ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
18, డిసెంబర్ 2024, బుధవారం
శీతాకాలపు అయనాంతం
*8 గంటలు పగలు.. 16 గంటల పాటు రాత్రి!*
డిసెంబర్ నెలలో అరుదైన ఘటన జరగబోతుంది. ఈ నెల 21న సుదీర్ఘమైన రాత్రి ఉండనుంది. దాదాపు 16 గంటల పాటు రాత్రి సమయం.. మిగిలిన 8 గంటల పాటు పగలు ఉండనుంది. సాధారణంగా ఇలా జరగడాన్ని అయనాంతం అని పిలుస్తారు. అయితే అయనాంతం ఏర్పడిన రోజున భూమి ఉత్తరార్థగోళం సూర్యునికి ఎక్కువ దూరం వెలుతుంది. ఆ సమయంలో చంద్రకాంతి భూమిపై చాలా సమయం ఉంటుంది. ఇది శీతాకాలంలో ఏర్పడుతున్నందున దీనిని 'శీతాకాలపు అయనాంతం' అని అంటారు.
పురోహితుడు (ఒక్కరు ) కావలెను.
*ఓం నమో వేంకటేశాయ*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి కాలరీస్ వారి P.V. కాలనీ నందు గల శ్రీ పద్మావతీ గోదాదేవి సమే త వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు నిత్య పూజాదికములు నిర్వహించుటకు పురోహితుడు (ఒక్కరు మాత్రమే) కావలెను.
*అర్హతలు*
1. 35 సంవత్సరములు పైబడి వివాహితుడై యుండవలెను.
2. స్మార్త, వైఖానస, ఆగమ శాస్త్ర విజ్ఞానం కలిగియుండి, ఆయా శాస్త్ర పద్ధతుల ప్రకారం పూజాది కార్యక్రమాలు నిర్వహించగలిగిన సామర్థ్యం కలిగి ఉండాలి.
3. ఏవిధమైన దురలవాట్లు లేకుండా ఉండాలి
*జీత భత్యములు*
1. నెలకు రూ.18,000/- లు జీతముగా చెల్లించ బడును.
2. నిత్య మహా నైవేద్యం నిమిత్తం రూ.5,000/- లు అదనంగా చెల్లించ బడును.
3. నెలకు ఒక గ్యాస్ సిలిండర్ ఉచితముగా ఇవ్వబడును.
4. రెండు పడక గదుల నివాసము ఆలయము పక్కనే ఉచితముగా ఇవ్వబడును.
5. కుటుంబ సభ్యులందరికీ ఉచిత వైద్య సదుపాయం
6. పిల్లలు ఉంటే వారికి ఉచిత విద్య
7. ఉచిత మంచినీరు, ఉచిత విద్యుత్తు
పైన తెలిపిన అర్హతలు, జీత భత్యములకు ఇష్టమున్న వారు మీ మీ దరఖాస్తులను మీకు సంభందించిన అన్ని వివరములతో ఈ క్రింద తెలుపబడిన చిరునామాకు మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జత పరచి ఈ నెల 30 వ తేదీ లోగా పంపవలెను. అన్ని దరఖాస్తులను పరిశీలించిన మీదట మీతో ముఖా ముఖి సంభాషణ జరుపు తేదీని మీ చరవాని నంబరుకు రెండు రోజుల ముందుగా తెలియ జేస్తాము. ప్రత్యక్ష ముఖా ముఖి అయిన తరువాత మీ మీ ప్రజ్ఞా పాటవాలను బట్టి మిమ్ములను ఎంపిక చేయడం జరుగుతుంది.
*మీ దరఖాస్తులు పంపవలసిన చిరునామా*
Dr. P. Seshagiri Rao,
Medical Superintendent,
Area Hospital, S.C.Co.Ltd.,
MANUGURU- 507117
Bhadradri -Kothagudem (Dt)
Mobile No. 9440367890
*18, డిసెంబర్, 2024*🌷
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🪷 *బుధవారం*🪷
🌷 *18, డిసెంబర్, 2024*🌷
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సంకష్టహర చతుర్థి*
*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం*
*దక్షిణాయణం - హేమంత ఋతౌః*
*మార్గశిర మాసం - కృష్ణపక్షం*
*తిథి : తదియ* ఉ 10.06 వరకు ఉపరి *చవితి*
*వారం : బుధవారం*(సౌమ్యవాసరే)
*నక్షత్రం : పుష్యమి* రా 12.58 వరకు ఉపరి *ఆశ్లేష*
*యోగం : ఐంద్ర* రా 07.34 వరకు ఉపరి *వైధృతి*
*కరణం : భద్ర* ఉ 10.06 *బవ* రా 09.58 ఉపరి *బాలువ*
*సాధారణ శుభ సమయాలు*
*ఉ 06.30 - 08.30 మ 01.30 - 05.00*
అమృత కాలం : *సా 06.30 - 08.07*
అభిజిత్ కాలం : *ఈరోజు లేదు*
*వర్జ్యం : ఉ 08.49 - 10.26*
*దుర్ముహూర్తం : ప 11.42 - 12.27*
*రాహు కాలం : మ 12.04 - 01.28*
గుళికకాళం : *మ 10.41 - 12.04*
యమగండం : *ఉ 07.53 - 09.17*
సూర్యరాశి : *ధనుస్సు*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం :*ఉ 06.30*
సూర్యాస్తమయం :*సా 05.39*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు*
ప్రాతః కాలం : *ఉ 06.30 - 08.44*
సంగవ కాలం : *08.44 - 10.57*
మధ్యాహ్న కాలం :*10.57 - 01.11*
అపరాహ్న కాలం : *మ 01.11 - 03.25*
*ఆబ్ధికం తిధి : మార్గశిర బహుళ చవితి*
సాయంకాలం : *సా 03.25 - 05.39*
ప్రదోష కాలం : *సా 05.39 - 08.13*
రాత్రి కాలం : *రా 08.13 - 11.39*
నిశీధి కాలం :*రా 11.39 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం : *తె 04.47 - 05.39*
________________________________
🌷 *ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🪷సరస్వతీదేవి🪷*
*అవతార అంతరార్థం*
*ఈమె బ్రాహ్మీముహూర్తం (సూర్యోదయం కంటే ముందున్న అరుణోదయం) నుండి మధ్యాహ్నకాలం వరకు ఆవిర్భవించిన సమయముగా చెబుతారు. సరస్వతి ప్రకాశమయ రూపము కలిగి ఉంటుంది కావున ఈమెను "తార'' గా వ్యవహరిస్తారు.*
*హిరణ్య గర్భః సమవర్తతాగ్రే*
*భూతస్య జాతః పతిరేక ఆసీత్*
*సదాధార పృధ్వీం ద్యాముతేమామ్*
*కస్మై దేవాయ హవిషావిధేమ*
*ఇది హిరణ్యగర్భుడైన బ్రహ్మస్తుతి. విశ్వాధిష్టాత అయిన ఈ హిరణ్యగర్భుని శక్తిని తార లేదా సరస్వతిగా వ్యవహరిస్తారు.*
*ప్రకాశసమయంలో అవతరించిన తల్లి కావున తార అని అంటారు. జ్ఞానానికి, ఆనందానికి, ఉనికికి, సరస్వతి మూలం కావున ఈమెను మూలా నక్షత్రం నాడు ఆరాధిస్తారు.*
🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷
🌷🪷🌹🛕🌹🌷🪷🌷
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🌷🌷🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🌹🌹🍃🌷
🌹🌷🪷🪷🪷🪷🌷🌹
సర్దుకుపోవడం
సర్దుకుపోవడం మౌనంగా ఉండడం కోపాన్ని అణచుకోవడం ఇవన్నీ ఎలా సాధ్యం
ఓ దంపతులు చాలా అన్యోన్యతకు రూపంగా ఉన్నారు. 50 ఏళ్ల వారి దాంపత్య జీవితంలో ఎటువంటి పొట్లాటలు లేవు. వినగానే ఆశ్చర్యం వేసినా నమ్మకం కలగలేదు.
భార్య తీవ్ర అనారోగ్యంతో తన తనువు చాలించే సమయంలో భర్త ఆమెను ఒక్క ప్రశ్న అడిగాడు.
కోకిలా ఇన్నేళ్ల మన జీవితంలో నాపైన ఎప్పుడూ కోపం రాలేదా అని.
ఆమె ఆ అటక పైన ఓ పెట్టె ఉంది తీసుకోండి అంది. మన పెళ్ళైన కొత్తలో మీనుండి ఓ మాట తీసుకున్నాను. ఎటువంటి పరిస్థితిలోనూ ఈ పెట్టే మీరు తెరవకూడదు అని. మీరు నా మాటను ఇప్పటివరకు పాటిస్తూ వచ్చారు. ఆ విషయంలో మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను.
ఇప్పుడు ఆ పెట్టెను తెరవండి అని అడిగింది కోకిల. భర్త ఆ పెట్టెను తెరిచాడు అందులో రెండు నూలు బొమ్మలు ఉన్నాయి.
మా అమ్మ ఈ పెట్టెను మన పెళ్లి అప్పుడు ఇచ్చారు. నీ భర్త పైన ఎప్పుడు కోపం వచ్చినా ఆయన పైన కోపాన్ని ప్రదర్శించకు. ఇలా బొమ్మలు వేసిపెట్టు అన్నారు అని చెప్పింది.
భర్తకు ఒకటే ఆనందం కోకిలా అంటే ఇన్నేళ్ల మన కాపురంలో నీకు నాపైన రెండు సార్లేనా కోపం వచ్చింది అని అడిగితే ఆమె అందులో ఉన్న ఒక మూటను విప్పి అక్షరాల రెండు లక్షల రూపాయలు అతడి చేతిలో పెట్టి,
నేను వేసిన బొమ్మలన్ని అమ్మేస్తే వచ్చిన డబ్బులు అవి ఇదిగో నీ జీవితాన్ని ఇక కొనసాగించుకో అన్నది.
అరిచి విడిపోవద్దు
అహంతో కొట్టుకోవద్దు
ఆవేశం కోపం వచ్చినప్పుడు
వాటిని ఎలా ఆపుకోవాలో తెలిస్తే బంధాలతో శాశ్వతంగా ఉంటాము అని చెప్పింది కోకిల.🍎🍑🍅🍅🍓🍇👍👍రాళ్లభండి చంద్రశేఖర్ శాస్త్రి 👏👏
తిరుప్పావై మూడవ రోజు
🔱ఓం నమః శివాయ🔱:
_*🚩తిరుప్పావై మూడవ రోజు పాశురం🚩*_
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
*3. పాశురము*
*ॐॐॐॐॐॐॐ*
ఓఙ్గి యులగళన్ద ఉత్తమన్ పేర్ పాడి
నాఙ్గిళ్ నంబావైక్కు చ్చాత్తినీరాడినాల్
తీఙ్గిన్ఱి నాడెల్లామ్ తిజ్గిళ్ ముమ్మారిపెయ్ దు
ఓఙ్గువళై ప్పోదిల్ పొఱివండు కణ్ పడుప్ప
తేఙ్గాదే పుక్కిరున్దు శీర్ త్తములై పత్తి
వాఙ్గ- క్కుడమ్ నిఱైక్కుమ్ వళ్ళల్ పెరుమ్ పశుక్కళ్
నీఙ్గాద శెల్వమ్ నిఱైన్దేలో రెమ్బావాయ్.
*భావము:-*
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీ కృష్ణ సంశ్లేషమే! ఐనా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంతానందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు.
ఆ పరమానంద మూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, యీ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్నాచరిస్తే - దుర్భిక్షమసలు కలుగనే కల్గదు. నెలకు మూడు వర్గాలు కురుస్తాయి.
పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంత ఎత్తుకెదిగి ఫలిస్తాయి. పంటచేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు త్రుళ్లిపడుతూ ఆనంద సమృద్దిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.
ఇవన్నీ సమృద్దికి సంకేతాలే! ఇక పాలు పిదుక గోవుల పోదుగలను తాకగానే - కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తోంది గోద!
*3 వ మాలిక*
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీని నాచరించుటవలన వ్రతాన్నాచరించనవారికే కాక లోకమునకంతకును లాబించుము. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మకదా!
మరి విశేషంగా ఆరాధించిన వారికేకాక లోకానికంతకూ కల్యాణాన్ని కల్గించి శుభాలను చేకూర్చేవాడని వ్రతఫలాలను వివరిస్తోంది గోదాదేవి.
