8, ఏప్రిల్ 2022, శుక్రవారం

భార్యాభర్తల పరస్పర ప్రవర్తన

 🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺భార్యాభర్తల పరస్పర ప్రవర్తన ఎలా ఉండాలి?

సమాధానం:-భర్త, భార్య గురించి -"ఈమె తన తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు మొదలైన వారిని అందరినీ, విడిచిపెట్టి,నా దగ్గరకు వచ్చిందంటే ఎంత గొప్ప త్యాగం చేసింది? కనుక ఈమెకు ఏవిధమైన కష్టం కలగకుండా చూసుకోవాలి.జీవనం నిమిత్తం తిండి,బట్ట, ఇల్లు మొదలైన వాటికి లోటుండకూడదు.నాకంటే ఈమెకు ఎక్కువ సుఖం లభించాలి".అని భావిస్తూ ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం విషయం కూడా ద్రుష్టి లో ఉంచుకోవాలి.అలాగే ఆమె గౌరవం నకు భంగం కలగకుండా చూసుకోవాలి.దానివలన‌ఆమె హద్దులు మీరకపోవడం శ్రేయస్సు పొందటం జరుగుతుంది.

          అలాగే భార్యకు ఎటువంటి భావం ఉండాలంటే -"నేను నా గోత్రం కుటుంబం మొదలైనవి త్యజించి వీరింటికి వచ్చానంటే సముద్రం దాటి ఇప్పుడు ఒడ్డు కు చేరుకుని మునిగిపోకూడదు.అంటే నేను ఇంతటి త్యాగం చేసి వచ్చాక ఇప్పుడు నా వలన వీరికి దుఃఖము కలుగకూడదు.వీరికి నా వలన అవమానం గానీ,నిందగానీ,తిరస్కారం గానీ,జరుగకూడదు.నావలన వీరికి నింద మొదలైనవి జరిగితే అది చాలా అనుచితమైన విషయం అవుతుంది.నేనెంత‌ కష్టమైనా అనుభవింతునుగాక, కానీ వీరికి మాత్రం కించిత్తు అయినా కష్టం కలుగరాదు."అంటూ ఆమె తన సుఖసంతోషాలు త్యాగం చేసి పతి యొక్క సుఖసంతోషాలు ద్రుష్టిలో ఉంచుకుని ఆయన యొక్క ఇహపర శ్రేయస్సు కోరుకోవాలి.🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత

 శ్రీ ఆదిశంకరాచార్య విరచిత


*శ్రీ రామ భుజంగ ప్రయాత స్తోత్రం*


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹



విశుద్ధం పరం సచ్చిదానందరూపం గుణాధారమాధారహీనం వరేణ్యమ్ | 

మహన్తం విభాన్తం గుహస్తం గుణాన్తం 

సుఖాన్తం స్వయం ధామ రామం ప్రపద్యే || ౧


శివం నిత్యమేకం విభుం తారకాఖ్యం సుఖాకారమాకారశూన్యం సుమాన్యమ్ | 

మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే || ౨ ||


యదావర్ణయత్కర్జమూలే న్తకాలే

శివో రామ రామేతి రామేతి కాశ్యామ్ | 

తదేకం పరం తారకబ్రహ్మ రూపం

భజే హం భజేహం భజేహం

భజేహమ్ || ౩ ||


మహారత్నపీఠే శుభే కల్పమూలే

సుఖాసీనమాదిత్యకోటిప్రకాశమ్ |

సదా జానకీలక్ష్మణోపేతమేకం 

సదా రామచంద్రం భజే హం భజే హమ్ ||౪ ||


క్వణద్రత్నమంజీరపాదారవిందం లసన్మేఖలాచారుపీతాంబరాఢ్యమ్ | 

మహారత్నహారోల్లసత్కౌస్తుభాంగం నదచ్చంచరీమంజరీలోలమాలమ్ || ౫ ||


లసచ్చంద్రికాస్మేరశోణాధరాభం

సముద్యత్పతంగేందుకోటిప్రకాశమ్ |

నమద్బ్రహ్మరుద్రాదికోటీరరత్న

స్ఫురత్కాన్తినీరాజనారాధితాంఘ్రమ్ ||


పురఃప్రాంజలీనాంజనేయాదిభక్తాన్ స్వచిన్ముద్రయా భద్రయా బోధయన్తమ్ |

భజేహం భజేహం సదా రామచంద్రం

త్వదన్యం న మన్యే న మన్యే న మన్యే || ౭ ||


యదా మత్సమీపం కృతాన్తః సమేత్య ప్రచండప్రకోపైర్భటైర్భీషయేన్మామ్ | 

తదావిష్కరోషి త్వదీయం స్వరూపం సదాపత్ప్రణాశం సకోదండబాణమ్ ॥ ౮॥


నిజే మానసే మందిరే సన్నిధేహి ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర | ససౌమిత్రిణా కైకయీనందనేన స్వశక్త్యానుభక్త్యా చ సంసేవ్యమాన || ౯ ||


స్వభక్తాగ్రగణ్యః కపీశైర్మహీశై 

నీకైరనేకైశ్చ రామ ప్రసీద |

నమస్తే నమోస్త్వీశ రామ ప్రసీద ప్రశాధి ప్రశాధి ప్రకాశం ప్రభో మామ్ || ౧౦


త్వమేవాసి దైవం పరం మే యదేకం

సుచైతన్యమేతత్త్వదన్యం న మన్యే | 

యతో భూదమేయం వియద్వాయుతేజో జలోర్వ్యాదికార్యం చరం చాచరం చ || ౧౦ ||


నమః సచ్చిదానందరూపాయ తస్మై

నమో దేవదేవాయ రామాయ తుభ్యమ్ |

నమో జానకీజీవితేశాయ తుభ్యం

నమః పుండరీకాయతాక్షాయ తుభ్యమ్ || ౧౨



నమో భక్తియుక్తానురక్తాయ తుభ్యం నమః పుణ్యపుంజైకలభ్యాయ తుభ్యమ్ | 

నమో వేదవేద్యాయ చాద్యాయ పుంసే 

నమః సుందరాయేందిరావల్లభాయ || ౧౩ ||



నమో విశ్వకర్తే నమో విశ్వహర్తే

నమో విశ్వభోక్తే నమో విశ్వమాత్రే |

నమో విశ్వనేత్రే నమో విశ్వజేత్రే నమో విశ్వపిత్రే నమో విశ్వమాత్రే || ౧౪ ||


నమస్తే నమస్తే సమస్తప్రపంచ

ప్రభోగప్రయోగ ప్రమాణప్రవీణ |

మదీయం మనస్త్వత్పదద్వంద్వసేవాం

విధాతుం ప్రవృత్తం సుచైతన్యసిద్ధ్యే || ౧౫


శిలాపి త్వదంఘ్రిక్షమాసంగిరేణు ప్రసాదాద్ధి చైతన్యమాధత్త రామ | నరస్త్వత్పదద్వంద్వసేవావిధానా 

త్సుచైతన్యమేతీతి కిం చిత్రమత్ర || ౧౬ ||


పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరా యే స్మరన్త్యన్వహం రామచంద్ర |

భవన్తం భవాన్తం భరన్తం  

భజన్తో లభర్తే కృతాన్తం న పశ్యన్త్యతోనే || ౧౭ ||


స పుణ్యః స గణ్యః శరణ్యో మమాయం

నరో వేద యో దేవచూడామణిం త్వామ్ |

సదాకారమేకం చిదానందరూపం మనోవాగగమ్యం పరం ధామ రామం || ౧౮ ||


ప్రచండప్రతాపప్రభావాభిభూత

ప్రభూతారివీర ప్రభో రామచంద్ర |

బలం తే కథం వర్ణ్యతేతీవ బాల్యే యతో ఖండి చండీశ కోదండదండమ్ || ౧౯


దశగ్రీవముగ్రం సపుత్రం సమిత్రం సరిద్దుర్గమధ్యస్థరక్షోగణేశమ్ | భవన్తం వినా రామ వీరో నరో వా సురో వామరో వా జయేత్కస్త్రిలోక్యామ్ || ౨౦ ||


సదా రామ రామేతి రామామృతం తే సదారామమానందనిష్యందకందమ్ | 

పిబన్తం నమన్తం సుదన్తం హసన్తం

హనూమన్తమన్తర్భజే తం నితాన్తమ్ || ౨౧ ||


సదా రామ రామేతి రామామృతం తే సదారామమానందనిష్యందకందమ్ |

పిబన్నన్వహం నన్వహం నైవ మృత్యో 

ర్బిభేమి ప్రసాదాదసాదాత్తవైవ || ౨౨ ||


అసీతాసమేతైరకోదండభూషై

రసౌమిత్రివంద్యై రచండప్రతాపైః | అలంకేశకాలైరసుగ్రీవమిత్రై

రరామాభిధేయైరలం దైవతైర్నః || ౨౩ ||


అవీరాసన స్థైరచిన్ముద్రికాధ్యై

రభక్తాంజనేయాదితత్త్వప్రకాశైః 

అమందారమూలైరమందారమాలై

రామాభిధేయైరలం దైవతైర్నః || ౨౪ 



అసింధుప్రకోపైరవంద్యప్రతాపై

రబంధుప్రయాణైరమందస్మిత్యాః |

అదండప్రవాసైరఖండప్రబోధై

రరామాభిధేయైరలం దైవతైరః || ౨౫ ||


హరే రామ సీతాపతే రావణారే

ఖరారే మురారే సురారే పఠేతి |

లపన్తం నయనం సదాకాలమేవం

సమాలోకయాలోకయాశేషబంధో || ౨౬ ||



లపన్తం నయన్తం సదాకాలమేవం

సమాలోకయాలోకయాశేషబంధో ||


నమస్తే సుమిత్రాసుపుత్రాభివంద్య

నమస్తే సదా కైకయీనందనేడ్య |

నమస్తే సదా వానరాధీశవంద్య

నమస్తే నమస్తే సదా రామచంద్ర || ౨౭ ||


ప్రసీద ప్రసీద ప్రచండప్రతాప

ప్రసీద ప్రసీద ప్రచండారికాల |

ప్రసీద ప్రసీద ప్రపన్నానుకంపిన్ ప్రసీద ప్రసీద ప్రభో రామచంద్ర || ౨౮ ||


భుజంగప్రయాతం పరం వేదసారం ముదా రామచంద్రస్య భక్త్యా చ నిత్యమ్ | పఠన్సన్తతం చిన్తయన్స్వాన్తరంగే స ఏవ స్వయం రామచంద్రః స ధన్యః || ౨౯


ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ రామ భుజంగప్రయాత స్తోత్రమ్ |


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

లేకపోతే జబ్బులు.

 *👉 మన శరీరం లోకి వెళ్లిన ఆహారం 24 గంటల్లో... మలినంగా బయటికి  వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.* 


 *👉 మన శరీరం లోకి వెళ్ళిన నీరు 4 గంటల్లో…  బయటికి వెళ్లిపోవాలి, లేకపోతే  జబ్బులు.* 


 *👉 మన శరీరంలోకి వెళ్లిన గాలి ఒక నిముషంలోగా… బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనం రోగగ్రస్థులం అవుతాం* .


 *👉 మరి మనలోకి చేరిన* *కోపం, అసూయ, ద్వేషం, మోసం...* *ఇలాంటివన్నీ సంవత్సరాలుగా మనలోనే ఉంటే... ఏమౌతుందో తెలుసా...  మనం నిత్య రోగగ్రస్తులుగా అవుతాం.* 


 *👉 అందుకే ఋషులు అంటారు...* *"మనం రోజూ జీవిస్తున్నాం అని అనుకుంటున్న మూర్ఖులం... నిజానికి మనం రోజూ కొద్దీ కొద్దీగా మరణిస్తున్నాం."*  


 *👉 మనకు వయసు పెరిగితే...* *ఆయుష్షు తగ్గినట్టా? పెరిగినట్టా?... మనం ప్రతి రోజూ... నెగెటివ్ ఎనర్జీ లతో కొద్ది కొద్దిగా మరణిస్తున్నామన్న చేదు నిజాన్ని త్వరగా గ్రహించాలి.* 


 *👉 మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని...  మన జీవితాల్ని మృతప్రాయం చేస్తున్న...* *కోపాన్ని, ఒత్తిడిని, ద్వేషాన్ని, బద్ధకాన్ని, అనారోగ్యాన్ని…  ప్రతి రోజూ ధ్యానం, యోగ చెయ్యడం  ద్వారా ప్రాణ శక్తిని ఎక్కువగా పొంది నెగెటివ్ ఎనర్జీ దూరం చెయ్యాలి.*  


👉 *మన శరీరంలోకి అధిక మొత్తంలో ప్రాణ శక్తిని చేర్చే ఏకైక మార్గం  ధ్యానం, యోగాయే...* 


 *👉 అందుకే భారతీయ ఋషులు ధ్యానం, యోగ మార్గాన్నే అనుసరించారు.* 


👉 కావున *రోజూ కనీసం అర గంట..... యోగా, ప్రాణాయామం, ధ్యానం,   చెయ్యండి...ఆయురారోగ్యాలతో   జీవించండి...*


శుభోదయం

తల్లిదండ్రులు

 🍂🍂🍂🍂🍂🍂🍂🍂🍂 తల్లిదండ్రులు, కొడుకులు, కూతుళ్ళు పరస్పరం ఎలా (ఒకరియెడల‌ మరొకరు) ప్రవర్తించాలి?

సమాధానం:-తల్లిదండ్రులు,_"ఈ కొడుకులు, కూతుళ్ళు,మన ఇంట పుట్టారు.కనుక మనం వీరి ఐహిక పారలౌకిక  క్చేమం ‌చూడాలి.మనం కేవలం సుఖశాంతులు చూచుకోవటం కాదు, వీరిని బాగుచేయడం ఎలా?అనే భావంతో‌ సంతానం మీద అధికారం చేయాలి, వాళ్ళని క్రమశిక్షణ లో పెట్టాలి.వాళ్ళకి 

మంచి విద్య నేర్పించాలి.అవసరార్ధం దండింఛ వలసి‌ వచ్చిన అది వారి మేలు కోసమే చెయ్యాలి.

సంతానం మేమనుకోవాలి?

