత్రమే వివరిస్తాయి. 'ధర్మ' అన్న పదం 'ధృ' అన్న ధాతువు నుండి వచ్చింది, అంటే, ధారణ్ కరనే యోగ్య, అంటే ‘మనకు తగిన బాధ్యతలు, విధులు, ఆలోచనలు మరియు చర్యలు’ అని. ఉదాహరణకు, జీవాత్మ యొక్క ధర్మ భగవంతున్ని ప్రేమించటమే. మన అస్తిత్వానికి ఉన్న మూల సూత్రము ఇదే.


ఇక్కడున్న పూర్వప్రత్యయము ‘స్వ’ అంటే ‘సొంత లేదా వ్యక్తిగత’ అని, ఆ ప్రకారంగా, ‘స్వ-ధర్మ’ అంటే మన వ్యక్తిగత ధర్మ, మనకున్న ప్రస్తుత జీవనంలో ఉన్న సందర్భము, పరిస్థితి, పరిపక్వత, మరియు వృత్తిని బట్టి ఉండే ధర్మం. జీవన సందర్భం/పరిస్థితి మారినప్పుడు, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడు, స్వ-ధర్మము అనేది మారవచ్చు. తన వృత్తి ధర్మాన్ని చేయమనటం ద్వారా, అర్జునుడిని స్వ-ధర్మం పాటించమని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. వేరే వారు ఎవరో ఇంకేదో చేస్తున్నారని తను చేసేది మార్చవద్దని అంటున్నాడు.


మరోకరిలా నటించటం కన్నా మనం మన లాగే ఉండటం ఏంతో ఆనంద దాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యముతో చాలా సునాయాసంగా చేయవచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడటానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్దులలో ఘర్షణకి దారితీస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయటం కన్నా స్వంత ధర్మములు నిష్ఠగా చేయటంలో మరణించినా సరే, అదే మంచిది అని శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని బలంగా ఉద్ఘాటిస్తున్నాడు.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

02-04-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. తల్లి తరపు బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


వృషభం


నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. వాహన యోగం ఉన్నది.

---------------------------------------


మిధునం


వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. కొన్ని విషయాలలో మానసికంగా ఆలోచనలు ఇబ్బందికి గురిచేస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. నూతన ఋణయత్నాలు చెయ్యకపోవడం మంచిది.

---------------------------------------


కర్కాటకం


కుటుంబ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్ధిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. 

---------------------------------------


సింహం


వృత్తి వ్యాపారాలలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించదు. ఆర్థిక వ్యవహారాలలో అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------


కన్య


కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరమైన చిక్కులు నుండి ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన విజయం సాధిస్తారు. వృత్తి,ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్న నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్ధిక పరమైన ఇబ్బందులను అధిగమించి పాత ఋణాలు తీర్చగలుగుతారు. బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి.

---------------------------------------


వృశ్చికం


సంతాన విద్యా విషయాలకు సంభందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సౌకర్యాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుతాయి.

---------------------------------------


ధనస్సు


శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తికావు. బంధు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం వృధాగా మిగులుతుంది.

---------------------------------------


మకరం


ధన పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------


మీనం

 

ఆర్ధిక విషయాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రారంభించిన పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. సహోద్యోగుల ప్రవర్తన వలన శిరో బాధలు పెరుగుతాయి. వాహన ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది.

---------------------------------------

శ్రీచక్ర వైభవం🙏

  🙏 శ్రీచక్ర వైభవం🙏

                        మొదటి భాగం 

""ఆబాలగోప విదితా, సర్వానుల్లంఘ్య శాసనా 

శ్రీ చక్రరాజనిలయా, శ్రీమత్త్రిపుర సుందరీ

శ్రీ శివా, శివశక్త్యైక్య రూపిణీ, లలితాంబికా "


మహా మహిమాన్వితమైన శ్రీచక్రము గురించి ఈ వ్యాసంలో వివరిస్తాను.ముందుగా గుర్తుంచుకోవలసిన విషయం చెబుతున్నాను.


ఈ జగత్తులో అంతర్గతంగా ఉన్న పరాశక్తిని కూడా దర్శించగలిగారు మన మహర్షులు. వివిధ శక్తులు, దేవతలు, ప్రాణులు అన్నీ ఆ పరాశక్తి నుండే ఉద్భవించాయి. అయినా వేటికి అవి ప్రత్యేకపని కొరకు ప్రత్యేక గుణములు కలిగి ఉంటాయి. అంటే ఒక గొలుసులోని వేరు వేరు లింకులన్నమాట. మానవ శరీరంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క స్థానము, ప్రత్యేకమైన పని ఉంటుంది. అలాగే ఈ విశ్వంలో ఒక్కొక్క దేవతకు ఉండవలసిన స్థానములు, చేయవలసిన పనులు, ప్రత్యేకంగా నిర్దేశించి ఉన్నాయి. ఈ దేవతలకు యంత్రం రూపమయితే, మంత్రం నాదమవుతుంది. వేదవాక్కులచే అట్టి దేవతలు ప్రత్యక్షమవుతారని, అనుగ్రహిస్తారని, తెలుసుకొన్న మన మహర్షులు మనకు మంత్ర, యంత్ర శాస్త్రాలను అందించారు. వేదమునకు మూలము నాదము. దాని నుండి బీజాక్షరములు ఉద్భవించి, మంత్రములుగా శక్తిని సంతరించుకున్నాయి.

ఈ జగత్తు లోని సకల తత్వాలు , సకల భువనాలు ,పరమశివుడు , పరాశక్తి మానవునియందు కలవు .. మానవుని శరీరాన్ని రెండు భాగాలుగా చూస్తే …. నాభి నుండి పైకి ఊర్థ్వ లోకమని , క్రిందకి అధోలోకమని ….. ఈ రెంటిని కలిపే వెన్నెముక ను మేరు దండమని అంటారు .. శ్రీ చక్రమును “మేరువు” అంటారు … మేరు పర్వతము కూడా భూమి కి ఇరుసు వంటిది . ఏ రకంగా పరాశక్తి దివ్య స్వరూప కాంతులచే … ఈ జగత్తంతా ప్రకాశవంతమై ఉందో , మన మేరుదండంలో గల ”కుండలినీ శక్తి"" చేత శరీరము చైతన్యవంతము గా అవుతుంది … మనలో ఆత్మా ఉన్నదని అంగీకరించినట్లే .. మన శరీర నిర్మాణం యొక్క ప్రాధాన్యతను గుర్తించాలి .. నవావరణాత్మకమైన శ్రీ చక్రానికి , మానవ శరీరానికి తేడా లేదని శాస్త్రాలు చెబుతున్నాయి … శ్రీ చక్రమును ఆరాదిస్తే సకల దేవతా మూర్తులను ఆరాదించినట్లే … అని తంత్ర శాస్త్రం తెలియజేస్తుంది …

శ్రీ చక్రమును మన శరీరము తో పోల్చి చూస్తే … మనము ఆ జగన్మాతను దర్శించుట యెంత దుర్లభమో అవగతమవుతుంది … మనలోని కర్మ , జ్ఞానేంద్రియాల వెంటపడి పరుగెత్తే మనస్సు , బుద్ధి , అహంకారం , మమకారములు , కామోద్రేకాలు , శృంగారాది నవరసాలు , జాగ్రద స్వప్న సుషుప్తాది అవస్థలు .. వీటిని నడిపే సత్వ రజ తమో గుణాలు .. వీటన్నింటిని ఆ “శ్రీదేవి” విభూతులుగా గ్రహించి , వీటన్నింటిని దాటి ‘బిందు’ స్థానమునకు చేరుకోగానే అచట అద్వితీయమైన , సచ్చిదానంద రూపమైన , సత్స్వరూపానుభవము కలుగుతుంది అనేది సత్యము … కానీ … ఎన్ని జన్మలకు సాధ్యమో ….

మనలోని ప్రాపంచికమైన ముప్పది ఆరు తత్వములు , త్రిపుటలు , నవావరణములను … నిర్లిప్తతో , నిష్కామంగా , నిస్వార్థంగా అనుభవిస్తూ ….. గమ్యాన్ని చేరుకోవటానికి నిరంతర సాధన చెయ్యాలె తప్ప వేరొక మార్గం ఉండదు.


యంత్రమంటే ఏమిటి:- యంత్రమనగా ఆరాధించే దేవత యొక్క శక్తి స్వరూపమే. ఆ దేవతాశక్తి ఆ యంత్ర రూపంలో నిక్షిప్తమవుతుంది. మన పెద్దలు ఈ శక్తిని గుర్తించి, మూడు రకాలుగా భావించారు.


అవి 1) ఇచ్ఛాశక్తి, 2) జ్ఞానశక్తి 3) క్రియాశక్తి. ఏ పని చేయాలన్నా ఆ పని చేయాలనే ‘ఇచ్ఛ’ (కోరిక) కలగాలి. అదే ఇచ్ఛాశక్తి. తరువాత ఆ పని ఎట్లా చేయాలని ఆలోచన చేయడమే జ్ఞానశక్తి. ఇచ్ఛ, ఆలోచనాజ్ఞానం రెండు కలిగిన తరువాత కార్యాచరణ జరపడమే క్రియాశక్తి. సృష్టికర్తకు దేనిని సృష్టించాలన్నా ఈ మూడు శక్తుల కలయిక తప్పదు. ఈ చరాచర సృష్టి మొత్తం ఈ మూడు శక్తుల కలయిక వల్లనే సాధ్యం.


ఈ మూడు శక్తులను సూచించే దేవతలే కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. శ్రీచక్రంలోని త్రికోణములో మూడు బిందువులలో ఉండే దేవతలు వీరే.


విజ్ఞానవేత్తలైన మన మహర్షులు ఈ మూడు శక్తులు కలిసిన శక్తినే ‘ప్రకృతి’ అని, ‘పరాశక్తి’ అని, ‘అవ్యక్తం’, ‘శుద్ధమాయ’ అని అంటారు. అంటే యావత్తు ప్రపంచానికి (సృష్టికి) జన్మనిచ్చినది ఇచ్ఛ, జ్ఞాన, క్రియాశక్తుల కలయిక అయిన పరాశక్తే అని తెలుస్తున్నది. కాబట్టి ఆ పరాశక్తే ఈ జగత్తుకు మాత (తల్లి) అని శాస్త్రాలు నిర్ణయించాయి. త్రిమూర్తులకు, దేవతలకు వారి వారి విధి నిర్వహణకు కావలసిన శక్తులన్నింటినీ ఆ జగన్మాత అయిన పరాశక్తి, వారికి అందిస్తోంది.


శ్రీ చక్ర ఆవిర్భావం:- ఉండేది బ్రహ్మమొక్కటే. ఈ బ్రహ్మం సత్‌, చిత్‌, ఆనంద స్వరూపములు కలది. అది చలనము లేనిది, నిశ్చలమైనదైనప్పటికి, చేతనం అనే బీజం కలిగి ఉండుటం దానిలోని విశేషం.


కేవలం కాంతి (ప్రకాశ) రూపముగానున్న బ్రహ్మమునందు ఏర్పడిన మొదటి కదలికను ‘విమర్శ’ (ఆలోచన) అన్నారు. ఋషులు కాంతిని పరమశివుడుగాను, విమర్శను పరాశక్తిగాను భావించారు. కాంతి (ప్రకాశ) స్వరూపమైన బ్రహ్మములో ఏర్పడిన మొదటి కదలికవల్ల నాదము ఏర్పడినది. ఈ ప్రథమ నాదము సూక్ష్మరూపమైన బిందువుగా ఏర్పడినది. ఈ బిందువునందే కేంద్రీకరించబడిన శివశక్తుల విజృంభణము కలదు.


దీనినే “పరాబిందువు” అందురు. ఇందులో కామేశ్వర, కామేశ్వరీ స్వరూపములు కలవు. ఈ బిందువే మూల ప్రకృతి."" మూల ప్రకృతిరావ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ ""అంటోంది లలితా సహస్రం. దీనికే సర్వానందమయ చక్రమని పేరు. ఈ బిందువే శ్రీచక్రమునకు ఆధారము. ఈ పరాబిందువు నందే సృష్టికి కావలసిన శక్తి అంతా బీజప్రాయంగా ఉన్నది. సృష్టి జరుగుటకు ఈ పరాబిందువు కొంత క్రిందికి దిగివచ్చి శబ్ద బ్రహ్మముగా మారుతుంది. అనగా విత్తనము (గింజ) లో రెండు బద్దలు ఉన్ననూ చుట్టూ ఉన్న పొట్టు (పై పొర) వలన గింజ ఒకటిగా కనపడినట్లు ఈ పరాబిందువు నందు శివశక్తులొకటిగా ఉంటాయి.

(ఇక్కడ చెప్పిన విషయం జాగ్రత్తగా అర్ధం చేసుకోండి )


శ్రీ చక్రం – పరాశక్తి వేర్వేరు కాదు

అలా ఒకటిగానున్న పరాబిందువు నుండి మూడు బిందువులేర్పడినవి.


1) శివశక్తులొకటిగా నున్న ‘బిందువు’, 2) అచేతనంగా ఉన్న ‘శివుడు’, 3) ‘చేతనా స్వరూపమైన శక్తి’.

ఈ మూడు బిందువులే త్రిగుణాత్మకము. త్రిపుటల సమ్మేళనము, త్రిపురముల మొదటి త్రికోణము. ఇది శివపార్వతుల ఏకరూపమైన అర్థనారీశ్వరతత్వాన్ని సూచిస్తోంది.


మనం పరాశక్తి శుద్ధ స్వరూపాన్ని దర్శించలేం, కనీసం ఊహించలేం. కనుక శక్తిమాత తన మొదటి రూపంగా శ్రీచక్రాన్ని నిర్మించింది. తదుపరి అనేక దేవీరూపాలను స్వీకరించి మనకు ఉపాసనా సౌలభ్యాన్ని కల్పించింది. శ్రీచక్రముతో ఈ సకల చరాచర జగత్తునకు నామరూపములకు, పదార్థములకు సమన్వయం కలుగుచున్నది.

పరాశక్తికి శ్రీ చక్రానికి ఏ మాత్రం భేదం లేదు. శ్రీ దేవియే శ్రీచక్రము. శ్రీమాత, శ్రీ విద్య, శ్రీచక్రములు వేరు వేరు కాదని, ఈ మూడూ ఒకే పరబ్రహ్మ స్వరూపమని శ్రీ లలితా సహస్రనామ స్తోత్రము తెలియచేస్తోంది.

ఆత్మవిద్యా మహావిద్యా శ్రీవిద్యా కామసేవితా

శ్రీషోడాశాక్షరీ విద్యా త్రికూట కామకోటికా .. 


శ్రీ చక్రం నందు లలితాదేవి ఎల్లప్పుడూ నివసించి ఉంటుంది. ఇటువంటి శ్రీవిద్యను, శ్రీచక్రోపాసనను మనువు, చంద్రుడు, కుబేరుడు, అగస్త్యుడు, లోపాముద్ర, అగ్ని, మన్మథుడు, సూర్యుడు, ఇంద్రుడు, శివుడు, స్కంధుడు, దూర్వాసుడు అను పన్నెండుమంది, పన్నెండు శాస్త్ర విధానములుగా ప్రవేశపెట్టినట్లు జ్ఞానార్ణవ తంత్రము తెలుపుచున్నది.


శ్రీచక్రానికి, పంచదశీ మంత్రానికి , అమ్మవారికి భేదం లేదు. మూడు ఒకటే. ఈ విషయం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి. శ్రీచక్రాన్ని దర్శించడానికే పూర్వ జన్మ సుకృతం కావాలి కాబట్టి శ్రీచక్ర దర్శనమే జన్మ రాహిత్యం కలిగిస్తుంది. ఇంక అర్చనచేస్తే వచ్చే ఫలితం చెప్పనలవి కాదు కదా. ""చరమే జన్మని శ్రీవిద్యోపాసకో భవేత్ "" అనేది అక్షర సత్యం.సాధకుడు నమ్మితీరాలి "" సత్యం సత్యం పునః సత్యం "" కాబట్టి ఈ శ్రీచక్రానికి మించిన చక్రము ఈ సృష్టిలో ఏదీ లేదు. అందుకే అది “చక్రరాజము” అయినది. సమస్త దోషములను నివారించి సమస్త కోరికలను తీర్చి, సకల సౌభాగ్యాలు ఇచ్చే దివ్యమైన యంత్రమే ఈ శ్రీచక్రరాజము . శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన అందరికీ సులభ సాధ్యం కాదు. అయినా పట్టుదలతో చేస్తే ఈలోకములో సాధించలేనిది అంటు ఏమి లేదు కాస్త కష్టమే అయినా అసాధ్యము మాత్రము కాదు.

                   సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

వేదం చదువుకోని వారికి ముక్తి లేదా ? )

 శ్రీరామ (122).


       (వేదం చదువుకోని వారికి ముక్తి లేదా ? )


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                                -----------


వేదాధ్యయనము ముక్తి హేతువు అని ఆచార్యులందరు ఆనతిచ్చిన విషయం అందరికీ విశదమే.

అయితే బ్రహ్మచర్య దీక్షతో, అనేక నియమములు పాటిస్తూ,

శీక్షా, వ్యాకరణము, జ్యోతిషము, నిరుక్తము,ఛందస్సు, కల్పము, అను ఆరు అంగములతో కూడినది,

 ఉదాత్త, అనుదాత్త, స్వరితాది స్వరభేదములు కలది,

 శిరఃకంపనాదులు చేయకూడదు మొదలైన శారీరక నియమములు కలది,

ఇంకా అనధ్యయన దినములు,ప్రదేశం శుచిగా ఉండాలి, మొదలైన అనేక నియమములతో కూడినది అయిన వేదాధ్యయనము అందరికీ సాధ్యం కాదు.

మరి వేదాధ్యయనం చేయలేని కోటానుకోట్ల బ్రాహ్మణ, క్షత్రియ,వైశ్య, శూద్రులకు, స్త్రీలకు,ప్రపంచంలోని ఇతర జాతులవారికి మోక్షము లేదా అన్నది అందరికి వచ్చే సందేహం.


భగవంతుడు సర్వజ్ఞుడు. 

అందరూ వేదాధ్యయనం చేయలేరన్న విషయం ఆయనకు తెలియదా ?

సామాన్య జనులు సంసార విషయాలలో తలమునకలై ఉంటారు.


ఆత్మజ్ఞానము, మోక్షము, దేవుడెఱుగు, ముందు కష్టాలనుండి బయటపడాలి అనేది వారి ఆకాంక్ష.

ఆకలితో ఉన్నవాడికి ముందు అన్నం కావాలి, వేదము, వేదాంతము కాదు.

అందుకే భగవంతుడు అవతార పురుషుల రూపం ధరించి, ఆయా దేశ కాలములకు తగిన ఉపదేశములు చేసి, ఆర్తుల కష్టాలు తీరుస్తుంటాడు.

ముక్తికి క్రమ మార్గం చూపిస్తూఉంటాడు.


అందువల్ల భగవత్సాక్షాత్కారం పొందిన మహనీయుల వాక్యములన్నీ వేదమంత్రములే, అని మనం తెలుసుకోవాలి.

ఆ వాక్యములకు భాషా, వ్యాకరణ నియమాలేవీ వర్తించవు.

నడిచే దైవం అని చెప్పబడే శ్రీ మహాస్వామివారి వాక్యములు గాని,

తులసీదాసు గారి "హనుమాన్ చాలీసా" గాని,

శ్రీ పాద శ్రీ వల్లభుల చరిత్రలోని " సిద్ధ మంగళ స్తోత్రం " గాని,

ఇంకా అనేకమంది మహానుభావుల వాక్కులు గాని

 ఆ కోవకు చెందినవి.

శ్రీ కంచి పరమాచార్యులవారు అవతార పురుషులు.

దాదాపు నూరు సంవత్సరములు జీవించిన

 ఆ మహాత్ములు,అనేకమంది భక్తులను అనుగ్రహిస్తూ , పాదయాత్ర చేస్తూ, ప్రజల సుఖశాంతులకోసం, ధర్మ ప్రచారం చేశారు.

వారి మహిమలు అనంతం.

మనం ప్రత్యక్షంగా భగవంతుని చూడలేము.

మనమీది అనుగ్రహముతో భగవంతుడే పరమాచార్యులవారి రూపంలో మన ముందు నడయాడారు.

వారు సర్వజ్ఞులు.

అందరూ వేదాధ్యయనం చేయలేరని వారికి తెలుసు.

 

ఎవరికి ఏది ఉపదేశిస్తే వారి సమస్యలు, కష్టాలు, తొలిగి అభ్యుదయం పొందుతారో

ఆ ఉపదేశమే వారు చేస్తారు.

వారిమీద నమ్మకము, గురుభావము ఉన్నవారు ఆవిధంగా ఆచరించి శ్రేయస్సు పొందుతారు.

పదిహేను సంవత్సరముల క్రితం ఆరోగ్య సమస్యల వల్ల నాకు ' పేస్ మేకర్ ' అమర్చారు.

దురదృష్టవశాత్తు ఆ ఆపరేషనులో జరిగిన ఏదో లోపం వల్ల తిరిగి పదిహేను రోజులకు ఇంకొక చిన్న ఆపరేషన్ చేసి దానిని సరిజేశారు.

అయితే రెండవ ఆపరేషన్ తరువాత ఆరోగ్యం బాగా క్షీణించింది.

అప్పుడు శ్రీ పరమాచార్యులవారి ప్రసంగం గుర్తు చేసుకొని,

 " నారాయణీయం " పారాయణ చేశాను.

ఆరోగ్యం కుదుట పడింది.


శ్రీ నారాయణ భట్టాత్రి రచించిన "శ్రీమన్నారాయణీయం"

అనే నూరు అధ్యాయముల గ్రంథము (1036 శ్లోకములు) పదునెనిమిది వేల శ్లోకములతో కూడిన మహాభాగవత పురాణము యొక్క సారసంగ్రహము.


ఎప్పుడో పురాణ కాలంలో జరిగిన విషయం.

 శుక్రాచార్యులవారిచే శపింపబడి అకాల వార్ధక్యం పొందాడు ' యయాతి మహారాజు ' 

తన ముసలితనమును కుమారుడైన ' పూరువు ' నకు ఇచ్చి, అతని యౌవనమును తాను తీసుకుని, వేయి సంవత్సరములు అన్ని భోగములు అనుభవించాడు.

తరువాత కుమారునికి యౌవనంతోబాటు రాజ్యము కూడా ఇచ్చి అరణ్యములకు పోయి తపస్సు ఆచరించి స్వర్గానికి వెళ్లాడు.

అప్పటినుండి ' పురు వంశం ' ప్రాముఖ్యత సంతరించుకుంది.


కానీ ఈ కలియుగంలో క్రీ.శ.1560 లో జన్మించిన

 శ్రీ నారాయణ భట్టాత్రి చిన్నతనంలోనే సమస్త విద్యలు అభ్యసించి, గురుదక్షిణగా 

గురువుగారి " వాత రోగమును "

తాను స్వీకరించి, తన ఆరోగ్యమును గురువుగారికి సమర్పించారు.

తనకు సంక్రమించిన అనారోగ్య బాధ పోగొట్టుకోవడానికి,

" గురువాయూరు " (కేరళ) శ్రీకృష్ణ దేవాలయంలో నూరు రోజులు ఉండి, భాగవత రచన చేసి ఆ గ్రంథమునకు "నారాయణీయం" అని పేరు పెట్టారు.

గ్రంథం పూర్తి అవగానే ఆయనకు శ్రీకృష్ణ సాక్షాత్కారం లభించింది.

సంపూర్ణ ఆరోగ్యవంతుడైనాడు.

ఈ గ్రంథం చదివే వారికి ఆయురారోగ్య సౌఖ్యములు ప్రసాదించమని భగవంతుని వేడుకొని ఆ వరం పొందాడు.

అప్పటినుండి ఈ గ్రంథం అత్యుత్తమ పారాయణ గ్రంథమై, 

అనేక మందికి వ్యాధులను పోగొట్టి, ఆరోగ్యం ప్రసాదిస్తూ, పాఠకులను అనుగ్రహిస్తున్నది.


సర్వజ్ఞులైన పరమాచార్యులవారు అందుకనే ఈ గ్రంథమును, అందులోని మంత్ర సదృశములైన కొన్ని శ్లోకములను పారాయణ చేయవలసినదిగా తరచు ఉపదేశించేవారు.

అందువలన వేదాధ్యయనం చేయలేకపోయాము అని ఎవరూ చింతించనవసరం లేదు.

వాల్మీకి రామాయణము, సుందరకాండ, దుర్గాసప్తశతి,విష్ణుసహస్రనామము, లలితాసహస్రనామము, నారాయణీయము,

మొదలైన వన్నీ వేదంతో సమానమైనవే.

వీటిలో ఏ ఒక్కదానిని శ్రద్ధాభక్తులతో పఠించినా కష్టాలు తొలగిపోతాయి, ముక్తి లభిస్తుంది.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

2-4-'26