13, అక్టోబర్ 2024, ఆదివారం

శ్రీ ఆది శంకరాచార్య చరితము40

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము40 వ భాగము*

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳


*గంధర్వోపాసకులు:*


గంధర్వోపాసకులు శ్రీ శంకరా చార్యులను తమ మతములో కలుపుకొన నెంచి, సమీపించి, 'యతీశ్వరా! విశ్వావసుడనే గంధర్వుడు మాకు ప్రభువై దైవముగా నున్నాడు. ఆతడు గంధర్వులకు దేవుడు. అట్టి వానిని మేము సదా భక్తిశ్రద్ధలతోపూజించు వారలము.ఆదేవుని అనుగ్రహంతో మేము  అందరము గానమందలి నాదబిందు కళాత్మకమైన విజ్ఞానం తో ఆరితేరిన విద్వాంసులమై యున్నా ము. దీనివలన మేమం దరము కృతార్థులమై ముక్తిని బడయుచుంటిమి. తామును మావలెనే గాంధర్వ విద్య యందు కళాపూర్ణులై ముక్తిని పొందుడు’ అని కోరిరి. 


అంతట శ్రీ శంకరాచార్యులు, 'భక్తులారా! మీ పలుకులు వేదములకు వ్యతిరేకముగ నున్నవి. ఇదిమీకు న్యాయమేనా?పరమాత్మ శబ్దాదులకు అతీతమై ప్రకాశించుచున్నదని వేదమున తెలుపబడినది. మీ గాంధర్వ విద్య శబ్దముతో గూడియున్నది. అందు వలన ఇది పరబ్రహ్మ విద్య కానేరదు. పరబ్రహ్మ ఎట్టివాడుగ నున్నాడో వినుడు. ఆతడు నిత్యుడు, అవ్యయుడు, ఆది మధ్యాంతములు లేని వాడు, నిశ్చయుడు, శబ్ద స్పర్శ రూప రస గంధ రహితుడు, మహత్తత్త్వము కన్నా పరమైనవాడు. అట్టి పరమాత్మను తెలిసి కొనినవాడే ముక్తుడు కాగలడు. కావున మీరందరు నాద బిందు కళాతీత మగు పరాత్పరు ని ఉపాసించుడు. అందు వలన తప్పక ముక్తి లభించును' అని ఉపదేశించగా గంధర్వ ఉపాసకులందరు శ్రీ శంకరాచార్యులను ఆశ్ర యించి శిష్యులయ్యారు. అద్వైత జ్ఞానమును ఆర్జించుకొని నిత్యానంద మును పొందిరి. అటు తరువాత భేతాళోపాస కులు చితాభస్మము (స్మశాన భస్మము) ను ధరించి శ్రీశంకరపాదులను సమీపించి నమస్కారములు చేసిరి.


*భేతాళ మతస్థులు:*


శ్రీశంకరపాదుల యెదుట తమ మతమును ప్రతిష్ఠింప జేయ నెంచి భేతాళ మతస్థులు, 'శ్రీ ఆచార్య వర్యా! మేమం దరము భేతాళుడు మొదలైన భూతములను ఉపాసించుచు లోకము లను మా యధీనమందు ఉంచుకొనుటకు తగిన సమర్ధుల మైతిమి. కావున తాము కూడ మావలెనే ఉపాసించిన లోకములు మీ యధీన మందుండ గలవు' అని తెలియజేసిరి.


శ్రీ శంకరులది విని, ‘భక్తు లారా! మీరందరు బ్రాహ్మణులు గదా! మీరిట్టి నీచమైన ఉపాసనలు చేయకూడదని శాస్త్రములు వచించుచున్నవి. సత్కర్మలకట్టి భూతములు ఆటంక ములు కలుగ జేయుచు న్నవి. సత్కర్మాచరణకు ముందుగా *'అపసర్పన్తు యే భూతా యే భూతా భూమి సంస్థితాః।*

*తేభూతా విఘ్నకర్తారస్తే నశ్యన్తు శివాజ్ఞయా*' (భూమి మీద ఏ భూతములు గలవో అవన్నియు దూరముగా నుండు గాక, సత్కర్మలు చేయుటకు ఏభూతము లు విఘ్నములు కలుగ చేయుచున్నవో అవి అన్నియు శివుని ఆజ్ఞచే నశించు గాక) అని వచించెదరు. అప్పుడు అవన్నియు దూరముగ తప్పు కొనును. ఇది శాస్త్ర ప్రమాణము. సత్కర్మల నాచరించని వారు పరమపదమును పొంద జాలరు. కావున నింద్యమైన మీ నీచ ఆచారములను వెంటనే వదలుడు. మీ మీ విధికర్మలను ఆచరిస్తూ ఆత్మతత్త్వము  తెలిసికొని జ్ఞానులు కండు. జ్ఞానము నలవరచు కొనడమే మోక్షము' అని బోధించెను.


అంతట వారు శ్రీశంకరా చార్యులు తత్త్వ రహస్యమును వినిపించుట తో శ్రీ శంకరపాదులకు నమస్క రించి ఆశ్రయించారు. ఉత్తమ దేవతలను ఆరాధించుకొనుచు అద్వైతతత్త్వ జ్ఞానము నార్జించుకొని ముక్తిని బడసిరి.


అంతటితో శ్రీ శంకరా చార్యస్వామి విశ్వప్రేమ ను అనేకమంది మీద కనబరచి దురాచారములను రూపు మాపి కృతార్థులయి యచ్చోటు వీడి పశ్చిమ సముద్రమునకు ప్రయాణమైనారు.


*గోకర్ణ క్షేత్రము:*


బహుమతములలోని లోపములను తెలియ జెప్పి శాస్త్రసమ్మతం గాని మతములను విడిచి పెట్టించి తరించు విధానము గల అద్వైతమత విశిష్టతను బోధించి యావద్భారతము సంచా రము జేసి కాశీపట్టణం జేరుకొన్నారు.


అచ్చట అనేక మతములను కాదని తత్త్వ రహస్యమును వెల్లడించి ప్రేమతో సరియైన మార్గమున త్రిప్పి తద్వారా అద్వైత మత స్థాపన జేసి పశ్చిమతీర ప్రాంతములకు ప్రయాణమై మార్గమధ్యమందు అనేక దేశములు దాటి కొలది దినములకు గోకర్ణ క్షేత్రం జేరు కొన్నారు. వెళ్ళీ వెళ్ళడంతో అందున్న పరమశివుని దర్శించారు.