అంటే ఈ శరీరం ద్వారా మనం పరమాత్ముని పొందగలం.ఈ శరీరం, మనకి తల్లిదండ్రులు వలన లభించింది.కనుక మనవలన వారికి ఎన్నడూ దుఃఖము కలుగరాదు.మనవలన‌,

వీరికి అపకీర్తి రాకుండా ఉండాలి.మన ప్రవర్తన వీరికి లోకంలో గౌరవసత్కారాలు పెంచేదిగా ఉండాలి.మనం చేసే

తీర్థ,సేవన,వ్రతాది శుభకార్యాలు ఏ‌‌ కొద్దివి అయినా వాటి వలన కలిగే పుణ్యఫలం తల్లిదండ్రులు కే లభించాలి.ఇటువంటి భావనవలన ఒకరిమీద ఒకరికి ప్రేమ పెరుగుతుంది.వర్తమానంలో కుటుంబం సుఖపడుతుంది.

భవిష్యత్తులో అందరికీ శ్రేయస్సు కలుగుతుంది.🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

*శ్రీ విష్ణు సహస్రనామ విశ్లేసణ

 *శ్రీ విష్ణు సహస్రనామ విశ్లేసణ.* >>>>>>>>>>>>>>ॐ<<<<<<<<<<<<<<<<<<                                                        *ఓం శ్రీ పరమాత్మనే నమః.*

*శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము హరిః ఓమ్*

ఈ స్తవరాజము *'ఓమ్'* అనుప్రణ వ పవిత్రాక్షరముతో ప్రారంభము అ గుచున్నది. ఓంకారము మంగళప్రద ము, పవిత్రము అగుటచేత ఆరంభ మునను,అంతమునను. ఈదివ్యమం త్రము గానము చేయ బడును ఇది ప్రణవమని పిలువబ డును.*'ఓమ్'.* అను మంత్రముతో భగవానుని ఉపాసించువాడు ముక్తి నిపొందుననిప్రశ్నోపనిషత్తుతెలుపు తున్నది. *"ఓమిత్యేకాక్షరంబ్రహా ఓమితిఇదగ్ం సర్వం”* అని మాం డుక్యోపనిషత్తు గానము చేయును. *“ఓం తద్బహ్మా ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓ తత్సర్వం ఓం తత్సర్వం”* అనినారాయణోపనిష త్తు గానము చేయుచున్నది. *“ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహ రన్ మా మనుస్మరన్ యః ప్రయా తి త్యజన్ దేహం స యాతి పర మాగతిమ్”* - ఎవ్వడుఓంకారము ను ఉచ్చరించుచు దేహత్యాగము చేయునో వాడుపరమగతినిపొందు ను - అను గీతావాక్యము స్మరణీయ ము (గీత : 8-11)


*“ప్రణవః సర్వ వేదేషు”* - సర్వవే ద సారము ప్రణవమైయున్నది. (గీత :7-8) *“గిరా మస్మ్యేక మక్ష రం”* - వాక్కులయందు నేను ఓం కారమునైయున్నాను (గీత:10-25)

1వశ్లోకము - 1 వపేజీ శ్రీ విష్ణు సహ స్రనామ స్తోత్రము - వివరణ *“ఓం అథ”* అను ఈ రెండు శబ్దములు ను సృష్టి ప్రారంభమునబ్రహ్మదేవుని కంఠము నుండిఆవిర్భవించినమంగ ళ శబ్దములని శృతి గానముచేయు ను.                                          కావునమంగళప్రదమగు.ఓంకారపు ణ్య శబ్దముతో మంగళప్రదమగుఈ స్తవరాజము ప్రారంభమగుచున్నది. *"తస్య వాచకః ప్రణవః”* - భగ వానుని నామము ప్రణవమనిపతం జలి మహర్షి తెలిపియున్నాడు. *'ఓం'* అనునది భగవానుని నామ ముగా గీతా శాస్త్రమున (17-23) తెలుపబడియున్నది.                  *“ఓం” అని పిలిచినచో “ఓ”* య ని భగవానుడు పలుకునని భక్తుల యొక్క విశ్వాసము.                 కావున *'ఓమ్'* అను దివ్యనామ ముతో ఈ స్తవరాజము మంగళకర ముగా ప్రారంభమగు చున్నది.

                                                              *ఓంనమోభగవతేవాసుదేవాయ.                             ఓం శ్రీ విష్ణురూపాయ నమశ్శివా యనమః.                                                ఓంనమోనారాయణాయవిశ్వస్మైనమః.    (మానవసేవయేమాధవసేవ.)             .      సర్వేషాంశాన్తిర్భవతు.*                       .                                                                      *ఇంద్రగంటి శంకర ప్రసాద శర్మ.                               సింగరేణి సూపర్ బజారు వెనుక.         కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తెలంగాణారాష్ఠ్రం.*

వైద్యులకు శరదృతువు తల్లివంటిది

 శ్లోకం:☝️

*వైద్యానాం శారదీ మాతా*

    *పితాచ కుసుమాకరః l*

*యమదంష్ట్రా స్వసా ప్రోక్తా*

    *హితభుక్ మిత భుక్ రిపుః ll*


భావం: వైద్యులకు శరదృతువు తల్లివంటిది మరియు వసంతకాలం తండ్రివంటిది. ఈ రెండు కాలాలలో చాలామంది అస్వస్థతకు గురైయ్యే అవకాశం ఉన్నందున వైద్యులకు చేతినిండా పని ఉంటుందిట. అందువల్ల ఈ రెండు ఋతువులు మృత్యుదేవత అయిన యమధర్మరాజు యొక్క రెండు దంతాలుగా భావించవలసి యుంటుంది. దీనికి ఒకే ఒక పరిష్కారం హితాహారం మితాహారం తినడం.

రాజు *జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా*

 *పోలాండ్లో* ఈ *భారత రాజును* దూషిస్తే మరణశిక్ష , కానీ భారతీయులకు ఆయనెవరో కూడా తెలియకుండా చేసిన గొప్ప విద్యా విధానం మనది!


*పోలాండ్* కు *భారతదేశం* పై అంత మమకారం ఎందుకు? ఏ రకంగా వారిని మనం కాపాడాము?? ఇజ్రాయిల్ లాగానే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చే పోలాండ్ వాసుల ఒకప్పటి ధయనీయమైన కధ??? 


పోలాండ్‌పై *హిట్లర్* రెండో ప్రపంచయుద్ధం ప్రారంభించినప్పుడు, ఆ సమయంలో *పోలెండ్* సైనికులు తమ దేశానికి చెందిన 500 మంది మహిళలను, దాదాపు 200 మంది పిల్లలను సముద్రంలో ఒక ఓడలో వదిలి, ఏ దేశానికి ఆశ్రయం లభిస్తుందో అక్కడికి తీసుకెళ్లమని కెప్టెన్‌కి చెప్పారు, ప్రాణం ఉంటే... బతికితే మళ్లీ కలుద్దాం!

 500 మంది శరణార్థులు పోలాండ్ మహిళలు, 200 మంది చిన్నారులతో నిండిన ఆ ఓడ ఇరాన్‌లోని ఓడరేవుకు   చేరుకుంది,ఆ దేశస్తులు ఎవరికీ ఆశ్రయం ఇవ్వలేదు, 


మళ్లీ అలా వెల్తూ వెల్తూ  అదాన్‌లో ఆగారు కానీ అక్కడ కూడా ఉండడానికి వారికి అనుమతి లభించలేదు.. చివరికి, సముద్రంలో తిరుగుతున్న ఒక ఓడ మన దేశానికి వచ్చింది.

అది గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ఒడ్డున....

 అప్పటి జామ్‌నగర్ రాజు *"#జామ్_సాహబ్_దిగ్విజయ్_సింగ్"* తన రాజభవనాన్ని 500 మంది స్త్రీలు మరియు 200 మంది పిల్లలకు బస ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆ పిల్లలను తన రాష్ట్రంలోని *బాలచాడి* లోని  

సైనిక్ పాఠశాలలో చదివించే ఏర్పాటు చేశాడు.  ఈ శరణార్థులు తొమ్మిదేళ్లు జామ్‌నగర్‌లో నివసించారు.


అదే శరణార్థి పిల్లల్లో ఒకరు తరువాత 

*పోలాండ్ ప్రధాని* అయ్యారు.... 

నేటికీ ప్రతి సంవత్సరం ఆ శరణార్థుల వారసులు జామ్‌నగర్‌కు వచ్చి తమ పూర్వీకులను స్మరించుకుంటున్నారు.

పోలాండ్ రాజధాని వార్సాలోని అనేక రహదారులకు *"మహారాజా జామ్ సాహబ్"* పేరు పెట్టారు, పోలాండ్‌లో ఆయన పేరు మీద అనేక ప్రణాళికలు అమలు చేయబడ్డాయి.  ప్రతి సంవత్సరం పోలాండ్ వార్తాపత్రికలలో *"మహారాజా జామ్ సాహబ్ దిగ్విజయ్ సింగ్"* గారి గురించి కథనం ప్రచురించబడుతుంది.  ప్రాచీన కాలం నుండి భారతదేశం ప్రపంచానికి *వసుధైక కుటుంబం* మరియు *సహనం* అనే పాఠాన్ని బోధిస్తోంది, మరియు నేటి కొత్త నాయకులు, కుండ జర్నలిస్టులు, మలచా మొదలైనవారు భారతదేశ సహనాన్ని ప్రశ్నిస్తున్నారా?


 రాజు *జామ్ దిగ్విజయ్ సింగ్ జడేజా*  వారి పరిస్థితిని చూసి ఆశ్రయం ఇచ్చారు. ఆశ్రయం ఇవ్వడమే కాకుండా, వారి పిల్లలకు సైనిక శిక్షణ ఇచ్చి, వారికి యుద్దవిద్యలు  నేర్పించారు, తరువాత ఆయుధాలు ఇచ్చి పోలాండ్‌కు పంపారు, అక్కడ వారు జామ్‌నగర్ నుండి నేర్చుకున్న సైనిక శిక్షణతో దేశాన్ని పునరుద్ధరించారు.


 నేటికీ పోలాండ్ ప్రజలు వారిని ఆహార ప్రదాతలుగా పరిగణిస్తున్నారు.  *పోలాండ్* రాజ్యాంగం ప్రకారం, *జామ్ దిగ్విజయ్ సింగ్* గారు వారికి దేవుడు లాంటివాడు.  అందుకే నేటికీ వారిని సాక్షులుగా పరిగణిస్తూ నేతలు పార్లమెంట్‌లో ప్రమాణం చేస్తారు.


 భారతదేశంలో *దిగ్విజయ్ సింగ్* గారిని అవమానిస్తే, ఇక్కడ లా అండ్ ఆర్డర్‌లో శిక్షించే నిబంధన లేదు.  కానీ అదే తప్పు పోలెండ్ లో చేస్తే  ఫిరంగికి కట్టేసి పేల్చేస్తారు.


 ఈ పోలాండ్ ప్రజలు *"జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్ జడేజా"* పేరుతో ఎందుకు ప్రమాణం చేస్తున్నారో తెలుసా?


 ఉక్రెయిన్ నుండి వచ్చే భారత ప్రజలను వీసా లేకుండా తమ దేశంలోకి ప్రవేశించడానికి పోలాండ్ ఎందుకు అనుమతిస్తుందో తెలుసా?


 జామ్ సాహిబ్ చేసిన ఆ పనిని పోలాండ్ నేటికీ మరచిపోలేదు.  కాబట్టి ఈ రోజు భారతదేశం వీసా లేకుండా వచ్చేవారిని అనుమతిస్తోంది.  వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తున్నారు.


 భారతదేశ చరిత్ర పుస్తకాలలో దిగ్వాజ్ సింగ్ గురించి ఎప్పుడైనా బోధించారా?  పోలాండ్ పౌరుడు ఒక భారతీయుడిని, "మీకు *"జామ్‌నగర్ మహారాజా దిగ్విజయ్ సింగ్"* తెలుసా?" అని అడిగితే, ఉక్రెయిన్‌లో డాక్టర్ చదవడానికి వెళ్లిన భారతీయ విద్యార్థుల్లో  యాక్షన్ అనేదే లేదు... 


లేదు,మనల్ని దాని స్వంత మూలాల నుండి దూరం చేసిన అటువంటి విద్యా వ్యవస్థకు సిగ్గుపడదాము ☺️

రాముడిని వదిలేసినా,

 రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగిపోక తప్పదు.


శ్రీరాముడు ల౦క కు వెళ్ళటానికి రామసేతువు నిర్మాణ౦ జరుగుతో౦ది. 


వానరులు సముద్ర౦లో రాళ్లు వేస్తున్నారు. అవి తేలుతున్నాయి. ఇద౦తా చూస్తూ...,

శ్రీరాముడు కూడా కొన్ని రాళ్లు వేద్దామని సముద్ర౦లో రాయిని వదిలాడు. 


విచిత్ర౦గా ఆ రాయి మునిగి పోయి౦ది. సరే అని మరొకటి వేశాడు. అది కూడా మునిగి పోయి౦ది. 

ఇదే౦టి! వానరులు వేస్తే తేలుతున్నాయి. నేను వేస్తే మునిగి పోతున్నాయి. అయినా చూద్దా౦ అని మరో రాయి విడిచాడు. అది కూడా మునిగి పోయి౦దట. 


ఇదే౦టని శ్రీరాముడు హనుమను మరి కొ౦దరిని అడిగాడు. 

*స్వామి!* 


*మేము వేసే రాళ్ళ మీద మీ నామ౦ రాస్తున్నా౦. మీరు రాయలేదు కదా* అన్నారు. 


అదే౦టి. 


నేను స్వయ౦గా వేస్తున్నాను కదా...నా నామ౦ రాస్తేనే తేలితే నేను వేస్తే మునిగి పోవట౦ ఏమిటీ?  ఎ౦దుకలా?* అన్నారు స్వామి. 


అందుకు హనుమ ఇలా సమాధానం చెప్పారు.

*స్వామి!* 


*మీరు ఆ రాయిని విడిచి పెట్టేశారు. రాముడిని వదిలేసినా, రాముడు వదిలేసినా మునిగి పోక తప్పదు. అదే జరుగుతో౦ది స్వామి*  అని. 


అందుకే....... 


రామ నామాన్ని జపి౦చ౦డి. ధర్మ౦గా జీవించ౦డి.


 *జై  శ్రీరామ్...*.                    🙏

బాల రోగములు

 శిశువులకు కలుగు రోగములు - 


   పసివారికి కలుగు రోగములను బాల రోగములు అని పిలుస్తారు . బాలురకు కూడా పెద్దవారి వలే సమస్త రోగములు కలుగును. కాని మరికొన్ని వ్యాధులు గ్రహదోషములు వలనను , మాతృకా దోషముల వలనను కూడా కలుగుచున్నవి. గ్రహాదుల వలన కలుగు వ్యాధులు కాక సామాన్యముగా కలుగు రోగములు 22 రకాలుగా ఉండును. అని శార్ఙ్గధరుడు వివరించెను . ఇప్పుడు మీకు వాటి గురించి సంపూర్ణముగా వివరిస్తాను . 


 * వాతజము - 


       వాతప్రకోపము చేత దేహమున పాలు దోషమును పొందినప్పుడు ఆ పాలను తాగించుట చేత శిశువు కంఠస్వరం మరియు శిశువు క్షీణించడం , మలమూత్ర , అపాన వాయువు నిరోధము కలుగుట వంటి సమస్యలు ఉత్పన్నం అగును . 


 * పిత్తప్రకోపం - 


         పిత్తప్రకోపం చెందుట చేత పాలు దోషం పొంది ఆ పాలు సేవించుట వలన సర్వదా చెమటపట్టుట , మలము బురద వలే వెడలుట , కళ్లు ఉబ్బు , సర్వాంగముల యందు వేడి కలిగి ఉండును. 


 * శ్లేష్మజము - 


          శ్లేష్మ వికారముచే చెడిన పాలను త్రాపుట చేత చొల్లు కారుట , అతినిద్ర , ఒడలు బరువు వంటి సమస్యలు కలుగును. 


 * ధంతో భేదము -  


          శిశువులకు కొత్తగా దంతములు మొలచునప్పుడు జ్వరం , భేదులు , వాంతులు , దగ్గు , తలనొప్పి కలిగి ఉండును. 


 * దంతఘాతము - 


          5 , 7 , 8 సంవత్సరముల వయస్సున దంతములు రాలుట చేత జ్వరం వంటి ఉపద్రవములు కలుగును. 


 * దంత శబ్దము ( దంత హర్షము ) - 


         శిశువులు నిద్రలో ఉన్నప్పుడు పళ్లు కోరుకుట  


 * అకాల దంతము - 


         శిశువులకు పండ్లూడు కాలమునకు ముందుగానే పండ్లు జ్వరాల వంటి ఉపద్రవాలు కలుగును. 


 * అహి పూతనము - క్షుద్రరోగము . 


         శిశువులు నిద్రించు సమయమున పక్క మీదనే మలమూత్రములు విసర్జించగా ముడ్డిని తుడవకగాని , కడగక ఉండటం వలన ముడ్డి యందు దురద కలిగి వ్రణము ఏర్పడును . 


 * ముఖపాకము - 


        శిశువుల నోరు పండినట్లు ఉబ్బుట . 


 * ముఖస్రావము - 


        శిశువుల నోట చొల్లు కారుట . 


 * గుదపాకము - 


         శిశువుల ముడ్డి పండి వ్రణం ఏర్పడుట . 


 * ఉపశీర్షకము - 


          శిశువుల కపాల స్థానమున వ్రణము ఏర్పడి జ్వరం వంటి ఉపద్రవాలు కలుగును. 


 * మహావిసర్పి - 


          శిశువుల శరీరం నందు వాతాదిదోషము వికారం పొందుట వలన మహాపద్మము అనే విసర్పి రోగము పుట్టును . ఇది చాలా తీవ్రంగా ఉండును. గుదస్థానము నందు ఎర్రటి తామర వలే ఉండును . హృదయము మొదలు శిరస్సు వరకు వేదనాభరితముగా ఉండును. 


 * తాలుకంటకము - 


         శిశువుల దవడల యందు శ్లేష్మ ప్రకోపము చేత ముండ్లవలే గరగరలాడుచుండి కఫము పడుట . 


 * విచ్ఛిన్నము - తాలు పాకము . - 


         శిశువుల దవడల యందు పల్లము పడుట చేత శిశువు పాలు త్రాగక నీళ్ల వలే మలము , విసర్జించునప్పుడు కడుపునొప్పియు , నేత్ర కంఠముల యందు వికారం , తాగినపాలు గొంతు దిగక కక్కుట వంటి సమస్యలు కలుగును. 


 * పారిగర్భికము - 


        తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చు పాలను శిశువు తాగుటచేత శిశువుకు ఆ దోషమున దగ్గు , అగ్నిమాంద్యము , వాంతులు , కండ్లమబ్బు , అరుచి , భ్రమ , కాళ్లు చేతులు సన్నం అగుట , కడుపు పెరుగుట మొదలగునవి కలుగును. ఈ సమస్య తల్లి గర్భముతో నుండకుండా ఉన్నను ఆమె పాలు తాగినను కొందరికి కలుగును. 


 * దౌర్బల్యము - 


         శిశువుల శరీరముకు దుర్బలత్వము కలుగుట. 


 * గాత్రశోషము - 


          ఏ దోషము వల్లనైనా శిశువు శరీరం కృశించుట . 


 * శయ్యా మూత్రము - 


         వాత వికారముచే శిశువు రాత్రియందు గాని పగటి యందు గాని పక్కపైన మూత్రమును పలుమార్లు విడుచును. 


 * కుకూనము - 


         చంటి పాల దోషముచే శిశువుల కనురెప్పల యందు దురద కలిగి దానిని నలుపుట చేత సూర్యుని తేజస్సు చూడనీయక పలుమార్లు కన్నీరు కార్చును . 


 * రోదనము - 


          పిల్లలు సదా ఏడ్చుచుండును. 


 * ఆజగల్లి - 


           శ్లేష్మ ప్రకోపము చేత శిశువు ల శరీరమున పెసరగింజల వంటి కురుపులు కలిగి వేదనాయుక్తమై శరీరం పాలిపోయినట్లు ఉండును. 


         పైన చెప్పిన విధముగా 22 రకాలుగా శిశు సంబంధ దోషములు కలుగును. సరైన పద్ధతిలో సమస్యని గుర్తించి చికిత్స చేయవలెను . 


    

         మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి . మరిన్ని సులభయోగాల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


      గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


            కాళహస్తి వేంకటేశ్వరరావు 


         అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

        ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 

                   

                        9885030034 


         మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు .


              అనువంశిక ఆయుర్వేద వైద్యులు .


                          9885030034

ధైర్యము నిచ్చున్

 క.


వినియోగించముయోగను

ధనముకు మించిన బలముగ ధైర్యము నిచ్చున్

తనువును వంచగ హెచ్చును

కొనలేనారోగ్య భాగ్య గుర్తులు గనుమా!


క.

ఘనమైనారోగ్యంబును

దినకర దండముతొ పొందు దినదినమందున్ వినయము చాటెడియోగన్

జనులెల్లరు చేయ వైద్య జాడ మరతురే!

దైవంగా

 ఒకనాటి పురుష ప్రయత్నంతో చేసిన కర్మఫలమే దైవంగా లభిస్తుంది. నేలలో వేసిన విత్తనం ఫలంగా రావడం దైవం. దైవం గురించి ప్రస్తుతం మనకు తెలియకపోవచ్చు. అందుకే వ్యక్తి పౌరుషానికే ప్రాధాన్యమివ్వాలి. దైవాన్ని నిందించడమో, దైవవశాత్తు ఏది జరిగితే అది జరుగుతుందని ఉపేక్షించడమో చేయకుండా- గొప్ప సిద్ధికి తగ్గ ప్రయత్నం మానవుడు చేయాలని వసిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధించాడు (యోగ వాసిష్ఠం ).

దైవం, పౌరుషం అనే రెండు అంశాలపై సనాతన ఆర్షగ్రంథాలు గొప్పగా చర్చించాయి. పౌరుషం అంటే మానవ ప్రయత్నం. 'దైవం' అంటే అనుభవించవలసిన కర్మఫలం.

ఒక వ్యక్తి గతంలో చేసిన కర్మల ఫలం అనుభవించవలసినదే అన్న వాక్యం 'సత్యమే కానీ నేటి ప్రయత్నంతో దాన్ని తొలగించుకోవడమో, సవరించుకోవడమో చేయవచ్చు అని కూడా ఋషి వాక్యం .

కర్మఫలం కాలానుగుణంగా వస్తుంది. బీజం కాలక్రమంలో భూజం (చెట్టు) అయినట్లే, కర్మ కాలప్రకారం ఫలంగా లభిస్తుంది. దైవం- కాలం అనే రెండు అంశాలు ఇక్కడ సమన్వయమవుతాయి. కర్మఫలాన్ని తగిన కాలంలో అందించే ఒకానొక స్వాభావిక శక్తినే 'ఈశ్వరుడు' అన్నారు. వారి వారి కర్మలననుసరించి 'జీవులను నడిపేవాడు ఈశ్వరుడు' అనే శాస్త్ర నిర్వచనాన్ని చాలా తేటగా రమణమహర్షి తెలియజేశారు.

ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. ఆయనకు ఒకరిపై ప్రేమ, వేరొకరిపై ద్వేషం ఉండవు. కర్మానుగుణంగా ఫలాన్నిచ్చే ఈశ్వరశక్తిని దైవం అంటున్నాం. దీనినే 'కాలం' అనీ వ్యవహరిస్తుంది శాస్త్రం. కలనం' చేసేది కాలం. అంటే సమకూర్చేది' అని అర్థం. సంకలనం- అనేమాట అందరికీ తెలిసిందే కదా!

ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా జరగాలో నియమించేదే కలనం. ఈ నియమానికే 'నియతి' అని పేరు. గతిని నియమించి, నడిపించేది కాలమే కనుక దీనికి 'నియతి' అనే పేరుంది. పంచభూతాల స్వభావం, ప్రవర్తన, సూర్యచంద్రాది జ్యోతిర్గణాల ఉదయాస్తమయాలు ఏ విశ్వనియతిని అనుసరించి జరుగుతాయో ఆ 'నియతి'యే కాలం. కాలం నా స్వరూపం' అంటూ విశ్వరూపాన్ని చూపిన శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు (భగవద్గీత-11వ అధ్యాయం). కాలాన్ని ఈశ్వరశక్తిగా గుర్తించినవాడు దాని విలువను, మహిమను గుర్తిస్తాడు. సత్ప్రయోజనాలను సాధించడానికి భగవంతుడు కాలరూపంగా లిఖించాడు అని గుర్తించిన సాధకుడు ప్రతిక్షణాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా ఆ భగవంతుని ఆరాధిస్తున్నాడు. కాలంలోనే పని, ఫలం- రెండూ ఉన్నాయి. పనిపైనే మన శ్రద్ధ, ప్రయత్నం ఉంటే- కాలం సత్ఫలాలను ప్రసాదిస్తుంది. మన భావం, ప్రయత్నం ఎలా ఉంటే కాలం అలా అనుగ్రహిస్తుంది.

సకాలంలో చేసిన ప్రయత్నం సరైన సిద్దినిస్తుంది. కనుకనే, కాలం వ్యర్థం కానివ్వకుండా కృషి చేయాలని ధార్మిక గ్రంథాలు నిర్దేశిస్తున్నాయి. 'కాలజ్ఞుడు' అంటే ఏ కాలానికి ఎలా ప్రవర్తించాలో తెలిసి, కాలాన్ని సద్వినియోగం చేసుకొనేవాడు. అనుభవం, అవకాశం- రెండూ కాలప్రసాదాలే.

సంకల్పం-సాధన సత్' అనే లక్షణంతో ఉంటే అది వ్యక్తికి, సమూహానికి క్షేమకరం. ఏ ప్రయత్నంలో స్వప్రయోజనంతోపాటు సర్వప్రాణిహితం, ప్రకృతి క్షేమం ఉంటాయో అది సత్ ప్రయత్నం. అలాంటి సల్లక్షణం కలిగిన వ్యక్తికి కాలస్వరూపుడైన ఈశ్వరుడు అనుకూలిస్తాడు. గత కర్మల ఫలాలను అదృష్టంగా ఇచ్చే కాలం, భావి సత్-ప్రయత్నాలను సాఫల్యం చేయాలని ఆశించడమే శుభాకాంక్ష!

సద్బ్రహ్మ ధర్మమే

 𝒫.𝒷.𝓂𝒶𝓉𝒶𝒿𝒾:

ఆకాశాది రూపాల్లో కనిపించే  సత్తా ,సద్బ్రహ్మ ధర్మమే.


ఉన్నది పరబ్రహ్మమే, మూడుకాలాల్లోను, సృష్టికిముందు, సృష్టి వచ్చాక, సృష్టి అనంతరం .


భ్రాంతికి పూర్వం _ఉన్నది పరబ్రహ్మమే.

 

భ్రాంతి కాలం _  పరబ్రహ్మ స్వరూపం అవగతం కాని కాలం. 

కాలమే భ్రాంతి.


భ్రాంతి విడచిన తరువాత మరల పరబ్రహ్మము తనకు తానుగా ఉంది.


పరబ్రహ్మము మూడొంతులు నిర్వికారంగా , నిర్గుణంగా ఉన్నది.


ఒకవంతు మాత్రమే మాయా శబలితమై ఉంది. 


(ఈశ్వరుడే గురురూపమై, పరబ్రహ్మ స్వరూపమై  నిర్గుణమైనప్పటికీ రక్షించే  బాధ్యత వలన సగుణరూపంలో వస్తున్నారు,  మనకు శాస్త్ర హృదయాన్ని అవగాహన చేయించి , లక్ష్యం చేర్చేటందుకై).

సదాసీదితి శబ్దార్థభేదే వైగుణ్యమాపతేత్ ౹


అభేదే పునరుక్తిస్స్యాన్మైవం లోకే తథేక్షణాత్  ౹౹ 36 ౹౹


36. సత్త ఉండెను అనే శబ్దముల అర్థము నందును విరోధమే.

విరోధము లేదు,రెండింటి అర్థమొకటే అనిన పునరుక్తి దోషము (అని ఆక్షేపించినచో సమాధానము)లోకవ్యవహారమిట్లే అగుటచే దోషము లేదు. 


వాఖ్య:-ఛాం ఉప3.19.9  :6.2.1 నందు “అసదేవేదమగ్ర ఆసీత్” అనే వాక్యమున విరోధము చెప్పబడినట్లే

 “సదేవసోమ్యేద మగ్ర అసీత్” అనినను విరోధమేయని ఆక్షేపము. ఉండినదే మరల ఉండెను అనుట విరుద్ధము.సత్,ఆసీత్ అనునవి రెండు సత్తలైనచో అద్వయసత్తయు సిద్ధమగుచున్నది.అర్థము ఒకటియే కదా అనిన ఒకదానిని రెండు పర్యాయములు చెప్పుట పునరుక్తి దోషము.ఇట్టి ఆక్షేపమునకు సమాధానముగ లోకమున ఇట్లే వ్యవహారము జరుగుటచే అందు దోషము లేదని చెప్పబడుచున్నది.


 ఈ అనంత చైతన్యము మాత్రమే నిత్యజాగరూకము,జ్ఞానవంతమునయిన  “సద్వస్తువు”.


బ్రహ్మము మాత్రమే సత్యమని తెలుసుకొన్న వ్యక్తి ముక్తుడగును.

మాయ నిజముగా లేదు.ఈ సత్యము నీవు తెలుసికొన్న క్షణమున అది అదృశ్యమగును.


ఈ అజ్ఞానము ఆత్మజ్ఞానము లేకుండా నశింపదు.

ఈ అజ్ఞానము యొక్క మూలము ఏదయినను అది కూడా నిశ్చితముగా ఆత్మలో ఉన్నది.


“నేను”— “బ్రహ్మము”అను భావము తొలగు నపుడే అతడు ముక్తుడగును.


అనంత చైతన్యమే ఒక చోట ఒక వస్తువుగాను,మరొక చోట మరొక వస్తువు గానూ కనిపించును.


తరంగ-జలముల మధ్య

అవయవ-దేహముల మధ్య

విభాగము లేనట్లే 

ఆ చైతన్యమునకు దాని శక్తికి మధ్య విభాగము లేదు.


అనంత చైతన్యమే ప్రపంచమునకు నామ,రూప రహితమగు ఆధారమని గ్రహించిన వారు సంసారమును జయింతురు.


కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధారస్య ధారణమ్  ౹౹

ఇత్యాది వాసనావిష్టం ప్రత్యాసీత్సదితీరణమ్  ౹౹ 37 ౹౹


కాలాభావే పురేత్యుక్తిః కాలవాసనయా యుతమ్   ౹

శిష్యం ప్రత్యేవ తేనాత్ర ద్వితీయం న హి శంక్యతే   ౹౹ 38 ౹౹


చోద్యం వా పరిహారో వా క్రియతాం ద్వైతభాషయా  ౹

అద్వైతభాషయా చోద్యం నాస్తి నాపి తదుత్తరమ్  ౹౹ 39 ౹౹


తదాస్తిమిత గంభీరం న తేజో న తమస్తమ్  ౹

అనాఖ్యమనభివ్యక్తం సత్కిఞ్చిదవశిష్యతే  ౹౹ 40 ౹౹


37. చేయవలసిన దానిని చేసెను,

    వాక్యమును వచించెను ,

    భారమును భరించెను  మొదలగు వాక్య ప్రయోగములన్నీ  పునరుక్తులు విరోధములే. ఇట్టి సంస్కారములు కలిగిన వారినుద్దేశించే “సత్ ఆసీత్”అని చెప్పుచున్నది.జనులకు ఈవాక్యములన్నీ అర్థవంతములే సాధువులే అగుచున్నవి.


38. అద్వితీయమగు బ్రహ్మము “పూర్వము”ఉండెను అనుట ఎట్లు? ఉండినగదా దానికి “పూర్వము” మరొకటి ఉండెనని చెప్పగలము?అను సంశయము వారింపబడుచున్నది.బ్రహ్మము కాలాతీతమైనను “పూర్వము” అని చెప్పుట కాలమను భావనను వదలని శిష్యుని గూర్చి మాత్రమే. కాలము లేదనిన నూతనులు దిగ్బ్రమ జెందుదురు.వారికి క్రముగ బోధ పరచుటకు బ్రహ్మము పూర్వము ఉండెను అని చెప్పబడినది.రెండవ దాని గూర్చిన ఉద్దేశము ఇందు లేదు.


39.ఆక్షేపముగాని పరిహరము గాని ద్వైతభాష యందే,వ్యవహారమున ద్వైతమును ఆరోపించుకొనియే జరుగును.అద్వైతభాష యందు పరమార్థమున ప్రశ్నయు లేదు ఉత్తరమసలే లేదు.

రెండవదే లేనపుడు ప్రశ్నలు ఉత్తరములు అసంభవముగదా.


40అప్పుడు,పరమార్థమున,

నిశ్చలము మనస్సు ఊహింపలేనిది కాంతి కానిది ఆచరింపనిది వ్యాప్తమైనది వివరింపనలవికానిది ఇంద్రియములు గ్రహింపజాలనిది శూన్యముకానిది ఇదిఫలానా అని చెప్పవీలు లేనిది ఉండును.అనగా దానిని ద్వైతనిషేధముచే మాత్రము సూచింపగలమని ఉద్దేశము.

(యోగవాశిష్ఠ ప్రారంభమున రామవశిష్ఠ సంవాదము ద్రష్టవ్యము.)


కంకణజ్ఞానము వలన సువర్ణము తన సువర్ణత్వమును అనుభవగోచరము గావించుకొను విధముగానే,విషయి(ద్రష్ట)విషయముగా,(దృశ్యముగా) అభివ్యక్తమగుచు తన ద్రష్టృత్వమును(ద్రష్టజ్ఞానమును)

అనుభవ గోచరముగావించు కొనును.


ఒకటి రెండవదాని ప్రతిబింబమే.నిజమయిన ద్వైతము(భేదము)లేదు.


ద్రష్ట దృశ్యమును జూచు నప్పుడు తనను జూడడు.

ద్రష్ట తనను దృశ్యముగా జూచును గనుక,తాను సత్యమైననూ, చూడడు,అయినను అతను అసత్యమయినట్లు అగుపించును.

అయినప్పటికి ఆత్మజ్ఞానముదయించి,విషయము అస్తిత్వరహితము కాగా,ద్రష్ట(విషయి)ఏకైక సత్యముగా అనుభవగోచరమగును.


విషయము వలన విషయి ఉండును.ఇక విషయము విషయి యొక్క ప్రతిబింబము మాత్రమే.

ఒక్కటి లేనిచో ద్వైతము ఉండజాలదు.మరియు ఒక్కటి మాత్రమే ఉన్నచో “ఏకత్వ” భావన యొక్క అక్కర  ఎక్కడ ఉండును.


ఆవిధముగా,సరి అయిన విచారణ,అవగాహనల వలన నిజమయిన జ్ఞానములభించి నప్పుడు మాటలతో వ్యక్తము చేయరానిది ఒక్కటే ఉండును.


దాని విషయమున అది ఒకటి అనిగానీ అనేకమనిగానీ,అది ద్రష్ట కాదనిగానీ, దృశ్యము కాదని గానీ,విషయి అనిగానీ,విషయమని గానీ,ఇదిఅనిగానీ చెప్పుట సాధ్యముగాదు.


ఏకత్వముగానీ నానాత్వముగానీ సత్యమని నిజముగా నిర్ణయింపజాలము.ఏల అనగా,ప్రతి వాదము తద్భిన్నమయిన వాదమునకవకాశమిచ్చును.

అయినను,తరంగము జలముకంటే వెరు కానట్లే,కంకణము బంగారము కంటే భిన్నము కానట్లే,ఒకటి “తదితరము”కంటే భిన్నము కాదు.


అదే విధముగా విభాగము ఏకత్వమునకు నిరాకరణము(విరుద్ధము)కాదు!

ఏకత్వమునకు,నానాత్వమునకు సంబంధించిన ఈఆలోచన అంతయు దుఃఖమును అతిక్రమించుటకు మాత్రమే.


దీని కంతటికి అతీతముగానున్నదే సత్యము,పరమాత్మ.

కాలమనేది సద్రూపబ్రహ్మము నందు లేకపోయినప్పటికీ ‘ పురా’ _ పూర్వకాలంలో అని చెప్పటం భూత వర్తమానాది కాలాల అభ్యాసరూపమైన వాసనలతో కూడియున్న శిష్యుని కోసం అని గ్రహించుదాం.


కాబట్టి కాలము ను, ద్వితీయ వస్తువుగా కల్పించుకోకూడదు.


“ సత్ ఆసీత్”_ సద్రూపమే ఉండెను.

 

అఙానం వలన భ్రమతో ఉన్నపుడు ద్వైతం ఉంది. 

అఙానం అనేకవిధాలుగా ఉంటుంది. 


ఙానం ఒక్కటిగా ఉంటుంది.

ఆ ఙాన నేత్రం తెరుచుకుని , ఉన్నదొ క్కటే అనే అనుభూతి చెందిన , అద్వైతం, ఏకం .


భావనలో ,ఆంతరికంగా ఏకత్వం( అద్వైతం) ఉండాలి.

వ్యవహారానికి అద్వైతం కాదు. 


ఆ అద్వైతంగా ఉన్న పరమార్ధ స్థితిలో నిశ్చలము,గంభీరము,తేజస్సు కంటె భిన్నమైన తత్త్వంఒక్కటే ఉంటుంది.


అది వ్యాపకమైనది.

ఇంద్రియాలకు విషయం కానట్టిది.

శూన్యం కంటే విలక్షణమైనది.

ఇది అని వ్యాఖ్యానింపశక్యము కానిది.


నేతి, నేతి యని సమస్త ద్వైత భావాలనూ నిషేధించగా, మిగిలి యుండే తత్త్వం ఒక్కటే ఉంది.

ఆ పరమార్ధ తత్త్వమే సద్రూపం.


అని విద్యారణ్యులు బోధించుచున్నారు.



 నను భూమ్యాదికం మా భూత్పరమాణ్వన్తనాశతః  ౹

కథం తే వియతోఽ సత్వం బుద్ధిమారోహతీతి చేత్  ౹౹ 41 ౹౹


అత్యంతం నిర్జగద్వ్యోమ యథా తే బుద్ధిమాశ్రితమ్ ౹

తథైవ సన్ని రాకాశం కుతో నాశ్రయతే మతిమ్  ౹౹ 42 ౹౹


41. ఆక్షేపము:- పరమాణువుల కలయికచే ఏర్పడిన భూమి జలము మొదలైనవి లేకపోవుగాక,నిత్యమగు ఆకాశము కూడా లేదనుట ఎట్లు ఊహింపగలము? (వైశేషికుల అభిప్రాయము.బ్రహ్మముతో పాటుగ ఆకాశముండిన అద్వయ వాదము భంగపడును)


42. సమాధానము:-జగమంతా నశించి ఆకాశము మాత్రముండునని నీవు ఊహింపగలిగినట్లే ఆకాశము కూడా నశింపగా సత్తా ఉండునని ఏల ఊహింపలేము?


వాఖ్య:- “శబ్దగుణక మాకాశం”అనీ

“అవకాశ దాతృత్వమ్ ఆకాశత్వమ్”అనీ ఆకాశమునకు నిర్వచనములు.శబ్దము కలుగుటకు ఆధారమైనది,ఇతర వస్తువులు ఉండుటకు అవకాశమును ఇచ్చునది ఆకాశము.అనగా ఇతర వస్తువులతో సంబంధపడునది ఆకాశము.ఇట్లుండ,వస్తువులన్నీ నశించి ఆకాశము మాత్రము ఉండుట ఊహింపగలిగినచో ఆ ఆకాశము కూడా నశించి సత్త మాత్రము శేషించుట ఏల ఊహింపలేము?అన్నింటిని నిషేధించుచూ వచ్చిన నిషేధింప సాధ్యము గానిది మిగులును.అదే   సత్త,బ్రహ్మము.


ఆత్మజ్ఞానము వలన బాహ్యమయిన జ్ఞేయ విషయము తనంత తాను తొలగగా చైతన్యము పరిపూర్ణముగా అభివ్యక్తమగును.

ఆచైతన్యమే స్వయముగా జడవిషయములందు జడస్వభావమును పొంది గాఢనిద్రాస్థితిని-అచేతనత్వమును లేక అజ్ఞానమును పొందును.


కావున చైతన్యమొక్కటే సర్వకాలములయందు ఉండును గనుక ఆకాశము ఉన్నదనియు, లేనిదనియు,ప్రపంచము ఉన్నదనియు, లేనిదనియు చెప్పవచ్చును.


అగ్నికి వేడి,శంఖమునకు తెలుపు,పర్వతమునకు గట్టితనము,జలమునకు ద్రవ్యత్వము,చెరకుకు తియ్యదనము,పాలకు వెన్న,మంచుకు తెల్లదనము,జ్యోతికి వెలుగు, తేనెకు మాధుర్యము, పుష్పమునకు సుగంధము ఎట్టిదో చైతన్యమునకు విశ్వము అట్టిది.


చైతన్యమున్నది గనుక ప్రపంచమున్నది.చైతన్యమునకు దేహము ప్రపంచము.

విభాగము లేదు,భేదము లేదు,

వ్యత్యాసము లేదు.


 సహజమయిన సత్తగల చైతన్యము సత్యము కావున ప్రపంచము సత్యము,

చైతన్యము లేకుండా ప్రపంచము వుండదు కనుక అసత్యము.


పర్వతములు,సముద్రము,భూమి,నదులుమొదలగునవి అవిగా వుండవు,కేవలము చైతన్యముగానే వుండును.కావున, చైతన్యములో భాగములుగానీ అవయవములుగానీ లేవు.


చైతన్యము యొక్క అస్తిత్వము లేదనరానిది.

అజ్ఞాని యొక్క అనుభవజ్ఞానముననుసరించి ప్రపంచ భావన పట్టు కొన్నది.


వాస్తవముగా ప్రపంచము,బ్రహ్మము,ఆత్మ ,

విశ్వచైతన్యము అను పదములలో భేదమే లేదు.



పరమాణు పర్యంతం సమస్త పదార్ధాలూ నాశనమయేవే. 

“ యదృశ్యం తన్నశ్యం” .నశించేవన్నీ అసత్తే.


పంచభూతాలైన భూమి, అగ్ని, జలం, వాయువు అనిత్యంగా ( అంతటా లేకపోవుట వలన) , అసత్ గా నిర్ణయించుచున్నాము.


 మరి నిత్యమూ ఉండే ఆకాశం ఎలా అసత్తు  అయింది ?  అంటున్నారు.


సృష్టి అయి ప్రపంచం గా కనపడే పదార్ధాలలో , ఆకాశం  మిగిలిన వాటితో   పోల్చిచూచిన నిత్యంగాఉన్నట్లుగా, అంతటాఉన్నట్లుగా, వ్యాపకం గా కనపడుతోంది.


ఆకాశం అంటే ఖాళీయే.

కానీ మనకు ఆ ఖాళీ నీలం రంగులో , అక్కడ ఒకటి ఉన్నట్లుగానే ,ఈ చర్మ చక్షువులకు కనపడుతోంది కదా! 


దృశ్యంగా కనపడేది, ఎప్పటికైనా నశిస్తుంది అని వేదాంతం చెబుతోంది.


మరి “సత్” అనేది చర్మ చక్షువులతో గోచరించనిది కదా! 


కాబట్టి ఆకాశము సద్వస్తువు కాదు,అంటున్నారు.


పరమాత్మకు దేహమే ప్రపంచం.

అదే పరమాత్మకు, స్థూల శరీరమైన విరాట్ స్వరూపం.