16, ఆగస్టు 2020, ఆదివారం

హోమియో వైద్యంతో కరోనా ట్రీట్మెంట్

ఇప్పటి పరిస్థితి చూస్తుంటే చాలా బాధాకరంగా వుంది. అటు అల్లోపతిలో కరొనకు ట్రీట్మెంట్ లేదంటూనే ప్రైవేట్ హొస్పేటిల్లో రోగుల  నుండి లక్షలలో ఫీజులు వాసులు చేస్తున్నారు.
మరి హోమియోపతిలో వైద్యం ఎలా ఉంటుంది అని అందరు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఈ రోగానికి ఈ వైద్యవిధానంలోనే ట్రీట్మెంట్ వున్నది అది యెట్లా అంటే ఈ వైద్యం రోగానికి మందు ఇవ్వదు కేవలం రోగ లక్షణానికి మాత్రమే మందు ఇస్తారు. కాబట్టి ఎంతమంది ఈ వైద్య విధానంలో మందులు తీసుకొని కోలుకున్నారు. కాబట్టి ఈ వైద్య విధానాన్ని ప్రభుత్వం ప్రత్సాహించి ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నాను.


అల్లోపతి మందులకన్నా హోమియోపతి మందులు సురక్షితం, సైడ్ ఏవేక్ట్లు వుండవు అనే మీ అభిప్రాయాన్ని భావించకండి. ప్రతి మందుకు సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అలానే హోమియో మందులకు కూడా. నిజానికి హోమియో వైద్యం ఎక్కువగా ప్రాధాన్యత సంతరించకపోవటానికి రెండు కారణాలు. వైద్యులు సరైన మందుని నిర్ధారణ చేసే సామర్థ్యం లేకపోవటంతో రోగ నిర్ములన్ కొన్ని సార్లు జరుగదు. ఈ రోజులల్లో రోగులు తక్షణ నివారణ కావాలని కోరుకుంటున్నారు దానితో వెంటనే రిలీఫ్ రాకపోటంతో వెంటనే వేరే వైద్యుడి దగ్గరకు పోతున్నారు. నిజానికి హోమియో వైద్యంలో రెండు ప్రధానాంశాలు ఉంటాయి అవి. ఒకటి  మందు రెండవది పోటెన్స్. ఈ రెండు సరిగా ఉంటేనే వ్యాధి నివారణ వెంటనే అవుతుంది. కానీ అల్లోపతిలో కేవలం రోగము-మందు ఉంటుంది. ఇక్కడ రోగ లక్షణానికి మందు. కొన్ని సందర్భాలలో ఒకే రకమైన రోగం వున్న ఇరువురికి వేరు వేరు మందులు కూడా ఇవ్వవలసి రావచ్చు. కాకపొతే బయో కెమికులో (హోమియోలో ఒక భాగం)  ఆలా ఉండక పోవచ్చు. ఏది ఏమైనా హోమియో కూడా జాగ్రత్తగా వాడవలసిన వైద్య విధానమే అని తెలుసుకోవాలి. 
**************

పితృ రుణం

భూమి మీదున్న ప్రతి మానవునికి దేవ ఋణము, పితృ ఋణము అనే రెండు ఋణములు ఉంటాయి. అవి తీర్చుకోవాల్సిందే. కృతఘ్నతా దోషముతో మళ్లీ మళ్ళీ జన్మలెత్తడం, లేదా ఇంటిలో భూత ప్రేత పిశాచాల భయం, అకాల మరణాలు వంటి.. కఠిన సమస్యలతో సతమతమవటం జరుగుతూనే ఉంటుంది. కనుక ముందు ఈ ఋణములు తీర్చుకోవాలి.

దేవ, పితృ యజ్ఞాలు ప్రతివారు ఆచరించాల్సిన నిత్య కర్మలు. ఆ పితరులే లేకపోతే.. ఈ జీవితం శరీరం ఎక్కడిది?! కనుక తప్పక వారిని అర్చించాలి. వారికి ఆహారాన్ని స్వధా దేవి చేకూరుస్తుంది. 'స్వర్గం లోకం దధాతి యజమానస్యేతి స్వధా' అనగా పితృ యజ్ఞములు చేయువారికి ఉత్తమ స్థితులు, చేయనివారికి అధోగతులని భావం. మేము జ్ఞానులైపోయాము బదరీ క్షేత్రంలో పిండప్రదానం చేశాము, ఇక తామేమి చేయనక్కరలేదని పితృ యజ్ఞములు మానేస్తే మహా పాపమును పొందుతారని చెప్పబడుతోంది. జీవం ఉన్నంతవరకు.. హేతువైన పితృ దేవతలను నిత్యం స్మరించుకోవాలి.
సమస్య వచ్చినప్పుడే, పండగ వచ్చినప్పుడే దేవతలు గుర్తొస్తారనే విషయం చాలా మందిలో కనిపిస్తున్న వాస్తవం. పితరులకు భక్తి విశ్వాసాలతో ప్రతి ఏటా పితృ కార్యాన్ని ఆచరించినప్పటికీ... ఆయా కుటుంబాల వారు సుఖ శాంతులకు దూరంగానే ఉన్నారు. దీనికి కారణమేమిటనే ప్రశ్న తెరపైకి రావవచ్చు. నిజమే మరి.. స్వధా దేవిని కేవలం పితృ కార్యాలనాడే తలుచుకుంటారే తప్ప మిగిలిన రోజులలో మచ్చుకైనా గుర్తుచేసుకోరు. కేవలం సంవత్సరానికి ఒక రోజున వచ్చే పితృ కార్యం ఆచరించి చేతులు దులుపుకొన్నంత మాత్రాన లాభం లేదు, పితృతిధి రోజునే పితృ కార్యం ఆచరించిననూ స్వధా దేవిని ప్రార్ధించటం లేదు. కేవలం ఆనాడు.. ఆ కార్యాన్ని పూర్తి చేయటానికి స్వధా దేవిని ఒక దూతగానే వాడుకున్నాం తప్ప ఆ తల్లి అనుగ్రహం నిత్యం ఉండాలని, చాలా మంది గమనించరు.

స్వాహా దేవికి 16 నామలున్నట్లుగానే, స్వధా దేవికి కూడా 8 నామాలున్నవి. పితృప్రాణతుల్యా, యజప్రీతికరా, యజదేవతారూపిణి, శ్రాద్ధాధిష్టాతృదేవీ, శ్రాద్ధఫలప్రదా, ఆత్మ మానసకన్యా, పితృదృష్టిప్రదా, కృష్ణవక్షస్థలా అనే 8 నామాలు. ఈ స్వధా దేవినే పురాణములలో గోలోక వాసినిగా ఉన్న కృష్ణవక్షస్థలా అనికూడా చెప్పబడింది. ఈ 8 నామాలతో ఉన్న స్వధా దేవిని ప్రత్యేక పద్ధతులలో అర్చించాలి. కనుక శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని మహా పుణ్యవంతమైన నామాలలో ఉన్న స్వాహా, స్వధా దేవతలను అర్చించటానికి కూడా ప్రత్యేకమైన రోజులు అవసరం. ఈ స్వాహా, స్వధా దేవతలను శాస్త్రీయ పద్దతిలో అర్చిస్తేనే, పూర్ణ ఫలాలను పొందగలుగుతారు.
ప్రతి ఒక్కరు దేవ యజ్ఞమును, పితృ యజ్ఞమును చేయాలి. దేవ యజ్ఞమును చేసినప్పుడు స్వాహాకారం, పితృయజ్ఞం చేసినప్పుడు స్వధాకారం ఉండును. ఈ రెండు శక్తులు వాక్కునకు మూలమైన అగ్నికి సంబంధించిన శక్తులుగా వర్ణింపబడినవి. ఈ విశ్వంలో దేవతలకి, పితృ దేవతలకి స్థానములున్నవి. వీరిరువురిని పూజించుట నిత్య కర్మలలో విధింపబడినది. భారతీయ యజ్ఞ విజ్ఞానంలో అనేక విషయములున్నవి. యజ్ఞాజ్ఞిలో సరియైన ప్రేరణతోనే స్వాహా, స్వధా శబ్దములు ఉండాలి. వాటి వల్లనే దేవతలు, పితృదేవతలు తృప్తి చెందుతారు.

పితృ కార్యములు ఆచరించునప్పుడు3 విధములైన దేవతలుగా చెప్పబడును. అవి వసు, రుద్ర, ఆదిత్య రూపమైన దేవతలు. అనగా అగ్ని, వాయు, సూర్యులలో దాగి ఉన్న పితృ శక్తి వసు, రుద్ర, ఆదిత్యుల రూపములుగా వ్యవహరింపబడుతున్నవి. ఈ 3 రూపములలో ఉన్నవారికి.. కర్త అయిన వ్యక్తి తన భావమును విన్నవించుకొనుటకు ఈ స్వధా దేవియే శరణ్యం. అగ్ని, వాయు, సూర్యుల ధారణా శక్తిని స్వధా అంటారు. ఇది వేదము చెప్పిన స్పష్టత. ఈ దేహములోనే కాక దేహానంతరము కూడా నడుపు శక్తి స్వధా దేవి. పితృ రూపములో జీవులు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో.. ఇక్కడ ఉన్నవారికి తెలియదు. కానీ ఆ పితృదేవతలను చేరుటకు మానవుని కర్మకు తగినటువంటి ఫలమును అందించుట ఒక్క స్వధా దేవికే సాధ్యం.

నైవేద్యం.

ఎవరింట్లో అయితే పితృశాపం ఉంటుందో, ఎవరింట్లో అయితే పెద్దల కార్యాలను సరిగ్గా చేసి ఉండరో, ఎవరింట్లో అయితే అకాల మరణాలు ఎక్కువుగా సంభవిస్తూ ఉంటాయో, ఎవరింట్లో అయితే పెద్దల కలలోకి వస్తుంటారో, ఎవరింట్లో అయితే దెయ్యం, భూతం, పిశాచాల సమస్యలు ఉంటాయో అటువంటివారు దేవునికి నువ్వుల అన్నం లేదా నువ్వుల పొడితో చిత్రఅన్నాన్నీ నైవేద్యంగా ఉంచి ప్రసాదంగా పంచాలి అలా చేస్తే వంశంలో, ఇంట్లో ఉన్న పితృ దేవతలా శాపాలు తొలగిపోతాయి. దేన్నీ చేసి మహాలయ అమావాస్య రోజు పెద్దల కార్యాలను చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
*******************

సేవాభారతి

నమస్తే కరోనా సేవ కై సేవాభారతి టోల్ ఫ్రీ నంబర్ 04048210101
కరోనా సోకిన వ్యక్తి కి కానీ వారి కుటుంబ సభ్యుల కు కానీ పైన తెలిపిన టోల్ ఫ్రీ నంబరు కు phone చేస్తే సేవా భారతీ వారు వివరాలు నమోదు చేసుకొని 5000 రూపాయల విలువ చేసే kit ను ఉచితంగా అందిస్తున్నారు. అందులో Pulse Oxy meter, Thermo meter, ఆవిరి capsules, Vitamin tablets,. Paracetamol tablets, మాస్క్ లు మరియు గొంతు gargling చేయడానికి ఒక liquid కూడా ఉంది. దయచేసి ఈ విలువైన మెసేజ్ ని ఎవరైనా నిరుపేదలకు వైరస్ సోకి ఉంటే వారికి kit ni అందజేసే ప్రయత్నం చేయండి
**************

నాకు నచ్చిన పోస్టు


ఈ బ్లాగు చూస్తున్న మిత్రువులకు నమస్కారాలు.
దేశ విదేశాలనుండి ఎంతోమంది ఈ బ్లాగు చుస్తున్నందుకు ఈ బ్లాగరుకు చాలా సంతోషంగా వుంది. దయచేసి మీకు ఈ బ్లాగు నచ్చితే మీరు ఈ మైలుద్వారా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదే విధంగా ఫాలోవరు కండి అప్పుడు ఈ బ్లాగు నిర్వహణకు చాలా శక్తిని చేకూర్చినవారు అవుతారు. ఇంకా మీకు ఏదైనా పోస్ట్ నచ్చితే మీ కామెంట్ పెట్టగలరు. లేక ఈ బ్లాగు నిర్వహణలో ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని  మీరు అనుకుంటే ఆ విషయం కూడా పెట్టగలరు.
మీరు ఏమైనా మంచి విషయాలు ఈ బ్లాగు ద్వారా ప్రపంచానికి తెలియ చేయాలని అనుకుంటే మీరు వ్రాసిన రచనలు, లేక ఏమైనా గొప్ప విషయాలు, కేవలం సాహిత్యపరమైనవే కాకుండా, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, హిందూ ధర్మ పరమైనవి లేక ఆధునిక సైన్సుకి సంబందించిన విషయాలు కూడా మీరు ఇక్కడ వ్రాయవచ్చు. 

సర్వ జనులకు విజ్ఞానదాయకమైన విషయాలను స్వాగతిస్తున్నాము. మీరు తెలుగులోనే మీ రచనలను పంపాల్సిన అవసరం లేదు, హిందీ, ఇంగ్లీష్ బాషలలో కూడా మీరు వ్రాయవచ్చు. అటువంటి వాటిని గూగులు అనువాదంతో అనువదించి ఆ అనువాదాన్ని కూడా క్రింద ఉంచబడుతుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇస్కాన్ వారు హరే రామ హరే కృష్ణ ఉద్యమంతో ప్రపంచ వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని, హిందూ సంప్రదాయాలను విశ్వవ్యాప్తి చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాల విషయాలను కూడా స్వాగతిస్తున్నాము.

ఇప్పుడు ప్రపంచం శాస్త్రీయంగా ఎన్నో కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు. కంప్యూటర్ టెక్నలాజి, ఇంకా ఇతర టెక్నాలజీలు అనేక రకాలుగా అభివృధి చెందుతున్నాయి. అలంటి కొత్త విషయాలు కూడా ఇక్కడ వ్రాయవచ్చు.

మీ స్పందనలను మేము ఆహ్వానిస్తున్నాము. 
ఇంకా మీరు ఏమైనా మీ వ్యాపారానికి సంబందించిన ప్రకటనలు చేయదలిచిన ఇక్కడ కామెంటు రూపంలో సంప్రదించవచ్చు, మీ వాట్సాప్ నెంబర్, మీ ఇమెయిల్ ఇవ్వటం మరవద్దు. అటువంటి కామెంట్లు ఈ బ్లాగులో కనపడవు. కేవలం బ్లాగు నిర్వాహకులకు మాత్రమే చేరుతాయి. తరువాత మీరు బ్లాగులో ఎరకమైన ప్రకటన ఇవ్వదలిచారో నిర్వాహకులతో సంప్రదించి ఇవ్వవచ్చు. 
*********************

శ్రీవారి ధ్వజస్తంభం

*తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న  కథ మీకు తెలుసా...?*
*కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!*

*డ్రైవర్ రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.*
*వందల కంఠాలు "గోవిందా! గోవిందా!" అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ చేరుకుంది*

*డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.*  *కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి... చుట్టూ చూశాడు. వేలాది యువతులు*
*హారతులిచ్చి, గోవిందా.. గోవిందా.. అంటూ తన్మయులైనారు*

*అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డి గారికి, ఎక్జిక్యూటివ్*  *ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి*
*నమస్కరించి  "ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు, ఏడు ఎనిమిది* *క్లిష్ఠమైన మలుపులున్నాయి.*
*ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం. ఎట్టి పరిస్థితుల్లోనూ*  *ట్రక్కును ఆపకుండా కొండ*
*మీదకు తీసుకుపోతాను.* *మధ్యలో పిట్టగోడలు దెబ్బతినొచ్చు,అంచులు తగిలి* *బండరాళ్లు దొర్లిపడవచ్చు, మీరు హామీ ఇస్తే పైకి చేర్చి*
*తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో పైకి చేర్చే బాధ్యత* *నీది. మిగిలిన బాధ్యతలు మావి*
*అని అభయం ఇచ్చారు*

*వాహనాల రాకపోకలను, పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు బయలుదేరింది.వెనుకే* *వాహనాల్లో అందరూ*
*బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే*
*మానులు తగిలి, బండలు* *ఊడిపడ్డాయి. పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో*  *పడిపోతుందేమో అని వెనుక వారికి భీతి కలిగేది.* *ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ* *సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..*
*సూర్యాస్తమయం లోగా*
*ట్రాలీ తిరుమల చేరిపోయింది"*

*వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో*
*గోవిందా..గోవిందా..*
*నామస్మణతో తిరుమల కొండ* *ప్రతిధ్వనించింది!*

*☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం దండేలీ అడవుల్లోపుట్టి* *300 ఏళ్ల వయసున్న*
*ఈ 6 టేకుమానులు స్వామి* *వద్దకు క్షేమంగా చేరుకున్నాయి*

*🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?*

*నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.*

*తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు*
*తాపడానికి పాలిష్ చేయడం.*
*నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన ఐ.ఏ.ఎస్ అధికారి* *పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు*
*ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు. ఈ పనులన్నీ ప్రసాద్* *గారు చిత్తశుద్ధితో చేసేవారు!*
*అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య! ఇలా*  *ధ్వజస్తంభం చుట్టూ* *వున్న నాలుగు వరుసల*
*గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే* *సమయంలో అసలు విషయం బయటపడింది*. *ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే*
*ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో*
*ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? మరి ఏ* *ఆధారంతో ధ్వజస్తంభం నిలిచి ఉంది? కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. రేపో మాపో అది* *కూలిపోవచ్చు!*
*మరి ఇప్పుడేం చేయాలి? ఏం* *చేయాలి?వేరే వారైతే దాన్ని* *తాత్కాలికంగా ఏదో*
*చేసేయ్యండి. 75 అడుగుల* *టేకుమానులు బజారులో* *దొరకవు అని సర్దుబాటు* *చేసేవారు! కానీ ఇక్కడ* *ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే* *ప్రసాద్! స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.*
*స్వామివారికి, ఆయన* *భక్తులకు ఏ చిన్న లోపం*
*జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు*
*అందుకే "ధ్వజస్తంభాన్ని* *పునర్మిద్దాం"*
*అని ప్రకటించారు......*
*ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!*

*🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.!*

*ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,*
*కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న ఒకే మాను* *కావాలి. వందేళ్లకు పైగా మన్నిక*
*కల్గిన టేకు చెట్టు అయివుండాలి*

*ఎక్కడ? ఎక్కడ?*

*ఈ లక్షణాలున్న చెట్లు* *దొరుకుతాయి?*
*పాత మాను గురించి* *తెలుసుకుంటే దొరుకుతుంది అని 190 సంవత్సరాల*
*రికార్డులన్నీ పరిశీలిస్తే..*
*ఎక్కడా ఈ ధ్వజస్తంభం* *ప్రస్తావన లేదు. మరో వేపు* *నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి నియామకాల గడువు* *పూర్తి కానున్న తరుణం.*
*ఈ కొద్ది రోజుల్లో మనం*
*ఇది చేయగలమా????ప్రశ్నలు???*

🍀  *ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన*
*ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు*
*ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు* *రేడియోలో విన్నాను. అటువంటి మానులు కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి.*
*మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను! వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను* *పరిశీలించి, అందులో నిర్ణీత ప్రమాణాలకు* *అనుకూలంగా*
*ఆరు చెట్లను ఎంపిక* *చేశారు.అదే వారంలో*
*కర్ణాటక ముఖ్యమంత్రి* *గుండూరావు గారు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి వచ్చారు..ఆయన* *ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.* *ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.* *ధ్వజస్థంభానికి ఒక్కమాను* *సరిపోతుంది. అయినా*
*ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ* *తీసుకున్నారు.* *సమస్య అక్కడితో అయిపోలేదు*
*దట్టమైన అడవిలో, కొండ* *వాలులో ఉన్న వీటిని*
*మొదటికంటా తీయించి 8* *కిలోమీటర్ల కిందికి తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు* *నిర్మించే బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..* *సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం మాకు ప్రసాదించండి అని..దుంగల్ని క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ* *చేర్చారు"*

*ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు*
*లేకుండా తిరుమల చేరుకుంది!*
*1982 జూన్ 10వ తేదీన*
*ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!*

*🍁ఉత్సవం చివరన నాగిరెడ్డి గారు ట్రైలర్ యజమానికి 70 వేల రూపాయల చెక్కును* *అందించారు! యజమాని..*
*"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు  ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!"*
*అని దానిని తిరస్కరించారు!*

*డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.*
*స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్,*
*ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను*
*సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!అది విప్పి* *చూసిన వెంకట్రామయ్య కళ్ళలో కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు* *చూస్తున్న తన ప్రమోషన్* *ఆర్డర్ అది! ఇలా..స్వామివారి*
*సన్నిధిలో.. ఎందరికి* *ప్రాప్తం?..అనుకుంటూ..*
*ఆయన రెండు చేతులూ జోడించి ఆనందడోలికల్లో మునిగిపోయారు!*

*🙏🏽💐ఓం నమో వెంకటేశాయ* 💐🙏🏽

*సుధాశశి కుమారి*
*మాచవరం*

*భక్తి శ్రద్ధలతో చదివేవారు ఇంకా కొంతమందితో పంచుకోండి*
**************************

వేదాలు! వేదాలు!

వేదాలు! వేదాలు! వేదాలు! వేదాలు! ఈ మాట చాలా చిన్నతనం నించీ అప్పుడప్పుడూ వింటూ వున్నదే. ఈ చెవితో విని, ఆ చెవితో వదిలేస్తున్నదే. వేదాల్ని ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం దేవుళ్ళే స్వయంగా చెప్పారనీ, అది సంస్కృత భూయిష్టం అయిన ప్రాచీన సాహిత్యం అనీ, దాన్ని అర్ధం చేసుకోవడం మహా భక్తులైన పండితులకు కూడా చాలా కష్టం అనీ, అదనీ - ఇదనీ, ఇక్కడా అక్కడా చిట్టి పోట్టి వార్తలు చదివి, ''వేదం'' అన్న పేరు చెవిన పడగానే జడుసుకుంటూ వున్నదే.

వేద నిర్వచనము

హిందూమతంలో అత్యంత మౌలికమైన ప్రమాణంగా వేదాలను గుర్తిస్తారు. వేదములను శ్రుతులు (వినబడినవి) అనీ, ఆమ్నాయములు అనీ అంటారు. "విద్" అనే ధాతువుకు "తెలియుట" అన్న అర్ధాన్నిబట్టి వేదములు భగవంతునిద్వారా "తెలుపబడినవి" అనీ, అవి ఏ మానవులచేతనూ రచింపబడలేదు అనీ విశ్వాసము. కనుకనే వేదాలను అపౌరుషేయములు అని కూడా అంటారు. వేదములను తెలిసికొన్న ఋషులను ద్రష్టలు అని అంటారు. ద్రష్ట అంటే దర్శించినవాడు అని అర్ధం. హిందూ శాస్త్రాల ప్రకారం వేదాలను ఋషులు భగవంతుని నుండి విని గానం చేశారు. అందుకే వీటిని శ్రుతులు అని కూడా అంటారు.

ఏనం విందంతి వేదేన తస్మాద్వేదస్య వేదతా,, (ఇష్టప్రాప్తి, అనిష్టపరిహారం ) కావల్సిన వాటిని తీర్చి అక్కర్లేని వాటిని రాకూండా చేసే ఆధ్యాత్మిక ఉపాయమే వేదం.
భద్రమరాజు శ్రీనివాసరావు
**************

అతనికే మోక్షం ఎందుకు?

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని. ‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.
‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు. వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.
స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోకుండా ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
*******************

పి తృ దో షం !

పితృ దోషము నుండి బయటపడే సులువైన పరిష్కారం "
పితృ దోషం' ...
మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి మనం ఎలాగ హక్కు అర్హత పొందుతామో ...
అలాగే...
తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి.
మన పెద్దలు పుణ్యాలు మంచిపనులు చేస్తూ ఉంటే వారి వంశం సుఖ సంతోషాలతో ఉంటుంది.
అలాగే అదే పూర్వికులు పాపాలు గనుక చేసి ఉంటే అది తెలుసు కావచ్చు తెలియక కావచ్చు ఏదైనా గాని వారు చేసిన పాప కర్మలు ఆ వంశపారంపర్యంగా ఆ కుటుంబంలోని వారు అనుభవించక తప్పదు -
 మేము తెలిసి తెలియక ఏ తప్పు చేయలేదు కానీ బాధలను కర్మలను అనుభవిస్తున్నాను అనే బాధ పడేవారు ముఖ్యంగా తెలుసుకోవలసినది ముఖ్యమైనది ఒక్కటే.
అదే
" పితృ దోషం "
ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయం.
అందుకే ఈ పోస్టు పెడుతున్నాను.
పితృ దోషం ఉన్నవారు ఈ జన్మలో వారు ఏ పాప కర్మలను చేయకపోయినా కుటుంబం ఇబ్బందులపాలు అవుతూ కష్టాలకు లోనవుతూ ఉంటుంది.
ఎందుకంటే మన పెద్దలు చేసిన పాప ఫలాలు.
వారి ఆస్తులను పంచుకున్నప్పుడు వారి పాపాలను కూడా కచ్చితంగా పంచుకొని తీరవలసిందే.
పితృదోష వలన కలిగే దుష్పరిణామాలు కొన్ని చర్చించుకుందాము...
చిన్న వారు అకాలమరణం పొందడం
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం.
అప్పులపాలు అవ్వడం లేనిపోని అపనిందల పాలు అవ్వడం మన ప్రమేయం లేకుండా
ప్రమాదాలకు గురయ్యే జీవితాంతం కర్మలను అనుభవించడం
మన కళ్ళ ముందు మన పిల్లలు చెడు వ్యసనాలకు బానిస అయ్యి కీర్తి ప్రతిష్టలకు భంగం కలిగించడం
ఇలా వీటన్నిటికీ కారణం పితృ దోషం కారణం
దీని నుండి విముక్తి పొందడానికి ఏకైక పరిష్కారం.
స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకోవడమే ...
అయితే ఈ స్మశాన నారాయణుడి ఆలయాలు ఈ భారతదేశంలో రెండే రెండు ఉన్నాయి.
1. కాశీ
2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది.
విచిత్రం ఏమిటంటే ఈ స్మశాన నారాయణ ఆలయం అలంపురంలో ఉన్నదన్న విషయం ఎవరికీ తెలియదు .
అయితే ఈ స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని మన బాధల నుండి విముక్తి పొందాలంటే ఏమి చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం -
స్మశాన నారాయణుని ప్రసన్నం చేసుకోవాలంటే....
పాలు అన్నముతో చేసిన పాయసం,
అన్నము, ముద్దపప్పు, నేయి,
వడ ఇవి నైవేద్యంగా పెట్టాలి ! ఈ విధంగా స్మశాన నారాయణుడికి నైవేద్యం పెడతారో ఆ ప్రసాదాన్ని వారి ఇంటి పేరు గల వంశస్థులు మాత్రమే దానిని  స్వీకరించాలి. ఇతరులకు ఇవ్వరాదు .
స్వామికి తెల్లటి కండువా అలంకరించాలి.
ఈ వంటలను స్వయంగా వండుకొని తీసుకొని వెళ్ళి నివేదన చేయాలి లేదా ( వెళ్ళడానికి వీలు లేనివారు ఖర్చులను ఇచ్చి అక్కడి పూజారి చే చేయించ వచ్చును )
అలంపురం తెల్లవారుజామునే వెళ్లి తుంగభద్రా నదీ స్నానం చేసి అమ్మవారిని అయ్యవార్ల ను దర్శనం చేసుకున్న తరువాత ఈ  స్మశాన నారాయణుడిని సేవించుకొని ఇంక వేరే చోటకి వెళ్లకుండా ఇంటికి చేరుకోవాలి.
ఈ ఆలయ ప్రాముఖ్యము మా గురువు గారు అయిన తంత్ర గురు "భరణి స్వామి " ద్వారా తెలుసుకోవడం జరిగింది ' ఈ అలంపుర స్మశాన నారాయణుడి దాని ప్రాముఖ్యము కేరళ తంత్ర శాస్త్రంలో లిఖించబడి ఉన్నదట !
ఎంతోమంది పితృదోషం తో బాధపడే వారు ఉన్నారు . అలాంటివారికి ఈ విషయం ఉపయోగపడుతుందని గ్రూపులో పెట్టడం జరిగింది !
చేరుకొనే విధానం :
అలంపూర్ "హరిత హోటల్ " కు ప్రక్కన ఒక చిన్న దారి ఉంటుంది . ఆ చిన్న దారి ఎడమవైపున 1.2 కిలోమీటర్ల దూరంలో పాపనాశేశ్వర ఆలయ సముదాయం ఉంటుంది . ఆలయ సముదాయంలో ఒక ప్రత్యేక ఆలయం "స్మశాన నారాయణుని ఆలయం "
ఇంకొక ముఖ్య విషయం : స్మశాన నారాయణుడి ఆలయ సమూహాలలో ప్రధాన దైవం శ్రీ పాపనాశిశ్వరుడు ' 7వ శతాబ్దం నాటి అతి పురాతన ' అతిపెద్ద మరకత లింగం ' దక్షిణ కాశి అంటారు . ఈ స్వామిని దర్శించుకున్న నంతనే పాపాలు నాశనం అవుతాయని ప్రతీతి !
ఈ ఆలయ విశేషాల గురించి ' స్మశాన నారాయణుడి పూజ గురించి సంప్రదించవలసిన ఆలయ పూజారి నంబర్లు :
9182883807,
7995464344.

పదిమందికి ఉపయోగపడే విషయం .
సర్వేజనా సుఖినోభవంతు
శ్రీ గురుభ్యోన్నమః
***************

శ్రీవీరేశ్వర స్వామి ఆలయం

#భద్రకాళి సమేత #శ్రీవీరేశ్వర స్వామి ఆలయం మురమళ్ళ.*



 #వివాహం కాని వారికి వివాహమవుతుంది.
స్వామి ని దర్శించి స్వామి వారికి  కళ్యాణం జరిపించు కుంటే వారికి కళ్యాణం జరుగుతుంది దర్శించండి తరించండి

#శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయము.

త్వరిత వివాహ కోరిక తో ఎంతోమంది ఇక్కడ స్వామి వారి కల్యాణం చేయించుకుంటారు.

ఎంతోమందికి వివాహాలు జరిగినవి.

ఐ.పోలవరం మండలానికి చెందిన మురమళ్ళ గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం జిల్లాలోని ఒక చారిత్రక ప్రదేశం.స్వామి వారు నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంన్నారు ఇక్కడ కళ్యాణానికి ఒక ప్రత్యేకత ఉంది వివాహ సాంప్రదాయం వైదిక స్మార్తాగమం ప్రకారం పురోహితులు నిత్యకళ్యాణం జరిపిస్తారు .

దీనితొపాటు ఆలయ అర్చకులు యక్షగానం పాడటం మరోవిశేషం . ఇక్కడ స్వామి వారికి రోజువారీ నిత్యకల్యాణం నిర్వహిస్తారు. ప్రతిరోజు దాదాపు వందల మంది యాత్రికులు వారి పూజలు నిర్వహించడానికి ఈ ఆలయాన్ని సందర్శిస్తున్నారు.

ప్రతి రోజు  స్వామి వారి కల్యాణములు చేయబడుతాయి.

#స్థల పురాణం.

దక్షయజ్ఞము అనంతరము వీరభద్రుడు శ్రీ
మహావిష్ణువు కోరికపై దక్షునకు మేక తలను తగిలించి దక్షుని పునర్జీవుని గావించి ఆయనచే వేదోక్తముగా దక్ష యజ్ఞమును పూర్తి గావించెను.

కాని సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి అవుటచే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించిననూ ఎంతకునూ శాంతించపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన శోడష కళలలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుని శాంతింప చేసేందుకు పంపించెను.

భద్రకాళి ఎంత ప్రయత్నించిననూ వీరభద్రుని క్రోధము చల్లారకుండుటచే 'అశ్శరభ శరభ' అనుచూ ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళీ రూపమునుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించెను.

అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికీ గాంధర్వ పద్ధతిన
మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి. అప్పటి నుండి ప్రతి సంవత్సరం అదేరీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది.
ఆలయ నిర్మాణము
ఈ కథాగమనము జరిగిన పిమ్మట ఆ పరంపరలో పూర్వదేవాలయము ఏర్పడినది.

మురమళ్ళ, అమలాపురం నుండి 25 కి.మీ., కాకినాడ నుండి 38 కి.మీ., (వయా యానాం), రాజమహేంద్రవరం నుండి 105 కి.మీ. (రావులపాలెం ద్వారా) దూరంలో ఉంది.
******************

*హారేరామ హారేరామ రామారామ హరేహరే.....*



*భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది. నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.*

*శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు.*

 *శుకమహర్షి లాంటి విజ్ఞాన ఘని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి.*

*పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట. ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి.*
*పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.*

*ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.*

*భజనలు నాలుగు విధాలు...*
**************

*JOKE OF THE CENTURY*

*A grandson, notice his grandpa look rather tense so to break the ice, he asks his grandpa one question while on the way back from school....*

What is the difference between 'Wife' and 'Girlfriend?'

Grandpa thought for a minute and Simplified the explanation like this ;

Listen Son ,

*Wife* is like a *TV* and *Girlfriend* is like a *MOBILE.*

At home  you *watch* TV,
but when you go out you *take* your MOBILE.

Sometimes you *enjoy* TV, but most of the time, you *play* with your MOBILE.

TV is (as good as) *free* for life, but for the MOBILE, if you don't *pay,* the services will be *terminated.*

TV is *big, bulky* and most of the time *old,*
But the MOBILE is *cute, slim, curvy, replaceable* and *portable.*

Operational costs for TV is often *acceptable*
but for the MOBILE, it is often *high* and *demanding.*

TV has a *remote*
but MOBILE *doesn't.*

Most importantly, MOBILE is a *two-way communication* (you talk and listen), but with the TV, you *MUST only listen* (whether you want to or not)!😝

Last but not least!
Yet TVs are superior because TVs don't have *viruses,* but MOBILES often *do*😂

And mobiles can be easily *hacked* or *stolen.*

*Take Care*
*Stick to TV only*
Issued in Public interest!
********************

*All Vedas and Slokas in all languages


*All Vedas and Slokas in all languages in one link. Please save this for your permanent reference.*

         

https://vignanam.org/mobile/

*పురాతనమైన ద్వారకాతిరుమల*

*శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిజరూప దర్శనం*

*స్థలపురాణం*

కృష్ణా గోదావరీ నదుల మధ్య ప్రదేశాన్ని విదర్భ దేశమంటారని పురాణాల వలన తెలుస్తోంది. ఖండేరాయుని కైకలూరు శిలాశాసనం వలన కూడ ఈ విషయం స్పష్టమౌతోంది. విశేషంగా దర్భలు లభించే ప్రదేశం కాబట్టి దీన్ని విదర్భ అని పిలిచేవారని కొన్ని గ్రంధాలు వ్రాస్తున్నాయి. ఈ ప్రాంతానికే తరువాత కాలంలో వెలనాడు, వేగినాడు అనే పేర్లు స్థిరపడ్డాయి.

*ఆలయ తూర్పు గాలిగోపురం*

త్రేతాయుగం లో ఆది శేషుడు శ్రీ హరి హరులను గూర్చి ఇంద్రకీలాద్రి కి పట్టిసాద్రి కి మధ్యభాగ మైన ఈ ప్రదేశం లో ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సు కు మెచ్చి హరి హరులు ప్రత్యక్ష మయ్యారు. ఏం కావాలో కోరుకొమ్మన్నారు శివకేశవులు. తన శిరసుపైనుండేలా వారిరువురిని అర్థించాడు శేషుడు. అనుగ్రహించారు హరిహరులు. శేషుడు పర్వతాకారాన్ని ధరించాడు. రమణీయమైన ఆ శేషాచలం మీద ఓ పెద్ద కుంకుడు చెట్టు మొలిచింది. దాని తొర్రలో శేషుడు తన అంశతో నివసించసాగాడు . అతన్ని అనుగ్రహించడానికి భక్తజన పరాధీనుడైన శ్రీ హరి శ్రీ వేంకటేశ్వరుడై ఒక పుట్టలో నివాసమేర్పరుచుకున్నాడు. శ్రీ మల్లిఖార్జునుడై శంకరుడు పర్వతాగ్రాన కొలువుతీరాడు. ఆ శైష శైల మే ఈనాడు శేషాద్రి గా, శేషాచలం గా, శేషశైలం గా, అనంతగిరి గా అనేక నామాల తో కీర్తింబడుతోంది.

*ద్వారక మహర్షి*

ద్వారకుడనే మహర్షి ఈ పవిత్ర ప్రదేశం లో దీర్ఘకాలం తపస్సు చేశాడు. ఈయన ధర్మపత్ని సునంద. ఈ దంపతులు శ్రీ వేంకటేశ్వరుని పాదసేవకే అంకితమై, నిరంతర గోవింద నామ స్మరణ తో వేంకటేశ్వరుని ధ్యానించేవారు. భక్త సులభుడైన ఆ శ్రీనివాసుడు మహర్షి దంపతుల భక్తి కి ముగ్ధుడైన వారిని కటాక్షించి , ప్రత్యక్షమయి వరం కోరుకోమన్నాడు. ఎల్లప్పుడూ శ్రీవారి పాదాలను సేవించుకొనే మహద్భాగ్యాన్ని కల్గించమని ద్వారక మహర్షి ప్రార్ధించాడు. అనుగ్రహించాడు శ్రీ లక్ష్మీనాథుడు. సమీపమందలి వల్మీకం లో శ్రీ స్వామి విగ్రహాన్ని దర్శించి. ఆశ్రయించి. సేవించి , తరించాడు ద్వారకమహర్షి. ఈ దివ్యక్షేత్రం లో శ్రీ స్వామి వారి పాదాలు వల్మీకము లోనుండి ద్వారక మహర్షిచే పూజించబడుచుండుట వలన భక్తులకు శ్రీ స్వామి వారి దివ్యరూపము నాభి వరకు మాత్రమే దర్శనీయ మగుచుండును. ఇట్లు ద్వారకమహర్షి వలన స్వయం వ్యక్తుడై శ్రీ శ్రీనివాసప్రభువు వెలసిన ఈ క్షేత్రము ద్వారకా తిరుమల గా , చిన్న తిరుపతిగా , ప్రసిద్దికెక్కింది.

ఇది ద్వారకాతిరుమల శ్రీనివాసుని ప్రపత్తి శ్లోకం. ఈ క్షేత్రమునందు స్వయంవ్యక్త మూర్తి ని సేవించడం వలన మోక్షాన్ని,ప్రతిష్టిత మూర్తిని సేవించడం వలన ధర్మ,అర్థ, కామాలను సాధించవచ్చని విజ్ఞుల చెపుతున్నారు.

గాలిగోపురం లోపలి గోడపై కన్పించే ఒక కుడ్యచిత్రం
క్షేత్ర ప్రత్యేకత :

ఇచ్చట స్వామిని సేవించు కొను భక్తులకు స్వామివారి పాదసేవ దుర్లభ మగుట వలన సర్వాంగ పరిపూర్ణుడగు శ్రీ శ్రీనివాసుని మంగళ రూపాన్ని మహర్షులు వైఖానసాగమానుసారంగా స్వయంవ్యక్తమగు ధృవమూర్తికి వెనుక భాగాన ప్రతిష్ఠించారు. ఇట్లు ఒకే విమానము క్రింద ఇద్దరు ధృవమూర్తులుండుట ఈ క్షేత్రప్రత్యేకత గా చెప్పబడుచున్నది. అంతేకాకుండా ఈ క్షేత్రము లో స్వామి దక్షిణాభిముఖులై యుండుట మరొక ప్రత్యేకత. ఈ ఆలయమునందు ఇద్దరు ధృవమూర్తులుండుటచే ఏడాదికి రెండు సార్లు తిరుక్కళ్యాణ మహోత్సవములు జరుగుట కూడ ఒక ప్రత్యేకత గా నే చెప్పవచ్చును. స్వయంవ్యక్తమూర్తి కి వైశాఖ మాసం లోను, ప్రతిష్ఠంచబడిన స్వామికి ఆశ్వయుజ మాసం లోను కళ్యాణమహోత్సవాలు నిర్వహించబడుతున్నాయి..
వాగ్గేయకారుడు అన్నమయ్య విగ్రహం
ద్వారకా తిరుమల క్షేత్రకథ శ్రీ బ్రహ్మ పురాణం లో ప్రస్తావించబడింది. త్రేతాయుగం లో శ్రీరామచంద్రుని పితామహుడైన (తాతగారు ) అజమహారాజు ఆయన ధర్మపత్ని ఇందుమతీదేవి కలసి ద్వారకా తిరుమల లోని శ్రీ పద్మావతీ శ్రీనివాసులను వధూవరులుగా అలంకరించి, కళ్యాణ వేడుకలు జరిపించినట్లు శ్రీ బ్రహ్మపురాణం లో విపులంగా వర్ణించబడింది. అంతేకాదు . శ్రీరాముని తండ్రియైన దశరథమహారాజు, స్వయం గా శ్రీరామచంద్రుడు కూడ శ్రీ స్వామి వారిని సేవించుకొనినట్లు పురాణాల వల్ల తెలుస్తోంది.

దేవేరులతో శ్రీనివాసుని కళ్యాణ మూర్తి

ఈ దేవాలయానికి ఉత్తర వాహిని యై పంపానది ప్రవహిస్తోంది. దాన్నే నేడు ఎర్రకాలువ అని పిలుస్తున్నారు.
ఆలయ దర్శనం.:::----- స్వామి వారి సన్నిధికి కుడివైపున ఉపాలయాల్లో అలివేలు మంగతాయారు. ఆండాళ్ అమ్మవార్లు దర్శనమిస్తారు. అంటే ఈ రెండు ఆలయాలు తూర్పు ముఖం గా ఉంటాయి. ధ్వజ స్థంభం వద్ద స్వామివారికి అబిముఖం గా భక్తాంజనేయ, గరుడాళ్వార్లు కొలువు తీరి ఉన్నారు.

శ్రీ స్వామి వారి దివ్యరూపం
ఆలయము చుట్టు పన్నిద్దరాళ్వారులు వేరువేరు ఆలయాల లో వేంచేసియున్నారు. ఆలయ ప్రాకారము లోపల నాలుగు మూలలా నాలుగు మండపాలు మనకు కన్పిస్తాయి. వీటిని మూలమండపాలు అని పిలుస్తారు.

అమ్మవారి దివ్య మంగళ విగ్రహం

ఈ మండపాలలో శ్రీ స్వామి వారి నిత్యోత్సవ, వారోత్సవ ,పక్షోత్సవ, మాసోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈశాన్య దిశలో ఉన్న మండపం లో పౌర్ణమి, అమావాస్య, సంక్రమణ సమయాల్లో స్వామివారు కొలువు తీరుతారు.అలాగే మిగిలిన మూడుమండపాల్లో శుక్రవారం సేవ నైరుతిదిశలో ఉన్న శుక్రవారం మండపం లోను, శనివారపు ఉత్సవము ఆగ్నేయ మండపం లోను, శ్రవణానక్షత్రం, ఏకాదశి, పునర్వసు సేవలువాయవ్య మండ పం లోను నిర్వహించబడతాయి.

అమ్మవారి ఆలయం ప్రక్కనే కన్పించే రజిత తాపిత కుడ్యశిల్పం
ఆలయ ప్రాకారానికి నాలుగువైపులా నాలుగు ఎత్తైన గాలి గోపురాలు రాజఠీవితో నిలిచి, స్వామివారి కీర్తిని దిగంతాలకు చాటుతూ, స్వామి ని సేవించుకోవడానికి వచ్చే దేవతాగణాన్ని సాభిమానంగా ఆహ్వానిస్తున్నట్లు కన్పిస్తాయి. వీనిలో దక్షిణ వైపు గాలిగోపురం ఐదు అంతస్తులతో అతి పెద్దదిగా కన్పిస్తుంది. ప్రతి గాలి గోపురం మీద తీర్చిదిద్దబడిన పురాణ గాథలను గుర్తుకు తెచ్చే వివిధ దేవతా శిల్పాలు అందంగా కొలువు తీరి చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి.

ఈశాన్య మండపం

శ్రీ పాదుకా మండపం

ఆలయం తొలిమెట్టు వద్ద పాదుకా మండపము భక్తులకు దర్శనమిస్తుంది. ఇచ్చట భక్తులు స్వామి వారి పాద పద్మాలను కనులార దర్శించి, స్పృశించి , సేవించుకొని భక్తి పరవశులౌతారు. పాదుకామండపానికి దక్షిణంగా కళ్యాణ మండపం కన్పిస్తుంది.

పాదుకా మండపం లో శ్రీవారి దివ్యపాదాలు

ఇవి కాక గ్రామం లోపల విలాసమండపం, క్షీరాబ్ధిమండపం, ఉగాది మండపం, దసరామండపం, సంక్రాంతి మండపాలు ఉన్నాయి. ఆయా పర్వదినములలో స్వామి తిరువీధి సేవ జరిగినప్పుడు ఆయామండపములపై స్వామి వారి ని వేంచేపు చేసి, అర్చన ,ఆరగింపు , ప్రసాద వినియోగము చేస్తారు.

సుదర్శన పుష్కరిణి

దీనినే నరసింహ సాగరమని కూడ పిలుస్తారు. ఇది గ్రామానికి పశ్చిమం గా ఉంది. ఇందలి పాషాణములపై సుదర్శన చిహ్నములుండుటచే దీనిని సుదర్శనపుష్కరిణి అని పిలుస్తున్నారు. పూర్వము దీని లోని నీటినే స్వామిపూజకు వినియోగించేవారు. ఈ పుష్కరిణి మధ్య లో 1999 వ సంవత్సరం లో ఒక మండపము నిర్మించబడినది. ఈ పుష్కరిణి యందు ఫ్రతి సం.రము క్షీరాబ్ధి ద్వాదశి ( కార్తీక శుద్ద ద్వాదశి ) నాడు శ్రీ స్వామి వారికి తెప్పోత్సవము కనుల పండువుగా నిర్వహించబడుతుంది.

ఆలయ ప్రవేశం వద్ద ధ్వజ స్థంభము

నారాయణ వనము

శ్రీ స్వామి వారి ఆలయమునకు వెనుక నొక అందమైన పూలతోట ఉంది. దీనినే నారాయణ వనమని పిలుస్తారు. ప్రతిరోజు స్వామివారి పూజకు కావలసిన పుష్పాలు, తులసి దళాలు ఈ వనము నుండే వినియోగించబడుతున్నాయి.

శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయ ప్రవేశ ద్వారము
క్షేత్రపాలకుడు

శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామివారు ఈ ద్వారకా తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడు. ఈఆలయానికి ఎగువన వాయవ్య దిశ లో ఉంది.ఆది శేషుని ప్రార్ధనను మన్నించి ,శంకరుడు ఫణాగ్రాన కొలువు తీరాడు.
శ్రీమల్లేశ్వర స్వామి వారు
ఈ ఆలయములో శ్రీ మల్లేశ్వర స్వామి వారి తో పాటు శ్రీ గణపతి, శ్రీ భ్రమరాంబాదేవి వారి ఉపాలయాలను, నవగ్రహ మండపమును కూడ మనం దర్శించవచ్చు. శ్రీమల్లేశ్వర స్వామి వారికి ప్రతి నెల మాసశివరాత్రికి ఏకాదశ రుద్రాభిషేకాలు, ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ స్వామి వారి కళ్యాణోత్సవము జరిపించడుతోంది. ఇక్కడ కూడ శివోద్యానము అనే సుందర ఉద్యాన వనాన్ని మనం చూడవచ్చు.

శ్రీ భ్రమరాంబికా దేవి చారిత్రక ప్రాథాన్యం

ఆంధ్ర శాతవాహన బ్రాహ్మణులు క్రీ.పూ 3 వశతాబ్దం నుండి సుమారు 465 సంవత్సరాలు తిరుమలేశుని అర్చించినట్లు, అనంతరం ఇక్ష్వాకులు, బృహల్పలాయనులనుండి రెడ్డిరాజులు, విజయనగర రాజుల వరకు శ్రీ స్వామిని సేవించి తరించి నట్లు పుస్తకాల్లో వ్రాస్తున్నారే తప్పితే చారిత్రకాధాలేవీ లభించడం లేదు. శ్రీ ధర్మాఅప్పారాయ బహద్దరు వారు(1762 -1827 ) ఈ ఆలయ ,గోపుర , ప్రాకార ,మండపాలను పునర్నిర్మించినట్లు చెప్పబడుతోంది.

మైలవరం జమీందారులు సూరానేని వంశీయులు” శ్రీ రాజా సురానేని శ్రీకృష్ణ రావు బహద్దూర్ జమీందారు వారు “ దేవాలయపునర్నిర్మాణ కార్యక్రమాలు చేయించినట్లుగా దక్షిణ గాలిగోపురం మీద కన్పించే శిలాశాసనం వలన మనకుతెలుస్తోంది. వీరి వంశీయులే వేయించిన మరొక శిలాఫలకం వేంచేపుమండపం గోడమీద కన్పిస్తోంది.

ఇది స్వామి వారికి భక్తులు సమర్పించే బంగారు,వెండి ఆభరణములను,వస్తువులను దేవస్థానం ఆఫీసులో సమర్పించి రసీదు పొందమని తెలియజేస్తోంది. అలాగే పసిపిల్లలు ఆలయం లో మూత్ర, పురీషములు చేయకుండా సంబంధీకులు జాగ్రత్తపడాలని, లేనిచో సంప్రోక్షణ నిమిత్తము ( ఆలయమును శుద్ధి చేయుటకు ) మూత్ర విసర్జన అపరాధ సుంకము 0.40 పై.లు గాను, తరువాత ( ? ) దానికి 0.80 పై.లు అపరాధ సుంకము వసూలు చేయబడుతుందని కూడ ఇందులో ఫర్మానా వ్రాయబడింది. ఇది ఆలయ పవిత్రతా సంరక్షణ లో ఆనాటి ధర్మకర్త ల బాధ్యతాయుత పాత్రకు మచ్చుతునక.

శ్రీ స్వామి వారి ప్రతిరూపం
గోశాల

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ పర్యవేక్షణ లో వదాన్యుల విరాళాలతో 300 పై చిలుకు గో సంపద తో గోశాల సకల వసతులతో నిర్వహించ బడుతోంది. శ్రీ స్వామి వారి ఉత్సవ సేవలో రాజలాంఛనముగా పాల్గొనుట కొరకు ఒక గజరాజును కూడ దేవస్థానము పోషించుచున్నది.

ఆలయ విహంగ వీక్షణం
అంతేకాకుండా ఆలయ ప్రత్యక్ష పర్యవేక్షణ లో ఎన్నో దేవాలయాలు ,విద్యాలయాలు నిర్వహించబడుతున్నాయి.అత్యంత ప్రసిద్ధి పొందిన వైఖానసాగమ పాఠశాల కూడ వానిలో ఒకటి.

వైఖానసాగమ పాఠశాల విద్యార్ధులు

ఆలయ సమయాలు

శ్రీ వేంకటేశ్వర ఆలయం లో ప్రాత కాలం లో 4 గం.లకు సుప్రభాత సేవతో ఆలయ కవాటాలు తెరుచుకుంటే రాత్రి 9 గం.లకు ఏకాంత సేవతో నిత్య కార్యక్రమాలు ముగుస్తాయి.మధ్యాహ్నం 1గం .లనుండి 3. గం ల వరకు దేవాలయ విరామం పాటించబడుతుంది.
ప్రత్యేక ఉత్సవాలు.

చైత్రమాసం లో ఉగాది సేవ, శ్రీరామనవమి కళ్యాణం, వైశాఖ మాసం లో స్వయం వ్యక్త మూర్తి కి తిరుక్కళ్యాణ మహోత్సవము, శ్రావణ మాసం లో పవిత్రోత్సవాలు, శ్రీకృష్ణాష్టమి వేడుకలు, ఆ శ్వయుజ మాసం లో ప్రతిష్టితస్వామి కి తిరుక్కళ్యాణోత్సవము, కార్తీక మాసం లో తెప్పోత్సవము, కృత్తికా దీపోత్సవము, మార్గశిర మాసం లో ధనస్సు,అధ్యయనోత్సవాలు, పుష్యమాసం లో గోదా కళ్యాణము, మాఘ మాసం లో రథసప్తమి తిరువీథి సేవ, ఫాల్గుణ మాసం లో డోలాపూర్ణిమ తిరువీథి సేవ శ్రీ స్వామి వారికి జరిగే ప్రత్యేక ఉత్సవాలు.

ఘాటు రోడ్డు ప్రారంభం లో దర్శనమిచ్చే గరుడాళ్వారు
రవాణా వసతి సౌకర్యాలు. శ్రీ ద్వారకా తిరుమల క్షేత్రం మద్రాసు- కలకత్తా మార్గంలో భీమడోలు నుండి 15 కి. మీ దూరం లో ఉంది. ప్రతి రోజు ఈ క్షేత్రానికి రాష్ట్రం లోని అన్నిప్రముఖ బస్ డిపోల నుండి సర్వీసులు నడపబడుతున్నాయి. ఏలూరు , తాడేపల్లిగూడేం ష్టేషన్లలో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగుతాయి. ఏలూరు నుండి 41 కి.మీ, తాడేపల్లి గూడెం నుండి 47 కి.మీ దూరం లో ద్వారకా తిరుమల ఉంది. బస చేయడానికి దేవస్థానం వారి వసతి గృహాలు (ఏ.సి/నాన్ఏ.సి) అనేకం ఉన్నాయి.
గాలిగోపురం పై కన్చించే రమణీయ శిల్పసంపద

కొండపైకి విశాలమైన ఘూటు రోడ్డు సౌకర్యం ఉంది. కొండమీదకు వెళ్లి ,రావడానికి, పరిసర దేవాలయాల సందర్శన కోసం దేవస్థానం వారి ఉచిత బస్సు సౌకర్యం కలదు. దేవస్థానం వారిచే ఆలయ ప్రాంగణం లోని అన్నదాన భవనం లో ప్రతిరోజు యాత్రికులకు ఉచిత భోజన సౌకర్యం కల్గించబడుతోంది.

“ వినా వేంకటేశం ననాథో న నాథ: సదావేంకటేశం స్మరామి స్మరామి !!”


*ఓం నమో వేంకటేశాయ*
*****************

*యధార్ధ సంఘటన*


అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.

ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో  " ఈకాలంలో కూడా  ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా  మూర్ఖులుగా మిగులుతున్నారు.  మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు. 

  పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.

ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు.  అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన  సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.

  " మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని "  ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార  ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను  పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.

 ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన  పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.

 అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది.

    " ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును.  మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. "  అని బోధించాడు. 

ఇది ఎప్పుడో జరిగిన సంఘటన  ఇప్పటికీ జరుగుతున్న ఒక వాస్తవం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో
స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి
రాకెట్ ని లాంచ్ చేసే ప్రతి సారి అక్కడ దగ్గరలో ఉన్న అమ్మవారికి,అలాగే ఏడు కొండల పైన ఉన్న శ్రీవారికి పూజలు చేసి ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది అలాగే అది విజయవంతం అయిన తర్వాత కూడా ఈ రెండు దేవాలయాల లో  ముక్కులు చెల్లించడం జరుగుతుంది.

అంత మంది శాస్త్రవేత్తలు అన్ని రోజులు కష్టపడి
రేయింబవళ్ళు శ్రమించి నిర్మించిన రాకెట్ను
ఈ ఇద్దరు దేవుళ్ళు కాపాడుతారు అన్నది
మూడ నమ్మకమా అలా అనుకుంటే అంతకంటే మూర్ఖులు మరెవరూ ఉండరు.

భక్తి అంటే బేరం పెట్టెది కాదు,
భారం తగ్గించె శక్తి అని అర్థం.

దేవుడంటే రాయి కాదు
మనోధైర్యాన్ని నింపి అద్భుతమైన  అనిర్వచనీయమైన
మహశక్తి అని అర్థం.

భక్తి నీ వ్యక్తపరిస్తే
శక్తి పెరుగుతుంది.
అవహేళన చేస్తే వినాశనమే కనబడుతుంది.

ఇప్పటి నాస్తికులు  ప్రతిదీ హేతువాదం ,  అంటూ డాంబికముగా కరాళ  నృత్యాలు చేయవచ్చును. కానీ  సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది.  దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.

కంటికి కనిపించని కరోన
పై విజ్ఞానాన్ని నమ్ముకున్న అజ్ఞానపు విదేశాలు నేర్చుకుంటున్న గుణపాఠాలు
మనందరికీ కనబడుతూనే ఉన్నాయి.

అలాగే భగవద్గీత ను నమ్మిన
భారతదేశం సాధించిన ప్రగతి సారాంశాని, ప్రపంచ దేశాలు గుర్తించి గౌరవించడం మొదలుపెట్టాయి అందుకు సంస్కారవంతమైన నమస్కారమే
ఒక పెద్ద సాక్ష్యం.

 చాలా ఇంకేమైనా కావాలా!
 *నిన్ను నమించటానికి.*

 *శ్రీమత్భగవద్గీత  సకలశాస్త్ర సారం !*
 *శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!*
*******************

His Masters Voice

'His Masters Voice' (HMV) had once published a pamphlet giving the history of gramophone record.*

*Gramophone was invented by Thomas Alva Edison in the 19th century.*

*Edison, who had invented many other gadgets like electric light and the motion picture camera, had become a legend even in his own time.*

*When he invented the gramophone record, which could record human voice for posterity, he wanted to record the voice of an eminent scholar on his first piece.*

*For that he chose Prof. Max Muller of England (a German by ethnicity), another great personality of the 19th century.*

*He wrote to Max Muller saying,*

*“I want to meet you and record your voice. When should I come?”*

*Max Muller who had great respect for Edison asked him to come on a suitable time when most of the scholars of the continent of Europe would be gathering in England.*

 *Accordingly, Edison took a ship and went to England. He was introduced to the audience. All cheered Edison’s presence.*

*Later at the request of Edison, Max Muller came on the stage and spoke in front of the instrument.*

*Then Edison went back to his laboratory and by afternoon came back with a disc & played it on the gramophone.*

*The audience was thrilled to hear the voice of Max Muller from the instrument.*

*They were glad that voices of great persons like Max Muller could be stored for the benefit of posterity.*

*After several rounds of applause and congratulations to Thomas Edison, Max Muller came to the stage and addressed the scholars and asked them,*

*“You heard my original voice in the morning. Then you heard the same voice coming out from this instrument in the afternoon. Do you understand what I said in the morning or what you heard in the afternoon?”*

*The audience fell silent because they could not understand the language in which Max Muller had spoken.*

*It was ‘Greek and Latin’ to them as they say.*

*But had it been Greek or Latin, they would have definitely understood because they were from various parts of Europe.*

*It was in a language which the European scholars had never heard.*

*Max Muller then explained what he had spoken.*

*He said that the language he spoke was Sanskrit and it was the first sloka of Rig Veda, which says "Agni Meele Purohitam”*

*This was the first recorded public version on the gramophone plate.*

*अग्निमीळे पुरोहितं यज्ञस्य देवं रत्वीजम।*
*होतारं रत्नधातमम।।*
*(Rig Veda 1.001.01)*

*Why did Max Muller choose this?*

*Addressing the audience he said,*

*“Vedas are the oldest text of the human race. And “Agni Meele Purohitam” is the first verse of Rig Veda.*

*"In the most primordial time, when the people did not know how even to cover their bodies and lived by hunting and housed in caves, Indians had attained high civilization and they gave the world universal philosophies in the form of the Vedas.”*

*When “Agni Meele Purohitam” was replayed, the entire audience stood up in silence as a mark of respect.*

*The verse means :*

*“Oh Agni, You who gleam in the darkness, to You we come day by day, with devotion and bearing homage. So be of easy access to us, Agni, as a father to his son, abide with us for our well being."*

*Proud to be part of a truly glorious ancient civilization .
***************

తెలుగు అనువాదం;

అతని మాస్టర్స్ వాయిస్

'హిస్ మాస్టర్స్ వాయిస్' (హెచ్‌ఎంవి) ఒకప్పుడు గ్రామఫోన్ రికార్డ్ చరిత్రను తెలియజేసే ఒక కరపత్రాన్ని ప్రచురించింది. *

* గ్రామోఫోన్‌ను థామస్ ఆల్వా ఎడిసన్ 19 వ శతాబ్దంలో

కనుగొన్నారు. చిత్రం కెమెరా, తన స్వంత సమయంలో ఒక పురాణం మారింది. *

* అతను తరం వారి కోసం మానవ వాయిస్ రికార్డు చేసే గ్రామ్ఫోన్ రికార్డు, కనుగొన్నారు చేసినప్పుడు, అతను తన మొదటి ముక్క ఒక ప్రముఖ పండితుడు వాయిస్ రికార్డు కోరుకున్నాడు. *

ఆ కోసం * అతను 19 వ శతాబ్దానికి చెందిన మరొక గొప్ప వ్యక్తిత్వం అయిన ఇంగ్లాండ్‌కు చెందిన ప్రొఫెసర్ మాక్స్ ముల్లర్‌ను (జాతి ప్రకారం జర్మన్) ఎంచుకున్నారు. *

* అతను మాక్స్ ముల్లర్‌కు ఇలా వ్రాశాడు, *

* “నేను మిమ్మల్ని కలవాలని మరియు మీ గొంతును రికార్డ్ చేయాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు రావాలి? ”*

* ఎడిసన్ పట్ల ఎంతో గౌరవం ఉన్న మాక్స్ ముల్లెర్ యూరప్ ఖండంలోని పండితులు చాలా మంది ఇంగ్లాండ్‌లో సమావేశమయ్యే సమయానికి తగిన సమయానికి రావాలని కోరారు. *

 * దీని ప్రకారం, ఎడిసన్ ఓడ తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆయనను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అందరూ ఎడిసన్ యొక్క ఉనికిని ఉత్సాహపరిచారు. *

* తరువాత ఎడిసన్ కోరిక మేరకు, మాక్స్ ముల్లెర్ వేదికపైకి వచ్చి వాయిద్యం ముందు మాట్లాడాడు. *

* అప్పుడు ఎడిసన్ తిరిగి తన ప్రయోగశాలకు వెళ్లి, మధ్యాహ్నం నాటికి ఒక డిస్క్‌తో తిరిగి వచ్చి దాన్ని ప్లే చేశాడు గ్రామోఫోన్. *

* వాయిద్యం నుండి మాక్స్ ముల్లెర్ యొక్క స్వరాన్ని విన్న ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. *

* మాక్స్ ముల్లెర్ వంటి గొప్ప వ్యక్తుల గొంతులను సంతానోత్పత్తి ప్రయోజనం కోసం నిల్వ చేయవచ్చని వారు సంతోషించారు. *

* థామస్ ఎడిసన్‌కు అనేక రౌండ్ల చప్పట్లు, అభినందనలు వచ్చిన తరువాత, మాక్స్ ముల్లెర్ వేదికపైకి వచ్చి పండితులను ఉద్దేశించి వారిని అడిగారు, *

* “మీరు ఉదయం నా అసలు గొంతు విన్నారు. అప్పుడు ఈ వాయిద్యం నుండి మధ్యాహ్నం అదే స్వరం బయటకు రావడాన్ని మీరు విన్నారు. నేను ఉదయం చెప్పినది లేదా మధ్యాహ్నం మీరు విన్నది మీకు అర్థమైందా? ”*

* మాక్స్ ముల్లెర్ మాట్లాడిన భాష అర్థం కాలేదు కాబట్టి ప్రేక్షకులు మౌనంగా ఉన్నారు. *

* ఇది వారికి 'గ్రీకు మరియు లాటిన్' వారు అంటున్నారు. *

* కానీ అది గ్రీకు లేదా లాటిన్ అయి ఉంటే, వారు ఐరోపాలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కాబట్టి వారు ఖచ్చితంగా అర్థం చేసుకునేవారు. *

* ఇది యూరోపియన్ పండితులు ఎప్పుడూ వినని భాషలో ఉంది. *

* మాక్స్ ముల్లెర్ అప్పుడు అతను ఏమి వివరించాడు మాట్లాడారు. *

* అతను మాట్లాడిన భాష సంస్కృతమని, ఇది ig గ్వేదం

యొక్క మొదటి స్లోకా అని, ఇది "అగ్ని మీలే పురోహితం" అని చెబుతుంది. * * ఇది గ్రామఫోన్ ప్లేట్‌లో రికార్డ్ చేసిన మొదటి పబ్లిక్ వెర్షన్. *

* अग्निमीळे पुरोहितं रत्वीजम रत्वीजम *
* होतारं रत्नधातमम ।। *
* ( ig గ్వేదం 1.001.01) *

* మాక్స్ ముల్లెర్ దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? *

* ప్రేక్షకులను ఉద్దేశించి ఆయన ఇలా అన్నారు, *

* “వేదాలు మానవ జాతి యొక్క పురాతన వచనం. మరియు“ అగ్ని మీలే పురోహితం ” రుగ్వేదం మొదటి పద్యం ఉంది. *

* "ప్రజలు వారి దేహాన్ని కూడా ఎలా తెలియదు ఉన్నప్పుడు మరియు వేట ద్వారా నివసించారు మరియు గుహలు లో ఉన్న అత్యంత ప్రైమోర్డియల్ సమయం లో, భారతీయులు అధిక నాగరికత పొందిన చేసింది వారు ప్రపంచంలో సార్వత్రిక తత్వాలు ఇచ్చింది వేదాల రూపంలో. ”*

* “అగ్ని మీలే పురోహితం” రీప్లే చేసినప్పుడు, ప్రేక్షకులందరూ గౌరవ చిహ్నంగా మౌనంగా నిలబడ్డారు. *

* ఈ పద్యం అర్థం: *

* “ఓహ్ అగ్ని, చీకటిలో మెరుస్తున్న మీరు, మేము రోజు రోజుకు వస్తాము, భక్తితో మరియు నివాళులర్పించారు. కాబట్టి మమ్మల్ని సులభంగా యాక్సెస్ చేసుకోండి, అగ్ని, తన కొడుకుకు తండ్రిగా, మా శ్రేయస్సు కోసం మాతో

ఉండండి . "* * నిజంగా అద్భుతమైన పురాతన నాగరికతలో భాగమైనందుకు గర్వంగా ఉంది.

భర్తృహరివ్రాసిన శ్లోకం::;

తపస్యన్తస్సన్తః కిమధినివసామస్సురనదీం//
గుణోదారాన్దారానుత పరిచరామస్సవినయమ్//
పిబామశ్శాస్త్రౌఘా?నుతవివిధ కావ్యామృతరసా?//
న్న విద్మః కింకుర్మః కతిపయనిమేషాయుషిజనే///

: ఏనుగు లక్ష్మణకవి తాత్పర్యపద్యం::;

తపముల్ సేయుచు దేవతాతటిని చెంతన్ నిల్తుమో,కాక దా//
రపరత్వంబున నుందుమోవివిధశాస్త్రశ్రవ్యకావ్యామృతం//
బుపభోగింతుమొ యేమిసేయను హితంబూహింపగాలే,మని//
త్యపులోకంబున మానవుల్ మితనిమేషాయుష్కులైయుండగన్////
*****************
సాయం సంధ్య వేళలో నంది కొమ్ముల నుంచి శివలింగం చూడనక్కరలేదా?

శివుడెప్పుడూ తనవైపే తిరగలాని నందీశ్వరుడి కోరిక. ఎదురుగా లింగమూర్తిగా ఉన్నప్పుడు కూడా నంది తన ఉచ్ఛ్వాసనిశ్వాసవలతో శివునికి చామరం వీస్తూ ఉంటాడు. అటువంటి నంది సేవకు భంగం కలగకుండా ఉండేందుకు నంది రెండు కొమ్ముల మీద కుడిచేతిని ఉంచి, వేళ్ళ మధ్య నుంచి శివ దర్శనం చేస్తారు. అయితే సాయం సంధ్య లో నందీశ్వరుడి ప్రుష్ఠ భాగం లో పావన నదులన్నీ చేరతాయని పురాణవాక్యము. అందువల్ల చీకటి పడిన తర్వాత నంది తోకను నిమిరి, కొమ్ముల మధ్య నుంచే శివదర్శనం చేసుకోవాలి. అసురసంధ్య వేళ అంటే సూర్యస్తమయానికి ముందు, వెనుక కలుపుకుని గంటన్నర కాలంపాటు పరమేశ్వరుని నిజరూప దర్శనం కలుగుతుంది. ఆ సమయంలో శివుణ్ణి నేరుగా దర్శించుకుని తరించవచ్చని శాస్త్రం. సేకరణ
**************

మహా శక్తివంతమైన రోగ నిరోధక మంత్రాలు

మీరు చదవండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

రోగ నిరోధక మంత్రాలు కూడా ఉంటాయా ఇప్పటి రోజుల్లో అనీ అనుకోవచ్చు..కానీ  నిజం..
రోగ  నిరోధక మంత్రాలు కచ్చితంగా ఉన్నాయి.
అసలు మంత్రం అనేది ఎలా నిర్మించ బడినది
ఒకదానికి ఒకటి ఒక ఫార్ములా లాగా పనిచేసే విధంగా నిర్మించ బడినది

మంత్రం చదివేటప్పుడు ఆ శబ్దనికి ప్రతిస్పందించే ప్రకృతిలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని ఆకర్షిస్థాయి..
అప్పుడు మనకు రోగ నిరోధక శక్తి మనో ధైర్యం,
బలం లభిస్తుంది..

ఒకప్పుడు వైద్యులు ఔషధం తో పాటు ఒక మంత్రం కూడా ఇచ్చే వాళ్ళు ఔషధం సేవించే టప్పుడు ఆ మంత్రాన్ని చదివి ఔషధం తీసుకోమని చెప్పే వాళ్ళు,
తేలు మంత్రం..పాము మంత్రంతో ప్రాణాలు నిలుపుకున్న పల్లె ప్రజలు ఉన్నారు..
ఇప్పుడు అలాంటి కొన్ని మంత్రాల గురించి తెలుసుకుందాము...

1. నారాయణయం

(ఇది గురువాయురు కృషుడి గురించి రాసిన వేయి పద్యాల అద్భుతమైన వర్ణన )
ఈ శ్లోకాలు జబ్బుతో ఉన్న వారు కానీ లేక వారి కోసం ఎవరు చదివినా భయంకరమైన  ప్రాణాపాయ జబ్బులు, కాన్సర్, దీర్ఘకాలిక రోగాలు నశిస్తాయి.
ఒకసారి ఆ పుస్తకం తెచ్చుకుని ప్రయత్నం చేయండి, (you tube vedio audio లభిస్తుంది) కృషుడి పైన పద్యాలు వాటి అర్థాలు ఎంతో భక్తి భావనతో భావోద్వేగాలు కలిగిస్తుంది...
చక్కటి ఆరోగ్యం ఆలోచన కలిగిస్తుంది..

2. వైద్యనాద్ స్త్రోత్రం

శివయ్య గొప్ప వైద్యుడు కూడా 
పురాణకాలం నుండి వైద్యంకోసం శివుని ఆరాధించేవారు, చర్మ వ్యాధులు ఇన్ఫెక్షన్ తో బాధపడే వారు
ప్రదోష కాలంలో ఈ వైద్యనాద్ స్త్రోత్రం,
శివ స్త్రోత్రాలు పారాయణం ప్రతి రోజు చేయాలి, సోమవారంనాడు శివునికి వాయుప్రతిష్ఠ చేసిన లింగానికి వారి చేత్తో అభిషేకం చేయాలి,
ఆరుద్ర నక్షత్రం రోజు ప్రదోష కాలంలో మట్టితో శివలింగాన్ని చేసుకుని, బియ్యం పిండి, గంధం, విభూది వీటితో
ఒక్కో దానితో ఓం నమః శివాయ అని 108 సార్లు
అర్చన చేసి, నైవేద్యం పెట్టి వైద్యనాద్ స్త్రోత్రం పఠించి  హారతి ఇవ్వాలి ,
కాసేపు  ధ్యానం చేసి ప్రసాదం భక్తిగా స్వీకరించాలి.. సంకల్పంతో మీకు ఆరోగ్యం ప్రసాదించమని వేడుకోవాలి, ప్రసాదం తినేటప్పుడు మీకు మంచి ఆరోగ్యం ప్రసాదించమని కోరుకుని తినాలి..
తర్వాత మీరు చేసిన మట్టి శివలింగాన్ని ప్రవహిస్తున్న నీటిలో కలపాలి
చెరువు అయినా పర్వాలేదు...
అలా నిమర్జన చేయడంలోనే మీకు మీ బాధ నుండి
చాలా ఉపశమనం లభిస్తుంది..
ఇలా ప్రతి ఆరుద్ర నక్షత్రం రోజు చేస్తూ రావాలి
మీకు పూర్తి ఆరోగ్యం లభించాక శివాలయంలో
అభిషేకం చేయించండి...

3.చిన్న చిన్నవి తరచూ వచ్చే జ్వరాలు , కీళ్ల నొప్పులు, ఊబకాయం , తిన్నది అరగక పోవడం,
వంటికి పట్టకపోవడం, తరచు నీరసం లాంటి
కారణం తెలియని రోగాలు మంచి ఉపాయం హనుమంతుడి గుడి ప్రదర్శన,
హనుమాన్ చాలీసా రోజు చదవడం..!

4. రాహుకాలం లో దుర్గా దేవి, సుబ్రహ్మణ్యస్వామి , కాలభైరవ స్వామి శ్లోకములు చదువుతూ ఉన్నా అకారణంగా వచ్చే భయాలు, నిద్రలో ఉలిక్కి పడటం, తరచు క్రిందపడటం ఇలాంటి బాధలు ఉండదు,.

5. ఏ ఔషధం సేవిస్తున్న కూడా
"ఓం నమో భగవతే వాసుదేవాయా " అని సేవిస్తే
ఆ మందు మీకు బాగా పనిచేస్తుంది.!

6.మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మంచి ఆలోచన వస్తుంది మంచి జీవితం ఉంటుంది.రోజూ ఐదు తులసి ఆకులు తినండి,
కాసేపు తులసికి దగ్గరగా కూర్చోండి.
తులసి మొక్క ఆక్సిజన్ ఎక్కువగా విడుదల చేస్తుంది,
రేఖీ, విశ్వప్రాణ శక్తిని ఆకర్షించే గుణం తులసికి ఉంది , ఇలాగే ఆవుకి కూడా.
అవకాశం ఉన్న వారు కాసేపు గోశాలలో గడపండి..
వైద్యం చేయించు కుంటూ ఇవి పాటిస్తే
త్వరగా గుణం ఉంటుంది.
*******************

కలి దోష నివారణం - నల, దమయంతుల నామ స్మరణం "

కర్కోటకస్య నాగస్య
దమయంత్యాః నలస్య చ
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తనం కలినాశనం

నల దమయంతుల కథ మహా భారతం లోని కీలక ఘట్టాలలో ఒకటి.
 కర్కోటకుని దారుణ విష ప్రభావాన్ని భరించ లేక కలి పురుషుడు నల మహారాజు దేహంలో నుండి బయటకు వచ్చాడు. తనను ఇక్కట్లపాలు చేసిన
కలి పురుషుని శపించేందుకు నలుడు సిద్ధ పడగా తనను శపించ వద్దని కలి పురుషుడు ప్రాధేయ పడ్డాడు.
ఓ నల మహా రాజా!
 దయ చూపు . నన్ను శపించ వద్దు. "నల దమయంతుల పేర్లను నిత్యమూ స్మరించే వారికి కలి దోషం అంటదు"  అని పలికి విభీతక వృక్షాన్ని ఆశ్రయించాడు.
  కలి పాప భయం తొలగాలన్నా..   కలి దోషం నివారణ కావాలన్నా నల మహా రాజు , ఆయన భార్య దమయంతి ల  పేర్లను నిత్యమూ  స్మరించడం ఫలప్రదం.. శుభప్రదం.

 ఆధారం;
మహా భారతం ఆరణ్య పర్వం 2 వ ఆశ్వాసం పద్యం 180. వచనం 181.

(ఏం.వి.ఎస్. శాస్త్రి ఒంగోలు ,9948409528)
**************

శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యము

శ్రీనైమిశ వనమందున
 శౌనక ముఖ్యాదులైన సంయమివర్యుల్
మానితమగు నొక ముఖమును
 పూనిరి సేయంగ మిగుల పూనిక తోడన్.                          1
                   
అనయము భగవన్నామము
 మనమందున దలచునట్టిమహనీయుండున్
ఘనుడగు నారదు డొచ్చెను
 మునిసంఘము లుండు వనికి మోదము తోడన్                2 

మునిసంఘము నారదుగని
మనమున యానందమొంది మన్నన సేయన్
మునియంతట చిఱునగవున
ఘనమగు యీ సవనమునకు కర్తెవరనియెన్                    3


హవ్యంబుల భోక్తెవరని
దివ్యుమ్డగు నారదుండు తెలియగ నడుగన్
"మువ్వురు మూర్తులె " యనుచును
భవ్యులు యచటున్న మునులు పల్కిరి భక్తిన్                    4

విని యా మాటలు సంయమి
యనియెను యీ రీతి యపుడు యాశ్చర్యముతోన్
" ఘన మునులగు మీరెప్పుడు
వినలేదా సవనవిధులు విజ్ఞులు నుడువన్                      5

మువ్వురు మూర్తుల కొఱకును
హవ్యము నీయంగ తగదు , యందొక వ్యక్తిన్
దివ్యునిగ నెన్నుకొనియును
యివ్వగ హవ్యంబు , ముఖము యిచ్చును ఫలమున్         6

మువ్వురు మూర్తుల యందున
యెవ్వడు యత్యంత ఘనుడొ యార్పడ నెఱిగీ
యవ్వాని పెద్ద జేసియు
నవ్వానికె నీయవలయు హవ్యంబెపుడున్ ".                    7

మునినాథు డీ విధంబుగ
యనినంతనె ఋష్యగణము యనుకొని రిటులన్
" మనకిది సాధ్యమె తలచగ
ఘనులౌ త్రయమూర్తులందు ఘనుడిని యెంచన్             8

మువ్వురు మూర్తుల యందున
యెవ్వరు యెధికుండొ దేల్చ నెవ్వరి తరమౌ
మువ్వురు యెవరికి వారలె
దివ్యులు , యత్యంత శక్తి తేజులు దలచన్                   9


మువ్వురు వ్యక్తులు లోపల
యెవ్వరు మోక్షంబు నిత్తు రీ జగమందున్
మువ్వురి యందున యెంచగ
నెవ్వనిలో సత్త్వగుణము యేర్పడియుండున్               10
********************

*అరవిందారామం* - కధ



ఆ రోజు ఆదివారం...
అరవింద కి ఆదివారం ఇంకా  ఎక్కువ పని.....
భర్తకి సెలవు...
పిల్లలు చిన్న వాళ్ళు..
మూడో సంవత్సరం నిండుతున్న పాప, బాబుకి సంవత్సరంన్నర...

భర్త శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్తేనే హాయిగా ఉంటుంది అరవిందకి...
రోజూ తొమ్మిది కల్లా భర్తకి కేరేజ్ కట్టి ఇచ్చి పంపిస్తే, సాయంత్రం 6 అవుతుంటే ఇంటికి వస్తాడు...
పిల్లలతో ఏదో అవస్థ పడినా...ప్రాణానికి ప్రశాంతత ఉంటుంది...

శ్రీరామ్ ఇంట్లో ఉంటే,  ఇక్కడ పుల్లతీసి అక్కడ పెట్టడు...
తాను ఆఫీస్ కి వెళ్లి సంపాదించే మహారాజులా భావిస్తాడు...
ఇంటికి వస్తే భార్య అగ్గగ్గలాడుతూ ఉండాలి...
ఆఫీస్ నుండి రాగానే చేతిలో బాగ్ తీసుకోవాలి...
మంచినీళ్లు ఇవ్వాలి....
తరువాత అతను ఫ్రెష్ అయ్యి కూర్చుని, అడిగితే కాఫీ గానీ టీ గానీ ఇవ్వాలి...
అతను ఫ్యాన్ కింద కూర్చుని టీవీ రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసుకుని కూర్చుంటాడు...

ఇంక అరవింద రాత్రికి వంట పనులు చేసుకోవాలి...పిల్లల్ని సముదాయించుకుంటూ...
పిల్లలు గొడవ చేసినా ఏడ్చినా చిరాకు పడతాడు...

పెళ్లి అయ్యాకా,  'అతని స్వభావం ఇదీ'  అని తెలిసాక అరవింద అతనికి అనుగుణంగా సర్దుకుపోవడం  మొదలు పెట్టింది...

ఆదివారం అతను ఇంకా లేజీ గా ఉంటాడు....
దగ్గరుండి అన్నీ సమకూర్చాల్సి వస్తుంది...బాత్రూం లో టవల్ పెట్టడం దగ్గరనుండీ...
చెడ్డవాడు కాదుగానీ, అతను పెరిగిన విధానమో ఏమో గానీ తను  "మగవాడు"  అనే అహం ఉంటుంది...
స్నేహంగా ఉండటం తెలీదో, ఇష్టం ఉండదో గానీ మొత్తానికి ఉండడు...
వాళ్ళమ్మకి నలుగురూ మగపిల్లలే...ఆడపిల్లల కష్టాలు తెలియకపోవడానికి అదీ ఒక కారణమేమో...

ఆదివారం ఆ హడావిడి లో ఉండగా, అరవింద
తండ్రి వాళ్ళింటికి వచ్చాడు...
అరవింద తండ్రిని చూసి ఉబ్బి తబ్బిబ్బయిపోయింది...
'నాన్నగారూ అంటూ'  హాల్లోకి వచ్చింది..
అంతా బావున్నారా...అమ్మ ఎలా ఉంది...చెల్లి తమ్ముడు బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు కురిపించింది...
ఆ ఆ అంతా బాగానే ఉన్నామమ్మా అని కూర్చున్నారు ఆయన...
ఎలా ఉన్నారు అల్లుడుగారూ అని పలకరించారు శ్రీరామ్ ని ...
బాగానే ఉన్నాను అన్నాడు ముభావంగా
చదువుతున్న పేపర్ పక్కన పెట్టి శ్రీ రామ్...

"ఈ రోజు మీరు కూడా ఇంట్లో ఉంటారు కదా అందరినీ చూసినట్టు ఉంటుందని వచ్చాను" అని సంజాయిషీ ఇచ్చినట్టు చెప్పారు ఆయన...

'కాఫీ ఇవ్వనా నాన్నగారూ అంది'  అరవింద...
వద్దమ్మా...పొద్దున ఒకసారి తాగాను..
ఈ డయాబిటీస్ వచ్చాకా ఆ చేదు కాఫీ ఒకసారి తప్ప తాగలేకపోతున్నాను..అన్నారు
ఆయన చిన్నగా నవ్వుతూ....

ఇప్పుడే వస్తాను నాన్నా అని వంటింట్లోకి వెళ్ళింది అరవింద...
శ్రీరామ్ కి 9 కల్లా టిఫిన్ చేయాలి...
పని చేసుకుంటూ నాన్నగారు ఎందుకొచ్చారబ్బా అనుకుంది మనసులో...
ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటుంది....
ఇప్పుడు మల్కాజగిరి నుండి కూకట్ పల్లి రావాల్సిన అవసరం ఏమైఉంటుంది అనుకుంది....
తండ్రి మాటలు వినపడితే వంటింటి తలుపు దగ్గర నిలబడింది...

నీతో మాట్లాడదామని వచ్చాను బాబూ...
అర్చనకి పెళ్లి కుదిరినట్టు నీకు తెలుసు కదా...ఒక లక్ష రూపాయలు అవసరం పడ్డాయి...
మన శివా కి జాబ్ వచ్చింది కదా టీ సి ఎస్ లో...
వాడు చేరగానే
నేను ఓ రెండు నెలల్లో ఇచ్చేస్తాను అంటున్నారు ఆయన...

శ్రీ రామ్ వెంటనే...నా దగ్గర లేదండీ...
మొన్ననే మా నాన్నగారు కావాలంటే ఇచ్చేసాను అంటున్నాడు...

అరవిందకి దుఃఖం వచ్చింది....
మొన్న అమ్మ చెప్పింది...చెల్లెలి పెళ్లికి  కి కొంచెం డబ్బు తక్కువయ్యింది అని...
కానీ ఈ రోజు తన తండ్రి నిస్సహాయం గా తన ఇంటికి వచ్చి లేదనిపించుకోవడం చాలా బాధనిపించింది....
శ్రీ రామ్ తన దగ్గర ఉండి లేదంటున్నాడని తెలుసు అరవిందకి....
మనసులో శ్రీ రామ్ అంటే ఏహ్యభావం కలిగింది...కానీ..
తను ఏం చేయగలదు...

ఇంతలో తండ్రి లేచి నిలబడి...సరే బాబూ...ఒకసారి అందరూ ఇంటికి వచ్చి వెళ్ళండి...
నీకు వీలవకపోతే అరవిందా పిల్లలనైనా పంపించు ఓ నాలుగు రోజులు ఉండి వస్తారు...

అమ్మా అరవిందా వెళ్ళొస్తానమ్మా అన్నారు...అక్కడే ఆడుకుంటున్న పిల్లల్ని దగ్గరకు తీసుకుంటూ...

అరవింద  వంటింట్లోంచి బయటికి వచ్చి...టిఫిన్ అయిపోవచ్చింది నాన్నా.. తిని వెళ్ళండి అంది...

వద్దమ్మా...వెళ్ళొస్తా...
అని బయటికి నడిచారు..
 అరవింద తానూ వెనక వెళ్ళింది గుమ్మం వరకూ...
తండ్రి చెప్పులు వేసుకుని వెనకకి తిరిగి వెళ్తుంటే...ఆయన కనపడేవరకు అక్కడే నిలబడి చూసి లోపలికి వచ్చింది....

శ్రీరామ్ టీవీ చూస్తూనే ఉన్నాడు అభావంగా....
అరవింద లోపలికి వెళ్ళి పెసరట్లు ప్లేట్ లో పెట్టుకుని వచ్చి శ్రీరామ్ కి ఇచ్చింది...
అది తీసుకుంటూ...
ఇంత పొద్దున్నే మీ నాన్నగారు వస్తేనే నాకు డౌట్ వచ్చింది...
ఇలాంటిదేదో ఉంటుందని...
అల్లుడికి ఇవ్వాల్సింది పోయి... అల్లుడినే అడగడం...అన్నాడు...

కొడుకు చదువు ఇంకా అవలేదు... అయ్యాకా ఉద్యోగం...ఉద్యోగం వచ్చాకా జీతం...
ఏమో పరిస్థితులు ఎలా మారతాయో
ఎవరికి తెలుసు అన్నాడు...

అరవింద అంది కొంచెం రోషంగా... "మీరైతే లేదని బాగానే చెప్పారుగా అని"...
"మరి చెప్పక ..ఇక్కడేమన్నా నా దగ్గర రాశులు పోసి ఉన్నాయా ఇవ్వడానికి"...అన్నాడు శ్రీరామ్...

అరవింద లోపలికి వెళ్ళిపోయింది...
అందరికీ  పౌరుషాలు రోషాలకి తక్కువ  లేదు
అని గొణుక్కున్నాడు శ్రీరామ్...

ఆరోజు అలా ఏదోలా,  భారంగా... అరవిందకి...
ఎప్పటిలాగానే, శ్రీరామ్ కీ గడిచాయి...

మర్నాడు భర్త ఆఫీస్ కు వెళ్ళగానే, పిల్లల్ని తీసుకుని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళింది అరవింద  దేవుడికి దణ్ణం పెట్టుకుని , కొంచెం సేపు ప్రశాంతంగా కూర్చుని వద్దామని...

గుడిలో దర్శనానంతరం అక్కడ మండపంలో కూర్చుంది...
పిల్లలు కింద ఆడుతుంటే చూస్తూ....
ఇంతలో ఎవరో అరవిందా అని పిలిచినట్లయి పక్కకు చూసింది...
"నేను అరవిందా కార్తీక్ ని" అన్నాడు కార్తీక్ చంద్ర...
నువ్వా కాదా అని డౌట్ వచ్చింది సుమా...అన్నాడు నవ్వుతూ..
అరవింద కూడా ఆశ్చర్యం గా చూసి నవ్వుతూ...ఎన్ని ఏళ్ళయింది నిన్ను చూసి...
ఏం చేస్తున్నావు...ఎక్కడున్నావు...
ఇక్కడున్నావు ఏంటి...అంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ...

కార్తీక్ అక్కడే కూర్చుంటూ...నేను ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నాను...ఇక్కడికి వచ్చి ఓ పది నెలలు అవుతోంది....
ఢిల్లీ నుండి వచ్చాను ఇక్కడ జాబ్ వస్తే....

ఈ ఏరియా లో మా మామయ్య ఉంటాడు...ఈ మధ్య ఆరోగ్యం బాలేదంటే చూసిపోదామని వచ్చాను...
సరే తిరిగి వెళ్తుంటే ఈ గుడి కనిపించింది...ఒకసారి దర్శనం చేసుకుని వెళదాం అని వచ్చాను...తరువాత ఇక్కడనుండి ఆఫీస్ కి వెళ్ళాలి...
కొంచెం లేట్ వస్తానని చెప్పాలే అన్నాడు నవ్వుతూ...

ఇంక నీ గురించి చెప్పు...
మాస్టారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు...
శివా, అర్చన ఎలా ఉన్నారు అని అడిగాడు...

నాన్నగారు రిటైర్ అయ్యి రెండేళ్లు అవుతోంది...
శివ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఇక్కడే సి.బి. ఐ.టి లో...
చెల్లెలు డిగ్రీ అయిపోయింది...పెళ్లి కుదిరింది...వచ్చే నెల పెళ్లి...
ఇదిగో నేను...అదిగో నా పిల్లలు...
మావారు కూడా సాఫ్ట్వేర్ ఇంజినీర్...
నేను హౌస్వైఫ్ ని...
ఇదీ నా జీవితం అంది...

అదేంటి అరవిందా.. అంత తెలివైన దానివి...ఇలా హౌస్ వైఫ్ లా ఉండిపోవడం ఏంటి...
మాథ్స్ ఎంత బాగా చేసేదానివి...అన్నాడు కార్తీక్...
ఇంటర్ చదువుతున్నప్పుడు కార్తీకచంద్ర అరవిందా వాళ్ళ నాన్నగారి దగ్గర ట్యూషన్ కి
వెళ్ళేవాడు...
అరవింద వాళ్ళ నాన్నగారు కొంతమంది తెలివైన పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీస్ తో ఐ ఐ టి మాథ్స్  కి మాత్రమే కోచింగ్ ఇచ్చేవారు...
అందులో కార్తీక్ ఒక్కడు...

ఆయన తెల్లవారుజామున లేచి ఓ మెరికల్లాంటి పదిమంది పిల్లలకి ట్యూషన్ చెప్పి తను 9 గంటల కల్లా ఆఫీస్ కి వెళ్లిపోయేవారు...ఆయన స్టేట్ గవర్నమెంట్ లో జాబ్ చేసేవారు...
ఆయనకి  చిన్నప్పటినుండి  మాథెమాటిక్స్ చాలా ఆసక్తి...
ఆయన చదివింది డిగ్రీ అయినా ఆయన తెలివి తేటలు ఆయనకు దేవుడిచ్చిన వరం...
ఆయన ఐ ఐ టి కి కోచింగ్ ఇస్తున్నారంటే ఆయన తెలివి తేటలు అంచనా వేయొచ్చు...

అప్పుడు అరవింద కూడా ఇంటర్  ఫస్ట్ ఇయర్ చదివేది అప్పుడు.....
తానూ పొద్దున లేచి కూర్చుని పిల్లలందరితో పాటూ నేర్చుకునేది...
తరువాత  కార్తీక్ కి ఐ ఐ టి ఢిల్లీ లో సీట్ రావడం... తరువాత ఇదే కలవడం...

అరవింద ని ఇంజనీరింగ్ చదివించలేక బి. ఎస్సీ మాథెమాటిక్స్ చదివించి పెళ్లి చేశారు...
అరవింద నవ్వి మా ఆర్ధిక పరిస్థితులు బట్టి నా చదువు...
నా తరువాత ఇంకా ఇద్దరున్నారని నేను అడజస్ట్ అవాల్సి వచ్చింది...

నా పెళ్ళికి బాగానే ఖర్చు అయ్యింది...
అర్చన అప్పటికి 9th  లో...శివా ఇంటర్ లో ఉన్నారు...
 నాన్నగారి  పెన్షన్ మీద,  ఇంటిలో ఒక వాటా అద్దెమీద సాగుతోంది వాళ్ళ సంసారం...
నాన్నగారు మాథ్స్ ఒక్కటీ చెప్పగలరు...
ఆ ఒక్క సబ్జెక్ట్ కీ ఇప్పుడు పిల్లలు రావడం లేదు కార్తీక్..మన అప్పటిలా కాదు...
అన్నీ ఒకచోట చెప్పే దగ్గరికి వెళ్తున్నారు...
వాళ్ళకి టైం కూడా ఇంపార్టెంట్ కదా...

పైగా అప్పటిలా నాన్నగారు ఎప్పటికప్పుడు అప్ డేట్ అవలేకపోతున్నారు...
సిలబస్ మారుతుంది...
పాటర్న్ మారుతుంది కదా...
అప్పుడు ఆయన యంగ్ కాబట్టి అన్నింటిలో ఆక్టివ్ గా ఉండేవారు...
ఇప్పుడు ఆయన వలన కావడం లేదు...

శివా  కి కూడా నాన్నగారు ఇంజనీరింగ్ చదివించడానికి లోన్ తీసుకున్నారు...వాడికి లక్కీ
గా క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది...
ఇంకో మూడు నెలలైతే వాడు జాబ్ లో జాయిన్ అవుతాడు..
నాన్నగారికి హెల్ప్ అవుతాడు అనిపిస్తోంది....
అరవింద ఆగింది...

కార్తీక్ అన్నాడు...చెప్పు అరవిందా...మాస్టారికి ఇప్పుడు ఇబ్బందిగా ఉందా అన్నాడు...

అంటే,  చెల్లి పెళ్లి దగ్గరపడుతోంది...
నీకు తెలుసు కదా ...ఆడ పిల్ల పెళ్లి అంటే ఎన్ని ఖర్చులు ఉంటాయో...
పెళ్లికి కొంత తక్కువ పడింది...
దానికి ఆయన కొంచెం ఆందోళన పడుతున్నారు..

నాకు అనిపిస్తూ ఉంటుంది చంద్రా... నేను మగపిల్లాడినై ఉంటే..ఏదో విధంగా నాన్నగారికి సహాయ పడేదాన్ని...
కంప్యూటర్ కోర్సెస్ ఏవో కొన్ని నేర్చుకుంటే నాకు ఇప్పుడూ ఉద్యోగం వస్తుంది...
కానీ మా ఆయనకి నేను ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు...

లేకపోతే అమ్మా వాళ్ళింటికి దగ్గరలో ఇల్లు తీసుకుంటే...
పిల్లల్ని అమ్మదగ్గర వదిలి నేను జాబ్ చేయొచ్చు...
అలా చేసి ఉంటే నాకంటూ డబ్బులు ఉండేవి...
నేను ఏదో కొద్దో గొప్పో సాయం చేసేదాన్ని....

ఈ విషయం లో తనతో ఘర్షణ పడి నేను ఎలా జాబ్ చేయగలను చెప్పు...
నాన్నగారికి బోలెడు సమస్యలు ఇప్పటికే...
మళ్లీ నేనో సమస్య కాకూడదు అని సర్దుకుపోతూ ఉన్నాను...

ఏంటో నాకు నా ఫీలింగ్స్ ఎవరికీ చెప్పుకునే దారి లేక...
నువ్వు అడగగానే నా బాధలు అన్నీ చెప్పేసాను...ఏమీ అనుకోకు అంది పేలవంగా నవ్వుతూ....
నీ గురించి చెప్పు ...అంది అరవింద...

నేను అహ్మదాబాద్ ఐ ఐ టి  లో చదువు అయ్యాకా...అక్కడే ఎం.టెక్ చేసాను...
US ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు...అమ్మా, నాన్న గారిని వదిలి వెళ్లాలనిపించలేదు...
అక్కకి పెళ్లి అయిపోయింది....
నాకూ అయింది... తను డాక్టర్...
అందరం ఇక్కడే కలిసి ఉంటున్నాం అన్నాడు...చాలా సంతోషం కార్తీక్...
నాన్నగారికి చెప్తా...సంతోషిస్తారు అంది...

లేదు లేదు నేనే వెళ్తాను..వెళ్లి సర్ప్రైజ్ ఇస్తా నువ్వు చెప్పకు అన్నాడు నవ్వుతూ...
మాస్టారి ఫోన్ నెంబర్ ఇవ్వు... అలాగే అడ్రస్ కూడా...

నీ ఫోన్ నెంబర్ ఇవ్వు...అన్నాడు...
అరవింద అన్ని డీటెయిల్స్ ఇచ్చింది....
అరవింద ఫోన్ నెంబర్ చూసి అదేంటి నువ్వు
లాండ్ లైన్ నెంబర్ ఇచ్చావు అన్నాడు...
"నేను సెల్ ఫోన్ మైంటైన్ చేయడం లేదు" అంది నవ్వుతూ...

కార్తీక్ అదేంటి ఇంకా నీ లాంటి వాళ్ళు ఉన్నారా అన్నాడు ఆశ్చర్యం గా...
అరవింద పరిస్థితి అర్ధమవుతోంది అతనికి...

మీ హస్బెండ్ ఎక్కడ పనిచేస్తారు...? అని అడిగాడు...
అరవింద కంపెనీ పేరు చెప్పగానే,   అతని భ్రుకుటి ముడి పడింది... పేరేంటి అన్నాడు...
పేరు చెప్పగానే ఐ సీ  అన్నాడు...
సరే అరవిందా... నిన్ను ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది...
నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను రా అన్నాడు కార్తీక్...

వద్దు కార్తీక్ ఇక్కడే చాలా దగ్గర ఇల్లు...వాకబుల్ డిస్టెన్స్...నువ్వు వెళ్లిపో...
నేను వెళ్తానులే అంది అరవింద...

సరే మరి...నువ్వేం వర్రీ ఆవకు...అన్ని సమస్యలు సర్దుకుంటాయి అన్నాడు...
పిల్లలిద్దరినీ కాసేపు ఎత్తుకుని...ముద్దు చేసి తను బయలుదేరాడు కార్తీక్ చంద్ర...

రెండు రోజుల తరువాత శ్రీ రామ్ ఆఫీస్ నుండి వచ్చి... అరవిందా అరవిందా..అని హడావిడి గా పిలిచి,  "నువ్వు చెప్పలేదేంటి ఎప్పుడూ నాకు అన్నాడు" 
అరవింద చేతులు పట్టి ఊపుతూ...

"ఏంటి" అంది ... అయోమయంగా అరవింద...
అదే మా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ ...మా బాస్, 
 మీ అందరికీ తెలుసని...అన్నాడు ఎక్సయిటింగ్ గా...
ఎవరిగురించి చెప్తున్నారు అంది..?
అదే కార్తీక్ చంద్ర గారి గురించి...ఆయన కింద మేం వందమంది పనిచేస్తాం...
మా అందరికీ బాస్ ఆయన...
ఆయన మామయ్య గారి దగ్గరే చదువుకున్నారట కదా...
నిన్ను అర్చననీ నా సిస్టర్స్ అన్నారు...అన్నాడు...

మీరు నిదానంగా చెప్పండి...నాకు అర్ధం కావడం లేదు...
కార్తీకచంద్ర మా ఇంటికి వచ్చి నాన్నగారి దగ్గర చదువుకున్నాడు...
అది తెలుసు నాకు అంతే...
తను మీ బాస్ అని నాకు తెలియదు అంది అరవింద సిన్సియర్ గా...

కూర్చో చెప్తా ....అన్నాడు శ్రీరామ్...
ఇవాళ ఆఫీస్ కి వెళ్లిన గంటకి కార్తీక్ చంద్ర గారినుండి కాల్ వచ్చింది...
నేను ప్రాజెక్ట్ గురించి అడుగుతారేమో అని వెళ్ళాను...
చూస్తే అక్కడ ఆయన కేబిన్ లో మీ నాన్నగారు ఉన్నారు...
నేను షాక్ అయి ఉండగా....ఆయన "ఇతనేనా మాస్టారూ" అని అడిగారు నన్ను చూపించి...
మామయ్యగారు అవునన్నారు...
అప్పుడు చెప్పారు ఆయన...
శ్రీ రామ్ ...ఈయన మా మధుసూదన్ మాస్టారు....
ఈయన వలనే నాకు ఐ ఐ టి లో సీట్ వచ్చింది ...

నా ఈ పొజిషన్ కి మాస్టారే కారణం...
నాకు ఒక వారం క్రితమే తెలిసింది ఈయన ఆచూకీ...
ఈ రోజు మన ఆఫీస్ చూపిద్దామని తీసుకొచ్చాను...

ఇప్పుడు చెప్పారు మా అల్లుడు కూడా ఈ ఆఫీస్ లో పని చేస్తాడని...
పేరడిగి నిన్ను పిలిపించాను....
అయితే నువ్వు మా అరవింద హస్బెండ్ వి మాట...
నాకు అరవింద, అర్చనలు దేవుడిచ్చిన చెల్లెళ్లు...

మాస్టారూ ...అరవింద ఆ రోజుల్లో మా  కంటే  చిన్నదైనా మా అందరితో సమానంగా మాథ్స్ చేసేది...
తరువాత ఏం చదివింది అని అడిగారు...
మమయ్యగారు చెప్పారు నీ గురించి...

ఏంటి మాస్టారు అంత తెలివైన అమ్మాయిని ఇంకా చదివించక పోయారా అని అన్నారు...
అప్పుడు అర్చన, శివ చిన్న పిల్లలుఅని చెప్పారు....
మీ అందరి గురించి ఎంత గొప్పగా చెప్పారో...

తరువాత నేను నా సీట్ కి వెళ్ళిపోయాను...మామయ్య గారిని ఒక అరగంట తర్వాత,  తన కార్ లో డ్రైవర్ నిచ్చి ఇంటికి పంపించారు....
మామయ్య గారితో ఇంకేం మాట్లాడారో...అన్నాడు శ్రీరామ్....

అవునా...ఇంత జరిగిందా అనుకుంది మనసులో అరవింద...
ఆరోజు తన భర్త చేసే ఆఫీస్ పేరు చెప్పగానే కార్తీక్
 ఫేస్ లో కలిగిన మార్పులు గుర్తొచ్చాయి..అరవిందకి...

అందుకా ఇంత మార్పు శ్రీ రాం లో  అనుకుంది...
ఈ రోజు రాత్రి వంట చెయ్యకు...
బయట భోజనం చేసి వద్దాం అన్నాడు...

నేను వంట చేసేసాను...తరువాత ఎప్పుడైనా వెళదాం లెండి అంది...
సర్లే అయితే అన్నాడు శ్రీరామ్....

ఉరుముల్లేని వర్షం లా ఉంది శ్రీ రామ్ తనమీద చూపిస్తున్న ప్రేమ...అనుకుంది...మనసులో...!
ఎక్కడా సంతోషం గా అనిపించలేదు...
కానీ శ్రీరామ్ ప్రవర్తన లో మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది...

మర్నాడు శ్రీరామ్ ఆఫీస్ కి వెళ్ళగానే ఇంటికి ఫోన్ చేసింది అరవింద...
ఏమయ్యింది నాన్నగారూ అని అడిగింది...

ఆయన చెప్పారు ...రెండురోజుల క్రితం కార్తీక్ వచ్చాడమ్మా భార్యను తీసుకుని మనింటికి...
నేను ఆశ్చర్యపోయాను....
ఇక్కడే మీ ఆయన చేసే కంపెనీ లోనే చాలా పెద్ద పోస్ట్ లో ఉన్నాడు...
భార్య అపోలో లో గైనకోలజిస్ట్ ట...
మమ్మల్నదరినీ భార్యకి పరిచయం చేశాడు..
నా వలనే తను పైకి వచ్చానని భార్యకి చెప్పాడు...
ఆ అమ్మాయి  కూడా నవ్వుతూ చాలా విధేయత గా ఉంది....
మన అందరి వివరాలు తెలుసుకున్నాడు...

తమ్ముడి జాయిన్ అవబోయే ఆఫీస్ గురించి...అన్ని వివరాలు తెలుసుకున్నాడు...
మీ అమ్మకి నాకు బట్టలు పెట్టి కాళ్లకు దణ్ణం పెట్టాడు...
ఈ రోజుల్లో అంత గుర్తుపెట్టుకొని రావడం చాలా అరుదు...
నువ్వు కలిసావని చెప్పాడు...
అర్చన పెళ్లికి వస్తానన్నాడు....
అమ్మా...ఇంకో గొప్ప విషయం...
3 లక్షలకు చెక్కు ఇచ్చి...మాస్టారు ఇది అప్పుగానే ఇస్తున్నాను...మీ అభిమానం తెలుసు నాకు...
శివ ఉద్యోగంలో సెటిల్ అయ్యాకా నిదానంగా నాకు తీర్చవచ్చు అన్నాడు...
తమ్ముడితో...శివా...ఇది నీ బాధ్యత...
నాన్నగారిది కాదు...
అలా అని నీకు బరువు, బంధనం కాదు..అని...

ఒక కొడుకుగా చెల్లెలికి పెళ్లికి చేసే సాయం అనుకోండి మాస్టారూ...
వద్దనద్దు అన్నాడు...
ఇంకెక్కడా డబ్బుకి ప్రయత్నించకండి అని కూడా అన్నాడు...
కాదనలేకపోయాను...నిజంగా ఇప్పుడు అవసరమే కదా...

వెళ్తూ... రేపు కార్ పంపిస్తాను ఇంటికి...మీరు అందులో మా ఆఫీస్ కి రండి...
నా దగ్గర కూర్చుని జస్ట్ అబ్ జెర్వ్ చేయండి...ఏమీ మాట్లాడకండి...
నేను ఏమీ తెలియనట్టు అడిగినా సమాధానం చెప్పండి..
తమాషా చూపిస్తా అన్నాడు...

అలా అల్లుడి గారి ఆఫీస్ కి వెళ్ళాను...
మిగిలిన సంగతి నీకు తెలిసిందే....

మాటల్లో అల్లుడు గారి గురించి చెప్పాడు...
శ్రీరామ్ తెలివైన వాడట...పని బాగా చేస్తాడట...
మిగిలిన విషయాలు కూడా అన్నీ సర్దుకుంటాయి చూడండి మాస్టారూ అన్నాడు...

నిజంగా దేవుడి లీల కాకపోతే...ఇలా సహాయం నాకు దొరుకుతుంది అనుకోలేదు....
ఇక నిశ్చింతగా అర్చన పెళ్లి జరుగుతుంది అని నమ్మకం కలిగింది...
వాళ్ళింటికి కూడా తనే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తా అన్నాడు...
అదిరా జరిగిన సంగతి అన్నారు ఆయన...

చాలా సంతోషం నాన్నా...
నేను ఏమీ చెయ్యలేకపోయానే అని చాలా మధన పడుతున్నాను...
మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుంది..
ఉంటాను మరి అని ఫోన్ పెట్టేసింది...

సాయంత్రం ఇంటికి వచ్చాడు శ్రీరామ్...చేతిలో ఏదో పాకెట్ ఉంది...

అతను ఫ్రెష్ అయ్యాకా...కూర్చుని
అరవిందా ...వంటింట్లో స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి రా అన్నాడు...
అరవింద అలాగే వచ్చింది...
కూర్చో అన్నాడు...మాట్లాడకుండా కూర్చుంది...
లేచి కింద అరవింద కాళ్ళ దగ్గర కూర్చున్నాడు...
"అయ్యో అదేంటి అంది అరవింద" కంగారుగా...

పర్లేదు...నే చెప్పేది విను...
నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు తెలుసు...
కార్తీక్ చంద్ర మీకు తెలుసు అన్నప్పటి నుండి నాలో మార్పు ఏదో వచ్చిందని...
నిజమే...!
అయితే అది నా స్వార్ధం తో వచ్చిన మార్పు కాదు...
అతనివలన నాకు కెరీర్ పరంగా లాభాలు ఉంటాయని కాదు...

నేనూ రెండు రోజులనుండీ ఆలోచిస్తున్నాను...
నేను ఒకలాంటి వాతావరణం లో పెరిగాను....
నాన్నగారు ఎప్పుడూ అమ్మమీద అధికారం చేలాయించేవారు...
అమ్మ నాన్నగారంటే భయపడుతూ అగ్గగ్గలాడుతూ ఉండేది...
అది తప్పని మాకు తెలీదు...తరువాత ముగ్గురు వదినలు వచ్చారు...
వాళ్ళనీ అన్నయ్యలు అలాగే చూసేవారు...
అదే పద్ధతి అనుకున్నాను నేనూ...
మగవాడికి అహం ఉండాలన్నట్టు ఉండేవారు నాన్నగారు...
ఇప్పటికీ మా నాన్నగారు వస్తే మా వదిన లు లేచి నిలబడతారు...
ఆయన ఎదురుకుండా కూర్చోరు....
అది తప్పు...తండ్రీ కూతుళ్ళ అనుబంధం ఉండాలి అని ఇప్పుడు అర్ధమవుతోంది నాకు...

మీ నాన్నగారికి మొన్న నేను  లక్ష రూపాయలు ఇవ్వలేదు...ఎందుకంటే నాకు అంతవరకూ ఆయనంటే చిన్న చూపు...
మీ శివా కి అపోయింట్మెంట్ క్యాన్సల్ అయితే ఎలా ఇస్తారు తిరిగి అన్న కుళ్ళు ఆలోచన...

అంతే గానీ నా భార్యకి తండ్రి...ఆయనకి ప్రస్తుతం నేను తప్ప ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచన లేదు నాకు...

ఇప్పుడు వస్తూ వస్తూ మీ నాన్నగారికి ఫోన్ చేసి ....ఇప్పుడు ఇస్తాను లక్ష రూపాయలు అంటే...ఆయన ఎంతో మార్ధవంగా చెప్పారు...
కార్తీకచంద్ర 3 లక్షలు తను అడగకుండానే ఇచ్చాడని...
అవసరమైతే  తప్పకుండా తీసుకుంటా బాబూ..ఏమీ అనుకోవద్దని...
నాకు మెత్తగా  చెంప మీద కొట్టినట్టే అయింది..
నాకు సొంత మామగారి మీద లేని నమ్మకం అతనికి ఉంది కదా అనిపించింది...మామయ్య గారు,
కార్తీకచంద్ర   నా బాస్ అయినందు వలన,   నేను ఇప్పుడు ఆయనకి హెల్ప్ చేస్తాను అన్నాననీ ...అనుకుని ఉండొచ్చు...

కానీ   అంత  పెద్ద పోస్ట్ లో కార్తీకచంద్ర లోని వినయం..విధేయత.. ఒద్దిక చూశాకా ఆశ్చర్యం వేసింది...
అతని ముందు నేను అన్నివిధాలా తక్కువే...
అయినా ఎంత అహం నాలో...?

మీ నాన్నగారు,  తన శిష్యులు అంత పెద్ద హోదాలో ఉన్నా ఎంత నిరాడంబరత...?
కార్తీకచంద్ర ఇప్పటికీ తన ఉన్నతికి కారణమైన మీ నాన్నగారిని మరచిపోకుండా గుర్తుపెట్టుకోవడం...
ఎంత డౌన్ టూ ఎర్త్ ఉన్నాడు అతను...

అసలు  నువ్వు ఎంత తెలివైనదానివి...?
నాకు కార్తీకచంద్ర చెప్పేవరకూ తెలీదంటే...నేను ఎంత మూర్ఖుణ్ణి...
నా దగ్గర ఉన్న విలువైన వజ్రం విలువ ఎవరో చెప్తే కానీ తెలుసుకోలేకపోయానే అన్న బాధ నాకు తొలిచేస్తోంది...
అతనితో సమానంగా మాథ్స్ చేసేదానివంటే...
నిన్ను మీ నాన్నగారు స్థోమత లేక చదివించలేదు గానీ...
నిన్ను చదివించి ఉంటే ఇలా నా భార్యగా ఉండేదానివా...
నాచేత అణచబడేదానివా...?
ఇలా ఒక సామాన్య గృహిణి లా ఉండేదానివా...?
ఎక్కడో ఉండేదానివి...లక్షల్లో జీతం తీసుకుంటూ...

మీరంతా చాలా గొప్పవాళ్ళు...పరిస్థితులకి
అనుగుణంగా సర్దుకుని బ్రతుకుతున్నారు అంతే..
.
ఈ కార్తీకచంద్ర ఈ ఆఫీస్ లోనే శాశ్వతంగా ఉండడు...
అంత పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నతనికి ఈ ఆఫీస్ కాకపోతే ఇంకోటి...
అలాంటి వాళ్లు ఎదుగుతూనే ఉంటారు...

కానీ నాలో మంచి మార్పు అంటూ వస్తే అతనే కారణం...
అతని గతం నాకు తెలియకపోతే నేను మారేవాడిని కాను...ఎందుకంటే అతను ఒక సంవత్సరం గా నా బాస్...

ఇది నిజంగా సహజంగా నాలో నా ఆలోచనల్లో వచ్చిన మార్పు...
స్వార్ధం తో వచ్చింది కాదు...నన్ను నమ్ము..

నేను బాగా ఆలోచించాను విందా...
నేనో నిశ్చయానికి వచ్చాను...
మనం మీ నాన్నగారి ఇంటికి దగ్గరలో ఇల్లు తీసుకుని వెళ్లిపోదాం...
మన చైత్ర ని ఈ సంవత్సరంలో నర్సరీ లో ఎలాగూ వేయాలి...
నువ్వు వేద్ ని అత్తయ్యగారి దగ్గర వదిలి నీ కిష్టమైన చదువు చదువుకో...

నువ్వు టీచర్ కావాలనుకుంటే బి. యి.డి చదువు....
లేకపోతే నీకేది ఇష్టమైతే అది...నాకు తెలీదు...
నువ్వు కూడా జాబ్ చేద్దువుగానీ...
నువ్వు కూడా ఆర్ధికంగా నిలదొక్కు కుంటే...నువ్వూ మీ పేరెంట్స్ కి సహాయం చేయొచ్చు...
నువ్వు ఇలా ఇంటికి పరిమితం అయిపోకూడదు అరవిందా...
నన్ను క్షమించు అంటూ అరవింద ఒడిలో తల పెట్టుకున్నాడు...

తన చేతిలో ఉన్న పాకెట్ అరవింద కిస్తూ ఇది మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ మోడల్ మొబైల్ ఫోను...అన్నీ మరచిపోయి ఇది  తీసుకో...అన్నాడు...!

అరవింద కళ్లనుండి కారుతున్న నీళ్లు తుడుచుకుంటూ...
లేవండి...అంది..
మనలో ఒకళ్ళనొకళ్ళు క్షమించుకోవడాలు లేవు అంది నవ్వుతూ...
నన్ను అర్థం చేసుకున్నారు అంతే చాలు...అంది అరవింద...

మా జీవితాల్లోకి  నిజంగా  కార్తీక చంద్రుడిలా వచ్చి చల్లని వెలుగుని నింపావు కదా కార్తీక్... అనుకుంది మనసులో...

అలా తల్లి తండ్రులని ఎప్పుడూ చూడని పిల్లలు
ఆశ్చర్యం గా చూస్తూ...ఏం జరుగుతోందా అన్నట్టు
దగ్గరికి వచ్చారు...
అరవింద తన రెండు చేతులతో ముగ్గురినీ ఒకేసారి దగ్గరకు తీసుకుంది...
 *సేకరణ* : వాట్సాప్ పోస్ట్.
***************************

పోత‌న త‌లపులో ...(21)


వేవేల సంవ‌త్స‌రాల క‌లియుగ  ప‌రిస్థితి ని ,భాగ‌వ‌త ర‌చ‌న మాటున‌
ముచ్చ‌ట‌గా మూడు పంక్తుల‌లోనే ద‌ట్టించి చెప్పిన‌వాడు పోత‌న‌.

                                            ****
అలసులు, మందబుద్దియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు; గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి, మునీంద్ర! చెప్పవే.
                                            ****

సూత మునీంద్రా!  కలియుగంలో మానవులు పెక్కురు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు. (అని శౌనకాది మునీంద్రులు సూత మునీంద్రుడిని కోరగా రూపుదిద్దుకున్న‌దే భాగ‌వ‌త క‌థ‌)

🏵️* పోత‌న ప‌ద్యం స‌హ‌స్ర‌కిర‌ణ ‌సంకాశం *

రామాయణమ్. .33

చివురుటాకులాగ వణికిపోయాడు దశరధుడు .
ఇంద్రుడి వద్ద ఇక శస్త్రము ముట్టనని ప్రమాణము చేసి, సంపాదించిన భూమినంతా కశ్యపుడికి దానంచేసి ,
మహేంద్రగిరి మీద వానప్రస్థం గడుపుతున్న ఈయన (పరశురాముడు) ఇచ్చటికి ఇలాగ ఉన్నపళంగా !,
ఈ రాజకులాంతకుడు ఎందుకు వచ్చాడు !? మదిలో ఈ ప్రశ్న కలకలంరేపుతున్నది దశరధునకు .
.
పరశురాముడు తన ఎదురుగా ఉన్న రామునితో ,
రామా !నీ పరాక్రమము అద్భుతము!
 శివధనుస్సు విరచినావని విన్నంతనే నీవెంతటి వాడివో తెలుసుకోవాలని మరియొక ధనుస్సు తెచ్చినాను ఇదిగో చూడు!
.
 కొన్ని కారణాలవల్ల శివధనుస్సు బలహీనముగా ఉన్నది . ఇది అత్యంత దృఢమైన వైష్ణవధనువు ! మా తండ్రి గారి వద్దనుండి నాకు ప్రాప్తించినది .
.
ఈ వైష్ణవ ధనుస్సు ఎక్కుపెట్టి శరసంధానము చేయవోయ్ ! నీ బలమేమిటో అప్పుడు తెలుస్తుంది .
.
అప్పుడు నీకు నాతో ద్వంద్వయుద్ధాన్ని అనుగ్రహిస్తాను,
.
 అని పరశురాముడు పలికినమాటలు దశరధుడి గుండెలలో ములుకులుగా గుచ్చుకొని ,భార్గవా ! నా రాముడుపసిబాలుడు !
.
 ఇప్పుడిప్పుడే జీవితంలో అడుగుపెడుతున్నాడు ! జీవనమాధుర్యమేదీ ఇంతవరకు రుచిచూసి ఎరుగడు!
ఇంకా కాళ్ళ పారాణి ఆరలేదు ! పసివాడింకా వాడు !
.
నా రామునకు ఏ విధమైన అమంగళము ప్రాప్తించినా మేమెవ్వరమూ జీవించలేము !.
.
ఈ వేడుకోలు మాటలేవీ పరశురాముడు వినటంలేదు! ఇంకా గట్టిగా మాట్లాడుతూ!
.
రామా ! నీవు సుక్షత్రియుడవే అయినట్లయితే ఈ వైష్ణవ ధనుస్సును ఎక్కుపెట్టు! అని హుంకరిస్తూ తనను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్న భార్గవరాముని చూచి దశరధరాముడు చాలా
 " తగ్గిన గొంతుతో " ఇలా అంటున్నాడు.
.
N.B
.
దశరధమహారాజు పరశురాముడి కాళ్ళ వేళ్ళ బడుతున్నాడు ,వేడుకుంటున్నాడు!
.
తన బలమేమిటో తనకు సంపూర్ణంగా తెలుసు ,అయినా ! తండ్రి మాట్లాడుతున్నప్పుడు ,రాముడు
,ఏమిటి ఈయనతో మాట్లేడేది నాన్నా ! ఈయన సంగతి నేను చూస్తాను ! అని పొరపాటున గూడా మాట్లాడలేదు !
అలా మాట్లాడితే తండ్రిని తగ్గించినట్లవుతుంది!
 అది తన అహంకార ప్రదర్శన అవుతుంది!
.
పరశురాముడికి జవాబిచ్చే సందర్భములో తగ్గిన గొంతుతో సంభాషిస్తాడు రాముడు ,ఇక్కడ రాముని గుణగణాలు తెలుస్తాయి.
.
తండ్రి ఎదుట,గురువుఎదుట ,పెద్దలెదుట ఎప్పుడూ పెద్దగొంతేసుకొని మాటలాడరాదు!
.
అందుకే వాల్మీకి మహర్షి ఈ శ్లోకం ఇలా చెపుతారు.
.
శ్రుత్వా త జ్జామదగ్న్యస్య వాక్యం దాశరధి స్తదా
గౌరవాద్యంత్రిత కధః పితూ రామ మథాబ్రవీత్.
.
పితుఃగౌరవాత్ యంత్రితకథః ......తండ్రిమీద గౌరవము వలన తగ్గింపబడిన సంభాషణము కలవాడై ....
.
రామాయణమ్ మనకు జీవన విలువలను నేర్పుతుంది !
.
ప్రతి సన్నివేశంలోనూ జీవన విలువలే! అందుకే రామాయణమ్ జీవనపారాయణమ్ కావాలి!
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**************

*వ్యక్తులు - సంఘము - నీతి*


*మానవుని సుఖ జీవన యాత్రకు నీతి సాధనము, పురుషార్థము (ధర్మము, అర్థము, కామము, మోక్షము) ఫలము*.
మానవుడు నీతి సాధనమున చతుర్విధ పురుషార్ధములను ఆరాధించుచూ దైవ పథమునధిశ్టించుచున్నాడు. అందుకనే మానవులకు ధర్మార్థ కామ మొక్షములు కరతలామలకముగా నున్నవి. వేద ప్రస్తావన త్రయము (ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రములు), దర్శనములు, శాస్త్రములు, పురాణ, ఇతిహాసములు, మత గ్రంధములు, కావ్యములు, నాటకములు, నవలలు అనేక విధములైన నీతులను తెల్పుచున్నవి/భోధిస్తున్నవి.

*వివిధ మతాలకు మోక్ష ప్రాప్తి విషయమై భేధాభిప్రాయములు ఉండవచ్చును గాని నీతి విషయములో అభిప్రాయ భేదములు ఉండవు*.

సుఖ ప్రాప్తికి, దుఖః నివృత్తికి మూలాంకురము నీతి. మానవుడు సకలావస్తల యందును, స్వధర్మ నిర్వహణ చేస్తూ తరించుటకు నీతి మార్గమే శరణ్యము.
నీతి ధర్మ పరా యణులు సుఖః దుఃఖఃములను, లాభ నష్టములను, జయాపజయములను, కీర్తపకీర్తులను పాటింపక/పరిగణించక స్వధర్మ నిర్వహణ ము చేసి కృతకృత్యులగుచున్నారు.

అహంకార చతుష్టయము (మనో, బుద్ధి, చిత్త, అహంకారము) మరియు జ్ఞానేంద్రియములు (5), కర్మేంద్రియాలు (5) విషయ వాసనల నుండి మరలుటకును, పరమాత్మలో లయము (లీనము) పొందుటకు నీతి మార్గమే సాధనంగా నున్నది.

*మానవుడు చేసే ప్రతి మంచి పనిని నీతి అని నిర్వచించవచ్చును*.
నీతి శాస్త్రానికి ధర్మం అనేది పట్టు గొమ్మ. నీతిని ఎవరైతే తు.చ. తప్పకుండా ఆచరిస్తా రో, వారు తరిస్తారనుటలో సందేహము లేదు. ప్రపంచములోని మానవులందరిని సన్మార్గంలో నడిపించేది నీతి.
*నీతి లక్ష్యం మంచి మార్గం. ధర్మం, న్యాయం, కర్తవ్యం మొదలగు సుగుణాలను విడువకుండా పాటించడమే నీతి*.

నీతి వ్యక్తులకే గాక సంఘానికి సంబంధించినది గూడా. *సంఘానికి సంబందించిన వివిధ జీవన రీతులు నీతి  మార్గానికి కట్టుబడి ఉంటాయి* వ్యక్తి సంఘ జీవి.
*సంఘంలోని వ్యక్తి సంఘానికి అన్ని విధాల ఉపయోగ  కారిగా ఉండాలి, ఆలా గాక వ్యక్తి అప్రయోజకుడుగా మారి నప్పుడు, సంఘములో అభివృద్ది కొరవడుతోంది, ఉన్నత విలువలలో వ్యత్యాసము మొదలవుతుంది*.
చివరిగా...
*ప్రతి వ్యక్తి సంఘము బాధ్యతను గుర్తెరిగి ప్రవర్తించుతుంటే, ఆ వ్యవస్థ ఆదర్శంగా ఉంటుంది*.
ధన్యవాదములు.
*****************

*🇮🇳I N D I A N R U L E R S🇮🇳*

 *బానిస రాజవంశం*
 1 = 1193 ముహమ్మద్ ఘోరి
 2 = 1206 కుతుబుద్దీన్ ఐబాక్
 3 = 1210 అరామ్ షా
 4 = 1211 ఇల్టుట్మిష్
 5 = 1236 రుక్నుద్దీన్ ఫిరోజ్ షా
 6 = 1236 రజియా సుల్తాన్
 7 = 1240 ముయిజుద్దీన్ బహ్రమ్ షా
 8 = 1242 అల్లావుద్దీన్ మసూద్ షా
 9 = 1246 నాసిరుద్దీన్ మెహమూద్
 10 = 1266 గియాసుడిన్ బల్బన్
 11 = 1286 కై ఖుష్రో
 12 = 1287 ముయిజుద్దీన్ కైకుబాద్
 13 = 1290 షాముద్దీన్ కామర్స్
 1290 బానిస రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 97 సం.)

 *ఖిల్జీ రాజవంశం*
 1 = 1290 జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ
 2 = 1296 అల్లాదీన్ ఖిల్జీ
 4 = 1316 సహబుద్దీన్ ఒమర్ షా
 5 = 1316 కుతుబుద్దీన్ ముబారక్ షా
 6 = 1320 నాసిరుదిన్ ఖుస్రో షా
 7 = 1320 ఖిల్జీ రాజవంశం ముగిసింది
 (ప్రభుత్వ కాలం - సుమారు 30 సం.)

 *తుగ్లక్ రాజవంశం*
 1 = 1320 గయాసుద్దీన్ తుగ్లక్ I.
 2 = 1325 ముహమ్మద్ బిన్ తుగ్లక్ రెండవ
 3 = 1351 ఫిరోజ్ షా తుగ్లక్
 4 = 1388 గయాసుద్దీన్ తుగ్లక్ రెండవ
 5 = 1389 అబూబకర్ షా
 6 = 1389 ముహమ్మద్ తుగ్లక్ మూడవ
 7 = 1394 సికందర్ షా మొదటి
 8 = 1394 నాసిరుదిన్ షా దుస్రా
 9 = 1395 నస్రత్ షా
 10 = 1399 నాసిరుద్దీన్ మహమ్మద్ షా వెంటాడే రెండవ స్థానంలో ఉన్నారు
 11 = 1413 డోలత్ షా
 1414 తుగ్లక్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 94 సం.)

 *సయ్యిద్ రాజవంశం*
 1 = 1414 ఖిజ్ర్ ఖాన్
 2 = 1421 ముయిజుద్దీన్ ముబారక్ షా రెండవ
 3 = 1434 ముహమ్మద్ షా నాల్గవ
 4 = 1445 అల్లావుద్దీన్ ఆలం షా
 1451 సయీద్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 37 సం.)

 * అలోడి రాజవంశం *
 1 = 1451 బహ్లోల్ లోడి
 2 = 1489 అలెగ్జాండర్ లోడి రెండవది
 3 = 1517 ఇబ్రహీం లోడి
 1526 లోడి రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 75 సం.)

 *మొఘల్ రాజవంశం*
 1 = 1526 జహ్రుదిన్ బాబర్
 2 = 1530 హుమయూన్
 1539 మొఘల్ రాజవంశం సమయం ముగిసింది

 *సూరి రాజవంశం*
 1 = 1539 షేర్ షా సూరి
 2 = 1545 ఇస్లాం షా సూరి
 3 = 1552 మహమూద్ షా సూరి
 4 = 1553 ఇబ్రహీం సూరి
 5 = 1554 ఫిరుజ్ షా సూరి
 6 = 1554 ముబారక్ ఖాన్ సూరి
 7 = 1555 అలెగ్జాండర్ సూరి
 సూరి రాజవంశం ముగుస్తుంది, (పాలన -16 సంవత్సరాలు సుమారు)

 *మొఘల్ రాజవంశం పున ప్రారంభించబడింది*
 1 = 1555 హుమాయు మళ్ళీ గడ్డిపై
 2 = 1556 జలాలుద్దీన్ అక్బర్
 3 = 1605 జహంగీర్ సలీం
 4 = 1628 షాజహాన్
 5 = 1659 u రంగజేబు
 6 = 1707 షా ఆలం మొదట
 7 = 1712 జహదర్ షా
 8 = 1713 ఫరూఖ్సియార్
 9 = 1719 రైఫుడు రజత్
 10 = 1719 రైఫుడ్ దౌలా
 11 = 1719 నెకుషియార్
 12 = 1719 మహమూద్ షా
 13 = 1748 అహ్మద్ షా
 14 = 1754 అలమ్‌గీర్
 15 = 1759 షా ఆలం
 16 = 1806 అక్బర్ షా
 17 = 1837 బహదూర్ షా జాఫర్
 1857 మొఘల్ రాజవంశం ముగుస్తుంది
 (ప్రభుత్వ కాలం - సుమారు 315 సంవత్సరాలు.)

 *బ్రిటిష్ రాజ్ (వైస్రాయ్)*
 1 = 1858 లార్డ్ క్యానింగ్
 2 = 1862 లార్డ్ జేమ్స్ బ్రూస్ ఎల్గిన్
 3 = 1864 లార్డ్ జాహోన్ లోరెన్ష్
 4 = 1869 లార్డ్ రిచర్డ్ మాయో
 5 = 1872 లార్డ్ నార్త్‌బుక్
 6 = 1876 లార్డ్ ఎడ్వర్డ్ లాటెన్లార్డ్
 7 = 1880 లార్డ్ జార్జ్ రిపోన్
 8 = 1884 లార్డ్ డఫెరిన్
 9 = 1888 లార్డ్ హన్నీ లాన్స్‌డన్
 10 = 1894 లార్డ్ విక్టర్ బ్రూస్ ఎల్గిన్
 11 = 1899 లార్డ్ జార్జ్ కర్జన్
 12 = 1905 లార్డ్ టివి గిల్బర్ట్ మింటో
 13 = 1910 లార్డ్ చార్లెస్ హార్డింగ్
 14 = 1916 లార్డ్ ఫ్రెడరిక్ సెల్మ్స్ఫోర్డ్
 15 = 1921 లార్డ్ రూక్స్ ఐజాక్ రైడింగ్
 16 = 1926 లార్డ్ ఎడ్వర్డ్ ఇర్విన్
 17 = 1931 లార్డ్ ఫ్రీమాన్ వెల్లింగ్డన్
 18 = 1936 లార్డ్ అలెగ్జాండర్ లిన్లిత్గో
 19 = 1943 లార్డ్ ఆర్కిబాల్డ్ వేవెల్
 20 = 1947 లార్డ్ మౌంట్ బాటన్

బ్రిటిషర్స్ పాలన సుమారు 90 సంవత్సరాలు ముగిసింది.

 * ఆజాద్ ఇండియా, ప్రధాని *
 1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ
 2 = 1964 గుల్జారిలాల్ నందా
 3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి
 4 = 1966 గుల్జారిలాల్ నందా
 5 = 1966 ఇందిరా గాంధీ
 6 = 1977 మొరార్జీ దేశాయ్
 7 = 1979 చరణ్ సింగ్
 8 = 1980 ఇందిరా గాంధీ
 9 = 1984 రాజీవ్ గాంధీ
 10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్సింగ్
 11 = 1990 చంద్రశేఖర్
 12 = 1991 పివి నరసింహారావు
 13 = అటల్ బిహారీ వాజ్‌పేయి
 14 = 1996 H.D. దేవేగౌడ
 15 = 1997 ఐకె గుజ్రాల్
 16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి
 17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్
 * 18 = 2014 నుండి నరేంద్ర మోడీ *

 764 సంవత్సరాల తరువాత, ముస్లింలు మరియు బ్రిటిష్ వారి బానిసత్వం నుండి స్వేచ్ఛ పొందబడింది.  ఇది హిందువుల దేశం.  ఇక్కడ మెజారిటీ ఉన్నప్పటికీ, హిందువులు తమ దేశ బానిసలుగా మారుతున్నారు, నేడు ప్రజలు చెబుతున్నారు.  హిందువులు మతతత్వమయ్యారు ,,,,,,,

 🚩🚩🚩🚩🚩
 ఈ ముఖ్యమైన సమాచారాన్ని యువకులందరి దృష్టిలో వీలైనన్ని సమూహాలలో పంపండి....

మనం 1000 సంవత్సరాలు కొన్ని కోట్ల మంది పోరాటం ఫలితంగా ఈ దేశం ఇంకా హిందూ దేశంగా మనుగడలో ఉన్నది.
సమాచారం సేకరించిన మిత్రుడి కృషికి గొప్ప
అభినందనలు.
****************

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పండ్రెండవ అధ్యాయము*

*శ్రీమహావిష్ణువు యొక్క మోహినీరూపమును జూచి, పరమశివుడు మోహితుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*12.9 (తొమ్మిదవ శ్లోకము)*

*త్వాం బ్రహ్మ కేచిదవయంత్యుత ధర్మమేకే ఏకే పరం సదసతోః పురుషం పరేశమ్|*

*అన్యేఽవయంతి నవశక్తియుతం పరం త్వాం  కేచిన్మహాపురుషమవ్యయమాత్మతంత్రమ్॥6774॥*

ప్రభూ! నీవు పరబ్రహ్మవనియు, కొందరు ధర్మమనియు వర్ణింతురు. ఈ విధముగా కొందరు నిన్ను ప్రకృతి  పురుషులకు అతీతుడవైన పరమేశ్వరుడవనియు తెలుపుచుందురు. విమల, ఉత్కర్షిణి, జ్ఞాన, క్రియ, యోగ, ప్రహ్వి, సత్య ఈశాన-అనుగ్రహ-అను తొమ్మిది శక్తులను కలిగిన పరమపురుషుడవని కొందరు భావింతురు. మరి కొందరు క్లేశములు, కర్మలు మొదలగు బంధములు లేనివాడవని, పూర్వజులకంటె పూర్వుడవని, శాశ్వతమైన పరమపురుషుడవని భావింతురు.

*12.10 (పదియవ శ్లోకము)*

*నాహం పరాయురృషయో న మరీచిముఖ్యా జానంతి యద్విరచితం ఖలు సత్త్వసర్గాః|*

*యన్మాయయా ముషితచేతస ఈశ దైత్యమర్త్యాదయః కిముత శశ్వదభద్రవృత్తాః॥6775॥*

ప్రభూ! నీ సత్త్వగుణములచే సృష్టింపబడిన నేను, బ్రహ్మదేవుడు, మరీచి మున్నగు ఋషులు నీచే నిర్మితమైన సృష్టియొక్క రహస్యమును తెలియజాలము. ఇంక నిన్ను ఎట్లు తెలిసికొనగలము? మాయావశులై రజస్తమోగుణ కర్మలయందు నిమగ్నమైన అసురులు, మానవులు మొదలగువారు నిన్ను ఎట్లు తెలిసికొనగలరు?

*12.11 (పదకొండవ శ్లోకము)*

*స త్వం సమీహితమదః స్థితిజన్మనాశం భూతేహితం చ జగతో భవబంధమోక్షౌ|*

*వాయుర్యథా విశతి ఖం చ చరాచరాఖ్యం సర్వం తదాత్మకతయావగమోఽవరుంత్సే॥6776॥*

ప్రభూ! సర్వాత్మకుడవుక జ్ఞానస్వరూపుడవు. వాయువువలె ఆకాశమున అదృశ్యుడవై ఉండియు సకల చరాచర జగత్తులో సర్వదా విరాజిల్లుచుందువు. వారి చేష్టలు, స్థితులు, జన్మకర్మలు, బంధమోక్షములు, నాశనము మొదలగునవి అన్నియును నీకు తెలియును.

*12.12 (పండ్రెండవ శ్లోకము)*

*అవతారా మయా దృష్టా రమమాణస్య తే గుణైః|*

*సోఽహం తద్ద్రష్టుమిచ్ఛామి యత్తే యోషిద్వపుర్ధృతమ్॥6777॥*

ప్రభూ! నీవు గుణములను స్వీకరించి, నీలీలను ప్రదర్శించుటకై పెక్కు అవతారములను దాల్చితివి. వాటిని అన్నింటిని నేను దర్శించితిని. ఇప్పుడు నీవు మోహినీ రూపమును ధరించితివని విన్నాను. ఆ రూపముసు గూడ నేను చూడగోరుచున్నాను.

*12.13 (పదమూడవ శ్లోకము)*

*యేన సమ్మోహితా దైత్యాః పాయితాశ్చామృతం సురాః|*

*తద్దిదృక్షవ ఆయాతాః పరం కౌతూహలం హి నః॥6778॥*

స్వామీ! ఆ రూపములో నీవు దైత్యులను మోహితులను గావించి, అమృతమును దేవతలకు పంచి ఇచ్చితివి. ఆ మోహినీ రూపమును దర్శింపవలెనని మా మనస్సులు ఉబలాటపడుచున్నవి. దానిని చూచుటకై మేము అందరము ఇచ్చటికి వచ్చితిమి.

*శ్రీశుక ఉవాచ*

*12.14 (పదునాలుగవ శ్లోకము)*

*ఏవమభ్యర్థితో విష్ణుర్భగవాన్ శూలపాణినా|*

*ప్రహస్య భావగంభీరం గిరిశం ప్రత్యభాషత॥6779॥*

*శ్రీశుకుడు వచించెను* శూలపాణియైన పరమశివుడు ఇట్లు ప్రార్థింపగా శ్రీమహావిష్ణువు దరహాసమొనర్చుచు భావగంభీర్యముతో శంకరునకు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.

*శ్రీభగవానువాచ*

*12.15 (పదునైదవ శ్లోకము)*

*కౌతూహలాయ దైత్యానాం యోషిద్వేషో మయా కృతః|*

*పశ్యతా సురకార్యాణి గతే పీయూషభాజనే॥6780॥*

*శ్రీమహావిష్ణువు ఇట్లనెను* మహాదేవా! ఆ సమయమున దైత్యులు అమృత కలశమును తీసికొనిపోవుచుండిరి. అప్ఫుడు దేవతల కార్యమును సాధించుటకు దైత్యులలో కౌతూహలమును కలిగించుటకు నేను స్త్రీ రూపమును   ధరించితిని.

*12.16 (పదహారవ శ్లోకము)*

*తత్తేఽహం దర్శయిష్యామి దిదృక్షోః సురసత్తమ|*

*కామినాం బహు మంతవ్యం సంకల్పప్రభవోదయమ్॥6781॥*

దైవశిరోమణీ! నీవు ఆ రూపమును చూడగోరుచున్నావు. గనుక, దానిని  మీకు చూపెదను. కాని, ఆ రూపము  కాముకులకే ఆదరణీయము. ఎందులకనగా, అది కామభావమును ఉత్తేజితమొనర్చునట్టిది సుమా!

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పండ్రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
*******************