శ్రీ శంకరాచార్యుల దర్శనం కొరకు వేలాది జనం శివాలయానికి వెళ్ళి వారిని దర్శించారు. ఆనాడా శివాలయంచూడ ముచ్చటైనది. తీరికసమయములలోఆలయంలో శిష్యులకు వేదాంత తత్త్వబోధ చేసే వారు. పురవాసులు వచ్చి వినేవారు. హరదత్తు డను శివభక్తుడు బాగుగ విద్యలు నేర్చినవాడు. శ్రీ శంకరులిచ్చు ఉపన్యాస ములు కడు శ్రద్ధతో విని శ్రీశంకరులు కేవలం అవతార పురుషులని నిశ్చయించు కొన్నాడు. అప్పటికి తన గురువైన నీలకంఠాచార్యుని కంటె గొప్ప వాడు లేడని తలంచేవాడు. శ్రీశంకర పాదుల శక్తిసామర్ధ్యము లు చూచుటతో అతని తలంపు తారుమారైనది. రెండురోజులు శ్రీశంకర దేశికేంద్రుల తత్త్వబోధ విని తన గురువులకు ఆ విషయం విన్నవించు కొనుటకు చాల కుతూహలం కలిగి గురువులను సమీపించి,'సద్గురువర్యా వందనములు! మన శివాలయమున యతీశ్వరులొకరు మహా శిష్యగణంతో అరుదెంచి యున్నవారు. లోకంలో ఎందరెందరినో జయించారట! అపజయమనునది ఆయనెఱుగరట! మండమిశ్రుడు మొదలైన దిగ్గజములు వాదమందు విజయం సాధించలేక నిర్వీర్యులై, జగద్గురువులకు శిష్యులై సేవిస్తు న్నారు. శ్రీ ఆచార్య స్వామి శిష్యులకు వేదాంతవిజ్ఞాన బోధలు చేయుచుండ నేనచ్చోట కొలదిసేపుండి విని యున్నాను.


అద్వైత మత ప్రచారమే వారి ముఖ్యాశయమట.


దేశ మందుగల మతములలో నుండే లోపములను పూర్ణమైన ప్రేమతో సవరించి నిజతత్త్వమును సాకల్య ముగ బోధించడమే వారి అవతారాశయమట! ఆ ఆశయమును దేశమం దంతట ప్రచారం చేసి విజయపతాకమును చేపట్టి కుమతములను ఖండించి మన ప్రాంతం మిగిలియున్నదని దీనిని గూడ ఆ విధముగ ఉద్దరించిన వారి కోరిక నిర్విఘ్నముగ, సంపూర్తి యగునని వచ్చియున్నారట! వాదమందు మిమ్ములను గూడ జయించ వలెనన్న ఆకాంక్షతో మన పురమందు బసచేసి యున్నారు' అని మెల్లగ హరదత్తుడు తన గురు దేవులకు వ్యక్తం చేశాడు.


శిష్యుని పలుకులు ములుకులై హృదయాం తరాళమందు గాఢముగ నాటుకొనగా నీలకంఠాచార్యు లొకించుక సేపు మౌనం వహించి పిమ్మట, 'శిష్యా! నా శక్తిసామర్థ్యములు నీవెఱుగవా? ఆసన్న్యాసి సముద్రమును ఎండగట్ట గలడనుకో! ఆదిత్యుని అనేక మారులు ఆకాశము నుండి అవనీతలమునకు దింప గలడనుకో! ఈ భూమినంతను ఒక్క పర్యాయం చాపచుట్ట వలె చుట్టగలడనుకో! ఇంకను ఏలాటి ఘన కార్యములనైనను చేయ గలడనుకో! నన్ను మాత్రం జయించడం కల్ల! క్షణంలో అతణ్ణి ఓడించడం స్థిరం! నా చాకచక్యం, నా ప్రజ్ఞ ఆ సన్న్యాసి చవి చూచును. నీకనుమాన మేల?' అని లోన గల పిరికితనమును వ్యక్తం చేయక హేలగాపలికాడు. లోనికేగి, ‘అదేమియో చూచెదను గాక!' అని మనస్సులో తలచి చక్కగా ద్వాదశ స్థానము లలోను విభూతిరేఖలను ధరించి, రుద్రాక్ష మాలలను అలంకరించుకొని, సాక్షాత్ శివునివలె తయారై, శిష్యులను వెంటబెట్టుకొని బయలు దేరి శ్రీశంకరాచార్యుల కడకు పోవుచుండెను. శ్రీ ఆచార్యస్వామిని సమీ పించి చేరువన కూర్చుం డెను.


*నీలకంఠుడు:*


నీలకంఠుడు జగద్గురువులతో వాదించుటకు  ఉద్యుక్తుడైనటుల సురేశ్వరాచార్యుడు గ్రహించాడు. తన చాతుర్యం వాదంలో చూపించెదనని, నీల కంఠునితో శ్రీసురేశ్వరా చార్యుడు వాదించుటకు జగద్గురువులనర్ధించాడు.  అందులకు శ్రీ శంకరపాదు లంగీకరించగా తయారుగ నుండెను. నీలకంఠాచార్యులు దానిని కనిపెట్టి, 'ఓయీ! నీవు నాతో వాదించ నాయత్తపడు చున్నట్లు కన్పట్టుచున్నావు! అలనాడు నీవు, నీ భార్య శ్రీశంకరులతో వాదించి ఓడిపోయి నటుల నేనెఱుగనా? నీ ప్రజ్ఞ అందు వ్యక్తమైనది గదా! స్వయంగా ఆచార్యస్వామితో వాదించ నుద్యుక్తుండనై వచ్చితిని. మధ్య నీతో  నాకేల?' అని సురేశ్వరా చార్యుని తిరస్కరించి శ్రీ ఆచార్యపాదులవైపు తిరిగి వాదమునకు సిద్ధముగా నున్నటుల వ్యక్తపరిచాడు. అందు లకు సర్వసిద్ధముగ నున్న జగద్గురువులు తన యభి మతమును వ్యక్తంచేయగా నీలకంఠా చార్యులు, 'శంకరా చార్యా! బ్రహ్మసూత్రములకు నేను ఇదివరకే భాష్యమును రచించి యుంటిని. శివతత్త్వమే మానవులకు శరణ్యమని సిద్దాంతం జేసినాడ' అని ప్రారంభించునంత శ్రీ శంకరాచార్యులు నీల కంఠాచార్యునికి గల ప్రభావమును సంపూర్తిగా వ్యక్తం చేయువరకు వేచియుండిరి. అంత వరకు వెడలగ్రక్కిన విషయములను పట్టు కొని ఒక్కొక్కదానినే తుత్తునియలు గావించిరి. అట్లు ఛేదించుట గమనించి పక్షములు తెగి న పక్షివలె నీలకంఠుడు కూలబడియెను. పట్టు దలవహించి వితండ వాదమునకు నడుం బిగించ  సమకట్టెను. 'యతివర్యా! తత్త్వమ స్యాది మహావాక్యములు జీవబ్రహ్మైక్యమునే ప్రతి పాదించుచున్నవని పలుకుచున్నారు. తాము కూడ అట్టిభావము స్థిర మైనదిగా భావించుచున్నారు. కాని అదెంత మాత్రము సమంజసము గనున్నటు లొప్పుటలేదు. లోకములో చీకటి, వెలుగులున్నవి. ఆ రెండి టికి విరుద్ధ భావములు సహజముగ నున్నవే కదా! ఆ రెండింటికి భేదము లేదనడం ఎట్లు పొసగును?అదేవిధముగ జీవేశ్వరులు ఒకే ధర్మము గలవారు కాదు గనుక వారిరువురకు భేదమే సత్యము. జీవేశ్వరులకు భేదములేదనుట పొసగు నది కాదు.


