24, ఆగస్టు 2026, సోమవారం

24-08-2026సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

24-08-2026సోమవారం రాశి ఫలితాలు


మేషం


భాగస్వామ్య వ్యాపారాలు మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాల ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమస్యలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి.      

--------------------------------------- 


వృషభం


నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------


మిధునం


వ్యాపారమున ఎంతగా శ్రమించినా ఫలితం లభించక నిరాశ కలుగుతుంది. గృహమున పెద్దల ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇతరులకు ధన వ్యవహారాలలో మాట ఇవ్వకపోవడం మంచిది. 

---------------------------------------


కర్కాటకం


మొండి బాకీలు తీర్చగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్ధిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


ఉద్యోగమున అధికారుల అనుగ్రహం కలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు కలసివస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కన్య


ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అంతగా అనుకూలించవు. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. రాజకీయ సభ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది.

---------------------------------------


తుల


దూర ప్రాంతాల బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాహన ప్రయాణాలు వాయిదా పడుతాయి. వ్యాపారమున భాగస్థులతో జాగ్రత్తగా మాట్లాడటం మంచిది.

---------------------------------------


వృశ్చికం


నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగమున కొంత అనుకూలత కలుగుతుంది. దాయాదులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల ప్రవర్తన కొంత చికాకు పరుస్తుంది.

---------------------------------------


ధనస్సు


కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో కొంత జాగ్రత్త అవసరం. ఋణాలు వసూలవుతాయి. నిరుద్యోగులు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి ఉద్యోగమున ఆశించిన స్థానచలనాలు కలుగుతాయి.

---------------------------------------


మకరం


అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు చికాకు కలిగిస్తాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 

---------------------------------------


కుంభం


ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి తెలివిగా బయటపడతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------


మీనం

 

సమాజంలో ప్రముఖుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. నూతన కార్యక్రమాల ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఎదురైనా సమస్యలు తెలివిగా అధిగమిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.   

---------------------------------------

తమిళనాడు : కోవిలాడి - తిరుచిరాపల్లి

 


⚜  తమిళనాడు : కోవిలాడి - తిరుచిరాపల్లి 


⚜  శ్రీ అప్పక్కుడతాన్ పెరుమాళ్ ఆలయం

(  తిరుప్పెర్ నగర్ దివ్యదేశం ) 


💠 ఇది శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన 108 శ్రీవైష్ణవ దివ్య దేశాలలో 8వ దివ్య దేశము

మరియు కావేరి నది ఒడ్డున ఉన్న పంచరంగ క్షేత్రాలలో ఇది ఒకటి. 


💠 పంచ రంగంలోని ఇతర క్షేత్రాలలో.. శ్రీరంగం, తిరుఇందళూరు,శ్రీ రంగపటనం, కుంబకోణం ఉన్నాయి.


💠 పంచరంగ క్షేత్రాలు (5 రంగాలు లేదా రంగనాథులు" అని అర్థం వచ్చే పంచరంగములు విష్ణువు యొక్క రూపమైన రంగనాథునికి అంకితం చేయబడిన కావేరి నది ఒడ్డున ఉన్న 5 దేవాలయాల సమూహం . 


 

🛎 స్థల పురాణం : 


💠 హిందూ పురాణం ప్రకారం, ఉపరిచరవసుడు అనే రాజు, మదపుటేనుగును వేటాడుతుండగా పొరపాటున ఒక బ్రాహ్మణుడిని చంపాడు. ఈ చర్య వలన తనకు బ్రహ్మహత్య  దోషం అంటగట్టబడటంతో , పశ్చాత్తాపపడిన ఆ రాజు తన సింహాసనాన్ని త్యజించి, దేశదిమ్మరులై తిరుగుతూ చివరకు తిరుప్పెర నగరానికి చేరుకున్నాడు. 


💠 దుర్వాస మహర్షి తన రాజ్య సందర్శన సమయంలో తనను గుర్తించనందుకు రాజును శపించాడు. దానికి ప్రాయశ్చిత్తంగా, ప్రతిరోజూ 10,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేయమని రాజుకు సలహా ఇవ్వబడింది.


💠 శివుడు అతనికి ప్రత్యక్షమై ఈ స్థలంలో విష్ణుమూర్తిని పూజించమని చెప్పాడు, అందువల్ల రాజు విష్ణుమూర్తికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. 

ప్రతిరోజూ పూజల అనంతరం, రాజు బ్రాహ్మణులకు అప్పం, పాయసంతో సహా అన్నదానం చేసేవాడు. 


💠 ఒకరోజు, విష్ణుమూర్తి ఆకలితో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఆ స్థలానికి వచ్చాడు. మిగతా బ్రాహ్మణులు సమావేశమయ్యే వరకు ఆగమని రాజు అతడిని కోరాడు, కానీ ఆ బ్రాహ్మణుడు తనకు చాలా ఆకలిగా ఉందని చెప్పడంతో, రాజు అతనికి భోజనం పెట్టాడు.

రాజు ఆశ్చర్యపోయేలా, ఆ బ్రాహ్మణుడు సిద్ధం చేసిన ఆహారమంతా తిని, ఇంకా కావాలని కూడా అడిగాడు.


💠 ఇంతలో, తిరుప్పెర నగరంలో ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వెతకమని శివుడు మార్కండేయ మహర్షికి సలహా ఇచ్చాడు. 

అక్కడ చేతిలో అప్పాల కుండను పట్టుకుని పడుకుని ఉన్న బ్రాహ్మణుడిని మహర్షి కనుగొన్నాడు. ఆ మహర్షి అతనికి నమస్కరించగా, విష్ణుమూర్తి తన అసలు రూపాన్ని ధరించి మహర్షిని ఆశీర్వదించాడు. అంతేకాకుండా, రాజును కూడా దీవించి అతని దోషాన్ని తొలగించాడు.


💠 ఇక్కడి మూలవర్ శయనించి, అప్పం కుడం పట్టుకుని, మార్కండేయ మహర్షిని ఆశీర్వదిస్తున్నారు. 

ఈ ఆలయ తీర్థాన్ని మృత్యు వినాశిని తీర్థం అని పిలుస్తారు, ఇది మహర్షి యొక్క దీర్ఘాయువు వరాన్ని సూచిస్తుంది. 

దివ్యదేశం ఆలయాలలో అప్పాన్ని నైవేద్యంగా సమర్పించే ఏకైక ఆలయం కూడా ఇదే


💠 అప్పం అనేది దేవుళ్లకు నైవేద్యంగా సమర్పించే ఒక తీపి వంటకం. అప్పం కుండను స్వీకరించినందున పెరుమాళు అప్పాకుడతన్ అనే పేరు వచ్చింది. 


💠 వైష్ణవ సంప్రదాయంలో కోవిల్ అని పిలువబడే శ్రీరంగం రంగనాథస్వామి ఆలయానికి దిగువన ఇది ఉన్నందున ఈ ప్రదేశాన్ని "కోవిలాడి" అని పిలుస్తారు. 


💠 చోళుల కాలంలో ఈ ప్రాంతాన్ని "పేర్ నగర్" అని పిలిచేవారు కాబట్టి ఈ ఆలయాన్ని "తిరుప్పేర్‌నగర్" అని పిలుస్తారు.


💠 ఈ ఆలయానికి పడమర వైపు ముఖం చేసి 3 అంతస్తుల రాజగోపురం ఉంది.

ఆలయ మూలవర్ (ప్రధాన దైవం), " అప్పల రంగన్ ", పడమర వైపు ముఖం చేసి భుజంగశయంలో (శయనించిన భంగిమలో) కనిపిస్తారు మరియు ఆయన చుట్టూ భూమా దేవి మరియు కమలవల్లి తాయార్ ఉంటారు


💠 పెరియాళ్వార్ తన చివరి మంగళశాసనాన్ని గానం చేసి, ఈ ఆలయం నుండే పరమేశ్వరుని నివాసానికి బయలుదేరారు. అందువల్ల, ఇక్కడ పెరుమాళ్ను పూజించేవారు తప్పకుండా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం. 


💠 ఆలయ పురోహితులు పండుగలతో సహా ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తారు . తమిళనాడులోని ఇతర విష్ణు దేవాలయాల మాదిరిగానే, ఇక్కడి పురోహితులు కూడా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వైష్ణవ సమాజానికి చెందినవారు .


💠 ప్రతి రాత్రి దేవునికి నైవేద్యంగా నెయ్యప్పం సమర్పించే ఏకైక దివ్య దేశం ఇది . 

ఈ ఆలయంలోని సంతానగోపాలన్ దేవునికి ప్రార్థించి, పంచదారతో కలిపిన నెయ్యిని సమర్పిస్తే సంతానం కలుగుతుందని ఒక నమ్మకం ఉంది.


💠 ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు: 13 రోజుల పంగుణి బ్రహ్మోత్సవం, కార్తీక మాసంలో (నవంబర్ - డిసెంబర్) కైసిక ద్వాదశి, మాసి మాగం (ఫిబ్రవరి - మార్చి) రోజున కావేరీ నది వద్ద తీర్థ వారి మరియు మార్గళి మాసంలో (డిసెంబర్ - ఫిబ్రవరి) ఎర పత్తు సమయంలో నమ్మాళ్వార్ మోక్షం.


💠 ఈ ఆలయానికి మరియు చుట్టుపక్కల గ్రామాలకు రథోత్సవం అత్యంత ప్రముఖమైన పండుగ. దీనిని తమిళ మాసం పంగుణి (ఏప్రిల్-మే)లో జరుపుకుంటారు; భక్తులు ఆలయ రథాన్ని కోవిలాడి వీధుల్లో లాగుతారు. 

ఆలయ పురోహితుల బృందం నాలాయిర దివ్య ప్రబంధం నుండి శ్లోకాలను పఠిస్తుంది మరియు నాదస్వరం మరియు తవిల్ (తాళ వాయిద్యం) లతో సంగీతాన్ని వాయిస్తారు. 


💠 వైకుంఠ ఏకాదశి ,నవరాత్రి మరియు వెన్న కుండ పగలగొట్టే వేడుక (స్థానికంగా ఉరి ఆది అని పిలుస్తారు ) ఆలయంలో జరుపుకునే ఇతర పండుగలు.



💠 తిరుచిరాపల్లికి 16 కి.మీ దూరం


రచన

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం

  శ్రీమద్భగవద్గీత: రెండవ అధ్యాయం 

సాంఖ్య యోగం: శ్రీ భగవానువాచ


రాగద్వేష వియుక్తైస్తు

విషయానింద్రియైశ్చరన్ |

ఆత్మవశ్యైర్విధేయాత్మా

ప్రసాద మధిగచ్ఛతి || (64)


శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ కూడా మనస్సుని నిగ్రహించిన వాడు మరియు రాగద్వేషమును జయించినవాడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

దీపం జ్యోతి నమోస్తుతే .....!!

  🙏  ప్రాతకాలస్మరమి దీపం జ్యోతి  నమోస్తుతే .....!!




శుభం కరోతి కళ్యాణం 

            ఆరోగ్యం ధన సంపద

శత్రు బుద్ధి వినాశాయ 


          దీప జ్యోతిర్ నమోస్తుతే 

       దీప-జ్యోతి: పరబ్రహ్మ               

           దీప జ్యోతి జనార్ధనః,

  దీపో హారతి మే పాపం 

          దీప-జ్యోతిర్-నమోస్తుతే

ఏ దీపజ్యోతి ఐతే శుభం,మంచి,ఆరోగ్యం ధనసంపదలు మీకు ప్రసాదిస్తుందో,చెడు తలపులను తొలగిస్తుంది,ఆ దీప జోయతికికి ప్రణమిల్లుతున్నాను ..


🙏🪔🪔🙏🪔🪔🙏🪔🪔🙏

సంవ‌త్స‌రంలో

 💜💚💜💚💜💚💜


*మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే ఠ‌క్కున చెప్పేస్తారు.* 

*కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు.* 

*అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను.* 

*మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.*


*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)* శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోధి

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోధన

*(1926,1986,2046)*: అక్షయ


*💚మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి.💚*

శ్రీమద్భాగవతం - 29/42*

 *


*శ్రీమద్భాగవతం - 29/42*


*బ్రహ్మమోహన లీల & బ్రహ్మదేవుని దివ్య స్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న అఘాసుర సంహారం వరకు వచ్చాం,ఈ అఘాసుర సంహారం కౌమార ప్రాయం లో జరిగితే ప్రౌగండ ప్రాయంలో గోపాలకులు బృందావనం లో చెప్పారు అని శుక మహర్షి అంటే అదేమిటి అంత కాలం వారు ఎందుకు దాచి ఉంచారు అని పరీక్షిత్తు మహారాజు అడిగాడు దానికి సమాధానంగా బ్రహ్మమోహన లీల గురించి చెప్పాడు శుక మహర్షి.


1. బ్రహ్మదేవుని భ్రమ & దూడలు-గోపబాలురు మాయమగుట

అఘాసురునీ సంహరించిన తరువాత శ్రీకృష్ణుడు గోపబాలురను, గోవులను యమునానది తీరానికి తీసుకుపోయి, ఇక్కడ పచ్చిక,నీరు సమృద్ధి గా ఉంది ఆవు, దూడలు నీరు త్రాగి, దానిని మేస్తాయి,

మధ్యాహ్న సమయం అయింది కనుక మనం కూడా చల్దులను ఆరగిద్దాం అన్నాడు.అందరూ తమ ఇళ్ల నుండి తెచ్చుకున్న చద్దన్నాలను ఆనందంగా తింటున్నారు.


యజ్ఞభోక్త అయిన పరమాత్మ గోపబాలురమధ్య గూర్చుండి, తన చతురోక్తులతో (హాస్యోక్తులతో) వారిని నవ్వించుచు చల్దులు ఆరగిస్తూ ఉన్నాడు ఎడమ అఱచేతియందు మీగడ పెఱుగుతో, నేతితో కలిపిన చల్టిముద్దను, వ్రేళ్లమధ్యలో ఊరగాయ ముక్కలను పెట్టుకొనెను. ఈవిధముగా కొనసాగుచున్న ఆయన బాల్యక్రీడలను స్వర్గలోకమునందలి దేవతలు ఆశ్చర్యానందములతో తిలకించిరి. గోప బాలురు లోకాన్ని మరచి శ్రీకృష్ణ లీలలలో మునిగి పోయారు.


ఇంతలో ఆవుధూడలు పచ్చని గడ్డి మేస్తూ దూరంగా ఉన్న వనం లోకి వెళ్ళిపోయాయి అప్పుడు శ్రీకృష్ణుడు తన చుట్టూ ఉన్న దూడలు కనిపించకపోవడాన్ని గమనించి, "నేను ఇప్పుడే వెళ్లి దూడలను వెతికి తెస్తాను"మీరు కంగారు పడకండి, హాయిగా చల్దులు ఆరగించండి అని చేతిలో చల్ది ముద్ద ఉంచుకొనే లేచాడు.


 * నిజానికి ఇది సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని పరీక్ష. అఘాసుర సంహారం చేసిన సమయంలో దేవతలు చేసిన స్తుతులు విని "ఈ బాలుడు నిజంగానే పరమాత్మ అయితే, ఈయన మహిమను పరీక్షిస్తాను" అని భావించిన బ్రహ్మదేవుడు, గోపబాలురు మేపుతున్న దూడలన్నింటినీ అదృశ్యం చేసి ఒక గుహలో దాచిపెట్టాడు.


 *ఎంత వెతికిన దొరకలేదు అడవి అంతటా వెతికాడు.కొంతసేపటికి తిరిగి వచ్చేసరికి బాలురు కూడా అదృశ్యమయ్యారు. దాంతో గోవులు, గోప బాలుర కోసం వెతుకుతూ అంతటా తిరిగాడు ఎక్కడా కనపడలేదు.

వనం లో ఎక్కడ జాడ కనపడక పోవడంతో

బ్రహ్మదేవుడే వీరందరినీ దాచిపెట్టాడని సర్వాంతర్యామి అయిన శ్రీకృష్ణుడు తన దివ్యదృష్టితో క్షణంలో గ్రహించాడు.(ఆయన అప్పుడే వాటిని విడిపించ గల సమర్ధుడు కానీ బ్రహ్మగారికి తగులుకున్న మొహం మాయ తొలగాలి కదా అందుకే అలా చేయకుండా)


2. శ్రీకృష్ణుడే స్వయంగా అందరూ అగుట 

గోపబాలురు, దూడలు లేకపోతే గోకులంలోని తల్లులు, గోవులు తీవ్రమైన శోకంతో కుమిలిపోతారు. వారిని కాపాడటం కోసం శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన లీల చేశాడు.


 * తన దివ్య శక్తితో (మాయతో) పోగొట్టుకున్న ఆ గోపబాలురు ఎంతమంది ఉన్నారో, ఏ రూపాలతో, ఏ వస్త్రాలతో, ఏ అలంకారాలతో, ఏ స్వభావాలతో ఉన్నారో... అలాగే ఖచ్చితంగా వారందరి రూపాలను తానే స్వయంగా ధరించాడు! అలాగే అన్ని దూడల రూపాలను కూడా తానే అయ్యాడు.(సర్వం విష్ణుమయం జగత్ అను శృతి వాక్యం సార్ధకం చేశాడు)


దూడలను ఇండ్లకు మఱలింపుడు' అని ఆజ్ఞాపించె నాయకుడు, మఱలించే గోపబాలురు, మఱలే ఆవుదూడలు అన్ని తానేయై, శ్రీకృష్ణుడు తన దివ్యలీలలను ప్రసరింపజేయుచు, ఆడుచు, పాడుచు బృందావనమునకు చేరెను. 


పరీక్షిన్మహారాజా! ఈవిధముగా శ్రీకృష్ణుడు బాలుర, దూడల రూపములలో మసలుచు గోపవాటికలో ప్రవేశించి, వారివారి దొడ్లలో ఆయా దూడలను యథాస్థానములకు చేర్చెను. గోపబాలుర రూపములతో వారి ఇండ్లలో ప్రవేశించెను


 * అందరూ శ్రీకృష్ణుడే అయినప్పటికీ, ఎవరికీ ఆ విషయం తెలియలేదు. బాలురు ఇంటికి వెళ్లినప్పుడు వారి తల్లులకు కృష్ణునిపై ఉన్న ప్రేమే తన పిల్లలపై ఉప్పొంగింది. గోవులు కూడా ఆ దూడలను తమ సొంత దూడలుగా భావించి పాలిచ్చాయి. ఈవిధముగా చిన్నికృష్ణుడు బాలుర రూపములను, దూడల ఆకారములను దాల్చి, (ఆ బాలురను, ఆ దూడలను కాపాడుచుండుటయే గాక) తనను తాను రక్షించుకొనుచు, గోపాలకునివలె మసలుచుండెను. ఇట్లు ఆ స్వామి తన అద్భుతమైన మహిమచే బృందావనమునందును, వనమునందును దాదాపు ఒక ఏడాదిపాటు విహరించెను.


3. బ్రహ్మదేవుని ఆశ్చర్యం & సత్యదర్శనం

ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు "ఇప్పుడు ఆ గోపాలురు, దూడలు ఎలా ఉన్నారో చూస్తాను" అని సత్యలోకం నుండి గుహ వద్దకు వచ్చి చూశాడు.(ఆయనకు క్షణం కానీ భూలోక సమయం సంవత్సరం)అక్కడ వారు అలాగే గాఢ నిద్రలో ఉన్నారు.


వెంటనే బృందావనానికి వెళ్లి చూసేసరికి... అప్పుడు తాను ఏ బాలురైతే దాచిపెట్టాడో, అక్కడా అవే రూపాలతో, అదే సంఖ్యలో గోపబాలురు, దూడలు కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కనిపించారు!


 * బ్రహ్మదేవుడు అయోమయంలో పడిపోయాడు. "అక్కడ గుహలో ఉన్నది వీరే కదా! మరి ఇక్కడ ఆడుకుంటున్నది ఎవరు?" అని అయోమయంతో ఆలోచిస్తుండగా...


 * ఆడుకుంటున్న గోపబాలురు, దూడల అందరి ముఖాలలోనూ బ్రహ్మదేవునికి సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క దివ్య తేజస్సు, చతుర్భుజ రూపాలు, శంఖ చక్రాలు సాక్షాత్కరించాయి!


 * చూస్తుండగానే చరాచర సృష్టిలోని ప్రతి అణువు, సమస్త దేవతలు, బ్రహ్మ రుద్రాది మూర్తులు అందరూ శ్రీకృష్ణుని రూపంలోనే దర్శనమిచ్చారు.మిక్కిలి ఆశ్చర్యకరమైన ఈ దృశ్యమును గాంచి, బ్రహ్మదేవుడు నిశ్చేష్టుడాయెను. అతని పదకొండు ఇంద్రియములును  (ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, మనస్సు) క్షోభకు గుఱియై చేష్టలు ఉడిగెను. ఆ జ్యోతిస్వరూపులముందు

అతడు (బ్రహ్మ) వ్రజభూమియొక్క అధిష్ఠానదేవతముందు

(శ్రీకృష్ణుని ముందు) ఒక బొమ్మవలె నిలిచిపోయెను. 


బ్రహ్మదేవుని మొహాన్ని, అశక్తతను తెలుసుకుని తన మాయ తొలగించాడు స్వామి,(తాను తీసుకున్న ఆ గోవు,గోపాలుర రూపాలు వెనక్కి తీసుకున్నాడు)


అప్పుడు మృతి చెందిన జీవుడు సజీవుడు అయినట్టు అతి కష్టం మీద బ్రహ్మగారు తేరుకుని, బృందావనం చూశాడు, శ్రీ కృష్ణ పాదాస్పర్శ చేత అక్కడి పక్షులు, పశువులు , మృగాలు అన్ని వైర భావం వీడి స్నేహ భావంతో ఉండటం చూసి మొహం తొలగి..


4. బ్రహ్మదేవుని సాష్టాంగ నమస్కారం & పశ్చాత్తాపం

బ్రహ్మదేవుడు తన అహంకారాన్ని విడిచిపెట్టి, శ్రీకృష్ణుని చరణాల వద్ద సాష్టాంగ నమస్కారం చేశాడు. కన్నీళ్లతో స్వామి పాదాలను అభిషేకించి, లేవలేక అలానే కూర్చుని పరమ పవిత్రమైన 'బ్రహ్మస్తుతి' చేశాడు:


 "ఓ పరమాత్మా! నీవు సమస్త ప్రాణులకు ఆత్మవు, నిత్యుడవు, పరమేశ్వరుడవు! నిన్ను పరీక్షించాలనే నా అజ్ఞానాన్ని క్షమించు. నా తపస్సు, నా సృష్టి శక్తి నీ మాయ ముందు కేవలం ఒక చిన్న దీపపు కాంతి వంటిది. నన్ను నీ దాసుడిగా అనుగ్రహించు!"


5. బ్రహ్మదేవుని నిష్క్రమణ & గోపబాలుర ప్రత్యక్షత 

శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని ప్రార్థనకు ప్రసన్నుడై చిరునవ్వు నవ్వి, ఆయన గర్వాన్ని పోగొట్టి: "బ్రహ్మదేవా! వెళ్ళి నీ సృష్టి కర్తవ్యంలో నిమగ్నమవ్వు" అని ఆశీర్వదించాడు. బ్రహ్మదేవుడు ప్రదక్షిణ చేసి సత్యలోకానికి వెళ్లిపోయాడు.


అప్పుడు కృష్ణుడు గుహలో దాచబడిన నిజమైన గోపబాలురను, దూడలను బయటకు తీసుకువచ్చాడు. బ్రహ్మదేవుడు వారిని దాచిన కాలమంతా వారికి ఒక నిమిషంలాగా గడిచింది. అందరూ కలిసి పూర్వం వలె, బ్రహ్మ దేవుడు మాయం చేసినపుడు శ్రీకృష్ణుడు ఎలా చేతిలో ముద్ద పట్టుకుని ఉన్నాడో అలానే ఆవు దూడల కోసం వెతుకుతూ వెళ్ళి వాటిని తీసుకుని వస్తున్న కృష్ణుడు ఆ గోపబాలురకు దర్శనం ఇచ్చాడు,ఆ గోప బాలురు అలాగే చల్దులు ఆరగిస్తూ ఉన్నారు. కృష్ణుడు దరహాసం చేయుచు వారితో చల్దులు ఆరగించాడు(వారికి మద్యలో జరిగింది ఏది గుర్తుకు లేదు)ఆ ప్రభువు వారికి అఘాసురుని శరీరం చూపి వనం నుండి బృందావనం కి బయలు దేరాడు 


పల్లెకు చేరిన పిమ్మట గోపకుమారులు 'అరణ్యములో ఒక కొండచిలువ మమ్ములను మ్రింగివేసినది. అంతట యశోదమ్మ ముద్దుల కొడుకైన మన కన్నయ్య ఆ మహాసర్పమును చావగొట్టి, మమ్ములను రక్షించెను!' అని అంతటను చాటిచెప్పిరి.


మహాత్మా! గోపాలురకును, గోపవనితలకును ఇంతవఱకూ తమ సంతానము పైగూడ కలుగనట్టి ఇంతటి ప్రేమ యశోదానందుల కుమారుడైన కృష్ణయ్యపై ఎట్లు కలిగెను? దయతో తెల్పుము”.అని అడగ్గా


మహారాజా! లోకములోని సమస్త ప్రాణులకును తమ సంతానము, గృహము, బంగారము మొదలగువాటి కంటెను తమ 'ఆత్మయే' మిక్కిలి ప్రీతికరము. సకలజీవులకు తమ ఆత్మపై ఉన్నంతప్రేమ, మమకారముతో పెనవైచుకొనిన తమ పుత్రులపైగాని, ధనముమీదగాని, ఇండ్లు మొదలగువాటి పైగాని ఉండదు. అందుకే ఆత్మ స్వరూపుడు అయిన పరమాత్మ యందు వారిని అంతటి ప్రీతి,ఆ ప్రేమ అనే మాయలో వారిని ఉంచి ఇన్ని లీలలు చేసాడు స్వామి. ఆయన్ని నమ్మితే ఏదైనా సాధ్యమే.... శ్రీ కృష్ణ శరణం మమ 


 

📝 నేటి ముఖ్య విషయాలు:

 * సర్వాంతర్యామి తత్త్వం: బృందావనంలో గోపబాలురుగా, దూడలుగా సంచరించింది సాక్షాత్తు పరబ్రహ్మమే. భగవంతుడు మనలో, మన చుట్టూ ఉన్న ప్రతి రూపంలోనూ ఉన్నాడనే సత్యానికి బ్రహ్మమోహన లీల నిదర్శనం.


 * అహంకార వినాశనం: బ్రహ్మదేవుడైనప్పటికీ, పరమాత్మ తత్త్వాన్ని పరీక్షించాలని చూస్తే భ్రమలో పడక తప్పదు. కేవలం శరణాగతి మాత్రమే భగవంతుని చేరుస్తుంది.


 * జీవ-బ్రహ్మ అభేదం: గోపబాలురే సాక్షాత్తు పరమాత్మ రూపాలు కావడం ద్వారా, జీవునికి పరమాత్మకు భేదం లేదనే అద్వైత సిద్ధాంతాన్ని భాగవతం చాటుతుంది.


ఎంత రాసిన అరె ఇంకా చెప్పాల్సినది ఉన్నదీ కదా,ఈ విషయం కూడా చెప్తే బాగుండేది అనిపిస్తూ ఉంటాయి శ్రీకృష్ణ లీలలు ప్రతి శ్లోకానికి అర్దం ఇవ్వలేను కదా అందుకే ఏదో స్వామి ఇంతే అనుగ్రహించాడు అని తృప్తి చెందడం అంతే కానీ సర్వ వ్యాపి అయిన పరమాత్మ లీలలు సంపూర్ణంగా చెప్పటం, వివరించడం సాధ్యమేనా అసాధ్యం...


....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

నారాయణుడు

 *విష్ణుమూర్తిని ‘నారాయణుడు’ అని ఎందుకు పిలుస్తారు?*


 సనాతన ధర్మంలో త్రిమూర్తులలో ఒకరైన శ్రీమహావిష్ణువు సృష్టి స్థితికారకుడిగా, జగత్తును సంరక్షించే దేవుడిగా ఆరాధించబడతాడు. ధర్మానికి హాని కలిగినప్పుడు,అధర్మం పెరిగినప్పుడు భగవంతుడు వివిధ అవతారాలు ఎత్తి సజ్జనులను రక్షించి, దుష్టులను శిక్షించి, ధర్మాన్ని స్థాపిస్తానని భగవద్గీతలో ప్రకటించాడు.


*“పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।*

*ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే ॥”*


 ఈ వాగ్దానానికి అనుగుణంగానే శ్రీమహావిష్ణువు మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అనే దశావతారాలను ధరించి లోకక్షేమాన్ని కాపాడాడని పురాణాలు చెబుతున్నాయి♪. కల్కి (రాబోయే కాలంలో అవతారం ఎత్తుతాడు)


 శ్రీమహావిష్ణువుకు అనేక దివ్యనామాలు ఉన్నాయి. వాటిలో విష్ణువు, శ్రీహరి, కేశవుడు, మాధవుడు, గోవిందుడు, వాసుదేవుడు, జనార్దనుడు, నారాయణుడు వంటి నామాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి♪. ప్రతి నామానికి ఒక ప్రత్యేకమైన అర్థం, తాత్పర్యం ఉంది.


*’నారాయణుడు’ అనే పేరుకు అర్థం:*


*నారాయణ అనే పదం రెండు పదాల కలయిక.*


నార (నారము) = నీరు లేదా సమస్త జీవులు.

ఆయన (ఆయనం) = ఆశ్రయం, నివాసం, గమ్యం.


 అందువల్ల *’నారాణాం ఆయనం ఇతి నారాయణః* అనే సంస్కృత వాక్యానికి అనుగుణంగా సమస్త జీవులకు ఆశ్రయమైనవాడు, పరమగమ్యమైనవాడు నారాయణుడు అని అర్థం.


*నీటితో సంబంధం:*


 పురాణాల ప్రకారం సృష్టి ప్రారంభంలో ఎక్కడ చూసినా జలమే ఉండేది. ఆ ప్రళయ జలాలపై ఆదిశేషుని పై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటున్న పరమాత్మ శ్రీమహావిష్ణువే. అందుకే జలానికి (నారము) ఆశ్రయమైనవాడు (ఆయనం) అనే భావంతో ఆయనను నారాయణుడు అని పిలుస్తారు.


*సమస్త జీవులకు ఆధారం:*


 మరో అర్థం ప్రకారం ‘నార’ అంటే సమస్త ప్రాణులు. ఆ సమస్త జీవుల హృదయాలలో అంతర్యామిగా నివసిస్తూ, వారిని పోషిస్తూ, కాపాడే పరమాత్మ నారాయణుడు. అందుకే ఆయనను జగన్నాథుడు, లోకరక్షకుడు అని కూడా పిలుస్తారు.


*గంగాదేవితో సంబంధం:* 


 పురాణాల ప్రకారం పవిత్రమైన గంగాదేవి శ్రీమహావిష్ణువు పాదాల నుండి ఉద్భవించింది. అందుకే గంగాజలాన్ని ‘విష్ణుపాదోద్భవి’ అని కూడా పిలుస్తారు. ఈ కారణంగా కూడా నారాయణుడనే నామానికి మరింత పవిత్రత లభించింది.


*నారద మహర్షి నామస్మరణ:*


దేవర్షి నారదుడు ఎల్లప్పుడూ *“నారాయణ... నారాయణ...”*  అని భగవన్నామాన్ని జపిస్తూ లోకాలన్నిటిలో సంచరిస్తాడు. అందువల్ల ‘నారాయణ’ అనే నామం భక్తుల మధ్య అత్యంత ప్రసిద్ధి చెందింది. అయితే ఈ నామం నారదుడి వల్ల ఏర్పడింది కాదు; ఆయన ఎల్లప్పుడూ ఆ నామాన్నే స్మరించేవాడు.


*శాస్త్రాలలో నారాయణుని మహిమ:* 


 మహోపనిషత్ ప్రసిద్ధ వాక్యం ఇలా చెబుతుంది: *”ఏకో హ వై నారాయణ ఆసీత్"* అంటే సృష్టికి ముందు పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణుడు మాత్రమే ఉన్నాడు. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా "నారాయణ" అనే నామం అత్యంత మహిమాన్వితమైన దివ్యనామంగా పేర్కొనబడింది.


 *శ్రీమహావిష్ణువును నారాయణుడు అని పిలవడానికి అనేక కారణాలు ఉన్నాయి:*


నారము (జలం)కు ఆశ్రయమైనవాడు.


 సమస్త జీవులకు ఆశ్రయమైనవాడు.


 ప్రళయజలాలపై యోగనిద్రలో విరాజిల్లేవాడు.


 సృష్టి, స్థితి, లయలకు మూలకారణమైన పరమాత్మ.


 సర్వలోకాలను రక్షించి ధర్మాన్ని స్థాపించేవాడు.


 అందువల్లే భక్తులు ప్రేమతో, భక్తి శ్రద్ధలతో...  *“ఓం నమో నారాయణాయ”* అనే అష్టాక్షరీమంత్రాన్ని జపిస్తూ శ్రీమహావిష్ణువును ఆరాధిస్తారు. ఈ మహామంత్రాన్ని భక్తితో జపిస్తే మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి, భగవంతుని అనుగ్రహం లభిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

సర్పాలు

 ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి గురించి ఇచ్చిన సంపూర్ణ వివరణ - చికిత్సలు .


సకల చరాచర సృష్టిలో సర్పాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.

 సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు రకాలుగా ఉన్నాయి. అవి

1 . దివ్యములు ఇవి దేవతా సర్పములు .

2 . భౌమములు ఇవి భూమి నందు ఉండునవి .

దివ్యసర్పములు లలో భూమి యందు తిరిగేసర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.

దివ్య సర్పములలో రకాలు -

1 . అనంతుడు.

2 . వాసుకి.3 . తక్షకుడు.4 . కర్కోటకుడు .5 . పద్ముడు .6 . మహాపద్ముడు .7 . శంఖపాలుడు .8 . కులికుడు .

దేవతాసర్పములకు ఉండు గుర్తులు -

 అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును. కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల

వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును.

 పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.

దేవసర్పములకు విషము ఎక్కువ ఉండు సమయములు -

 ఆది, సోమ , మంగళ, బుధ , గురు, శుక్ర , శని వారాల్లో పగలు సమయంలో దేవతా సర్పములకు విషం ఎక్కువ ఉండును. రాత్రి సమయంలో విషప్రభావం చాలా తక్కువ ఉండును. ఒక్క శనివారం రాత్రి సమయంలో మాత్రం విషప్రభావం ఎక్కువ ఉండును. ఈ సమయంలో మాత్రమే అనంతుడు వంటి దేవతా సర్పాలు కరుచును .

దేవతాసర్పముల యొక్క మహిమ -

 అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరామరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషదం ఏమి లేదు .

భూమి యందు ఉండు సర్పముల భేదములు

1 - ఉపజాతి సర్పములు .

2 - దర్వీకరములు .

3 - మండలీ సర్పములు .

4 - రాజీమంతములు .

 అను నాలుగు రకముల సర్పములు కలవు.

భౌమ సర్పముల యొక్క లక్షణములు -

 పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును ఉపజాతి సర్ప లక్షణములను విష లక్షణములను తరువాత వివరిస్తాను.

మూడు రకాల సర్పాల విష గుణము -

 దర్వీకముల యొక్క విషము కొంచం వేడి కలిగి ఉండి కారముగా ఉండును. మండలీ విషము వేడిగా ఉండి పులుపు రుచి కలిగి ఉండును. రాజీమంత విషము చల్లగా ఉండి మధురముగా ఉండును. పైన చెప్పిన రుచులను బట్టి ఆయా సర్పాలు కరిచినప్పుడు వాటి విషం శరీరం లో ప్రవేశించి వాతాదిదోషములను కలుగచేయును .

మూడు రకాల సర్పములు యొక్క వాతదోషముల వివరములు -

 దర్వీకర జాతి సర్పములు వాతోద్రేకం , మండలీ సర్పములు పిత్తోద్రేకం , రాజీమంత సర్పములు శ్లేష్మోద్రేకం కలిగి ఉంటాయి.

భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య -

1 - దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు.

2 - మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు.

3 - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.

భూమి ముందు ఉండు సర్పాలలో ప్రముఖమైనవి , ప్రమాదకరమైనవి త్రాచుపాములు ఇవి మొత్తం 14 రకాలు . అవి

• చింతపువ్వు వన్నె త్రాచు.

• నాగజెర్రి .

• రేలత్రాచు .

• నాగజెర్రి.

• సెనగపువ్వు త్రాచు.

• నల్లత్రాచు.

• అరికెవన్నె త్రాచు.

• కందిపొడల త్రాచు.

• మొగలిపువ్వు త్రాచు.

• తెల్ల త్రాచు.

• కోడె త్రాచు.

• గిరినాగు .

• నీరు త్రాచు .

• గోధుమ త్రాచు.

• రాచపాముఈ విధంగా 14 రకాలుగా త్రాచుపాములు ఈ భూమి యందు నివసించుచున్నాయి.

ఇప్పుడు వీటి లక్షణాలు తెలియచేస్తాను .

• చింతపువ్వు వన్నె త్రాచు - దీని యొక్క శరీరం మంచి ఛాయతో ఉండి దీని యొక్క కోపం సాధారణంగా ఉండును. ఆదివారం నాడు దీని యొక్క విషతీవ్రత తీవ్రంగా ఉంటుంది.

• నాగజెర్రి - ఇది సగం త్రాచు వలే , సగం జెర్రిపోతు వలే ఉండును. చెట్లు , తోటల యందు , చెట్ల పై భాగంలో నివసించుతూ గోధుమవన్నే తెలుపురంగు కలిగి అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. దీనికి అత్యంత కోపం . సోమవారం నాడు విషాదిక్యత కలిగి ఉండును. నాగజెర్రిని త్రాచుపాముల జాబితాలోనే మన పూర్వికులు చేర్చారు .

• రేలత్రాచు - అడవుల యందు నివసించుట, సన్నంగా, పొడవుగా శరీరం కలిగి ఉంటుంది. సామాన్యమైన కోపం కలిగి ఉంటుంది.సోమవారం నందు దీనియొక్క విష తీవ్రత అధికంగా ఉంటుంది.

• శెనగపువ్వు త్రాచు - ఇది శెనగ పువ్వు వర్ణం కలిగి ఉంటుంది. సువాసన గల ప్రదేశాలలో ఉంటుంది. సోమవారం నందు దీని యొక్క విషప్రభావం అధికంగా కలిగి ఉంటుంది.

• నల్లత్రాచు - నేరేడు పండు వర్ణం కలిగి ఉండి కొంచం తక్కువ పొడవు కలిగి ఉంటుంది. అత్యంత దుష్టత్వం , అత్యంత కోపం కలిగి ఉంటుంది. దీని విషం స్వచ్చంగా ఉంటుంది. పర్వతాలు, అడవుల యందు నివసిస్తుంది. మంగళవారం తీవ్ర విషాదిక్యత కలిగి ఉంటుంది.

• అరికెవన్నె త్రాచు - ఈ త్రాచు ఎక్కువుగా మనుష్యుల మల విసర్జణ చేసే ప్రదేశాలలో సంచారం చేయును . మలభక్షణం చేయును . అత్యధిక కోపం , స్వచ్చమైన గరళం కలిగి ఉండును. బుధవారం నందు తీవ్ర విషాదిక్యత కలిగి ఉండును. అరిక ధాన్యం వంటి వర్ణం కలిగి ఉంటుంది.

• కందిపొడల త్రాచు - కందికాయ మీద ఉండునట్టి పొడలు వలే దీని శరీరం పైన ఉంటాయి. సామాన్యం అగు కోపం కలిగి ఉంటుంది.బుధవారం నందు దీని విషతీవ్రత అధికంగా ఉండును.

• మొగలిపూత్రాచు - దీనియొక్క శరీరం వెండితో సమానం అయిన ఛాయ ఉంటుంది.పరిమళములు గుభాళించు ప్రదేశాలలో ఉంటుంది. మొగలి పొదలు , పరిమళ ఔషదాలు గల అరణ్యముల

యందు సంచరిస్తుంది. కోపం తక్కువ, అతిశాంతం , సూక్ష్మమైన మొగలి రేకు ప్రమాణం , గురవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.

• తెల్లత్రాచు - కోపం తక్కువ , సాత్విక గుణం , శాంతస్వభావం , వెన్నెలవంటి శరీర రంగు కలిగి ఉండి తెల్లత్రాచు అని చెప్పబడును .

• కోడెత్రాచు - 18 అంగుళముల పొడువు ఉండును. కోళ్ళని భ్రమ చెందించి ఆకర్షించుట కొరకు కోళ్ళవలె అరుచును. ఇండ్ల యందు , కోళ్ల గూళ్ళ యందు నివాసం ఉండును. అత్యధిక కోపం కలిగి ఉండును. రాత్రుల యందు కోళ్ళని భక్షించును. రూపం భయంకరంగా ఉండును. అత్యంత చురుకుగా ఉండును. శుక్రవారం నందు అత్యథిక విషతీవ్రత కలిగి ఉండును.

• గిరినాగు - చంద్రబింబం వంటి వంక కలిగి , మెరుస్తున్న పడగ కలిగి ఉండి పర్వతముల యందు సంచారం చేస్తూ చెట్ల కొమ్మల యందు నివాసం ఉండును. ఇది పక్షులను భక్షించును . పడగ యందు వర్తులాకారం గా కృష్ణపాదములు కలిగి ఉండును. శుక్రవారం నందు విషోద్రేకం కలిగి ఉండును.

• నీరుత్రాచు - అధికం అగు విషం , అతికోపం కలిగి ఉండి జలం నందు సంచారం , జలజంతు భక్షణ చేయుచూ శుక్రవారం నందు విషోద్రేకం అధికంగా ఉండును.

• గోధుమత్రాచు - సాత్విక స్వభావం కలిగి ఉండి గజము పొడవు ఉంటుంది. శనివారం నందు విషోద్రేకం కలిగి ఉండును.

• రాచనాగు అను త్రాచు - పడగ గుండ్రంగా ఉండి , కృష్ణపాదములు లేని పడగ ఉండి మూడు అడుగుల పొడవు కలిగి ఉండి అధికకోపం కలిగి ఉంటుంది. చాలా భయంకర స్వభావం కలిగి ఉంటుంది. పగదీర్చుకొను పట్టుదల ఉండును. పర్వతాలు అరణ్యముల యందు నివాసము ఉండును. ఇప్పుడు మీకు పెంజర పాముల గురించి వివరిస్తాను.

ఇవి మొత్తం 21 రకాలు అవి .

• కాటుకపోడ పెంజర .

• రక్త పెంజర .

• ఉడుముపొడ పెంజర.

• కలంకారీ పెంజర.

• పొట్ల పెంజర.

• తివాసిపోడ పెంజర.

• ఊదుపొడ పెంజర .

• పిచ్చుకపోడ పెంజర.

• అగ్నిపోడ పెంజర.

• పొడ పెంజర.

• సున్నపుపొడ పెంజర.

• తేనెపొడ పెంజర.

• కుళ్ళుపొడ పెంజర.

• పాదిరీపొడ పెంజర.

• గువ్వపొడ పెంజర.

• గరికపోడ పెంజర.

• మోదుగపూపొడ పెంజర.

• పసుపుపొడ పెంజర.

• దొండపండు పొడ పెంజర.

• గవ్వపోడ పెంజర.

• రెండు తలల శిఖండి. పైన చెప్పిన విధంగా 21 రకాలుగా ఉన్నాయి .

మండలీ సర్పముల లక్షణములు -

• కాటుకపోడ పెంజర లక్షణము -ఈ పెంజర మిక్కిలి లావుగా , అమితమైన పొడవు , శరీరం అందు పంగనామాలు కలిగి ఉండును. ఇది జీవజంతువులను కరుచును. దీని కాటు వలన దేహమంతయు వాపు , తెల్లగా పాలిపోవడం , దురద, నిస్సత్తువ కలుగును. మరణం మాత్రం కలుగదు . దీనిని దాసరిపాము అని కూడా పిలుస్తారు .

• రక్త పెంజర -రక్త పెంజర అనునది చెయ్యి పొడవు కలిగి ఉండి ఎర్రని మచ్చలు , భయంకరమైన విషం కలిగి ఉండును. దీని కాటు వలన మైకం , భ్రాంతి, మూర్చ, నోటివెంట నురుగు పడును. నేత్రములు , పండ్ల చిగుళ్లు , రోమకూపములు , ముక్కు , కంఠం వీటి నుండి విపరీతంగా రక్తస్రావం కలుగును.ఎనిమిది జాములలో మనిషి మరణించుట జరుగును. ఆ సమయం దాటిందో చిత్రంగా బతుకగలడు.

• ఉడుముపొడ పెంజర -ఈ పెంజర పెద్ద శిరస్సు కలిగి ఉండి గరుకు శరీరం , ఉడుము వంటి ఆకారం కలిగి భయంకరంగా ఉండును. దీని కాటు వలన కలిగిన గాయము నుండి అధికంగా రక్తం స్రవించును . మైకంలో ఉండి మంత్ర మరియు ఔషధ చికిత్సలకు లొంగక 3 దినములలో తప్పక మనిషికి మరణము కలుగును.

• కలంకారీ పెంజర -కలంకారీ పెంజర అనునది మూరెడు పొడవు కలిగి ఉండి కలంకారీ రంగుల వంటి పొడలు కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం మంటలు పుట్టును . శోఫ , కలంకారి పని చేయబడిన చాందిని వంటి మచ్చలు , కంఠం యందు శోఫ , దాహము కలుగును. కాటుపడిన చోట ఆముదం , నూనె మొదలయిన చమురు పదార్థాలను ఉంచిన అవి ఇనికిపోవును . ఇట్టి లక్షణాలు కలిగిన మనిషి ఒక్క రోజులో మరణించును.

• పొట్ల పెంజర -పొట్ల పెంజర అనునది తలయును , తోకయును సన్నంగాను , శరీరం లావుగాను , పొట్లకాయ రంగు కలిగి మూరెడు పొడవు కలదై పొట్లకాయ వలే ఉండును. దీని కాటు తిన్నవారికి గొంతుక యందు గురక కలుగుట , శరీరం వాచుట మొదలగు లక్షణాలు కలుగును. దీని కాటు తినినవాడు 4 వ దినం నందు తప్పక మరణించును.

• తివాసిపోడ పెంజర -ఈ పెంజర అనునది 20 అంగుళాల పొడవు ఉండి తివాసి రంగుల వంటి మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడిన వారి శరీరం అంతా మంటలు , వాపు , మైకం , కనులకు చీకటి కమ్మడం వంటి లక్షణాలు కలిగి నాలుగు జాములలో మరణం సంభంవించును.

• ఊదు పొడ పెంజర - ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు . నరులు మొదలయిన వాని శరీరం నందు బుస్సుమని వూదును. అందువలన దేహమందు వాపు , రక్తక్షీణత , పాండు రోగం , నిస్సత్తువ , కీళ్ల యందు చచ్చుదనం వంటి దుర్గుణములు ఏర్పడి చాలా కాలం తరువాత మరణం కలుగును.

• పిచ్చుకపోడ పెంజర - ఈ పెంజర అనునది అడుగు పొడవు ఉండి ముఖం నందు మూడు మచ్చలు ను కలిగి ఉండును. ఇది ఇండ్ల చూరుల యందు ఉండును. ఇది ప్రాకును. మరియు దుముకుతూ వేగంగా పోవును . దీనికాటు పడిన వారికి దేహం నందు పిచ్చుక మచ్చలు వంటివి మచ్చలు కలుగును. కడుపులో తిప్పును. రొమ్మునందు పసరు చేరినట్టు ఉండును. దీనివలన మరణం కలగదు .

• అగ్నిపోడ పెంజర - అగ్నిపోడ పెంజర అనునది 18 అంగుళాల పొడవు కలిగి ఉండును. ఇది మనుషుల శరీరం నందు కాటువేయుట , ఊదుట , చొల్లు కార్చుట చేయును . ఈ మూడింటిలో ఏ విధంగానైనా అగ్నిపోడ పెంజర విషాన్ని మనుష్యుని మీదకు విషాన్ని ప్రయోగించిన శరీరం నందు మిక్కిలి మంటలు కలుగును. కొంతకాలం తరువాత చిన్నగా అనారోగ్యం కలుగును. మరణం లేదు .

• పొడపెంజర - ఇది ఒక అడుగు పొడవు ఉండును. ఇది కరవదు. ఊదును. దీని నోటి విషపు గాలి తగిలిన వెంటనే శరీరం నందు ఒక్కసారిగా భగ్గున మంట మొదలగును. గాలిసోకిన స్థలం నందు రెండు మూడు దినముల పిమ్మట నిప్పుతో కాల్చబడినట్టు బొబ్బలు జనించును. నూనె మొదలగు సేవించినట్టైన శరీరం నందు నల్లని మచ్చలు పుట్టును . కొంతకాలం ఇలా బాధపడిన తరువాత మృత్యువు సంభంవించును.

• సున్నపు పొడ పెంజర - ఇది అడుగు పొడవు మాత్రమే ఉండును. ఇది వరిమళ్ళ లోని ఎండ్రకాయ బొక్కలలో నివసిస్తూ ఎండ్రకాయలను భక్షించును . ఇది కరవదు. ఇది మనుజుల శరీరం నందు ఊదును. దీని విషపు గాలి తగిలిన వెంటనే మంట పుట్టును . శరీరం నందు మచ్చలు , దద్దుర్లు , గ్రంథులు ఏర్పడి , దురద మొదలయి కుష్టురోగి వలే ఉండును. దీనివల్ల మృతి కలగదు .

• తేనె పొడ పెంజర - ఇది రెండు మూరల పొడవు కలిగి ఉండి గుర్రపు వన్నె గల మచ్చలు కలిగి ఉండును. ఇది కరిచిన శరీరం నందు వాపు , మచ్చలు జనియించి కొన్నిదినములకు మృతి చెందును

• కుళ్లు పొడ పెంజర - ఇది ఒక గజం పొడవు ఉండును. దీని శరీరం పైన అనేక వర్ణములు గల పొడలును కలిగి ఉండి చూచుటకు అసహ్యం కలిగి ఉండును. దీని కాటు పడిన వారికి శరీరం బరువు ఎక్కును. ముక్కులు ఎగురుచుండును. శ్వాస బంధించును. కాళ్లు , చేతుల యెక్క గోళ్లు పుచ్చిపోవును . కుష్టువ్యాధి సంభవించినట్టు శరీరం కుళ్ళి దుర్గందం ఏర్పడును . ఇది కరిచిన సంవత్సరం తరువాత మరణించును.

• పాదిరీ పొడ పెంజర - ఇది చేతి పొడవు ఉండును. కలిగొట్టు పువ్వు వన్నె మచ్చలు కలిగి ఉండి మొద్దు స్వభావం కలిగి ఉండును. ఇది కరవదు. మనుజుల శరీరములను నాకును. అందువలన శరీరం నందు పైత్యం , నవ, శరీరం రంగు మారు ట , నిస్సత్తువ, వాంతులు ఎక్కిళ్లు , అరిచి సంభంవించును. మృతి ఎంత మాత్రం కలగదు .

• గువ్వపోడ పెంజర - ఇది ముప్పది అంగుళముల పొడవును , పావురపు రంగు శరీరం కలిగి ఉండి పసుపు వన్నె మచ్చలు కలిగి ఉండును. దీని కాటు పడినవారికి శరీరం నందు పాండు వ్యాధి , దురద, శోఫ , పసుపు వర్ణము గల మచ్చలు , దద్దురులు కలుగును. కొంతమందికి మాత్రమే మరణం కలుగును.

• గరికపోడ పెంజర - ఇది గరిక వర్ణపు మచ్చలను కలిగి ఉండి అడుగు పొడవును కలిగి ఉండును. దీని కాటు వలన మనుజులకు శరీరం నందు దురద, వాపు , మాంద్యం, నొప్పి, కన్నులు భ్రమ గప్పుట, దేహంలో నిస్సత్తువ , శరీరం అంతా ఆకు పసుపు వర్ణం గల పొడలు , శరీరం నందు వణుకు వంటి లక్షణాలు కలిగి కుష్టువ్యాది జనింపజేయును . కాళ్ల యొక్క చేతుల యొక్క వ్రేళ్లు వంకరలై ఎండిపోయినట్టు అయ్యి శుష్కించి ఉండును.

• మోదుగుపూ పొడ పెంజర - ఇది రెండు అడుగుల పొడవు , ఎర్రని మచ్చలు కలిగి ఉండును. దీని కాటు తిన్న వారికి శరీరం నందు వాపు , గాయం నందు పోట్లు , శరీరం నందు గ్రంథులు కట్టుట, అప్పటికప్పుడే రక్తం వాంతి అగుట , దగ్గిన రక్తం పడుట వంటి లక్షణాలు కలిగి ఉండును.

• పసుపుపొడ పెంజర - ఇది చేతి పొడవు కలిగి ఉండును. పసుపు వన్నె మచ్చలను కలిగి యుండును. దీని కాటు వలన శరీరం నందు పసుపు రంగు బొబ్బలు , జ్వరం , గాయాల్లో పోట్లు ఏర్పడి మరణం సంభంవించును.

• దొండపండు పొడ పెంజర - ఇది చేతేడు పొడవు ఉండును. చక్కగా పండిన దొండపండు వర్ణం కలిగి ఉండును. దీని కాటువలన శరీరం నందు నరములు ఉబ్బి ఎర్రగా కనిపించును. దేహం శుష్కించును . గాయం నందు పోట్లు కలుగును. మారుతి సంభవింపదు.

• గవ్వపోడ పెంజర - ఇది మూడు మూరల పొడవును , లావుగా భయంకరంగా గవ్వ వర్ణం కలిగి ఉండును. దీని కాటు వలన శరీరం నందు పాండువు , ముఖం , నేత్రములు పసుపు వర్ణం కలిగి ఉండును. కాటుపడిన ప్రదేశం కుంగి గుంట పడుట జరుగును. మరణం సంభవించదు.

• రెండు తలల శిఖండి - ఈ పెంజర రాగిరంగు కలిగి ఉండును. తెల్లని మచ్చలు , గజము పొడవు కలిగి ఉండును. దీని తోక వైపు మొద్దుగా ఉండటం చేతను తలవైపుకు ప్రాకినట్లే తోకవైపుకు పాకును. అందువలన జనులు దీనికి రెండు తలలు ఉండునని భావించును. దీనిని కర్రతో కొట్టినా చావదు. జెముడు , జిల్లేడు కర్రలతో కొట్టినను , నిప్పులతో కాల్చినను చనిపోవును . ఇది కరవదు . మనుజుల శరీరం నాకును . ఇందువలన దేహం అంతయు నవ, పాండు రోగం , పొడలు , వాపు కలిగి అన్నం తినటం మీద ద్వేషం కలుగును.

ఇప్పటివరకు మీకు 21 రకాల పెంజర సర్పాల గురించి తెలియచేశాను . ఇప్పుడు మీకు రాజీమంత సర్పాల గురించి తెలియచేస్తాను .

 ఈ రాజీమంత సర్పాలలో 4 రకాల సర్పాలు కలవు. అవి

• క్షుద్రజాతి సర్పాలు .

• కుంభీ వస సర్పాలు .

• మహా సర్పాలు .

• నిర్విష సర్పాలు . అని 4 రకాలు కలవు.

రాజీమంత సర్పాలలో బేధాలు -

 పైన చెప్పబడిన నాలుగు జాతుల సర్పాలలో క్షుద్రజాతి సర్పములు 9 జాతులుగాను , కుంభీవస సర్పాలు 8 కులములుగాను , మహాసర్పములు 3 బేధములుగాను , నిర్విష సర్పములు 16 తరగతులుగా పుట్టి ఉన్నవి.

క్షుద్రసర్పములలో రకాలు -

• పెద్ద కట్లపాము.

• నాగుల కట్లపాము.

• నూనె కట్లపాము.

• బఱ్ఱె కట్లపాము.

• కట్లపాము.

• తాటిబొలుగు పాము.

• చెట్టెగురు పాము.

• గొడ్డలి ముఖపు పాము.

• గోడప్రాకుడు పాము. ఈ విధంగా మొత్తం 9 విధాలుగా ఉండును.

• పెద్ద కట్లపాము లేదా పెద్ద పరుగుడు పాము ఇది గజము పొడవు ఉండి గోధుమవన్నె త్రాచు పాముని పోలి ఉంటుంది. దీని కాటు పడిన వానికి మాటిమాటికి విషం ఎక్కి భాధించును. కాని మరణం కలగదు.

• నాగుల కట్లపాము - దీనిని నాగ పరుగుడు అని కూడా అంటారు. ఇది 36 అంగుళముల పొడవు ఉండును. ఇది చూడటానికి నల్ల త్రాచువలె ఉండును. దీని కాటువలన విషం ఎక్కడం దిగడం జరుగును. మంత్రౌషదాల వలన విషం విరుగును. మరణం కలగదు.

• నూనె కట్లపాము - ఇది 36 అంగుళముల పొడవు కలిగి ఉండి శరీరం అంతయు తెల్లని కట్లు కలిగి ఉండి మెరుస్తూ ఉంటుంది. దీని విషం మిక్కిలి చురుకు అయినది. దీని కాటు వలన బాధ కలుగును. విషం వలన మరణం సంభవించదు.

• బర్రెకట్ల పాము - ఇది 50 అంగుళాల పొడవు ఉండి మొద్దు వలే లావును , శరీరం నందు గరుకు కలిగి ఉండును. ఇది క్రూరమైన విషం కలిగి ఉండును.

• కట్లపాము లక్షణము - ఇది మూడుమూరల పొడవు , శరీరం నందు గణుపుల వంటి కట్లు కలిగి ఉండును. ఇది కాటు వేయడం వలన మాటిమాటికి విషం ఎక్కడం , దిగడం జరుగును. మరణం కలుగనేరదు .

• తాడిగిరి లేదా తాటిబొలుగు పాము - ఇది చిటికెన వ్రేలు లావును , మూడు జానల పొడవు నూనె రంగును కలిగి ఉండును. ఇది తీగ జాతి చెట్లలో విశేషంగా తాటిచెట్ల యందును సంచరించును. మనుజుల నిది తలమీదనే తప్ప మరి వేరే ప్రదేశంలో కరవదు. అందువలన తక్షణమే విషమెక్కి మనుజుడు గంటలోపునే చచ్చును. దీని విషముకు విరుగుడు లేదు . ఇది పగబట్టిన మనిషిని చంపియే తీరును . ఒకవేళ చంపలేక పోతే నిరసన వ్రతం బూని 6 నెలలలో అతనికోసం వేచి చూసి చివరకు చచ్చును.

• చెట్టగురు పాము - ఇది చిటికెన వ్రేలు లావు , అడుగున్నర పొడవు ఉండి ఎప్పుడూ చెట్ల మీదనే ఉండును. ఇది ఒక చెట్టు పై నుంచి మరియొక చెట్టు పైకి తటాలున దుమక గలదు. ఇది మనుజులను తలమీద కాని కన్నుల మీద కాని కరుచును. ఇది పగ సాధించుట విషయంలో తాడిగిరి పామును పోలి ఉండును. ఇది కరిచినచో ఔషదం ఇచ్చు సమయం కూడా ఉండదు. అంతలోపు మనుజుడు మరణించును. జీవజంతువులు ను చంపుటలో దీని విషాన్ని మించినది లేదు . కావున పర్వాతారణ్యాలు , ఉద్యానవనాలు యందు తిరిగే వారు ఈ సర్పాన్ని సదా కనిపెట్టి తిరగగలరు.

• గొడ్డలిమొగపు పాముల లక్షణము - ఇది ఉదారంగును , గొడ్డలి వంటి తల కలిగి ఉండును. రేగటి మట్టి భూములలో , చౌడు భూముల్లో , బురద నేలల్లో నివసించును. వర్షాకాలంలో మాత్రమే బయట తిరుగును. మూరెడు పొడవు కలిగి ఉండును. ఈ పాముచే కరవబడిన మనుజుడు యొక్క అంగాలు కుంచించుకు పోయి పొట్టివాడు అగును.

• గోడప్రాకుడు పాము లక్షణము - ఇది రెండు మూరల పొడవు కలిగి తెల్లని శరీరం కలిగి శరీరం పైన నల్లని అడ్డు చారలు కలిగి ఉండును. వేలెడు లావు కలిగి ఉండును. అతిక్రూరమైన విషము కలిగి ఉండును.ఈ సర్పము ఎంత చదరము అయిన గోడని అయినా ప్రాకి ఎక్కగలదు. కాని దిగుట తెలీదు . గబుక్కున కింద పడును.

ప్రాచీన గ్రంథాలలో సర్పాలు వాటి వివరణ - 5

 అంతకు ముందు పోస్టులో రాజీమంత సర్పాలు మొత్తం 21 రకాలు వాటి గురించి సంపూర్ణ వివరణ ఇచ్చాను. ఇప్పుడు కుంభీన జాతి సర్పాలు గురించి వివరిస్తాను.

ఈ కుంభీని జాతి సర్పాలు మొత్తం 8 రకాలు .

• ఘంటాపుచ్చము .

• గరున్నాగము .

• త్రిశూలి .

• జటాధరము .

• కుంభీనసము .

• శోణముఖము .

• లోహితాక్షము .

• ఛత్రపతి.ఈ విధంగా 8 రకాలుగా ఉంటాయి.

• ఘంటాపుచ్చ సర్ప లక్షణము - మిక్కిలి పొడవు శరీరం , క్రూరత్వం , మిక్కిలి పరాక్రమం సంచరించునప్పుడు తోక చివర యందు ఘంటానాదం కలిగి ఉంటుంది. ఈ సర్పం సర్వ జంతువులను భక్షించును . ఉగ్రమైన విషం కలిగి ఉండును. సంచారం బయలుదేరడం మొదలు కాగానే దీని తోక యందు ఘంటానాదం వినపడును. ఆ నాదం వినపడిన వెంటనే సమస్త జంతువులు పారిపోవును. ఈ సర్పం ఆఫ్రికా దేశ పర్వతారణ్యములలో సంచరించును.

• గరున్నాగ సర్ప లక్షణము - ఖడ్గము వంటి నాలుక , గబ్బిలపు రెక్కల వంటి రెక్కలు , గుడ్లగూబ వంటి ముఖం, భూమి మీద మరియు ఆకాశ గమనం , 8 మూరల పొడవు కలిగి ఉండును. ఇది పక్షిజాతులను భక్షించును . ఇది ఆఫ్రికా దేశ పర్వతారణ్యాలలో నివశించును.

• త్రిశూలీ సర్ప లక్షణము - పిల్లివంటి ముఖం , తోక యందు గరుడపచ్చ కాంతి వంటి రేఖలతో ప్రకాశించుట , మీసాలు కలిగి ఉండును. 16 మూరలు పొడవు కలిగి ఉండిన దేహము , తోక త్రిశూలం వంటి మూడు చీలికలు కలిగి ఉండును. ఇది ఆఫ్రికా ఖండం నందు ఉండును.

• జటాధరా సర్ప లక్షణము - మేకవంటి స్వరము , అతి పెద్ద శరీరం , గొఱ్ఱెవలె జడలు , 6 మూరల పొడవు , కంబడి చాయ వంటి లక్షణములు కలది. ఇది సింహళ ద్వీపం నందు ఉండును.

• కుంభీనస సర్ప లక్షణము - మూడు మూరల పొడవు , పంది ముఖం , కడవ వంటి కడుపు , కురచ అయిన తోక , చిన్నగా పాకును . తుమ్మెద ధ్వని వంటి కూత ఈ లక్షణములు గలది కుంభీనస సర్పం అనబడును. ఇది అన్ని దేశాలలో ఉండును.

• శోణముఖ సర్ప లక్షణం - స్పటిక ఛాయ గల శరీరం , పద్మరాగ మణి వంటి శిరస్సు , అతి భయంకరమైన కామక్రోధములు , భయంకరమైన గర్జన , 12 మూరల పొడవు గల శరీరం కలిగి ఉండునది శోణముఖ సర్పం అనబడును.

• లోహితాక్ష సర్ప లక్షణం - నల్లని వర్ణం, భూమి నుండి చెట్ల పైకి , చెట్ల పై నుంచి భూమి పైకి దుముకుట , బారెడు పొడవు గల శరీరం , అగ్ని కణముల వంటి నేత్రములు , భయంకర ఆకారం కలిగి ఉండును.

• ఛత్రపతి సర్ప లక్షణము - 5 మూరల పొడవు , అతిస్నిగ్ధమైన కోమలాకారం , సంచరించునప్పుడు శరీరం వికసించును. సంచరించనప్పుడు శరీరం ముడుచుకుని ఉండును. శ్వేత ఛత్రం గల శిరస్సు , సర్వ జంతువుల ధ్వనిని చేయగలిగి ఉండును. క్షణంలో ప్రాణం తీయును.రాత్రుల యందు చెట్ల మీద నివసించును . ఇది కేరళ నందు నివసించును .

మహాసర్పముల వివరణ -

 మహాసర్పములు మొత్తం 3 రకాలు అవి

• దాసరి పాము .

• కొండ చిలువ .

• సముద్రపు చిలువ .

• దాసరిపాము లక్షణము - 60 మూరల పొడవు , బారెడు లావుగల శరీరం , శరీరం అంతా త్రిపుండ్రాకారం గల నామములు , కాటుక వంటి ఛాయ , ముఖం నందు ఊర్ద్వత్రిపుండ్రములు కలిగి ఉండునది దాసరిపాము అని చెప్పబడును . దీనికి దొరికిన ఏ జంతువుని అయినా బిర్రుగా చుట్టుకుని చంపి దిగమింగును.

• కొండచిలువ లక్షణము - నూరు మూరల పొడవు , మూడు బారల వలయము , వెడల్పు గల తెల్లని పొడలు , నీలవర్ణం గల శరీరం కలిగి ఉండునది కొండచిలువ అని చెప్పబడును . ఇది ఏ జంతువుని అయినా చటుక్కున మింగి చెట్టుకు చుట్టుకుని నీల్గును . అంతట పొట్టలోని జంతువు జీర్ణం అగును.ఇది కొండల యందు మాత్రమే నివసించును .

• సముద్రపు పాము లక్షణము - మిక్కిలి పొడవు , స్థూలమగు శరీరం గలది . దీనిచేత కరవబడిన మనిషిని భూమి పైకి తీసుకొచ్చి చికిత్స చేసిన విషము హరించదు. సముద్రము నందు ఉంచే చికిత్స చేయవలెను . * సర్పజాతి వివరణ సంపూర్ణం *ఇప్పుడు మీకు సర్పాలు కాటువేసినప్పుడు చేయవలసిన చికిత్సల గురించి వివరిస్తాను.సర్ప విషములకు చేయవలసిన చికిత్సలు -అంతకు ముందు పోస్టులలో మీకు సర్పాలలో రకాలు మరియు వాటి లక్షణాలు సంపూర్ణంగా వివరించాను. ఇప్పుడు వాటి చికిత్సలు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

• 1వ చికిత్స - ఏ సర్పం కోపోద్రేకంతో ఉండునో అట్టి సర్పం నోటి నుండి పొగ వెడలుచుండును. యే మనుజుడు అయినా అట్టి సర్పముచే కరవబడినను ఆ సర్పం వదిలిన పొగచే స్మృశించబడిన ఆహార పదార్థాలను భక్షించిన వెంటనే విషం ఎక్కును.ఆ విషాన్ని చికిత్సల ద్వారా తొలగించవలెను . వెంటనే ఆ విషార్తునకు ఆవుపాలు , ఆవునెయ్యి , తేనె సమాంతరములుగా కలిపి అందు రెండు గురిగింజల అంత వత్సనాభిని కలిపి త్రాగించి గాయమునకు కూడా వత్సనాభిని కరిచినచొట పైపూతగా రాయవలెను .వెంటనే విషం హరించును .

• 2 వ చికిత్స - సర్పం కాటువేసిన వానికి వెంటనే ఎడమ ముక్కునందు చెవిలో గులిమి పట్టించి మనిషి మూత్రం ఆ ముక్కులో ఉంచిన విషం ఎక్కదు.

• 3 వ చికిత్స - నేలగుమ్ముడు గడ్డను గంథం తీసి కాటువేసిన చోట లేపనం చేసిన విషం హరించును . దీని చూర్ణం మీకు ఆయుర్వేద పచారీ షాపులలో దొరకును.

• 4 వ చికిత్స - పెన్నేరు గడ్డ అనగా అశ్వగంధ , చిర్రివేరు , మహిసాక్షి , కరిదువ్వ ఈ వస్తువులను గోమూత్రం తో నూరి పట్టించిన సర్పవిషం హరించును . విషంని హరించుటలో దీన్ని మించిన గొప్ప ఔషదం లేదు .

• 5 వ చికిత్స - ఆగాకర గడ్డ ని గంథం తీసి అనగా సానమీద అరగదీసి ఆ గంధాన్ని తీసి కాటువేసిన స్థలం నందు దానిని పూసిన విషం హరించును .

• 6 వ చికిత్స - కాటువేసిన స్థలం నందు జిల్లేడు వేరు అరగదీసి పట్టించినను లేదా ఎర్ర చిత్రమూలం , ఆరుద్ర పురుగు కలిపి నూరి పట్టించినను విషం విరుగును.

• 7 వ చికిత్స - కరక్కాయ , తేనె , మిరియాలు , ఆకుపత్రి , ఇంగువ, మణిశిల , వస వీనిని సమానంగా నీరు వేసి నూరి ముక్కులో వేసిన సర్పముచే కరవబడిన వాడు జీవించును.

• 8 వ చికిత్స - మణిశిల , ఇంగువ, వస , త్రికటుకములు అనగా శొంటి,పిప్పిళ్లు , మిరియాల సమాన చూర్ణం , కరక్కాయలు, లవంగచెక్క, ఆకుపత్రి అనునవి సమానంగా తీసుకుని నీటితో కలిపి నూరి ముక్కులో వేసినచో ఎంత విషపూరితమైన సర్పం కరిచినను ఆ వ్యక్తి బ్రతుకుతాడు.

• 9 వ చికిత్స - దేవకాంచన చెట్టు వేరు గంధంని ముక్కులోపల వేసినచో అసాధ్యం అయిన సర్పవిషం హరించును .

• 10 వ చికిత్స - నేపాళపు గింజల్లోని పప్పులను నిమ్మపండ్ల రసంలో 21 సార్లు భావన చేయవలెను . భావన అనగా నిమ్మపండ్ల రసంలో గింజల్లోని పప్పు నానబెట్టి మళ్ళీ పూర్తిగా ఎండించడం మరలా నానబెట్టి మరలా ఎండించడం ఈ విధముగా 21 సార్లు చేయవలెను . ఆ తరువాత దానికి ఉమ్మి తో నూరి కణికలు చేసి ఎండించి మాత్రలులా చేసుకోవలెను . కావలసినప్పుడు ఉమ్మితో అరగదీసి కాటువేసిన స్థలం నందు లేపనం చేయవలెను . తరువాత కన్నులకు కాటుక వలే ఆ గంధాన్ని పట్టించవలెను . విషం విరిగిపోవును.

• 11 వ చికిత్స - గుంటగలగర వేఱు గాని , తిప్పతీగ వేఱు కాని , త్రిశూలి చెట్టు వేఱు గాని నీటితో నూరి లోపలికి తీసుకుని కాటువేసిన స్థలం నందు పూయడం వలన సర్పవిషం హరించును .

• 12 వ చికిత్స - భావంచి విత్తనాలు గోమూత్రంలో నానబెట్టి గోమూత్రంతోనే నూరి లోపలికి తాగవలెను .

• 13 వ చికిత్స - తెల్లగురిగింజ వేరుని నోటిలో ఉంచుకుని రసం మింగుచున్న సర్పవిషం హరించును .

• 14 వ చికిత్స - అశ్వగంధ సమూలం మేక మూత్రంతో నూరి దానినే గాయమునకు పట్టించిన సర్వ జంతువుల విషంని హరించును .

• 15 వ చికిత్స - నల్ల ఉమ్మెత్త వేఱు చిన్న ముక్కను తీసుకుని 10 ml కానుగ విత్తనాల నూనె వేసి నూరి మాత్ర వలే చేసి పుక్కిట పట్టుకొని ఆ మాత్రని నిమ్మపండ్ల రసముని కలిపి త్రాగిన సర్పవిషం హరించును .

• 16 వ చికిత్స - అత్తిపత్తి చెట్టు వేఱు అనగా దీనిని పట్టుకున్నచో ఆకులు ముడుచుకొనిపోవును . మరియు నీలివేరు ను మంచి నీటితో నూరి పుచ్చుకొని తెల్ల గురిగింజ లోని పప్పుల గంధమును కాటువేసిన స్థలం నందు పట్టించిన సర్పవిషం హరించును .

• 17 వ చికిత్స - గొమూత్రంలో గాని మనుష్యుని మూత్రంలోగాని పాత నెయ్యిలో గాని పసుపు చూర్ణం కలిపి తాగించిన సర్పవిషము హరించును .

• 18 వ చికిత్స - పాము కరిచిన వెంటనే నరమూత్రం సేవించిన విషం ఎక్కదు.

• 19 వ చికిత్స - కటుకరోహిణి , నేలతాడిగడ్డలు నీళ్లతో నూరి పుచ్చుకొనిన సర్పవిషం హరించును .

• 20 వ చికిత్స - కుంకుడువేరు నూరి కుంకుడు గింజ ప్రమాణంలో పుచ్చుకొనిన సర్పవిషం హరించును .

• 21 వ చికిత్స - నాగముష్టి వేరు నూరి రసం తీసి తాగిన అన్ని రకాల సర్పవిషాలు హరించును .

• 22 వ చికిత్స - జిల్లేడు యొక్క లేత మొగ్గలని కోసి ఆ మొగ్గలు తెంచునపుడు స్రవించు పాలను ఒక గ్లాసులో పట్టి ఆ పాలతో ఆ మొగ్గలను నూరి రేగు పండు ప్రమాణం మాత్రలను చేసి ఆ మాత్రలను తమలాపాకులో చుట్టి గంటకి ఒకసారి మింగించిన సర్పవిషం హరించును . ఇలా 6 మాత్రలు కు తక్కువలేకుండా మింగించవలెను . మింగలేని స్థితిలో ఉన్నచో నీటితో కలిపి తాగించవలెను .

• 23 వ చికిత్స - జిల్లేడు ఆకులకు ఇరువైపులా అంటుకొని ఉండే దూది వంటి తెల్లని నునగును గీచి ఒక గాజుపాత్రలో వేసి జిల్లేడు లేత మొగ్గలను తుంచునప్పుడు తొడిమలు నుండి స్రవించు పాలతో తడిపి చేతితో చక్కగా పిసికి కుంకుడు గింజ అంత మాత్రలు చేసి నీడలో ఎండపెట్టి ఆ మాత్రలకు గాలి తగలకుండా సీసాలో వేసి కార్క్ మూత బిగించి ఈ మాత్రలను గంటకొకటి చొప్పున మూడు గంటలసేపు మింగించిన సర్పవిషం నిస్సందేహంగా నివర్తించును. ఈ మాత్రలు తయారుచేసిన రెండు నెలల వరకే పనిచేయును . కావున రెండు నెలలోకసారి ఈ మాత్రలు తయారుచేసి నిలువ ఉంచుకొనవలెను .

    ◦ సర్ప విష చికిత్సలు సంపూర్ణం *

గమనిక -

 కొంతమంది ప్రాచీన వైద్య పండితులు పాము కరిచిన సాధారణంగా మనుషులకు మృతి సంభవించదు అని తమతమ గ్రంథాలలో వివరించారు . పాము కరిచినవారికి స్మృతి తప్పి ఉచ్వాస నిశ్చ్వాసములు ఆగి , హృదయచలనం ఆగి నాడిగమనం ఆగి ఉన్న సమయంన మృతుడు అయినట్టు నిర్ణయించుకుని చక్కగా కూర్చొండబెట్టి 500 వందల బిందెల నీటిని నెత్తిన ధారగా పోసిన బొందిలోకి ప్రాణం వచ్చి లేచును. ఈ విధంగా చేసినను ప్రాణం రానిచో ఒక గచ్చు తొట్టిలో కాని , చెక్క తొట్టిలో కాని నిండుగా నీరు నింపి మూడు దినములు ఉంచిన ఉదకం నుండి బుడగలు వచ్చును. బుడగలు మొదలు అయినచో శరీరంలోకి ప్రాణం ప్రవేశిస్తుంది అని అర్థం. ఈ విధంగా బుడగలు మొదలయిన గడియ తరువాత కాటు తిన్న వాని శరీరం బయటకి తీసి కూర్చుండబెట్టి శిరస్సు పై నుంచి నీటిని ధారగా పోయుచున్న ప్రాణములు నిలబడును. నీటిలో ఉంచినప్పుడు బుడగలు రానిచో మృతుడు అని నిర్ణయించవలెను . సిద్దనాగార్జున తంత్రం నందు తొమ్మిది దినముల వరకు నీటియందు ఉంచవలెను అని ఉన్నది. పాముచే కరవబడిన వాడు చనిపోయినచో వానిని మరలా ఆ సర్పం వలన గాని లేదా మరియొక సర్పం చేత కాని కరిపించినచో కాటు తిన్నవాడు బ్రతుకును కాని సర్పం మరణించును. బహుశా పాముకాటు తిన్నవాడు శరీరంలోని అవయవాలు పనిచేయని ఒక రకమైన అచేతన స్థితికి చేరుకుంటాడు కావోచ్చు ఉదకం సహాయంతో అతన్ని మరలా సాధారణ స్థితికి తీసుకురావొచ్చు అని ఆయుర్వేద పండితుల ఉవాచ కావోచ్చు . నేను చదివిన కొన్ని గ్రంథాలలో పాముకరిచిన వెంటనే ఆ పాముని కాటు తినినవాడు పట్టుకొని కరవాలి అని లేదా మట్టిపెడ్డని నమిలి కాని పాముకాటు పైన కాల్చి కుంకుడు ఆకు నలుగగొట్టి కట్టిన సర్పవిషం హరించును అని ఉన్నది.

పాములు దగ్గరకు రాకుండా ఉండుటకు రహస్య క్రియలు -

• 1 వ ప్రక్రియ - పుష్యమి నక్షత్రం నందు సంగ్రహించబడిన తెల్ల జిల్లేడు వేఱు , తెల్ల గలిజేరు వేఱు బియ్యపు కడుగుతో నూరి త్రాగినను , ఆ నక్షత్రం యెక్క సమయం నందు ఆ మూలికలను నూరి బియ్యపు కడుగులో చేర్చి పూసుకుని స్నానం చేయవలెను . ఇలా సంవత్సరంకి ఒకమారు చేయడం వలన ఆ మనిషి దగ్గరకి సర్పాలు వెళ్లవు . సర్పభయం ఉండదు.

• 2 వ ప్రక్రియ - సూర్యుడు మేషరాశి యందు ఉండగా చిరుశెనగలు , వేపాకు కలిపి భక్షించిన ఒక సంవత్సరం వరకు సర్పభయం ఉండదు.

• 3 వ ప్రక్రియ - ఆషాడ శుక్ర పంచమి నాడు సంగ్రహించబడిన దిరిసెన చెట్టు వేరుని దూపదీపనైవేద్యములు వొసగి నడుముకి కట్టుకుని బియ్యపు కడుగుతో ఆ వేరుని నూరి తాగిన ఆ సంవత్సరం సర్పభయం ఉండదు. ఇటుల చేసిన వానికి యే కారణం వల్లనైనా పాము కరిచినను పామే చచ్చును.

• 4 వ ప్రక్రియ - దూసరి తీగ వేరుని తెచ్చి నివశించే గృహము నందు కనపడునట్టు వ్రేలాడదీసిన సమస్త విషజంతువులు అన్నియు దూరంగా పారిపోవును .

• 5 వ ప్రక్రియ - పుష్యమి నక్షత్రం నందు తిప్పతీగ వేరుని తెచ్చి కణికలుగా ఖండించి దారము నకు మూలికగా గుచ్చి కంఠం నందు ధరించినచో సర్పభయం కలగదు. పాముకాటు వేసిన వాని కంఠం నందు వేసిన విషం దిగును.

• 6 వ ప్రక్రియ - పుష్యమి నక్షత్రంతో కూడిన ఆదివారం నందు బియ్యం కడుగుతో తెల్లగలిజేరు వేరు నూరి తాగిన మనుజునిని చూసిన సర్పం వెంటనే పారిపోవును . అట్టి మనిషికి సర్పభీతి ఉండదు.

• 7 వ ప్రక్రియ - తెల్ల గంటెన వేరును బియ్యపు కడుగుతో నూరి పుచ్చుకొనిన మనుజుని కి 6 మాసముల వరకు సర్పభయం కలగదు.

• 8 వ ప్రక్రియ - దూసరి తీగ వేఱు ఉదకంతో నూరి తాగినవానిని 6 మాసములు వరకు సర్పం కరవదు.దీనిని " గరుడ చూడామణి" అని పిలుస్తారు .

• 9 వ ప్రక్రియ - మనుజులు ప్రతి దినం పడుకొనే సమయం నందు అస్తిక మునిని గూర్చి ధ్యానించి నమస్కారం చేసి పడుకున్నచో ఆ మనుషులకు సర్పభయం లేకపోవుటయే కాక స్వప్నం నందు కూడా సర్పాలు కనపడవు.

• 10 వ ప్రక్రియ - గొడుగు వేసుకొని ఆవాలు పిడికిటపట్టుకొని రాత్రియందు గాని , పగటి యందు గాని ఏ మనుజుడు సంచరించునో వాని ఛాయ పడినను , శబ్దము వినినను సర్పములు భయపడి పారిపోవును .

• 11 వ ప్రక్రియ - అతిమధురం , విప్పకర్ర ఈ రెండింటిని చేర్చి మంట వేసినచో ఆ జ్వాలను చూసి నాగుపాములు సైతం దగ్గరకి రావు .

• 12 వ ప్రక్రియ - సింహం దంతంతో గరుడ విగ్రహంని చేయించి రాగి లేక బంగారు తాయత్తు లో పొదిగి శరీరం నందు ధరించిన వానిని చూడగానే సర్పములు పలాయనం చిత్తగించును . పైన చెప్పబడిన రహస్యతంత్రాలలో మీకు ఏది వీలుగా ఉంటుందో అది ప్రయత్నించండి. ముఖ్యముగా అరణ్యములలో సంచరించేవారు , రహస్య ప్రదేశాలలో తిరిగేవారు తప్పనిసరిగా పైన చెప్పిన తంత్రాలు పాటించటం చాలా మంచిది పాముకాటు గుండ్రంగా ఉండినను , నేరేడు పండు వర్ణం కలిగి ఉండినను , నీలపు వర్ణం కలిగి ఉండినను , రక్తహీనం అయ్యి తెల్లగా ఉండినను , రక్తం గూడుకట్టి ఎర్రగా ఉండినను వాడు దేవజాతి అయిన వాడు అయినను బ్రతకడు ఇది నిశ్చయం ... నేటితో సర్పాలు గురించి పూర్తి వివరణ వాటి చికిత్సా విధానాలు గురించి పూర్తిగా తెలియచేశాను . అదేవిధంగా సర్పాల నుంచి రక్షించుకొనుటకు కొన్ని ప్రక్రియలు కూడా వివరించాను. మరలా ఒక మంచి పొస్టుతో మీ ముందుకు వస్తాను . 



మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


గమనిక -


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 9885030034 


       కాళహస్తి వేంకటేశ్వరరావు 


    అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

 

                  9885030034

పంచాంగం 24.08.2026 Monnday,

  ఈ రోజు పంచాంగం 24.08.2026 Monnday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస శుక్ల పక్ష ద్వాదశి తిథి ఇందు వాసర పూర్వాషాఢ నక్షత్రం ప్రీతి యోగః బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: ద్వాదశి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



శ్రీ భగవానువాచ ।

పార్థ నైవేహ నాముత్ర వినాశస్తస్య విద్యతే ।

న హి కల్యాణకృత్కశ్చిత్ దుర్గతిం తాత గచ్ఛతి ।। 40 ।।



ప్రతిపదార్థ:



శ్రీ భగవాన్ ఉవాచ — శ్రీ భగవానుడు పలికెను; పార్థ — అర్జున, ప్రిథ పుత్రుడా; న ఏవ — ఎప్పటికి కాదు; ఇహ — ఈ లోకంలో; న — కాదు; అముత్ర — పరలోకమున; వినాశః — నాశనము; తస్య — అతని; విద్యతే — ఉండును; న — కాదు; హి — నిజముగా; కల్యాణ-క్రిత్ — భగవత్ ప్రాప్తికి ప్రయత్నించే వాడు; కశ్చిత్ — ఎవరైనా; దుర్గతిం — చెడు గతి; తాత — నా మిత్రమా; గచ్ఛతి — పోవును.



తాత్పర్యము: 


శ్రీ భగవానుడు ఇలా పలికెను: ఓ పార్థా, ఆధ్యాత్మిక పథంలో ఉన్న వాడు ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ చెడిపోడు. ప్రియ మిత్రమా, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే వాడు ఎన్నటికీ దుర్గతి పాలుకాడు.



వివరణ:


తాత అన్న పదం అనురాగాన్ని సూచిస్తున్నది, దీనర్థం ‘పుత్రుడా’ అని. అర్జునుడిని తాత అని సంబోధించి, శ్రీ కృష్ణుడు అతనిపై ఉన్న వాత్సల్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. గురువు తన శిష్యుడికి తండ్రి లాంటి వాడు, కాబట్టి గురువు కూడా ఒక్కోసారి తన శిష్యుడిని ప్రేమతో 'తాత' అని సంభోదిస్తాడు. ఇక్కడ అర్జునుడి పట్ల తన వాత్సల్యాన్ని మరియు కృపని చూపిస్తూ, ఆయన మార్గంలో ఉన్న వారి బాగోగులని తనే చూసుకుంటాడు, అని చెప్పటానికి శ్రీ కృష్ణుడు సంకల్పించాడు. వారు భగవంతునికి ప్రియమైన వారు ఎందుకంటే వారు అత్యంత పవిత్రమైన కార్యంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి, మరియు ‘మంచి చేసే వారు ఎప్పుడూ కూడా కష్టాలపాలు కారు.’ ఈ లోకంలో మరియు పరలోకంలో భక్తుడిని భగవంతుడే కాపాడుకుంటాడు, అని ఈ శ్లోకం వక్కాణిస్తున్నది. ఈ ప్రకటన ఆధ్యాత్మిక అభిలాషులకు ఒక గొప్ప భరోసా. ఇక తదుపరి, ఈ జన్మలోనే ప్రయాణం పూర్తి చేయలేకపోయిన యోగి యొక్క సాధనని భగవంతుడు ఎలా భద్రపరుస్తాడో, శ్రీ కృష్ణుడు వివరిస్తాడు.