11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

స్వామి వివేకానంద స్ఫూర్తి

  స్వామి వివేకానంద స్ఫూర్తి....
రోజుకో సూక్తి....


మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్యకాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.


శుభ శుక్రవారం 🌹Happy Friday 


Swami Vivekananda’s Wisdom for

Daily Inspiration. 


Is education book - learning? No. Is it diverse knowledge? Not even that. The training by which the current and expression of will are brought under control and become fruitful is called education.

11-09-2026 శుక్రవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

11-09-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధనసహయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారములలో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.     

---------------------------------------


వృషభం


ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు.  

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. శుభకార్యాలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి.  

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారమునకు సకాలంలో పెట్టుబడులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి.   

---------------------------------------


సింహం


సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యాపార వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. 

---------------------------------------


కన్య


వ్యాపార, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు.

---------------------------------------


తుల


ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటాబయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

---------------------------------------


వృశ్చికం


ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఇంటాబయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు.

---------------------------------------


ధనస్సు


భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో వివాదాలు రాజీ చేసుకుంటారు.  

---------------------------------------


మకరం


ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి.     

---------------------------------------


కుంభం


నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలసి వస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి.    

---------------------------------------


మీనం

 

కొన్ని పనులలో శ్రమ తప్పదు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలలో నష్ట సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. దాయదులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి.   

---------------------------------------

కాలం - అనుకూలం*

  *కాలం - అనుకూలం*

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)

卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐

🌟 సెప్టెంబరు 11 2026 🌟

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం


తిథి: *అమావాస్య ఉ.8.43 కు* తదుపరి *శు.పాడ్యమి 12 ఉ.7.43 కు*

వారం: *భృగువారము (శుక్రవారం)*

నక్షత్రం: *పుబ్బ ప.2.17 కు* తదుపరి *ఉత్తర 12 ప.2.07 కు*

యోగం: **సాధ్య సా.5:01 కు* తదుపరి *శుభ 12 మ.3:08 కు*

కరణం: **నాగ ఉ.8:57 కు, కింస్తుఘ్న రా.8:18 కు* తదుపరి *బవ 12 ఉ.7:46 కు*

రాహుకాలం: *ఉ. 10.30 - 12.00 కు*

దుర్ముహూర్తం: *ఉ. 8.33 - 9.22 కు, మ. 12.37 - 1.25 కు*

వర్జ్యం: *రా.9.26 - 11.01 కు*

అమృతకాలం: *ఉ. 07.03 - 08.36 కు*

సూర్యోదయం: *ఉ. 6.07 కు*

సూర్యాస్తమయం: *సా. 6.18 కు*


*గురుబోధ:*

విఘ్నేశ్వరునికి అనంత నామాలున్నాయి. అనేక అవతారాలున్నాయి. ఆయన లీలాగాథలు కూడా అనంతాలే. నిర్గుణుడు. సగుణుడు కూడా విఘ్నేశ్వరుడే. అటువంటి గణేశ్వరునికి మరింత ఇష్టమైన పదహారునామాలు ఉన్నాయని, ఆ పదహారునామాలని భక్తితో తలచుకుంటే సకల శుభాలు కలుగుతాయని వ్యాసమహర్షి సెలవిచ్చాడు. ఈ పదహారు నామాలను ఉచ్చరించినా, విన్నా కూడా శుభాలే కలుగుతాయి. అందునా విద్యారంభసమయంలోనూ, వివాహసమయంలోనూ, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు లేక గృహాదులలో ప్రవేశిస్తున్నప్పుడూ, యుద్ధసమయంలోనూ, ఇంకా సర్వకార్యాలలోనూ ఈ నామాలు ఉచ్చరించిన వానికి, విన్నవానికి విఘ్నాలు తొలగిపోతాయి. ఆ నామములను గురించి విడివిడిగా తెలుసుకుందాం. 1. సుముఖుడు 2. ఏకదంతుడు 3. కపిలుడు 4. గజకర్ణకుడు 5. లంబోదరుడు 6. వికటుడు 7. విఘ్నరాజు 8. గణాధిపుడు 9. ధూమకేతుడు 10. గణాధ్యక్షుడు 11. ఫాలచంద్రుడు 12. గజాననుడు. 13. వక్రతుండుడు 14.శూర్పకర్ణుడు 15. హేరంబుడు 16. స్కందపూర్వజుడు.


