తెలుగు పండిత కవులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
14, ఏప్రిల్ 2026, మంగళవారం
జీవిత సత్యాలు
*🙏శుభ మంగళవారం🌹Happy Tuesday 🙏*
*🤘జీవిత సత్యాలు🤟*
కలియుగ మహత్యం ఎలా ఉందంటే చెప్పులు షోరూముల్లో, పుస్తకాలు రోడ్లపై ఉంటాయి. కుక్కలు బంగ్లాలో, ఆవులు వీధుల్లో ఉంటాయి. పిల్లలు విదేశాల్లో, తల్లిదండ్రులు వృద్ధాశ్రమంలో ఉంటారు.
*👌నిత్య సత్యాలు✍️*
కలియుగ మహత్యం ఎలా ఉందంటే డబ్బు ఎక్కువ, ప్రేమ తక్కువ ఉంటుంది. చదువు ఎక్కువ, సంస్కారం తక్కువ ఉంటుంది. అందం ముఖ్యం అవుతుంది, ఆరోగ్యంపై నిర్లక్ష్యం ఉంటుంది..
ఈ ప్రశ్నకు బదులేది 20
ఈ ప్రశ్నకు బదులేది 20
ఈరోజు మన ప్రశ్న జ్యోతిష్యానికి సంబంధించింది.
నక్షత్రములు ఎన్ని ?
ఒక్కొక్క నక్షత్రమునకు ఎన్ని పాదములు ఉంటాయి ?
రాశులు ఎన్ని ?
ఒక్కొక్క రాశిలో ఎన్ని పాదాలు ఉంటాయి?
వివరంగా వివరించగలరు
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
గమనిక:: మీ జవాబును క్రింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రపంచం మొత్తం తినిపిస్తుంది
*సంపూర్ణ మహాభారతము
🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯
*సోమవారం 13 ఏప్రిల్ 2026*
``
*ప్రతిరోజూ*
*సంపూర్ణ మహాభారతము*
సరళ వ్యావహారిక భాషలో!
1️⃣9️⃣4️⃣
*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``
*సంపూర్ణ మహాభారతము*
*194 వ రోజు*
*విరాట పర్వము పంచమాశ్వాసము*
*అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట*```
అర్జునుడు ఎవరు మిగిలి ఉన్నారా అని చూడగా అక్కడ కర్ణుడు, ద్రోణుడు, కృపుడు నిలబడి ఉండటం చూసి అర్జునుడు “ఉత్తరకుమారా! రధాన్ని వారి వైపు పోనివ్వు” అన్నాడు.
అర్జునుడు తమవైపు రావడం చూసి అశ్వథ్థామ "కర్ణా! అర్జునుడు మన వైపు వస్తున్నాడు. అతనిని ఎదుర్కొని ఓడించ గలిగిన సమర్ధుడవు నువ్వే" అని కర్ణుని పరహాసంగా ముందుకు తోసాడు.
కర్ణుడు "నేను ఇప్పుడే అర్జునిని ఎదుర్కొంటాను చూడు" అన్నాడు.
అర్జునుడు కౌరవవీరులందరినీ మట్టి కరిపించాడు. ఒక్కొక్కరే వారంతా అలసిపోయి తొలగిపోయారు. ఇక్కడ ఉత్తరకుమారుని పరిస్థితి అలాగే ఉంది అతడు అర్జునితో "అర్జునా! నీవేమో అలుపు లేకుండా యుద్ధం చేస్తున్నావు. నాకు దాహం వేస్తోంది కనీసం నీళ్ళు త్రాగకుండా యుద్ధం చేయడమెలా? ఇక నేను సారధ్యం చేయలేను" అన్నాడు.
అర్జునుడు "ఉత్తర కుమారా! ఓపిక పట్టు ఇక సుయోధనుడు మాత్రమే మిగిలి ఉన్నాడు. అభిమానధనుడు నాతో యుద్ధానికి సిద్ధం ఔతున్నట్లు ఉంది. రథం నడపడంలో నీకు నేను సాయం చేస్తాను. భయపడకు" అన్నాడు.
సుయోధనుని వైపు రథాన్ని నడిపించాడు అర్జునుడు. అర్జునుడు ఆకలిగొన్న పులి వలె సుయోధనునిపై విరుచుకు పడ్డాడు. బదులుగా సుయోధనుడు అర్జునుని గుండెలపై రెండు బాణాలు వేసాడు. అర్జునిని నుదిటిపై రెండు బాణాలు వేసాడు సుయోధనుడు. వాటిని సునాయాసంగా విరిచి సుయోధనునిపై శరపరంపరను వేసాడు అర్జునుడు. సుయోధనునికి సాయంగా వికర్ణుడు ఏనుగు మీద ఎక్కి రాగా అర్జునుడు ఏనుగు కుంభ స్థలంపై పిడికిలితో కొట్టాడు.
ఆదెబ్బకు ఏనుగు కూలబడింది. వికర్ణుడు ఏనుగు మీద నుండి పడి పక్కనే ఉన్న వివిశంతి రథంపై ఎక్కాడు.
అర్జునుడు మరలా సుయోధనుని గుండెలను గురి పెట్టి పది బాణాలను వేసాడు.
సుయోధనుడు గాయపడ్డాడు. సాయంగా వచ్చిన వారందరిని అర్జునుడు గాయపరచగా విధి లేక సుయోధనుడు వెను తిరిగాడు.
అర్జునుడు సుయోధనుని తరిమాడు. అది చూసి కర్ణుడు భీష్మునితో
"అర్జునుడు తరుము కొస్తుండగా సుయోధనుడు పారి పోతున్నాడు. మనం అతనిని కాపాడాలి" అన్నాడు.
కర్ణుని మాటలను భీష్మ , ద్రోణ, కృపాచార్యులు లెక్కచెయ్యలేదు. సుయోధనుడు దీనంగా "అదేమిటి ఇలా ఒంటరిగా రాజైన నన్ను వదిలి పోవడం ధర్మమా? రాజైన నేను పరాజయం చెందుతున్నప్పుడు నన్ను ఆదుకోవడం మీ ధర్మం కాదా?" అన్నాడు.
అందరూ సుయోధనుని మాటలకు ఆగారు. భీష్ముడు సుయోధనుని ఓదార్చాడు. అర్జునుడు సుయోధనుని చూసి "ఏమిటి సుయోధనా ! అలా పారి పోతున్నావు. ఇది క్షత్రియ ధర్మమా? నేను ఒక్కడిని కుంతీ పుత్రులలో చిన్న వాడిని ఒంటరిని నీవో గాంధారి పుత్రులలో అగ్రజుడవు అపార సేనా వాహినితో వచ్చావు మిత్రులు సాయం ఉన్నారు ఇలాంటి నీవు ఇలా పారిపోతే సాటి వారు ఎగతాళి చేయరా? కౌరవేశ్వరా ఇక నీవు హస్థినాపురంలో ఏనుగు మీద ఎలా ఊరేగగలవు. మణిమయ భూషణములు ధరించి నిండు సభలో ఎలా సింహాసనాధిష్టుడివి కాగలవు? కర్పూర చందన సుగంధ ద్రవ్యాలను సేవిస్తూ భోగభాగ్యములను ఎలా అనుభవించగలవు? సుందరీ మణులతో ఎలా క్రీడించగలవు? సుయోధనా నా మాట విను యుద్ధమున మరణిస్తే స్వర్గ సుఖాలు; గెలిస్తే ఇహలోక సుఖాలు అనుభవించవచ్చు కాని వెను తిరిగి పారిపోవండం తగునా? ఇది రణరంగం. జూదం ఆడి గెలుచుట సాధ్యం కాదు. నీలాటి రారాజు పారి పోవడమేమిటి చీ సిగ్గుగా లేదా?" అని అధిక్షేపించాడు.```
*(సశేషం)*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
*🌹14ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *మంగళవారం*🍁
*🌹14ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*సౌర/తమిళ సంవత్సరాది*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : ద్వాదశి* రా 12.12 వరకు ఉపరి *త్రయోదశి*
*వారం : మంగళవారం* (భౌమవాసరే)
*నక్షత్రం : శతభిషం* సా 04.06 వరకు ఉపరి *పూర్వాభాద్ర*
*యోగం : శుక్ల* సా 03.40 వరకు ఉపరి *బ్రహ్మ*
*కరణం : కౌలువ* మ 12.46 *తైతుల* రా 12.12 ఉపరి *గరజి*
*సాధారణ శుభ సమయాలు:*
*మ 12.00 - 01.00 సా 04.30 - 06.00*
అమృత కాలం : *ఉ 08.53 - 10.29*
అభిజిత్ కాలం : *ప 11.43 - 12.33*
*వర్జ్యం : రా 10.18 - 11.51*
*దుర్ముహూర్తం : ఉ 08.23 - 09.13 రా 10.58 - 11.44*
*రాహు కాలం : మ 03.15 - 04.49*
గుళికకాళం : *మ 12.08 - 01.41*
యమగండం : *ఉ 09.00 - 10.34*
సూర్యరాశి : *మీనం/మేషం*
చంద్రరాశి : *కుంభం*
సూర్యోదయం :*ఉ 06.01*
సూర్యాస్తమయం :*సా 06.32*
*ప్రయాణశూల : ఉత్తర దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.53- 08.23*
సంగవ కాలం :*08.23 - 10.53*
మధ్యాహ్న కాలం :*10.53 - 01.23*
అపరాహ్న కాలం :*మ 01.23- 03.53*
*ఆబ్ధికం తిధి :చైత్ర బహుళ ద్వాదశి*
సాయంకాలం :*సా 03.53- 06.23*
ప్రదోష కాలం :*సా 06.23 - 08.41*
రాత్రి కాలం :*రా 08.41 - 11.44*
నిశీధి కాలం :*రా 11.44 - 12.30*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.20 - 05.06*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🍁శ్రీ ఆంజనేయ శ్లోకం🍁*
*రామరిణా కృతహృతౌ జనకాత్మజాయా*
*లంకాస్థితా జనకజేతి సుశోధకారిన్*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
*శ్రీ మహావిష్ణు పురాణం*
🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*సోమవారం 13 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *56వ భాగం*``
*వామనావతారం*
బలి చక్రవర్తి మూడు అడుగుల దానం -
వామనుడు బలిని సుతలానికి పంపి స్వర్గలోకం ఇంద్రునికి అప్పగించుట..```
వామనుడు జగత్తు అంతా ఆశ్చర్యం, ఆనందంగా చూస్తుంటే నడుస్తూ
బలి చక్రవర్తి యాగ ప్రదేశానికి చేరుకున్నాడు.
తేజస్సుతో ప్రకాశిస్తూ వస్తున్న బాల వటువుని చూసి యాగశాలలో అందరు విష్ణువో శివుడో సూర్యుడో లేక అగ్నిదేవుడో బాలకుని రూపంలో వస్తున్నాడని అనుకున్నారు.
ఋషులు, మహర్షులు, ఋత్వికులు, అతిథులు, రాజ భటులు
ఆ వామన మోహన రూపం చూసి ఆనందం చెందుతున్నారు. ఎవ్వరు ఆపటం లేదు, అడగటం లేదు. వామనుడు మోహన రూపంతో, ముద్దు ముద్దు మాటలతో అందరిని పలకరిస్తూ, నవ్వ్వుతూ ముందుకు వెళ్ళాడు.
బలి చక్రవర్తి బాలవటువుని చూసి విస్మయం చెందాడు. ‘భగవంతుడే
ఈ రూపంలో రాలేదు కదా?’ అని అనుకున్నాడు. వామనుడు
తన లేత చేతులతో బలిని ఆశీర్వదించాడు.
బలి చక్రవర్తి సతీమణి వింధ్యావళి బాల వటువుని చూసి ముచ్చటపడి దగ్గరకు తీసుకుంది. దంపతులిరువురు వామనుని సింహాసనం మీద కూర్చోబెట్టి బంగారు పళ్లెంలో పాదాలుంచి, వింధ్యావళి నీరు పోస్తుంటే పాదాలు కడిగి నీళ్ళు నెత్తిన చల్లుకున్నారు. మెత్తటి వస్త్రంతో పాదాలు తుడిచి శుభ్రపరిచాడు.
రాక్షస గురువు శుక్రచార్యుడు యజ్ఞస్థలి నుంచి అప్పుడే వచ్చి బలి దంపతుల చేత పూజించ బడుతున్న వామనుని చూసాడు. బాలుని దివ్య తేజస్సు చూడగానే అనుమానం వచ్చింది. బాలుని రూపంలో విష్ణువు బలి చక్రవర్తిని మోసం చేయడానికి వచ్చి ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి" అని వామనుని గమనించసాగాడు.
బలి చక్రవర్తి వామనునితో.. "బాల బ్రాహ్మణా! బ్రహ్మతేజస్సుతో ప్రకాశిస్తున్న నీ ఆశీస్సులు పొంది నా జన్మ ధన్యమైంది. ఎవరు నీవు? ఎక్కడ నుంచి వచ్చావు? నీవేమి అడిగినా దానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ధనమా, గోవులా, బంగారమా, రత్నాలా, భూములా లేక వేరే ఏమన్నా మనస్సులో ఉంటే చెప్పుము. తప్పక ఇస్తాను" అన్నాడు.
బాల వటువు నవ్వుతూ "నా నామధేయం వామనుడు. బాల బ్రహ్మచారిని. అందరు నా వాళ్లు అయినా నేను మాత్రం ఒంటరి వాడిని. ఒక చోట ఉండక విశ్వమంతా తిరుగుతుంటాను. నాకు ధన సంపదలు వస్తు వాహనాలు స్వర్ణ రత్నాదుల పై మోజు లేదు. అయినా మంచివాడవైన నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక్క చిన్న కోరిక కోరుతాను. ఇదే నా తొలి మరియు తుది కోరిక. సాధ్యమైతే ఇవ్వు లేదన్నా పర్వాలేదు. నాకు మూడు అడుగుల నేల దానంగా ఇవ్వు! చాలు" అని కోరాడు.
బలి చక్రవర్తికి వామనుడి కోరిక విని నవ్వు, కోపము రెండూ వచ్చాయి. "ముల్లోకాల చక్రవర్తినైన నన్ను మూడు అడుగుల నేల అడుగుతావా? దాత గొప్పదనాన్ని గమనించి అడగాలి అని తెలియదా! నీ కోరిక వినడానికే సిగ్గుగా ఉంది" అన్నాడు.
వామనుడు నవ్వుతూ "నీవు సర్వస్వం అడిగినా ఇవ్వగల మహాదాతవని నాకు తెలుసును! కానీ నేను బాలుడిని! బ్రహ్మచారిని. నాకు మూడడుగుల నేల దానం చాలు. సరిపోతుంది" అని అన్నాడు.
వామనుడి వింత కోరిక విన్న శుక్రచార్యుడికి అనుమానం బలపడింది. వచ్చింది విష్ణువే అనుకుని బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి "రాజా! విష్ణువే ఈ బాల వటువు రూపంలో వచ్చాడు. మూడు అడుగులు నీవు దానమిస్తే ముల్లోకాలు ఆక్రమిస్తాడు. దానం ఇవ్వవద్దు" అని హెచ్చరించాడు.
