23, సెప్టెంబర్ 2021, గురువారం

ప్రశ్న పత్రం సంఖ్య: 34

  ప్రశ్న పత్రం సంఖ్య: 34 కూర్పు: సి. భార్గవ శర్మ న్యాయవాది  

తం తో అంతమయ్యే పదాలు తెలపండి  

 క్రింది ప్రశ్నలను   పూరించటానికి ప్రయత్నించండి.    

1)  పోతనగారు తెలుగు చేసిన గ్రంధం 

 2) తనమాటే గెలవాలని బిగించుకోవటం 

3) ఇది నాది 

 4) పొలంలో మడి 

5) నా రాతలో ఇట్లా వుంది లో "రాత" 

6) సహాయం 

 7) పవిత్రం 

8) మొదటి నుంచి చివర వరకు 

 9) ఆటంకం 

10) వాల్మీకి రచించింది రామాయణం లో "రచించింది" 

11) సుకుమారం 

12) విద్యుతు ప్రమాదంలో " ప్రమాదం" 

13) విరివిగావున్నది 

14) నెలకొనివుంది  

15) పీడించబడటం  

16) ఒప్పుకోవటం 

17) నిజము కాదు సొంతంగా చెప్పింది 

18) ఇతిహాసాలలో ఒకటి 

19) వీరుని లక్షణం 

20) ప్రతి మనిషి వ్యక్తిగతం 

21) గడచినా కాలం 

22) ఆహ్వానించటం 

23) మనసులో చెప్పుకున్నది 

24) పుస్తకం వనితా విత్తం పరహస్త ______గతః 


వినాయకుని నామాలు,*

 వినాయకుని నామాలు,*

                 *వాటి అర్ధాలు:*

                 ➖➖➖✍️

1. *వాతాపి గణపతి:*

గాలిని పానం చేయడం అని అర్థం. అంటే ప్రాణాయామాది సాధనల వల్ల వాయువుని నియంత్రించడం. అదే వాతాపి లక్షణం. వినాయకుడు మూలాధార అధిష్టాన దేవత. కుండలినీ జాగరణ అక్కడే ప్రారంభమౌతుంది. అటువంటి యోగంలో ముఖ్యమైనది వాయునియంత్రణ. ఏనుగు నీటిని లోనికి, పైకి పీల్చిన్నట్లు మూలాధారములోని కుండలినిని పైకి తీసుకువెళ్తేనే సిద్ధి. కనుక ప్రాణవాయువును నియంత్రించి ఆ ఊర్ధ్వ దిశలో పయనింపచేసే చైతన్యమే వాతాపి అలా యోగశక్తిగా ఉన్న గణపతినే *వాతాపి గణపతి.* అంటారు.


2. *ఉచ్చిష్ట గణపతి:*

అక్షరములకు ప్రభువు ఓంకారం. గణపతి ఓంకార స్వరూపుడు. అక్షరములు అన్ని వెలువడేది నోటినుండే. నోటి నుండి వచ్చినది ఉచ్చిష్టo. కనక అక్షరపతే ఉచ్చిష్ట గణపతి.


3. *మహాగణపతి/వరసిద్ధి వినాయకుడు:*

మహా అనేది పరబ్రహ్మ వాచకము. గణపతి సర్వదేవతాత్మకడు. 11 చేతుల(10 చేతులు,1తొండం) తో వుంటాడు. ఆయా చేతులలో వివిధ దేవత సంకేతాలుగా, వారి వారి ఆయుధాలను ధరిస్తాడు.

అవి:

*ఒక చేతిలో చక్రం-పద్మం--విష్ణులక్ష్మీ తత్వం.

*ఒక చేతిలో త్రిశూలం-పాశం--శివ పార్వతి తత్వం.

*చెఱుకువిల్లు,నల్లకలువ- మన్మధుడు, రతీదేవి తత్వం.

*వరికంకి, గద- భూదేవి వరాహస్వామి తత్వం.

*బీజాపూరం(దానిమ్మ పండు), ఏకదంతం -- పుష్టి, పుష్టి పతి తత్వం.

*ఇక తొండంలో రత్న ఖచిత కలశం- మోక్షానికి సంకేతం.


4. *లక్ష్మీ గణపతి:*

ఎవరి శక్తి వారికి ఐశ్వర్యం! అదే లక్ష్మీ అంటే. (గాయకుడికి- పాడగలడమే శక్తి)

గణపతి యొక్కశక్తి యే లక్ష్మీ అంటే.( *విష్ణుపత్ని లక్ష్మి అని ఇక్కడ కాదు.)*


5. *నాట్య గణపతి:*

ఆనందంగా ఉన్నప్పుడే నాట్యం చేస్తారు.ఆనంద గణపతే నాట్య గణపతి అన్నా తాండవ గణపతిఅన్నా కూడా.

కాలం లయాత్మకo, ఊపిరీ లయాత్మకo అలా లయాత్మకంగా గమనం చేసే చైతన్యమే నాట్య గణపతి.


6. *హేరంబ గణపతి:*

శుభమైన శబ్ద స్వరూపుడు అంటే ఓంకార స్వరూపుడు.

హే=దీనులు, రంభ=పాలించువాడు దీనులను పాలించువాడు.


7. *వినాయకుడు:*

విగతనాయకుడే వినాయకుడు . అంటే ఆయనకు పై ఇక వేరే నాయకుడు లేరు.

వినయమును ఇచ్చువాడు వినాయకుడు.


8. *మూషిక వాహనుడు:*

గుండె గుహలోని జీవుడనే ఎలుక, ప్రపంచం చుట్టూ తిరిగి, విషయవాంఛలన్నీ ఆ హృదయ గృహలో అనుభవిస్తూ ఉంటాడు. ఆ జీవాత్మని అధిష్టించిన పరమాత్మ మూషిక వాహనుడు.


నోరుఅనే కలుగులో తిరిగే నాలుకే ఎలుక. దాన్ని అధిష్టించి వచ్చే అక్షరపతే గణపతి- మూషిక వాహనుడు.


09. *గణపతి:*

మనుషులు, ఇంద్రియములు, పంచప్రాణాలు. ఇలా ఏమి చూసినా గణములే. ఆ గణములన్నిటికీ పతియే - గణపతి.✍️

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!

వివాహం ఓ శాశ్వత బంధం

 *❤️వివాహం ఓ శాశ్వత బంధం❤️*

మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. హైందవ సమాజంలో వివాహానికి ఉన్నంత పటిష్టత మరే సమాజంలోనూ కానరాదు.ఒక వ్యక్తి జీవితంలోనూ వివాహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోంటోంది. షోడశ సంస్కారాలలోనూ వివాహం ప్రత్యేకమైనది.


వివాహానికి ముందు 

ఒక వ్యక్తి ఏకవచనం, వివాహానంతరం జీవితాంతం ఆ వ్యక్తి నిత్యబహువచనం. 'నేను' అన్న మాట మరుగై, 'మేము' అన్న భావన బయటకు వచ్చే విశిష్ట క్షణానికి శ్రీకారం చుట్టేది వివాహం.

'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః' అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన భార్యను వరునికి చేరువ చేసేది వివాహం. 


'వేదాధ్యయనం పూర్తి చేసి బ్రహ్మచారి వేదోక్త కర్మానుష్ఠానం చెయ్యాలని, పరమేశ్వరుణ్ణి ఉపాసించాలని వంశ తంతువును అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని తలపోయటం సహజం. ఈ ధర్మాలన్నీ ధర్మపత్న్యధీనాలు. కాబట్టే, అతడు 'నాకు యోగ్యురాలైన భార్య కావాలి' అనుకుంటాడు' అని శతపథ బ్రాహ్మణం పేర్కొంటోంది. 'సంక్షేపంగా చెప్పాలంటే, అతిథిపూజ, దేవతా పూజ, సంతాన ప్రాప్తి, యథాశక్తిదానం, స్వాధ్యాయం అనేవి గృహస్థు ధర్మాలు. వీటిని శ్రద్ధగా ఆచరిస్తే జీవితం పునీతం అవుతుంది. అందుకోసమే వివాహం.


వివాహ ప్రక్రియలో సూత్రీయం, భట్టీయం అని సంప్రదాయాలే కాకుండా దేశ కులాచారాలను బట్టి అనేక ఇతర భేదాలు కూడా ఉంటాయి. 


*వివాహంలో ప్రథమ ఘట్టం - గణపతి పూజ :*

అగ్నిసాక్షిగా జరగబోయే వివాహానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని గణపతిని ప్రార్థించడంతో వివాహ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మరొక విశేషం ఏమిటంటే, విఘ్నేశ్వరుడిని అగ్నికి ప్రతీకగా భావిస్తారు. అందుకే, వేదంలో అగ్నిని స్తుతించే 'గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమమ్‌ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్‌' అన్న మంత్రంతోనే విఘ్నేశ్వరుడిని స్తుతించడం జరుగుతోంది. 


ఆ తరువాత, పురాణ దంపతులైన లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీహిరణ్యగర్భులు (సరస్వతీబ్రహ్మలు), శచీపురందరులు, అరుంధతీవశిష్ఠులు, సీతారాములను పూజిస్తారుతరువాత కలశపూజ. కలశపూజ తర్వాత, గణాధిపతిని ధ్యానవాహనాది షోడశోపచారాలతో అర్చిస్తారు. 


*పుణ్యాహవాచనం :*

గణపతి పూజ, కలశ పూజల తర్వాత పుణ్యాహవాచనం.


శుభప్రదమైన వివాహం జరగబోయే గృహం, వేదిక, సత్రం, మండపం.. ఏదైనా కానీ, అది పవిత్రం కావటానికి దానితో బాటు సమస్త వాయుమండలం అంతా ఒక విశిష్టమైన పవిత్రతను సంతరించుకునేందుకు ఉద్దేశించిన పవిత్ర కర్మే పుణ్యాహవాచనం. 


*స్నాతకం లేదా సమావర్తనం :*

ఇంతకాలం విద్యాభ్యాసం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించిన బ్రహ్మచారి, విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా తిరిగి రావడాన్నే 'సమావర్తనం' అంటున్నారు. తిరిగి వచ్చిన వెంటనే అతనికి అంతక్రితం తను ఎరగని సుగంధ భరితమైన జలాలతో స్నానం చేయిస్తారు. ఈ స్నానాన్నే 'స్నాతకం' అంటారు. దీనితో అతను, తన బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సర్వంసహా సిద్ధపడుతున్నాడన్నమాట. 


ఈ స్నాతక సమయంలో పలికే మంత్రాలు చాలా శక్తిమంతమైనవి. వీటినే మనం నిత్యం దినవారీ పూజల్లో భాగంగా కూడా చేసే సంకల్పంలోనూ పఠిస్తాము.


'ఆపో హిష్ఠామయోభువః తాన ఉర్జే దధాతన మహేరణాయ చక్షసే

యోవ శ్శివోత్తమ రసః తస్యభాజయతేహనః ఉశతీరవ మాతరః 

తస్మా అరంగమామవః యస్యక్షయాయ జిన్వథ ఆపో జన యథాచనః'


అంటే 'ఓ ఉదకములారా! మీరు మాకు సుఖములను కలుగ జేయుదురు. మీ అనుగ్రహము చేతనే మాకు అన్నము లభిస్తున్నది. మీనుంచి లభించిన శక్తితోనే జ్ఞానము కలుగుచున్నది. కన్నతల్లులు ఏ విధముగా అయితే, తమ పిల్లలను పోషిస్తారో మీరు ఆ విధముగానే మీ మంగళకరమైన రసముతో మమ్ము పోషింతురుగాక! నశ్వరమైన ఈ దేహాన్ని రక్షించే శక్తి మీలోని రసములకు ఉంది. కావుననే మేము వినయముగా మిమ్ములను వేడుకొనుచున్నాము. మమ్ములను సత్సంతానము గలవారిగా చేయుము' అని అర్థం. 


*స్నానానంతరం*, ఆ బ్రహ్మచారి నూతన వస్త్రధారణ చేస్తాడు. తర్వాత అగ్నిని పూజిస్తాడు. అనంతరం కాటుకను అలంకరించుకుంటాడు. కానీ, అతనికి అప్పుడు ఈ అలంకరణలతో కొంత వైరాగ్యం కలిగి, ఈ అలంకరణలను చేసుకోవడంకన్నా మరింత ఉన్నత విద్యను అభ్యసించటం మంచిదనే భావన కలుగుతుంది. అందుకే మళ్లీ గొడుగు అందుకుని, పాంకోళ్లు ధరించి, ఉన్నత విద్యకై *కాశీకి ప్రయాణం* అవుతాడు. ఈ సమయంలో అతనికి వధువును ఇవ్వదలిచిన కుటుంబీకులలోని వధువు తమ్ముడు, ఇతర బంధువులు వచ్చి 'ఇక నీ బ్రహ్మచర్యానికి మంగళం పలుకుతూ, మా ఇంటి కన్యను భార్యగా స్వీకరించి, గృహస్థువు కమ్మ'ని కోరుతారు. వధువు తండ్రి మాటగా వరునికి ఇలా తెలియజేస్తారు:


*'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః*

*పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్‌'*


'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు. 


*అంకురారోపణం :*

'అంకురం' అంటే మొలక అని అర్థం. ప్రారంభం అని కూడా మరో అర్థం చెప్పుకోవచ్చు. వివాహ శుభకార్యానికి ఇది ప్రారంభ కార్యక్రమం. వివాహ సుముహుర్తానికి ముందు రోజు రాత్రి వధూవరుల తల్లిదండ్రులు ఈ 'అంకురారోపణం' అనే కర్మను చేస్తారు. దీన్నే 'అంకురార్పణ' అనీ అంటున్నారు. 


ప్రకృతిలో ఉండే ఓషధులపట్ల కృతజ్ఞతను ప్రకటించే కర్మమే ఇది. ఓషధులకు చంద్రుడు అధిపతి కాబట్టి ఈ కర్మను రాత్రి వేళల్లోనే చేయాలి. 


మట్టితో చేసిన అయిదు పాలికలలో పుట్టమట్టి పోసి, ఆ మట్టిలోఓషధీబీజాలను వేసి, అవి మొలకెత్తేలా చేయటమే 'అంకురారోపణం'. పాలికల మూలాలలో దూర్వ (దూర్వార), రావి, మారేడు దళాలను ఉంచి, చుట్టూ తెల్లని దారంతో కడతారు. శుచి అయిన ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి, ముగ్గుపెట్టి, దానిపైన ఈ పాలికలను ఉంచుతారు. తర్వాత, మంత్రాలు చదువుతూ, యజమాని ఆ పాలికలలో మట్టిని నింపుతారు. తర్వాత దొరికినంత వరకూ నువ్వులు, మినుములు వంటి ఏడు ఓషధులు (ఇవి గ్రామ్యాలు), వెదురుబియ్యం, నివ్వెరబియ్యం వంటి ఏడు ఓషధులు (ఇవి అరణ్యాలు)- వీటి అన్నింటినీ ఒక పాత్రలో పోసి, పాలతో తడిపి, ఓషధీసూక్తంతో అభిమంత్రిస్తారు. తర్వాత, ఈ ఓషధులను అయిదు పాలికలలో చల్లుతారు. పాలికలలో దేవతలను ఆహ్వానించి, పవమానసూక్తంతో నీళ్లు చల్లుతారు. తర్వాత, ఈ పాలికలను వివాహం అయ్యేంతవరకు భద్రపరచాలి. అంకురించిన ఓషధులకు శ్రద్ధగా నీరు పోస్తూ ఉండాలి. 


*వధూగృహాగమనం :*

మరింత విద్యాభ్యాసానికై కాశీ వెళ్లాలని ఆశించిన వరుడు, ఆ ప్రయత్నం మానుకుని, వివాహానికి అంగీకారం తెలపటంతో కాశీయాత్ర వేడుక పూర్తి అవుతుంది. తర్వాత వరుడు మంగళస్నానం చేసి, నూతన వస్త్రధారణ చేసి, అలంకారాలు ధరించి, వధువు గృహానికి లేదా వివాహం జరిగే కల్యాణమండపానికి బయలుదేరుతాడు. ఈ సమయంలో శకునాలన్నీ మంగళప్రదంగానే ఉండాలని అనేక శకున మంత్రాలు పఠిస్తాడు. 


*మధుపర్కం :*

అప్పటికి కన్యాదాత తమ గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణం పూర్తి చేసుకుని ఉంటారు. వధువు సైతం రక్షను ధరించి, గౌరీ పూజ చేసుకుని ఉంటుంది. ఈ సమయానికి వరుడు, వరుని బంధుమిత్రులు, కన్యాదాత గృహానికి చేరతారు. వధువు తండ్రి వరుడిని అన్వేషించటం లోకరీతి అయినా, వాస్తవానికి వధువును కోరడానికి వరుడు రావాలి. ఇలా తన కుమార్తెను కోరవచ్చిన వరుడిని వధువు తండ్రి సాదరంగా ఆహ్వానిస్తాడు. వరుడు కూర్చునేందుకు దర్భలతో కూడిన ఆసనం ఇస్తాడు. దానిపై వరుడు కూర్చున్న తర్వాత, అతని కుడికాలును, తర్వాత ఎడమకాలును కడుగుతాడు. 


తనకన్నా వయసులో పెద్ద, కాబోయే మామగారు అయిన వధువు తండ్రి అలా చేయటం వల్ల వరుడి తేజం నష్టం అవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టుకోవడం కోసం వరుడు కొన్ని మంత్రాలు పఠిస్తాడు. తర్వాత, వధువు తండ్రి ఇచ్చే దధిమధుమిశ్రమాన్ని (తేనె, పెరుగు కలిపిన మిశ్రమం) మంత్రాలను చదువుతూ, స్వీకరిస్తాడు. ఈ *దధిమధు మిశ్రమాన్నే 'మధుపర్కం' అంటారు.*


*మహా సంకల్పం :*

మనం చేయబోయే ధర్మం ఏదైనా దాన్ని ఈశ్వరాజ్ఞగా భావిస్తూ పరమేశ్వరుని అనంతకాల స్వరూపాన్ని విస్మయావిష్టహృదయంతో గుర్తు చేసుకుంటూ, గోత్రనామాల్ని చెప్తూ, 'ఈ కర్మను నేను ఈశ్వరార్పణ బుద్దితో చేస్తున్నాను' అని సంకల్పిస్తాము. చేయబోయే ప్రతి పనికీ దైవానుగ్రహం ఉండాలని ఈశ్వరుడికి మన 'సంకల్పం' వివరించటమే ఇది.

కన్యాదానం వంటి ముఖ్య పుణ్యకార్యాలలో ఈ సంకల్పం నిత్యం చేసే సంకల్పం కన్నా పెద్దదిగా ఉంటుంది. దీన్నే 'మహా సంకల్పం' అంటారు.

వివాహ సమయంలో చెప్పే సంకల్పం సృష్టిక్రమవర్ణంతో ఆరంభం అవుతుంది.


'అస్య శ్రీమదాదినారాయణస్య ఆచింత్యాపరిమితశక్త్యా - ప్రకృతి మహదహంకార పృధివ్యప్తే జోవాయ్వాకాశాది..' అంటే, పరమేశ్వరుని అనంతర స్వరూపమైన భూమ్యాకాశ పర్యంతమైన విశ్వంలో ఒక చిన్న శకలమైన భూ ఖండంలో ఉన్న మనం మన సంకల్పాన్ని ఆ పరమ దైవం ముందు పెడుతున్నాం. 


'సాలంకృత కన్యాదాన మహం కరిష్యే' అంటూ కన్యాదాత అనటంతో ఈ మహాసంకల్పం ముగుస్తుంది. 


*గోత్రప్రవర :*

వివాహ వేడుకలో ఇదొక చక్కని ఘట్టం. వధూవరుల గురించి వారి పూర్వికుల ఘన చరిత్ర గురించి ఎలుగెత్తి చాటే సమయమిది. వధూవరుల నుంచి వెనుకకు మూడు తరాల గురించి వారి గోత్రనామాలు, వారి ఋషుల పేర్లు (ప్రవర) గట్టిగా చదివి వినిపిస్తారు. అలా చేయటం వల్ల వధూవరులలో 'ఇంత గొప్ప గోత్రంలో పుట్టాం. ఇందరు ఋషుల ఆశీస్సులను పొందగలుగుతున్నాం కనుక మనం ఈ మహాపురుషుల పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జీవించాలి' అన్న స్ఫూర్తి కలుగుతుంది. 


*కన్యాదానం :*

కన్యాదానం అనేది ఒక గొప్ప అదృష్టం. మన ఇంటి అమ్మాయిని వేరొక ఇంటి వ్యాప్తికి పంపటం సామాన్యమైన విషయం కాదు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను నిస్వార్థంగా ఒక వరుడి చేతిలో పెట్టడానికి ఎంత ఔదార్యం కావాలి! ఆ వరునిపై ఎంత విశ్వాసం, ఎంత గౌరవం ఉండాలి!! అందుకే, దానాలన్నిటిలోకి కన్యాదానం బహు గొప్పదని అందరూ అంటారు. 


నారికేళఫలపుష్పాక్షత హిరణ్య సహితమైన కన్య కుడి చేతిని ఆమె తల్లిదండ్రులు వరుని కుడిచేతిలో ఉదకపూర్వకంగా సమర్పిస్తారు. వరుడు తూర్పునకు, వధువు తండ్రి పశ్చిమానికి, తల్లి ఉత్తరానికి అనుకూలంగా కూర్చుని కన్యాదానం చేస్తారు. సాధారణంగా దానాన్ని ఇచ్చేటప్పడు 'తుభ్యమహం సంప్రదదేే న మమ' అంటారు. అంటే, 'ఇది నీకు ఇస్తున్నాను, ఇక నాకు దీనితో సంబంధం లేదు' అని అర్థం కానీ, కన్యాదాన సమయంలో మాత్రం వధువు తండ్రి 'తుభ్యమహం సంప్రదదే' అంటాడు. 'న మమ' (అంటే, 'ఇక నాకు సంబంధం లేదు) అని మాత్రం అనడు, అనకూడదు. 


వరుడు కూడా ఆ దానం స్వీకరిస్తూ, కొన్ని ప్రతిగ్రహ మంత్రాలు చెప్తాడు. 'దేవస్య త్వా సవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి' అంటాడు. అంటే సూర్యభగవానుని అనుజ్ఞతో, అశ్వనీదేవతల బాహువులతో పూషన్‌ దేవత యొక్క హస్తాలతో స్వీకరిస్తున్నాను' అని అర్థం. 


'స్వీకరిస్తున్నావు సరే, ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా!' అంటూ బాధ్యతను గుర్తు చేస్తూ వధువు తండ్రి 'ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యా' అంటాడు. అంటే 'ధర్మములో, అర్థములో, కామములో ఆమెతోనే కలిసి ఉండాలి. ఆమెను అతిక్రమించరాదు' అని అర్థం. 


దీనికి సమ్మతిస్తూ వరుడు *'నాతి చరామి'* (అతిక్రమించను) అంటాడు. వధువు తండ్రి, వరుడు తమ తమ మాటలను మూడుసార్లు అంటారు. 


*'త్రిషత్యా హి దేవాః' అని వేదవాక్యం.* అంటే ముమ్మారు అన్నది సత్యమని అర్థం. ఈ కారణంగానే మూడుసార్లు అనిపించటం!!


*సుముహూర్తం :*

వివాహానికి నిర్ణీతమైన ముహూర్తానికి ముందు పురోహితులు వివాహ మంగళ శ్లోకాలను చదువుతారు. వివిధ దేవతల ఆశీర్వాదాలు కాబోయే వధూవరుల మీద వర్షించాలనే ప్రార్థనలు ఇవి. దీని తర్వాత 'చూర్ణిక' అనే సంస్కృత గద్య పఠనం ఉంటుంది. ఇవి కూడా ప్రార్థనలే. తర్వాత సుమూహూర్తానికి ముందు *'సుముహూర్తో సావధాన* అంటూ అందరినీ సావధానులు కమ్మంటూ హెచ్చరికలు చేస్తారు. సుముహూర్త సమయంలో వధూవరులు తమ తమ శిరస్సులపై పరస్పరం జీలకర్ర, బెల్లములతో కలిపి చేసిన ముద్దను ఉంచుకుంటారు. 


'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌' అంటూ పురోహితులు ఆశీర్వచనాలు పలుకుతారు. 


*వధూసమీక్షణము :*

ఈ సమయంలో వధువును చూస్తూ, వరుడు కొన్ని మంత్రాలను పఠిస్తాడు. వధువు తనతో రావటం వల్ల వధువును తనకు ఇచ్చిన కుటుంబం పొందే వియోగం గురించిన ప్రస్తావన, దానికి ఓదార్పు వచనాలు ఈ మంత్రాలలో ఉంటాయి. 


*వధువును అభిషేకించటం :*


దర్భలతో తయారు చేసి 'ఇణ్వము' అనే వలయాన్ని వధువు శిరస్సుపై ఉంచి, కాడి ఎడమ రంధ్రంలో బంగారం ఉంచి, ఆ రంధ్రం గుండా నీటిని వధువు తలపైన పడేలాగ వరుడు సమంత్రకంగా పోస్తాడు. ఈ విధంగా అభిషేకించడం వల్ల వధువు సూర్యునిలా నిత్యప్రకాశవంతం అవుతుందని భావన. దీనికి ఒక పురాణ గాధను ఆధారంగా చెప్తారు. ఈ అభిషేకం అయిన తర్వాత, వధువుపైన వరుడు ఒక నూతన వస్త్రాన్ని కప్పుతూ, ఒక మంత్రం పఠిస్తాడు. 


*యోక్త్రబంధనం :*

వధువు నడుము చుట్టూ ఒక దర్భతాటిని గట్టిగా కట్టి, వరుడు ఒక మంత్రాన్ని పఠిస్తాడు. వివాహం ఒక శాశ్వత బంధం.


*మంగళ సూత్రధారణం :*

వివాహ సమయలో మరొక ముఖ్యఘట్టం - మంగళసూత్ర ధారణం. సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఇవ్వటానికీ, ఆమెకు వివాహం జరిగిందన్న దానికి సూచికగానూ మంగళ సూత్రం ఉపయుక్తంగా ఉంటోంది. ఈ సందర్భంగా, వివాహం అనేది వధూవరులైన స్త్రీ పురుషులు ఇద్దరికీ జరుగుతుండగా, కేవలం స్త్రీ మాత్రమే మంగళసూత్రం ధరించవలసిన అవసరం ఏమిటన్న వాదం ఉంది. నిజానికి వివాహ సమయంలో వరుడు కూడా తన బ్రహ్మచర్యం నాటి యజ్ఞోపవీతానికి అదనంగా మరొకటి, ఉపవస్త్రం స్థానే మరొకటి, మొత్తం ఉపవీతాలు మూడింటిని ధరిస్తాడు. కనుక ఈ విషయంలో స్త్రీపురుషుల వ్యత్యాసం ఏమీ లేదనే చెప్పాలి. మంగళసూత్రాన్ని వధువు మెడలో వేస్తున్నప్పుడు వరుడు సుప్రసిద్దమైన 

*'మాంగల్యతంతునానేన మమ జీవనహేతునా,కంఠే బధ్నామి సుభగే* *త్వంజీవ శరదాం శతమ్‌'*

అనే శ్లోకాన్ని పఠిస్తాడు. అంటే 'నేను ఈ మంగళ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఇకపై నా జీవనం దీనిపైనే ఆధారపడి ఉంది. నీవు శతాయుర్దాయాన్ని పొందుము' అని అర్థం. మంగళసూత్రం వధువు సౌభాగ్యానికి హేతువు అని కూడా భావించడం కద్దు. 


*అక్షతారోపణం :*

వివాహకార్యక్రమంలో ఈ ఆనంద వేడుకనే మనం 'తలంబ్రాలు', 'అక్షింతలు' అనీ అంటున్నాం. 'అక్షత' అంటే క్షతి లేనిదని, అంటే నాశనం లేనిదని అర్థం. 'అక్షతలు' అంటే అంతులేని శుభాలను కలుగజేసేవని అర్థం. తండులాలు (బియ్యం), ఘృతము (నెయ్యి), క్షీరము (పాలు) కలిపిన మంగళద్రవ్యాలను మనం 'అక్షతలు'గా భావిస్తున్నాం. వరుడు, వధువు చేతిలో కొద్దిగా పాలను రెండుసార్లు రాసి, తర్వాత రెండుసార్లు తండులాలను పోసి, మళ్లీ పాలతో రెండు సార్లు అభిఘారం చేస్తాడు. అప్పుడు వరుని చేతిలో కన్యాదాత లేదా పురోహితుడు అలాగే చేస్తాడు. అప్పుడు వధువు చేతులలో వరుని చేతులను ఉంచి వాటిలో కొంత బంగారం పెట్టి, ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉదకాన్ని పోస్తాడు. 


'పుణ్యం వర్ధతాం.. శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, తిథికరణముహూర్తనక్షత్రసంపదస్తు' అంటూ మంత్రపఠనం చేస్తారు. మరికొన్ని మంత్రాల తర్వాత, వధూవరులు పరస్పరం అక్షతలను పోసుకుంటారు. వివాహమండపంలో ఇదొక సంబరం. 


*మహదాశీర్వచనము:*

కొత్త దంపతులను వేద పండితులు ఆశీర్వదించడం ఇది. అనేక వేదోక్తమైన వచనాలతో నూతన వధూవరులు ఆశీర్వచనం అందుకుంటారు. 


*ప్రధానహోమము :*

వధూవరుల వస్త్రాల కొంగులను సువర్ణ ఫల సహితంగా, అగ్నిని స్తుతించే మంత్ర సహితంగా ముడి వేస్తారు. దీనికి *'బ్రహ్మగ్రంధి'(బ్రహ్మముడి)* అని పేరు. తర్వాత, కొంగుముడులు వేసుకున్న కొత్త దంపతులు అగ్నిసాక్షిగా కొన్ని హోమాలు చేస్తారు. అగ్నిసాక్షిగా వివాహం అంటే ఇదే!ఇంత వరకూ 'ఎవరో' అయిన వధువు ఈ క్షణం నుంచి వరుని ఇల్లాలు అవుతుంది. ఇంత ప్రధానమైనది కాబట్టే దీనికి 'ప్రధాన హోమము' అని పేరు. 


*పాణిగ్రహణము:*

వరుడు తన కుడి చేతితో వధువు చేతిని పట్టుకోవడమే 'పాణిగ్రహణము'.


 'గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథా సః భగో అర్యమా సవితా పురంధిర్మహ్యం త్వాదుర్గార్‌హపత్యాయ దేవాః' 

అన్న మంత్రాన్ని పఠిస్తూ వరుడు 'నేను నీ చేతిని గ్రహిస్తున్నాను, ఇకపై నీ బాధ్యత నాది' అంటూ వధువుకు వాగ్దానం చేస్తాడు. 'చేతిలో చెయ్యేసి చెప్పడం' ఇదే!!


*సప్తపది :*

మాంగల్యధారణ జరిగిన తర్వాత, అగ్నిసాక్షిగా ఆ నూతన వధూవరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఏడడుగులు కలిసి నడుస్తారు. ఇదే 'సప్తపది'. అంటే ఏడు అడుగులు కలిసి నడవటం అన్నమాట. వాస్తవానికి ఈ సమయంలో వధువు నడుముపై వరుడు చెయ్యి వేసి, దగ్గరగా తీసుకుని, అగ్నిహోత్రానికి దక్షిణవైపున నిలబడి ఏడడుగులు నడవాలి. ఒక్కో అడుగుకు ఒక్కొక్క మంత్రాన్ని పురోహితులు చెప్తారు. 


మొదటి అడుగుకు: 'ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే, 'ఈ తొలి అడుగుతో విష్ణువు మనలను ఒక్కటి చేయుగాక!' అని అర్థం.

రెండో అడుగుకు: 'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు' అన్నది మంత్రం. అంటే, 'ఈ రెండవ అడుగుతో విష్ణువు మనకు శక్తిని కలుగజేయుగాక!' అని అర్థం. 

మూడవ అడుగు మంత్రం: 'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు' అంటే, 'ఈ మూడవ అడుగుతో వివాహవ్రత సిద్ధికి విష్ణువు మనలను కరుణించుగాక!' అని అర్థం.

నాలుగో అడుగుకు మంత్రం: 'చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు'. అంటే, 'ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందం కలుగజేయుగాక' అని అర్థం.

ఐదవ అడుగుకు 'పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే 'ఈ ఐదవ అడుగుతో మనకు పశుసంపదను విష్ణువు కలిగించుగాక!' అని అర్థం.

ఆరవ అడుగుకు 'షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రపఠనం జరుగుతుంది. అంటే 'ఈ ఆరవ అడుగుతో మనకు ఆరు ఋతువులూ సుఖమునే కలిగించుగాక!' అని అర్థం.

ఏడవ అడుగుతో 'సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రం చదువుతారు. అంటే 'ఈ ఏడవ అడుగుతో గృహస్థాశ్రమ ధర్మనిర్వహణను మనకు విష్ణువు అనుగ్రహించుగాక' అని అర్థం.


అదే సమయంలో వరుడు 'సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదాబభూవ! సఖ్యం తే గమేయగ్‌ం సఖ్యాత్‌! తేమాయోషం సఖ్యాన్మే మాయోష్ఠాగ్‌ం సమాయవః సంప్రియౌ రోచిష్ణూ సుమన స్యమానౌ, ఇష మూర్జమభినంవసానౌ నం నౌమనాగ్‌ంసి సంవ్రతా సమచిత్తన్యాకరమ్‌' అంటాడు. అంటే, 'ఏడడుగులతో నాకు మిత్రమైన ఓ సఖీ! నీవు నా స్నేహాన్ని వీడకు, మంచి ప్రేమగలవారమై, మంచి మనసుతో కలిసి జీవిద్దాం, సమాలోచనలతో ఒకే అభిప్రాయంతో కలిసి ఉందాం!' అంటాడు. 


దానికి జవాబుగా ఆ వధువు 

'పాత్వమసి అమూహం! అమూహమస్మి! సా త్వం ద్వౌ, అహం పృథివీ! త్వం రేతో అహం రేతోభృత్‌! త్వం మనో అహమస్మి వాక్‌! సామాహమస్మి, ఋక్తం సా మాం అనువ్రతాభవ!' 

అంటుంది. అంటే 'ఓ మిత్రమా! నీవు ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండు. నేను కూడా ఏ తప్పులూ చేయను! నీవు ఆకాశమైతే నేను భూమిలా కలిసి ఉందాం. నీవు శుక్రమైతే నేను శ్రోణితాన్ని! నీవు మనసైతే నేను వాక్కును! నేను సామ(వేదగాన)మైతే నీవు ఋక్కువై కలిసి ఉందాం!!' అని అర్థం.


అప్పుడు వరుడు, వధువును ఇలా వేడుకుంటాడు: 

'పుంసే త్రాయ వేత్తవేశ్రియై ఉత్తరయ వేత్తావయేహి సూనృతే!' అంటాడు. అంటే 'మన వంశాభివృద్ధి కోసం, ఉత్తరకాలంలో ఉత్తమ లోకాల ప్రాప్తి కోసం, ధైర్యవంతుడైన, సత్యవాక్‌ పరిపాలకుడైన వంశాభివృద్ధి చేయగల పుత్రులను నాకు ప్రసాదించు!' అని అర్థం. 


వివాహ మహోత్సవంలో ఇదొక అద్భుత ఘట్టం. ఈ ఘట్టంతో వధువు గోత్రం మారుతుంది. ఆమె వరుని సతీమణి అయి, అతని గోత్రవతి అవుతుంది. 


*అశ్మారోహణము :*

అగ్నికి ఉత్తరంగా సన్నికల్లు మీద వధువు కుడికాలును ఉంచి, వరుడు ఒక మంత్రం పఠిస్తాడు. భార్యభర్తల మధ్య బంధం శిలాసదృశమని దీని సూచన. ఒకప్పుడు సన్నికల్లుకు ఇంట్లో ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇంటిలోనివారికి కావాల్సిన ధాన్యాన్ని దంచటం అంటే, ఇంటిలోని వారందరి యోగక్షేమాలు చూడటమన్నమాట. అది గృహాధిపత్యానికి సూచన. వధువు తన కుడికాలును అంత శక్తిమంతమైన సన్నికల్లు మీద ఉంచిందీ అంటే, గృహాధిపత్యం తనదేనని చెప్పటం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోని వారికోసం బియ్యం దంచటమనే ప్రసక్తి లేకపోయినా, ఆ అధికార గ్రహణ సూచనలు కొనసాగుతూనే వస్తున్నాయి. 


*లాజహోమము :*

'లాజలు' అంటే పేలాలు. వధువు చేతిలో ఆమె సోదరుడు పేలాలను పోసి, వాటిని నెయ్యితో అభిఘరించి, వాటితో మంత్రపూర్వకంగా వరుడు వామపార్శ్వహోమం చేయిస్తాడు. తర్వాత, వధూవరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. 


*యోక్త్ర విమోచనము :*

యోక్త్రబంధన సమయంలో వధువు నడుము చుట్టూ కట్టిన బంధాన్ని వరుడు సమంత్రకంగా విప్పటమే ఈ సంస్కారం.


*వధువు వరుని ఇంటికి వెళ్లటం :*

వివాహానంతరం వధువు, వరుని ఇంటికి వెళ్లటం ఆనవాయితీ. ఈ సమయంలో వరుడు ఆమెను తన (తమ) ఇంటికి తీసుకు వెడుతూ కొన్ని మంత్రాలు పఠిస్తాడు. వాటిలో ఒక మంత్రంలో 'మూర్ధానాం పత్యురారోహ' అంటాడు. అంటే 'నీవు నా శిరసును అధిష్టించుము' అని అర్థం. అంటే, 'ఇకపై నా మీద అన్ని అధికారాలూ నీవే!'నని చెప్పటమన్నమాట. అలాగే, ఇంటిలో ఉండే అత్తామామలు, ఆడబడుచులు, మరుదుల మీద నీదే అధికారమని అనేక మంత్రాలలో చెప్తాడు. వరుని ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇలా అధిగమించాక, వరుని ఇంటి వద్దకు వచ్చిన ఆమెకు స్వాగతం పలుకుతూ మరికొన్ని మంత్రాల పఠనం జరుగుతుంది. అయితే, *ఇప్పుడు సమయాభావం చేత, కాకుంటే వరుని గృహం దూరం, పోయి రావటం భారం కావటంతో, ఈ వేడుకలన్నీ క్షణాల మీద పెళ్లి పందిట్లోనే జరిగిపోతున్నాయి.*


*ప్రవేశ హోమము :*

గృహప్రవేశం అనంతరం, వధూవరులు సంకల్పం చేసుకుని, వైవాహికాగ్నిని ప్రతిష్ఠించి, ప్రవేశహోమాన్ని నిర్వహిస్తారు. తన ఇంటికి వచ్చిన నూతన వధువుకు స్వాగతం చెప్తూ, ఇంటి బాధ్యతలను అప్పగిస్తూ, వరుడు పలు మంత్రాలు చదువుతాడు. అలాగే, తమ బంధుమిత్రులందర్నీ తమకు ఆశీస్సులు అందజేయమని కోరతాడు.


*నక్షత్ర దర్శనము :*

సాయంత్రం నక్షత్రోదయం అయ్యాక, పురోహితులు నూతన వధూవరులకు నక్షత్ర దర్శనం చేయిస్తారు. తూర్పు లేదా ఉత్తర దిక్కుకు కొంత దూరం నడిచిన పిమ్మట, ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ, వరుడు ఆ నక్షత్రంనుంచి ఆశీస్సులు కోరతాడు. ఆకాశంలో స్థిరమైన ధ్రువ నక్షత్రం లాగానే తమ దాంపత్యం సుస్థిరంగా ఉండాలనే ఆకాంక్షను ఆ దంపతులు వ్యక్తం చేస్తారు. ధ్రువమండలంలోని పరబ్రహ్మను ఉపాసించటం వల్ల అపమృత్యుభయం తొలగిపోతుందనీ, సమస్త సంపదలు లభిస్తాయని విశ్వాసం. ఆ తర్వాత, పురోహితులు ఆ నవ దంపతులకు సప్తర్షి మండలాన్ని, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ఏడుగురు మహాఋషుల తర్వాత స్థానం పొందాలని వరునికీ, సప్తర్షు భార్యలలో ఏడవది అయిన అరుంధతి తర్వాత స్థానం పొందాలని వధువుకు సూచించడం ఇది. ఇదే సమయంలో వధూవరులు ఆ నక్షత్రాలకు అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో పఠించే మంత్రం ఇది:


'సప్త ఋషయా ప్రథమం కృత్తికానాం - అరుంధతీం యద్‌ ధ్రువత్వం హనిన్యుః

షట్‌ కృత్తికా ముఖ్యయోగం వహన్తి ఇయమ్‌ - అస్మాకం ఇధతు అష్టమి' 

'సప్తర్షులను, కృత్తికలలో మొదటిదైన అరుంధతిని ప్రార్థిస్తున్న ఈ వధూవరులకు నిత్యత్వం లభించుగాక. ఈ వధువుకు అరుంధతి తోడుగా గల ఇతర ఆరుగురు పతివ్రతల (సప్తర్షుల సతీమణుల) తర్వాత ఎనిమిదవ స్థానం లభించుగాక!' అని అర్థం. 


*ఆగ్నేయ స్థాలీపాకము :*

దీన్నే మనం సంక్షిప్తంగా 'స్థాలీపాకం' అంటున్నాం. అగ్నిని ఉపాసించి, జీవనానికి శ్రీకారం చుట్టాలని చేసే కర్మనే 'ఆగ్నేయ స్థాలీపాకం' అంటారు. 


వధువు ఒక గిన్నెలో బియ్యం పోసి, నీళ్లు పోసి, అగ్నిహోత్రంలో వండి హోమం కోసం సిద్ధం చేస్తుంది. ఈ హోమద్రవ్యాన్ని 'చరువు' అంటారు. దీన్ని కొద్దికొద్దిగా చేతితో హోమసాధనమైన దర్విలోకి తీసుకుని, ఆజ్యంతో అభిఘారం చేసి రెండుసార్లు వరుడు సమత్రంకంగా హోమంలో వేస్తాడు. చరువు చేయటంతో భార్య తన విధిని నిర్వహిస్తూ, భర్తకు తోడ్పడుతూ ఉంటుంది. హోమం చేయగా మిగిలిన చరువును వధూవరులు యజ్ఞప్రసాదంగా స్వీకరిస్తారు. 


*శేషహోమము :*

వివాహంలో ఇదే చివరి హోమం. ఇందుకే దీనికి 'శేష హోమము' అని పేరు. ఈ హోమ సమయంలో వరుడు అగ్నితో బాటు వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతులతోబాటు ద్వాదశమాసాధిపతులనూ ప్రార్థిస్తూ, హోమం చేస్తాడు. ఈ హోమ సమయంలో వధువు, వరుడిని వీక్షిస్తుంది. 


*నాకబలి :*

దీన్ని ఇప్పుడు 'నాగవల్లి' అనటం జరుగుతోంది. వాస్తవానికి అది 'నాకబలి' మాత్రమే! దేవతలకు చేసే పూజను 'నాకబలి' అంటారు. ఇంటి మధ్యలో చతురస్రాకారంలో మట్టిని అలికి, అయిదు రకాల రంగులతో, పిండితో పద్మాకారాన్ని చిత్రిస్తారు. ఉత్తర దక్షిణ దిక్కులలో రెండు ఏనుగుల బొమ్మలను చిత్రించి, పద్మ మధ్యంలో గౌరీదేవి బొమ్మను ప్రతిష్ఠిస్తారు తూర్పున రెండు కలశాలను, నాలుగు దిక్కులలో మట్టితో చేసిన 33 నాకబలి పాత్రలను ఉంచుతారు. చుట్టూ దారం కట్టి, పుష్పాక్షతలతో అలంకరిస్తారు. ఇద్దరు ముతైదువలు పళ్లాలలో 33 దీపాల్ని పట్టుకుంటారు. ఈ 33 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉందని కొందరి భావన. 27 నక్షత్రాలు, త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) ముగ్గురు, వారి సతీమణులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) ముగ్గురు- మొత్తం కలిసి 33. 

వీరందరినీ ఉపాసించటం కోసమే ఈ 33 పాత్రలు, 33 దీపాలు. దీపాలను వెలిగించి తెచ్చిన ముత్తయిదువులతో కలిసి, వరుడు- అతని చేయి పట్టుకుని వధువు, పురోహితుడితో సహా అందరూ కలిసి ఆ అలంకృత ప్రదేశం చుటూముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో 'మమాగ్నేవర్చః' అన్న మంత్రాలను పఠిస్తారు. చుట్టూ దీపాల్ని అలంకరిస్తారు. నాకదేవతలకు 33 అన్నకబళాలను నైవేద్యంగా పెడతారు. తర్వాత, పడమర దిక్కులోని దారాన్ని చాకుతో తెంచి, లోపలకు ప్రవేశించి, గౌరీదేవిని, ఇంద్రాణీ దేవిని షోడశోపచారాలతో వధూవరులు పూజిస్తారు. వరుడు, వధువు కంఠంలో నీలమణి సూత్రం(నల్లపూసల) గొలుసును అలంకరిస్తాడు. అప్పుడు వరుడు 'నేను నీ పట్ల ప్రేమానురాగాలతో ఉండగలనని' చెప్పే ఒక మంత్రాన్ని పఠిస్తాడు. 

నాకబలి సందర్భంలోనే వరుడు, వధువు కాళ్లకు మట్టెలు పెట్టటం ఉంది. వధువు సన్నికల్లుమీద తన కాలును ఉంచుతుంది. అప్పుడు వరుడు, ఆమెకు కాలివేళ్లలో బొటనవేళ్ల తర్వాత ఉండే రెండో వేలుకు మట్టెలు తొడుగుతాడు. 


కాలి రెండో వేలుకు మట్టెలు వేయటం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం 'ఆక్యుప్రెషర్‌' వైద్యవిధానం ప్రకారం కాలి రెండో వేలు దగ్గర ఉండే నరం, వధువు ఉదరభాగానికి సంబంధించినదనీ, అక్కడ ఒత్తిడిని కలిగిస్తే, వధువు గర్భసంచికి మేలు కలుగుతుందనీ అంటారు.  

*సన్నికల్లు* అనేది మన నూరుడు బల్లలాగ ఉంటుంది. 'కల్‌' అనేది ప్రస్తుతం తమిళపదం అయినా, గతంలో మనకూ ఆ పదం ఉండేది. 'ఓరుగల్లు' (ఒకే రాయి, ఏక శిల), 'ఉర్వకల్లు' (ఒకే రాయి) అన్న పేర్లు దీనికి సాక్షి. ఈ పదానికి రాయి అన్న అర్థం ఉంది. 


ఏవిధంగా అయితే రాయి ఎండకూ వానకూ కూడా ప్రతిస్పందించదో, అలాగే నేనుకూడా సుఖదుఃఖాలకు ప్రతిస్పందించను అన్న భావాన్ని వధువు వ్యక్తం చేయటమే సన్నికల్లును తొక్కటం అంటారు. 


అలాగే, ఉత్తమ పతివ్రతగా అరుంధతిని చూడటమూ ఉంది. అరుంధతీ నక్షత్ర దర్శనం వెనుక ఉన్న కథా ఇదే!! 


వివాహ సంస్కారంలో ప్రధానమైన ఘట్టాలు ఇవే అయినా, దేశాచారాలను బట్టి, దంపతి పూజ, అప్పగింతలు వంటి ఇతర వేడుకలు ఉంటాయి. 


వివాహ బంధం విశిష్టతను వివరించే ఒక శ్లోకం మహాభారతంలోని అష్టక-యయాతి సంవాదంలో ఉంది. దీన్ని 'గృహోపనిషత్‌' అంటారు. ఆ శ్లోకం ఇది:


    'ధర్మాగతం ప్రాప్యధనం యజేత

    దద్యాత్సదైవాతిధీన్‌ భోజయేచ్ఛ

    అనాధదానశ్చ పరైరదత్తం

    సైషాగృహస్థోపనిషత్‌ పురాణీ!!'

అంటే, 'ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి. ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు. ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు. ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్‌ ఇదే!


ఒక మనిషి జీవితంలో వివాహ సంస్కారానికి గల ప్రాముఖ్యం అంత గొప్పది! ఈ గొప్పదనమే ఈ వివాహ వ్యవస్థను హైందవ జీవనంలో సుస్థిరం చేసింది, తరతరాలకు మార్గదర్శనం చేస్తోంది.

ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి.

 *❤️వివాహం ఓ శాశ్వత బంధం❤️*

మన సమాజంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. హైందవ సమాజంలో వివాహానికి ఉన్నంత పటిష్టత మరే సమాజంలోనూ కానరాదు.ఒక వ్యక్తి జీవితంలోనూ వివాహం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకోంటోంది. షోడశ సంస్కారాలలోనూ వివాహం ప్రత్యేకమైనది.


వివాహానికి ముందు 

ఒక వ్యక్తి ఏకవచనం, వివాహానంతరం జీవితాంతం ఆ వ్యక్తి నిత్యబహువచనం. 'నేను' అన్న మాట మరుగై, 'మేము' అన్న భావన బయటకు వచ్చే విశిష్ట క్షణానికి శ్రీకారం చుట్టేది వివాహం.

'అథో అర్థో వా ఆత్మనః యత్పత్నీః' అని ఉంది. అంటే 'ఏ పురుషుడైనా తనంత తానుగా సగమే. రెండవ సగం అతని భార్య' అని అర్థం. జీవితంలో అంతటి ప్రధానమైన భార్యను వరునికి చేరువ చేసేది వివాహం. 


'వేదాధ్యయనం పూర్తి చేసి బ్రహ్మచారి వేదోక్త కర్మానుష్ఠానం చెయ్యాలని, పరమేశ్వరుణ్ణి ఉపాసించాలని వంశ తంతువును అవిచ్ఛిన్నంగా కొనసాగించాలని తలపోయటం సహజం. ఈ ధర్మాలన్నీ ధర్మపత్న్యధీనాలు. కాబట్టే, అతడు 'నాకు యోగ్యురాలైన భార్య కావాలి' అనుకుంటాడు' అని శతపథ బ్రాహ్మణం పేర్కొంటోంది. 'సంక్షేపంగా చెప్పాలంటే, అతిథిపూజ, దేవతా పూజ, సంతాన ప్రాప్తి, యథాశక్తిదానం, స్వాధ్యాయం అనేవి గృహస్థు ధర్మాలు. వీటిని శ్రద్ధగా ఆచరిస్తే జీవితం పునీతం అవుతుంది. అందుకోసమే వివాహం.


వివాహ ప్రక్రియలో సూత్రీయం, భట్టీయం అని సంప్రదాయాలే కాకుండా దేశ కులాచారాలను బట్టి అనేక ఇతర భేదాలు కూడా ఉంటాయి. 


*వివాహంలో ప్రథమ ఘట్టం - గణపతి పూజ :*

అగ్నిసాక్షిగా జరగబోయే వివాహానికి ఎలాంటి విఘ్నాలు లేకుండా ఉండాలని గణపతిని ప్రార్థించడంతో వివాహ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. మరొక విశేషం ఏమిటంటే, విఘ్నేశ్వరుడిని అగ్నికి ప్రతీకగా భావిస్తారు. అందుకే, వేదంలో అగ్నిని స్తుతించే 'గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే కవిం కవీనా ముపమశ్రవస్తమమ్‌ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్‌' అన్న మంత్రంతోనే విఘ్నేశ్వరుడిని స్తుతించడం జరుగుతోంది. 


ఆ తరువాత, పురాణ దంపతులైన లక్ష్మీనారాయణులు, ఉమామహేశ్వరులు, వాణీహిరణ్యగర్భులు (సరస్వతీబ్రహ్మలు), శచీపురందరులు, అరుంధతీవశిష్ఠులు, సీతారాములను పూజిస్తారుతరువాత కలశపూజ. కలశపూజ తర్వాత, గణాధిపతిని ధ్యానవాహనాది షోడశోపచారాలతో అర్చిస్తారు. 


*పుణ్యాహవాచనం :*

గణపతి పూజ, కలశ పూజల తర్వాత పుణ్యాహవాచనం.


శుభప్రదమైన వివాహం జరగబోయే గృహం, వేదిక, సత్రం, మండపం.. ఏదైనా కానీ, అది పవిత్రం కావటానికి దానితో బాటు సమస్త వాయుమండలం అంతా ఒక విశిష్టమైన పవిత్రతను సంతరించుకునేందుకు ఉద్దేశించిన పవిత్ర కర్మే పుణ్యాహవాచనం. 


*స్నాతకం లేదా సమావర్తనం :*

ఇంతకాలం విద్యాభ్యాసం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించిన బ్రహ్మచారి, విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వస్తాడు. ఇలా తిరిగి రావడాన్నే 'సమావర్తనం' అంటున్నారు. తిరిగి వచ్చిన వెంటనే అతనికి అంతక్రితం తను ఎరగని సుగంధ భరితమైన జలాలతో స్నానం చేయిస్తారు. ఈ స్నానాన్నే 'స్నాతకం' అంటారు. దీనితో అతను, తన బ్రహ్మచర్యానికి స్వస్తి పలుకుతూ గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి సర్వంసహా సిద్ధపడుతున్నాడన్నమాట. 


ఈ స్నాతక సమయంలో పలికే మంత్రాలు చాలా శక్తిమంతమైనవి. వీటినే మనం నిత్యం దినవారీ పూజల్లో భాగంగా కూడా చేసే సంకల్పంలోనూ పఠిస్తాము.


'ఆపో హిష్ఠామయోభువః తాన ఉర్జే దధాతన మహేరణాయ చక్షసే

యోవ శ్శివోత్తమ రసః తస్యభాజయతేహనః ఉశతీరవ మాతరః 

తస్మా అరంగమామవః యస్యక్షయాయ జిన్వథ ఆపో జన యథాచనః'


అంటే 'ఓ ఉదకములారా! మీరు మాకు సుఖములను కలుగ జేయుదురు. మీ అనుగ్రహము చేతనే మాకు అన్నము లభిస్తున్నది. మీనుంచి లభించిన శక్తితోనే జ్ఞానము కలుగుచున్నది. కన్నతల్లులు ఏ విధముగా అయితే, తమ పిల్లలను పోషిస్తారో మీరు ఆ విధముగానే మీ మంగళకరమైన రసముతో మమ్ము పోషింతురుగాక! నశ్వరమైన ఈ దేహాన్ని రక్షించే శక్తి మీలోని రసములకు ఉంది. కావుననే మేము వినయముగా మిమ్ములను వేడుకొనుచున్నాము. మమ్ములను సత్సంతానము గలవారిగా చేయుము' అని అర్థం. 


*స్నానానంతరం*, ఆ బ్రహ్మచారి నూతన వస్త్రధారణ చేస్తాడు. తర్వాత అగ్నిని పూజిస్తాడు. అనంతరం కాటుకను అలంకరించుకుంటాడు. కానీ, అతనికి అప్పుడు ఈ అలంకరణలతో కొంత వైరాగ్యం కలిగి, ఈ అలంకరణలను చేసుకోవడంకన్నా మరింత ఉన్నత విద్యను అభ్యసించటం మంచిదనే భావన కలుగుతుంది. అందుకే మళ్లీ గొడుగు అందుకుని, పాంకోళ్లు ధరించి, ఉన్నత విద్యకై *కాశీకి ప్రయాణం* అవుతాడు. ఈ సమయంలో అతనికి వధువును ఇవ్వదలిచిన కుటుంబీకులలోని వధువు తమ్ముడు, ఇతర బంధువులు వచ్చి 'ఇక నీ బ్రహ్మచర్యానికి మంగళం పలుకుతూ, మా ఇంటి కన్యను భార్యగా స్వీకరించి, గృహస్థువు కమ్మ'ని కోరుతారు. వధువు తండ్రి మాటగా వరునికి ఇలా తెలియజేస్తారు:


*'సాలంకారం మమ సుతాం కన్యాం దాస్యామి తే ద్విజః*

*పాణిం గృహీత్వా సాగ్నిస్త్వం గచ్ఛ స్వాగచ్ఛ మద్గృహమ్‌'*


'నీకు సర్వాలంకార భూషిత అయిన మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేయిస్తాము. ఆమె చేతిని గ్రహించి, ధర్మపత్నీ సమేతుడవై, త్రేతాగ్నులతో వెళ్లగలవు. ఇప్పుడు మా ఇంటికి రాగోరుతున్నాం' అని అర్థం. ఈ వినతితో ఆ బ్రహ్మచారి, తన కాశీయాత్రను తాత్కాలికంగా పక్కన పెట్టి వివాహానికి అంగీకరిస్తూ, కల్యాణమండపం వైపు అడుగులు వేస్తాడు. 


*అంకురారోపణం :*

'అంకురం' అంటే మొలక అని అర్థం. ప్రారంభం అని కూడా మరో అర్థం చెప్పుకోవచ్చు. వివాహ శుభకార్యానికి ఇది ప్రారంభ కార్యక్రమం. వివాహ సుముహుర్తానికి ముందు రోజు రాత్రి వధూవరుల తల్లిదండ్రులు ఈ 'అంకురారోపణం' అనే కర్మను చేస్తారు. దీన్నే 'అంకురార్పణ' అనీ అంటున్నారు. 


ప్రకృతిలో ఉండే ఓషధులపట్ల కృతజ్ఞతను ప్రకటించే కర్మమే ఇది. ఓషధులకు చంద్రుడు అధిపతి కాబట్టి ఈ కర్మను రాత్రి వేళల్లోనే చేయాలి. 


మట్టితో చేసిన అయిదు పాలికలలో పుట్టమట్టి పోసి, ఆ మట్టిలోఓషధీబీజాలను వేసి, అవి మొలకెత్తేలా చేయటమే 'అంకురారోపణం'. పాలికల మూలాలలో దూర్వ (దూర్వార), రావి, మారేడు దళాలను ఉంచి, చుట్టూ తెల్లని దారంతో కడతారు. శుచి అయిన ప్రదేశాన్ని ఆవుపేడతో అలికి, ముగ్గుపెట్టి, దానిపైన ఈ పాలికలను ఉంచుతారు. తర్వాత, మంత్రాలు చదువుతూ, యజమాని ఆ పాలికలలో మట్టిని నింపుతారు. తర్వాత దొరికినంత వరకూ నువ్వులు, మినుములు వంటి ఏడు ఓషధులు (ఇవి గ్రామ్యాలు), వెదురుబియ్యం, నివ్వెరబియ్యం వంటి ఏడు ఓషధులు (ఇవి అరణ్యాలు)- వీటి అన్నింటినీ ఒక పాత్రలో పోసి, పాలతో తడిపి, ఓషధీసూక్తంతో అభిమంత్రిస్తారు. తర్వాత, ఈ ఓషధులను అయిదు పాలికలలో చల్లుతారు. పాలికలలో దేవతలను ఆహ్వానించి, పవమానసూక్తంతో నీళ్లు చల్లుతారు. తర్వాత, ఈ పాలికలను వివాహం అయ్యేంతవరకు భద్రపరచాలి. అంకురించిన ఓషధులకు శ్రద్ధగా నీరు పోస్తూ ఉండాలి. 


*వధూగృహాగమనం :*

మరింత విద్యాభ్యాసానికై కాశీ వెళ్లాలని ఆశించిన వరుడు, ఆ ప్రయత్నం మానుకుని, వివాహానికి అంగీకారం తెలపటంతో కాశీయాత్ర వేడుక పూర్తి అవుతుంది. తర్వాత వరుడు మంగళస్నానం చేసి, నూతన వస్త్రధారణ చేసి, అలంకారాలు ధరించి, వధువు గృహానికి లేదా వివాహం జరిగే కల్యాణమండపానికి బయలుదేరుతాడు. ఈ సమయంలో శకునాలన్నీ మంగళప్రదంగానే ఉండాలని అనేక శకున మంత్రాలు పఠిస్తాడు. 


*మధుపర్కం :*

అప్పటికి కన్యాదాత తమ గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణం పూర్తి చేసుకుని ఉంటారు. వధువు సైతం రక్షను ధరించి, గౌరీ పూజ చేసుకుని ఉంటుంది. ఈ సమయానికి వరుడు, వరుని బంధుమిత్రులు, కన్యాదాత గృహానికి చేరతారు. వధువు తండ్రి వరుడిని అన్వేషించటం లోకరీతి అయినా, వాస్తవానికి వధువును కోరడానికి వరుడు రావాలి. ఇలా తన కుమార్తెను కోరవచ్చిన వరుడిని వధువు తండ్రి సాదరంగా ఆహ్వానిస్తాడు. వరుడు కూర్చునేందుకు దర్భలతో కూడిన ఆసనం ఇస్తాడు. దానిపై వరుడు కూర్చున్న తర్వాత, అతని కుడికాలును, తర్వాత ఎడమకాలును కడుగుతాడు. 


తనకన్నా వయసులో పెద్ద, కాబోయే మామగారు అయిన వధువు తండ్రి అలా చేయటం వల్ల వరుడి తేజం నష్టం అవుతుంది. ఈ నష్టాన్ని అరికట్టుకోవడం కోసం వరుడు కొన్ని మంత్రాలు పఠిస్తాడు. తర్వాత, వధువు తండ్రి ఇచ్చే దధిమధుమిశ్రమాన్ని (తేనె, పెరుగు కలిపిన మిశ్రమం) మంత్రాలను చదువుతూ, స్వీకరిస్తాడు. ఈ *దధిమధు మిశ్రమాన్నే 'మధుపర్కం' అంటారు.*


*మహా సంకల్పం :*

మనం చేయబోయే ధర్మం ఏదైనా దాన్ని ఈశ్వరాజ్ఞగా భావిస్తూ పరమేశ్వరుని అనంతకాల స్వరూపాన్ని విస్మయావిష్టహృదయంతో గుర్తు చేసుకుంటూ, గోత్రనామాల్ని చెప్తూ, 'ఈ కర్మను నేను ఈశ్వరార్పణ బుద్దితో చేస్తున్నాను' అని సంకల్పిస్తాము. చేయబోయే ప్రతి పనికీ దైవానుగ్రహం ఉండాలని ఈశ్వరుడికి మన 'సంకల్పం' వివరించటమే ఇది.

కన్యాదానం వంటి ముఖ్య పుణ్యకార్యాలలో ఈ సంకల్పం నిత్యం చేసే సంకల్పం కన్నా పెద్దదిగా ఉంటుంది. దీన్నే 'మహా సంకల్పం' అంటారు.

వివాహ సమయంలో చెప్పే సంకల్పం సృష్టిక్రమవర్ణంతో ఆరంభం అవుతుంది.


'అస్య శ్రీమదాదినారాయణస్య ఆచింత్యాపరిమితశక్త్యా - ప్రకృతి మహదహంకార పృధివ్యప్తే జోవాయ్వాకాశాది..' అంటే, పరమేశ్వరుని అనంతర స్వరూపమైన భూమ్యాకాశ పర్యంతమైన విశ్వంలో ఒక చిన్న శకలమైన భూ ఖండంలో ఉన్న మనం మన సంకల్పాన్ని ఆ పరమ దైవం ముందు పెడుతున్నాం. 


'సాలంకృత కన్యాదాన మహం కరిష్యే' అంటూ కన్యాదాత అనటంతో ఈ మహాసంకల్పం ముగుస్తుంది. 


*గోత్రప్రవర :*

వివాహ వేడుకలో ఇదొక చక్కని ఘట్టం. వధూవరుల గురించి వారి పూర్వికుల ఘన చరిత్ర గురించి ఎలుగెత్తి చాటే సమయమిది. వధూవరుల నుంచి వెనుకకు మూడు తరాల గురించి వారి గోత్రనామాలు, వారి ఋషుల పేర్లు (ప్రవర) గట్టిగా చదివి వినిపిస్తారు. అలా చేయటం వల్ల వధూవరులలో 'ఇంత గొప్ప గోత్రంలో పుట్టాం. ఇందరు ఋషుల ఆశీస్సులను పొందగలుగుతున్నాం కనుక మనం ఈ మహాపురుషుల పేరు ప్రతిష్టలకు భంగం కలుగకుండా జీవించాలి' అన్న స్ఫూర్తి కలుగుతుంది. 


*కన్యాదానం :*

కన్యాదానం అనేది ఒక గొప్ప అదృష్టం. మన ఇంటి అమ్మాయిని వేరొక ఇంటి వ్యాప్తికి పంపటం సామాన్యమైన విషయం కాదు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తెను నిస్వార్థంగా ఒక వరుడి చేతిలో పెట్టడానికి ఎంత ఔదార్యం కావాలి! ఆ వరునిపై ఎంత విశ్వాసం, ఎంత గౌరవం ఉండాలి!! అందుకే, దానాలన్నిటిలోకి కన్యాదానం బహు గొప్పదని అందరూ అంటారు. 


నారికేళఫలపుష్పాక్షత హిరణ్య సహితమైన కన్య కుడి చేతిని ఆమె తల్లిదండ్రులు వరుని కుడిచేతిలో ఉదకపూర్వకంగా సమర్పిస్తారు. వరుడు తూర్పునకు, వధువు తండ్రి పశ్చిమానికి, తల్లి ఉత్తరానికి అనుకూలంగా కూర్చుని కన్యాదానం చేస్తారు. సాధారణంగా దానాన్ని ఇచ్చేటప్పడు 'తుభ్యమహం సంప్రదదేే న మమ' అంటారు. అంటే, 'ఇది నీకు ఇస్తున్నాను, ఇక నాకు దీనితో సంబంధం లేదు' అని అర్థం కానీ, కన్యాదాన సమయంలో మాత్రం వధువు తండ్రి 'తుభ్యమహం సంప్రదదే' అంటాడు. 'న మమ' (అంటే, 'ఇక నాకు సంబంధం లేదు) అని మాత్రం అనడు, అనకూడదు. 


వరుడు కూడా ఆ దానం స్వీకరిస్తూ, కొన్ని ప్రతిగ్రహ మంత్రాలు చెప్తాడు. 'దేవస్య త్వా సవితుః ప్రసవేశ్వినోర్భాహుభ్యాం పూష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి' అంటాడు. అంటే సూర్యభగవానుని అనుజ్ఞతో, అశ్వనీదేవతల బాహువులతో పూషన్‌ దేవత యొక్క హస్తాలతో స్వీకరిస్తున్నాను' అని అర్థం. 


'స్వీకరిస్తున్నావు సరే, ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి సుమా!' అంటూ బాధ్యతను గుర్తు చేస్తూ వధువు తండ్రి 'ధర్మే చ అర్థే చ కామే చ నాతిచరితవ్యా' అంటాడు. అంటే 'ధర్మములో, అర్థములో, కామములో ఆమెతోనే కలిసి ఉండాలి. ఆమెను అతిక్రమించరాదు' అని అర్థం. 


దీనికి సమ్మతిస్తూ వరుడు *'నాతి చరామి'* (అతిక్రమించను) అంటాడు. వధువు తండ్రి, వరుడు తమ తమ మాటలను మూడుసార్లు అంటారు. 


*'త్రిషత్యా హి దేవాః' అని వేదవాక్యం.* అంటే ముమ్మారు అన్నది సత్యమని అర్థం. ఈ కారణంగానే మూడుసార్లు అనిపించటం!!


*సుముహూర్తం :*

వివాహానికి నిర్ణీతమైన ముహూర్తానికి ముందు పురోహితులు వివాహ మంగళ శ్లోకాలను చదువుతారు. వివిధ దేవతల ఆశీర్వాదాలు కాబోయే వధూవరుల మీద వర్షించాలనే ప్రార్థనలు ఇవి. దీని తర్వాత 'చూర్ణిక' అనే సంస్కృత గద్య పఠనం ఉంటుంది. ఇవి కూడా ప్రార్థనలే. తర్వాత సుమూహూర్తానికి ముందు *'సుముహూర్తో సావధాన* అంటూ అందరినీ సావధానులు కమ్మంటూ హెచ్చరికలు చేస్తారు. సుముహూర్త సమయంలో వధూవరులు తమ తమ శిరస్సులపై పరస్పరం జీలకర్ర, బెల్లములతో కలిపి చేసిన ముద్దను ఉంచుకుంటారు. 


'ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః, ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌' అంటూ పురోహితులు ఆశీర్వచనాలు పలుకుతారు. 


*వధూసమీక్షణము :*

ఈ సమయంలో వధువును చూస్తూ, వరుడు కొన్ని మంత్రాలను పఠిస్తాడు. వధువు తనతో రావటం వల్ల వధువును తనకు ఇచ్చిన కుటుంబం పొందే వియోగం గురించిన ప్రస్తావన, దానికి ఓదార్పు వచనాలు ఈ మంత్రాలలో ఉంటాయి. 


*వధువును అభిషేకించటం :*


దర్భలతో తయారు చేసి 'ఇణ్వము' అనే వలయాన్ని వధువు శిరస్సుపై ఉంచి, కాడి ఎడమ రంధ్రంలో బంగారం ఉంచి, ఆ రంధ్రం గుండా నీటిని వధువు తలపైన పడేలాగ వరుడు సమంత్రకంగా పోస్తాడు. ఈ విధంగా అభిషేకించడం వల్ల వధువు సూర్యునిలా నిత్యప్రకాశవంతం అవుతుందని భావన. దీనికి ఒక పురాణ గాధను ఆధారంగా చెప్తారు. ఈ అభిషేకం అయిన తర్వాత, వధువుపైన వరుడు ఒక నూతన వస్త్రాన్ని కప్పుతూ, ఒక మంత్రం పఠిస్తాడు. 


*యోక్త్రబంధనం :*

వధువు నడుము చుట్టూ ఒక దర్భతాటిని గట్టిగా కట్టి, వరుడు ఒక మంత్రాన్ని పఠిస్తాడు. వివాహం ఒక శాశ్వత బంధం.


*మంగళ సూత్రధారణం :*

వివాహ సమయలో మరొక ముఖ్యఘట్టం - మంగళసూత్ర ధారణం. సమాజంలో స్త్రీకి సముచిత స్థానం ఇవ్వటానికీ, ఆమెకు వివాహం జరిగిందన్న దానికి సూచికగానూ మంగళ సూత్రం ఉపయుక్తంగా ఉంటోంది. ఈ సందర్భంగా, వివాహం అనేది వధూవరులైన స్త్రీ పురుషులు ఇద్దరికీ జరుగుతుండగా, కేవలం స్త్రీ మాత్రమే మంగళసూత్రం ధరించవలసిన అవసరం ఏమిటన్న వాదం ఉంది. నిజానికి వివాహ సమయంలో వరుడు కూడా తన బ్రహ్మచర్యం నాటి యజ్ఞోపవీతానికి అదనంగా మరొకటి, ఉపవస్త్రం స్థానే మరొకటి, మొత్తం ఉపవీతాలు మూడింటిని ధరిస్తాడు. కనుక ఈ విషయంలో స్త్రీపురుషుల వ్యత్యాసం ఏమీ లేదనే చెప్పాలి. మంగళసూత్రాన్ని వధువు మెడలో వేస్తున్నప్పుడు వరుడు సుప్రసిద్దమైన 

*'మాంగల్యతంతునానేన మమ జీవనహేతునా,కంఠే బధ్నామి సుభగే* *త్వంజీవ శరదాం శతమ్‌'*

అనే శ్లోకాన్ని పఠిస్తాడు. అంటే 'నేను ఈ మంగళ సూత్రాన్ని నీ మెడలో కడుతున్నాను. ఇకపై నా జీవనం దీనిపైనే ఆధారపడి ఉంది. నీవు శతాయుర్దాయాన్ని పొందుము' అని అర్థం. మంగళసూత్రం వధువు సౌభాగ్యానికి హేతువు అని కూడా భావించడం కద్దు. 


*అక్షతారోపణం :*

వివాహకార్యక్రమంలో ఈ ఆనంద వేడుకనే మనం 'తలంబ్రాలు', 'అక్షింతలు' అనీ అంటున్నాం. 'అక్షత' అంటే క్షతి లేనిదని, అంటే నాశనం లేనిదని అర్థం. 'అక్షతలు' అంటే అంతులేని శుభాలను కలుగజేసేవని అర్థం. తండులాలు (బియ్యం), ఘృతము (నెయ్యి), క్షీరము (పాలు) కలిపిన మంగళద్రవ్యాలను మనం 'అక్షతలు'గా భావిస్తున్నాం. వరుడు, వధువు చేతిలో కొద్దిగా పాలను రెండుసార్లు రాసి, తర్వాత రెండుసార్లు తండులాలను పోసి, మళ్లీ పాలతో రెండు సార్లు అభిఘారం చేస్తాడు. అప్పుడు వరుని చేతిలో కన్యాదాత లేదా పురోహితుడు అలాగే చేస్తాడు. అప్పుడు వధువు చేతులలో వరుని చేతులను ఉంచి వాటిలో కొంత బంగారం పెట్టి, ఈ మంత్రాన్ని పఠిస్తూ ఉదకాన్ని పోస్తాడు. 


'పుణ్యం వర్ధతాం.. శాన్తిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివం కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు, తిథికరణముహూర్తనక్షత్రసంపదస్తు' అంటూ మంత్రపఠనం చేస్తారు. మరికొన్ని మంత్రాల తర్వాత, వధూవరులు పరస్పరం అక్షతలను పోసుకుంటారు. వివాహమండపంలో ఇదొక సంబరం. 


*మహదాశీర్వచనము:*

కొత్త దంపతులను వేద పండితులు ఆశీర్వదించడం ఇది. అనేక వేదోక్తమైన వచనాలతో నూతన వధూవరులు ఆశీర్వచనం అందుకుంటారు. 


*ప్రధానహోమము :*

వధూవరుల వస్త్రాల కొంగులను సువర్ణ ఫల సహితంగా, అగ్నిని స్తుతించే మంత్ర సహితంగా ముడి వేస్తారు. దీనికి *'బ్రహ్మగ్రంధి'(బ్రహ్మముడి)* అని పేరు. తర్వాత, కొంగుముడులు వేసుకున్న కొత్త దంపతులు అగ్నిసాక్షిగా కొన్ని హోమాలు చేస్తారు. అగ్నిసాక్షిగా వివాహం అంటే ఇదే!ఇంత వరకూ 'ఎవరో' అయిన వధువు ఈ క్షణం నుంచి వరుని ఇల్లాలు అవుతుంది. ఇంత ప్రధానమైనది కాబట్టే దీనికి 'ప్రధాన హోమము' అని పేరు. 


*పాణిగ్రహణము:*

వరుడు తన కుడి చేతితో వధువు చేతిని పట్టుకోవడమే 'పాణిగ్రహణము'.


 'గృహ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథా సః భగో అర్యమా సవితా పురంధిర్మహ్యం త్వాదుర్గార్‌హపత్యాయ దేవాః' 

అన్న మంత్రాన్ని పఠిస్తూ వరుడు 'నేను నీ చేతిని గ్రహిస్తున్నాను, ఇకపై నీ బాధ్యత నాది' అంటూ వధువుకు వాగ్దానం చేస్తాడు. 'చేతిలో చెయ్యేసి చెప్పడం' ఇదే!!


*సప్తపది :*

మాంగల్యధారణ జరిగిన తర్వాత, అగ్నిసాక్షిగా ఆ నూతన వధూవరులు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఏడడుగులు కలిసి నడుస్తారు. ఇదే 'సప్తపది'. అంటే ఏడు అడుగులు కలిసి నడవటం అన్నమాట. వాస్తవానికి ఈ సమయంలో వధువు నడుముపై వరుడు చెయ్యి వేసి, దగ్గరగా తీసుకుని, అగ్నిహోత్రానికి దక్షిణవైపున నిలబడి ఏడడుగులు నడవాలి. ఒక్కో అడుగుకు ఒక్కొక్క మంత్రాన్ని పురోహితులు చెప్తారు. 


మొదటి అడుగుకు: 'ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే, 'ఈ తొలి అడుగుతో విష్ణువు మనలను ఒక్కటి చేయుగాక!' అని అర్థం.

రెండో అడుగుకు: 'ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు' అన్నది మంత్రం. అంటే, 'ఈ రెండవ అడుగుతో విష్ణువు మనకు శక్తిని కలుగజేయుగాక!' అని అర్థం. 

మూడవ అడుగు మంత్రం: 'త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు' అంటే, 'ఈ మూడవ అడుగుతో వివాహవ్రత సిద్ధికి విష్ణువు మనలను కరుణించుగాక!' అని అర్థం.

నాలుగో అడుగుకు మంత్రం: 'చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు'. అంటే, 'ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందం కలుగజేయుగాక' అని అర్థం.

ఐదవ అడుగుకు 'పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అనేది మంత్రం. అంటే 'ఈ ఐదవ అడుగుతో మనకు పశుసంపదను విష్ణువు కలిగించుగాక!' అని అర్థం.

ఆరవ అడుగుకు 'షడృతుభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రపఠనం జరుగుతుంది. అంటే 'ఈ ఆరవ అడుగుతో మనకు ఆరు ఋతువులూ సుఖమునే కలిగించుగాక!' అని అర్థం.

ఏడవ అడుగుతో 'సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు' అన్న మంత్రం చదువుతారు. అంటే 'ఈ ఏడవ అడుగుతో గృహస్థాశ్రమ ధర్మనిర్వహణను మనకు విష్ణువు అనుగ్రహించుగాక' అని అర్థం.


అదే సమయంలో వరుడు 'సఖాసప్తపదాభవ! సఖాయౌ సప్తపదాబభూవ! సఖ్యం తే గమేయగ్‌ం సఖ్యాత్‌! తేమాయోషం సఖ్యాన్మే మాయోష్ఠాగ్‌ం సమాయవః సంప్రియౌ రోచిష్ణూ సుమన స్యమానౌ, ఇష మూర్జమభినంవసానౌ నం నౌమనాగ్‌ంసి సంవ్రతా సమచిత్తన్యాకరమ్‌' అంటాడు. అంటే, 'ఏడడుగులతో నాకు మిత్రమైన ఓ సఖీ! నీవు నా స్నేహాన్ని వీడకు, మంచి ప్రేమగలవారమై, మంచి మనసుతో కలిసి జీవిద్దాం, సమాలోచనలతో ఒకే అభిప్రాయంతో కలిసి ఉందాం!' అంటాడు. 


దానికి జవాబుగా ఆ వధువు 

'పాత్వమసి అమూహం! అమూహమస్మి! సా త్వం ద్వౌ, అహం పృథివీ! త్వం రేతో అహం రేతోభృత్‌! త్వం మనో అహమస్మి వాక్‌! సామాహమస్మి, ఋక్తం సా మాం అనువ్రతాభవ!' 

అంటుంది. అంటే 'ఓ మిత్రమా! నీవు ఎప్పుడూ తప్పు చేయకుండా ఉండు. నేను కూడా ఏ తప్పులూ చేయను! నీవు ఆకాశమైతే నేను భూమిలా కలిసి ఉందాం. నీవు శుక్రమైతే నేను శ్రోణితాన్ని! నీవు మనసైతే నేను వాక్కును! నేను సామ(వేదగాన)మైతే నీవు ఋక్కువై కలిసి ఉందాం!!' అని అర్థం.


అప్పుడు వరుడు, వధువును ఇలా వేడుకుంటాడు: 

'పుంసే త్రాయ వేత్తవేశ్రియై ఉత్తరయ వేత్తావయేహి సూనృతే!' అంటాడు. అంటే 'మన వంశాభివృద్ధి కోసం, ఉత్తరకాలంలో ఉత్తమ లోకాల ప్రాప్తి కోసం, ధైర్యవంతుడైన, సత్యవాక్‌ పరిపాలకుడైన వంశాభివృద్ధి చేయగల పుత్రులను నాకు ప్రసాదించు!' అని అర్థం. 


వివాహ మహోత్సవంలో ఇదొక అద్భుత ఘట్టం. ఈ ఘట్టంతో వధువు గోత్రం మారుతుంది. ఆమె వరుని సతీమణి అయి, అతని గోత్రవతి అవుతుంది. 


*అశ్మారోహణము :*

అగ్నికి ఉత్తరంగా సన్నికల్లు మీద వధువు కుడికాలును ఉంచి, వరుడు ఒక మంత్రం పఠిస్తాడు. భార్యభర్తల మధ్య బంధం శిలాసదృశమని దీని సూచన. ఒకప్పుడు సన్నికల్లుకు ఇంట్లో ఎంతో ప్రాముఖ్యం ఉండేది. ఇంటిలోనివారికి కావాల్సిన ధాన్యాన్ని దంచటం అంటే, ఇంటిలోని వారందరి యోగక్షేమాలు చూడటమన్నమాట. అది గృహాధిపత్యానికి సూచన. వధువు తన కుడికాలును అంత శక్తిమంతమైన సన్నికల్లు మీద ఉంచిందీ అంటే, గృహాధిపత్యం తనదేనని చెప్పటం అనుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోని వారికోసం బియ్యం దంచటమనే ప్రసక్తి లేకపోయినా, ఆ అధికార గ్రహణ సూచనలు కొనసాగుతూనే వస్తున్నాయి. 


*లాజహోమము :*

'లాజలు' అంటే పేలాలు. వధువు చేతిలో ఆమె సోదరుడు పేలాలను పోసి, వాటిని నెయ్యితో అభిఘరించి, వాటితో మంత్రపూర్వకంగా వరుడు వామపార్శ్వహోమం చేయిస్తాడు. తర్వాత, వధూవరులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. 


*యోక్త్ర విమోచనము :*

యోక్త్రబంధన సమయంలో వధువు నడుము చుట్టూ కట్టిన బంధాన్ని వరుడు సమంత్రకంగా విప్పటమే ఈ సంస్కారం.


*వధువు వరుని ఇంటికి వెళ్లటం :*

వివాహానంతరం వధువు, వరుని ఇంటికి వెళ్లటం ఆనవాయితీ. ఈ సమయంలో వరుడు ఆమెను తన (తమ) ఇంటికి తీసుకు వెడుతూ కొన్ని మంత్రాలు పఠిస్తాడు. వాటిలో ఒక మంత్రంలో 'మూర్ధానాం పత్యురారోహ' అంటాడు. అంటే 'నీవు నా శిరసును అధిష్టించుము' అని అర్థం. అంటే, 'ఇకపై నా మీద అన్ని అధికారాలూ నీవే!'నని చెప్పటమన్నమాట. అలాగే, ఇంటిలో ఉండే అత్తామామలు, ఆడబడుచులు, మరుదుల మీద నీదే అధికారమని అనేక మంత్రాలలో చెప్తాడు. వరుని ఇంటికి వెళ్లే మార్గాన్ని ఇలా అధిగమించాక, వరుని ఇంటి వద్దకు వచ్చిన ఆమెకు స్వాగతం పలుకుతూ మరికొన్ని మంత్రాల పఠనం జరుగుతుంది. అయితే, *ఇప్పుడు సమయాభావం చేత, కాకుంటే వరుని గృహం దూరం, పోయి రావటం భారం కావటంతో, ఈ వేడుకలన్నీ క్షణాల మీద పెళ్లి పందిట్లోనే జరిగిపోతున్నాయి.*


*ప్రవేశ హోమము :*

గృహప్రవేశం అనంతరం, వధూవరులు సంకల్పం చేసుకుని, వైవాహికాగ్నిని ప్రతిష్ఠించి, ప్రవేశహోమాన్ని నిర్వహిస్తారు. తన ఇంటికి వచ్చిన నూతన వధువుకు స్వాగతం చెప్తూ, ఇంటి బాధ్యతలను అప్పగిస్తూ, వరుడు పలు మంత్రాలు చదువుతాడు. అలాగే, తమ బంధుమిత్రులందర్నీ తమకు ఆశీస్సులు అందజేయమని కోరతాడు.


*నక్షత్ర దర్శనము :*

సాయంత్రం నక్షత్రోదయం అయ్యాక, పురోహితులు నూతన వధూవరులకు నక్షత్ర దర్శనం చేయిస్తారు. తూర్పు లేదా ఉత్తర దిక్కుకు కొంత దూరం నడిచిన పిమ్మట, ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ, వరుడు ఆ నక్షత్రంనుంచి ఆశీస్సులు కోరతాడు. ఆకాశంలో స్థిరమైన ధ్రువ నక్షత్రం లాగానే తమ దాంపత్యం సుస్థిరంగా ఉండాలనే ఆకాంక్షను ఆ దంపతులు వ్యక్తం చేస్తారు. ధ్రువమండలంలోని పరబ్రహ్మను ఉపాసించటం వల్ల అపమృత్యుభయం తొలగిపోతుందనీ, సమస్త సంపదలు లభిస్తాయని విశ్వాసం. ఆ తర్వాత, పురోహితులు ఆ నవ దంపతులకు సప్తర్షి మండలాన్ని, అరుంధతీ నక్షత్రాన్ని చూపిస్తారు. ఏడుగురు మహాఋషుల తర్వాత స్థానం పొందాలని వరునికీ, సప్తర్షు భార్యలలో ఏడవది అయిన అరుంధతి తర్వాత స్థానం పొందాలని వధువుకు సూచించడం ఇది. ఇదే సమయంలో వధూవరులు ఆ నక్షత్రాలకు అర్ఘ్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో పఠించే మంత్రం ఇది:


'సప్త ఋషయా ప్రథమం కృత్తికానాం - అరుంధతీం యద్‌ ధ్రువత్వం హనిన్యుః

షట్‌ కృత్తికా ముఖ్యయోగం వహన్తి ఇయమ్‌ - అస్మాకం ఇధతు అష్టమి' 

'సప్తర్షులను, కృత్తికలలో మొదటిదైన అరుంధతిని ప్రార్థిస్తున్న ఈ వధూవరులకు నిత్యత్వం లభించుగాక. ఈ వధువుకు అరుంధతి తోడుగా గల ఇతర ఆరుగురు పతివ్రతల (సప్తర్షుల సతీమణుల) తర్వాత ఎనిమిదవ స్థానం లభించుగాక!' అని అర్థం. 


*ఆగ్నేయ స్థాలీపాకము :*

దీన్నే మనం సంక్షిప్తంగా 'స్థాలీపాకం' అంటున్నాం. అగ్నిని ఉపాసించి, జీవనానికి శ్రీకారం చుట్టాలని చేసే కర్మనే 'ఆగ్నేయ స్థాలీపాకం' అంటారు. 


వధువు ఒక గిన్నెలో బియ్యం పోసి, నీళ్లు పోసి, అగ్నిహోత్రంలో వండి హోమం కోసం సిద్ధం చేస్తుంది. ఈ హోమద్రవ్యాన్ని 'చరువు' అంటారు. దీన్ని కొద్దికొద్దిగా చేతితో హోమసాధనమైన దర్విలోకి తీసుకుని, ఆజ్యంతో అభిఘారం చేసి రెండుసార్లు వరుడు సమత్రంకంగా హోమంలో వేస్తాడు. చరువు చేయటంతో భార్య తన విధిని నిర్వహిస్తూ, భర్తకు తోడ్పడుతూ ఉంటుంది. హోమం చేయగా మిగిలిన చరువును వధూవరులు యజ్ఞప్రసాదంగా స్వీకరిస్తారు. 


*శేషహోమము :*

వివాహంలో ఇదే చివరి హోమం. ఇందుకే దీనికి 'శేష హోమము' అని పేరు. ఈ హోమ సమయంలో వరుడు అగ్నితో బాటు వాయువు, ఆదిత్యుడు, ప్రజాపతులతోబాటు ద్వాదశమాసాధిపతులనూ ప్రార్థిస్తూ, హోమం చేస్తాడు. ఈ హోమ సమయంలో వధువు, వరుడిని వీక్షిస్తుంది. 


*నాకబలి :*

దీన్ని ఇప్పుడు 'నాగవల్లి' అనటం జరుగుతోంది. వాస్తవానికి అది 'నాకబలి' మాత్రమే! దేవతలకు చేసే పూజను 'నాకబలి' అంటారు. ఇంటి మధ్యలో చతురస్రాకారంలో మట్టిని అలికి, అయిదు రకాల రంగులతో, పిండితో పద్మాకారాన్ని చిత్రిస్తారు. ఉత్తర దక్షిణ దిక్కులలో రెండు ఏనుగుల బొమ్మలను చిత్రించి, పద్మ మధ్యంలో గౌరీదేవి బొమ్మను ప్రతిష్ఠిస్తారు తూర్పున రెండు కలశాలను, నాలుగు దిక్కులలో మట్టితో చేసిన 33 నాకబలి పాత్రలను ఉంచుతారు. చుట్టూ దారం కట్టి, పుష్పాక్షతలతో అలంకరిస్తారు. ఇద్దరు ముతైదువలు పళ్లాలలో 33 దీపాల్ని పట్టుకుంటారు. ఈ 33 సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉందని కొందరి భావన. 27 నక్షత్రాలు, త్రిమూర్తులు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) ముగ్గురు, వారి సతీమణులు (సరస్వతి, లక్ష్మి, పార్వతి) ముగ్గురు- మొత్తం కలిసి 33. 

వీరందరినీ ఉపాసించటం కోసమే ఈ 33 పాత్రలు, 33 దీపాలు. దీపాలను వెలిగించి తెచ్చిన ముత్తయిదువులతో కలిసి, వరుడు- అతని చేయి పట్టుకుని వధువు, పురోహితుడితో సహా అందరూ కలిసి ఆ అలంకృత ప్రదేశం చుటూముమ్మారు ప్రదక్షిణలు చేస్తారు. ఈ సమయంలో 'మమాగ్నేవర్చః' అన్న మంత్రాలను పఠిస్తారు. చుట్టూ దీపాల్ని అలంకరిస్తారు. నాకదేవతలకు 33 అన్నకబళాలను నైవేద్యంగా పెడతారు. తర్వాత, పడమర దిక్కులోని దారాన్ని చాకుతో తెంచి, లోపలకు ప్రవేశించి, గౌరీదేవిని, ఇంద్రాణీ దేవిని షోడశోపచారాలతో వధూవరులు పూజిస్తారు. వరుడు, వధువు కంఠంలో నీలమణి సూత్రం(నల్లపూసల) గొలుసును అలంకరిస్తాడు. అప్పుడు వరుడు 'నేను నీ పట్ల ప్రేమానురాగాలతో ఉండగలనని' చెప్పే ఒక మంత్రాన్ని పఠిస్తాడు. 

నాకబలి సందర్భంలోనే వరుడు, వధువు కాళ్లకు మట్టెలు పెట్టటం ఉంది. వధువు సన్నికల్లుమీద తన కాలును ఉంచుతుంది. అప్పుడు వరుడు, ఆమెకు కాలివేళ్లలో బొటనవేళ్ల తర్వాత ఉండే రెండో వేలుకు మట్టెలు తొడుగుతాడు. 


కాలి రెండో వేలుకు మట్టెలు వేయటం వెనుక ఒక శాస్త్రీయమైన కారణం 'ఆక్యుప్రెషర్‌' వైద్యవిధానం ప్రకారం కాలి రెండో వేలు దగ్గర ఉండే నరం, వధువు ఉదరభాగానికి సంబంధించినదనీ, అక్కడ ఒత్తిడిని కలిగిస్తే, వధువు గర్భసంచికి మేలు కలుగుతుందనీ అంటారు.  

*సన్నికల్లు* అనేది మన నూరుడు బల్లలాగ ఉంటుంది. 'కల్‌' అనేది ప్రస్తుతం తమిళపదం అయినా, గతంలో మనకూ ఆ పదం ఉండేది. 'ఓరుగల్లు' (ఒకే రాయి, ఏక శిల), 'ఉర్వకల్లు' (ఒకే రాయి) అన్న పేర్లు దీనికి సాక్షి. ఈ పదానికి రాయి అన్న అర్థం ఉంది. 


ఏవిధంగా అయితే రాయి ఎండకూ వానకూ కూడా ప్రతిస్పందించదో, అలాగే నేనుకూడా సుఖదుఃఖాలకు ప్రతిస్పందించను అన్న భావాన్ని వధువు వ్యక్తం చేయటమే సన్నికల్లును తొక్కటం అంటారు. 


అలాగే, ఉత్తమ పతివ్రతగా అరుంధతిని చూడటమూ ఉంది. అరుంధతీ నక్షత్ర దర్శనం వెనుక ఉన్న కథా ఇదే!! 


వివాహ సంస్కారంలో ప్రధానమైన ఘట్టాలు ఇవే అయినా, దేశాచారాలను బట్టి, దంపతి పూజ, అప్పగింతలు వంటి ఇతర వేడుకలు ఉంటాయి. 


వివాహ బంధం విశిష్టతను వివరించే ఒక శ్లోకం మహాభారతంలోని అష్టక-యయాతి సంవాదంలో ఉంది. దీన్ని 'గృహోపనిషత్‌' అంటారు. ఆ శ్లోకం ఇది:


    'ధర్మాగతం ప్రాప్యధనం యజేత

    దద్యాత్సదైవాతిధీన్‌ భోజయేచ్ఛ

    అనాధదానశ్చ పరైరదత్తం

    సైషాగృహస్థోపనిషత్‌ పురాణీ!!'

అంటే, 'ధనాన్ని ధర్మమార్గంలోనే సంపాదించాలి. సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దైవకార్యాలకు, దానానికి వెచ్చించాలి. ఇతరుల ధనాన్ని ఎన్నడూ అపహరించరాదు. ఇతరులు దానం చేసిన దాన్ని తీసుకోవచ్చు. ఇంటికి విచ్చేసిన అతిథులను సాదరంగా సత్కరించి, భోజన సమయమైతే తప్పక వారికి భోజనాన్ని ఏర్పాటు చేయాలి.' అతి ప్రాచీనమైన గృహస్థోపనిషత్‌ ఇదే!


ఒక మనిషి జీవితంలో వివాహ సంస్కారానికి గల ప్రాముఖ్యం అంత గొప్పది! ఈ గొప్పదనమే ఈ వివాహ వ్యవస్థను హైందవ జీవనంలో సుస్థిరం చేసింది, తరతరాలకు మార్గదర్శనం చేస్తోంది.

Keep an eye on what karma

 After Shri Krishna killed Kansa, he went to the jail to release Vasudev and Devki, his mother and father.


Devki mata asked eagerly, "Child, you are God yourself, and you have divine powers; then, why did you wait fourteen years to kill Kansa and release us"? 


Shri Krishna replied, ′′ Respected mother, forgive me. But why did you send me to the jungle for fourteen years in my last birth?


Devki was very surprised and said, ′′ Krishna, how is this possible? Why are you saying this?"


Shri Krishna replied, ′′ Mother, you will not remember anything about your previous birth. But you were Kaikayi in your last birth and your husband was Dashrath".


Devki was very surprised and asked curiously, ′′ Then, who is Kausalya now?"


Shri Krishna replied, ′′ Mother Yashoda. The fourteen years of mother's love that she was deprived of in her last life, she got it in this life ′′


Everyone has to bear the fruits of their karma, even the gods cannot escape from it.


Keep an eye on what karma you want accumulate.

అకాల మృత్యు హరణం

 🙏 *అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం! సమస్త పాపక్షయకరం శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం!!* 🙏

🕉పూజారులు ఈ మంత్రం జపిస్తూ భక్తులకు తీర్ధాన్ని ఇస్తారు.

💧 *తీర్ధం* యొక్క విశిష్టత ప్రత్యేకంగా ఇంట్లో, దేవాలయంలో లేదా ఇంకెక్కడైనా దేవుడిని దర్శించుకున్న తర్వాత తీర్ధం తీసుకుంటాం.

దేవునికి పూజ చేసిన తర్వాత తీసుకునే తీర్ధంలో

💦 *పంచామృతాలు* ,

☘ *తులసి దళాలు* ,

🥃 *సుగంధ ద్రవ్యాలు* ,

📿 *మంత్ర శక్తులు* ఉంటాయి. దీంతో ఆ తీర్ధం అత్యంత పవిత్రంగా మారుతుంది. తీర్ధం తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం, ఆధ్యాత్మికత మెరుగవుతాయి.

👌 *మొదటిసారి* తీర్ధం తీసుకుంటే శారీరక, మానసిక శుద్ధి జరుగుతుంది. ( *అకాల మృత్యు హరణం* )

👌 *రెండవసారి* తీర్ధం తీసుకుంటే న్యాయ, ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి. ( *సర్వవ్యాధి నివారణం!* )

👌 *మూడవది* పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుని తీసుకోవాలి.( *సమస్త పాపక్షయకరం* )

📚 *పురాణాల** ప్రకారం తీర్ధం అంటే తరింపజేసేది అని అర్ధం. దీన్ని మూడుసార్లు తీసుకుంటే.. భోజనం చేసినంత శక్తి వస్తుందని అంటారు. తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో తీసుకోవాలి. ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యానికి మరియు నా ఆధ్యాత్మికతను మెరుగు పరుస్తుంది అనే సద్భావంతో తీసుకోవాలి.

మూడు సార్లు కూడా కుడిచేయి కింద ఎడమ చేయిని ఉంచి తీర్థం తీసుకోవాలి. *కుడిచేయి చూపుడు వేలు మధ్యలోకి బొటన వేలిని మడిస్తే గోముఖం ముద్ర* వస్తుంది. ఈ ముద్రతో తీర్థాన్ని తీసుకోవాలి. తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకుంటారు. అలా చేయకూడదు. తల పైన బ్రహ్మ రంద్రం *సహస్రార చక్ర* ఉంటుంది. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాము. కనుక కళ్లకద్దుకోవడం మంచిది.


🙏 *శివోహం* 🙏



🌴🌿🌴🌿🌴🌿🌴🌿🌴🌿🌴

నాటి ఇంద్రపురమే

 నాటి ఇంద్రపురమే నేటి నిజమాబాదు.

.......................................................


రాష్ట్రకూటరాజైన ఇంద్ర వల్లభునకు బోదనపట్టణం రాజధానిగా వుండేది. తెలంగాణాలోని ఇప్పటి బోదన్ పట్టణనానికి గల నిజమైన పేరు బొదన. ఆంగ్లమోజులోపడి మనం ఇలా తయారయ్యాం. ఈ రాజు బోదన పట్టణాన్ని రాజధానిగా పాలించాడు. 1086 కాలంనాటి శాసనమొకటి ఇక్కడే లభించింది. వేయించినవాడు త్ర్యలోక్యమల్ల ప్రథమసోమేశ్వరుడు. 


" రాష్ట్రకూటాయ చక్రేశ్వరం ఇందరవల్లభం

రాజధాని బోదనదోళ్ మాడిసిద

ఇంద్రనారాయణదేవర దేవాయతనం "


పై కన్నడశాసనం ప్రకారం ఇంద్రవల్లభుడు బోదనపట్టణంలో ఇంద్రనారాయణదేవర దేవస్ధానాన్ని నిర్మించాడు.


ఇప్పటి నిజమాబాదుకు మొన్నటి వరకు ఇందూరు అని పేరు. ఇందూరు అనేపేరు ఇంద్రపురం నుండి వచ్చిందని, ఇంద్రపుర నిర్మాత ఇంద్రవల్లభుడేనని అతని పేరు మీదుగానే ఇంద్రపురాన్ని నిర్మించడం జరిగిందని చరిత్రకారుల నిర్ణయం.


॥సేకరణ॥

______________________________________________జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

S E N I O R C I T I Z E N S - 2021*

 *S E N I O R C I T I Z E N S - 2021*


▪When you get old, never teach anyone anything, unless requested, even if you are sure you are right. 

▪Do not try to help unless asked for. Just be ready & available for it if possible.

▪️Do not give unsolicited opinion all the time.

▪️Do not expect everyone to follow your opinion, even though you feel your opinion was the best...

▪Don't impose yourself on anyone on any subject. 

▪Don't try to protect your loved ones from all the misfortunes of the World. Just love them & pray for them.

▪Don't complain about your health, your neighbours, your retirement, your woes all the time.

▪Don't expect gratitude from children. 

▪There are no ungrateful children, there are only stupid parents, who expect gratitude from their children. 

▪Don't waste your last money on anti - age treatments. It's useless.

▪Better spend it on a trip. It's always worth it.

▪Take care of your spouse, even if he/she becomes a wrinkled, helpless and moody old person. Don't forget he/she was once young, good looking and cheerful, may be he/she is the only one who really needs you right now.

▪Understand new technologies, obsessively follow the News, constantly study something new, a new skill, a new dish, a new indoor game, do not fall behind in time. 

▪Don't blame yourself for whatever happened to your life or to your children's lives, you did everything you could.

▪Preserve your dignity & integrity in any situation, till the end. 

▪Do your best, my senior Peers. This is very important. Remember, you're still alive, someone needs you. Do your best & leave the rest to The Almighty.

▪I guess some friends are already following these tips. 


This is what is known as ‘ageing gracefully’ 🙏

అంతరంగం

 *ఒక పెద్దాయన మాటలు అంతరంగం :.....* 👌👍👏🙏🌷


నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.

చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.

కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం


పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

పెద్దవారు మనకు మార్గదర్శనం.....🙏🙏


 *ఇలా కూతురు లా చూసుకునే కోడళ్ళు ఉన్నంత కాలం వృద్దాశ్రమాలతో పనివుండదు.* 👍👍🙏🙏

beautiful answer.

 What a beautiful answer.! Comparison between two "Generations" Everyone must read 👌👌


A youngster asked his father : How did you people live before with:

No access to technology

No aeroplanes

No internet

No computers

No dramas

No TVs

No air cons

No cars

No mobile phones?


Dad replied :

"Just like how your generation live today":


No prayers

No compassion

No honor

No respect

No character

No shame

No modesty

No time planning

No sports 

No reading 


We, the people that were born between 1940-1980 are the blessed ones. Our life is a living proof:

👉 While playing and riding bicycles, we never wore helmets.

👉 After school, we played until dusk. We never watched TV.

👉 We played with real friends , not internet friends.

👉 If we ever felt thirsty, we drank tap water not bottled water.

👉 We never got ill although we used to share the same glass of juice with four friends.

👉 We never gained weight although we used to eat a lot of rice everyday.

👉 Nothing happened to our feet despite roaming bare-feet.

👉 our mother and father never used any supplements to keep us healthy. 

👉 We used to create our own toys and play with them.

👉 Our parents were not rich. They gave us love, not worldly materials.

👉 We never had cellphones, DVDs, play station, XBox, video games, personal computers, internet chat - but we had real friends.

👉 We visited our friend's home uninvited and enjoyed food with them.

👉 unlike your world we had Relatives who lived close by so family time and ties were enjoyed together. 

👉 We may have been in black and white photos but you can find colourful memories in those photos.

👉 We are a unique and the most understanding generation, because *we are the last generation who listened to their parents*. *Also , the first who have had to listen to their children.* and we are the ones who are still smarter and helping you how to use the technology that never exist while we were your age!!!


We are a LIMITED edition! So you better:

Enjoy us. 

Learn from us.

Treasure us.

Before we disappear from Earth and your lives...

Love everything and everyone ❤❤❤

బ్రాహ్మణులు కొరకు కాశీలో

 బ్రాహ్మణులు కొరకు కాశీలో ప్రత్యేక ఆశ్రమం :


బ్రాహ్మణులు కొరకు కాశీలో శ్రీ కాశీ గాయత్రీ ఆశ్రమ సేవ సొసైటీ తరపున ప్రత్యేక ఆశ్రమం ఏర్పాటు చేసాము.


⏩ఏ.సి, నాన్ ఏ.సి రూములు, అతి తక్కువ ధరలకే సింగిల్ బెడ్ లు, ఎయిర్ కూలర్ గదులు కేటాయింపు..


⏩2, 3, 5 పడకలు గల రూములు కలవు. ఎయిర్ కూలర్ సదుపాయంతో ఒక్కొక్కరికి కేవలం 150/- (ఒక రోజుకు) లకే వసతి కల్పించబడును.


⏩ఈ ఆశ్రమంలోబ్రాహ్మణులు కొరకు ప్రత్యేక నారాయణ సేవ (అన్నదానం) జరుగుతుంది. ప్రతీ రోజు రెండు సార్లు ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 03.30 వరకు మరియు రాత్రి 07:00 నుండి 09:00 వరకు


⏩అనుష్ఠానం చేసుకొనుటకు ప్రత్యేక సదుపాయాలు కలవు.


⏩ఉచిత లైబ్రరీ సదుపాయం.


☎ ఈ విషయాలలో మీకు ఎలాంటి వివరాలు కావలసినా సంప్రదించ వలసిన ఫోన్ నెంబర్లు:

+91 89191 23647

+91 99367 64525

+91 99187 74933


Email: sethu2kasi@gmail.com


Facebook: https://www.facebook.com/kashi.hariharasastry


సంప్రదించవలసిన అడ్రస్:


శ్రీ కాశీ గాయత్రీ సేవ సొసైటీ,

శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం,

అబ్బూరు హరి హర శాస్త్రి,

D 47 /2B 2G, 

PDR మాల్ దగ్గర,

రామాపుర, వారణాసి.

PIN 221001

బ్రహ్మాండం

 నాసా అంతరిక్ష కేంద్రం విడుదల చేసిన గెలాక్సి ఫొటో మన భాషలొ అయితే పాలపుంత అని, మన శాస్త్రాల ప్రకారం అయితే "#బ్రహ్మాండం" అని అంటాం..!! 

ఫొటోలో కుడి వైపు వున్నది లింగాకార శివ లింగం..!!


బ్రహ్మాండం ఆకారం, శివలింగం ఆకారం రెండు ఒకేలా ఉండడం మీరు ఇక్కడ గమనించవచ్చు..!!


పూర్వం మునులు , తపస్విలు, ఋషులు మన శాస్త్రాలలో ఈ విషయాన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలియ చెప్పారు..!!


ఆపాతాళ నభస్తలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళీ విలసత్పూర్ణేందు వాంతామృతైః

అస్తోకాప్లుత మేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధమే ధ్రువపదం విప్రో$భిషించేచ్ఛివమ్


బ్రహ్మాండవ్యాప్తదేహభసితహిమరుచాభాసమానా భుజంగైః

కంఠేకాలాః కపర్దాకళిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా

రుద్రాక్ష మాలా సులలిత వపుష శ్శాంభవా మూర్తి భేదా

రుద్రా శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవానః ప్రయచ్ఛన్తు సౌఖ్యమ్


  💥బ్రహ్మాండమే శివలింగం... 

  సమస్త బ్రహ్మాండమే శివస్వరూపం ...

  శివ లింగానికి ప్రదక్షిణ చేయడం సమస్త లోకాలను ప్రదక్షించడంతో సమానం 

  శివ లింగాన్ని అభిషేకం చేయడం సమస్త బ్రహ్మాండాన్ని సేవించడంతో సమానం..!!


విఘ్నేశ్వరుడూ కూడా శివ పార్వతులను ముమ్మారు ప్రదక్షిణ చేయడం వల్లనే గణాధిపతి/విఘ్నాధిపతి అయ్యాడు..!!


అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహా అని అమ్మవారిని

పిలుస్తారు.!! ఒక బ్రహ్మండం కాదు ఇలాంటివి అనేక కోట్ల 

బ్రహ్మాండాలు ఉన్నాయి ఈ విశ్వంలో...


వేదాంతంలో ఏమి చెబుతారంటే అండం_పిండం_బ్రహ్మాండం.!!

అండంలో ఉన్నదే పిండంలో ఉంటుంది..!!

పిండంలో ఉన్నదే బ్రహ్మాండంలో ఉంటుంది..!!


అందుకే ఏడుకొండలవానిని అండపిండబ్రహ్మాండనాయకుడు అని, అఖిలాండకోటి 

బ్రహ్మాండనాయకుడు అని అంటారు..!!


'లిం’ అంటే మన కంటికి కనిపించకుండా లీనమై ఉన్నదానిని, ‘గం’ అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంటుంది..!! అందుకే అది లింగమైంది..!!

     ఈ సృష్టి సమస్తం #శివమయం.! #లింగస్వరూపం..!!


-🚩ఓం నమ: శివాయ🚩

అద్భుతమైన కథ...

 9/11 vన్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి

ఒక అద్భుతమైన కథ...

(11th September 2001 నాడు అమెరికా లో world trade center పైన జరిగిన దాడి వివరాలు అందరికీ తెలుసు.ఆ వివరాలన్నీ TVలలో స్వయంగా చూసేము. కాని ఆ దుర్దినాన అమెరికాకు వస్తున్న విమానాలన్నీఅమెరికా చేరుకోలేక పడ్డ అవస్థలగురించి మనకెవ్వరికీ తెలియదు.అటువంటి విపత్కర సమయంలో దేశ దేశాలనుండి వస్తున్న 53 విమానాలలోని 10500 మంది ప్రయాణీకులను కెనడా ప్రభుత్వమూ అక్కడి చిన్న గ్రామాల ప్రజలూ ఆదుకున్నతీరు మనకి తెలియదు. ఆ ముచ్చటను ఆ రోజు Frankfurt నుండి బయలుదేరి Atlanta చేరుకోవలసిన Delt15 లోని flight attendant చెప్పిన విషయాల్ని ఆవిడ మాటల్లోనే తెలుగులో మీకు అందిస్తున్నాను. చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాను.మంచి ఎక్కడున్నా దానిని ఎక్కువ మందికి తెలియజేయాలన్నదే నా ఆశయం. అందుకే ఆంగ్లంలో మా వాట్సప్ గ్రూపులో వచ్చిన ఈ ముచ్చటను తెలుగులో మిత్రులకు అందిస్తున్నాను)

                                                                                    **** 

9/11 నాటి తమ అనుభవాల్ని Delta Flight 15 పేరుగల విమానంలో పని చేసేన ఒక ఎయిర్ హోస్టెస్ ఈ విధంగా తెలిపింది:

ఆ రోజు సెప్టెంబరు 11 వ తేదీ మంగళ వారం.మా విమానం ప్రాంక్ పర్ట్ నుంచి బయల్దేరి సుమారు 5 గంటలయంది.మేం అప్పటికి ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రం మీదుగా ప్రయాణిస్తున్నాం.అంతలోనాకు కాక్ పిట్ లోనికి వెళ్ళి విమానం కేప్టెన్ ని కలుసుకోవలసిందిగా పిలుపు వచ్చింది.నేను కాక్ పిట్లో ప్రవేశంచగానే అక్కడ అందరి ముఖాలూ గంభీరంగా ఉండడం గమనించాను.కేప్టెన్ అక్కడ నాకొక మెసేజ్ ఉన్న కాగితం అందించాడు.ఆ మెసేజ్ అట్లాంటాలో ఉన్న మా డెల్టా ఎయిర్ లైన్స్ ఆఫీసునుంచి వచ్చింది.అందులో ఇలా ఉంది: “అమెరికా లో ఉన్న విమానాశ్రయాలన్నీ ప్రస్తుతం మూసివేయబడ్డాయి.ఏ ప్రయాణీకుల విమానాలూ రావడానికి వీలు లేదు.అందువల్ల మీకు దగ్గరలో ఉన్న విమానాశ్రయాన్ని ఎంచుకుని అక్కడికి వెళ్ళండి.మీరు ఎక్కడ లేండ్ అయేదీ తెలుపగలరు” 

కాక్ పిట్ లో ఉన్నఅందరికీ పరిస్థితి ఎంత గంభీరమైనదో అర్థమైంది.అప్పుడు మేం సముద్రం మీద ప్రయణిస్తున్నాం కనుక అతి తొందరలో భూభాగం మీద విమానాన్ని సురక్షితంగా దింపగల ప్రదేశాన్ని వెతుక్కోవాలి. అంతా పరిశీలించి మా కేప్టెన్ మాకు 400 మైళ్ళ దూరంలో న్యూ ఫౌండ్ లేండ్ లో ఉన్న గేండర్ విమానాశ్రయం లోనే విమానాన్ని దింపాలని నిశ్చయించాడు.వెంటనే కెనేడియన్ ట్రాఫిక్ కంట్రోలర్ని సంప్రదించగా వారు ఏ విధమైన ప్రశ్నలూ అడక్కుండానే అనుమతి ఇచ్చారు..అప్పుడు మాకు అది ఆశ్చర్యంగానే అనిపించినా తరువాత అలా ఎందుకు జరిగిందో అర్థమైంది.

మా విమానాన్ని గేండర్ విమానాశ్రయానికి చేర్చబోతుండగా మాకు అమెరికాలో విమానాల హైజాకింగ్ జరిగిందనీ టెర్రరిస్టులు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారనీ తెలిసింది.అయితే ఆ విషయాలను మా ప్రయాణీకులకు తెలిపి వారిని భయభ్రాతులను చేయడం ఇష్టం లేక మా విమానంలో చిన్న సాంకేతిక లోపం తలెత్తిందనీ దగ్గర లోని గేండర్ విమానాశ్రయంలో ఆపి ఆ లోపాన్ని సరిజేసుకుని తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తామనీ అబధ్ధం చెప్పాము.అక్కడ దిగాక పూర్తి వివరాలు వారికి తెలియ జేస్తామనీ నమ్మబలికాము.అది విన్న ప్రయాణీకులలో తాము గమ్య స్థానం చేరడంలో ఆలస్యమవుతుందని తెలిసి కొంత విసుగూ చిరాకూ కనిపించాయి.అది చాలా సహజమైన విషయమే కదా?మరో నలభై నిమిషాల తర్వాత మా విమానం గేండర్ లో దిగే సరికి అక్కడి స్థానికి సమయం12.30 A.M.అయింది(11A.M.E.S.T.) అక్కడ అప్పటికే వివిధ దేశాలనుండి అమెరికా వెళ్ళాల్సిఉండి దారి మార్చుకుని గేండర్ విమానాశ్రయంలో దిగిన సుమారు 20 విమానాలున్నాయి.

మా విమానం లేండ్ అయిన తర్వాత కేప్టెన్ మా ప్రయాణీకులనుద్దేశించి ఇలా చెప్పాడు. మన చుట్టూ ఉన్న ఇన్ని విమానాలను చూస్తే మీకు వాటన్నిటికీ కూడా మనలాటి సాంకేతిక సమస్యే వచ్చిందా అని ఆశ్చర్యం కలగొచ్చు.నిజానికి మనకి గాని ఇతర విమానాలకి గాని ఏ సాంకేతిక సమస్యా లేదు.ఇన్ని విమానాలూ ఇక్కడ అత్యవసరంగా దిగడానికి వేరే కారణం ఉంది అంటూ అమెరికాలో విమానాల హైజాకింగ్ టెర్రరిస్టుల దాడి గురించి మాకు తెలిసినంత మట్టుకు వారికి వివరించాడు.నమ్మ శక్యం గాని ఆ వార్త విని ప్రయాణీకులంతా భయవిహ్వలులై నిశ్చేష్టులయారు. ప్రయాణీకులెవరూ విమానం దిగడానికి వీలు లేదనీ విమానంలోనే ఉండాలనీ అక్కడి అధికారులు ఆదేశించారని చెప్పారు. అక్కడి ఎయిర్పోర్ట్ పోలీసులు తప్ప వేరెవ్వరూ విమానాల దగ్గరికి రావడానికి వీల్లేదని తెలియజేసారు.

మా విమానం అక్కడ దిగిన గంటసేపట్లో మరికొన్నివిమానాలు కూడా అక్కడ దిగాయి.మొత్తం 53 విమానాలు.అన్నీ అమెరికా వెళ్లాల్సినవే.మా లాగే అత్యవసరంగా ఇక్కడ దిగాయి.వాటిలో 27 విమానాలు అమెరికా దేశానికి చెందినవే.మెల్లగా మరికొంత సేపటికి మాకు మరికొంత సమాచారం తెలిసింది.అంతవరకూ అమెరికాలో టెర్రరిస్టుల దాడి జరిగిందని తప్ప ఏ వివరాలూ మాకు తెలియదు.ఇప్పుడు అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీదా పెంటగాన్ మీదా హైజాక్ చేసిన విమానాలతో దాడి జరిగిందని తెలిసింది.ఈ వివరాలు విన్న కొంత మంది ప్రయాణీకులు తమ సెల్ పోన్లలో వివరాలు కనుక్కుందికి ప్రయత్నించారు కానీ కెనడాలో వేరే సెల్ పోన్ సిస్టం ఉండడంతో అవి పని చేయ లేదు.పని చేసిన వాటికి అమెరికాలో లైన్లన్నీ జామ్ అయాయనో మూసివేయబడ్డాయనో సమాచారం వచ్చింది.

ఆ సాయంత్రానికి మాకు W.T.C. twin towers పూర్తిగా కూల్చి వేయబడ్డాయనీ హైజాక్ చేయబడిన నాలుగో విమానం కుప్పకూలిందనీ తెలిసింది. అప్పటికే మా ప్రయాణీకులందరూ శారీరకంగానూ మానసికంగానూ అలసిపోయి స్థబ్దుగా ఉండిపోయారు.మా విమానం కిటికీలలోంచి కనిపిస్తున్న ఆ 52 విమానాలనీ చూస్తే ఈ ఇబ్బందిలో ఇరుక్కున్నది మేం మాత్రమే కాదని ఈ సమస్య ఎంతో మందిదనీ తెలుస్తోంది.తరువాత తెలిసిందేమిటంటే విమాన ప్రయాణీకులందరినీ ఊళ్ళోకి తీసుకెళ్ళి వారికోసం ఏర్పాటు చేస్తున్న బసలలో ఉంచుతారనీ అయితే ఒక విమానం తర్వాత ఒకటిగా ఖాళీ చేయించి ఊళ్ళోకి తీసుకెళ్ళడానికి చాలా సమయం పడుతుందనీ మా విమానాన్ని ఖాళీ చేయించడం మరునాడు సుమారు 11గంటలకు జరగవచ్చనీ తెలిసింది .ఇది విన్న మా ప్రయాణీకులు చేసేదేమీ లేక తప్పదు కదా అని పరిస్థితులతో రాజీ పడిపోయి రాత్రి విమానం లోనే గడపడానికి సిధ్ధ పడిపోయారు.అక్కడి విమానాశ్రయాధికారులు మాకు కావలసిన మంచినీటి సదుపాయం లెవేటరీలను శుభ్రపరచడం అవసరమైతే వైద్యసహాయం అందించడం వండివి జరుగుతాయని హామీ ఇచ్చారు. మాకు వైద్యసహాయం కోరాల్సిన అవసరం పడలేదు. మా ప్రయాణీకులలో ఒక 8 నెలలు నిండిన గర్భవతి ఉన్నా ఆమెక ఏ చికాకూ పడలేదు. మేం ఆమెను జాగ్రత్తగానే చూసుకున్నాం. సీట్ల లోనే పడుక్కోవలసి రావడమనే అసౌకర్యాన్ని ప్రయణీకులందరూ మౌనం గానే భరించారు.

మరునాడు 12 వ తేదీ ఉదయం 10.30 ప్రాంతంలో మా విమానం దగ్గరకు ఎన్నో స్కూల్ బస్సులు వచ్చి క్యూకట్టి వరుసగా నిల్చున్నాయి. వాటిలోకి మేమూ మా ప్రయాణీకులందరం ఎక్కాక అవి మమ్మల్ని ఎయిర్పోర్టు టెర్మినల్ కి తీసుకెళ్ళాయి. అక్కడ అందరం ఇమ్మిగ్రేషన్ కష్టమ్స్ ఫార్మాలిటీస్ తో పాటు రెడ్ క్రాస్ లో మా వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తరువాత మా విమాన సిబ్బందిని మాత్రం అక్కడికి దగ్గర్లోని చిన్న హోటల్ కి తీసుకెళ్ళారు.మా ప్రయాణీకులను ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలీదు.అక్కడి రెడ్ క్రాస్ వారు చెప్పిన దానిని బట్టి అక్కడ గేండర్ ఊరి జనసంఖ్య 10,400 మాత్రమే ఉండగా ఇప్పుడు విమానాలలో అత్యవసరంగా దిగిన ప్రయాణీకుల సంఖ్య10,500 ఉందట.హోటల్ కి చేరాక తాము మళ్ళా వచ్చి పిలిచే దాకా మమ్మల్నిహాయిగా విశ్రాంతి తీసుకోమని చెప్పారు.అయితే ఆ పిలుపు అంత తొందరలో వస్తందని మాత్రం ఆశించవద్దన్నారు.

అలా హోటల్కి చేరాక T.V.ల ద్వారా మాకు అమెరికాలో జరిగిన దుర్ఘటన వివరాలు అవి జరిగిన 24 గంటల తర్వాత పూర్తిగా తెలిసాయి.అక్కడ ఆ గేండర్ వూరి ప్రజలు ఎంతటి స్నేహశీలురోమాకు అర్థమైంది.మమ్మల్ని విమానాల మనుషులంటూ పిలుస్తూ ఎంతో కలివిడిగా మాకు ఆతిథ్యం ఇచ్చి మమ్మల్ని ముగ్ధుల్ని చేసారు.మాకు వేరే పనేం లేదు కనుక వూరంతా తిరిగి ఎంజాయ్ చేసేము.అలా రెండు రోజులు గడిచాక మాకు పిలుపు వస్తే మేము విమానాశ్రయం చేరి మా విమానంలో ఎక్కాము.ఎక్కడెక్కడో ఉన్న మా ప్రయాణీకులంతా కూడా ఒక్కరు కూడా మిస్ అవకుండా అందరూ విమానంలోకి చేర్చబడ్డారు.అలా అంతా చేరుకున్నాక మా ప్రయాణీకులు ఆ రెండు రోజులలో వారి వారి అనుభవాలను మాతో పంచుకోవడం మొదలెట్టారు.

అనుకోకుండా ఇన్ని విమానాలలో వచ్చిన వేలాది మంది ప్రయాణీకులకు ఆతిథ్యమివ్వడానికి గెండర్ లాంటి చిన్నఊ రు సరిపోదు కనుక అక్కడి ప్రభుత్వాధికారులు గేండర్ కి చుట్టు పక్కల 75 కి.మీ. వ్యాసార్థంలో ఉన్న ఊళ్ళన్నిటిలోనూ స్కూళ్ళు మీటింగ్ హాళ్ళూ లాడ్జీలు మొదలైనవన్నీ ప్రయాణీకుల తాత్కాలిక వసతి కోసం ఏర్పాటు చేసేరుట.కొన్ని చోట్ల మంచాలూ పరుపులూ ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల చాపలు పరచి స్లీపింగ్ బేగ్స్ తలగడలూ ఏర్పాటు చేసేరుట.ఆ వూళ్ళలోని హైస్కూలు విద్యార్థులందరూ విమానాలలో దిగిన ప్రయాణీకులందరికీ సహాయం చేయడానికి వలంటీర్లుగా ఏర్పాటు చేయబడ్డారుట.మా విమానంలో వచ్చిన 218 మంది ప్రయాణీకులకూ గేండర్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లూయీ పోర్ట్ అనే గ్రామంలోని ఒక హైస్కూల్లో బస ఏర్పాటు చేసేరుట.వేరుగా ఉండదలచుకున్న స్త్రీలకు ప్రత్యే ఏర్పాట్లు కుటుంబాలు కలసి ఉండడానికి వలసిన ఏర్పాట్లు చేసేరుట.బాగా వృధ్ధులైన వారికి అక్కడ కొందరి ఇళ్ళలో వసతి ఏర్పాటు చేసేరుట.మా ప్రయాణీకులలో ఉన్న గర్భవతికి దగ్గరలో వైద్య సదుపాయం అందుబాటులో ఉన్న ఒకరింట్లో బస ఏర్పాటు చేసేరుట.రోజులో ఒక్కసారి ప్రతివారు దేశ దేశాలలో ఉన్న తమవారితో ఫోన్లో మాట్లాడుకోగలిగే సదుపాయం ఏర్పాట చేసేరుట.ఆ రెండు రోజులూ పగటి పూట ఎక్స్ కర్షన్ లాగా బయటకు పోయి సరస్సులలో క్రూయిజ్లూ దగ్గర అడవుల్లో హైకింగూ వంటివి సరదా ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసేరుట . అతిథులకు తాజా బ్రెడ్ లు అందించడానికి ఆ వూళ్లోని బేకరీలన్నీరాత్రీ పగలూ పని చేసేయిట.ఆ గ్రామంలోని గృహస్తులందరూ ఇళ్ళల్లో వంటలు వండించి స్కూళ్ళకు తెచ్చి వడ్డించే వారట.హోటల్ తిళ్ళని ఇస్టపడే వారిని రెస్టారెంట్లకు తీసుకెళ్లి తినిపించే వారట. వాళ్ల సామాన్లన్నీ విమానం లో ఉండిపోయాయి కనుక అతిథులందరూ వారి బట్టలుతుకుకునేందుకు లాండ్రీలను ఏర్పాటు చేసేరుట.ఒక్క ముక్కలో చెప్పాలంటే అతిథులందరినీ ఆ రెండురోజులూ ఏ ఇబ్బందీ లేకుండా పెళ్ళి వారిలా చూసుకున్నారుట. వాళ్ళ వాళ్ల అనుభవాలను చెబుతున్నప్పుడు మా ప్రయాణీకులు ఆనందం పట్టలేక ఏడ్చేసేవారు.అక్కడి రెడ్ క్రాస్ వారికి ఏయే విమానాల్లో వచ్చిన వారు ఎక్కడున్నారో పూర్తి వివరాలు తెలుసు కనుక విమానం బయలు దేరే వేళకి ఒక్కరూ మిస్ కాకుండా అందరినీ వారి వారి విమానాలకు చేర్చారు.ఇంత మందికి ఇన్ని ఏర్పాట్లు ముందస్తుగా తెలియక పోయినా ఇంత చక్కగా ఏర్పాటు చేయగలగడం అబ్బురమే కదా?

తిరిగి విమానంలో చేరుకున్న మా ప్రయాణీకులందరికీ కలసి మెలసి క్రూయిజ్ లో వెళ్తున్న అనుభూతి కలిగి ఒకరికొకరు దగ్గరై పేర్లు పెట్టి పిలుచుకోవడం తమ తమ అనుభవాలను పక్కవారితో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.గేండర్ నుంచి తిరిగి అట్లాంటాకి మొదలైన ప్రయాణం ఒక గ్రూపు కలసి కట్టుగా ఏర్పాటు చేసుకన్న ప్రైవేటు ఛార్టర్డ్ ఫ్లైట్ ప్రయాణం లాగుంది. ప్రయాణీకుల హర్షాతిరేకాలకు అడ్డు తగలక పోవడమే మా క్రూ మెంబర్లం అందరం చేసిన పని.వారి ఆనందం చూస్తూ మేం నోట మాట రాకుండా నిల్చుండి పోయే వాళ్ళం.ఇలా ఉండగా ఓ అనుకోని సంఘటన జరిగింది.

మా ప్రయాణీకుల్లో ఒకరు నా దగ్గరకు వచ్చి మైకులో అందర్నీ ఉద్దేశించి తాను మాట్లాడవచ్చా అని అడిగాడు. మామూలు పరిస్థితుల్లో మేం అటువంటిది అంగీకరించం కాని ప్రస్తుత పరిస్థితులు వేరు. సరే నంటూ అతడికి మైక్ అందించాను.

ఆ రెండురోజుల్లోనూ తన అనుభవాలను కొద్దిగా వివరిస్తూ తామెవరో తమ ముక్కూ మొహం తెలియకపోయినా ఆ ఊరి ప్రజలు తమకు అందించిన ఆతిథ్యం జన్మలో మరువలేనిదని అన్నాడు.ఆ లూయీ పోర్ట్ ప్రజలకు తామెంతో రుణపడి ఉంటామని అందు చేత కొద్దిగా నైనా వారి రుణం తీర్చుకునేందుకు ఏదో ఒకటి చేయాలనుందని అంటూ తన ఆలోచనను బయట పెట్టాడు. ఆ ఊరి వారి కోసం ఒక సహాయ నిధి trust ని ఏర్పాటు చేద్దామనీ దానికి Delta 15(ఇది మా ఫ్లయిట్ పేరు)అని పేరు పెట్టాలన్నది తన అభిమతమనీ ఆ సహాయనిధి నుండి ఇక్కడి స్కూలు పిల్లలకు కాలేజీ చదువులకు అవసరమైన స్కాలర్ షిప్పులు ఇప్పించాలన్నది తన కోరిక అనీ చెప్పాడు.ఈ కార్యక్రమంలో పాలుపంచుకో దలచిన దాతలు తమ పేర్లను ఫోన్ నంబర్లను విరాళం సొమ్మునూ వ్రాయవలసిందిగా ఒక కాగితాన్ని అందరికీ పంచేడు. ఆ విధంగా అందరూ కలసి ప్రకటించిన విరాళం సొమ్ము 14000 డాలర్లయింది. ఈ మంచి ఆలోచనను ప్రయాణీకుల్లో ప్రవేశ పెట్టిన వ్యక్తి వర్జీనియాకు చెందిన డాక్టరు.అతడు తన వంతు చందాగా అంతే సొమ్మును ప్రకటిస్తున్నాననీ అతి త్వరలోనే ట్రస్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహరాలన్నీ పూర్తి చేస్తాననీ చెప్పాడు. అంతే కాకుండా డెల్టా విమానాధి పతుల్ని కూడా ఈ కార్యక్రమానికి చేయూతనందించాల్సిందిగా కోరుతాననీ చెప్పాడు. 

                                                                   ***

నేను మీకీ వివరాలన్నీ అందజేయడానికి పూనుకున్నప్పటికి ట్రస్టుకి 15 లక్షల డాలర్ల విరాళాలు అందేయి.134 మంది స్కూలు విద్యార్థులకు కాలేజీ చదువులకోసం స్కాలర్ షిప్పులు అందజేయడం జరిగింది.

నేనీ విషయాలను మీతో పంచుకోవడానికి కారణం. అనుకోకుండా వచ్చి మీద పడ్డ వందల మంది అతిథులను ఆ చిన్నిగ్రామ ప్రజలు ప్రేమాభిమానాలతో ఆదుకున్నతీరు అబ్బురమనీ ప్రపంచంలో మంచి ఇంకా మిగిలే ఉందనీ తెలియజేయడానికే.

మంచి ఎక్కడున్నా నలుగురికీ తెలియజేయండి.మంచిని ప్రోత్సహించి పెంచండి. 

********


Source FB

~~~~Forwarded~~~~

Unknown

 ధృతరాష్ట్ర ఆప్టికల్స్,

దిగంబరా క్లాథ్ ఎంపోరియం,

దుశాసన శారీ సెంటర్ 

భీష్మా యూత్ క్లబ్,

దుర్వాస లాఫింగ్ క్లబ్,

కచ్ఛపి ట్రావెల్స్,

వృకోదరా మెస్,

వాతాపి పిజ్జాస్,

ద్రౌపది మేరేజ్ హాల్,

వేమన కట్పీస్ క్లాథ్ సెంటర్,

హనుమాన్ మేరేజ్ బ్యూరో;

గాంధీ వైన్స్,

కుచేల ఫర్టిలిటీ సెంటర్,

హయగ్రీవ బ్యూటీ పార్లర్;

భరత ఫుట్వేర్,

శకుని అడ్వైసర్స్,

జటాయు కొరియర్స్...

కుమార్ స్వామి స్పీడ్ రేసింగ్ క్లబ్

వినాయక వెయిట్ లాస్ సెంటర్.

నరసింహస్వామి Intestine surgery center

కుబేర పర్సనల్ లోన్ సర్వీసెస్.

లవకుశ రాక్ బ్యాండ్.

రామ అండ్ కో కన్స్ట్రక్షన్ కంపెనీ.

శ్రీకృష్ణ లైఫ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్

ఏకలవ్య ఆన్లైన్ ఎడ్యుకేషన్.

కె. రాఘవేంద్ర రావు ఫ్రూట్ షాప్ 


(.. Unknown source)

సంస్కృత మహాభాగవతం

 *23.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఏడవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - పృథివి మొదలుకొని కపోతముల వరకు గల ఎనిమదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*7.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*కాలేన హ్యోఘవేగేన భూతానాం ప్రభవాప్యయౌ|*


*నిత్యావపి న దృశ్యేతే ఆత్మనోఽగ్నేర్యథార్చిషామ్॥12474॥*


అగ్నియొక్క జ్వాలలు అగ్నినుండి ఉద్భవించును. తిరిగి అగ్నిలోనే సమసిపోవును. ఇట్లే కాలము యొక్క తీవ్రమగు ప్రవాహవేగమున నిత్యనిరంతరము ప్రాణులు పుట్టును, నశించును. కాలప్రవాహమున ప్రతిక్షణము ప్రాణులు మృత్యుముఖము నందు ప్రవేశించుచుండుట కన్పించకున్నది.


*అహన్యహని భూతాని, గచ్ఛంతీహ యమాలయమ్| శేషాః స్థిరత్వమిచ్ఛంతి, కిమాశ్చర్యమతః పరమ్॥* ప్రాణులు ప్రతిదినమూ మృత్యుముఖమున ప్రవేశించుచుండును. అనగా మరణము అనివార్యము. ఐనను మిగిలినవారు స్థిరముగా నుండవలెనని కోరుకొనుచుందురు. ఇది ఎంత విడ్డూరము? (ఎంత ఆశ్చర్యకరము?) = మహాభారతము =


*7.50 (ఏబదియవ శ్లోకము)*


*గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముంచతి|*


*న తేషు యుజ్యతే యోగీ గోభిర్గా ఇవ గోపతిః॥12475॥*


సూర్యుడు తన కిరణములద్వారా జలములను గ్రహించును. సమయానుకూలముగా లోకకల్యాణమునకై వర్షించును. గ్రహించుటయందును, వర్షించుటయందును ఆ లోకసాక్షికి ఎటువంటి ఆసక్తి యుండదు. అట్లే యోగి సమయానుసారముగ ఇంద్రియములద్వారా విషయములను గ్రహించును మరియు విడిచి పెట్టును. కాని, అతడు ఆసక్తితో వాటియందు తగుల్కొనడు.


*సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత| కుర్యాద్విద్వాంస్తథాఽసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్॥*


ఓ భారతా! (అర్జునా!) అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, విద్వాంసుడు (జ్ఞాని) కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలెను. = గీత. 3-25.


*7.51 (ఏబది ఒకటవ శ్లోకము)*


*బుధ్యతే స్వే న భేదేన వ్యక్తిస్థ ఇవ తద్గతః|*


*లక్ష్యతే స్థూలమతిభిరాత్మా చావస్థితోఽర్కవత్॥12476॥*


సూర్యుడు ఒక్కడేయైనను వివిధ జలపాత్రలలో వేర్వేరుగా కనబడుచుండును. అట్లే ఆత్మ ఒకటేయైనను స్థూలబద్ధులకు ఉపాధి భేదములను అనుసరించి, ఆత్మలు వేర్వేరుగా తోచుచుండును. ఆత్మయొక్క వాస్తవస్థితి వారికి బోధపడదు. సూర్యునియొక్క దృష్టాంతము ద్వారా ఆత్మయొక్క అఖండత్వము బోధపడును.


*7.52 (ఏబది రెండవ శ్లోకము)*


*నాతిస్నేహః ప్రసంగో వా కర్తవ్యః క్వాపి కేనచిత్|*


*కుర్వన్ విందేత సంతాపం కపోత ఇవ దీనధీః॥12477॥*


ఇక్కడ పావురముయొక్క వృత్తాంతము ఉదాహరింపబడుచున్నది:- యదుమహారాజా! ఎవ్వరియెడలను అతిప్రేమ, ఆసక్తి కలిగియుండరాదు. ప్రేమాసక్తులవలన పురుషుడు (వ్యక్తి) కపోతమువలె దైన్యావస్థకు గుఱియై బాధలకు గుఱికావలసి వచ్చును.


*7.53 (ఏబది మూడవ శ్లోకము)*


*కపోతః కశ్చనారణ్యే కృతనీడో వనస్పతౌ|*


*కపోత్యా భార్యయా సార్ధమువాస కతిచిత్సమాః॥12478॥*


మహారాజా! ఒకానొక అరణ్యములో ఒకపావురము ఒకచెట్టుపై గూడుకట్టుకొని తన భార్యయైన (ఆడు) పావురముతో కొన్ని సంవత్సరములపాటు హాయిగా నివసించుచుండెను.


*7.54 (ఏబది నాలుగవ శ్లోకము)*


*కపోతౌ స్నేహగుణితహృదయౌ గృహధర్మిణౌ|*


*దృష్టిం దృష్ట్యాంగమంగేన బుద్ధిం బుద్ధ్యా బబంధతుః॥12479॥*


ఆ పావురముల జంట శరీరములు వేరుగానున్నను హృదయములు ఒక్కటిగా పరస్పర గాఢానురాగములతో సుఖముగా కాపురము చేయుచుండెను. వాటి మధ్యగల ప్రేమానురాగములు దినదినాభివృద్ధి చెందుచుండెను. వాటిచూపులు, అంగములు, బుద్ధులు ఆత్మీయతతో పెనవైచుకొనియుండెను.


*7.55 (ఏబది ఐదవ శ్లోకము)*


*శయ్యాసనాటనస్థానవార్తాక్రీడాశనాదికమ్|*


*మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు॥12480॥*


అవి ఆ వనమునందలి వృక్షములపై పరుండుట, కూర్చుండుట, ఇటునటు తిరుగుట, నిలుచుట, సల్లాపములు జరుపుట, క్రీడించుట, భుజించుట మొదలగు కార్యములను కలిసిమెలిసి కొనసాగించుచు నిర్భయముగా జీవించుచుండెను.


*7.56 (ఏబది ఆరవ శ్లోకము)*


*యం యం వాంఛతి సా రాజన్ తర్పయంత్యనుకంపితా|*


*తం తం సమనయత్కామం కృచ్ఛ్రేణాప్యజితేంద్రియః॥12481॥*


యదుమహారాజా! ఆ మగపావురము ఆడుపావురముపై గల అంతులేని ప్రేమతో అది కోరినదానినెల్ల ఎంత శ్రమపడియైనను తెచ్చి పెట్టి దానిని తృప్తిపఱచుచుండెడిది. ఆ పెంటి పావురముగూడ ఆ మగపావురముపై ప్రేమ గలిగి దానికి దాంపత్యసుఖములను గూర్చుచుండెడిది. వాటి అన్యోన్యప్రేమలు అట్టివి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఏడవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*998వ నామ మంత్రము* 23.9.2021


*ఓం శ్రీశివాయై నమః*


శ్రీతో కూడిన పార్వతియైన జగన్మాతకు నమస్కారము.


*శివా* యను నామముతో కూడిన పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీశివా* యను మూడక్షరముల నామ మంత్రమును *ఓం శ్రీశివాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ పరమేశ్వరి జన్మరాహిత్యమైన కైవల్యపదమునకు మార్గము సుగమము చేసి తరింపజేయును.


శ్రీ యనగా శోభస్కరమైనది. శ్రీ యను శబ్దమునకు అనేక అర్థములు ఉన్నవి. లక్ష్మీ స్వరూపిణి, శోభతో కూడినది (శోభతో కూడిన పార్వతి). మంగళకరమైనది. సర్వమంగళ స్వరూపిణి. *శివా* యనగా శివశక్త్యైక్యము వలన పరమేశ్వరుడే పరమేశ్వరి, పరమేశ్వరియే శివుడు అని, ఆ పార్వతీపరమేశ్వరులు, లేదా కామేశ్వరీ కామేశ్వరులకు అభేదమును తెలియజేయబడుటచే అమ్మవారు *శివా* యనియు, శోభ (శ్రీ) తో కూడిన *శ్రీశివా* యనియు అనబడినది. *శ్రీయుక్తా శివా శ్రీశివా* అని భాస్కరాచార్యులవారు అన్నారు (సౌభాగ్యభాస్కరం, 1083వ పుట). అవును! అమ్మవారు, అయ్యవారు ఒకటే. వారిద్దరూ శ్రీచక్రరాజమునకు ప్రతీకలు. అమ్మవారు సాక్షాత్తు శివునియర్ధాంగి యగుటచే *శివా* యనియు, మంగళస్వరూపిణియైన ఆ అమ్మ *శ్రీశివా* యనియు అనబడినది. అమ్మవారిని *శివా* యని లలితా సహస్రమందలి ఏబది మూడవ నామ మంత్రమందు పరమేశ్వరుని శక్తియే, అర్ధాంగియై అభేదముగా అలరారుచున్నదని కీర్తించియున్నాము. ఇప్పుడు ఈ నామ మంత్రమునందు ఆ అమ్మను శోభతో (శ్రీతో) కూడిన *శివా* *(శ్రీశివా)* యని భక్తిప్రపత్తులతో కీర్తించుచున్నాము.


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం శ్రీశివాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

మొగలిచెర్ల

 *నిష్కల్మష భక్తి..*


"స్వామి వారి ఆరాధానోత్సవాల పోస్టర్లు వేయించారా?..మీరు ఒంగోలు చేరుస్తారా? లేక, నన్ను వచ్చి తీసుకోమంటారా?" అంటూ గత పది, పన్నెండు సంవత్సరాలుగా...శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం జరిగే వైశాఖ శుద్ధ సప్తమికి నెలరోజులముందునుంచీ అడిగే ఒకే ఒక వ్యక్తి, శ్రీ ఇండ్ల వెంకటేశ్వర్లు గారు..


శ్రీ ఇండ్ల వెంకటేశ్వర్లు, రమణమ్మ దంపతులు, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద, గత 18 సంవత్సరాలుగా స్వామి వారి ఆరాధానోత్సవం రోజున తమ భజన బృందంతో సహా వచ్చి, ఉదయం 9గంటల నుంచీ, సాయంత్రం 6గంటల దాకా..నిర్విరామంగా..పారవశ్యంతో భజన చేస్తారు..ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించరు..


వీరిద్దరూ నివాసం ఉండేది, ఒంగోలు లోని అగ్రహారం రోడ్డు, బత్తులవారి కుంట వద్ద వుండే, దత్తాత్రేయ కాలనీ లో...


2001 వ సంవత్సరం లో తమ భజన బృందం గురువుగారు, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి భక్తుడూ అయిన లక్ష్మయ్య గారి ప్రోద్బలంతో, మొట్ట మొదటిసారి, మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరాన్ని దర్శించారు ఆ దంపతులు..


"స్వామి వారి సమాధి చూడగానే, మాకు వింత అనుభూతి కలిగింది, అది మాటల్లో చెప్పలేమయ్యా..ఇదీ అని చెప్పలేని పరిస్థితి, మమ్మల్ని మేము మర్చిపోయాము"అని శ్రీమతి రమణమ్మ గారు చెప్పారు..ఆరోజే స్వామివారి చిత్రపటాన్ని కొనుక్కుని, ఒంగోలు వెళ్లారు..


మరుసటి రోజు తెల్లవారుఝామున, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు తనకు స్వప్న దర్శనం ఇచ్చారనీ.. తాము తెచ్చుకున్న చిత్రపటాన్ని పూజగదిలో పెట్టుకోమని చెప్పారని తెలిపారు..


మరి కొద్దిరోజుల్లోనే, దంపతులిద్దరూ భజనలో ఉన్నప్పుడే శ్రీ వెంకటేశ్వర్లు గారి ప్రభుత్వ ఉద్యోగం పర్మినెంట్ అయిందనే వార్త వచ్చిందనీ చెప్పారు..అది మొదలు ఆ దంపతులిద్దరూ శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి భక్తులుగా మారిపోయారు..


వాళ్ళు నివాసముంటున్న, దత్తాత్రేయ కాలనీ కూడా, వీళ్ళ గురువుగారు లక్ష్మయ్య గారి ప్రోద్బలం తోనే రూపుదిద్దుకుంది..దానిని ఈ దంపతులిద్దరూ ఒక్కొక్క సౌకర్యం కోసం పాటుబడి, అన్నీ సాధించగలిగారు..ఇక అక్కడ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గుడి ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు..


నేటికీ ఆ దంపతులు తమ కష్ట సుఖాలన్నీ స్వామి వారి అనుగ్రహం గానే భావిస్తారు..ఆరాధన ఉత్సవాలకు, ఒంగోలు లో ప్రచారం వాళ్లే చేస్తారు..దర్శనానికి వచ్చేటప్పుడు, అన్నదానానికి తమవంతు సహకారంగా సరుకులు తీసుకొచ్చి ఇచ్చి వెళుతుంటారు.. 


"అన్నీ ఆయనే...అంతా ఆయనదే భారం, మేము నిమిత్తమాత్రులం..ఇదిగో ఇలా ఇన్ని సంవత్సరాలుగా మాకు అంతరాయం లేకుండా భజన చేసుకునే అవకాశం కల్పించాడు" అంటూ ఆ స్వామి వారి పటానికి చేతులుజోడించి నిరహంకారంగా చెప్పుకుంటారు..


ఎంతోమంది దర్శనానికి వస్తూఉంటారు..అందులో నిష్కల్మష భక్తి ఏ కొద్దిమందిలోనో ఉంటుంది..అటువంటి కోవకు చెందినవారే ఈ దంపతులు.. 


సర్వం..

శ్రీదత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం...ప్రకాశం జిల్లా...పిన్:523114...సెల్..94402 66380 & 99089 73699)