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

11సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹శుక్రవారం🌹*

 *🪷11సెప్టెంబర్26🪷*  

  *దృగ్గణిత పంచాంగం*                      


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : అమావాస్య* ఉ 08.56 ఉపరి *భాద్రపదం ప్రారంభం*

*వారం  : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పుబ్బ* మ 01.16 ఉపరి *ఉత్తర ఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : సాధ్య* రా 05.02 వరకు ఉపరి *శుబ*

*కరణం  : నాగ* ఉ 08.56 *కింస్తుఘ్న* రా 08.17 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.30 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఉ 07.05 - 08.37*

అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.29*

*వర్జ్యం    : రా 08.21 - 09.56*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.12 మ 12.29 - 01.18*

*రాహు కాలం : ఉ 10.32 - 12.04*

గుళికకాళం      : *ఉ 07.27 - 09.00*

యమగండం    : *మ 03.08 - 04.41*

సూర్యోదయం : *ఉ 5.49*

సూర్యాస్తమయం : *సా 06.11*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 05.55 -08.23*

సంగవ కాలం      : *08.23 -10.50*

మధ్యాహ్న కాలం    : *10.50 - 01.18*

అపరాహ్నకాలం   : *మ 01.18-03.45*

*ఆబ్ధికం తిధి        : భాద్రపద శుద్ధ పాడ్యమి*

సాయంకాలం   : *సా 03.45 - 06.13*

ప్రదోష కాలం      : *సా06.13 - 08.33*

రాత్రి కాలం         : *రా 08.33 - 11.41*

నిశీధి కాలం        : *రా 11.41 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

            *🌷ఓం శ్రీ🌷*

*🪷మహాలక్ష్మీ దేవ్యై నమః🪷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


            🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శ్రీమద్భాగవతం - 46/48*🙏

 *భృగువారం 11 సెప్టెంబర్ 2026*


**శ్రీమద్భాగవతం - 46/48*🙏 


*ఉద్ధవగీత పరిసమాప్తి – త్రివిధ యోగాలు, భిక్షుగీత & అర్చనా విధి**


ఓం నమో భగవతే వాసుదేవాయ!


ఏకాదశ స్కంధంలోని మరికొన్ని ముఖ్య విషయాలు ఈరోజు తెలుసుకుని తరిద్దాం రండి.


**1. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు – త్రివిధ మార్గాలు**


శ్రీకృష్ణుడు మోక్ష సాధనకు మూడు ప్రధాన మార్గాలను స్పష్టంగా వివరించాడు:


* **జ్ఞానయోగం:** ప్రాపంచిక విషయాలపై పరిపూర్ణ వైరాగ్యం కలిగి, కర్మలను త్యజించగల సామర్థ్యం ఉన్నవారికి జ్ఞానయోగం శ్రేష్ఠమైనది.


* **కర్మయోగం:** సంసార కోరికలు పూర్తిగా నశించని వారు, ఫలాపేక్ష లేకుండా భగవదర్పణ బుద్ధితో శాస్త్రోక్త కర్మలను ఆచరిస్తూ చిత్తశుద్ధి పొందడానికి కర్మయోగం ఉపకరిస్తుంది.


* **భక్తియోగం:** భగవత్కథలను వినడం వల్ల శ్రద్ధ పెరిగి, కోరికలను పూర్తిగా వదలలేకపోయినా, వాటి పట్ల విరక్తి భావన ఉంటూ భగవంతుని నామరూపాలను ఆశ్రయించేవారికి **భక్తియోగం అత్యంత సులభమైన, శ్రేష్ఠమైన మార్గం**. భక్తి నిండిన హృదయంలో కామక్రోధాలు క్షణంలో నశిస్తాయి. ఇది మనం ఆచరించగలం.


ఈ మానవశరీరము అత్యంత దుర్లభము. స్వర్గవాసులైన దేవతలు, నరకములో ఉన్నవారు ఈ మనుష్యదేహమునే కోరుకొందురు. ఇది జ్ఞానమార్గమునకు, భక్తిమార్గమునకు పరమసాధనము. స్వర్గమునందున్న వారికి, నరకమునందు ఉన్నవారికి భగవత్ప్రాప్తి కలుగదు, కేవలం మానవ జన్మతోనే భగవత్ప్రాప్తి సాధ్యం.


**2. సాంఖ్య తత్త్వ విచారణ & ప్రకృతి-పురుష భేదం**


సృష్టి తత్త్వాన్ని వివరించే సాంఖ్య శాస్త్రం గురించి ఉద్ధవుని సందేహాలను పరమాత్మ నివృత్తి చేశాడు:


* ఈ సృష్టి 24 తత్త్వాల సమ్మేళనం (ప్రకృతి, మహత్తత్త్వం, అహంకారం, పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, ఏకాదశేంద్రియాలు).


* **పురుషుడు (ఆత్మ):** మార్పులేనివాడు, జ్ఞానస్వరూపుడు, నిత్యుడు.


* **ప్రకృతి (దేహం):** గుణాల చేత మార్పులకు లోనయ్యేది, నశించేది.


* దేహం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. కానీ ఆత్మ వీటన్నింటికీ అతీతంగా కేవలం సాక్షిగా మాత్రమే ఉంటుంది. ఈ వివేకమే మోక్ష సాధనం.


**3. భిక్షుగీత – అవంతి బ్రాహ్మణుని పరమ సహనశీలత**


మనస్సును నిగ్రహించడం ఎలాగో వివరించడానికి శ్రీకృష్ణుడు **అవంతి దేశపు బ్రాహ్మణుని చరిత్రను (భిక్షుగీత)** ఉపదేశించాడు:


* పూర్వం అవంతి నగరంలో ఒక మహా ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అత్యంత పిసినారి, దుర్మార్గుడు, కూడబెట్టడమే కానీ, ఇంకొకరికి, కనీసం సొంతవారికి కూడా పెట్టింది లేదు. దాంతో బంధువులు, భార్యాబిడ్డలు, సేవకులు అందరూ అతనిని అసహ్యించుకున్నారు.


* ఆ డబ్బుతో పంచ మహా యజ్ఞాలు చేయకపోవడం వల్ల కాలక్రమంలో దైవవశాత్తు దొంగల వల్ల, బంధువుల వల్ల, రాజదండనల వల్ల అతని సమస్త సంపద నాశనమైంది.


* ఉన్నప్పుడు ఎన్నడూ ఎవడికీ పెట్టింది లేదు కనుక ఎవరూ ఆదరించలేదు. అలా సకల సంపదలు పోవడం వల్ల ఎంతో కాలం దుఃఖించి, దుఃఖించి చివరకు సంసారం మీదనే విరక్తి కలిగింది.


* దేవతలు కూడా కోరుకొనే మానవజన్మను, అందునా బ్రాహ్మణోత్తమ జన్మను పొందియు, డబ్బు మీద వ్యామోహంతో నా వయసుని, జన్మను వృథా చేసుకున్నాను. ఇప్పుడు వృద్ధుడిని అయ్యాను, ఇకపై అయినా తపస్సు చేత నా జీవితం సార్థకం చేసుకుంటాను అని అహంకార మమకారాలు, రాగ ద్వేషాలు త్యజించి నిర్మల చిత్తంతో సన్యాసిగా మారి, తనను ఎవరూ గుర్తించని రూపంతో ఊరూరా తిరుగుతూ భిక్షాటనతో జీవింపసాగాడు.


* **దుష్టుల వేధింపులు:** మూడు కాళ్ళ ముసలి అయి, అవధూతలా తిరిగే ఆయన్ని దుర్మార్గులు పిచ్చివాడని ఎగతాళి చేస్తూ, కొట్టేవారు; చేతిలోని దండాన్ని, పాత్రను లాక్కునేవారు; ఆయనపై ఉమ్మివేస్తూ, మలమూత్రాలు చల్లుతూ చిత్రహింసలు పెట్టేవారు.


* **అవంతి బ్రాహ్మణుని గీతం:** అటువంటి ఘోరమైన అవమానాలను అనుభవిస్తూ కూడా ఆ బ్రాహ్మణుడు ఏమాత్రం చలించక, ప్రశాంతంగా ఇలా పాడుకున్నాడు:


**"నాయం జనో మే సుఖదుఃఖహేతుర్న దేవతాత్మా గ్రహకర్మకాలాః |**

**మనః పరం కారణమామనంతి సంసారచక్రం పరివర్తయేద్యత్ ||"**


*"నా సుఖదుఃఖాలకు ఈ జనులు కారణం కాదు, దేవతలు కారు, నా శరీరమూ కాదు, గ్రహాలూ కావు, నా పూర్వకర్మలూ కావు, కాలమూ కారణం కాదు... కేవలం నా **'మనస్సు'** మాత్రమే వీటన్నింటికీ మూలకారణం! మనస్సే సంసార చక్రాన్ని తిప్పుతోంది."*


* అని ఇతరులను నిందించడం మాని, మనస్సును భగవంతుని యందు స్థిరం చేసి ఆ బ్రాహ్మణుడు పరమహంసగా మారి ముక్తిని పొందాడు.


అగ్నిలో నెయ్యి పోసే కొద్దీ మంట పెరుగుతుందే తప్ప చల్లారదు; అలాగే కోరికలను తీర్చుకునే కొద్దీ అవి మరింత బలపడతాయి తప్ప శాంతించవు. ఎంత అనుభవించినా తృప్తి అనేది లభించదు.


**4. త్రిగుణాల స్వరూపం & కర్మల గతులు**


శ్రీకృష్ణుడు సత్త్వ, రజో, తమో గుణాల లక్షణాలను విడమరచి చెప్పాడు:


* **సత్త్వగుణం:** శమం, దమం, ఓర్పు, దయ, సత్యం, భక్తి. సత్త్వగుణం పెరిగితే ఊర్ధ్వలోకాలకు (దేవలోకం) వెళ్తారు.


* **రజోగుణం:** కోరిక, అహంకారం, కీర్తి దాహం, అసూయ, శ్రమ. రజోగుణం వల్ల మానవ జన్మలో సంసార బంధాలు ఏర్పడతాయి.


* **తమోగుణం:** కోపం, లోభం, ఆలస్యం, నిద్ర, హింస, భ్రమ. తమోగుణం వల్ల అధోగతి (నరక/పశు జన్మలు) కలుగుతుంది.


* **గుణాతీతుడు:** ఈ మూడు గుణాల ప్రభావానికి లోనుకాకుండా పరమాత్మను ఆశ్రయించిన భక్తుడు మాత్రమే గుణాతీతుడై భగవద్ధామాన్ని చేరుకుంటాడు.


**5. క్రియాయోగం – అర్చనా విధి / పూజా విధానం**


ఉద్ధవుని కోరికపై విగ్రహారాధనా క్రమాన్ని స్వామి వివరించాడు:


* భగవంతుని విగ్రహాలు ఎనిమిది రకాలు: రాయి, చెక్క, లోహం, మట్టి, రంగులతో గీసిన చిత్రం, ఇసుక, మనస్సుతో భావించే రూపం మరియు మణి.


* శుచియై ఆసనంపై కూర్చుని, ప్రాణాయామం చేసి, హృదయంలో స్వామిని ధ్యానించి, విగ్రహంలో పరమాత్మను ఆవాహన చేయాలి.


* పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యాలతో షోడశోపచార పూజ చేయాలి.


* హృదయపూర్వకమైన భక్తితో సమర్పిస్తే నీరైనా, చిన్న పత్రమైనా అమృతతుల్యంగా స్వీకరిస్తానని స్వామి అభయమిచ్చాడు.


**6. ఉద్ధవగీత ముగింపు & ఉద్ధవుని బదరికా ప్రయాణం**


శ్రీకృష్ణుని సమగ్ర ఆత్మబోధతో ఉద్ధవుని మోహం, దుఃఖం పటాపంచలయ్యాయి. పరమాత్మ పాదాలపై సాష్టాంగపడి కన్నీళ్లతో ప్రణమిల్లాడు* 

**అంతిమ ఆదేశం:** శ్రీకృష్ణుడు: *"ఉద్ధవా! నా ఈ ఉపదేశాన్ని హృదయంలో నిలుపుకుని వెంటనే బదరికాశ్రమానికి వెళ్ళు. అక్కడ అలకనందాతీరాన నర-నారాయణుల సన్నిధిలో తపస్సు చేసుకుంటూ జీవన్ముక్తుడవు కమ్ము"* అని ఆదేశించాడు.


**పాదుకల సమర్పణ:** శ్రీకృష్ణుడు తన పాదుకలను ఉద్ధవుని శిరస్సుపై ఉంచి అనుగ్రహించాడు. ఉద్ధవుడు ఆ పాదుకలను శిరస్సుపై ధరించి, శ్రీకృష్ణునికి ప్రదక్షిణ చేసి, విరహబాధతో కన్నీరు మున్నీరవుతూ బదరికాశ్రమానికి బయలుదేరాడు. అక్కడ పరమాత్మ బోధను నిరంతరం చింతిస్తూ బ్రహ్మీభూతుడయ్యాడు.


ఇంతటితో ఉద్ధవ గీత సంపూర్ణం. ఇది 12 అధ్యాయాల మహా జ్ఞాన రాశి, అందులో నాలుగు గింజలు మనం తీసుకోగలిగాం. నిత్యం ఉద్ధవ గీత అధ్యయనం చేసేవారికి ముక్తి తథ్యం అని స్వయంగా పరమాత్మ ఫలశ్రుతి చెప్పాడు . 


రేపు భాగవతంలో అతి కీలక ఘట్టాలు రాబోతున్నాయి, ఇక స్వామి పాదం భూమి మీద నుండి వైకుంఠానికి చేరుతుంది, ఎల్లుండితో భాగవతానికి మంగళాచరణం. మనసులో ఎలాగో ఉంది, ఇప్పటికి ఈ వేదిక పై ఎన్నో రాశాను కానీ, భాగవతం రాస్తుంటే మనసు పులకరించి పోయింది. 


మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఇలాగే చదువుకునే భాగ్యం మనకు ఇవ్వమని ఈరోజే గట్టిగా స్వామిని వేడుకుని రేపు కలుసుకుందాం.. శ్రీకృష్ణ శరణం మమ.


📝 **నేటి ముఖ్య విషయాలు:**


1. **మనోనిగ్రహమే సర్వస్వం:** భిక్షుగీత ద్వారా భాగవతం ఇచ్చిన సందేశం — మన సుఖదుఃఖాలకు బాహ్య వ్యక్తులు కారణం కాదు; మనస్సును జయిస్తే సమస్త లోకాన్ని జయించినట్లే.


2. **అనన్య భక్తి సౌలభ్యం:** కఠిన తపస్సులు, యోగాలు అందరికీ సాధ్యం కాకపోవచ్చు; కానీ భగవన్నామస్మరణతో కూడిన భక్తియోగం ప్రతి ఒక్కరికీ మోక్షాన్ని అందిస్తుంది.


3. **భగవత్పాదుకల రక్షణ:** ఉద్ధవుడు స్వామి పాదుకలను ఆశ్రయించినట్లే, భక్తుడు భగవంతుని చరణారవిందాలను పట్టుకుంటే సంసార సాగరాన్ని అలవోకగా దాటవచ్చు.


.....సశేషం

🙏🌹🙏


           *🌹సేకరణ🌹*

        🙏*న్యాయపతి*🙏 

           *నరసింహారావు*

పంచాంగం 11.09.2026 Friday,

  ఈ రోజు పంచాంగం 11.09.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష అమావాస్య తిథి భృగు వాసర పూర్వఫల్గుని నక్షత్రం సాధ్య యోగః నాగవం తదుపరి కింస్తుఘ్నం కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి : పాడ్యమి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।



ప్రతిపదార్థ:


 

మత్తః — నా కంటే; పర-తరం — ఉన్నతమైనది; న అన్యత్ కించిత్ అస్తి — వేరైనది ఏదియునూ లేదు; ధనంజయ — అర్జునా, ధనమును జయించేవాడా; మయి — నా యందే; సర్వం — సమస్తము; ఇదం — మనకు కనిపించే ఇవి; ప్రోతం — ఆధారపడి (దూర్చబడి) ఉన్నవి; సూత్రే — దారం పై; మణి-గణాః — పూసలు; ఇవ — లాగా.



తాత్పర్యము:


నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.



వివరణ :


సర్వోత్కృష్ట భగవానుడు శ్రీ కృష్ణుడు ఇక అన్నిటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త, మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదే విధంగా, జీవాత్మలు తమకు నచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే, అందరిని నిలబెట్టి సంరక్షించేది ఆయనే, మరియు ఆయన యందే అందరూ ఉంటారు. కాబట్టి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య

శక్తిర్వివిధైవ శ్రూయతే (6.8)


‘భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏమీ లేదు’


భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం, చాలా మంది మనస్సులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తుంది, వారు శ్రీ కృష్ణుడు పరమ సత్యము కాదని, కృష్ణుడికే మూలాధారమైన ఇంకేదో నిరాకార తత్త్వం ఉందని అనుకుంటారు. కానీ, ఈ శ్లోకంలో ఆయన, అర్జునుడి ముందు నిల్చొని ఉన్న తన యొక్క ఈ శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే, సర్వోన్నత సర్వోత్కృష్ట పరమ సత్యమని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రకారంగా, ప్ర-ప్రథమంగా జన్మించిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ క్రింది విధంగా స్తుతించాడు.


ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః

అనాదిరాదిర్ గోవిందః సర్వ కారణకారణమ్


(బ్రహ్మ సంహిత 5.1)


‘శ్రీ కృష్ణుడే పరమేశ్వరుడు; ఆయన సనాతనుడు (నిత్యుడు), సర్వజ్ఞుడు, మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది, అంతము లేనివాడు, అన్నిటికి మూలహేతువు, సర్వ కారణ కారకుడు’

10, సెప్టెంబర్ 2026, గురువారం

కర్ణాటక సంగీత క్లాసులు


విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లు, సంగీత ప్రియులు  సంగీతం నేర్చుకోవాలని అభిలాష పడే వారి కోసం ఆన్లైన్లో సంగీత క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది .

బాల బాలికలు ఈ క్లాసులు లో చేరవచ్చు .

మీరు మీ కుమార్తెను గాని మీకుమారుని గాని ఈ క్రాసులలో చేర్పించదల్చుకొనిన మీ ఫోను నెంబర్ తో లేక మీ ఈమెయిల్ ఐడి తో కింద కామెంట్ రూపంలో పేర్కొని వివరాల కోసం సంప్రదించగలరు.


మీరు రాసే కామెంట్ ఈ బ్లాగులో కనపడదు  పూర్తిగా గోప్యంగా ఉంచబడును .

అది కేవలం టీచర్ గారికి మాత్రమే చేరుతుంది కాబట్టి నిస్సందేహంగా మీరు వివరాల కోసం సంప్రదించండి.

మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో మీకు వివరాలు తెలుపబడును అదే విధంగా ఈమెయిల్ ఐడి ఇస్తే మేలు ద్వారా మీకు వివరాలు తెలుపబడును.

మీకు కర్ణాటక సంగీతం మీద ఏమైనా పట్టు ఉంటే దాని గురించిన వివరాలు కూడా తెలియజేస్తే  అనుగుణంగా  క్లాసులు ఏర్పాటు చేయబడును ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వివరాల కోసం సంప్రదించండి


ఆన్లైన్ క్లాసులు వాట్సాప్ ద్వారా నిర్వహించబడును

మూత్రద్వారంలో రాళ్లు

 మూత్రద్వారంలో రాళ్లు మరియు మూత్రంలో మంట నివారణ కొరకు అద్బుత యోగం -


 తుత్తురు బెండ చెట్టు అయిదు ఆకులు తీసుకుని వాటిని నలిపి పావులీటరు నీటిలో వేసి సగానికి మరగబెట్టి వడపోసి చల్లార్చి ఒక చెంచా కండచక్కెర కలిపి మూడు పూటలా తాగుతుంటే మూత్రంలో మంట తగ్గిపోయి రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటపడతాయి.



గమనిక - తుత్తురు బెండ చెట్లు పల్లె ప్రాంతాలలో విరివిగా దొరకును. పట్టణప్రాంతాలలో ఖాళి స్థలాల్లో విరివిగా లభించును. దీనిని ముద్రబెండ మరియు పిచ్చిబెండ అని కూడా అంటారు. 



9, సెప్టెంబర్ 2026, బుధవారం

వచ్చెననుచు బీపి వదల కుండా మాత్ర

  వచ్చెననుచు బీపి వదల కుండా మాత్ర

వేస్తె లైఫు లాంగు వేదనొచ్చు

చక్కబరచు యోగ చక్కనౌ హోమ్యోతొ

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: బీపీ హెచ్చుతగ్గులకు గురవ్వటం అనేది అందరి జీవితం లోనూ సహజమైన విషయం. కానీ తరచుగా అధిక రక్తపోటుకు గురౌతూ ఉంటే, అధిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ద్వారా నిరంతర సాధన చెయ్యాలి. అలాగే టీ, కాఫీ, టిఫిన్ లు మానేసి, ఉదయపు ఆహారంగా చద్దన్నం లేదా పెరుగన్నం తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు వరి అన్నం బదులు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తో చద్దన్నం, జావ చేసుకుని, పెరుగు కలిపి తీసుకోవాలి. కారాలూ, పచ్చళ్ళూ, మషాళాలూ తగ్గించుకోవాలి. కిడ్నీలో రక్తాన్ని శుద్ధి చేసే ఫిల్టర్లను 'నెఫ్రాన్లు ' అంటారు. అవి ఒక్కొక్క కిడ్నీలో దాదాపు పది లక్షల వరకూ ఉంటాయి. ఈ ఫిల్టర్ల తలలు టోపీలాగా ఉంటాయి. ఈ తలలపై ఉండే కణాలు "రెనిన్" అనే హార్మోన్ ను ఉత్పత్తి చేసి, రక్తం శుద్ధి అయ్యి, తిరిగి శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఆ మంచి రక్తంలో ఆ హార్మోన్ ను కలిపి పంపుతుంది. ఈ హార్మోన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కిడ్నీలోని ఫిల్టర్లు పాడైన వారికి ఈ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం కూడా అధిక రక్తపోటుకు కారణమౌతుంది. మానసికంగా, శారీరకంగా ఏర్పడిన సమస్యలను చక్కదిద్దడం మానేసి, రోజుకో బీపీ మాత్ర మింగేసి, బీపీ ని కంట్రోల్ లో పెట్టుకుంటూ, సమస్యలను దాచుకోవడం వలన, ఈ పనికిమాలిన టెంపరరీ మాత్రలను అదేపనిగా వాడటం వలన వాటిలోని రసాయనాల దెబ్బకు త్వరలో కిడ్నీలు పాడవ్వడం, గుండెపోటు కు గురవ్వడం, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, సెరిబ్రల్ హేమరేజ్ తో పక్షవాతానికి గురవ్వడం, కంటిలోని రక్తనాళాలు చిట్లి, దృష్టి దెబ్బతినడం, వెర్టిగో సమస్యతో తరచుగా తల విసిరి పడిపోవడం, ఇలా ఎన్నో సమస్యలకు గురౌతారు. బీపీ మాత్రలతో అనేక సంవత్సరాల పాటు బీపీ పేషెంట్ గా బ్రతుకుతూ సర్వ నాశనం అయ్యే బదులు హోమియో మందులు వాడుకుంటే కేవలం కొద్ది రోజులలోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, మీ అవయవాలను సైతం సైడ్ ఎఫెక్ట్స్ బారినుండి కాపాడుకోవచ్చు! ఏ సమస్య వచ్చినా దానికో టాబ్లెట్ వాడుకుంటూ, జీవితకాలం పాటు ఆ పేషెంట్ గా బ్రతకటమే నిజమైన వైద్యమని, అలా చేసేదే సైన్స్ అనీ, దానినే ఫాస్ట్ వైద్యమంటారనీ, ఈ పిచ్చి మెదళ్ళకు పచ్చిగా పట్టేసింది! వీళ్ళని ఈ భ్రమ నుంచి లాగడం భగవంతుని తరం కూడా కాదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)