'శంకరాచార్యా! జీవేశ్వరులకు భేదం లేదని ఒప్పించుటకు ఎన్నెన్నో యుక్తులు పన్ని ప్రయత్నించెదరు. అందు ‘బింబము-ప్రతిబింబము' అనుసామ్యంచెప్పుదురు. బింబము లేకుండ ప్రతిబింబ ముండదు. బింబము వంటివాడు ఈశ్వరుడు. ప్రతిబింబ మువలె జీవుడున్నాడని యందురు. అంత మాత్ర మున బింబ ప్రతిబింబ సామ్యంతో జీవేశ్వరులకు భేదములేదని ఒప్పించుట సమంజసము కానేరదు. ఏలయన సూర్యునకుండే గుణము లు ప్రతిబింబమునకు లేవుగదా! అందువలన గుణభేదం ఏర్పడినం దున వైరుధ్యము ప్రత్యక్ష మగుచున్నది. ఇందు సామ్యం ఎట్లు సమర్ధ నీయము? కనుకనే వ్యోమశివుడు మొదలైన మహా మహులందరు దానిని మిథ్య యని స్థిరపరిచినారు. కావున మీరందరు పలుకునది ప్రమాణరహితం. ఇది యును గాక, బింబము సత్యము, ప్రతిబింబము అసత్యమేగదా! ప్రతి బింబము బింబము యొక్క ఛాయమాత్రమే అయియున్నది. ఛాయ లెన్నటికి సత్యములు కానేరవు. జీవుడు పరమాత్మ యొక్క ప్రతిబింబమని అంగీక రించిన అది సత్యము ఎన్నటికీ కాదు. పరమాత్మకు ఉపాధి లేదు. ఉపాధి లేనప్పుడు పరమాత్మకు ఛాయ యెట్లు కలుగును? ఒకవేళ ఉన్నదని ఒప్పుకొనిన ప్రతిబింబ మునకు సత్యత్వమే యుండదు. కనుక జీవుడు మిథ్యావస్తువే యగుచున్నది. జీవుడే లేనప్పుడు తేడా లేదనడం ఎన్నటికీ సాధ్యం కానిమాట. అట్లయినచో బంధము లేదు, మోక్షము లేదు. మరియొక విషయము - 'జీవునకు బ్రహ్మకు ఉపాధులు లేవు, అవి కల్పితము' లనుచు న్నారు. ఆ ఉపాధులు నశిస్తే 'జీవుడే బ్రహ్మ' అని అంటారు వేదాంతులు. జీవేశ్వరులలో ఈశ్వరుని వలె జీవుడుండుట లేదు. ఈశ్వరునకు సర్వజ్ఞత్వ మున్నది.


జీవుడు మూఢుడు, పైగా అల్పజ్ఞానంతో నున్న వాడు.


అందువలన వారిరువురి ధర్మముల లోను తేడాలు స్పష్టముగ నున్నవి. మరియు ఆవులకు గుఱ్ఱములకు ధర్మాలలో తేడాలున్నవి. ఆ ధర్మములను కాదను టకు ఎట్లు వీలు లేదో జీవేశ్వరులకు చిన్న, పెద్ద అను తేడాలున్నవి. అట్లు కాదనుట ఎవరికీ శక్యం కాదు. 'నేనుపరమాత్మను కాను' అనేది కూడ ప్రత్యక్ష ప్రమాణం కలదియే. దీనిని కూడ కాదనుటకు వీలు లేదు. కనుక భేదం లేదని వాదించడం భ్రాంతి కాక మరేమున్నది? 

 

లోకమంతా 'నేను, నీవు' 'వాడు, వీడు' అనే భావంతో మునిగి యున్నది. ఇది నా భార్య, వీడు నా కుమారుడు, ఈతడు నా మిత్రుడు అనుచున్నారు. నాకు, వీనికి భేదము లేదనుచున్నారు. భేదము లేకుండ అభేదము రాదు. అప్పుడు కూడ రెండు ఉండి ఉండ వలెను. నేనే వాడు, వాడే నేను అన్నప్పుడు భేదం లేకున్నను ఇద్దరు కనబడుచున్నారు. 'నేను బ్రహ్మను' అనినప్పుడు 'నేను' అనువాడొకడు, ‘బ్రహ్మ’ అనువాడొకడై తీరుచున్నది. కనుక అద్వైతమనునది శుద్ధ అబద్ధమైంది. గనుక ద్వైతమే స్థిరం' అని నీలకంఠుడు తనలో నున్నదంతయు వెలువ రించెను.


*కాలడి శంకర కైలాస శంకర*


*శ్రీ ఆది శంకరాచార్య చరితము 40వ భాగముసమాప్తము* 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

*శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,

 *శ్రీ ఆది శంకరాచార్య చరితము 39,వ భాగము*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️


*పరమాణు వాదులు:*


పరమాణువాద మత స్థులలో ధీరశివుడను వాడు పెద్ద. ఆయన శంకరులను సమీపించి, 'స్వామీ! నమస్కారములు! పరమేశ్వరుడు లోకములన్నింటికి కర్తయై వెలయు చున్నాడు. అంతవరకు అందరికి సమ్మతమే. నిత్యత్వంగల భూమ్యాది పరమాణు వుల సంయోగము వలన లోకములు సృష్టింప బడుచున్నవి. ఎప్పుడా పరమాణువు లు వియోగము జెందునో ఆనాడు ప్రళయము సంభవించుచున్నది. కాని పరాత్పరుడు తాను నిమిత్త మాత్రుడై, సాక్షీభూతుడై ఉన్నాడు’ అని వివరించాడు.


ధీరశివుని మత విధాన మును విని, 'ధీరశివా! నీవన్నదంతా వేద విరుద్ధమైనది. సమస్త ము పరమేశ్వరుడి నుండియే పుట్టు చున్నది. ఆయన సృష్టించనిది ఏమియు లేదు. లోకముల కాయన తండ్రి యని వేదము తెలియ జేయు చున్నది. గౌతమ ముని చే తెలుపబడినన్యాయ విద్యను అనుసరించిన వారు నక్కలై పుట్టెదరు. కనుక అట్టివన్నియు విడనాడి అద్వైతతత్త్వ మునాశ్రయించి ముక్తు లు కండు. అందులకు సద్గురువుల నాశ్రయిం చవలెను' అని శ్రీ శంకరాచార్యస్వామి తెలుపగా ధీరశివుడు మొదలైన పరమాణు వాద మతము వారందరు తమ మతమును వీడి శ్రీ శంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన జేయుచు సుఖముగ నుండిరి.

ఆ మరునాడు బ్రాహ్మీ ముహూర్తమున లేచి, త్రివేణీ సంగమంలో స్నానాదులొనర్చి, శ్రీ శంకరపాదులు శిష్య సమేతముగా బయలు దేరి వారము దినములకు కాశీక్షేత్రం జేరు కొన్నారు.


*కర్మవాదులు:*


ప్రయాగ పట్టణము నుండి కాశీ జేరుకొని శ్రీశంకరాచార్య స్వామి మూడు మాసములు అద్వైత మత ప్రచార ముజేసిరి.శ్రీ శంకర పాదుల ఆగమనముతో కాశీ పట్టణం కళకళలాడి నది. పురజనులు తండోపతండములుగ వచ్చి జగద్గురువుల దర్శనం చేసికొని పద్మపాదాదియతులను దర్శించి ఆశీర్వచన ములు పొంది పోవు చుండిరి. పూర్వ పరిచయం గలవారు శ్రీశంకరాచార్యుల దివ్య తేజంచూచి అబ్బుర పడి అమితానంద భరితులైరి. శ్రీ ఆచార్య స్వామి దేశమందనేక మతములను నిరాక రించి అద్వైత మతము నకు పట్టాభిషేకము జేసి వచ్చినారని కాశీ పురమందు, చుట్టుపట్ల గల కర్మవాదులందరు ఒకచో సమావేశమై ఎట్లైనను కర్మమతము నకు ప్రముఖస్థాన మిప్పించ వలెనని నిర్ణయించు కొనిరి.

కర్మవాదులందరు శ్రీ శంకరపాదులకు యధా విధిగ నమస్కారములర్పించి తమతమ స్థానములయందు ఆసీను లయ్యారు. అందొకరులేచి, ఆచార్య స్వామీ! కర్మ చేయనిదే ఏమీలేదు. సృష్టిస్థితు లకు కర్మ వల్లనే గదా కారణమగు చున్నది. మంచికర్మలు చేయుట వలన మంచి జన్మలు, చెడు కర్మలాచరించి నందువలన నీచజన్మలు కలుగు చున్నవి. జనకమహారాజు మొదలయిన వారు అందరు సత్కర్మలాచ రించుట వలననే గదా జ్ఞానులై ముక్తిని బడసి యున్నారు. ముముక్షు వులందరు కర్మలు చేయవలెనని, దాని వలన సుఖం కలుగు నని, ఆ సుఖమే మోక్షమని నిర్ణయిం చారు గదా!” అని తెలియజేసెను.


కర్మోపాసకుల పలుకు లాలకించి శ్రీ శంకరా చార్యులు, 'కర్మోపాసకుడా! “యస్యైతత్ కర్మ” అని శ్రుతి తెలుపుచున్నది. జగత్తు పుట్టినదనిన అందులకు కారణము బ్రహ్మే, అది సుస్పష్టము. కర్మ జడమై యుండ,జడము సృష్టికి కారణమెట్ల గును? మూఢులయిన వారుమాత్రం జడమగు కర్మనాశ్రయించి జనన మరణరూప సంసార సాగరమందు బడుచు న్నారు' అని సూక్తులతో పలుక కర్మవాదులం దరూ శ్రీశంకరులకు శిష్యులై కర్మమతమును విడనాడి అద్వైత విద్య నాశ్రయించారు.


*చంద్ర మతస్థులు*:


శివభూషణుడను పేరు గల చంద్రమత గురువు శిష్యులతో శ్రీశంకరాచార్యుల కడకు జేరి, 'యతీశ్వరా! నమస్కార ములు! పూర్ణిమ మొదలగు పుణ్య తిథులలో భక్తిశ్రద్ధలతో చంద్రుని ఆరాధించెదరు. లోకములన్నిటికి ప్రకాశమును కలుగ జేయు చున్నాడు చంద్రుడు. ఆయన ప్రత్యేక మండలము గలిగినవాడై లోకములకు కూడ పాలకుడై అలరారుచున్నాడు. అందువలన చంద్రుడు అందరికి పూజనీయు డయ్యాడు. ఆతడే ముక్తి నిచ్చువాడు. అందుచే మేమందరం ఆయన్నే ఉపాసించు చున్నాము. తాముకూడ మావలెనే చంద్రుని పూజించి ధన్యులు కండు!' అని తన మత విధానమును వివరించెను.


శ్రీశంకరాచార్యులు ఆ పద్దతిని విని, 'శివ భూషణా! అనిత్యమైన వాళ్ళను ఉపాసించిన నిత్యమైన మోక్షం ఎట్లా కలుగును? అదెన్నటికి సాధ్యం కాని పని. కొన్ని కర్మలు చేసిన చంద్ర మండల నివాసం కలుగును. ఆ పుణ్యం తరిగిన వెంటనే తిరిగి భూ లోకమందు జన్మించడం సత్యం. ‘ధూమో రాత్రి స్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనమ్ | తత్ర చాంద్రమానం జ్యోతిర్యోగీ ప్రాప్య నివర్తతే' అని శ్రీకృష్ణ భగవానుడువచించాడు. అనగా పొగ, రాత్రి, కృష్ణపక్షము, ఆరునెల లతోగూడిన దక్షిణాయ నము, ఏ మార్గమున గలవో ఆ మార్గమున వెడలి, సకామ కర్మయోగి చంద్ర సంబంధ మైన ప్రకాశమును పొంది, మరల వెనుకకు వచ్చుచున్నాడు. అనగా భూమండ లమున జన్మించుచున్నాడు. పైగా చంద్రుడు దేవతలకు అన్నమని చెప్పుచున్నది. అట్టి వాణ్ణి ఎట్లు సేవించినను ముక్తి రానేరదు. ఒక్క చంద్రలోక ప్రాప్తి మినహాగా చంద్రోపాస కునకు లభ్య మయ్యేది మరియొకటి కానరాదు. కనుక ఇంతటితో మీ మూఢత్వమును విడనాడి జ్ఞానమును ఆర్జించుకొని ముక్తులు కండు! జ్ఞానమే ముక్తికి మార్గము' అని బోధించారు.


శివభూషణాదులు శ్రీ జగద్గురువుల తత్త్వ బోధను విని తమ మతమును  విడనాడి శ్రీశంకరపాదులకు శిష్యులై అద్వైతతత్త్వ జ్ఞానార్జన చేయుచు సుఖముగ నుండిరి.


పిమ్మట కుజుడు మొదలైన గ్రహోపాసకు లు శ్రీశంకరపాదులతో వాదించ వచ్చి యున్నారు.


*కుజాది గ్రహోపాసకులు*


గ్రహములు తొమ్మిది. అందు మొదట రవి చంద్రులను ఉపాసిం చువారు శంకరులతో వాదించి అద్వైతు లయ్యారు.మిగిలినవారు కుజ, రాహు, గురు, శని, బుధ, కేతు, శుక్ర మతములవారున్నారు. వారందరు శ్రీశంకరా చార్యులను దర్శించి, 'స్వామీ! అనేక నమస్కారరములు! అంగారకుడు మొదలయిన గ్రహములను ఉపాసిం చిన ముక్తి కలుగునని వేదమందు వచించ బడియున్నది. మేమం దరము అంగారకాది గ్రహోపాసకులము. మా ఉపాసనలతో తప్పక మాకు ముక్తి కలుగు చున్నది. కావున ముక్తిని పొందగోరు వారు మావలె శ్రద్ధతో కుజాది గ్రహములను ఉపాసించవలెను అన్నారు.


శ్రీ శంకరదేశికేంద్రులు కుజాది గ్రహోపాసకుల ఆశయము విని, ‘భక్తులారా! గ్రహాల నుపాసించిన ముక్తి లభింపదు. అట్టి ఉపాసన గ్రహపీడలను వదల్చుకొనుటకు ఉపకరించును. తత్త్వజ్ఞానం వల్లనే ముక్తి కలుగుచున్నదని 'సదేవ’ మొదలగు వాక్యములు ప్రమాణ ములుగ నున్నవి. కావున నవగ్రహోపాస నలు విడనాడి ఆత్మ తత్త్వ జ్ఞానమునకై పాటుపడుడు!' అని బోధించారు. అంతట గ్రహోపాసకులందరు శ్రీశంకరపాదుల మాటల యందు గౌరవముంచి శ్రీజగద్గురువులకు శిష్యులై ఆత్మతత్త్వము నాశ్రయించి జ్ఞానులై సుఖమును పొందిరి. పిమ్మట క్షపణకుడను వాడు శ్రీశంకరపాదుల శిష్య గణమందు వేచి యున్నవాడు, శ్రీ శంకరాచార్యస్వామి వారి పరీక్షకు సిద్ధ పడెను.


*క్షపణకుడు శిష్యుడగుట:*


ఆరుమాసముల క్రితం శ్రీశంకరాచార్యులఆజ్ఞకు బద్ధుడై గోలయంత్ర తురీయ యంత్రములను ధరించిన క్షపణకుడను కాలమతస్థుడు ఉండ బట్టలేక శ్రీజగద్గురువుల కడ కరుదెంచి, నమస్కరించి, 'స్వామీ! చిరకాలము నుండి మీకడ నుండిపోతిని. నన్ను పరీక్షింతు నంటిరి. కాని మీకడ సుఖముగ నుంటిని. నన్ను మన్నించి నా మతవిధానము వినుడు!' అనగా శ్రీశంకరపాదులంగీక రించి వివరించమనిరి.


'పరాత్పరా! కాలమే పరబ్రహ్మమని మేము నమ్మియున్నారము. ముక్తికోరువారు మా కాలదేవుణ్ణి ఉపాసించవలెను. ఆయన మాకు ముక్తి నిచ్చుచున్నాడు. తామును మావలెనే కాలదేవుని ఉపాసిం చుడు!' అని క్షపణ కుడు వివరించెను.


వాని మాటల కాశ్చర్య పడి శ్రీశంకరాచార్యులు 'కాలముగూడ పరబ్రహ్మము నుండియే ఉత్పన్నమైనది. పుట్టిన దెప్పుడును నిత్యము కాదు. కనుక దాని నుపాసించ తగదు. కాలోపాసన వలన ముక్తి రాదు. ఇకనైన నీ బుద్ధి మార్చుకొని అద్వైత మతము నాశ్రయించుము! అదియే నీకు ముక్తి నిచ్చును' అని బోధించారు. 

క్షపణకుడు తక్షణం తన మతమును విడిచి శంకరులకు శిష్యుడై అద్వైతము నాశ్రయిం చాడు.


*పితృమతస్థులు:*


సత్యకర్మ మొదలయిన పితృ మతస్థులు తమ మత విధానమును తెలిపి శ్రీశంకరులను ఒప్పించుటకు వచ్చి నమస్కరించారు. 'స్వామీ! పితృ దేవతలు ఎల్లపుడు ముక్తులయి ఉన్నవారు. వాళ్ళను సేవించుట వలన ధర్మాదులు లభించి ముక్తి కలుగు చున్నది. వారలకు నిత్యము పితృ తర్పణ ములు వదలుచుండ వలెను. శ్రాద్ధాదులు శ్రద్ధతో పెట్టవలెను. అట్లుచేసిన గృహస్థులు ముక్తులగుచున్నారు. పితృలోకము చంద్ర మండలమునకు పైగా నున్నది. 


చాంద్రమానమును బట్టి ప్రతీ అమావాస్య పితృదేవతలకు మధ్యాహ్న కాలము అగును. మానవమానం ప్రకారము పితృదేవత లకు ఒక దినము అచున్నది. అమావాస్యనాడు పితృదేవతలకు భోజన మిడిన వాళ్ళు ప్రతీ దినము భోజనము చేసినట్లగును. మన మట్లుచేసిన పితృదేవత తలు నిత్య తృప్తులగుదురు. ప్రతీ అమావాస్య నాడు పిండపితృ యజ్ఞము లాచరించి వలసి యున్నది. కావున పితృదేవతో పాసన చేసినవారు తప్పకుండ ముక్తిని పొందెదరు" అని వివరించారు పితృ మతస్థులు.