*(మోహనరాగము - ఆదితాళము)*
ప. హరి తిరువడులను కొలిచెదము
తిరు నామములనె పాడెదము
అ.ప.. పెరిగి లోకముల గొలిచిన పాదము
పరసాధనమని తెలిసి పాడుదము
1 చ. వ్రతమును చేయగ స్నానమాడెదము
ప్రతి నెల ముమ్మరు కురియు వర్షములు
వితత సస్యముల నెగయు మీనములు
మత్తిలి కలువల సోలు భ్రమరముల
2 ఛ. బలసిన గోవుల పొదుగుల తాకగ
కలశముల క్షీరధారలు కురియగ
శ్రీలెయెడతెగని ప్రసారములో యన
ఇల సిరులదూగు చేతుము వ్రతమును.
🕉🌞🌎🌙🌟🚩
*తిరుప్పావై 3పాశురము.... ఓఙ్గియులగళన్ద తెలుగు అనువాద పద్యము*
సీ.పరమాత్ము సేవించు భాగ్యంబు మాదని
తరలి వెళ్ళెడు జన్మ ధన్యమయ్యె
వామన రూపుడై బలిచక్రవర్తికి
మూడవ యడుగుతో మోక్షమిచ్చె
ఈతి బాధలు లేక సిరులతో నిండును
భువిలోని ప్రజలకు పోవుబాధ
గోవిందు పూజలు గోక్షీర వృద్ధియు
పైరులు పంటలు బాగుపడును
వర్షదారలు పడి వరదలు పారెను
వరదుని సేవకై వచ్చునటుల
తే.గీ. సిరులు సంపదలు కలిగి ధరణినిండి
సంతసంబుగ జీవించి స్వామి సేవ
భాగ్యమయ్యెను మాకంచు ప్రాణులెల్ల
పశువు పైరులు జనులెల్ల వశులు యగును
శ్రద్ధభక్తిని కల్గించి బుద్ధినిమ్ము
శ్రీధరుని మానసంబున స్థిరము కమ్ము!!
🕉🌞🌎🌙🌟🚩
*ఆండాళ్ తిరువడిగలే శరణం*
*3-పాశురము*
*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి*
*నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్*
*తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు*
*ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ*
*పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప*
*తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి*
*వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్*
*నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్*
విభవం
(అవతారములు):-
ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహము లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.
"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు.
ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.
ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు!
ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు.
ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.
మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.
వ్రత ఫలితములు:-
ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు.
మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా!
మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.
మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.
మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.
ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది.
ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి.
సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.
ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా!
దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు.
అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.
"నాంగళ్" ఏం కోరిక లేని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.
"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి.
"పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.
భావం:--
ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే ! దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి మూడడుగుల దానాన్ని పొందిన కృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది, ఆకాశమంత ఎత్తు ఎదిగి, మూడులోకాలను కొలిచాడు.
ఆ పరమానందమూర్తి దివ్యచరణాలను, అతని దివ్య నామాలను పాడి, ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గళిస్నానాన్ని ఆచరిస్తే, దుర్భిక్షము అసలు కలుగనే కలుగదు. నెలకు మూడు వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రముని వలే ఆకాశమంత ఎత్తుకి ఎదిగి - ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువలను చేరి ... భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి.
ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక, గోవుల పొదుగులను తాకగానే -- కలశాలు నిండునట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహదైస్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సఖులందరినీ పిలుస్తున్నది గోదాదేవి.
అవతారిక:--
ఈ ధనుర్మాస వ్రతమెంతో శుభప్రదమైనది. దీనినాచరించుట వలన -- వ్రతాన్ని ఆచరించిన వారికే కాక లోకమునకంతకును లాభము కల్గును. ఇది ఇహపరసాధక వ్రతము. పిలిస్తే పలికేవాడు కృష్ణపరమాత్మ కదా !శాస్త్రోక్తములగు నియమములను పాటించాలి. అలా పాటించనివారు ఇహపర లోకాలలో సుఖమునొందజాలరు అని కృష్ణపరమాత్మా తెలియచేస్తున్నారు.
🕉🌞🌎🌙🌟🚩
పంచాంగం 18.12.2024 Wednesday,
ఈ రోజు పంచాంగం 18.12.2024 Wednesday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం హేమన్త ఋతువు మార్గశిర మాస కృష్ణ పక్ష తృతీయ తిథి సౌమ్య వాసర: పుష్యమి నక్షత్రం ఇంద్ర యోగః: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.
రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.
యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.
శుభోదయ:, నమస్కార: