13, అక్టోబర్ 2024, ఆదివారం

పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .

 పండ్లు - వాటిలోని ఔషధోపయోగాలు - 2 .


 * అరటిపండు -


         అరటిపండులో పొటాషియం , మాంసకృత్తులు ఎక్కువుగా ఉండటం వలన ఇది తీసుకోగానే నీరసం , వికారం తగ్గి ఉత్సాహం వస్తుంది. గుండె పనితీరు క్రమబద్దం అవుతుంది. ఒక పెద్ద అరటిపండు తింటే 150 కేలరీల శక్తి వస్తుంది. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పనితీరు కూడా మెరుగవుతుంది. గుండెనొప్పి నివారించవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తింటే ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగును .


 * మామిడిపండు -


        మామిడిపండు శరీరపుష్టిని కలిగించును. వేగముగా శక్తిని ప్రసాదించును. మామిడిపళ్ళలో A , B , C , D విటమిన్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లలో ఉండే కెరొటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారును . మామిడికాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రెండింటిని తినడం వలన ఐరన్ , విటమిన్ C లను పొందవచ్చు. ఇతర ఖనిజ లవణాలు మాత్రం మామిడికాయ , మామిడిపండు రెండింటిలోనూ సమపాళ్లలో ఉంటాయి.


 * సీతాఫలం -


        శీతాకాలం ప్రారంభంలో కడుపులో నులిపురుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సీతాఫలాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వలన నులిపురుగులు పోతాయి . సీతాఫలాలు కడుపులోని క్రిములను బయటకు నెట్టివేస్తుంటే సీతాఫలాలు తినటం వలన పురుగులు వచ్చాయి అనుకుంటాము. ఇది కేవలం భ్రమ మాత్రమే . సీతాఫలానికి జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నది. సీతాఫలం వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. రక్తవిరేచనాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది .


 * దానిమ్మ పండు. -


       రక్తహీనతతో బాధపడేవారు రోజూ దానిమ్మపండు తినడంగాని లేదా దానిమ్మపండు రసం తాగడం గాని చేయాలి . ఆహారాన్ని జీర్ణం చేయడంలో దానిమ్మ ఒక ఔషధముగా పనిచేయును . అంతేకాకుండా కీళ్లనొప్పులు , ఉబ్బసం , కఫాలను పోగొట్టును . శరీరంలో మంట, జ్వరం , గుండెజబ్బులు , గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది చాలా మంచిది . అరుగుదల సరిగా లేనివారు దానిమ్మని తినటం అలవర్చుకోవాలి.


          తరవాతి పోస్టులో మరికొన్ని పండ్లలో గల ఔషధగుణాలు వివరిస్తాను. 


  

   మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  

  గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కామెంట్‌లు లేవు: