26, డిసెంబర్ 2021, ఆదివారం

కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

 #కేదార్‌నాథ్_దేవాలయం_పరిష్కరించని_రహస్యం_కోడ్

కేదార్‌నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానిపై చాలా చర్చ జరుగుతోంది.పాండవుల నుండి ఆదిశంకరాచార్యుల వరకు.


కేదార్‌నాథ్ ఆలయం బహుశా 8వ శతాబ్దంలో నిర్మించబడిందని నేటి శాస్త్రం సూచిస్తుంది.  ఈ ఆలయం కనీసం 1200 సంవత్సరాల నుండి ఉనికిలో ఉంది.


21వ శతాబ్దంలో కూడా కేదార్‌నాథ్ సమీపంలోని భూమి చాలా ప్రతికూలంగా ఉంది.  కేదార్‌నాథ్ పర్వతం ఒకవైపు 22,000 అడుగులు, 

మరోవైపు #కరచ్‌కుండ్ 21,600 అడుగుల ఎత్తు, #భరత్‌కుండ్_మూడో_వైపు_22700 అడుగుల ఎత్తు ఉన్నాయి.ఈ మూడు పర్వతాల నుండి ప్రవహించే ఐదు నదులు #మందాకిని, 

#మధుగంగ_చిర్గంగా_సరస్వతి మరియు #స్వరందరి.  ఇది పురాణాలలో ప్రస్తావించబడింది.


ఈ ప్రాంతం "#మందాకినీ_నది" ఉన్న ఏకైక రాష్ట్రం.  చల్లని రోజున భారీ మంచు మరియు వర్షాకాలంలో భారీ వర్షం.  ఇంత శత్రుభూమిలో గుడి కట్టాలంటే ఎంతో అధ్యయనం చేయాల్సి వచ్చేది.


  ఈ రోజు కూడా మీరు "కేదార్‌నాథ్ ఆలయం" ఉన్నంత వరకు డ్రైవ్ చేయలేరు.  అలాంటి స్థలంలో ఎందుకు నిర్మించారు?  అది కాకుండా, 100-200 కాదు, 1000 సంవత్సరాలకు పైగా, ఇంత ప్రతికూల పరిస్థితిలో ఆలయం ఎలా మనుగడ సాగిస్తుంది?  మనమందరం ఒక్కసారైనా ఆలోచించాలి.  10వ శతాబ్దానికి చెందిన పక్షంలో ఈ ఆలయం భూమిపై చిన్న "మంచు యుగం" కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు.


  డెహ్రాడూన్‌లోని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ వారు కేదార్‌నాథ్ ఆలయ శిలలపై "#లిగ్నోమెట్రిక్_డేటింగ్" పరీక్షను నిర్వహించి ఆలయం ఉన్న ప్రదేశానికి సమీపంలో పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేలా చూసుకున్నారు.  "రాతి జీవితాన్ని" గుర్తించడానికి లిగ్నోమాటిక్ డేటింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.  14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఈ ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని ఈ పరీక్షలో తేలింది.  అయితే ఆలయ నిర్మాణంలో ఎలాంటి నష్టం జరగలేదు.


  2013లో కేదార్‌నాథ్‌లో వరదలు వచ్చినప్పుడు అందరూ చూసి ఉంటారు.  ఈ కాలంలో వర్షపాతం "సగటు కంటే 375%" ఎక్కువ వర్షం కురిసింది.  తదుపరి వచ్చిన వరదలలో కనీసం 5,748 మంది మరణించారు (ప్రభుత్వ గణాంకాలు).  4200 గ్రామాలు దెబ్బతిన్నాయి.  భారత వైమానిక దళం ద్వారా 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలు విమానంలో సురక్షిత స్థలానికి చేరారు.కానీ ఈ విపత్తు వరదలో కూడా, కేదార్‌నాథ్ ఆలయ నిర్మాణం కొంచెం కూడా ప్రభావితం కాలేదు.


ఆర్కియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రకారం, వరద తర్వాత కూడా, ఆలయ మొత్తం నిర్మాణం యొక్క ఆడిట్‌లో 99 శాతం దేవాలయాలు పూర్తిగా రక్షించబడ్డాయి.  2013 వరదల సమయంలో భవనానికి ఎంత నష్టం జరిగిందో, ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేసేందుకు "IIT మద్రాస్" ఆలయంపై "NDT పరీక్ష" నిర్వహించింది.  ఆలయం పూర్తిగా సురక్షితంగా, పటిష్టంగా ఉందని కూడా చెప్పారు.


1200 సంవత్సరాల తరువాత, ఆ ప్రాంతంలో ప్రతిదీ ప్రవహించే చోట, ఒక్క నిర్మాణం కూడా మిగిలి లేదు.  ఈ దేవాలయం మనసులో నిలిచి ఉంది మరియు నిలబడడమే కాకుండా చాలా బలంగా ఉంది.  ఈ ఆలయాన్ని నిర్మించిన తీరు చూస్తే నమ్మండి.  ఎంపిక చేయబడిన స్థలం.  ఈ వరదలో ఈ ఆలయం తన కాళ్లపై తాను నిలబడగలిగినందుకు ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాయి మరియు నిర్మాణమే కారణమని నేడు శాస్త్రం చెబుతోంది.


  ఈ ఆలయం "ఉత్తర-దక్షిణ"గా నిర్మించబడింది.  కేదార్‌నాథ్ నిర్మాణం "దక్షిణ-ఉత్తరం" అయితే భారతదేశంలోని దాదాపు అన్ని దేవాలయాలు "తూర్పు-పడమర"గా ఉన్నాయి.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆలయం "తూర్పు-పశ్చిమ" గా ఉంటే, అది ఇప్పటికే నాశనం కాబడి ఉండేది.  లేదా కనీసం 2013 చివరి నాటికి నాశనం చేయబడి ఉండేది.


  కానీ ఈ దిశ కారణంగానే కేదార్‌నాథ్ ఆలయం మనుగడలో ఉంది.  ఇంకో విషయం ఏంటంటే ఇందులో వాడే రాయి చాలా గట్టిగా, మన్నికగా ఉంటుంది.  విశేషమేమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన రాయి అక్కడ లభ్యం కాదు, అయితే ఆ రాయిని అక్కడికి ఎలా తీసుకెళ్లి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి?  అప్పట్లో అంత పెద్ద రాయిని మోసుకెళ్లే పనిముట్లు లేవు.  ఈ రాయి ప్రత్యేకత ఏమిటంటే, వాతావరణంలో తేడాలు ఉన్నప్పటికీ, మంచు కింద ఉన్న 400 సంవత్సరాల తర్వాత కూడా దాని "గుణాలు" మారలేదు.

 

అందువల్ల, ఆలయం ప్రకృతి చక్రంలో తన బలాన్ని నిలుపుకుంటుంది.  ఆలయంలోని ఈ బలమైన రాళ్లను ఎటువంటి సిమెంట్ ఉపయోగించకుండా "#ఆష్లర్" పద్ధతిలో కలుపుతారు.  అందువల్ల, రాతి కీళ్లపై ఉష్ణోగ్రత మార్పుల ప్రభావం లేకుండా ఆలయ బలం అభేద్యంగా ఉంటుంది.  2013లో విత ఘాలాయికి గుడి వెనుక భాగంలో పెద్ద రాయి చిక్కుకుపోయి నీటి అంచు పగిలిపోయింది.  మరుసటి రోజు భారత వైమానిక దళం ఎవరిని హెర్లిఫ్ట్ చేసింది.


  విశ్వాసం ఉందా లేదా అనేది ప్రశ్న.  కానీ 1200 సంవత్సరాలకు పైగా సంస్కృతిని మరియు శక్తిని నిలుపుకునే ఆలయ నిర్మాణానికి స్థలాన్ని ఎంచుకున్న తర్వాత, దాని దిశ, సారూప్య నిర్మాణ వస్తువులు మరియు ప్రకృతిని కూడా పరిగణనలోకి తీసుకున్నారనడంలో సందేహం లేదు.  టైటానిక్ మునిగిపోయిన తర్వాత, పశ్చిమ దేశాల ప్రజలు "NDT పరీక్ష" మరియు "ఉష్ణోగ్రత" ఆటుపోట్లను ఎలా మార్చగలరో గ్రహించారు.  కానీ మనం 1200 సంవత్సరాల క్రితం ఇది ఇలా అని అనుకున్నాం.


కేదార్‌నాథ్ అదే స్పష్టమైన ఉదాహరణ కాదా?  

కొన్ని నెలల వర్షం, 

కొన్ని నెలలు మంచు, మరియు కొన్ని సంవత్సరాలు మంచు, ఇప్పటికీ మంచు, గాలి మరియు వర్షంతో కప్పబడి ఉంటుంది.  మరియు 6 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫారమ్ యొక్క బలాన్ని బట్టి, మనం ఆలోచించడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.  ఎంత సైన్స్ ఉపయోగించబడింది ఇక్కడ.


ఈరోజు, అన్ని వరదల తరువాత," కేదార్‌నాథ్ శాస్త్రవేత్తల సృష్టికి మేము మరోసారి నమస్కరిస్తున్నాము.


వైదిక హిందూధర్మం  మరియు సంస్కృతి ఎంత ముందున్నాయో ఇదొక ఉదాహరణ.

  ||  ఓం నమః శివాయ ||


సేకరణ..

డా॥కె.యు.గిరిధర్

సాధన -3

 సాధన -3

 శరీర సంసిద్ధత 

వంట చేయాలంటే ముందుగా వంటకు వాడే పాత్రలు శుభ్రంగా తోముకొని స్వచ్ఛమైన నీటితో కడుగుకొని వుంచుకుంటాము. అదే విధంగా బియ్యం, పప్పులు, కూరలు మరియు ఇతర వంటకు పనికివచ్చే దినుసులన్నీ స్వచ్ఛమైనవిగా చూసుకొని అప్పుడు కానీ పొయ్యిమీద గిన్నె పెట్టాము. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటె మనం వండుకునే వంటకం స్వచ్ఛముగా, రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండాలని మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాము. 

సాధకుడు తను ఆ అనంతునివైపు పయనించే సాధన చేయాలంటే తన సాధనకు ఉపకారంగా వున్న శరీరాన్ని కూడా శుభ్రంగా, శుచిగా, శుద్ధంగా సిద్ధం చేసుకోవాలి కదా. ముందు శరీరం శుచిగా ఉంటే అప్పుడు మనస్సు కూడా శుచిగా ఉండి చక్కగా  సాధనకు సహకరిస్తుంది. 

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం అంటే శుభ్రంగా స్నానం చేయటం అని మనం అనుకుంటాము.  అది కూడా నిజం చక్కగా స్నానమాచరించాలి, అంతేకాక తలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అప్పుడే బుద్ధికుడ శుభ్రంగా అవుతుంది. సాధకునికి దేహ మొహానికి కారణం శిరోజాలు అంటే తలవెంట్రుకలు. అధర్వణ వేదాంతర్గత మైనట్టి ముండకోపనిషత్తు సాధకుని ముందుగా ముండనం చేసుకొని అంటే గుండు చేయించుకోమని తెలుపుతున్నది. ఎప్పుడైతే సాధకుడి తలబొడిది అవుతుందో అప్పుడు అతని బుద్ధికుడ శుభ్రంగా మారుతుంది. మనం తెలుసుకున్న యోగ పురుషులు, ఉదాహరణకు శ్రీ రామకృష్ణ, శ్రీ రమణులు ఇంకా అలంటి వారి కోవకు చెందిన అనేక మహానుభావులు వారి తలలను బోడిగా వుంచుకోవటమే ఇందుకు  నిదర్శనం. ఇప్పుడు కూడా అనేక మంది సన్యాసజీవనాన్ని గడుపుతున్న మహానుభావులు కూడా వారి తలలను బోడిగానే ఉంచుకుంటున్నారు. కాకపొతే సంసార జీవనాన్ని గడుపుతున్న సాధకులు మాత్రము పూర్తిగా బోడి గుండు కాకుండా శిఖను (పిలకను) ధరించాలి. మన సనాతన ధర్మంలో బ్రాహ్మణులకు ఈ రకమైన సంప్రదాయం ఉండటం బహుశా వారి మానసిక ఉన్నతికి తోడ్పాటుకొరకే అయివుండొచ్చు. ఇప్పుడు గుండు పిలక కలిగిన బ్రాహ్మణులను చాలా తక్కువగా చూస్తున్నాము.  కానీ సాధకుడు మాత్రం విధిగా తన సాధనకొరకు గుండు పిలక కలిగి  ఉండాలి. అప్పుడే సాధన సక్రమంగా కొనసాగుతుంది. 

కేశాలను అలంకరించుకొని, ఇంకా మాట్లాడితే రంగు దిద్దుకొని వేదాంత మాటలు చెప్పే వారిని కేవలము మూర్ఖులుగా భావించాలి. తానూ ఆచరించక ఇతరులకు చెప్పటం పెద్ద దోషం. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  సమాజం నా గూర్చి ఏమనుకొంటుందో అనే భావనను పూర్తిగా విడనాడాలి. ఈ సమాజానికి మనం ఎలా కనబడితే అలానే చూస్తుంది. ఒకరికోసం కాదు జీవనం. సాధకుని ఆధ్యాత్మిక అభివృద్ధి అది కేవలం అతని వ్యక్తిగతం. ఎన్నో విధాల శ్రమదమాలను ఓర్చుకుంటేనే సాధన నిరంతరాయంగా సాగుతుంది. 

సాధకుడు సామాజిక జీవనానికి తక్కువ ప్రాధాన్యత, ఆధ్యాత్మిక జీవనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ విషయం సదా జ్ఞ్యాపకం ఉంచుకోవాలి. ముముక్షువు లక్ష్యం ఎప్పుడు మోక్షం మీదనే ఉండాలి.  ఈ సమాజంలో ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.  సాధకుడు తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకుంటే పూర్తి ప్రకృతి శక్తులు తన వశం అవుతాయి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 



* రాక్షసులతో సమానులు

* రాక్షసులతో సమానులు ఏవరు ?

 

1. రాజాజ్ఞ మీరినవారు.

2. ఆధారం లేక అప్పు చేసినవారు.

3. తనంతటి వాడు లేడని గర్వించేవాడు .

4. జన్మనిచ్చిన వారిని కష్టపెట్టేవాడు.

5. చేసిన ఉపకారాన్ని మరిచేవాడు.

6. ఆడదాని మాటలు విని కలహించేవాడు.

7. నమ్మించి మోసగించేవాడు.

8. స్త్రీని బలాత్కారంగా అనుభవించేవాడు.

9. నిరసంగా పరిహసించువాడు .

10. సభకు విగ్నం కలిగించువాడు.

11. పురుషుని అదుపాజ్ఞలలో ఉండని స్త్రీ .

12. హంతకుడు.


స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ -

 స్వర్ణ భస్మం గురించి సంపూర్ణ వివరణ - 


    స్వర్ణ భస్మం గురించి అంతకు ముందు మీకు వివరించాను . ఇప్పుడు మీకు మరికొంత విలువైన సమాచారాన్ని అందిస్తాను . 


   స్వర్ణ భస్మము ప్రయోగించుట వలన అనేకరకాల మొండివ్యాధులను సైతం నయం చేయవచ్చు . వాతము వలన వచ్చు జ్వరము , పిత్త సంబంధ జ్వరము , అతిసార రోగము , గ్రహణి , పాండురోగము , క్షయ , గర్భ సంబంధ రోగములు , ఫిరంగి రోగము ( siphalis ) , ఆయాసం , ఆమ్లపిత్తము , అపస్మారము , శిరస్సుకు సంబంధించిన రోగములు , ఉన్మాద రోగము , త్రిదోషాల వలన సంప్రాప్తించు రోగములు , స్తనరోగము , విషము వలన కలిగెడి రోగములు , ఎక్కిళ్లు , బాలలకు వచ్చు రోగములు వంటి సమస్తరోగములు ఈ స్వర్ణభస్మ సేవన వలన నయం అగును . 


      ప్రస్తుత కాలములో మనం తీసుకునే ఆహరం దగ్గర నుంచి తాగే నీరు వరకు ప్రతీది కాలుష్యమే . మన భారతదేశము నందు ఈ మధ్యకాలములో పురుగు మందుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయింది . సంవత్సరానికి మనం 300ml నుంచి 400ml వరకు పురుగు మందు మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది మనశరీరాన్ని చిన్నచిన్నగా విషపూరితం చేస్తుంది . క్రమముగా అనేక భయంకర రోగాలపాలు అవ్వడం జరుగుతుంది. ఇలా కలుషితం అయిన శరీరాన్ని బాగుచేసుకొనుటకు మరియు శరీరములో ఉన్నటువంటి టాక్సిన్స్ ను బయటకి పంపి సంపూర్ణ ఆరోగ్యం పొందుటకు ఈ స్వర్ణభస్మం ఎంతగానో ఉపకరించును . 


        నేను చేసిన పరిశోధన మరియు నేను గ్రహించిన అనుభవం మేరకు ఈ స్వర్ణభస్మం ను మరికొన్ని భస్మాలతో కలిపి ప్రయోగించినప్పుడు ఫలితాలు వేగవంతంగా వచ్చాయి. మా పూర్వీకుల ఫార్ములా ఉపయోగించి తయారుచేసిన స్వర్ణఔషధం అత్యుత్తమ ఫలితాలు ఇచ్చినది.


       ఈ స్వర్ణఔషదం నరాలు , ఎముకలు , కండరాల మీద అద్భుతముగా పనిచేయును .మధుమేహ వ్యాధిగ్రస్తులకు లోపలి అంతగర్గత అవయవాలు దెబ్బతినడం జరుగును . ఈ ఔషధం వాడుట వలన అంతర్గత అవయవాలు దెబ్బతినకుండా బలం చేకూరును . అదేవిధముగా ఈ మధ్యకాలంలో నరాల సంబంధ దోషములతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యముగా మధుమేహము ఉన్నవారు.అటువంటి దోషములన్నింటిని పోగొట్టి నరాలను శక్తివంతముగా మార్చును.


         ఈ స్వర్ణఔషదం గొప్ప వాజీకరణం . శృంగారపరమైన బలహీనత , శృంగారము పైన ఆసక్తి లేకపోవటం వంటి సంబంధ సమస్యలే కాకుండగా స్త్రీలలో వచ్చు గర్భసంబంధ దోషములకు కూడ అద్బుతముగా పనిచేయును . 


        చిన్నపిల్లలలో అమితమైన జ్ఞాపకశక్తిని మరియు మెదడుకు మరింత బలాన్ని చేకూర్చును . ఇది క్రమం తప్పకుండా వాడుతున్నవారు ఏకసంథాగ్రాహకులు గా మారును . ఇది మంచి ఇమ్మ్యూనిటి బూస్టరుగా పనిచేయును . రోగనిరోధక శక్తిని అమితముగా పెంచును. 


        కరోనా సమయములో కరోనా వచ్చి బలహీనపడిన వారికి ఇది ఇవ్వడం వలన త్వరితగతిన కోలుకోవడం జరిగింది . మగవారికి మాత్రరూపములో , ఆడవారికి మరియు పిల్లలకు లేహ్యరూపములో ఇవ్వడం జరుగును. 


 గమనిక - 


      దీని ఖరీదు కొంత ఎక్కువుగా ఉండును . కావలసిన వారు ఫొన్ చేసి సంప్రదించగలరు. మెస్సేజి , కామెంట్స్ రూపములో స్పందించడం జరగదు.దీనికి కారణం మీరు ఫొన్ చేసినప్పుడు నేను అడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వవలెను . దీనివల్ల మీ శరీరాత్త్వాన్ని అంచనా వేసుకొని తయారుచేసి ఇస్తాను. 


     ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎవ్వరైనా వాడుకోవచ్చు. దీనిని వాడటం వలన రాబోయే దుష్ప్రభావాలను ఎదుర్కొనే శక్తి వచ్చును .  


       ఈ స్వర్ణఔషదం కావలసిన వారు 9885030034 నంబర్ కి ఫోన్ చేయగలరు . 


     

              కాళహస్తి వేంకటేశ్వరరావు 


              అనువంశిక ఆయుర్వేదం 


                   9885030034

కృతఘ్నత

 ॐ                       కృతఘ్నత 



    "కృతఘ్నత" (ఇతరులు మనకు చేసిన మేలు మరచి పోవడం) మహాపాపం.

    అన్ని పాపములకు "ప్రాయశ్చిత్తం" శాస్త్రములలో చెప్పబడి  ఉంది.

    కానీ "కృతఘ్నతా దోషానికి" మాత్రం  ప్రాయశ్చిత్తం లేదు.

    భగవంతుడు కూడా ఈ దోషాన్ని పోగొట్టలేడు.

    ఒక్క సద్గురువు మాత్రమే ఈ దోషమునుండి భక్తులను కాపాడగలరు.


    కృతఘ్నతా దోషము పాలుగాకుండా, ఒక మహా పండితుని  శ్రీ కంచి పరమాచార్యులవారు అనుగ్రహించిన  సంఘటన ఒకటి ఇప్పుడు చెప్పుకుందాము.


    అనంతపురంలో  "మొదలి శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు"  అనే వేద విద్వాంసులు ఉండేవారు.

    వారు అనేకమంది శిష్యులకు వేదము చెప్పేవారు. సంస్కృతములో కూడా గొప్ప పండితులు.

    అనంతపురం, ప్రభుత్వ కళాశాలలో సంస్కృత భాషోపన్యాసకులుగా ఉద్యోగం చేసే వారు.


    మా బావమరిది శ్రీ అమ్మనమంచి శివప్రసాదు, అనంతపురం వైశ్యాబాంక్ లో పనిచేస్తుండగా వీరి సాంగత్యం లభించి, వీరి శిష్యులైనారు. వీరిదగ్గర "అరుణము", మొదలైనవి అధ్యయనం చేశారు.

    వారికి శ్రీ శర్మగారు స్వయముగా చెప్పినదే ఈ వృత్తాంతమంతా.


    శ్రీ శాస్త్రిగారు  నిత్యము " సప్తశతి"పారాయణ చేసేవారు.

    అనేకమంది చేత చండీయాగములు చేయించారు.

     ఆగమ శాస్త్ర పండితులు కూడా కాబట్టి  అనేక దేవాలయ ప్రతిష్టలు కూడా నిర్వహించారు.

    నెల్లూరు దగ్గరవున్న" పెంచలకోన" లో శ్రీ విజయేశ్వరి అమ్మవారు అనేకసార్లు వీరిచేత  తమ ఆశ్రమంలో చండీయాగములు చేయించారు. 


    ఒకసారి శ్రీ కంచి పరమాచార్యులవారు అనంతపురంలో పదిరోజులు బస చేశారు.

    శ్రీ బాల విశ్వనాధ శర్మ గారు రోజూ వారిని దర్శించుకునేవారు. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా శ్రీ స్వామివారు వీరితో మాట్లాడేవారు కాదు. 

    అందరితో మాట్లాడుతూ, ప్రత్యేకంగా, ఆ ఊరిలో ఎంతో ప్రఖ్యాతి చెందిన వీరితో మాత్రం  శ్రీ స్వామివారు మాట్లాడక పోవడము అందరికీ ఎంతో ఆశ్చర్యం కలిగించేది.

    శ్రీ స్వామి వారు తనతో మాట్లాడక పోవడముతో శ్రీ శర్మగారు ఎంతో మనస్తాపం చెందారు.

    కారణము తెలియక వారికి రోజు రోజుకు దుఃఖము అధిక మవుతుండేది.

    ఇలా పదిరోజులు గడిచినై.


    శ్రీ స్వామివారు అక్కడనుండి "ధర్మవరము" నకు ప్రయాణమయినారు.

    శ్రీ శర్మగారు చింతాగ్రస్తులయినారు. ఏమైనా సరే, శ్రీ స్వామివారు మాట్లాడేదాకా వారిని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.

   "నేను ఎప్పుడు వస్తానో తెలియదు.అప్పటివరకు సెలవు మంజూరు చేయ వలసినది" అని కళాశాలకు సెలవు చీటీ పంపించి, శ్రీ స్వామివారి వెంట ధర్మవరము వెళ్లారు.

    శ్రీ స్వామివారు నదీ స్నానం ఆచరిస్తుండగా అక్కడ నిలబడి " అఘమర్షణ " సూక్తము మొదలైన స్నాన మంత్రములు చదివారు.

    మంత్రములు చదవటం పూర్తి అయినా, శ్రీ స్వామివారు, ఇంకా స్నానం చేస్తూనే ఉన్నారు.

    శ్రీ శర్మగారు కొంత తటపటాయిస్తూ "రుద్రము" చదవటం మొదలుపెట్టారు. 

    శ్రీ స్వామివారు చదవమని చేయి ఊపి సైగ చేశారు.


    పది రోజుల తరువాత అదే 

మొదటిసారి శ్రీ స్వామివారు, శ్రీ శర్మగారివంక చూడటము. 

    శ్రీ శర్మగారు మహదానంద భరితులయినారు.


    సాయంకాలము ఊరి వారందరితో కూడిన సభ జరుగుతున్నది. శ్రీ స్వామివారు వున్నట్లుండి శ్రీ శర్మగారిని పేరు పెట్టి పిలిచి, వేదికపైకి రమ్మన్నారు.

    శ్రీ శర్మగారు వేదికపైకి వెళ్లి శ్రీ స్వామివారికి " న కర్మణా న ప్రజయా" అని వేదమంత్రం చదువుతూ సాష్టాంగ నమస్కారం చేశారు. 

    శ్రీ పరమాచార్యులవారు వీరితో సంస్కృతములో సంభాషణ ప్రారంభించారు.


   "మీరు మీ గురువులను విస్మరించారు.

    మీ కుటుంబము వారందరికి శ్రీ శృంగేరీ జగద్గురువులతో ఎన్నో తరములనుండి అనుబంధము ఉన్నది.

    మీకు చిన్న తనములో నత్తి వల్ల మాటలు సరిగా రాకపోవడంతో మీ ఇంట్లో వారందరు దిగులు పడ్డారు.

    మీ తాతగారు, మిమ్ములను, శ్రీ శృంగేరి జగద్గురువులు శ్రీ చంద్రశేఖర భారతీ స్వాములవారి సన్నిధికి  తీసుకు వెళ్లి విషయం విన్నవించారు.

    జగద్గురువులు మీ నోరు తెరవమన్నారు. ఎంతో అనుగ్రహంతో మీ నాలుకమీద వారి అమృతదృష్టి ప్రసరింపజేసి, చిరునవ్వు నవ్వుతూ "ఈ అబ్బాయి గొప్ప పండితుడు అవుతాడు. చాలా ప్రఖ్యాతి సంపాదిస్తాడు" అని ఆశీర్వదించారు.

    ఆ క్షణం నుండీ మీకు నత్తి పోయింది స్పష్టమైన ఉచ్ఛారణ వచ్చింది. వేదము, సంస్కృతము అధ్యయనం చేసి మంచి పండితులైనారు.

    అటువంటి సద్గురువులను మీరు విస్మరించారు" అన్నారు.


    శ్రీ శర్మగారు నిశ్చేష్టులైనారు.

    ఒక్కసారిగా వారికి గతమంతా గుర్తుకు వచ్చింది.

    తనను తన తాతగారు, శృంగేరీ తీసుకువెళ్లడము, జగద్గురువులు ఆశీర్వదించడము,తన విద్యాభ్యాసము, క్రమంగా శ్రీ జగద్గురువులను మరచి పోవడము అన్నీ జ్ఞప్తికి వచ్చినవి.

    ఎంతో సిగ్గు పడ్డారు.

    వారికి ఆశ్చర్యం కూడా వేసింది.

    ఎప్పుడో తన చిన్నతనంలో జరిగిన ఈ విషయాలు శ్రీ స్వామివారికి ఎలా తెలుసు?


    శ్రీ స్వామివారు సాక్షాత్తూ భగవంతుని అవతారం అనటానికి ఇంతకంటే వేరే నిదర్శనం ఏమి కావాలి?

    తనకు "నత్తి" పోగొట్టి, వాక్పటుత్వము ప్రసాదించిన శ్రీ శృంగేరీ జగద్గురువులు కనులకు గోచరించారు. వారి మనస్సు భక్తి భావంతో నిండిపోయింది.

    శ్రీ పరమాచార్యులవారికి సాష్టాంగ నమస్కారము చేశారు.


    తాను శ్రీ శృంగేరీ జగద్గురువులను విస్మరించి గొప్ప పాపం చేశానని, మీరు నన్ను కాపాడాలని, 

శ్రీ పరమాచార్యులవారిని  వేడుకున్నారు.

    శృంగేరీ వెళ్తానన్నారు.

    ఆ తరువాత వారిద్దరూ అనేక విషయములు మాట్లాడుకున్నారు.

    శ్రీ శర్మగారి సందేహాలు ఎన్నో శ్రీ స్వామివారు తీర్చారు.

    వారిని ఆశీర్వదించి తిరుగు ప్రయాణానికి అనుజ్ఞ ఇచ్చి పంపారు.

    శ్రీ శర్మగారు అప్పటినుండి శ్రీశృంగేరీ వారితో తమ అనుబంధం కొనసాగించారు. అనేకమందికి,వేదము, సంస్కృతము చెప్పారు. అనేక గ్రంధాలు రచించారు. 

    అనేక సత్కార్యాలు చేసి జన్మ చరితార్ధము చేసుకొన్నారు.

    దేహత్యాగ పర్యంతము ఏటువంటి రుగ్మతా లేకుండా సంపూర్ణ ఆరోగ్యముతో వున్నారు.

    కృతఘ్నతా మహా దోషం నుండి తనను కాపాడిన శ్రీ పరమాచార్యులవారిని ఆ జన్మాంతమూ, స్మరించుకుంటూనే ఉండేవారు.


    కేవలము తమ భక్తులనే కాదు, సన్మార్గంలో ఉండే వారందరినీ  శ్రీపరమాచార్యులవారు ఇలా

 కాపాడుతూ ఉంటారు. 


శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః.


                    శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

25-12-'21. 


                   **********

    పరమాచార్య నడిచే దైవం.

    ఇప్పూడూ సమాధినించీ నడిపించే ఆ దైవానికి ప్రణామాలు.


"కృతఘ్నత" గురించి శ్రీరాముడు లక్ష్మణుని వాలివద్దకు పంపుతూ లక్ష్మణునితో అన్న మాట 


కృతార్థా హ్యకృతార్థానాం 

మిత్రాణాం న భవన్తి యే I

తాన్మృతానపి క్రవ్యాదాః 

కృతఘ్నాన్నోపభుఞ్జతే ॥ 4/30/73


    మిత్రులసహాయముతో తమ పనులను పూర్తి చేసికొని, 

    పిదప వారికి సహాయపడనివారు కృతఘ్నులు. 

    అట్టివారు చనిపోయిన పిమ్మట వారి కళేబరములను పచ్చిమాంసములను తినెడి క్రూరమృగములుగూడ ముట్టవు. 


    Even the carnivorous animals 

    dislike to eat the body of such ungrateful men 

    who do not help their friends even though they have received help and have achieved their objective. 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

పాఠక మిత్రులకు విన్నపం

ఈ బ్లాగు మనందరిది. దీనిని సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావచ్చు. కానీ మీరు మీకు నచ్చిన, లేక నచ్చని అంశం ఎందుకు నచ్చిందో, నచ్చలేదో తెలిపే ముందు మీరు మన బ్లాగులో ఫాలోవరుగా అవ్వండి. తదుపరి మీరు చేయాలనుకునే కామెంటును సహేతుకంగా అందరికి అర్ధమయ్యే రీతిలో వ్రాయండి. క్రింద మీ పూర్తీ పేరు, అడ్రస్సు, ఫోను నెంబరు వ్రాయటం మాత్రం మరువకండి. అసంపూర్తి వివరాలు లేక మీ వివరాలు తెలుపకుండా కామెంట్లు చేస్తే అవ్వి ప్రచురించబడవు.  గమంచగలరు. 

సాధన -2

 సాధన -2

కారు, డ్రైవరు 

సాధకునికి ఆత్మానాత్మ విచక్షణ సులభంగా అర్ధం కావటానికి  కఠోపనిషత్లో క్రింది మంత్రం ద్వారా తెలియచేస్తున్నది.  

రథరూప కల్పన ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు | బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ |3|

= ఆత్మానం = ఆత్మను; రథనం = రథస్వామి అని; విద్ధి = తెలుసుకో శరీరం = శరీరాన్ని; రథం ఏవ తు = రథమే అని (తెలుసుకో); బుద్ధిం తు= బుద్ధిని; సారథిం = సారథి అని; విద్ధి = తెలుసుకో; మనః = మనస్సు: ప్రగ్రహం ఏవ చ = పగ్గమే అని కూడా (తెలుసుకో); = = (తా|| ఈ ఆత్మను రథస్వామి అని తెలుసుకో. శరీరాన్నే రథమని తెలుసుకో. బుద్ధిని సారథి అని తెలుసుకో. మనసేమో పగ్గమే అని తెలుసుకో.)

దీనిని ప్రస్తుత కాలానికి అనుగుణంగా సాధకుల సౌలబ్యానికి ఇలా అర్ధన్ని చెప్పుకుందాం. 

ఇక్కడ కారు-కారు డ్రైవరు పోలికతో మనకు ఉపనిషత్తు సాధకునికి తన ఆత్మకు, శరీరానికి వున్న అనుబంధాన్ని తెలియ చేయుచున్నది. ఆత్మను కారు యజమాని గాను, శరీరాన్ని, కారు గాను, బుద్ధిని కారు డ్రైవరుగాను ఇక మనస్సు కారుకు ఉన్నటువంటి స్టీరింగ్, కాగా  బ్రేకు, క్లచ్, యాక్సిలరేటర్లు ఇంద్రియాలుగా పోల్చుతున్నది. కారు యజమాని సురక్షితంగా ప్రయాణం చేయాలంటే కారు డ్రైవరు అలాగే స్టీరింగ్ తదితర అన్ని హంగులు సక్రమంగా పనిచేయాలి. అప్పుడే గమ్యానికి క్షేమంగా చేరగలడు. ప్రయాణం సాఫీగా జరగాలంటే ముందుగా కారు పూర్తి కండిషనులో ఉండాలి అంటే సాధకుని శరీరము పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉండాలి. ఏరకంగా కారు డ్రైవరు రోజు కారు పరిస్థితిని గమనించి లోటుపాట్లు అంటే పెట్రోలు, ఆయిల్ మొదలైనవి సరిగా ఉన్నాయో లేదా అని చూసుకుంటాడో అట్లాగనే సాధకుడు తన బుద్దిని వుపయోగించి శరీరానికి కావలసిన ఆహార, పానీయ దుస్తులు మొదలైనవి బాధ్యతగా సమకూర్చి శరీరం రోగగ్రస్తం కాకుండా, అలసత్వం చెందకుండా ఎప్పుడు చెతన్యవంతంగా వుండే విధంగా చూసుకోవాలి.  కానీ శరీరం మీద మొహాన్ని మాత్రం పెంచుకోకూడదు.  శరీరం కేవలం ఆత్మను పరమాత్మ వద్దకు (మోక్షాన్ని) తీసుకొని వెళ్లే ఉపకరణంగా మాత్రమే చూడాలి అంతేకాని సమాజంలో శరీరానికి ఆపాదించే మానవమానాలు తనవిగా  భావించరాదు. వాటిని పరిగణలోకి తీసుకోరాదు. అప్పుడే సాధకుడు సాధనలో ముందుకు వెళ్లగలడు. 

సాధకుని ద్రుష్టి సదా మోక్షం మీద మాత్రమే ఉండాలి,  భౌతికమైన విషయాలను తాత్కాలికమైనవిగాను తాను వాటికి ఎంతవరకు సంబందం కలిగి ఉండాలో అంతవరకుమాత్రమే సంబంధం ఉంచుకోవాలి. కేవలం తామరాకు మీద నీటి బిందువు లాగ మాత్రమే ఈ సమాజంలో తాను ఉండాలి.  ఇవ్వన్నీ సాధ్యమేనా అనే ప్రశ్న  ఉదయిస్తుంది. నిజానికి అన్ని సాధ్యమే కేవలం మనస్సుని స్వాధీన పరచుకోవాలి.

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః.