20, సెప్టెంబర్ 2026, ఆదివారం

భగవంతుడు

  🌷☘️🌷☘️🌷☘️🌷☘️🌷


*🌺భగవంతుడు*

      *అంటే అర్ధం*🌺


*చాలా మందికి దేవుడిని "భగవంతుడు" అని పిలుస్తారని తెలుసు*.


*🌺"భగవంతుడు" అంటే ఏమిటి?*


మంచి గుణాలు కలిగిన వారిని "గుణవంతులు" అంటాము.

బాగా ధనం కలిగిన వారిని ''ధనవంతులు" అంటాము.

మంచి శీలం ఉంటే" శీలవంతులు" అంటాము.

అలాగే అందమైన రూపం కలిగిన వారిని " రూప వంతులు" అంటాము.

మరి "భగవంతుడు" అంటే ఏవరు?

"మాహాత్మ్యస్య సమగ్రస్య ధెైర్యస్య యశస శ్శ్రియఃజ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం - భగ, ..... ఇత్యుక్త భగో౽స్యాస్తీ తి భగవాన్ " అని శాస్త్ర నిర్వచనం .


1) మాహాత్మ్యం

2) ధైర్యం

3) యశస్సు 

4) సంపద

5) జ్ఞానం

6) వైరాగ్యం

ఈ ఆరింటిని షడైశ్వైర్యాలు అంటారు.

వీటికే "భగ" అని పేరు. 

*ఈ ఆరు ఐశ్వైర్యాలను సంపూర్ణంగా కలిగి ఉండడం వల్లనే "భగవంతుడు" అని పేరు**.


*🌺1) మాహాత్మ్యం..*

*పవిత్రత వల్ల మాహాత్మ్యం సిద్ధిస్తుంది." పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం" అని వేదశాస్త్ర పురాణేతిహాసాలు దేవుడిని కీర్తిస్తున్నాయి.దేవుడు "సంపూర్ణ పవిత్ర స్వరూపుడు" కాబట్టి సంపూర్ణ మాహాత్మ్యం కలిగి ఉంటాడు.అనుభవ పూర్వకంగా చూసుకున్నా మనం ఏ విషయంలో పవిత్రంగా ఉంటామో ఆ విషయంలో మాహాత్మ్యం సిద్ధిస్తుంది*


*.ఉదాహరణకు...తల్లిదండ్రులు తమ సంతానం విషయంలో ఎలాంటి కల్మషం లేని పవిత్రతతో ఉంటారు.కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు తమ దీవెనలు ఫలించగలిగే మాహాత్మ్యం సిద్ధిస్తుంది..... ఇలా ఏ విషయంలో మనం పవిత్రతను కలిగి ఉన్నామో ఆ విషయంలో ' మాహాత్మ్యం' ఏర్పడడాన్ని మనం గమనించవచ్చు!ఎక్కడ మాహాత్మ్యం ఉంటుందో అక్కడ నమస్కార యోగ్యత ఏర్పడుతుంది.నమస్కారం వల్ల అవతలి వ్యక్తి మాహాత్మ్యాన్ని - ఆశీర్వాదాన్ని మనం స్వీకరించ గలుగుతాము.అందుకే పవిత్రంగా జీవించే సాధువులకూ, మహాత్ములకూ, బ్రాహ్మణులకూ, పెద్దలకు నమస్కరించే పద్ధతి సనాతన ధర్మం లో సాంప్రదాయ సిద్ధంగా వస్తూ ఉంది*.


*🌺2) ధైర్యం*...

*.ఇక ధైర్యం దేనివల్ల కలుగుతుంది.భయం లేకపోవడం వల్ల.భయం ఎలా పుడుతుంది?ప్రధానంగా 50% భయాలు అజ్ఞానం వల్లనే కలుగుతాయి. ఎక్కడ తెలియనితనం ఉంటుందో అక్కడ భయం ఉంటుంది.అది తెలిసిన తర్వాత ఆ భయం పోతుంది.ఇక మిగతా భయాలు మనకున్న ఆరోగ్యం - ఆయుస్సు - సంపదలు - పరివారం - అధికారం - కీర్తి - సౌఖ్యం ...మొ॥ ఐశ్వర్యాలు ఎక్కడ నశించి పోతాయో అనే కారణం నుండి పుడుతాయి*.


*🌺ఇక దేవుడు వేదస్వరూపుడు.అంటే జ్ఞానస్వరూపుడు.ఇక అతనికి అజుడని పేరు.అంటే పుట్టక లేని వాడు .అలాగే అచ్యుతుడు.. అంటే నాశనం లేనివాడు.శ్రీధరుడు అంటే సమస్త ఐశ్వర్యాలను ధరించినవాడు.కాబట్టి సంపూర్ణ ధైర్యం అనెడి ఐశ్వర్యం అతనిని సేవిస్తూ ఉంటుంది*.


*🌺3) యశస్సు*...

*యశస్సు అంటే స్వచ్చమైన కీర్తి ."క్రియాశీలత వల్ల కీర్తి... నిష్క్రియత్వం వల్ల అపకీర్తి " ఏర్పడుతుంది.నీరు నిరంతరం ప్రవహిస్తూ క్రియాశీలంగా ఉండడం వల్ల " నది "లా మారి అందరిచే పూజించబడుతూ "కీర్తి"ని పొందుతుంది.ఆగిపోయిన నీరు " నిష్క్రియత్వం" వల్ల మురికి గుంటలా మారి అందరిచే అసహ్యించబడుతూ.. అపకీర్తిని పొందుతుంది.మనష్యుల పరిస్థితి అయినా అంతే!ఏ విషయంలో మనిషి క్రియాశీలతను కలిగి ఉంటే ఆ విషయంలో కీర్తి లభిస్తుంది.ఉదాహరణకు.. చదువు విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి విద్య విషయంలో కీర్తి లభిస్తుంది.ధన సంపాదన విషయంలో క్రియాశీలతను కలిగి ఉన్న వ్యక్తికి ధనవంతుడనే కీర్తి లభిస్తుంది..... ఇలా ఏ విషయంలో క్రియాశీలత ఉంటుందో ఆ విషయంలో సహజంగానే కీర్తి లభిస్తుంది.ఇక సంపూర్ణ క్రియాశీలుడైన ఈశ్వరున్ని యశస్సు అనెడి ఐశ్వర్యం నిరంతరం సేవిస్తూ ఉంటుంది*.


*🌺4) సంపద..*

*సంపద అంటే సమృద్ధి, సాధించబడినది అనే రెండు అర్థాలు.తృప్తి పరిచేది - అవసరాలను తీర్చేది సంపద.సంపద రెండు రకాలుగా సృష్టించబడుతుంది*.


*🌺i)ఇతరుల అవసరాలను నెరవేర్చగలిగే శక్తి పెరుగుతున్న కొద్ది సంపద సృష్టి జరుగుతూ ఉంటుంది.ఒక కూలి నుండి బిల్ గేట్స్ వరకు ఎవరినైనా గమనించండి. వారు ఇతరుల అవసరాలను ఎంతగా నెరవేరుస్తూ ఉంటారో అంతగా వారి వద్ద సంపద వృద్ధి పొందుతూ ఉంటుంది.*


*శారీరకంగా - మానసికంగా -బౌద్ధికంగా - ఆథ్యాత్మికంగా ..... ఏ రకంగానైనా ఇతరుల అవసరాలను తీర్చగలిగే శక్తే, శ్రీమంతుడు కావడానికి ప్రధాన కారణం*.


*ఇక రెండవది*

*🌺ii) క్రియాశక్తి వల్లలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపమని పురాణాలు వర్ణిస్తున్నాయి.సంపద అనేది శ్రమకు ప్రతిఫలం . శ్రమించడం వల్ల కూడా సంపద సృష్టి జరుగుతుంది.శ్రమించే తత్వం పెరుగుతూ తనలో ఉన్న ఇచ్చాశక్తినీ... జ్ఞాన శక్తిని క్రియా రూపంలోకి మార్చడం వల్ల సంపద సృష్టించబడుతూ వుంటుంది.ఈ రెండు రకాలుగా కాకుండా ఇతరుల చే సృష్టించబడిన సంపదను కొల్లగొట్టేవారు కొందరుంటారు. వీరు ఇహ-పర లోకాలలో పతనం చెందుతారని శాస్త్రం చెబుతుంది.ఎందుకంటే....సంపద అంటే డబ్బు - బంగారం కాదు. అవి సంపదకు బదులుగా వినియోగించే వినిమయాలు మాత్రమే! ఒక దేశంలోని డబ్బుకు మరో దేశంలో విలువ ఉండదు. అలాగే భూలోకంలో ఉండే వినిమయాలు మరో లోకంలో చెల్లబడి కావు.కానీ, ఇతరుల అవసరాలను తీర్చగలిగే నెైపుణ్యశక్తి.... క్రియాశక్తి ఆ జీవుడు ఏ లోకంలో ఉన్నా సంస్కార రూపంలో వెన్నంటి ఉండి అతన్ని ఐశ్వర్యవంతుడు గా నిలుపుతుంది*


*ఇక ఈ సమస్త సృష్టి అవసరాలు తీర్చడం వల్లా.., సంపూర్ణ క్రియాశీలత్వం వల్ల ఈశ్వరున్ని సంపద అనెడి ఐశ్వర్యం సేవిస్తూ ఉంటుంది*.


*🌺5) జ్ఞానం..*

*ఈశ్వరుని యొక్క సర్వవ్యాపకత్వం - సర్వశక్తిమత్వమే సర్వజ్ఞత్వానికి కారణమౌతుంది.తత్వశాస్త్ర దృష్ట్యా జ్ఞానం అనేది పొందబడేది ... కోల్పోయేది కాదు. అది ఎప్పుడూ ఉండేది. అది ఆత్మ స్వరూపంగా ఉంటుంది.దాన్ని మనకున్న ఏకాగ్రతను బట్టి కొంచెం కొంచెంగా అనుభవంలోకి తెచ్చుకుంటాము.ఒక వ్యక్తిలో ఉన్న ఏకాగ్రత శక్తిపైన అతని జ్ఞానం ఆధారపడి ఉంటుంది.ఏ విషయంలో ఏకాగ్రత చూపుతాడో ఆ విషయ సంబంధ జ్ఞానం లభిస్తుంది.ఏకాగ్రత సంపూర్ణ స్థాయికి చేరినపుడు సంపూర్ణ జ్ఞానం అనుభవంలోకి వస్తుంది. అలాంటి వ్యక్తులను ఆత్మజ్ఞానులు అంటాము. వారి వ్యక్తిగత చైతన్యం విశ్వ స్థాయికి ఎదగడం వల్ల వారికి కూడా సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది.ఈ విశ్వంలోని సమస్త నియమాలను సృష్టించి ఒక నియతిని ఏర్పాటు చేయడం వల్ల ఈశ్వరునికి నియంత అనే మరో పేరుంది.ఆ నియమాలపై ఏకాగ్రత నిలిపి పరిశోధించడాన్నే మనం శాస్త్ర విజ్ఞానం అంటున్నాము.ఇలా సర్వవ్యాపకుడు - విశ్వరూపుడు - నియంత అయిన ఆ పరమాత్మను జ్ఞానం అనెడి ఐశ్వర్యం సదా సేవిస్తూనే ఉంటుంది*.


*🌺6) వైరాగ్యం..*

*సంతృప్తితో కూడిన త్యాగమే వైరాగ్యం.ఈశ్వరునికి నిరంజనుడని పేరు.అంటే దేనికీ అంటకుండా కేవల సాక్షి మాత్రంగా ఉండే వైరాగ్య సంపన్నుడని అర్థం.వైరాగ్యం అనేది సమృద్ధిని దాటిన స్థితి.హిమాలయాల్లో "పరుసవేది " అనే మూలిక ఉంటుందట. ఆ వేరుతో ఏ లోహాన్ని ముట్టినా ఆ లోహం బంగారంగా మారుతుందట. అలాంటి పరుసవేది ని కలిగి ఉన్న వ్యక్తి గుట్టలు గుట్టలుగా బంగారాన్ని ప్రోగుచేస్తాడా?ఆ వేరును మాత్రం దగ్గరుంచుకుని అవసరమున్నంత వరకే వాడుకుంటాడు. అతనికి ధనాన్ని సంపాదించాలనే కోరిక - ఆశ వంటివి ఏమీ ఉండవు.అంటే ధన విషయంలో వైరాగ్యం లభించినదన్న మాట!అసంతృప్తితో - అశక్తతతో వచ్చేది వైరాగ్యం కాదు. అది లేమితనం - బలహీనత.ఒక నపుంసకుడు సన్యాసిగా మారితే అది వైరాగ్యం కాదు.ఒక నిజమైన పురుషుడు సన్యాసిగా మారితేనే అది నిజమైన వైరాగ్యం.మన దేశంలో చాలా మంది మిథ్యా వైరాగ్య సంపన్నులు ఉంటారు. నాకు ధనం మీద ఆశ లేదు అంటుంటారు. మళ్లి కష్టపడకుండా - తేరగా ధనం వస్తే సంతోషిస్తారు. ఒక కోటి రూపాయలు కష్టపడి సంపాదించి దానిపై బంధం లేకుండా సంతృప్తితో దానం చేయగలిగితే అది వైరాగ్యం అవుతుంది.వైరాగ్యం అనేది తేలికగా వచ్చే ఐశ్వర్యం కాదు. అది ఇంతకు ముందు చెప్పినట్లు సమృద్ధిని దాటిపోయిన స్థితి.ఎవరో కొందరు వివేకానందుడు లాంటి మహాత్ములు మాత్రమే నిజమైన వైరాగ్య సంపన్నులుగా ఉంటారు*.


*ఇక దేవునిది అన్ని విషయాల్లో సమృద్ధిని దాటిన స్థితి.కాబట్టి వైరాగ్యం అనెడి ఐశ్వర్యం అతడిని నిరంతరం సేవిస్తూ ఉంటుంది.ఇలా ఈ ఆరు ఐశ్వర్యాలను కలిపి 'భగ' అని పేరు. వీటిని కలిగి ఉండడం వల్ల భగవంతుడని పేరు.మనలో కూడా ఈ ఆరు ఐశ్వర్యాలు అంశ మాత్రంగా ఉంటాయి. మన ప్రవర్తనను బట్టి ఆయా ఐశ్వర్యాలు వృద్ధి పొందుతాయి*.


💅💅💅💅💅💅💅💅💅💅💅


*కృష్ణం వందే జగద్గురుం 🙏.*

ప్రణవనాదం

  🕉️ *ప్రణవనాదం — ఓంకార విశిష్టత.* 🪷


*“ఓం”* — భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో పవిత్రమైన నాదం. మనం పూజ చేసేటప్పుడు, మంత్రాలు జపించేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు ముందుగా ఓంకారాన్ని స్మరించడం మన సంప్రదాయంలో ఉంది.


ఓం అనేది కేవలం ఒక శబ్దం కాదు. దైవాన్ని స్మరించడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగించే పవిత్ర నాదం.


ఓంకారంలో దాగిన భావం ~


*ఓంకారం “అ, ఉ, మ” అనే మూడు ధ్వనులతో ఏర్పడుతుంది.*


మనిషి సాధారణంగా మూడు స్థితులను అనుభవిస్తాడు — మెలకువ, కల, గాఢ నిద్ర. వీటిని అ, ఉ, మ ధ్వనులతో మాండూక్యోపనిషత్తు అనుసంధానిస్తుంది.


ఈ మూడు స్థితులకు మించిన చైతన్యాన్ని తురీయ స్థితిగా ఉపనిషత్తు చెబుతుంది.


అందుకే ఓంకారం మన రోజువారీ అనుభవాలను గుర్తుచేస్తూనే, వాటికి మించిన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకోవాలనే ఆలోచనను కలిగిస్తుంది.


 *ఓంకారాన్ని ఎందుకు స్మరించాలి?*


పూజలో ఓం అని పలికినప్పుడు మన మనస్సు దైవంపై నిలుస్తుంది. మంత్రజపానికి ముందు ఓంకారాన్ని స్మరించడం ద్వారా మనసును భక్తి భావంలోకి తీసుకురావచ్చు.


ధ్యానంలో కూడా ఓంకారాన్ని నెమ్మదిగా ఉచ్చరిస్తూ, ఆ నాదాన్ని శ్రద్ధగా వినవచ్చు. నాదం ముగిసిన తరువాత వచ్చే నిశ్శబ్దాన్ని కొద్దిసేపు గమనిస్తే మనస్సు ప్రశాంతంగా ఉండేందుకు అది సహాయపడుతుంది.


 *ఓంకారం మనకు చెప్పే విషయం. ~*


మన జీవితం ఎప్పుడూ ఎన్నో ఆలోచనలు, ఆందోళనలు, పనులతో నిండి ఉంటుంది. అలాంటి సమయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చుని “ *ఓం* ” అని స్మరించడం మన దృష్టిని లోపలికి తిప్పే ఒక సులభమైన సాధన.


శబ్దం నుంచి నిశ్శబ్దానికి,

చంచలత నుంచి ప్రశాంతతకు,

బయటి ప్రపంచం నుంచి మన అంతరంగం వైపు

మనసును తీసుకెళ్లే ఆధ్యాత్మిక భావమే ఓంకార స్మరణ.


*శాస్త్రాలు చెప్పిన ఓంకార మహిమ. ~*


మాండూక్యోపనిషత్తు ఓంకారంలోని అ, ఉ, మ ధ్వనులకు లోతైన అర్థాన్ని వివరిస్తుంది.


 ప్రశ్నోపనిషత్తు ప్రణవోపాసనను ప్రస్తావిస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు *“ఓం”* ను పవిత్రమైన ఏకాక్షర బ్రహ్మంగా పేర్కొంటాడు.


అందుకే మన పూజలు, మంత్రజపాలు, ధ్యానసాధనల్లో ఓంకారానికి ప్రత్యేకమైన స్థానం వచ్చింది.


🙏 *ఓంకారం — ప్రతి భక్తునికీ ఒక స్మరణ. ~*


ఓం అని పలికేటప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి:


దైవాన్ని స్మరించాలి…

మనస్సును ప్రశాంతంగా ఉంచాలి…

మంచి ఆలోచనలతో జీవించాలి…

మనలోని ఆధ్యాత్మికతను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.


ఇదే ఓంకార స్మరణలోని అందమైన భావం.


*ఓం — ఒక పవిత్ర నాదం.*

*ఓం — ఒక దైవస్మరణ.*

*ఓం — ఒక ధ్యాన మార్గం*.

*ఓం — మనసును అంతర్ముఖం చేసే ఒక సాధన.*


🕉️ *ఓం తత్ సత్* 🕉️


🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 20.09.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష నవమి తిథి భాను వాసర పూర్వాషాఢ నక్షత్రం సౌభాగ్య యోగః కౌలవ కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 


శ్రాద్ధ తిథి : నవమి


 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః
                    జ్ఞాన విజ్ఞాన యోగము

త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ ।
మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయమ్ ।। 13 ।।


ప్రతిపదార్థ:


త్రిభిః — మూడింటి; గుణ-మయైః — ప్రకృతి గుణములతో కూడియున్న; భావైః — దశలు; ఏభిః — ఇవి అన్ని; సర్వం — సర్వము; ఇదం — ఈ యొక్క; జగత్ — జగత్తు; మోహితం — మోహామునకు గురై; న అభిజానాతి — తెలుసుకొనలేక; మాం — నన్ను; ఏభ్యః — ఈ; పరం — సర్వోన్నత; అవ్యయం — అనశ్వరమైన/నిత్యమైన.


తాత్పర్యము:


మాయ యొక్క త్రిగుణములచే భ్రమకు లోనై (మోహితులై), ఈ లోకంలోని జనులు, అనశ్వరమైన మరియు సనాతనమైన నా గురించి తెలుసుకోలేకున్నారు


వివరణ :

ఇంతకు క్రితం శ్లోకాలు విన్న తరువాత, అర్జునుడు ఇలా అనుకునే అవకాశం ఉంది, ‘ఓ ప్రభూ, ఇవన్నీ గనక నీ విభూతులే అయి ఉంటే, శ్రీ కృష్ణా, నీవే సర్వేశ్వరుడవని, సమస్త సృష్టికి మూలమని కోట్ల మంది మనుష్యలు నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?’ అని. దీనికి జవాబుగా, శ్రీ కృష్ణుడు అంటున్నాడు, సత్త్వము, రజస్సు, తమస్సు లతో కూడిఉన్న ప్రకృతి త్రిగుణములచే జనులు మోహితులై పోతున్నారు అని అంటున్నాడు. మాయ యొక్క ఈ మూడు గుణములు వారి యొక్క బుద్ధిని కప్పివేయటం వలన, వారు క్షణభంగురమైన శారీరక సుఖాలకు ఆకర్షితులౌతారు.

‘మాయ’ అన్న పదానికి ఉన్న అర్థాలలో ఒకటి, ‘మా’ (కాదు) మరియు ‘యా’ (ఉన్నది). కాబట్టి, మాయ అంటే, ‘మనకు అనిపించినట్టుగా ఉన్నది కాదు’ అని. భగవంతుని శక్తి స్వరూపంగా మాయ అనేది ఆయన సేవలోనే నిమగ్నమై ఉంటుంది. ఇంకా భగవత్ ప్రాప్తికి అర్హత సాధించని జీవాత్మల నుండి, పరమేశ్వరుని నిజమైన స్వభావాన్ని కప్పివేసి ఉంచటమే, అది చేసే సేవ. మాయ అనేది, ఈశ్వర విముఖంగా ఉన్న జీవాత్మలకు ఎర వేసి, మోహమునకు గురి చేస్తుంది. అదే సమయంలో, మాయ, జీవాత్మలను, మూడు రకాల భౌతిక బాధలకు గురిచేస్తూ ఎన్నోరకాల కష్టాలతో దుఃఖాన్ని కలుగచేస్తుంది. ఈ విధంగా, ఈశ్వర సన్ముఖంగా అయ్యేంతవరకూ వారికి సంతోషము లేదు అన్న విజ్ఞానాన్ని జీవాత్మలకు తెలియచేసేటానికి ప్రయత్నిస్తుంది.

ONLINE DRAFTING OF CASES

 

 ONLINE DRAFTING OF LEGAL CASES 

We launched an online service to useful for all Advocates, who are dealing with civil, criminal, family cases in Courts. Even private parties can also contact for legal help.

Nowadays it is becoming difficulty to find a good skilled person to draft a case.  the seniors are engaged in their day to day court work.  To avoid this situation we are providing eminent legal persons to draft cases.  For details mentioning the following information contact by sending a comment below this post.

NB: your comment will not appear in this blog.  That message will directly go to the relevant persons,

after receiving your message they will contact you to your mobile by way of watts app message.. Why delay start now to get inquiry.

Name:

Place:

Name of the Court you want to file the present case.

Details of case.

Your Mobile No:

Any other information which you wants to furnish

తెలుగు నేర్చుకోండి

 తెలుగు నేర్చుకోండి

 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.

కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.


ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము


మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.

















19, సెప్టెంబర్ 2026, శనివారం

వేంకటేశాయ

 ఓం నమో వేంకటేశాయ🕉️🙏Govindaya


🙏కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే 

ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ।

ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః

వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే 

శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే

శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్🙏



హనుమాన్ బాహుక్



**🙏🌹*హనుమాన్ బాహుక్*🙏🌹 

              *🌷ఎనిమిదవ రోజు🌷*


దూత రామరాయకో, సపూత పూత పౌనకో, తూ 

అంజనీకో నందన ప్రతాప భూరి భాను సో |

సీయ - సోచ - సమన దురిత - దోష దమన, 

సరన ఆయే అవన, లఖనప్రియ ప్రాన సో ॥ 

దనముఖ దుసహ దరిద్ర దరిబేకో భయో, 

ప్రకట తిలోక ఓక తులసీ నిధాన సో ॥ 

జ్ఞాన - గునవాన బలవాన సేవా సావధాన । 

సాహెబ సుజాన ఉర అను హనుమానసో ॥


వివరణ : శ్రీ హనుమంతుడు శ్రీరామచంద్ర ప్రభునకు దూత,

వాయుదేవునికి యోగ్యుడైన కుమారుడు, అంజనాదేవికి ఆనందము కలిగించే వాడు, అసంఖ్యాక సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు, సీతశోక వినాశకుడు, పాపములను, అవగుణములను తొలగించువాడు, శరణాగత రక్షకుడు, లక్ష్మణునకు ప్రాణసమానమైన వాడును. అట్టివాడు ఈ తులసీదాసుయొక్క దుస్సహ దారిద్య్ర రూపియగు రావణుని నాశనము చేయుటకై ముల్లోకములందును ఆశ్రయరూపుడై ప్రకటమగుచున్నాడు.


కనుక ఓ జనులారా! మీరు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు, సేవాభావులు కావాలి అనుకుంటే ఎల్లవేళల జాగరూకుడై యుండు హనుమంతునివంటి సమర్థుడగు దేవుని హృదయమున ఉంచు కొనండి. హనుమంతుడు సర్వశక్తి సమన్వితు డగుటవలన ఏ కోరికలు కలవారయినను ఆతనినే ప్రార్థించి పొందవచ్చు అని అర్దం.


ఈ శ్లోకం లో హనుమంతుడు చేసిన అన్నీ గొప్ప పనులను చెపుతూ ఆ హనుమంతుడు నన్ను అంటే తులసి దాసును దుస్సాహంగా రావణుడు ఎలా లోకాన్ని ఇబ్బంది పెట్టాడో అలా ఇబ్బంది పెట్టే నా సమస్యను తీర్చుగాక అని అంటూ,ఓ జనులారా మీరు జ్ఞానవంతులు, గుణవంతులు, బలవంతులు, ధైర్యవంతులు కావాలంటే ఆ స్వామి హనుమను హృదయంలో ఉంచుకోండి మీ కష్టాలు పోతాయి కోరికలు తీరుతాయి అని మనకు సూచిస్తున్నారు.


🙏🌹*జై శ్రీరామ్ జై హనుమాన్*🙏🌹


          *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*



18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

పాలు సేవించుట

 పాలు సేవించుట  వల్ల ఉపయోగాలు - సేవించువారు తీసుకోవలసిన జాగ్రత్తలు  -  


 

  పాలు సేవించుట వల్ల ఉపయోగాలు - 


   పాలు మధురంగా ఉండును. జిడ్డుని కలిగి ఉండును. వాతాన్ని , పిత్తాన్ని హరించును . శీతలం , అన్ని తత్వముల వారికి మంచిది . బలం కలుగజేయును . మేధస్సుకు మంచిది . ఆయువుని వృద్ది చేయును . బాలురు , వృద్ధులు, క్షీణించినవారు, ఆకలిచే కృశించిన వారు పాలు సేవించిన ఆరోగ్యం కలుగును.


              పాలు పితుకుతున్నప్పుడు వేడిగా ఉండు పాలు బలం , అమృత తుల్యంగా ఉండును. అలా కాకుండగా పితికిన తరువాత చల్లబడిన పాలు తాగినచో అనేక రోగాలు తెచ్చి పెట్టును. 


              పంచదార , పటికబెల్లం కలిపిన పాలు తాగినచో శుక్రం పెంచును.  బెల్లం కలిపిన పాలు తీసుకున్నచో మూత్రం బొట్లుబొట్లుగా పడు రోగంని నివారించును. పిత్తాన్ని , శ్లేష్మాన్ని పెంచును. రాత్రుల యందు పాలు తాగుచున్న యొడల అనేక దోషాలను పోగొట్టును . అలా పాలు సేవించాలి అనుకునేవారు భోజనం వేళకు , పాలు తాగు సమయానికి 2 గంటల వ్యవధి ఉండవలెను . భోజనం చేయకుండా పాలు తాగవచ్చు . పాలలో అన్నం కలిపి తినకూడదు.  అలా తినినచో " అజీర్ణం" కలుగును. రాత్రి నిద్రపట్టదు. 


  ప్రతిదినం పాలు తాగువారు పాటించవలసిన నియమనిబంధనలు  - 


 *  మంచి రంగు లేకుండా మంచి రుచి కలిగి ఉండని , పుల్లటి మరియు చెడు వాసన , గడ్డలుగా ఉన్న పాలను తాగరాదు.


 *  పాలతో ఎల్లపుడూ పంచదార మాత్రమే కలిపి వాడవలెను. లేనిచో పటికబెల్లం చూర్ణం కూడా వాడవచ్చు 


 *  పాలల్లో ఉప్పు కలిపి వాడరాదు.


 *  చేపల కూర తిని పాలు మరియు పాలపదార్థాలు తీసుకోరాదు . అలా తీసుకున్నచో తప్పక కుష్టువ్యాది కలుగును. 


 *  కొన్నిరకాల పుల్లటి వస్తువులు పాలతో చేరినపుడు విరుద్దముగా మారును . కావున పాలు తాగు సమయంలో కాని ఆ తరువాతనైనా పుల్లని వస్తువులను భుజించరాదు . 


 *  ఉలవలు , పరిగెలు , కొర్రలు, అనుములు , అడవి పెసలు మొదలైనవి పాలతో విరోధించును. కావున వీనిలో ఏ ఒక్కటి పాలతో కలిపి లోపలికి తీసుకోకూడదు . 


 *  అనుములు , మినుములు ముఖ్యంగా పాలతో విరోధించును.ఈ రెండు పదార్థాలకు సంబంధించిన ఆహారాలు తీసుకున్నప్పుడు పాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు . అనారోగ్యం కలుగును.


 *  ముల్లంగి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు పాలు వాడరాదు.


 * రాత్రుల యందు వేడివేడి గోధుమ చపాతీలు ఇగురు కూరలతో కాని , తీపి పదార్థాలతో కాని లేక పంచదారతోగాని కలిపి భుజించి కాచిన పాలలో పంచదార కలిపి తాగిన చక్కటి ఆరోగ్యం కలుగును. 


 *  పాలయందు వెన్న ఆవులు, గేదెలు తిను ఆహారం నుండి పుట్టును . చిట్టు , పచ్చగడ్డి , పత్తిగింజలు , మినపరొట్ట మెదలైనవి తినిన పశువుల పాలు శ్రేష్టము. పల్లపు ప్రదేశాలలో ఉండు పశువులు ఇచ్చు పాలకన్నా మెట్ట ప్రాంతాలలో ఉండు పశువులు ఇచ్చు పాలు శ్రేష్టం. 


 *  ఆవుపాలు గేదెపాలకన్నా శ్రేష్టమైనవి . గేదెపాలల్లో ఆవుపాలు కంటే మందంగా ఉండును. కారణం వెన్నశాతం ఎక్కువుగా ఉండటం అందువలన ఆలస్యముగా జీర్ణం అగును. గేదెపాలు నిద్రను కలుగజేయును. చలవ చేయును . 


 *  మేకపాలు కారం, చేదు రుచులు కలిగి ఉండును. ఆకులను తినుట చేతను కొద్దిగా నీరు తాగుటచేతను , ఎక్కువ దూరం నడుచుట వలన మేకపాలు అన్ని వ్యాధులను పొగొట్టును. ముఖ్యంగా రక్తపిత్తవ్యాధి అనగా నోటి నుండి రక్తం బయటకి వెలువడు వ్యాధి తగ్గును. క్షయరోగం , దగ్గు , జ్వరములను తగ్గించును .  చంటిబిడ్డలకు తల్లిపాల తరువాత మేకపాలు శ్రేష్టమైనవి . 


      

      

పంచాంగం 18.09.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 18.09.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష సప్తమి తిథి భృగు వాసర జ్యేష్ఠ నక్షత్రం ప్రీతి యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శ్రాద్ధ తిథి : అష్టమి 


 

నమస్కారః , శుభోదయం