30, ఏప్రిల్ 2024, మంగళవారం

వేదవాఙ్మయమే

 *_-||||మహనీయం||||-_*


“భారతదేశానికి గొప్పతనాన్ని, ప్రతిష్ఠను ఇదివరకు తెచ్చినది, ఇప్పుడు తెచ్చుచున్నది, ముందు తేగలది - వేదవాఙ్మయమే!!


అటువంటి వేదం గురువు వల్ల విని స్వరములతో సరిగ్గా ఉచ్చరించగల మానవుల వల్ల నిలువగలిగింది గానీ, గ్రంథాలు అచ్చువేయటం వల్ల కాదు....


ఎన్ని గ్రంథాలు నశించిపోలేదు మొరటుజాతి వారివల్ల ఎన్ని గ్రంథభాండారాలు తగలపెట్టబడలేదు?


ఎల్లప్పుడు వల్లె వేస్తూ ఒక పొల్లయినా పోకుండా సస్వరంగా ఉచ్చరిస్తూ "సజీవ గ్రంథాలైన" బ్రాహ్మణ సంఘీయుల వల్ల మ్లేచ్ఛపాలన వంటి దుష్కాలంలో సైతం నశింపబడకుండా రక్షింపబడింది! అట్టి సంఘాన్ని ఉపేక్షించక గురు-శిష్య పరంపరను కాపాడుకోవాలి.... కేవలం గ్రంథస్థం చేస్తే కాపాడబడేది కాదు శ్రుతిమాత....


"వచ్చేవరకు చెప్పుకోవడం చచ్చేవరకు వల్లించడం" వల్లనే వేదం ఆచంద్రార్కం నిలచి ఉంటుంది. ....కాబట్టి ప్రజలు, ప్రభుత్వం వేదాధ్యయనం చేసేవారిని ప్రోత్సహించి, వారి కుటుంబాలకు తగిన వసతులను కల్పించి, సృష్టి ఆది నుండి కాపాడబడిన వేదశాస్త్రాదులను తమ సంతానం క్షేమం కోసం, లోకక్షేమం కోసం కాపాడుకొందురుగాక!!!!

పాఠకులు



 నిన్న ఒక్కరోజు మన బ్లాగు చూసిన పాఠకులు. ఇందులొ ఇండియా కన్నా అమెరికా వారు యెక్కువగా వుండటం విశేషం

పునరావృతం అవుతున్నాయి.

 పాకిస్థాన్ లోని 

సియాల్ కోట్ లో 1946లో హిందూ జనాభా దాదాపు 250000, ముస్లిం జనాభా దాదాపు 5000, 


దేశవిభజన సమయంలో సియాల్ కోట్ ని భారత్ లో కలపాలా, పాకిస్తాన్ లో కలపాలా అన్న చర్చ వచ్చినప్పుడు హిందువులు భారత్ లో కపపాలని, ముస్లింలు పాకిస్తాన్ లో కలపాలని అడిగారు, అప్పుడు స్థానిక పెద్దలు వోటింగ్ పెడదాం, ఎక్కువ సంఖ్యలో దేన్ని కోరితే అలా కలుపుదాము అని నిర్ణయించి వోటింగ్ కోసం ఒకరోజు ను నిర్ణయించారు. 


ఆ రోజు తెల్లవారుజాము కల్లా ముస్లింలు మొత్తం ఓటు వేయడానికి క్యూలో నిలబడ్డారు, దాదాపు 85% జనాభా మనమే ఉన్నాం కాబట్టి గెలుపు గ్యారెంటీ అనే ధీమాతో హిందువులు చాలామంది ఇళ్లలోనే ఉండిపోయారు ఓటు వేయడానికి వెళ్లిన కొద్ది మంది హిందువులు అంత పెద్ద క్యూ చూసి -----ఏం నిలబడతాంలే అని తిరిగి ఇళ్ళకి వెళ్లిపోయారు, ఎవరికీ పట్టనిది నాకెందుకు అని కొందరు క్యూ నుండి బైటికి వచ్చారు. 


పోలింగ్ అయ్యాక బాలట్ బాక్స్ లు తెరిచి చూస్తే దాదాపుగా అంతా పాకిస్తాన్ లో కలపడానికే మొగ్గు చూపినట్టు తేలింది. దాంతో సియాల్కొట్ పాక్ లో ఉండిపోయింది, 


వెంటనే హిందువుల ఊచకోత మొదలైంది వేల సంఖ్యలో హిందువుల్ని చంపుతూ హిందూ జనాభాని క్రమంగా 500కు తెచ్చారు. హిందువుల బద్ధకం, బుద్ధి హీనత, మతం పట్ల అభిమానం లేకపోవడాలు ఒక్క సియాల్ కోట్ లో 3 లక్షల పైగా హిందూ హత్యలకు కారణం అయ్యాయి. 


పరుగెత్తి ప్రాణాలు కాపాడుకుంటావా, కూర్చుని ప్రాణాలు వదిలేస్తావా అని హిందువుల్ని అడిగితే ప్రాణాలకోసం ఎవడు పట్టుగెత్తుతాడు చావు ఎప్పటికైనా తప్పదు కొంచెం ముందుగా పోతే ఏమౌతుంది అన్నంత బద్దకం హిందువులది, మిగిలిన కుటుంబ సభ్యులు అనాధలై, అడుక్కుతింటారు అనే ఆలోచనని బద్ధకం తొక్కేస్తోంది. లక్షల సందర్భాలలో ఇది నిరూపణ అయ్యింది. 


హిందూ అనైక్యతకు పాకిస్తాన్ లోని మరో సంఘటన చెప్తారు. విభజనకు ముందు ఒక హిందూ జమిందార్ ఎకరం విస్తీర్ణంలో ఒక పెద్ద భవనాన్ని నిర్మించే సమయంలో తన మిత్రుడైనా ఒక ముస్లింతో - నా ఒక్కగానొక్క కొడుకు కోసం ఎంత పెద్ద బంగ్లా కట్టిస్తున్నానో చూడు అన్నాడు, అప్పుడు ఆ ముస్లిం దాన్ని ఏదో ఒక రోజున నా 5 మంది కొడుకులు ఆక్రమిస్తారు అన్నాడు, 


విభజన తర్వాత జమిందార్ని కొడుకును అతని మిత్రుడే చంపి ఆ బంగ్లాని ఆక్రమించాడు, ఇలాంటివి వేల సంఖ్యలో చెప్పినా, చూసినా హిందువులు వాటిలో అర్ధాన్ని గ్రహించడం లేదు, గుర్తు పెట్టుకోవడం లేదు, 


ఫలితంగా అవే పునరావృతం అవుతున్నాయి...!

పోతన అక్షర చిత్రం!


పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. , దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా, పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

మహాప్రస్థానా”నికి

 (ఏప్రిల్ 30 శ్రీ శ్రీ జయంతి)


              ( సేకరణ ) 


“మహాప్రస్థానా”నికి యోగ్యతాపత్రం రాస్తూ “కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నాడు చలం. అసలు ఎవరీ శ్రీశ్రీ. తెలుగులో కవిత్వం పేరెత్తగానే అందరి తలలూ ఆయనవైపెందుకు తిరుగుతాయి? “రెండు శ్రీల ధన దరిద్రుడు - కవితా ఘన సముద్రుడు శ్రీశ్రీ” అని వేటూరి సంస్మరించుకున్న ఆ ఘనసముద్రంలో ఉన్న రత్నమాణిక్యాలేమిటి? వాటి కాంతుల ధగధగలు ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుసుకుంటూ, ఆ రత్నపుకాంతులు చూసుకుంటూ పదండి ముందుకు, పదండి త్రోసుకు, పదండి పోదాం పైపైకి!


“ఎముకలు క్రుళ్ళిన,


వయస్సు మళ్ళిన


సోమరులారా! చావండి!


నెత్తురు మండే,


శక్తులు నిండే


సైనికులారా! రారండి!”. ఇంత బలంగా మనకోసం మనల్నే తిట్టిన మొదటికవి “శ్రీశ్రీ”నే అయ్యుంటాడేమో! తన కవితాధాటికి ఆ ఎముకులు కుళ్ళిన వారు, వయస్సు మళ్ళిన వారు కూడా నెత్తురు మండుతున్న, శక్తులు నిండుగా ఉన్న సైనికులుగా మారాలని కవి ఆక్రోశం అయ్యుంటుంది.


ఇది చదువుతున్నంతసేపు “విరామ మెరుగక మ్రోగే ఆ మరో ప్రపంచపు కంచు నగారా” మన చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.


శ్రీశ్రీ తానెవరో చెబుతూ...


“భూతాన్ని,


యజ్ఞోపవీతాన్ని,


వైప్లవ్యగీతాన్ని” అనగానే, నువ్వు విప్లవకవివి; ఇలా యజ్ఞోపవీతాలు గట్రా అనకూడదంటూ కస్సుమన్నారు కొందరు.


అసలు ఆయన “స్మరిస్తే పద్యం


అరిస్తే వాద్యం” అన్న సంగతి వాళ్ళకేం తెలుసు.


అందుకే వాళ్ళకు అర్థమయ్యేలా శ్రీశ్రీ ఉధృతి పెంచి...


“నేనొక దుర్గం!


నాదొక స్వర్గం!


అనర్గళం, అనితర సాధ్యం నా మార్గం!” అని ఢంకా బజాయిస్తాడు.


ఇంతకీ మీరేం చేశారు? అని అడిగితే...


“నేను సైతం


ప్రపంచాగ్నికి


సమిధనొక్కటి ఆహుతిచ్చాను!” అన్నాడు. అంతేనా అంటే? కాదుట…


“నేను సైతం


భువనఘోషకు


వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!” అన్నాడు ఆవేశంగా ఆకాశం వైపు చూస్తూ.


ఏంటండీ ఆ చూపు అని అడిగితే? అటు చూడు అన్నాడు. అక్కడ…


“యముని మహిషపు లోహఘంటలు


మబ్బుచాటున


ఖణేల్ మన్నాయి!


నరకలోకపు జాగిలమ్ములు


గొలుసు త్రెంచుకు


ఉరికి పడ్డాయి!”. భయంవేసింది.


ఏంటండీ ఇంత భయం కలుగుతుందీ, ఈ కొత్తరకం కవిత్వం వింటుంటే? అని అడిగితే... ఆయన నవ్వేసి, లేకపోతే ఇంకా ఆ పాతపద్ధతుల్లోనే ఎంతకాలమోయ్ కవిత్వాన్ని మురగబెడతారు? అంటూ...


“కదిలేదీ కదిలించేదీ


మారేదీ మార్పించేదీ


పాడేదీ పాడించేదీ


పెనునిద్దుర వదలించేదీ


మునుముందుకు సాగించేదీ


పరిపూర్ణపు బ్రదుకిచ్చేదీ


కావాలోయ్ నవకవనానికి” అని ఉపదేశం చేస్తాడు..


అసలు కవిత్వానికి ఎలాంటి కవితా వస్తువులు తీసుకోవాలండి అని అడిగామా…


“కుక్కపిల్లా


అగ్గిపుల్లా


సబ్బుబిళ్ళా


హీనంగా చూడకు దేన్నీ!


కవితామయమేనోయ్ అన్నీ!” అంటాడు.


ఆయనకు “ప్రపంచ మొక పద్మవ్యూహం!


కవిత్వ మొక తీరని దాహం!”


అందుకే “ఓ కవితా! ఓ కవితా” అని ఆయన గొంతెత్తి పాడితే… కవిసమ్రాట్ కళ్ళ నీళ్లు పెట్టుకుని ఈ కవిని కౌగిలించుకున్నాడట.


“పొలాలనన్నీ - హలాలదున్నీ - ఇలాతలంలో హేమం పిండే” విరామమెరుగక పరిశ్రమించే కర్షకవీరుల ఘర్మజలానికి ఖరీదు లేదంటాడీ కవి.


కూటికోసం కూలికోసం, పట్టణంలో బ్రదుకుదామని తల్లిమాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారి కష్టం మనకు కష్టం కలిగించేంతల్లా చెప్పి, చివరికి అతను మరణిస్తే పల్లెటూళ్ళో ఉన్న అతని తల్లికి పాడుకలలో పేగు కదిలిందంటాడు.


ఈ ప్రపంచంలో ఉన్న మనమంతా బానిసలం, గానుగులం, పీనుగులం అంటాడు.


“మనదీ ఒక బ్రదుకేనా?


కుక్కలవలె, నక్కల వలె!

మనదీ ఒక బ్రదుకేనా!


సందులలో పందులవలె!” అని ఛీత్కారంగా చూస్తాడు.


అసలు ఈ ప్రపంచంలో సాయంత్రం అయ్యేసరికి ఒక్కొక్కడికీ ఒక్కోరకం సమస్యంటాడు.


రాక్సీలో హాలీవుడ్ హీరోయిన్ నార్మా షేరర్‌ సినిమాకి వెళ్ళాలా? లేక బ్రాడ్వేలో కాంచనమాల సినిమాకి వెళ్ళాలా? అని ఒక విద్యార్థికి సమస్యైతే, ఉడుపీ శ్రీకృష్ణవిలాస్‌లో బాదం హల్వా తినాలా లేక సేమ్యా ఇడ్లీ తినాలా? అన్నది ఒక ఉద్యోగికి సమస్యై కూర్చుంటుందంటాడు. ఇక చివరిగా…


“ఇటు చూస్తే అప్పులవాళ్లూ


అటు చూస్తే బిడ్డల ఆకలి!


ఉరిపోసుకు చనిపోవడమో,


సముద్రమున పడిపోవడమో-


సమస్యగా ఘనీభవించిం


దొక సంసారికి!” అంటూ ముక్తాయింపునిస్తాడు.


“నిప్పులు చిమ్ముకుంటూ


నింగికి నే నెగిరిపోతే,


నిబిడాశ్చర్యంతో వీరు-


నెత్తురు కక్కుకుంటూ


నేలకు నే రాలిపోతే


నిర్దాక్షిణ్యంగా వీరే…” అని ఏడు ఏడు పద్నాలుగు ముక్కల్లో మనిషి స్వభావాన్ని చెప్పేస్తాడు. అంతే కాదు,


“ఏ దేశచరిత్ర చూచినా


ఏమున్నది గర్వకారణం


నరజాతి చరిత్ర సమస్తం


పరపీడన పరాయణత్వం” అని “చరిత్ర” చరిత్రని, తిరుగులేని ఋషివాక్యంలా చెప్పి నిట్టూర్పు విడుస్తాడీ మహాకవి.


“తాజమహల్‌ నిర్మాణానికి


రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?


ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌,


అది మోసిన బోయీ లెవ్వరు?” అన్న ప్రశ్నలతో మనల్ని నీళ్ళునమిలిస్తాడు.


మీరు మరీ ఇంతల్లా అవతలివారిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తుంటే… ఇక మీతో ఎవరుంటారండీ? అని అడిగితే…


“పోనీ


పోనీ


పోతే పోనీ!


సతుల్, సుతుల్, హితుల్, పోనీ


పోతే


పోనీ!


రానీ


రానీ


వస్తేరానీ!

కష్టాల్, నష్టాల్


కోపాల్, తాపాల్, శాపాల్ రానీ!” అని నిర్లక్ష్యంగా చూస్తాడు.


పతితులను, బాధాసర్పష్టులను చూసి కరిగిపోయి “దగాపడిన తమ్ములార! ఏడవకం డేడవకండి!” అని ఊరడిస్తాడు. జగన్నాథ రథచక్రాల్‌! మీకోసం వస్తున్నాయని ధైర్యాన్నిస్తాడు.


“పాపం, పుణ్యం, ప్రపంచమార్గం-


కష్టం, సౌఖ్యం, శ్లేషార్థాలూ


ఏమీ ఎరుగని పూవుల్లారా,


అయిదారేడుల పాపల్లారా!” అంటూ చిన్నపిల్లల్ని దగ్గరకు తీసుకుని ముద్దుచేస్తాడు.


“ఆనందం అర్ణవమైతే,


అనురాగం అంబరమైతే-


అనురాగపు టంచులు చూస్తాం,


ఆనందపు లోతులు తీస్తాం.” అని అద్వైతంగా పాడుకుంటాడు.


సెలవంటూ ఈ లోకాన్ని వదిలి, తలవంచుకు వెళ్లిపోయిన తన నేస్తం కొంపెల్ల జనార్థనరావుకోసం ఈ నిరాశామయలోకంలో కదనశంఖం పూరించాడు. ఈ మహాప్రస్థానం లిఖించాడు.


“ఈ కత్తి


బూజుపట్టిన భావాలకి


పునర్జయం ఇవ్వడానికి కాదు


కుళ్ళిపోతున్న సమాజవృక్షాన్ని


సమూలచ్ఛేదం చెయ్యడానికి


ఇది


సమానధర్మాన్ని స్థాపిస్తుంది


నవీన మార్గాన్ని చూపిస్తుంది” అంటూ తన కవన ఖడ్గం ఏం చెయ్యబోతుందో, ఈ ఖడ్గసృష్టికి కారణామేమిటో వివరిస్తాడు.


“చక్రవర్తి అశోకుడెచ్చట?


జగద్గురు శంకరుడెచ్చట?


ఏవితల్లీ: నిరుడు కురిసిన


హిమ సమూహములు?” అని వేదనగా అడుగుతాడు. కానీ ఈ ఆవేదనతో పొంగుకొచ్చే దుఃఖాన్ని ఆపలేక...


“జడిగొల్పే దుఃఖంలో


తడియకుండ గొడుగులేదు” అని ఉన్నమాట చెప్పేస్తాడు.


“ఇంకా చెప్పాలంటే


ఎందరో మహానుభావులు


బ్రతుకునించి పారిపోయి


తమ వెనుకనె దాగువారు” అని ఈసడిస్తాడు.


“పాతపీపా పీతపాపా


పాడుకుంటూ తిరుగుతాయట


కొత్తగొంతుక చెవిని పడితే


గుడ్లు నిప్పులు చెరుగుతాయట


నన్ను తిట్టినతిట్లతోనే


మల్లెపూవుల మాలకట్టెను


నాకు వ్రాసిన ప్రేమలేఖలు


పోస్టుచేయుట మానివేసెను” అని “మంచి ముత్యాలసరాలు” విసురుతాడు.


“శరచ్చంద్రిక”లకు ముగ్ధుడవుతూ…


“ఇదిగో జాబిల్లీ నువ్వు


సముద్రంమీద సంతకం చేసేటప్పుడు


గాలి దాన్ని చెరిపెయ్యకుండా


కాలమే కాపలా కాస్తుందిలే” అని చందమామతో సరదా సంభాషణ చేస్తాడు.


“ప్రేమ ప్రేమను ప్రేమించడాన్ని ప్రేమిస్తుంది


ప్రేమ ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది


ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది” అని “జేమ్స్ జాయిన్‌” కవితకు అనువాదపు ప్రేమగీతాలల్లుతాడు.


ఇక సిప్రాలి దగ్గరకు వచ్చేసరికి, తన అరివీరభయంకర విప్లవరూపాన్ని కొంత శాంతింపజేసి, సరదా దారి తొక్కుతాడు. సిప్రాలి అంటే... సిరిసిరిమువ్వలు, ప్రాసక్రీడలు, లిమరుక్కులు.


సిరిసిరిమువ్వలన్నీ కందపద్యాలు. ఛందస్సుల సంకెళ్ళు త్రెంచినవాడుగా, తన కవిత్వాన్నే ఒక ఛందుస్సుగా మార్చినవాడుగా వినుతికెక్కిన శ్రీశ్రీ, ఇలా సరదాగా కందాలు రాయడం మొదలు పెడుతూ…


“మళ్ళీ ఇన్నాళ్ళకి ఇ


న్నేళ్ళకి పద్యాలు రాయుటిది యెట్లన్నన్


పళ్ళూడిన ముసలిది కు


చ్చిళ్ళన్ సవరించినట్లు సిరిసిరిమువ్వా!” అని పకపకమంటాడు.


“మీసాలకు రంగేదో


వేసేస్తే యౌవనం లభించదు నిజమే!


సీసా లేబిల్ మార్చే


స్తే సారా బ్రాంది యగునె? సిరిసిరి మువ్వా!” అని శ్రీరంగనీతులు చెబుతాడు.


ఇంకొకచోట మేము ఎలాంటి వారిమో తెలుసా?


“ఇస్పేటు జాకీలం


ఎగేసిన బాకీలం


మృత్యువు సినీమాలో


మూడు భాషల టాకీలం


భగవంతుని టోపీలం


కవిత్రయపు కాపీలం


గోరంతల కొండతలం


ఒకటికి రెండింతలం” అంటాడు.


కవిత్వం ఎలా ఉండకూడదో చెబుతూ…


“ప్రపంచాన్ని చూడలేని


కవిత నిజం చూపదు


ఇసకలోన తల దూర్చిన


ఉష్ట్రపక్షి బాపతు” అంటాడు.


“ప్రజాస్వామ్య పార్టీల్లో


ప్రజలకు తావెప్పుడు


నేతి బీరకాయలోన


నేయి పుట్టినప్పుడు” అని ఒకచోట,


“కొంతమంది కుర్రవాళ్ళు


పుట్టుకతో వృద్ధులు


పేర్లకీ పకీర్లకీ పు


కార్లకీ నిబద్ధులు” అని ఇంకొకచోట. అచ్చమైన నిజాలను ప్రాసక్రీడలాడుతూ చెబుతాడు.


అలాగే ఆదిభట్ల నారాయణదాసుగారి గురించి…


“హరికథా పితామహుడగు


ఆదిభట్ల దాసు


సంగీతం సాహిత్యం


సరితూచిన త్రాసు” అంటూ భక్తిపూర్వకమైన ప్రాసక్రీడ ఆడతాడు.


ఇక శ్రీశ్రీ“పంచపదులు”కూడా పసందైనవే…


“అరిచే కుక్కలు కరవవు


కరిచే కుక్కలు మొరగవు


కరవక మొరిగే కుక్కలు తరమవు


అరవక కరిచే కుక్కలు మరలవు


అరవని కరవని కుక్కలెక్కడా దొరకవు” అని శునకోపాఖ్యానం చెబుతాడు.


ఆయనకి సాక్షి వ్యాసాలంటే ఎంత అభిమానమో మరొక పంచపదిలో చెబుతాడు.


“లక్ష్మీ నరసింహారావు పానుగంటి


సాక్షి వ్యాసాలు చదవడం మాననంటి


ఎంచేతంటే వాటిలో పేనులాంటి


భావానికాయన ఏనుగంటి


రూపాన్నియ్యడం నేను గంటి” అని నమస్కరించుకుంటాడు.


ఇక లిమఋక్కులలో, నేను ఎవరో తెలుసా?…


“ముసలివాణ్ణి


కాను అసలు వాణ్ణి


పడగెత్తిన తాచుపాము బుసలవాణ్ణి


పీడితుల్ని వెంటేసుకు మసలువాణ్ణి


అందుకున్న ఆకాశపు కొసలవాణ్ణి” అని బుసకొడతాడు.


“సినారె


బళారె


అన్నిట్లో హుషారె


సినిమా రె


డీమేడ్ సరుక్కీ తయారె” అంటూ నారాయణరెడ్డి గారి మీద చతురోక్తి విసురుతాడు.


“వెయ్యి పడగలు


లక్ష పిడకలు


లక్క పిడతలు


కాగితపు పడవలు


చాదస్తపు గొడవలు” అంటూ ఒకవైపు విశ్వనాథని వెటకారం చేసినా, మరోవైపు...


“మాట్లాడే వెన్నెముక


పాట పాడే సుషుమ్న


నిన్నటి నన్నయభట్టు


నేటి కవి సామ్రాట్టు


గోదావరి పలుకరింత


కృష్ణానది పులకరింత


కొండవీటి పొగమబ్బు


తెలుగువాళ్ళ గోల్డునిబ్బు


అకారాది క్షకారాంతం


ఆసేతు మహికావంతం


అతగాడు తెలుగువాడి ఆస్తి


అనవరతం తెలుగువాడి ప్రకాస్తి


ఛందస్సు లేని ఈ ద్విపద


సత్యానికి నా ఉపద” అని విశ్వనాథకు నిలువెత్తు నమస్కారం కూడా చేస్తాడు.


ఇక శ్రీశ్రీ రాసిన సినిమా పాటలు కూడా చాలానే ఉన్నాయి. “పాడవోయి భారతీయుడా” అనే పేరుతో వాటిని పుస్తకంగా కూడా తీసుకువచ్చాడు.


ఈ పుస్తకాన్ని తనకు సినిమా రచయితగా అవకాశం రావడానికి కారకులైన మల్లాది రామకృష్ణశాస్త్రి గారికి అంకితం ఇచ్చాడు. శ్రీశ్రీకి పాటల రచయితగా మొదటి సినిమా... ఆహుతి అనే డబ్బింగ్ చిత్రం.


ఆయన రాసిన మొదటి పాట పల్లవి…


“ప్రేమయే జనన మరణ లీల


మృత్యుపాశమే అమరబంధమౌ


యువప్రాణుల మ్రోల!”.


“కుమారి మొల్ల” సినిమాలో ఒక సందర్భంకోసం శ్రీశ్రీగారొక దత్తపది రాయాల్సి వచ్చింది.


తెనాలి రామలింగడు మొల్లతో “అప్పు, నిప్పు, మెప్పు, చెప్పు”అనే నాలుగు మాటలిచ్చి రామాయణపరంగా అర్థమొచ్చేటట్టు ఒక పద్యం చెప్పమంటాడంటాడు. అయితే అప్పు అంటే ఋణం, నిప్పు అంటే అగ్ని, మెప్పు అంటే ప్రశంస, చెప్పు అంటే పాదరక్ష అనే అర్థాలు రాకూడదంటాడు. ఇది శ్రీశ్రీ గారు కల్పించిన సన్నివేశమే. అందుకు మొల్ల ఇచ్చే సమాధానాన్ని శ్రీశ్రీ గారు ఇలా కంద పద్యంగా చెప్పారు…


“‘అప్పు’డు మిథిలకు జని నే


‘నిప్పు’డు కావించు వింత నిచ్చటి ప్రజ తా


‘మెప్పు’డును కాంచబోరని


‘చెప్పు’చు రాఘవుడు విరిచె శివకార్ముకమున్”


“ప్రపంచం” అనే సినిమాలోని ఒక పాటలో, సంసారం ఎలా ఉండాలో చెబుతూ…


“బండికి ఉండేటి రెండు చక్రాల్లాగా


తాపీగా సాగాలి సంసారం


కొరడాతో తోలేటి కరమం లేకుండానే


సాఫీగా సాగాలి సంసారం” అని తాపీగా, సాఫీగా, విన్నవాళ్ళకు హాయికలిగేలా రాశారు.


ఈ సినిమాలో చిన్న విశేషం ఏమిటంటే… ఇందులో సర్కస్ ఎనౌన్సర్‌గా శ్రీశ్రీ సుమారు రెండున్నర నిమిషాల పాటు కనపడతారట.


ఆత్రేయ గారు డైరెక్ట్ చేసిన “వాగ్ధానం” సినిమాకు శ్రీశ్రీ కూడా పాటలు రాశారు. అందులో రేలంగి పాత్ర పాడే హరికథ “శ్రీ నగజా తనయం సహృదయం” అనే శ్లోకంతో మొదలవుతుంది. అది ఏ పూర్వకవో రాసిన వినాయక ప్రార్థనట. ఇక పాట చివర్లో వచ్చే కందపద్యం పోతన భాగవతం లోనిదట. అయితే…“ఫెళ్ళుమనె విల్లు - గంటలు ఘల్లుమనె” అనే పద్యం కరుణశ్రీ గారిది. వారి అనుమతితోనే ఆ పద్యం వాడుకున్నప్పటికీ, ఆ విషయం ఆ సినిమా పాటల పుస్తకంలో ప్రస్తావించకపోవడం పొరపాటని, అందుకు కరుణశ్రీ గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నానని అంటారు శ్రీశ్రీ.


ఇక తొలితరం వీణ పాటలలో ఒకటైన, భార్యాభర్తలు సినిమాలోని…


“ఏమని పాడెదనో ఈ వేళ


మానసవీణ మౌనముగా నిదురించిన వేళకి” అనే పాట శ్రీశ్రీ కలం మ్రోగించినదే,


“జగమే మరచి హృదయ విపంచి


గారడిగా వినువీధి చరించి


కలత నిదురలో కాంచిన కలలే


గాలి మేడలై కూలిన వేళ” అని అక్కినేని మంచిమనిషిగా మారినా, మారలేదనుకుని కృష్ణకుమారి వేదనాలాపన చేస్తుంది.


కృష్ణకుమారి వేదనకు, అనుమానానికి కారణం ఉంది. అంతకుముందు అక్కినేని…


“ఓ బాల నీ వయ్యారమెంచి మరులుకొంటినె


చాల ప్రేమ పాఠములను చదువుకొంటినే” అని ఎంతోమంది అమ్మాయిలతో కలిసి “జోరుగా హుషారుగా షికారు” చేసిన విషయం ఆవిడకు తెలుసు. అదన్నమాట సంగతి.


కానీ తన “మాంగల్య బలా”న్ని బలంగా నమ్మిన మహానటి మాత్రం...


“ఆకాశ వీధిలో అందాల జాబిలీ


ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలుగేనే


సయ్యాటలాడెనే” అని అక్కినేనితో కలిసి ప్రేమపరవశంతో పాడుకుంటుంది.


ఇక “వెలుగు నీడలు” ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటాయని, అధైర్యం వలదనీ జగ్గయ్య భార్యయైన సావిత్రికి చెబుతూ…


“కల కానిది విలువైనది


బ్రతుకూ కన్నీటిధారలలోనే


బలిచేయకు” అంటాడు అక్కినేని.


అంతకుముందే గిరిజతో కలిసి…


“హాయి హాయిగా జాబిల్లి.. తొలిరేయి వెండి దారాలల్లి


మందు జల్లి నవ్వసాగే ఎందుకో


మత్తుమందు జల్లి నవ్వసాగే ఎందుకో” అని పాడుకుంటాడు.


అసలు భాగ్యం అంటే ఏమిటో, స్వర్గం అంటే ఎలావుంటుందో తెలియాలంటే “డాక్టర్ చక్రవర్తిని” అడగాలి.


“నిన్ను నిన్నుగా ప్రేమించుటకు


నీ కోసమే కన్నీరు నించుటకు


నేనున్నానని నిండుగ పలికే


తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” అంటాడాయన. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే...


“మనసున మనసై బ్రతుకున బ్రతుకై


తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” అన్నది ఆయన ఉద్దేశ్యం.


అలాగే వేరేచోట...


“నా హృదయంలో నిదురించే చెలీ!


కలలలోనే కవ్వించే సఖీ


మయూరివై వయ్యారివై నేడే


నటనమాడి నీవే


నన్ను దోచినావే” అని ఎంతో “ఆరాధన”గా పాడుకుంటాడు అక్కినేని.


శ్రీశ్రీని ఎవరో అడిగారట “ఆ నిదురించే చెలి” ఎవరని? “కమ్యూనిజం” అని జవాబిచ్చారట శ్రీశ్రీ.


అన్ని పాటలూ అక్కినేనికేనా అంటే… సర్లేకానీ అని...


“ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామ


ఈ సిగ్గుపొరలలోన బాగుంది సత్యభామ


ఏమంది సత్యభామ?” అని నందమూరితో అడిగించి,


“ఏమందో ఏమో కాని పరిహాసాలే చాలునంది


శ్రీవారిని ఐదారడుగుల దూరాన ఆగమంది” అని అంజలీదేవితో జవాబు చెప్పించారు.


అసలు శ్రీశ్రీ తలచుకుంటే ఎన్టీయార్‌తో యముడిమీదే తిరుగుబాటు చేయించగలరు.


“సమరానికి నేడే ప్రారంభం


యమరాజుకు మూడెను ప్రారబ్ధం


నరలోకమున కార్మిక శక్తికి


తిరుగే లేదని చాటిద్దాం”అని ఆ నందమూరి అందగాడితో పాటలు పాడించనూ గలరు.


ఈ మహాకవి అంతటి శక్తిమంతుడైనా, మనబోటివాళ్ళ దగ్గరకు వచ్చేసరికి…


“ఎవరో వస్తారని ఏదో చేస్తారని


ఎదురు చూసి మోసపోకుమా


నిజము మరచి నిదురపోకుమా” అని జాగ్రత్తలు చెబుతుంటారు.


ఆయన మాత్రం ఈ “మనుషులు మారాలి!” అని నిత్యం తాపత్రయపడుతుంటారు.


“చీకటిలో కారు చీకటిలో


కాలమనే కడలిలో


శోకమనే పడవలో


ఏ దరికో.. ఏ దెసకో” అని వ్యధతో పాడుకుంటూ ఎక్కడెక్కడికో వెళిపోతుంటారు.


అసలు మనిషంటేనే మణిదీపం అంటారు. అతని మనసే నవనీతం అంటారు.


“ఉందిలే మంచి కాలం ముందు ముందూనా


అందరూ సుఖపడాలి నందనందాన” అని ఉద్బోధిస్తారు.


“అందరి కోసం ఒక్కడు నిలిచి


ఒక్కనికోసం అందరు కలిసి


సహకారమే మన వైఖరియైతే


ఉపకారమే మన ఊపిరి ఐతే..” అంటూ ఆ మంచిరోజులు రావాలంటే ఏంచెయ్యాలో కూడా ఆయనే చెబుతారు.


ఆ తరువాత…


“పాడవోయి భారతీయుడా - ఆడి


పాడవోయి విజయగీతికా!” అని ఉత్సాహాన్నిస్తూ…


“స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసీ


సంబర పడగానే సరిపోదోయి


సాధించిన దానికి సంతృప్తిని పొందీ


అదే విజయమనుకుంటె పొరపాటోయి” అని విషయం వివరిస్తూ,


“ఆగకోయి భారతీయుడా


కదలి సాగవోయి ప్రగతి దారులా” అని దిశా నిర్దేశం చేస్తారు.


కొంచెం ఈ కాలం నుండి అలా వెనక్కు వెళితే, అక్కడ…


“ఎవ్వరికోసం ఈ మందహాసం


ఒకపరి వివరించవే


సొగసరి ఒకపరి వివరించవే” అని అభిమన్యుడు,


“చెలుని కోసం ఈ మందహాసం


గడుసరి ఏమని వివరించను” అని ఉత్తర యుగళగీతం పాడుకుంటుంటారు.


ఎక్కడైనా చక్కటి వెన్నెలలో ఇద్దరూ అమ్మాయిలే కూర్చుని కనబడితే… ఒకరిని వీణ వాయించమని చెప్పి, ఇంకొకరితో...


“పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా


ఈ వసంత యామినిలో


ఈ వెన్నెల వెలుగులలో


జీవితమే పులకించగ” అంటూ పాట పాడిస్తారు.


“బొమ్మను చేసి ప్రాణము పోసి


ఆడేవు నీకిది వేడుకా” అని రాసి వీటూరి గారు రాసి అలా ప్రక్కకు వెళ్ళగానే…


“ఒకనాటి ఉద్యానవనము నేడు కనము


అదియే మరుభూమిగా నీవు మార్చేవులే” అని మిగతాది రాసుకు వెళిపోతారు.


మీరు ఇంత పేరుమోసిన విప్లవకవికి కదా జావళీల సంగతేమన్నా తెలుసా అని అడిగితే…


అప్పటికప్పుడు ఎల్. విజయలక్ష్మిని రప్పించి


“నిను జేర మనసాయె రా - నా స్వామి


చనువార దయసేయరా” అని ఆమెతో గజ్జెలు గలగలలాడిస్తారు.


“మగువ కోర మొగమాటమేలరా


బిగువ మాని జవరాలి నేలరా” అంటూ శృంగారం ఒలికింపజేస్తారు.


మాకోసం ఇంకేమన్నా చేసిపెట్టండి సార్! అని అడిగితే...


సూపర్ స్టార్‌ను పిలిపించి “తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా” అంటూ స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం పంపించి, ఈయన వెళ్ళి తెలుగువాళ్ళు ఎప్పుడూ చూడని నేషనల్ అవార్డ్‌ పట్టుకొచ్చి ఇస్తారు.


ఇన్ని చేసిన శ్రీశ్రీ గారి కోసం చాలా గొప్పవాళ్ళు ఇంకా గొప్పగా ఎన్నో అన్నారు. వారిలో..


“రెండు శ్రీలు ధరించి


రెండు పెగ్సు బిగించి


వరలు శబ్ద విరించి” అన్న ఆరుద్ర గారికి ఒక నమస్కారం,


“శ్రీశ్రీ మొదలంటా మనిషి - చివర్లో ఋషి - మధ్యలోనే కవి - ఎప్పటికీ ప్రవక్త” అన్న వేటూరి గారికి మరొక నమస్కారం చేసి...


తెలుగులో నవకవితకు శ్రీరస్తు వ్రాసిన ఈ వ్యాస కథానాయకుడు శ్రీ “శ్రీశ్రీ” గారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ స్వస్తి!


🙏💐🙏💐🙏💐🙏💐🙏💐

మంకీ ట్రాప్*

 👑👑👑👑👑👑

*శుభ మంగళవారం*

*30-4-2024*

---------------------====-

*మంకీ ట్రాప్*

------------------------===


ఇటీవల మూడు రోజుల క్రితం చదివిన ఒక చిన్న వార్త ... 

భాగ్యనగరంలో ఒక బిక్షగాడు మృతి.. పోస్టుమార్టం లో తేలింది ఏమిటంటే, అతనుకు 14 రోజుల నుంచి భోజనం లేదు... అంటే ఆకలి మరణం. ఇది కూడా పెద్ద సంచలన వార్త ఏమి కాదు, కానీ ఈ వార్తలోని కొసమెరుపు ఏమిటంటే బిక్షగాడి జోలి కాని సంచిలో అక్షరాల మొత్తము 1లక్ష 34 వేల రూపాయలు దొరికాయి. న్యూస్ హెడ్డింగ్ కూడా ఇదేను. "బిచ్చగాడి దగ్గర భారీ మొత్తమని".  


ఇక్కడ బాగా గుంజి పడేస్తున్న విషయం ఏమిటంటే అంత డబ్బు ఉంచుకున్న బిక్షగాడు ఒక పూట ఆహారం ఎందుకు తీసుకోలేకపోయాడు? అదీ తన ప్రాణం పోతున్నా.. 14 రోజుల నుంచి ఆకలితో ఉన్నాడు.. తప్ప డబ్బు ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? ఏమిటి ఈ మనస్తత్వం ? ఇటువంటి దౌర్భల్యం మనందరిలో కూడా ఉంటుందా? అంటే.. అవుననే చెబుతుంది మానసిక శాస్త్రము..



"మంకీ ట్రాప్" అవును ఆఫ్రికాలోని ఒక తెగ వారు కోతులను వేటాడటానికి చెట్టు తొర్రలో కానీ, పుట్టలో కానీ, ఇవి కాకపోతే ఎండు కొబ్బరికాయలో ... ఖచ్చితంగా కోతి చేయపట్టే అంత రంద్రం చేస్తారు. ఈ రంధ్రం ప్రత్యేకత ఏమిటంటే ఇది కోతి చేయి పట్టే అంత పెద్దది గా మరియు.. కోతి పిడికిలి బయటికి రానంత చిన్నదిగా ఉంటుంది.. ఇక ఈ రంద్రంలో కోతి కి కావలసిన అరటికాయనో వేరుశనగ గింజలనో పోసి ఉంచుతారు. దీనికి ఆశ పడిన కోతి రంద్రములో చేయి పేట్టి వాటిని పట్టుకుంటుంది. కానీ పిడికిలిని మాత్రం బయటికి తీయలేక పోతుంది. సరిగ్గా ఇదే సమయంలో ఆ తెగ వారు ఆ కోతిని పట్టుకుంటారు. గమ్మత్తుగా మనుషులు తనను సమీపిస్తున్న... ప్రమాదం పొంచి ఉన్న.. కోతి మాత్రం ఆ పిడికిల్ని తెరవలేకపోతుంది.తాను పట్టుకొన్నది వదలలేక పోతుంది.చివరికి దొరికిపోతుంది. దీన్నే సింపుల్ గా మంకీ ట్రాప్ అంటాము.

 నిజంగా మనకి ప్రమాదమని.. నష్టమని తెలిసినప్పటికినీ కొన్నిటిని మనం వదులుకోలేకపోతున్నామా ? అయితే ఇటువంటి మంకీ ట్రాప్ లో మనం ఉన్నట్లే.. రోజువారి కష్టపడి సంపాదించుకున్న కూలీ డబ్బులను దాచిపెట్టుకొని ఆసుపత్రికి వెళ్ళటానికి కూడా మనసు ఒప్పుకోకుండా తనువు చాలించిన చుట్టాలు నాకు చాలా మంది తెలుసు.నిజంగా డబ్బు అంతగా కట్టి పడేస్తుందా అంటే..డబ్బు కాదుకాని మన తత్వం మనల్ని ట్రాప్ లో పడేస్తుంది. విశితంగా పరిశీలిస్తే మన నష్టాన్ని మనం అంత తొందరగా వదులుకోలేము అనిపిస్తుంది..... చచ్చిన బిచ్చగాడిని చూసి నవ్వుకునే మనము .. మనకు తెలియకుండానే మనం అదే ట్రాప్ లో ఉన్నామనిపిస్తుంది. 

ఎప్పుడో తెగిపోయిన ఒక బంధాన్ని పట్టుకొని ఇప్పటికి ఏడుస్తున్న వాళ్ళము ఎంతమంది లేము? 

ఒక మాట పంతానికి ఇంకెన్నో బంధాలను దూరం చేసుకుని ఒంటరిగా మిగిలిపోయిన వాళ్లు మనలో లేరా?

వ్యాపార లాభాలు అంటూనో, పేరు ప్రతిష్ఠలంటూనో వృత్తికి అంకితం అయిపోయి తన కుటుంబాన్ని పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పెద్దలు నాకు బాగా తెలుసు. 

మేము పరాజితులమని వాళ్లే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. అందుకే చిన్న మోతాదులో కానీ పెద్ద మోతాదులో కానీ మనం కూడా ఇటువంటి ట్రాప్ లో ఏమైనా ఉన్నామేమో! చూసుకోవాలి. 

అది బంధం కావచ్చు డబ్బు కావచ్చు, కీర్తి కావచ్చు.. మనల్ని పట్టేసి ఉంచుతుందేమో గమనించుకోవాలి. అవసరానికి దాన్ని వదులుకోగలమో లేదో చూసుకోవాలి. అప్పుడే మనము ఈ ట్రాప్ నుంచి బయటపడగలం.

మనల్ని ఏడిపించే జ్ఞాపకాలు...

నో చెప్పలేని మోహమాటలు...

తిరిగి అడగలేని అప్పులు...

దండిచలేని ప్రేమలు...

ఊపిరి సలపనివ్వని పనులు...

వత్తిడి పెంచే కోరికలు....

ఆరోగ్యాన్ని హరించే సంపాదనలు...

పేరు వెంట చేసే పరుగులు....

అన్నీ మంకీ ట్రాప్ లే!!


 మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ చెప్పినట్లు " వదలటం గొప్పా పట్టుకోవడం గొప్ప? అంటే.. అవును సీతను వదిలేసి ఉంటే రావణుడు ప్రాణాలతో బతికేవాడు.. అందుకే ఫ్రెండ్స్ కొన్నిటిని వదిలేయడం అలవాటు చేసుకుందాం.. మరింత మనశ్శాంతిగా ఉందాము.

చర్మవ్యాధులు

 చర్మవ్యాధుల గురించి సంపూర్ణ వివరణ - 


 చర్మవ్యాధులు రావడానికి గల కారణాలు - 


  * విరుద్ధములగు అన్నపానములు తినటం అనగా పాలతో తయారైన సేమ్యా , కోవా , ఐస్ క్రీం తిని పెరుగన్నం తినటం లేదా చల్లని కూల్ డ్రింక్ ని వేడిఅన్నం , కూరలు కలిపి తినటం ఇలాంటి ఆహారపు అలవాట్లు పాటించటం . 


 * మలమూత్రాలను ఆపడం , అదేవిధముగా వాంతి వంటి సహజ వేగాలను బలవంతముగా నిరోధించడం . 


 * భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయుట , ఎండలో తిరుగుట చేయరాదు . 


 * ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగరాదు . 


 * అతిగా శ్రమపడి వచ్చి వెంటనే నీటిని సేవించరాదు . 


 * అజీర్ణముగా ఉండగా మరలా భుజించరాదు . అనగా ముందు తిన్నది సంపూర్ణముగా అరగక ముందు మరలా భోజనం చేయరాదు . 


 * కొత్తబియ్యపు అన్నం , పెరుగు మరియు చేపలు కలిపి తినరాదు . 


 * అధికంగా పులుపు , ఉప్పు తినరాదు . 


 * మినుములు , ముల్లంగితో చేయబడిన వంటలు , పాలు నువ్వులతో చేసిన వంటలు ఎక్కువుగా తీసుకొనుట 


 * తినిన ఆహారం జీర్ణం కాకముందే దాంపత్యములో పాల్గొనుట చేయరాదు . 


 * పగలు నిద్రించరాదు . పగలు నిద్రించుట వలన శరీరం నందు శ్లేష్మము పెరిగి దానివలన రక్తప్రసరణకు అవరోధము కలిగి చర్మమునకు రక్తప్రసరణ సరిగ్గా జరగక చర్మవ్యాధులు సంభవించును . ఎండాకాలం కొంచంసేపు పగలు నిద్రించవచ్చు . 


        పైన చెప్పినవిధముగా విరుద్ధమైన ఆహారం , పనులు చేయుటవలన శరీరంలో చర్మము , రక్తము , మాంసము , లింప్ గ్రంథులు దోషమును పొంది రకరకాల చర్మవ్యాధులు కలుగును. 


  చర్మవ్యాధులు రావడానికి పూర్వము కనిపించు లక్షణములు - 


 * స్పర్శజ్ఞానం క్రమేపి తగ్గిపోవుట . 


 * చెమట ఎక్కువుగా పట్టుట లేదా చర్మవ్యాధి ప్రదేశము నందు అసలు చెమట పట్టకపోవును . 


 * శరీరవర్ణము మారి నల్లబారిపోవుట . 


 * దద్దుర్లు . 


 * పోట్లు . 


 * అలసట , వడలినట్లు అగుట. 


 * వ్రణములు లేచి అధికభాధతో కూడి శీఘ్రముగా  

      జనించి త్వరగా మానకుండా ఉండటం. 


 * తాపము ( చర్మం అంతా మంటలు ) . 


  అసాధ్య చర్మవ్యాధి లక్షణములు - 


 * రోగి బలహీనుడుగా ఉండి దప్పిక , మంట , అగ్నిమాంద్యములతో కూడి క్రిములు ఏర్పడిన అసాధ్యము . 


 * చర్మవ్యాధి ఏర్పడి 10 సంవత్సరాలు దాటిన     

      అసాధ్యము . 


  చర్మవ్యాధుల యందు చికిత్సాక్రమము - 


        శరీరము నందలి వ్యర్ధపదార్ధముల వలన చర్మవ్యాధులు వచ్చును . కాబట్టి వానిని వివిధరకాల పద్ధతుల ద్వారా వాంతి , విరేచనం మొదలగు శోధన పద్ధతులను ఉపయోగించి వ్యర్ధాలను బయటకి పంపుతూ ఔషధాలను ఇయ్యవలెను . 


  చర్మవ్యాధుల యందు పథ్యము - 


  * తేలికగా అరిగెడి ఆహారం తీసికొనవలెను . 


  * త్రిఫలములు - ఉశిరి , కరక్కాయ , తానికాయ 

       విరివిగా వాడవలెను . 

  

  * త్రిఫలా ఘృతము కూడా వాడవచ్చు . 


  * పాతధాన్యములు వాడవలెను . 


  * యవలు , చామలు , కొర్రలు , కందికట్టు , పెసర 

       కట్టు , మేకమాంసం వాడవలెను . 


  * బీరకాయ , పొట్లకాయ , దోసకాయ , పెరుగు 

      తోటకూర , పొన్నగంటికూర , మెంతికూర , ఆవు 

       నెయ్యి , తెల్ల గలిజేరుకూర , తేనె , నీరుల్లి . 


           పైన చెప్పిన పదార్ధాలు ఆహారంలో తప్పక భాగం చేసుకొనవలెను . 


  చర్మవ్యాధుల యందు అపథ్యము - 


 * చింతపండు పులుపు , అతిగా కారం , ఆవాలు , 

      గుమ్మడి , వెల్లుల్లి , పెరుగు , పాలు . 


 * బెల్లం , కల్లు , సారాయి , నువ్వులు .


 * మినుములు , చెరుకురసము , పానకము .


 * చేపలు , నీటిపక్షులు , కోడి మాంసం , పావురం .


 * అతిగా వ్యాయామం , స్త్రీసంభోగం చేయరాదు .  


          పైన చెప్పినవిధముగా ఆహారపు అలవాట్లు పాటిస్తూ సరైన వైద్యుడి పర్యవేక్షణలో ఔషధాలు సేవించుచున్న చర్మవ్యాధుల నుంచి త్వరగా బయటపడగలరు. ఇక్కడ మనం ముఖ్యముగా గుర్తు ఉంచుకోవాల్సిన విషయము ఏమిటంటే వ్యాధి సంప్రాప్తినిచ్చిన తరువాత ఔషధాలు సేవించుట కంటే వ్యాధి రాకుండా చూసుకోవడమే అత్యంత ప్రధానమైనది. 


    

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

నర్మదానదీ పుష్కరాలు

 ॐ నర్మదానదీ పుష్కరాలు - మహేశ్వర్ 


       నర్మదా నదీ పుష్కరాలు రేపటి నుంచీ ప్రారంభమవుతున్నాయి కదా! 


                నర్మదా నది ప్రత్యేకత 


    మూడు సంవత్సరాలు సరస్వతిలోనూ, 

    ఏడు రోజులు యమునా నదిలోనూ, 

    ఒక్కరోజు గంగానదిలోనూ స్నానం చేయడం వల్ల పుణ్యం వస్తుందంటారు. 

    కానీ నర్మదానదిని చూస్తేచాలు పాపాలన్నీ పటాపంచలవుతాయట. 


    గంగానది కూడా ఏడాదికి ఒకసారి నర్మదానదిలో స్నానంచేసి, తన పాపాలను (తనలో భక్తులు స్నానంచేయడం ద్వారా భక్తులపాపాలను) కడిగివేసుకుంటుంది. 

    గంగ నర్మదలో స్నానం చేసినరోజుని 'గంగాసప్తమి' అంటారు. 


                        మహేశ్వర్ 


    ఇది క్షిప్ర - నర్మద నదుల మధ్యప్రదేశంలో, నర్మదానది ఉత్తరతీరంలో, కార్తవీర్యార్జున క్షేత్రంగా పిలువబడుతూంటుంది. 


        మహేశ్వర్ - ప్రముఖ దేవాలయాలు 


    శ్రీ రాజరాజేశ్వర, కాశీ విశ్వనాథ, అహిల్యేశ్వర, జ్వాలేశ్వర, బాణేశ్వర, కాలేశ్వర, కాదంబేశ్వర, సప్తమాతృక మొదలైన దేవాలయాలు ప్రసిద్ధిచెందినవి. 

     

         ఈ పుష్కరంలో అన్నదానం 


    శ్రీవేంకటేశ్వర బ్రాహ్మణ నిత్యాన్నదాన ట్రస్ట్, ద్వారకా తిరుమలవారు, 

    ఈ మహేశ్వర్ క్షేత్రానికి వచ్చిన భక్తులకు 

    1/5/2024 నుండీ 12/5/2024 వరకూ 

    అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మోక్షం అనేది

 శ్లోకం:☝️

*న మోక్షో నభసః పృష్ఠే*

 *న పాతాలే న భూతలే l*

*మోక్షో హి చేతో విమలం*

 *సమ్యగ్ జ్ఞానవిబోధితం॥*

  - యోగవాశిష్టం


భావం: మోక్షం అనేది స్వర్గంలో కానీ పాతాళంలో కానీ భూమిమీద కానీ లేదు. సమష్టి జ్ఞానముచే శుద్ధమైన మనస్సు తన యొక్క ముక్త స్థితిని అనుభవపూర్వకంగా గుర్తించడమే మోక్షం.🙏

పంచాంగం 30.04.2024 Tuesday

 ఈ రోజు పంచాంగం 30.04.2024 Tuesday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: షష్థి తదుపరి సప్తమి తిధి భౌమ వాసర: ఉత్తరాషాఢ నక్షత్రం సాధ్య యోగ: వణిజ తదుపరి భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


షష్థి ఉదయం 07:04 వరకు తదుపరి సప్తమి రా.తె 05:45 వరకు.

ఉత్తరాషాఢ రా.తె 04:08 వరకు. 

సూర్యోదయం : 05:54

సూర్యాస్తమయం : 06:32


వర్జ్యం : మధ్యాహ్నం 12:30 నుండి 02:04 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:26 నుండి 09:16 వరకు. తిరిగి రాత్రి 11:05 నుండి 11:50 వరకు.


అమృతఘడియలు : రాత్రి 09:52 నుండి 11:26 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.


యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

అక్షయ తృతీయ*

 *అక్షయ తృతీయ*

*సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య చందనోత్సవం*

*మే 10 వ తేదీన*

🌸🌸🌸🌸🌸🌸🌸

 మే 10 అక్షయ తృతీయ వరకు వీలున్న వారు  , శ్రీ ఆది శంకరులవారు మనకు అందించిన మహిమాన్విత *శ్రీకనకధార పారాయణ* వీలైనన్ని ఎక్కువసార్లు చేయవచ్చు.

ఇప్పటి వరకు ప్రారంభించని వారు *ఈరోజు  నుంచి* *ప్రారంభిస్తే అక్షయ తృతీయ నాటికి 11 రోజుల పారాయణం అవుతుంది.*

శ్రీ మహాలక్ష్మీ కటాక్ష సిద్ధిరస్తు

🌸🌸🌸🌸🌸🌸🌸

ఒరే అబ్బాయ్

 పొద్దునే లేచి కాఫీ తాగుతుంటే మా బాబాయ్ పేపర్ లోనుండి తల పైకెత్తి నన్ను పిల్చాడు...


*ఒరే అబ్బాయ్...ఏమిట్రా ఈ ఒకట్ల గోల(1,1,1...),మా చిన్నప్పుడు ఒక పరీక్షల్లో ఒకే ఒక ఒకటి వుండేది, ఇప్పుడు ఏమిట్రా, అందరూ 1,1,1,....వేస్తున్నారు,కొంచం  విడమర్చి చెప్పరా* అన్నాడు.


బాబాయ్ పూర్తి గా తెలుసుకొనిదే ఏది వదలడు,బాబాయ్ కి నిద్రపట్టదు,తిన్నది అరగదు.


బాబాయ్ కి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను.


ఇంతలోనే మరల అరిచినంత పని చేశాడు,*ఏమిట్రా పొద్దునే ఆ పరధ్యానం*...


ఇంకా తప్పదు అని మొదలెట్టాను...*బాబాయ్, నీ కిష్టమైన భోజన పరిభాష లో ఒకట్ల(1,1,1,1...) గురించి చెప్తాను.కోప్పడకూడదు* అన్నాను.


*బాబాయ్ వెంటనే చెప్పరా బడుద్ధాయ్....అంటూ నవ్వాడు*


నీ ఫ్రెండ్స్ నలుగుర్ని మన ఇంటికి భోజనానికి పిలిచావు అనుకో,*పిన్ని* వాళ్ళందరికీ చక్కటి భోజనం వండి వార్చింది,అనుకో.


1) *ముద్ద పప్పు,కాచిన నెయ్యి  అన్నం తో ఇద్దరు మొదలు పెట్టారు,అప్పుడు పప్పు  తో ప్రారంభించడం లో ఒకరు ఫస్ట్(1), ఫస్ట్ ర్యాంక్*


2)పిన్ని చేసిన గుత్తి వంకాయ కూర ముగ్గురు *మారు అడిగారు, వంకాయ కూర మారు అడిగిన వాళ్ళలో ఒక ఆయన  ఫస్ట్(1st  ర్యాంక్)*


3) దప్పలం జుర్రుతూ అప్పడాలు కరకరా నలుగురు నమిలారు.

పెద్ద శబ్దం చేస్తూ నమలడం లో నువ్వు ఫస్ట్ ర్యాంక్(1).


4) గడ్డ పెరుగు విస్తట్లో వేస్కుని ఆస్వాదించడం లో సుబ్బయ్య మామయ్య ఫస్ట్,కాబట్టి ఆయనది ఫస్ట్ ర్యాంక్(1)


5) *ఇంకా ఏదో చెప్పబోతుంటే బాబాయ్ అడ్డంపడి,చాలు,చాలు,ఇంకేమి చెప్పకు ..నాకు పూర్తిగా అర్థం అయింది అని ... మరల పేపర్లో తలదూర్చాడు.*


నేను గుండెలనిండా గాలి పీల్చి,బాబాయ్ కేసి విజయ దరహాసంతో చూసి,చెప్పుల్లో కాలు పెట్టాను.


ఇంతలో మా *ఆవిడ* వంటిట్లో నుండి కేకేసింది...ఏమండీ మన చింటుగాడు నిన్న స్కూల్ లో రెండో ఎక్కం చూడకుండా రాయడం లో ఫస్ట్(1 ర్యాంక్) వచ్చాడు, పాపాయి బెంచి లో కూర్చున్న నలుగురు పిల్లల్లో ఫస్ట్ అంట (1) ఫస్ట్ ర్యాంక్.


*పరీక్ష వ్రాసిన అందరి పిల్లలకు ఫస్ట్ ర్యాంక్ రావాలి*.


సర్వేజనా,సమస్త జీవ,ప్రాణి కోటి సర్వావస్థల యందు సుఖీభవ...


మూర్తి, సీనియర్ ఫిజిక్స్ లెక్చరర్, కాలమిస్ట్,9985617100

చందమామ కథలు

 💦 *చందమామ కథలు (Chandamama Kathalu) - 99*


*🐥మోహానుబంధాలు*


 ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..

ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు.

సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని.

మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,

" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు

వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.

యజమాని కంగారుపడుతూ.

" అలా ఎలా కుదురుతుంది ??

పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు.

సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.

ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.

మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను "

యజమాని తడబడుతూ

" ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...

వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా..

" పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..

ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి

సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .

అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు..

సాధువు కి కొంచెం బాధనిపించింది.

ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు..

చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..

సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు..

సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,

" ఏమిటి నీ పిచ్చి మోహం ??? 🐕 గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "

అన్నాడు..

యజమాని

" ఆ మాట మాత్రం వినలేను..

ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.

మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.

అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది..

పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమానే.

మంత్రజలం చల్లి,

" ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???" అన్నాడు

ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..

సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు.అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,

కర్రలు తీసుకుని బయలుదేరారు.

తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు

కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

నీతి

గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.

           💦🐬🐥🐋💦

శ్రీమన్నారాయణుని వైభవం!

 :

 పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. ,  దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా,  పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా  శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


పోతనగారి పద్యంలోని పోతనగారి  విశ్వరూపసందర్శనను అత్యద్భుతమైన రీతిలో వర్ణించారు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు.   🙏🙏🙏🙏

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

జీవితాలలో వెలుగు నింపండి !

 గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !


కాదు కనుమరుగు చేశారు, ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! 


గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! 


అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!


 మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ... ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! 


పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! 


మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? 


ఎక్కువలో ఎక్కువ 5000 / ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? 

రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? 


అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! 


గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !


పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! 


అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి              మీరు హిందువులు అయితే మీరు పాటించి మీ తోటి వారిని పాటించమని చెప్పండి... జై శ్రీ రామ్ 🙏🙏

హిందూధర్మమే

 స్వధర్మే నిధనం శ్రేయః 

పరధర్మో భయావహః 


పూర్వం

ప్రపంచమంతా హిందూధర్మమే ఉండెను 


ఈ కుల ఉన్మాదం వలన హిందువులు అన్ని దేశాలను కోల్పోయారు 


భవిష్యత్తులో ఈ కుల ఉన్మాదం వలన హిందుస్థాన్ని కోల్పోతారు 


హిందూధర్మం సనాతనధర్మం బ్రతకాలి అంటే కుల శైవ విష్ణు మధ్వ జైన బౌద్ధ ముస్లిం క్రైస్తవ మతాలను విస్మరించి 


సంస్కృతభాషా గురుకులాలను ప్రపంచమంతా స్థాపించాలి 


సంస్కృతభాష గురుశిష్యులను ప్రతి గల్లీ లో వీథిలో బడిలో గుడిలో నిర్మించుకోవాలి


లోకాః సమస్తాః సుఖినోభవంతు అని విశ్వశాంతిని కోరుకున్న సమ్భాషణ సంస్కృతంను వేదవేదాంగాలను భగవద్గీతను 

ఆందరికి అనివార్యంగా 


ప్రపంచమంతా నేర్పించాలి 


నాటి ప్రపంచ మానవులందరూ సమ్భాషణసంస్కృతమును వేదాలను వేదాంగాలను సంస్కృతభాషను 

సంస్కృతభాషా సాహిత్యం మును చదివేవారు 


ప్రభుత్వాలు

హిందువులను కులాలుగా విడదీసినారు 


ఆ కులపాయన ఆస్తిని ఆ ఫలానా కులపైనకు అమ్మేసిన దట 


అయ్యో మీకు తెలియదా ఆ కులపోని కూతురు క్రైస్తవురాలిగా మారిపోయినదట 


అయ్యో ఆ కులపామె అమ్మాయి హిందు ధర్మం వదిలేసి ముస్లింను ప్రేమించి పెండ్లి చేసుకున్నదట 


అని మాట్లాడుకొనే విధంగా ప్రభుత్వాలు హిందూ ప్రజలను కులాలుగా విడదీసినాయి 


 హిందువులను కులాలుగా విడదీసి మన హిందు ధర్మమును సనాతన ధర్మమును సర్వనాశనం చేసి సాటి హిందువుకు


 హైందవ మతేతురుల ద్వారా కష్టం వస్తే పట్టించుకునే నాథుడే లేకుండా చేయడం దురదృష్టకరం 


వేద వేదాంగాలు చదివి అందరికి బోధించే గురువులు సైతం 

ప్రపంచానికి గురువులైన మహానుభావులు 


బ్రహ్మజ్ఞానం నేర్చుకున్న మహానుభావులు పండితులు 


షోడశసంస్కారాలు షోడశ ఉపచారపూజలు చేస్తూ 


అందరికి నేర్పిస్తూ 


ప్రతి వ్యక్తిని

ప్రతి ఇంటిని 

ప్రతి వీథిని 

ప్రతి రాజ్యమును 

ప్రతిరాష్ట్రమును 


సంస్కరించాల్సిన పెద్దలు వక్తలు కవులు పండితులు గురువులు ఋషులు అయిన వారు


 కులములుగా విడిపోతే ఈ హిందువులను ఎవరు కాపాడుతారు 


వేదవేదాంగాలు చదివిన వారు 


వాటిని అందరికి నేర్పిస్తు


చదువురాని చదువుకున్న హిందూధర్మం గొప్పతనం తెలియని వారికి


తెలియజేసి


హిందువులను కాపాడిల్సిన పండితులు ప్రభుత్వాలు


 కులముగా విడిపోతే 


హిందూధర్మమును ఎవరు కాపాడుతారు 


వేదవేదాంగాలు నేర్చుకున్న పండితులు 


అపౌరుషేయాలైన

ప్రజలకు వేదవేదాంగాలు సంస్కృతమును నేర్పించి హిందుజాతిని

 హిందుదేశాన్ని 

హిందుసాహిత్యమును 

హిందుశాస్త్రములను 

సంస్కృతభాషను 


ప్రపంచానికి నేర్పించాల్సిన పండితులు ప్రభుత్వాలు


కులాలుగా విడిపోతే హిందూదేశం అంతరించిపోతుంది 


 హిందువులందరికి హిందూదర్మం గురించి 

 

బోధించే పండితులు ప్రభుత్వాలు


కులాలుగా విడిపోతే 


కులమే గొప్పదని ప్రబోధిస్తే 


సనాతనధర్మం హైందవధర్మం కులధర్మంగా మారిపోతుంది 


కులప్రభుత్వాలు

కుల గల్లీలు 

కుల వైపు షాపులు

కులపార్టీలు 

కులకాలనీలు 

కుల ప్రాంతాలు 

కులగ్రామాలు 

కులనగరాలు 

వస్తాయి వస్తున్నాయి వచ్చాయి


సాటి హిందువు ముఖంలో కులమే కనిపిస్తుంది 


హిందు ధర్మం కనిపించదు 


హిందూధర్మం హిందూసాహిత్యం వేదవేదాంగాలు అంతరించిపోతాయి 


చివరికి ఈ దేశంలో గల్లీ గల్లీ కొక 


కుల

వైన్ షాప్ వస్తుంది ఇక అందరూ 


ప్రొద్దున నుండి రాత్రి వరకు నిశాలో ఉంటారు 


హిందు ధర్మమును వేదవేదాంగ ములను భగవద్గీతను ఎవ్వరూ పట్టించుకోరు 


తస్మాత్ కులం కన్న గుణమే మిన్న


హిందూధర్మమే 

వేదవేదాంగాలు 

భగవద్గీత 

సంస్కృతభాష గొప్పదని 

ప్రొబోధించాలి


లోకాః సమస్తాః సుఖినోభవంతు అని కోరుకున్న సంస్కృతభాషను జాతీయభాషగా ప్రకటించుకోవాలి 


సమ్భాషణ సంస్కృతమ్ ను

వేదవేదాంగాలను భగవద్గీతను శ్లోకాలను మంత్రాలను సూత్రాలను స్తోత్రాలను దండకాలను 


అందరూ అనివార్యంగా నేర్పించే 


విద్యా వ్యవస్థకు శ్రీకారం శ్రీగణేశం ఓంకారం చేద్దాం 


రండి 


హైందవసంస్కృతి నేషనల్ పార్టీ ని స్థాపిద్దాం 


లోకాః సమస్తాః సుఖినోభవంతు అని విశ్వశాంతిని కోరుకున్న సంస్కృతభాషను జాతీయభాషగా ప్రకటించుకుందాం 


సంస్కృతభాషా 

అక్షరాలను

పదాలను 

వాక్యాలను 

వేదాలను 

వేదాంగాలను 

నిఘంటువులను

దండకాలను

గద్యాలను

ఖాద్యాలను 

భోజ్యాలను 

సంగీతాలను 

సప్తస్వరాలను 

స్తోత్రాలను 

అలంకారగ్రంథాలను 

సమ్భాషణ సంస్కృతమ్ ను 


ప్రపంచమానవులందరికి నేర్పిద్దాం 


హైందవ సంస్కృతి గొప్పతనమును 


తెలియజేద్దాం 


హైందవసంస్కృతి జాతీయదలం 


హైందవసంస్కృతి నేషనల్ పార్టీ లో 


సభ్యులు కావాలనుకునే సంప్రదించగలరు 


9849641892


స్వామీజీలు ప్రభుత్వాలు మేలు కోవాలి 


కులాల పేర్లతో అంతరించిపోతున్న 


హైందవ సంస్కృతికి మూలమైన


వేద వేదాంగ సంస్కృతభాష సాహిత్యమును 


కాపాడుకోవాలి 


హైందవసంస్కృతి నేషనల్ పార్టీ కి సపోర్ట్ చెయ్యండి

శతరుద్రీయము-48*

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.              *శతరుద్రీయము-48*

(వ్యాఖ్య: శ్రీ తురుమెళ్ళ మాధవ కుమార్)

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

*చతుర్థానువాకము - 2 వ యజుస్సు*


*నమకనామాని : ఓం స్తేనానాంపతయే  నమః*



*నమ ఉగణాభాయస్తృగ్ం హతీభ్యశ్చవో నమః!*


ఓ రుద్రులారా! ఉత్కృష్ట గణరూపములుగల సప్తమాతృకల యందున్న మీకు నమస్కారము, హింసించుటకు సమర్థులయిన ఉగ్రదేవతా మూర్తులగు మీకు నమస్కారము♪.


*వివరణ:*

బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా అను ఈ అమ్మవార్లు సప్తమాతృకలు♪. 


వీరి రూపములోనున్నది రుద్రుడే.  

ఇఱువది యేడు రథములు, 

ఇఱువదియేడు ఏనుగులు, 

ఎనభై ఒక్క గుఱ్ఱములు, 

నూటముప్పది యైదుగురు కాలిబంట్లు 

కలిగిన సేనా సమూహాన్ని *గణము* అంటారు. 


ఇటువంటి గణములు అనేకములు గలిగిన దేవతలు కాబట్టి *ఉగణములు* అన్నారు.


(రేపు.... చతుర్థానువాకం 3 వ యజుస్సు)


                                                                    *సశేషం.....*

        ❀┉┅━❀🛕❀┉┅━❀


*సేకరణ:* శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *నాలుగవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*

. *శ్లోకము 04-05*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అర్జున ఉవాచ ।*

*అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః ।*

*కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి ।। 4 ।।*


*భావము:* 

అర్జునుడు ఇలా అన్నాడు : నీవు వివస్వనుడి తరువాత ఏంతో కాలానికి పుట్టావు. మరి నీవు ఈ విద్యని అతనికి ప్రారంభంలోనే ఉపదేశించావు, అంటే నేను దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?


. 🍂🍃🍂🍃


*శ్రీ భగవానువాచ ।*

*బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున ।*

*తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప ।। 5 ।।*


*భావము:* 

శ్రీ భగవానుడు ఇలా అన్నాడు: మన ఇద్దరికీ ఎన్నో జన్మలు గడచినవి. ఓ అర్జునా, నీవు వాటిని మరిచిపోయావు, కానీ, అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి, ఓ పరంతపా.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

_ఏప్రిల్ 30, 2024_*

 ॐశుభోదయం, పంచాంగం ॐ 

 *ఓం శ్రీ గురుభ్యోనమః* 

    *_ఏప్రిల్ 30, 2024_* 

*శ్రీ క్రోధి నామ సంవత్సరం*

*ఉత్తరాయణం*

*వసంత ఋతువు*

*చైత్ర మాసం*

*కృష్ణ పక్షం*

తిథి: *సప్తమి* రా2.49

వారం: *భౌమవాసరే*

(మంగళవారం)

నక్షత్రం: *ఉత్తరాషాఢ* రా1.36

యోగం: *సాధ్యం* రా8.14

కరణం: *విష్ఠి* మ3.36

*బవ* రా2.49

వర్జ్యం: *రా10.07-11.40*

మర్నాడు *తె.5.25నుండి*

దుర్ముహూర్తము: *ఉ8.09-9.00*

*రా10.47-11.33*

అమృతకాలం: *రా7.25-8.57*

రాహుకాలం: *మ3.00-4.30*

యమగండం: *ఉ9.00-10.30*

సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *ధనుస్సు*

సూర్యోదయం: *5.39*

సూర్యాస్తమయం: *6.14*

లోకాః సమస్తాః*

 *సుఖినోభవంతు*

వేద ఆశీర్వచనం.

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

                🌷🌷🌷

*కలియుగాబ్ది 5125* *శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం -‌ షష్ఠి - ఉత్తరాషాఢ -‌‌ భౌమ వాసరే* *30.04.2024.* 


ప్రముఖ వేదపండితులు,  

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.




🙏🙏

భజగోవిందం

 💎🌅 *_-|¦¦| శుభోదయమ్ |¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 *ఏతస్మాత్కారణాత్ప్రజ్ఞాం మృగయంతే పృథగ్విధామ్౹*

          *ప్రజ్ఞాలాభో హి భూతానామ్ ఉత్తమః ప్రతిభాతి మే॥* 


                      *-మహాభారతం-*


భావం:- శ్రేయస్సును కోరుకునేవారు చాలా విషయాల్లో ప్రజ్ఞలను సంపాదించాలని నిరంతరం ప్రయత్నిస్తారు. అన్నిటికంటె *ప్రజ్ఞా లాభమే ఉత్తమ ఫలాన్ని ఇచ్చి అభివృద్ధిని - ఆనందాన్ని అందిస్తుంది*....

      

  👇 //---------- ( *భజగోవిందం* )---------// 👇


శ్లో𝕝𝕝 *యావత్పవనో నివసతి దేహే | తావత్పృచ్చతి కుశలం గేహే*

  *గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్కాయే* ||6||


భావం: *ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు*. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ చూసి భార్య కూడా భయపడుతుంది.

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-04-2024 / మంగళవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


సోదరులతో దీర్ఘకాలికంగా వివాదాలు పరిష్కారమవుతాయి.  ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి  ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి.  వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

---------------------------------------

మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ  తప్పదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ  ఫలితాలు అందుతాయి.

---------------------------------------

కర్కాటకం


చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో  మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల  ప్రయత్నలోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి.  ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------

సింహం


చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో   చర్చలు చేస్తారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో  నష్టాలు  భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో  సమస్యల నుండి బయట పడతారు.

---------------------------------------

కన్య


కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. రావలసిన ధనం చేతికందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------

తుల


కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. ఋణదాతల  ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------

వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన  బాధ్యతలు నిర్వహించడంలో  విఫలమౌతారు. చేపట్టిన  పనులు నిదానంగా  సాగుతాయి. ఆస్తి  వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.

---------------------------------------

ధనస్సు


సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక  సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు  అందుతాయి.  మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా  సమస్యల నుండి బయట పడతారు.

---------------------------------------

మకరం


వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక  ధనవ్యయ సూచనలున్నవి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

కుంభం


ఇంట బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. వృత్తి వ్యాపారమున వ్యవహార  అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగమున  అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------

మీనం


వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. సన్నిహితుల నుండి ఒక ముఖ్యమైన వ్యవహారంలో కీలక  సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

పోతన అక్షర చిత్రం!



: పోతన అక్షర చిత్రం!

శ్రీమన్నారాయణుని వైభవం!

   

       ఆంధ్రవాఙ్మయప్రపంచంలో విచిత్రాలేన్నో? అందులో ఇదియొకటి.

సహజ పాండిత్యమండితుడైన పోతన

మహాకవి భాగవతానువాదమున చిత్రించిన శబ్దచిత్రాలెన్నో? అవిగాక ఇదియొకటి.

          శ్రీమన్నారాయణుని మహిమాభిరామమైన విశ్వరూపసందర్శనా చిత్రమును ప్రదర్శంచినాడు.నారాయణ శతకమున సూక్ష్మముగాపరిశీలించిన నిది శ్రీమన్మారాయణసూక్త ప్రదర్శనమే!!

సకలభువన సమన్విత చరాచర ప్రకృతి 

యంతయు నతనిసామ్రాజ్యమే!గదా!

పరికింపుడు.


"ధరసింహాసనమై,నభంబుగొడుగై,తద్దేవతల్ భృత్యులై/

పరమామ్నాయములెల్ల వందిగణమై, బ్రహ్మాండమాకారమై/

సిరిభార్యామణియై, విరించికొడుకై,శ్రీగంగ సత్పుత్రియై/

వరుసన్నీఘనరాజసంబుదెలుపన్ వర్ధిల్లు నారాయణా!"

--నారాయణశతకం:బమ్మెఱపోతన;


     అత్యద్భుతమైన యీపద్యం శ్రీ మన్నారాయణుని యనంత వైభవానికి అద్దంపడుతోంది.

         చక్రవర్తిత్వసూచకంగా సింహాసనం, ఛత్రం. మహారాణి ,పరివారం, వందిమాగధులు,

భృత్యకోటి, మొదలైనవి రాజలాంఛనాలు. అవన్నీ ఈచిత్రంలో నారాయణునకు పొందుపరిచాడు కవి.

ఇగో ఇలాగ,


        "సర్వభూతధాత్రి ధరిత్రి సింహాసనము, నిర్గుణపరబ్రహ్మ స్వరూపమైన ఆకాశము ఛత్రము. ,  దేవతలందరూ సేవకులుకాగా, విరించి ముఖోధ్భూతములగుచున్న వేదములే వందిగణములు(పొగడువారు)కాగా, చరాచర ప్రపంచమంతయూ స్వరూపమైయొప్పారగా , సకలసంపదలకాణాచి శ్రీలక్ష్మి మహారాణియైసహపీఠమునలంకరింప సకలజీవులసృష్టికికారకుడగు విధాత పుత్రుడై విలసిల్లగా,  పరమపునీత గంగ సత్పుత్రియై , యాతని ఘనమైన వైభవమును వెల్లడించుచుంగా  శ్రీమన్నారాయణుడున్నాడట!. ఆహా ఏమావైభవము!!


              మహనీయమైన ఇట్టిచిత్రరాజమును చిత్రింపగలవారెవ్వరు?ఆఘనత పోతనకేదక్కినది.మిత్రులారా! మనలోచనములతోగాక ,ఆలోచనాలోచనాలతో నాలోకింపుడు.కవియూహకు అబ్బురపాటుకలుగకమానదు.అదే రసానందము.అదే రసౌవైసః అన్నవేదసిధ్ధాంతరహస్యము.

                                  స్వస్తి!


పోతనగారి పద్యంలోని పోతనగారి  విశ్వరూపసందర్శనను అత్యద్భుతమైన రీతిలో వర్ణించారు శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారు.   🙏🙏🙏🙏

🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