బలి చక్రవర్తి తిరస్కరిస్తూ "ఆచార్యా! మూడు అడుగులు నేల దానమివ్వలేని అసమర్థుడు అనే చెడ్డ పేరు నాకు వద్దు. మీరన్నట్టు శ్రీహరే ఈ రూపంలో దానమడిగితే అది నాకు గౌరవం, గొప్పదనం తెస్తుంది. భగవంతునికే దానమిచ్చిన దాతగా నా పేరు చిరస్థాయిగా నిలుస్తుంది" అనడంతో శుక్రచార్యుడు కోపగించి "గురువు మాట కాదన్నందుకు రాజభ్రష్టుడివి అవుతావు" అని పలికాడు.
అయినా దానమాపడానికి శుక్రచార్యుడు ఆఖరి ప్రయత్నంగా బలి వామనునికి దానమివ్వడానికి నీరు పోసే కమండలంలో సూక్ష్మరూపంతో నీరు పడకుండా అడ్డుగా నిలిచాడు.
వామనుడు గమనించి దర్భపుల్లతో లోపలికి పొడిచాడు. అది శుక్రచార్యుడి కన్నుకి గుచ్ఛుకుంది. బాధతో అరుస్తూ మాయమయ్యాడు. నాటి నుండి శుక్రచార్యుడు ఒక కన్ను పోయి ఒంటి కన్నుతో జీవించాడు.
బలి చక్రవర్తి మూడడుగుల నేలను శాస్త్రోక్తంగా వామనుడి చేతిలో నీరు పోస్తూ దానమిచ్చాడు. మరుక్షణం అద్భుత సంఘటన జరిగింది. బలి చక్రవర్తి, అక్కడి వారు ఆశ్చర్యంగా చూస్తుండగా వామనుడు తన శరీరం పెంచి త్రివిక్రముడు అయ్యి ఆకాశం అంచులు తగిలేంత ఎత్తుకి ఎదిగాడు. ఒక పాదముతో భూమిని, మరొక పాదముతో ఆకాశాన్ని ఆక్రమించాడు.
బలిని చూసి “నీ విచ్చిన మూడడుగులలో రెండు అడుగులకు భూమి ఆకాశం సరిపోయాయి. మరి నా మూడో అడుగుకి నేల ఎక్కడ ఉంది?" అని అడిగాడు.
బలి చక్రవర్తి మోకాళ్ల పైనుంచుని నమస్కరిస్తూ "బ్రాహ్మణ దేవా! నీవు మహావిష్ణువు అని తెలుసుకున్నాను. అయినా నేను ఇచ్చిన మాట తప్పను.
నీ మూడో అడుగు నా శిరస్సు పై ఉంచుము" అని తల వంచాడు.
బలి చక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు అక్కడకు వచ్చి "నారాయణా! నా మనవడు బలి నీ భక్తుడు. నీవే ఇంద్రపదవి ఇచ్చావు. ఇప్పుడు మరల నీవే తీసుకుంటున్నావు. పదవితో వచ్చిన అహంకారాన్ని తొలగించి కరుణించుము" అని ప్రార్ధించాడు.
బలి చక్రవర్తి అర్థాంగి వింధ్యావళి పతి భిక్ష పెట్టమని ప్రార్ధించింది.
త్రివిక్రముడు నారాయణుడు బలి చక్రవర్తి సత్య సంధతను ప్రశంసిస్తూ "బలి చక్రవర్తీ! నీవు నా ప్రియభక్తుడవి. మూడో అడుగు నీ శిరస్సు పై ఉంచి నిన్ను సుతలానికి పంపుతాను. అక్కడ నీకు సంరక్షణగా ఉండి రక్షిస్తాను. స్వర్గము కన్నా సుఖమైన సుతలంలో సుఖంగా జీవించుము. భవిష్యత్తులో సావర్ణి మనువు కాలంలో నీకు ఇంద్రపదవి మరల లభిస్తుంది. ఆ తరువాత నీవు నా సన్నిధికి చేరుకుంటావు" అని బలిని తన పాదము అతని శిరస్సు పై ఉంచి పాతాళలోకమైన సుతలానికి పంపివేశాడు.
ఇంద్రాదులకు స్వర్గలోకం ఇచ్చి వేశాడు. వామనావతార ఉద్దేశం నెరవేరడంతో నారాయణుడై వైకుంఠం చేరుకున్నాడు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
సుందరకాండ మహిమ!*
*చాగంటివారి...*
*సుందరకాండ మహిమ!*
```
ఎక్కడెక్కడ రామకథ చెప్పబడుతుందో అక్కడక్కడ స్వామి హనుమ అందరి కన్నా ముందు వచ్చి కుర్చుంటారు.
ఎక్కడెక్కడ రామ కథ చెప్పడం పూర్తవుతుందో అక్కడ అందరి కన్నా చిట్టచివర్న బాధపడుతూ, వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తారు.
అందుకే, ప్రత్యేకించి ‘సుందరకాండ ఎక్కడ చెప్పబడుతుందో అక్కడకి హనుమ వస్తారు’ అని అంటారు.
కారణం ఏమంటే శ్రీ రామాయణంలో - మిగిలిన ఏ కాండలోనూ లేని అద్భుతం ఒక్క సుందరకాండలోనే వుంది.
సుందర కాండలో రామ కథ ఒకటికి పదిమార్లు చెప్పబడుతుంది.
హనుమ చెప్పేటప్పుడు ఎక్కడ ఎప్పుడు ఎంత రామకథ చెప్పాలో అంతనే చెబుతారు.
రామకథ కున్న బలమేమిటో, రామ నామానికున్న బలమేమిటో నిరూపించిన కాండ సుందరాకాండ!
అందుకే సుందరాకాండ బహుభంగిమల సుందరకాండ.
ఎన్ని కోణాలలో చూడండీ, అదంతా సుందరమే!
ఒక పాత్ర నిండా పాయసం తీసుకొచ్చి అక్కడ పెడితే, అడుగున వున్నది పాయసమా, మధ్యన వున్నది పాయసమా, పైనున్నది పాయసమా అని అడిగితే ఏం చెప్పవలసి వుంటుంది? - అంతా పాయసమే. - అలాగే, సుందరాకాండని ఎటు వైపునించి చూడండి అంతా సౌందర్యమే.
రామాయణంలో ఒక్క సుందరకాండకొచ్చే సరికి, మహర్షి ఒక గొప్ప ప్రయోగం చేసారు.
ఇందులో చాలా శ్లోకములు శ్లోకములు
కావు. చాలా శ్లోకములు మంత్రములే.
అందుచేతనే, అప్పటికీ ఇప్పటికీ సుందరకాండ శక్తి ఏమిటంటే...
```
*పిల్ల పెళ్ళవలేదు...*
*సుందరకాండ చదువుకోండి!*
*పిల్లాడికి ఉద్యోగం రాలేదు...*
*సుందరకాండ చదువుకోండి!*
*ఆరోగ్యం బాలేదు...*
*సుందరకాండ చదువుకోండి!*
*ఏమిటో భయంగా వుంటోంది...*
*సుందరకాండ చదువుకోండి!*
*భీతి కలిగింది...*
*సుందరకాండ చదువుకోండి!*
*ఏ కష్టం కలగనీండి...*
*సుందరకాండ చదువుకోండి!*
```
ఫలితం వుంటుందని నమ్ముతారు భక్తులు.
ఎందుకనంటే - లోకంలో ఇంత శక్తిమంతమైనవి రెండే రెండు సాహిత్యంలో వున్నాయని చెబుతారు పెద్దలు.
ఈ రెండూ కాకుండా మూడో అంకె వేసి చెప్పడానికి ఇంక లేదు.