శ్రీ శంకరాచార్యస్వామి అది విని 'కర్మలు చేయుట వలన ముక్తి రాదని వేదం వచించు చున్నది. అందువలన మీరాడిన మాటలలో సత్యం దూరమైనది. ఆత్మతత్త్వ జ్ఞానమే ముక్తిని ఇచ్చునని పరమ ప్రమాణమై యుండ కర్మ చేయడం వలన ముక్తి కలుగు ననుటకు ఆస్కార మెక్కడ? కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి మాత్రమే కలుగు చున్నది. చిత్తశుద్ధి గలిగినవాడు సద్గురువుల నాశ్రయించి తత్త్వ విచారణ చేయవలసి యున్నది. దానివలన ముక్తి తప్పక సిద్దించును' అని బోధించారు. అంతట సత్యశర్మాదు లందరు తమతమమతములను విడనాడి శ్రీశంకరా చార్యులనుశరణుజొచ్చి శిష్యులై జ్ఞానమార్గము నవలంబించిరి.


*గరుడ శేష భక్తులు:*


గరుడ శేష భక్తులు శ్రీశంకరుల జూడ వచ్చారు. అందు కుజ్వలీటుడు ఆదిశేషుని భక్తుడు. శంఖపాదుడు గరుడభక్తుడు. వారిరువురు వారివారి మతస్థులలో గురువులై యున్నారు. వారిరువురు శ్రీశంకరపాదులను జేరి నమస్కరించి ‘యతీశ్వరా! మా మనవి చిత్తగింపుడు! ఆదిశేషుడు శ్రీ పరమే శ్వరునకు సర్వదా శయ్యాసుఖమును కలుగజేయు చున్నాడు. అందువల్ల మేమందరం  ఆదిశేషుని ఉపాసించు చున్నాము' అన్నాడు కుజ్వలీటుడు. 


'పరమేశ్వరునకు నిత్యం వాహన సౌఖ్యమును కలుగ జేయుచున్న గరుత్మం తుని పరమభక్తితో సేవించుచుందుము' అని శంఖపాదుడు వివరించాడు.


వారిరువురి విధానము లను విని, 'ఓయీ! భక్తులారా! శయ్యను, వాహనమును ఉపాసించిన ముక్తిరానేరదు. మీకు ముక్తి కావలెనన్న పరాత్పరునే సేవించుడు ఆ దేవదేవుని దయకు పాత్రులు కండు. ఆయన దయ వలన తత్త్వ జ్ఞానార్జన ప్రాప్త మగును. తద్వారా ముక్తిని పొందుడు' అని శ్రీ శంకరాచార్యులు తెలియజెప్పిరి. అంతట వారిరువురు సంత సించి జగద్గురువులు వచించిన విధానము ననుసరించుటకు నిశ్చయం చేసికొని శ్రీశంకరాచార్యుల నాశ్రయించి శిష్యులై నారు.


*సిద్ధోపాసకులు:*


'స్వామీ! నమస్కార ములు! మేమందరం సిద్ధుల అనుగ్రహంతో మంత్రాలను పొంది యున్నాము. శ్రీశైలము మొదలైన దివ్య స్థలములలో సత్యనాధుడు మొదలయిన అనేకమంది సిద్ధులు ఉంటున్నారు. వారు అందరు మంత్రసిద్ధి ప్రభావం వలన చిరకాలము నుండి అట్లనే ఉండిపోయారు. మేముకూడ వారివలెనే చిరకాలము నుండి జీవించుచున్నాము. అనేకవిద్యలు అంజనా దులు మా యధీన మైనవి. మమ్ములను కాదనువారికి శక్తి చాలదు. కనుక తాము కూడ మా వలెనే సిద్ధులై ప్రసిద్ధికెక్కుడు' అని తమ ఉపాసనా విధానమును విశద పరిచారు.


శ్రీ శంకరపాదులు సిద్ధుల ప్రజ్ఞ విన్నారు. 'సిద్దోపాసకులారా! విచిత్రవేషములు దాల్చుటవలన ఆడంబ రమే మిగులును. అజ్ఞానముతో మాట లాడుట యుక్తము కాదు. వేషాదుల వలన ద్రవ్యార్జనకు అనువుగా నుండిన నుండవచ్చు. అట్టి ద్రవ్యము పాప భూయిష్టమగును. ఆ ద్రవ్యమనుభవించిన వాడు పాపి యగును. ఈ శరీరములు సర్వ దుఃఖములకు నిలయ ములు. ఎంత కాలం జీవించిన నేమి ఫలము ఉన్నది? చిరజీవికి ఆత్మ సుఖం లేనప్పుడు జన్మ సార్ధకము కానేరదు. కావున తరుణో పాయము పొందుటకు జ్ఞాన మార్గమును అవలం బించుడు. తద్వారా ముక్తిని బడయుడు' అని తెలియజెప్పగా సిద్దులు శంకరసూక్తులు మనమున నాటి వారి మతమును విడచి శ్రీ శంకరపాదులకు శిష్యులై కృతార్ధు లయ్యారు.


*కాలడి శంకర కైలాస శంకర*

*శ్రీ ఆది శంకరాచార్య చరితము39 వ భాగముసమాప్తము*

🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗🥗

రక్త , జిగట విరేచనాలు

 రక్త , జిగట విరేచనాలు కొరకు  - 


       ఉశిరిక ఆకులు 50 గ్రాములు , మెంతులు 3 గ్రాములు అరలీటరు మంచి నీటిలో వేసి పావులీటరు కషాయం అయ్యేవరకు మరిగించి వడపోసి ఆ కషాయాన్ని సగం సగం రెండుపూటలా తాగుతూ ఉంటే ఎంతోకాలం నుంచి బాధపెడుతున్న రక్త , లేదా జిగట విరేచనాల సమస్య అతి సులువుగా హరించి పొతుంది .


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .

 పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .


 * అరటిపండు -


         అరటిపండులో పొటాషియం , మాంసకృత్తులు ఎక్కువుగా ఉండటం వలన ఇది తీసుకోగానే నీరసం , వికారం తగ్గి ఉత్సాహం వస్తుంది. గుండె పనితీరు క్రమబద్దం అవుతుంది. ఒక పెద్ద అరటిపండు తింటే 150 కేలరీల శక్తి వస్తుంది. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పనితీరు కూడా మెరుగవుతుంది. గుండెనొప్పి నివారించవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తింటే ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగును .


 * మామిడిపండు -


        మామిడిపండు శరీరపుష్టిని కలిగించును. వేగముగా శక్తిని ప్రసాదించును. మామిడిపళ్ళలో A , B , C , D విటమిన్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లలో ఉండే కెరొటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారును . మామిడికాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రెండింటిని తినడం వలన ఐరన్ , విటమిన్ C లను పొందవచ్చు. ఇతర ఖనిజ లవణాలు మాత్రం మామిడికాయ , మామిడిపండు రెండింటిలోనూ సమపాళ్లలో ఉంటాయి.


 * సీతాఫలం -


        శీతాకాలం ప్రారంభంలో కడుపులో నులిపురుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సీతాఫలాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వలన నులిపురుగులు పోతాయి . సీతాఫలాలు కడుపులోని క్రిములను బయటకు నెట్టివేస్తుంటే సీతాఫలాలు తినటం వలన పురుగులు వచ్చాయి అనుకుంటాము. ఇది కేవలం భ్రమ మాత్రమే . సీతాఫలానికి జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నది. సీతాఫలం వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. రక్తవిరేచనాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది .


 * దానిమ్మ పండు. -


       రక్తహీనతతో బాధపడేవారు రోజూ దానిమ్మపండు తినడంగాని లేదా దానిమ్మపండు రసం తాగడం గాని చేయాలి . ఆహారాన్ని జీర్ణం చేయడంలో దానిమ్మ ఒక ఔషధముగా పనిచేయును . అంతేకాకుండా కీళ్లనొప్పులు , ఉబ్బసం , కఫాలను పోగొట్టును . శరీరంలో మంట, జ్వరం , గుండెజబ్బులు , గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది చాలా మంచిది . అరుగుదల సరిగా లేనివారు దానిమ్మని తినటం అలవర్చుకోవాలి.


          తరవాతి పోస్టులో మరికొన్ని పండ్లలో గల ఔషధగుణాలు వివరిస్తాను. 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

ప్రతిభావంతులేమో

 ✊✊


*బోల్ ఇండియా బోల్ - చేదు నిజాలు*


రైతులు పొలంలో - రైతుల కొడుకులు సైన్యంలో మరణిస్తారు,

కానీ

నాయకులు దేశంలో, వారి సంతానం విదేశాల్లో, సౌఖ్యాలు పొందుతారు.


*చేదు నిజం ఏమంటే*, ఈ దేశ వాసులమైన మనం ఇక్కడ పి.హెచ్.డి, గ్రాడ్యుయేషన్, మెడిసిన్, ఇంజనీరింగ్ చదివిన వాళ్లం,

టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళకు ఓటు వేసి, నేతలుగా ఎన్నుకొని, వారి నుండి మన బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటుంటాం. *ఆలోచించండి*.


రాజకీయ నేతలు కావాలనుకొనే వాళ్ళు ఐదు సంవత్సరాలు సైన్యంలో ఖచ్చితంగా పనిచేసి తీరాలన్న నిబంధన పెడితే,

దేశంలో 80 శాతం ఉత్పాతాలు (దరిద్రాలు) వాటంతట అవే సర్దుకుంటాయి.


*25 - 30 సంవత్సరాల పాటు ఉద్యోగాలు చేసిన వాళ్లకు పెన్షన్ఉండదు*.

కానీ,

ఐదేళ్లు రాజకీయ నేతగా పదవి వెలగబెడితే మాత్రం *జీవితాంతం పెన్షన్, ఇతర సదుపాయాలు* ఇస్తున్నారు.

ఇలా ఎందుకు ఇవ్వాలి? 


నాయకులపైకి చెప్పులో, కోడి గుడ్లో, నల్ల సిరానో, విసిరితే ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేస్తారు.

కానీ,

భారతీయ సైన్యం పై రాళ్ల దాడి చేసే వాళ్లకు మాత్రం మినహాయింపు ఇస్తారు. ఎందుకు?


రైతుల సరుకుల వాహనాలపై తోలు వలిచి టోల్ వసూలు చేస్తున్నారు.

కాని,

మంత్రి మహాశయుల వాహనాలకు అదేమీ ఉండదు.

*రైతు తినేది దొంగ సొమ్మా?*

 *నేతలు తినేది కష్టార్జితమా?* ఇదేమి న్యాయం.


*విద్యలో రాజకీయం 100%*

*రాజకీయంలో విద్య 00%*

ఆహా ఎంత గొప్ప విధానం మన ఈ దేశంలో.

ఇందుకేనేమో *రాజకీయం అంతా చెత్త తో నిండిపోయింది*.


దేశంలోని ప్రతిభావంతులేమో

వలస పక్షులు అవుతున్నారు.


దేశంలోని ధర్మాసుపత్రుల్లో పరిస్థితులు మారాలంటే, నేతల పిల్లలకు 

వారి రోగాలకు చికిత్సలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి.

అప్పుడే పరిస్థితులలో మార్పు చూస్తాం.


*₹399 కి అపరిమిత కాల్స్* డేటా దొరుకుతుంటే ప్రజాప్రతినిధులకు నెలసరి *₹15000 టెలిఫోన్ బత్తా ఎందుకు?*


*ప్రజల చర్మం వలిచి పన్నులు వసూలు చేసే కోట్ల రూపాయలను ఇలా వృధాగా ఖర్చుచేయడం అవసరమా?*

అందరూ ఆలోచించాలి. మతం గురించి రాజకీయ నాయకులు రెచ్చగొడితే పేద వర్ణ ప్రజలు రెచ్చిపోయి సాటి మనిషిని దూరం పెట్టి, మతంలో మృగాలా మారిపోతున్నారు. కానీ అది రాజకీయ ఎత్తుగడ తెలుసుకోలేకపోతున్నాడు.


దయచేసి మన దేశంలోని ఇలాంటి *దరిద్ర వ్యవస్థ* గురించి అందరికీ తెలిసేలా షేర్ చేయండి.

సేకరణ

ఆకవరం దామోదరాచారి

ఆదివారం*🌞 🌹 *13, అక్టోబర్, 2024*🌹

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🌞 *ఆదివారం*🌞

🌹 *13, అక్టోబర్, 2024*🌹       

      *దృగ్గణిత పంచాంగం*                


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - శరత్ఋతౌః*

*ఆశ్వీయుజ మాసం - శుక్లపక్షం*


*తిథి     : దశమి* ఉ 09.08 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం: ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : ధనిష్ఠ* రా 02.51 వరకు ఉపరి *శతభిషం*


*యోగం  : శూల* రా 09.26 వరకు ఉపరి *గండ*

*కరణం  : గరజి* ఉ 09.08 *వణజి* రా 07.59 ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు*

*ఉ 07.00-08.00 &11.00-12.00 మ 02.30-04.00*

అమృత కాలం:*సా 05.09 - 06.39*

అభిజిత్ కాలం  : *ప 11.30 - 12.17*


*వర్జ్యం          : ఉ 08.11 - 09.41*

*దుర్ముహూర్తం:సా 04.13 - 05.00*

*రాహు కాలం: సా 04.19 - 05.47*

గుళికకాళం      : *మ 02.50 - 04.19*

యమగండం    : *ప 11.53 - 01.22*

సూర్యరాశి : *కన్య* 

చంద్రరాశి : *మకరం/కుంభం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 05.47*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం    :  *ఉ 05.59 - 08.21*

సంగవ కాలం  :      *08.21 - 10.43*

మధ్యాహ్న కాలం :*10.43 - 01.04*

అపరాహ్న కాలం:*మ 01.04 - 03.26*

*ఆబ్ధికం తిధి: ఆశ్వీయుజ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం :  *సా 03.26 - 05.47*

ప్రదోష కాలం   :  *సా 05.47 - 08.14*

రాత్రి కాలం     :  *రా 08.14 - 11.29*

నిశీధి కాలం    :*రా 11.28 - 12.18*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.11*

________________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌞 *శ్రీ సూర్య నారాయణ దండకం...!!*🙏


శ్రీసూర్య నారాయణా వేదపారయణా లోకరక్షామణి దైవచూడమణీ!!(2సార్లు)


ఆత్మరక్షా నమః: పాపశిక్షా నమోవిశ్వకర్తా నమో విశ్వభర్తా

నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథాధినాథా 

మహాభూతభేదంబులున్ నీవయై బ్రోచు మెల్లపుడున్ భాస్కరాహస్కరా!!


    🌞 *ఓం సూర్యాయ నమః*🌞


🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌹🌞🌞🌹🌷🌹

శాఖాహారం అమృతాహారం

 శాఖాహారం  అమృతాహారం.


భారత దేశం పుణ్య భూమి అంటారు .!!

మరి అటువంటి భారత దేశాన్ని

పుణ్య భూమి గానే ఉంచుదా ము.


ఇది ఖచ్చితం గా చదవండి.


 మాంసాహారం మృతాహారం


జార్జి బెర్నర్డ్ షా అన్నారు,

నీ పొట్ట శ్మశానం కాదు అని.


వివరణ చూద్దాం.


(1)  జంతువులు,పక్షులు,జల చరాలు, అన్ని కూడా మనలాగే నొప్పి ఉన్న ప్రాణులే.

మనకి ఎలా అయితే పెన్సెలు చెక్కి నప్పుడు వ్రేలు కోసుకుంటే వారం పది  రోజులు,(అలాగే ఇతరత్రా)

వరకు కట్టు వేస్తామూ.

అదే జంతువులని పీక           కోస్తున్నప్పుడు అది భూమిపై గిల గిల కొట్టు కుంటున్నప్పు డు అది ఎంత బాదపడు తుంది,,  

 మైడియర్  ఫ్రెండ్స్   ఒక్కసారి ఆలోచిద్దాం . మరి ఆబాద ఎవరికి చెందుతుంది.


పెంచిన వారికి,అమ్మే వారికి,కొన్న వారికి,వండే వారికి,తిన్న వారికి . చేరి ఇంట్లో,వొంట్లో కస్టాలు.


2  ఈ మాంసము తినడం ఎక్క డ నుండి మానవుడి కి             వచ్చింది అంటే,

ఆది మానవుడు నుండివచ్చింది.                        ఆది  మానవుడు ఎలా ఉండేవాడో అందరికి తెలుసు,జంతువు లాగే ఉండేవాడు.

మరి ఈనాడు  అన్నీ అలవాట్లు మార్చుకుని జీవిస్తున్నాడు.

మరి జంతువుల తిండి ఎందుకు మారలేదు.


3   మన పురాణాలు లో ప్రతి భగవంతుడి వెనుక ఒక జంతువు లేక పక్షి ఉంటుంది.

అంటే భగవంతుడు జంతువు లో కుడా ఉన్నాడు ,మమ్మల్ని పూజించి నట్లే వాటిని కుడా పూజించండి అని.


మరి మన వాళ్లు దేవుడి తో పాటు వాటిని పూజిస్తారు,మళ్లి

వాటిని చంపి తింటారు.

ఎందుకు.   !!  

                  

అలాగే

దశావతారం లో భగ వంతుడు నేనే  ఆ అవతారాల్లో ఉన్నాను అని చూపించేడు.


4  మాంసం తిన్న  జంతువు క్రూరత్వం తో ఉంటుంది. వాటి  దగ్గరకు మచ్చిక అయితేనే వెళ్ల గలం.

ఉదా; పిల్లి,కుక్క,నక్క,పులి,సింహం.


అదే ఆవు,మేక,గొర్రె,ఏ నుగు,ఇంకా ఎన్నో వీటి దగ్గరకు మనం వెళ్లగలము.


  ఇంకా అంటారు మాంసం బలమని

మరి పై జంతువులన్నిటి కి బలము ఎలా వచ్చింది.!!


అలాగే మాంసం తిన్న జంతువుల కి కోరలు , గోళ్ళూఉంటాయి.


ఆవులు  మిగతా వాటికి దంతాలు ,గిట్టలు ఉంటాయి.

మరి మన పళ్ళు,గోళ్ళూ  ఎలా ఉన్నాయి.


అలాగే

మనిషి బ్రతకడం కోసం ఆహారం కావాలి కాని మాంసం అవసరం లేదు,


నాలుక మీద ఒక్క క్షణం ఉండే రుచి కోసం ప్రాణం తీయడం అవసరమా.


ఈ రోజు ఎన్నో రకాలయిన veg లు దొరుకు తున్నాయి.

పన్నీరు,మష్రూమ్,మీల్ మేకర్

బేబీ కార్న్, ఇతరత్రా. 


అలాగే ఇంకో ఆసక్తి కరవిషయం

ఒక kg మాంసం తయారీ కి 10     or  15 వేల లీటర్ల నీరు అవసరం పడుతుంది.

అదే కాయగూరల కి 500 లీటర్ల   

         నీరు పడుతుంది.


ప్రాణం విలువ, ప్రాణం ఉన్న వాళ్ళకే తెలుసు..


జై హింద్.