ఆ రెండూ ఏమిటంటే
ఒకటి- సుందరకాండ,
రెండు- సౌందర్య లహరి.
మూడు ఇక లేదు!
రెండూ సౌందర్యము, సుందరము
ఆ పర్యాయ పదాలతోటే వుంటాయి.
రామానుగ్రహాన్ని ప్రసాదించే శక్తి సుందరకాండలో వుంది!
-బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వరరావుగారు.
```
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
13, ఏప్రిల్ 2026, సోమవారం
ఈ ప్రశ్నకు బదులేది 19
ఈ ప్రశ్నకు బదులేది 19
ఈరోజు మన ప్రశ్న ఆధ్యాత్మికత కు సంబంధించింది.
ఉపనిషత్ అనగా ఏమిటి ?
మొట్టమొదటిసారిగా వెలువడిన ఉపనిషత్తు పేరు ఏమిటి?
అందులోని మొదటి మంత్రము ఏమి చెబుతున్నది
మీకు నచ్చిన ఉపనిషత్తు ఏది?
వివరంగా వివరించగలరు
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
భగవంతుడు - పూజ - ధ్యానము*
*భగవంతుడు - పూజ - ధ్యానము*
సభ్యులకు నమస్కారములు.
1) *సామాన్య భక్తి*
భక్తి అనగానే ఆ పరమాత్మను పువ్వులతో పూజచేసి, నారికేళాలు, కదళి ఫలాలు అర్పించి తీర్థ ప్రసాదాలు పంచుకుని ఆరగించడం. *కాని, సర్వమూ భగవద్రూపమే* అన్న విశ్వాసాన్ని పెంచుకోవాలంటే ఎన్నో మార్గాలు
2) *బద్నాతి ప్రీతిమితి బంధుః*
భగవంతుడు జీవులకు సర్వ విధ బంధువు.
3) *ప్రీతి పూర్వ మను ధ్యానం భక్తి రిత్యాభిధియతే*.
ప్రీతి (సంతోషము, ఇష్టము) తో నిరంతరము భావన చేస్తే, ఆ భావన సంపూర్ణ భక్తి అనబడుతుంది. తద్వారా మనకు భగవత్ అనుభవం కలుగుతుంది. భగవత్ పూజలు, ధ్యానము మ్రొక్కుబడిగానో, భయం చేతనో, కోరికలతో లేక ప్రేరణలతో చేయకుండా, ఇష్టముగా, మనః స్పూర్తిగా సంతృప్తి మరియు సంతోషాలతో చేయవలసి ఉన్నది, ఉంటుంది. ప్రార్థన లేక పూజ పూర్తి విశ్వాసము, ఇష్టము మరియు సంతోషములతో చేస్తే భగవంతుడిని కరిగిస్తుంది. భక్తులకు ధర్మాన్ని, బలాన్ని మరియు శుభాలను అందజేస్తుంది.
4) *ఉపచారాపదేశేన్ కృతాన్ హర హర్మయా,*
*అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ*
స్వామీ పురుషోత్తమా నీకు ఉపచారములు, పూజలు చేసే నెపంతో, ప్రతి రోజు నేను చేసే అపకారములను మన్నించి క్షమించగలవు. భక్తులు ప్రతి రోజు *పూజ లేక భగవత్ ధ్యానము తదుపరి, భగవంతుని పై విధంగా వేడుకొనుట ఒక మర్యాద మరియు సంస్కారము*.
5) *యోగ కర్మ సుకౌశలమ్*
అంటే సంసారిక జీవనాన్ని అర్థం చేసుకుని, ఇందులో చిక్కుకొనని విధంగా, సర్వ విధ ప్రవృత్తుల్ని, చాలా మెళుకువతో, కౌశల పూర్ణంగా కొనసాగించడం.
పైన తెల్పిన గీతా వచనం బాగా అవగాహనలో ఉండటమే గాక ఆచరణలో ఉండడం గూడా మహానుభావుల విశేష లక్షణం. వీరికి తాము చేసే సంసారిక వ్యవహారాలన్నీ, తమకు అంటకుండా ఉండేలా చేసే విధానం పట్ల అవగాహన ఉన్నదను విషయం స్పష్టం. ఏమిటా అవగాహన.... చేసే ఏ కర్మైనా భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నాం తప్ప, వ్యక్తిగత ప్రయోజనానికి కాదన్న భావన దృఢంగా ఉంటుంది. *అందువలననే తాము చేయవలసిన ధార్మిక, సమాజ హితకర పనులను ఎట్టి అవాంతరాలు ఏర్పడినా భయంతో మానడమొ లేక వైరాగ్య భావనతో పూర్తిగా విడిచి పెట్టడమొ చేయరు*. శాస్త్రం విధించిన సత్కర్మలు చెసి, ఫలాన్ని పరమాత్మకు విడిచిపెడతారు. ఈలా వివేచనతో కర్మాచరణ సాగించడమే వీరి విశిష్టత.
ధన్యవాదములు
*శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం*
*శ్రీ రామానుజ జయంతి* *22.04.2026, బుధవారం*
*అద్వైతం అంటే రెండుగా లేకపోవడం. విశిష్టాద్వైతం అంటే ఒక్కటిగా ఉండేందుకు ప్రకృతిని ఉపాయంగా చేసుకోవడం.* *రామానుజాచార్యులు విశిష్టాద్వైతాన్ని ప్రవచించారు. శరణాగతి ద్వారా ఎవరైనా పరమాత్మను చేరుకుని, ఆయనతో ఒక్కటిగా కలిసి ఉండవచ్చని తెలిపారు. భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని, మోక్షం పొందడానికి ఎవరైనా అర్హులేనని చాటి చెప్పారు.* *ఒకనాడు రామానుజుడు లేకపోతే, ఈ నేలపై విగ్రహాలతో కూడిన ఆలయాలు లేవు. అనేకానేక ఆరాధనా పద్ధతులూ లేవు. ఈనాడు రామానుజుని స్ఫూర్తి మనలో లేకుంటే, సనాతన ధర్మనిష్ఠకు అర్థం లభించదు. ఆచరణ సాధ్యం కాదు...*
*వేయి సంవత్సరములకు పూర్వమే…*
*మహోన్నతమైన మంత్రాన్ని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన సంఘసంస్కర్త వారు...!!!*
*సామాజిక వైషమ్యాలు ఎగచిమ్ముతున్న సమయంలో సమత్వ దృష్టితో, ప్రజలను “మనమంతా ఒక్కటే”నని మమైకం చేసినవారు.*
*వారు ప్రపంచాన్ని వసుదైవ కుటుంబంగా భావించి ఎన్నో అద్భుతమైన సంస్కరణలు చేసి ఆదర్శమయ్యారు.*
*ఒక దేశంలో ఉగ్రవాదం. ఒక దేశంలో వర్ణ వివక్ష. ఒక దేశంలో తీవ్ర దుర్భిక్షం. ఒక దేశంలో ఆటవిక న్యాయం. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రతి సమస్యకూ, మానవాళిని కలవరపెడుతున్న ప్రతి సంక్షోభానికి.. శ్రీమత్ రామానుజాచార్యుల బోధనలో పరిష్కారం ఉంది.*
*శేషావతార రూపమశేషజనౌఘాఘహరణచరణాబ్జమ్ శ్రీభాష్యకార మమలం కలయే రామానుజం కృపాసింధుమ్*
*సముద్రమంత తన అపార కరుణ చేత అశేష జనుల పాపాలను హరించడానికి… శ్రీమన్నారాయణుని శయ్య అయిన ఆదిశేషుడే…. భగవద్రామానుజులుగా, శ్రీభాష్యకారులుగా రూపమెత్తాడు. ఆయన చరణారవిందాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.*
