15, మే 2026, శుక్రవారం

శనివారం🍁* *🌹16, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁శనివారం🍁*

  *🌹16, మే, 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                  


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : అమావాస్య* రా 01.30 ఉపరి *అధిక జ్యేష్ఠ మాసారంభః*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : భరణి* సా 05.30 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం : సౌభాగ్య* ఉ 10.26 వరకు ఉపరి *శోభన*

*కరణం  : చతుష్పాద* మ 03.22 నాగ రా 01.30 ఉపరి *కింస్తుఘ్న*

*సాధారణ శుభ సమయాలు*

            *-ఈరోజు లేవు-*       

 అమృత కాలం  : *మ 01.15 - 02.40*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : శేషం ఉ 06.10 & రా.తె 04.01 - 05.25 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 05.37 - 07.20* 

*రాహు కాలం  :ఉ 08.50- 10.27*

గుళికకాళం      : *ఉ 05.37 - 07.13*

యమగండం    : *మ 01.41 - 03.18*

సూర్యరాశి : *వృషభం*                    

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.44*  

సూర్యాస్తమయం :*సా 06.41*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:* 

ప్రాతః కాలం   :  *ఉ 05.37 - 08.12*

సంగవ కాలం    :*08.12 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.56*

*ఆబ్ధికం తిధి  :వైశాఖ అమావాస్య*

సాయంకాలం    :*సా 03.56 - 06.31*

ప్రదోష కాలం       :*సా 06.31- 08.44*

రాత్రి కాలం         :*రా 08.44- 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     *🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*హరే వేంకటేశ ప్రసీద ప్రసీద* 

*ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


        *🍁హనుమకృత🍁*

   *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*కౌసల్యా గర్భ సంభూతం* 

*వేదిగర్భోదితం స్వయం !*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><>><


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం


        *శ్రీ మహావిష్ణు పురాణం*                                       

                 *89వ భాగం*


*నరనారాయణ అవతారాలు*```


బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరు కోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు. తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు.


కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దరు కుమారులుగా జన్మించాడు. ధర్మదేవత ధర్ముడి పుత్రులైన నరనారాయణులు వేద విద్యలతో పాటు అధర్వణ వేదంలోని యుద్ద విద్యలు అభ్యసించారు. బ్రహ్మదేవుడు నరుడికి 'అజగవము' అనే ధనుస్సు, నారా యణుడికి 'శార్ఞగము" అనేధనుస్సు అక్షయ తూణీరాలతో ప్రసాదించాడు.


నరనారాయణులు తపోదీక్ష స్వీకరించి హిమాలయాలలోని బదరికావనానికి వెళ్లి తపస్సు చేయసాగారు. బదరికావృక్షములతో నిండి ఉండటం చేత ఆ వనానికి బదరికావనం అని పేరు వచ్చింది. బదరికాశ్రమం ఏర్పరచుకుని నరనారాయణులు లోకంలో ధర్మ సంస్థాపనకై చేస్తున్న తపస్సు కి వేయి సంవత్సరాలు గడిచాయి.


హిరణ్యకశిప సంహారం తరువాత రాజైన ప్రహ్లాదునికి చ్యవన మహర్షి ద్వారా సంవత్సరాల తరబడి ధర్మ సంస్థాపనకై తపస్సు చేస్తున్న మహర్షులు ఉండే ప్రదేశాలైన నైమిశారణ్యం, బదరికావనం గురించి విన్నాడు. యజ్ఞ యాగాదులతో, నిరంతర తపస్సులతో తపోభూములుగా ప్రసిద్ధికెక్కిన రెండు పుణ్యస్థలాలను దర్శించాలని బయలుదేరాడు.


మొదట నైమిశారణ్యం చేరిన ప్రహ్లాదుడు అక్కడి మహర్షులను దర్శించి ఆశీస్సులు పొందాడు. వారి ద్వారా నరనారాయణుల గురించి విని బదరికావనం బయలుదేరి వెళ్లాడు. బదరికాశ్రమంలో నిశ్చల ధ్యానంలో ఉన్న నరనారా యణులను దర్శించాడు. నారవస్త్రాలు ధరించి కృష్ణాజినాలపై తపస్సులో ఉన్న నర నారాయణుల ముందు ధనుస్సులు, అక్షయ తూణీరాలు (బాణాలు) ఉండటం గమనించి విస్మయం చెందాడు.


తపస్సు చేసేవారి వద్ద ఆయుధాలు ఉండటం ధర్మవిరుద్ధం అని భావించి ప్రహ్లాదుడు వారితో "నరనారాయణులారా! బ్రహ్మ వంశస్థులు, బ్రాహ్మణులైన మీరు మీ వర్ణాచారం ప్రకారం తపస్సు చేయాలి. మరి ఈ ధనుస్సులు బాణాలు ఎందుకు చేపట్టారు? ధర్మదేవత ధర్ముడి పుత్రులైన మీరు అధర్మంగా ఆయుధాలు చేపట్టడం తప్పు. ధర్మదేవత పుత్రులే అధర్ములైతే నేను సహించను. మీరు ఆయుధాలను తక్షణం వదిలేయండి" అని హెచ్చరించాడు.


నరుడు నవ్వి "ప్రహ్లాద మహారాజా! ధర్మ పరిరక్షణ కూడా బ్రాహ్మణుల విధ్యుక్త ధర్మంలో భాగము అని మీకు తెలియదా! వేదశాస్త్రాలతో పాటు యుద్దవిద్యలు మీవంటి వారికి నేర్పించేది మేమే అని మరచిపోయారు. సమస్త విద్యలకు ఆచార్యులమైన మేము తపస్సు చేయడానికి, ధనుస్సు ధరించడానికి అర్హులం, సమర్ధులం. అనవసర ప్రసంగం మాని మీరు మీ దారిన వెళ్ళండి" అని అన్నాడు.


మహావిష్ణువు ప్రియ భక్తుడైన ప్రహ్లాదునికి నరుడు చులకనగా మాట్లాడేసరికి ఆగ్రహం వచ్చింది. "మీరు మాతోటి యుద్దంచేయగల సమర్థులా? రండి!తేల్చుకుందాం" అని నరనారాయణులతో యుద్దానికి దిగాడు. 


సరేనని నరనారాయణులు ధనుస్సులు ధరించి యుద్దానికి దిగారు.


ప్రహ్లాదుడు, నరనారాయణుల మధ్య భీకర ధనుర్యుద్ధం మొదలైంది. బాణాలు శరపరంపరలుగా కురిశాయి. ఆకాశం బాణాలతో కమ్ముకుపోయింది. నారాయణుని ప్రియభక్తునికి, నారాయణుని అంశావతారాలైన నరనారాయణులకు నూరు సంవత్సరాలు యుద్దం జరిగింది. ప్రశాంత వాతావరణం కలిగిన బదరికావనం ధనుష్టంకార ధ్వను లతో, బాణాల శబ్దాలతో దద్దరిల్లి పోయింది.


తాపసులందరు యుద్దం ఆపేలా చేయమని వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుని ప్రార్ధించారు. మొరలాలకించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ప్రహ్లాదుడు, నరనారాయణులు యుద్దం ఆపి నారాయణునికి నమస్కరించారు. నారాయణుడు ప్రహ్లాదుని చూసి


"ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశావతారులుగా జన్మించారు. జితేంద్రియులైన వీరు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం జన్మించబోయే అవతార మూర్తులుగా ఉండటానికి ఈ జన్మలో ధనుర్విద్యలు అభ్యసించి ధను ర్భాణాలు ధరించారు. ఈ జన్మ లో తపస్సుతో, వచ్చే జన్మలో శస్త్రాస్త్రాలతో ధర్మ ప్రతిష్టాపన చేస్తారు. కనుక నా అవతార మూర్తులతో యుద్దం తక్షణం విరమించు! అపజయం అని భావించక యుద్ద విరమణ చేసి నీ రాజ్యానికి వెళ్లుము" అని ప్రబోధించాడు.


ప్రహ్లాదుడు నారాయణునితో పాటు నరనారాయణులకు నమస్కరించి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. నరనారాయణులు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి "శ్రీమన్నారాయణా! నీవు "బదరీనాథుడు" గా ఇక్కడ స్వయంభువు మూర్తిరూపంలో వెలసి భక్తులకు నీ సుందర విగ్రహ దర్శనం కలిగించుము" అని ప్రార్ధించారు.


శ్రీహరి వారి ప్రార్థనకి సంతోషించి "నేను బదరీనాథుడిగా స్వయంభువునై ఇక్కడ అవతరిస్తాను. మీరు మీ జన్మాంతమున నాకు ఇరు వైపులా నర-నారాయణ పర్వతములుగా వెలసి నన్ను దర్శించే భక్తులను రక్షిస్తుంటారు. కలియుగాంతం వరకు ఈ ప్రదేశం బదరీనాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంటుంది" అని వరమిచ్చి వెలిసాడు. 


నరనారాయణుల తో జరిగిన యుద్దంలో ప్రహ్లాదుడు పరాజయం పొందాడని తెలిసి ఇంద్రుడు ఆందోళన చెందాడు. నరనారాయణులు స్వర్గాధిపత్యం కోసం తపస్సు చేస్తున్నారని భావించి భంగం చేయడానికి రంభ తిలోత్తమ మేనకాది అప్సరసలను రతీ మన్మథుల వెంట పంపాడు.


మన్మధుడు తన మాయతో బదరికావనంలో వసంత ఋతువు వచ్చేటట్టు చేసాడు. మన్మథ బాణాలు ప్రయోగించి మునులందరిని మన్మథవికారానికి గురి చేసాడు. రంభాది పద హారు వేల అప్సరసలు శృంగార నృత్యాలు చేస్తూ మునులకు తపోభంగం చేయసాగారు. నారాయ ణుడు కన్నులు తెరచి వారందరిని ఇంద్రుడు ఎందుకు పంపించాడో గ్రహించాడు. రంభాది అప్సరసల కన్నా సుందరమైన అప్సరసను సృష్టించి గర్వభంగం చేయాలని తన ఊరువుని (తొడను) గట్టిగా చరిచాడు.


రంభాదులను మించిన అద్భుత సౌందర్యరాశి నారాయణుని ఊరువుల నుండి ఉద్భవించింది. ఊరువుల నుండి పుట్టింది కాబట్టి "ఊర్వశి" అనే నామం పొందింది. రంభాది అప్సరసలకు "తామే జగదేక సౌందర్యవతులము, ఎటువంటి తపస్వులనైనా మోహపరచి తపోభంగం చేయగలం" అనే గర్వం భంగం అయ్యింది. నారాయణునికి నమస్కరించి తమ ఓటమిని అంగీకరించారు.


నారాయణుడు వారిని క్షమించి చిరునవ్వుతో "దేవకాంతలారా! మీ తప్పు లేదు. ఇంద్రుడు ఆదేశించగా వచ్చారు. ఓటమిని అంగీకరించిన నిలిచిన మీ వినయానికి ప్రసన్నుడైనాను. వరం ఇస్తాను. కోరుకోండి! ఈ ఊర్వశిని నా కానుకగా ఇంద్రుడికి అందచేయండి" అన్నాడు.


రంభాది పదహారు వేల యాభై దేవకాంతలు నరనారాయణుల పాదాలకు ప్రణమిల్లి "నారాయణ మహర్షీ! వరమిస్తాను అన్నారు కనుక మేమందరం ఒకే కోరిక కోరుతున్నాము. మాకు ఇంద్రుడు వద్దు స్వర్గము వద్దు మమ్మల్నందరి ని మీ భార్యలుగా చేసుకోండి. మీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉండి పోతాం" అని కోరారు.


నారాయణ మహర్షి మందహాసంతో "దివ్యరమణులారా! ఈ జన్మలో మేము తపస్వులుగా ఉంటూ గృహస్థాశ్రమం స్వీకరించ కూడదు అని నిర్ణయించుకున్నాము. మా తపస్సు త్వరలో ముగించి ఈ దేహాలను వదిలే స్తాము. మా పార్థివ శరీరాలు నరనారాయణ పర్వతాలుగా మారి కలియుగాంతం వరకు బదరీనాథుని సేవిస్తాయి.


వచ్చే ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణుడిగా, నరుడు అర్జునుడిగా భూమిపై జన్మిస్తాము. అప్పుడు మీరు వివిధ దేశాల రాజకుమార్తెలుగా జన్మించి నరకాసురుని చెఱలో ఉంటారు. నేను మిమ్మల్ని రక్షించి వివాహం చేసుకుంటాను. అప్పుడు మీరందరు నా భార్యలు అవుతారు. అందాకా ఈఊర్వశిని తీసుకుని దేవలోకం వెళ్లి ఉండండి" అని చెప్పడంతో సంతృప్తి చెంది రంభాది అప్సరసలు ఊర్వశిని తీసుకుని వెళ్లి పోయారు.


కొంతకాలానికి నరనారాయణులు దేహం వదలి నారాయణునిలో లీనమై పోయారు. వారి దేహాలు పర్వతాలుగా మారి బదరీనాథు నికి ఇరువైపులా నర-నారాయణ గిరులుగా ప్రసిద్ధి చెందాయి. బదరీ నాథుడు రెండు పర్వతాల మధ్య ఉన్నత ప్రదేశంలో ఉండి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగము

 


దేవుడి పూజలో దీపం

 *దేవుడి పూజలో దీపం - అలంకారం ఏది ముందు? వత్తులు ఎన్ని?* 🙏


మీ సందేహం చాలా మందికి ఉంటుంది. శాస్త్రం ప్రకారం క్లియర్‌గా చెప్తాను.


*1. దీపం ముందా? అలంకారం ముందా?*


*జవాబు: ముందు దీపం వెలిగించాలి, తర్వాతే అలంకారం.*


*కారణం*: 

1. *దీపం = జ్యోతి స్వరూపుడు*. దేవుడు జ్యోతి రూపంలో వస్తాడు. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం - దీపమే పరబ్రహ్మం, చీకటిని పోగొట్టేది. 

2. చీకట్లో దేవుడికి అలంకారం చేయకూడదు. *వెలుగులోనే దేవుడిని చూసి, అలంకరించాలి*. 

3. పూజ మొదలుపెట్టేదే *దీపారాధనతో*. దీపం వెలిగించాకే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టు, ఆహ్వానించినట్టు. ఆ తర్వాత స్నానం, అలంకారం, నైవేద్యం.


*సరైన క్రమం*: 

స్నానం → శుభ్రమైన బట్టలు → *దీపం వెలిగించడం* → గంట కొట్టడం → ఆచమనం → అలంకారం, పూలు పెట్టడం → ధూపం, నైవేద్యం → హారతి.


*2. దేవుడి ముందు దీపంలో ఎన్ని వత్తులు వేయాలి?*


వత్తుల సంఖ్యకు చాలా అర్థం ఉంది. *బేసి సంఖ్యలో వేయాలి - 1, 3, 5, 7, 9*.

వత్తుల సంఖ్య ఫలితం ఎవరికి పెట్టాలి

1 వత్తి ఆయుష్షు, ఆరోగ్యం రోజూ దీపారాధనకు, దేవుడి పటాలకు

2 వత్తులు పెట్టకూడదు అశుభం. శవానికి మాత్రమే 2 వత్తులు.

3 వత్తులు త్రిమూర్తులు, సంతానం లక్ష్మీదేవి, దుర్గమ్మకు విశేషం

5 వత్తులు పంచ భూతాలు, ఐశ్వర్యం అన్ని దేవుళ్ళకు శ్రేష్టం

7 వత్తులు సప్త ఋషులు, విజయం వెంకటేశ్వరుడికి, శివుడికి

9 వత్తులు నవగ్రహ దోష నివారణ అమ్మవారు, సుబ్రహ్మణ్యుడికి

*రోజూ ఇంట్లో పెట్టే దీపానికి 1 లేదా 5 వత్తులు చాలు*. పండుగలు, శుక్రవారం, మంగళవారం నాడు 5 లేదా 9 వత్తులు పెట్టండి.


*3. "3 వత్తులు వేస్తే 2 ఒకటిగా, 1 విడిగా ఉంచాలి" - నిజమేనా?*


*అవును అండి, ఇది 100% నిజం. శాస్త్ర సమ్మతమే.*


*కారణం*: 

1. *2 వత్తులు కలిపి ఒకటిగా* వెలిగించాలి, *మూడో వత్తి విడిగా* ఉంచాలి.

2. ఎందుకంటే *2 వత్తులు విడివిడిగా వెలిగిస్తే అది అశుభం*. 2 వత్తులు శవానికి, ఆపదలకు గుర్తు. 

3. 3 వత్తులు పెట్టినప్పుడు 2+1 = 3 అవుతుంది. అంటే బేసి సంఖ్య. ఇది శుభం.


*ఎలా పెట్టాలి*: 3 వత్తులు తీసుకుని, 2 వత్తులను పేని ఒకటిగా చేయండి. మూడోది అలాగే ఉంచండి. ఇప్పుడు దీపంలో *రెండు జ్వాలలు* మాత్రమే వస్తాయి - ఒకటి లావుగా, ఒకటి సన్నగా. ఇదే సరైన పద్ధతి.


*లక్ష్మీదేవికి 3 వత్తులు* పెడితే - 2 వత్తులు లక్ష్మీనారాయణులకు, 1 వత్తి మన ఇంటి క్షేమానికి అని అర్థం.


*4. వత్తులకు సంబంధించి ఇంకొన్ని ముఖ్య నియమాలు*


1. *వత్తులు*: పత్తితో చేసినవి శ్రేష్టం. తామర వత్తులు లక్ష్మీదేవికి, అరటి నార వత్తులు శివుడికి ఇష్టం.

2. *నూనె*: ఆవు నెయ్యి ఉత్తమం, తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె. వేరుశనగ నూనె వాడకూడదు.

3. *దిశ*: దీపం జ్వాల *తూర్పు లేదా ఉత్తరం* వైపు ఉండాలి. దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదు.

4. *వెలిగించడం*: అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు. వేరే దీపంతో లేదా కర్పూరంతో వెలిగించాలి.

5. *ఆర్పడం*: నోటితో ఊది ఆర్పకూడదు. పువ్వుతో గానీ, పత్తితో గానీ నెమ్మదిగా అదమాలి.


*గుర్తుంచుకోండి*: ఏక వర్తికా దీపం వా యో దద్యాత్ సదాశివే - ఒక్క వత్తితో దీపం పెట్టినా చాలు, భక్తితో పెడితే శివుడు సంతోషిస్తాడు.


కాబట్టి *ముందు దీపం, తర్వాత అలంకారం*. వత్తులు *1 లేదా 3 లేదా 5*. 3 పెడితే *2+1* పద్ధతి పాటించండి.


మిమ్ము దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటు...🙏🏻

శంఖుపూల మొక్కశంఖుపూల మొక్క

 🙏🌺 *శంఖుపూల మొక్క* 🌺🙏


🌺మతిమరుపు... యాభై పైబడిన వాళ్లలో క్రమేణా పెరుగుతోంది. క్యాన్సర్‌... వయసుతో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా కబళిస్తోంది. ఆందోళన... చిన్నాపెద్దా అందరినీ కుంగదీస్తోంది. బీపీ, మధుమేహం... ఇలా మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎందరినో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వీటన్నింటికీ చూడచక్కని పరిష్కారమే శంఖుపుష్పి అంటున్నారు సంప్రదాయ వైద్యులు..!🌺


🌺అనగనగా ఓ అడవి... అక్కడ మనుషులతోపాటు చిత్రమైన జంతువులూ ఉండేవట. ఒకరోజు ఇస్రా అనే మహిళని సగం మనిషి సగం పక్షి ఆకారంలో ఉన్న కిన్నారి అనే విచిత్రజీవి వచ్చి ఓ పూలవనంలోకి తీసుకెళ్లిందట. అక్కడ ఇస్రాకి ఎన్నడూ చూడని ఓ నీలి పుష్పం కనిపించింది. ‘ఈ మొక్కని తీసుకెళ్లి పాకించు. ఊరందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది’ అని చెప్పింది కిన్నారి. అలాగే చేసింది ఇస్రా. కొన్నాళ్లకి అది గోడంతా పాకి విరబూసింది. ఓ పువ్వుని కోసి, కాసిని మరిగించిన నీళ్లలో వేసి, నిమ్మరసం పిండింది. అది కాస్తా గులాబీ రంగులోకి మారిపోయింది. ఆ రంగుని చూసి ఆనందపడిపోతూ ఇస్రా చుట్టుపక్కలవాళ్లకీ ఆ పానీయాన్ని ఇచ్చిందట. ఆ రంగుకి ఫిదా అయిపోయిన వాళ్లంతా దాన్ని తాగడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించారట. థాయ్‌లాండ్‌ వాసులు నీలి టీని చప్పరిస్తూ ఇప్పటికీ ఈ జానపద కథని తలచుకుంటారు. ఆ కథలోని నీలి పువ్వే మన శంఖుపుష్పి. దీన్నే అపరాజిత, గోకర్ణ, గెంతన... ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఊదా, తెలుపూ రంగుల్లో మాత్రమే కనిపించే ఈ పూల తీగ, ఎరుపూ గులాబీ నీలం రంగుల్లోనూ వికసిస్తోంది. ఆ టీని ఇప్పుడు మన దగ్గరా చప్పరిస్తున్నారు.🌺


🌺అవునండీ... ఈమధ్య కొందరి ఇళ్లల్లో ఓ తీగ మొక్క కనిపిస్తోంది. అయితే ఆ మొక్కకి పువ్వులు మాత్రం కనిపించడం లేదు. వాటిని ఏ రోజుకారోజు కోసుకుని టీ రూపంలో తాగేస్తున్నారు మరి. నిజానికి శంఖుపుష్పం పూలతీగగా మనకీ సుపరిచితమే. పశుగ్రాసంగానూ వాడేవారు. కానీ అదో అద్భుతమైన ఔషధమొక్క అన్నది సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులకే తెలుసు.🌺


🌺శంఖు మొక్క పువ్వులే కాదు, ఆకూ వేరూ కాండమూ గింజా అన్నీ ఆరోగ్యకరమైనవే. నెలసరి ఇబ్బందులకి పూల కషాయాన్ని ఇస్తే, విషపదార్థాలకి విరుగుడుగా వేళ్లతో చేసిన మందుని ఇచ్చేవారట. పాముకాటుకి తెలుపురంగు శంఖు మొక్క వేళ్లను నూరి ఇస్తుంటారు. సొరియాసిస్‌కీ ఈ మందు పనిచేస్తుందట. పంచకర్మ వైద్యంలోనూ వాడతారు. ఇక, ఈ పూలని ఆగ్నేయాసియా దేశాల్లో ఆహారపదార్థాల్లో రంగుకోసం పూర్వం నుంచీ వాడుతున్నారు. వాటితో వంటలూ చేస్తుంటారు. ఈ మొక్క లేతకాయల్ని కూరగానూ వండుతారట. అంతర్జాలం పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచమంతా ఆ పూలని తింటున్నారు, తాగుతున్నారు.🌺


🌺ఎందుకు మంచిదంటే.


ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్లూ కెటెచిన్‌లూ పాలీఫినాల్సూ... ఇలా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు హానికర పదార్థాలను బయటకు పంపిస్తాయి. పూలల్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం... వంటి పోషకాలూ ఉంటాయి. ఇందులోని ప్రొయాంథోసైనిన్‌ అనే యాంటీఆక్సిడెంటు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందట. అందుకే ఈ పూలతో చేసిన టీ తాగడం పెరిగింది.🌺


🌺మతిమరుపు రాకుండా: శంఖు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి నాడీవ్యవస్థ పనితీరుని పెంచడం ద్వారా జ్ఞాపకశక్తినీ తెలివితేటల్నీ పెంచుతుందనీ; నిద్రలేమికీ డిప్రెషన్‌కీ మందులా పనిచేస్తుందని ఆధునిక వైద్యులూ చెబుతున్నారు. ఇందులోని ఆర్గనెల్లోలిన్‌ అనే పదార్థం, శరీరంలో ఎసిటైల్‌ కోలీన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ శాతాన్ని పెంచి మెదడు పనితీరుకి తోడ్పడుతుందనీ, తద్వారా వయసుతోబాటు వచ్చే మతిమరపుని తగ్గిస్తుందనీ అంటున్నారు.


జీర్ణశక్తికి: వారానికి రెండుసార్లు చొప్పున పరగడుపున శంఖుపూలూ లేదా ఆకుల్ని మరిగించిన కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ పోయి జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఇది పొట్టలో మంటనీ మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. గ్యాస్ట్రైటిస్‌, వాంతులు, వికారాలకీ మందే. ఈ మొక్క గింజల్ని పొడి చేసి గ్రా. చొప్పున రెండు పూటలా తిన్నా మంచిదేనట.🌺


🌺చర్మసౌందర్యానికి: కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం సాగుదలని పెంచి, వయసుతోబాటు వచ్చే ముడతల్నీ చర్మంమీది మచ్చల్నీ తగ్గిస్తుందట. అందుకే ప్రస్తుతం దీన్ని అనేక సౌందర్యోత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఇందులోని క్యుయెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ జుట్టుని త్వరగా నెరవనీయదట.


క్యాన్సర్లకి: ఈ పూల టీలోని సైక్లోటైడ్లు క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయట. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో శంఖుపూల కషాయం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు పరిశీలనలు చెబుతున్నాయి.🌺


🌺జ్వరంగా ఉంటే: ఈ టీ తాగితే జ్వర తీవ్రత, దగ్గు, జలుబు తగ్గుతాయట. 


చూపు తగ్గుతుంటే: శంఖుపువ్వులోని ప్రొయాంథోసైనిడిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కంటి నరాల్లో రక్తసరఫరాని పెంచడం ద్వారా గ్లకోమాని నిరోధించడంతోబాటు రెటీనా దెబ్బతినకుండా చేస్తుంది. తరచూ కళ్లు ఎర్రబడటం, వాయడం, ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవాళ్లకి ఈ పూల టీ మంచి మందు.🌺


🌺సంతానోత్పత్తికి: రోగనిరోధకశక్తికి మారుపేరైన శంఖుపుష్పం శృంగారప్రేరితం కూడా. క్రమం తప్పక తాగడం వల్ల శుక్రకణాల శాతం పెరుగుతుందట. నెలసరిని క్రమబద్ధీకరించేందుకూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకీ తోడ్పడుతుంది.


కొవ్వు పెరిగితే: రోజూ శంఖుపూల టీని తాగితే కొలెస్ట్రాల్‌ శాతం తగ్గినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. అయితే పూలకన్నా వేళ్ల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ లేదా గింజలను పొడి చేసి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు చెబుతున్నారు. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడకుండానూ బీపీని అదుపులో ఉంచేందుకూ తోడ్పడుతుందీ మొక్క.🌺


🌺చక్కెరవ్యాధికి: శంఖుపూలలో సమృద్ధిగా ఉండే ఫినాలిక్‌ ఆమ్లం, ఫినాలిక్‌ అమైడ్‌లు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంతోపాటు జీవక్రియను నియంత్రిస్తాయి. అంటే- రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు లేకుండా చేస్తాయి. భోజనానికి ముందు ఈ టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికీ తోడ్పడుతుంది.


అదీగాక, కొన్ని రకాల మొక్కల్లోనే సైక్లోటైడ్లూ పెప్టైడ్లూ ఉంటాయి. అలాంటివాటిల్లో ఒకటైన శంఖు మొక్కలోని సైక్లోటైడ్లకి హెచ్‌ఐవీ వైరస్‌నీ అడ్డుకునే గుణం ఉందట. ఇంకా శంఖుపూలు మూత్ర, శ్వాస సమస్యల్నీ నివారిస్తాయి. పంటినొప్పికీ మశూచికానికీ డయేరియా నివారణకీ గొంతు శ్రావ్యంగా ఉండేందుకూ తలనొప్పికీ... ఇలా ఎన్నో సమస్యలకు శంఖుమొక్క మంచి మందు. సాధారణంగా పండ్లూ కూరగాయలన్నింట్లోనూ ఉండే ఫ్లేవనాయిడ్‌ శంఖు పూలల్లోనూ ఉంటుంది. అది చురుకైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తూ వయసుతోబాటు పెరిగే హానికర ఫ్రీరాడికల్స్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుంది. అందుకే ఇంటింటా ఓ శంఖుపూల మొక్క ఉంటే అంతా మేలే.🌺


🌺ఎలా వాడతారు


ఈ పువ్వుని గ్రీన్‌ టీ మాదిరిగానే తాగితే మంచిది. పువ్వుల్ని సలాడ్లలో తినొచ్చు. ఎండబెట్టి చేసిన పువ్వులూ లేదా పొడిని కాఫీలో కేకుల్లో ఐస్‌క్రీముల్లో డెజర్ట్‌ల్లో జ్యూసుల్లో... ఇలా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. కాసిని పూలని నీళ్లలో వేసి మరిగించి దించాక వచ్చిన నీలి రంగు టీలో కాస్త నిమ్మరసం పిండితే అది ముదురు గులాబీరంగులోకి మారుతుంది. రసం పిండేకొద్దీ లేత రంగులోకి వస్తుంటుంది. అందులో మళ్లీ తేనె కలిపితే ముదురు గోధుమ వర్ణం వస్తుంది. దీన్ని వేడిగా చల్లగా ఎలా తాగినా మంచిదే. పైగా గులాబీ ఎరుపూ రంగుల్లో విరబూసే శంఖుపూలూ ఉంటున్నాయి. కాబట్టి ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి, రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసిన షర్బత్‌లను అతిథులకి అందిస్తే ఆ రంగుల గమ్మత్తుని చూస్తూ గ్లాసు ఖాళీ చేసి మిమ్మల్ని అభినందించేేయడం ఖాయం!

( సేకరణ)

అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో

  భారత ఉపఖండంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న త్రిపుర సుందరి ఆలయంలో (దీనిని భక్తులు ప్రేమగా 'మాతాబారి' అని పిలుచుకుంటారు) భక్తులు అమ్మవారిని అపారమైన భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.


​కూర్మ పీఠం: ఈ ఆలయం తాబేలు ఆకారంలో నిర్మించబడటం వల్ల దీనిని "తాబేలు దేవాలయం" అని కూడా పిలుస్తారు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు శాంతిని, ఐశ్వర్యాన్ని మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రసాదిస్తుంది.


​కళ్యాణ్ సాగర్: ఆలయం చుట్టూ పవిత్రమైన 'కళ్యాణ్ సాగర్' సరస్సు ఉంది. ఇందులో ఉండే తాబేళ్లు మరియు చేపలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రకృతికి, భక్తికి మరియు ప్రాచీన తాంత్రిక సంప్రదాయాలకు మధ్య ఉన్న సామరస్యానికి నిదర్శనం.


​దైవ స్వరూపం: నల్లరాతితో మలచబడిన త్రిపుర సుందరి దేవి విగ్రహానికి భక్తులు పూలు, దీపాలు, నైవేద్యాలను సమర్పించి ప్రార్థిస్తారు. అమ్మవారిని అనంతమైన సౌందర్యానికి, విశ్వజనీన ప్రేమికు మరియు దైవిక చైతన్యానికి స్వరూపంగా భావిస్తారు.


​మాతాబారిలోని పవిత్ర శక్తి భక్తులను అమ్మవారికి శరణాగతి అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇక్కడ లభించే అంతర్గత ప్రశాంతత మరియు భక్తి, శక్తి యొక్క శాశ్వతమైన కృపను అనుభూతి చెందేలా చేస్తాయి.

రామాయణం -- 64

 రామాయణం -- 64


అప్పుడు సుగ్రీవుడు అసలు కథని వివరంగా ఇలా చెప్పాడు " రామ! ఒకానొకప్పుడు మా తండ్రి అయిన ఋక్షరజస్సు ఈ వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ ఋక్షరజస్సుకి ఇంద్రుడి అనుగ్రహంగా వాలి ఔరసపుత్రుడిగా జన్మించాడు, సూర్యుడి అనుగ్రహంగా నేను ఔరసపుత్రుడిగా జన్మించాను. పెద్ద కుమారుడైన వాలి తండ్రి యొక్క ప్రీతిని పొందాడు. నేను కూడా చాలాకాలం వాలిని ప్రీతితో అనుగమించాను. కొంతకాలానికి ఋక్షరజస్సు శరీరాన్ని విడిచిపెట్టాక, పెద్ద కుమారుడు కనుక వాలికి పట్టాభిషేకం చేశారు. నేను వాలియందు వినయవిధేయలతో, భయభక్తులతో ఉండేవాడిని. 


దుందుభి అనే రాక్షసుడి అన్న అయిన మయుడికి ఒక కుమారుడు ఉన్నాడు, వాడి పేరు మాయావి. ఆ మాయవికి, వాలికి ఒక స్త్రీ సంబంధంగా వైరం వచ్చింది. ఆ కారణం చేత మాయావి ఒకరోజు రాత్రి కిష్కింద ద్వారం దగ్గరికి వచ్చి గట్టిగా కేకలు వేసి ' వాలి బయటకి రా, మనిద్దరమూ యుద్ధం చేద్దాము. ఈరోజుతో నిన్ను సంహరిస్తాను ' అన్నాడు. అప్పటివరకూ తన భార్యలతో సంతోషంగా కాలం గడుపుతున్న వాలి గబగబా బయటకి వచ్చాడు. అప్పుడు నేను కూడా బయటకి వచ్చాను. ఆ మాయావి మా ఇద్దరినీ చూసి భయపడి పారిపోయాడు. అక్కడున్న స్త్రీలు ' ఎలాగు వాడు పారిపోతున్నాడు కదా, ఇంక విడిచిపెట్టు ' అన్నారు. కాని, శత్రువుని విడిచిపెట్టనని వాలి వాడి వెనకాల పరిగెత్తాడు. అప్పుడు నేను కూడా వాలి వెనకాల వెళ్ళాను. 


పరిగెత్తి పరిగెత్తి, తృణముల చేత కప్పబడిన ఒక పెద్ద బిలంలోకి ఆ మాయావి దూరిపోయాడు. అక్కడికి వెళ్ళి నేను, వాలి నిలబడ్డాము. అప్పుడు వాలి నాతో ' సుగ్రీవా! నువ్వు ఈ బిళ ద్వారం దగ్గర కాపలాగా ఉండు, నేను ఇందులోకి వెళ్ళి ఆ రాక్షసుడిని సంహరించి వస్తాను. నువ్వు నా తమ్ముడివి, చిన్నవాడివి నా పాదముల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను, నువ్వు ఇక్కడే ఉండు ' అని చెప్పి వాలి గుహలోపలికి వెళ్ళాడు.


వాలి లోపలికి వెళ్ళి ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. నేను బయట అలాగే నిలబడ్డాను. అలా చాలాకాలం తరువాత లోపలినుండి రాక్షసుల కేకలు వినపడ్డాయి. ఆ ద్వారం దగ్గర నురగతో కూడిన నెత్తురు ప్రవహిస్తూ బయటకి వచ్చింది. ఎక్కడా వాలి మాట కాని, వాలి అలికిడి కాని వినపడలేదు. బహుశా మా అన్నగారైన వాలిని ఈ రాక్షసులు సంహరించి ఉంటారు అనుకొని, ఈ రాక్షసులు బయటకి వస్తే ప్రమాదము అని, నేను ఒక పెద్ద శిలని తీసుకొచ్చి ఆ బిలానికి అడ్డుగా పెట్టాను. అప్పుడు నేను చనిపోయాడనుకున్న వాలికి అక్కడే ఉదకక్రియ నిర్వహించి తర్పణాలు విడిచిపెట్టాను. 


తరువాత నేను రాజ్యానికి వచ్చి, ఎవ్వరికీ తెలియకుండా శాస్త్రం ప్రకారం వాలికి చేయవలసిన కార్యములను చేశాను. నేను అంత జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా చేసినప్పటికీ, మంత్రులు విషయాన్ని కనిపెట్టి, రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు కనుక నన్ను బలవంతంగా సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చేశారు. నేను చాలా ధర్మబద్ధంగా వానర రాజ్యాన్ని పరిపాలిస్తూ కాలం గడుపుతున్నాను. 


ఒకనాడు అకస్మాత్తుగా మా అన్న వాలి తిరిగివచ్చాడు. అప్పుడాయన ఎర్రనైన కళ్ళతో నావంక చూశాడు. నా మంత్రులని, స్నేహితులని బంధించి కారాగారంలో వేశాడు. ఆ సమయంలో నేను ప్రభువుగా ఉన్నాను కనుక, నాకున్న బలం చేత, నేను వాలిని బంధించి కారాగారంలో పెట్టగలను, కాని నేను అలా చెయ్యలేదు. ఆయన నాకు అన్నగారు, ఆయనని నేను గౌరవించాలి అందుకని నేను ఆయనని నిగ్రహించలేదు. 


దిష్ట్యా అసి కుశలీ ప్రాప్తో నిహతః చ త్వయా రిపుః |

అనాథస్య హి మే నాథః త్వం ఏకో అనాథ నందనః ||


అప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా రెండు చేతులని జోడించి, శిరస్సు వంచి ' అన్నయ్యా! నువ్వు లేక నేను అనాథనయ్యాను. నువ్వు తిరిగి రావడం వలన ఇవ్వాళ నేను నాథుడున్న వాడిని అయ్యాను. నాకు ఎంతో సంతోషంగా ఉంది. అన్నయ్యా! నూరు తీగలున్న ఈ తెల్లటి ఛత్రాన్ని నీ శిరస్సుకి పెడతాను, నీకు చామరం వేస్తాను. నువ్వు మళ్ళి సింహాసనం మీద కూర్చొని పూర్వం ఎలా పరిపాలించేవాడివో అలా పరిపాలించు. నేనెప్పుడూ పట్టాభిషేకం చేసుకుందామని అనుకోలేదు. బలవంతంగా మంత్రులు, పౌరులు నాకు పట్టాభిషేకం చేశారు. నేను నీకు శిరస్సు వంచి అంజలి ఘటిస్తున్నాను, ఎప్పటికీ నువ్వే వానర రాజ్యానికి రాజువి. అందుకని రాజ్యాన్ని స్వీకరించు ' అన్నాను. 


అప్పుడు వాలి ' చి ఛి, పరమ దుష్టుడా నేను లేని సమయం చూసి నువ్వు పట్టాభిషేకం చేసుకున్నావు. నువ్వు పరమ దుర్మార్గుడివి ' అన్నాడు. మరునాడు జానపదులను, మంత్రులను, ఇతరమైన వానరములను పిలిచి ఒక పెద్ద సభ తీర్చాడు. అప్పుడు నేను వాలి పక్కన నిలబడ్డాను. అప్పుడాయన నన్ను చూసి ' నేను దురాత్ముడైన మాయవిని చంపడం కోసమని ఒక రాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. ఈ మహాపాపి అయిన నా తమ్ముడు నన్ను అనుగమించి వచ్చాడు. నేను రాక్షసులని చంపి వెనక్కి వస్తాను, నువ్వు బిల ద్వారం దగ్గర కాపలాగా ఉండు అన్నాను. కాని పాపపు ఆలోచన కలిగిన సుగ్రీవుడు నేను లోపలికి వెళ్ళగానే శిలా ద్వారాన్ని అడ్డు పెట్టాడు. నేను లోపల మరణిస్తాను అని తిరిగొచ్చి పట్టాభిషేకం చేసుకున్నాడు. కాని నేను లోపలికి వెళ్ళాక మాయావి నాకు కనపడలేదు. ఒక సంవత్సర కాలం వెతికాక ఆ మాయావి తన బంధువులతో, స్నేహితులతో కనపడ్డాడు. నేను వాళ్ళందరినీ సంహరించాను. ఆ గుహ అంతా నెత్తురుతో నిండిపోయింది. నేను బయటకి వద్దాము అనుకున్నాను, కాని వీడు శిలని అడ్డుపెట్టాడు. నేను ఎంతో కష్టంతో ఆ శిలని పక్కకి తోసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికి వీడు రాజ్యాన్ని పరిపాలిస్తూ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కావాలనే నన్ను గుహలో పెట్టి రాజ్యాన్ని తీసుకున్నాడు. వీడిని ఎట్టి పరిస్థితులలోను ఆదరించకూడదు. రాజ్యం కోసమని అన్నని హత్య చెయ్యాలని ప్రయత్నం చేసినవాడు ' అన్నాడు.


అప్పుడు వాలి నన్ను కట్టుబట్టలతో బయటకి తరిమేశాడు. అప్పుడు నేను భయపడుతూ బయటకి వచ్చాను. కాని వాలి నన్ను వదిలిపెట్టకుండా చంపుతాను అని ఈ భూమండలం అంతా తరిమాడు. నేను ఈ భూమండలం అంతా పరిగెత్తాను. ఈ కొండమీదకి వాలి రాలేడు కనుక, చిట్టచివరికి నేను ఈ కొండ మీద కూర్చున్నాను. నాకు అత్యంత ప్రియమైన భార్య అయిన రుమని, నేను బ్రతికి ఉండగా వాలి తన భార్యగా అనుభవిస్తున్నాడు. నేను చెయ్యని పాపానికి నన్ను కట్టుబట్టలతో బయటకి తోసేశాడు. నేను ఎంత చెప్పినా వినలేదు, పైగా నా భార్యని తన భార్యగా చేసుకున్నాడు. ఇంత కష్టంలో ఉన్నాను రామ............." అని సుగ్రీవుడు ఏడిచాడు. 


ఈ మాటలు విన్న రాముడు " గ్రద్దల యొక్క ఈకలు కట్టినటువంటి, ఒంపులు లేనటువంటి బంగారు బాణములు నా అమ్ములపొదిలో ఉన్నాయి. నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో, అంతకాలమే బతికి ఉంటాడు. వాలి నాకు కనపడగానే మరణిస్తాడు. నువ్వు బెంగ పెట్టుకోకు, వాలిని ఇప్పుడే సంహరిస్తాను. వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు " అన్నాడు.

సంపూర్ణ మహాభారతము*

  *

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                         2️⃣2️⃣6️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *226 వ రోజు*                    

*భీష్మ పర్వము ప్రథమాశ్వాసము*


            *ప్రధమాశ్వాసం*```


జనమేజయుడు వైశంపాయనుని చూసి “ఒకరిని ఒకరు గెలవవలనన్న తలపుతో పాండవులు కౌరవులు ఎలా ప్రవర్తించారు. యుద్ధం ఎలా జరిగిందో నాకు వివరించండి" అని అడిగాడు. 


వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు. పుణ్య క్షేత్రమైన కురుక్షేత్రంలో చేరిన ఇరు పక్షముల వారు కదనోత్సాహంతో విడిసి ఉన్నారు. తన కుమారుల అవిధేయతకు కలత పడిన ధృతరాష్ట్రుడు సంజయుని పిలిపించుకున్నాడు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. ధృతరాష్ట్రుడు అర్ఘ్యపాద్యములు సమర్పించిన పిమ్మట వ్యాసుడు 

"దృతరాష్ట్రా ! ఈ భూమి మీద ఉన్న రాజులందరికి కాలం తీరింది కనుకనే ఈ యుద్ధం సంప్రాప్తమైంది. ఇందుకు నీవు చింతించ పని లేదు. నీకు నేను దివ్య దృష్టి ప్రసాదిస్తాను నీవు యుద్ధ భూమిలో ఏమి జరుగుతుందో స్వయంగా చూడవచ్చు” అన్నాడు. 


ధృతరాష్ట్రుడు “వ్యాసమహర్షీ ! అన్నదమ్ములు ఘోరంగా యుద్ధం చేసుకోవడం నేను ఎలా చూడగలను. నాకు యుద్ధ విశేషాలు వినే భాగ్యం ప్రసాదిస్తే చాలు" అన్నాడు. 


వ్యాసమహర్షి సంజయుని చూసి 

"సంజయా! నీవు దృతరాష్ట్రునికి యుద్ధ విశేషాలు వివరించడానికి అనువుగా నీకు రెండు పక్షములలో జరిగే రహస్య సంభాషణలు, వారి మనో వృత్తులు తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. నీవు తలచిన వెంటనే యుద్ధ భూమిలో ప్రవేశించి అంతటా సురక్షితంగా సంచరించగలవు ఏ అస్త్ర శస్త్రం నీకు హాని కలిగించదు. కనుక నీవు చూసినది చూసినట్లు దృతరాష్ట్రునికి వర్ణించు" అన్నాడు. 


వ్యాసుడు ఆ తరువాత సంజయునికి శీఘ్రగమనము, దూరశ్రవణం మొదలైన శక్తులు ప్రసాదించాడు. 


వ్యాసుడు "దృతరాష్ట్రా! భూభారం తగ్గించడానికి సంభవించిన ఈ యుద్ధానికి చింత వలదు. పలు దుశ్శకునాలు గోచరిస్తున్నాయి. కనుక కుల క్షయం తప్పదు. అనేక రాజులు నశించక తప్పదు. ధర్మం జయిస్తుంది ఇప్పటికైనా మించి పోలేదు నీ కుమారులను ఒప్పించి పాండవుల రాజ్యభాగం ఇప్పించి ఈ మారణ హోమాన్ని ఆపించు " అన్నాడు. దృతరాష్ట్రుడు " మహాత్మా ! నా కుమారులు అవిధేయులు నా మాట వినరు. నా దోషం లేకుండా నేను అనేక విధముల చెప్పాను. అన్నీ నిష్ప్రయోజనం అయ్యాయి నేను ఏమి చేయగలను " అన్నాడు. వ్యాసుడు " దృతరాష్ట్రా ! జయాపజయాలు దైవాధీనాలు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది " అని చెప్పి వెళ్ళాడు.


*దృతరాష్ట్ర సంజయుల సంభాషణ*


దృతరాష్ట్రుడు సంజయుని చూసి " సంజయా ! ఈ భూమి కోసం ఎందరో యుద్ధాలు చేసి తమ ప్రాణాలు పోగొట్టు కున్నారు. భూమి అంటే అంత తీపి ఎందుకు? సంజయా ఈ భూమి యొక్క పరిమాణం, స్వరూపం గురించి నాకు వివరించు " అన్నాడు. సంజయుడు " రాజా ! ఈ భూమి నానా విధ చరాచరములకు నిలయం . ఆకాశం యొక్క గుణం శబ్దం. వాయువు గుణం శబ్దం, స్పర్శ. అగ్ని గుణములు శబ్దం, స్పర్శ, రూపములు. జలము యొక్క గుణము శబ్ధ, స్పర్శ, రూప, రసములు. భూమి యొక్క గుణం శబ్ధ, స్పర్శ, రూపం, రసము, గంధం (వాసన). కనుక పంచ భూతములలో ప్రధానమైనది. మేరు పర్వతమునకు దక్షిణమున సుదర్శనం అను పేరు కలిగిన ఒక సువిశాల ప్రదేశం ఉంది. దాని వైశాల్యం 2,500 యోజనములు. అందు మధురసభరితమైన ఒక జంబు (నేరేడు) వృక్షం ఉంది. దాని పండ్లు నేల రాలి చితికి ఆ రసము ఏరులై ప్రవహిస్తూ పర్వతములకు ప్రదక్షిణ చేస్తూ కురు భూమి గుండా ప్రవహించి సముద్రంలో చేరుతుంది. ఆ నదిని జంబు నది అంటారు. ఆ నదిలో ప్రవహించు నీరు సోకిన ప్రదేశం బంగారు మయమగును. కనుక బంగారమునకు జంబూనదం అనే పేరు కూడా ఉంది. ఆ జలం త్రాగిన వారికి ముసలి తనం, రోగములు, దాహం, ఉండదు. కనుకనే ఈ భూమికి జంబూ ద్వీపం, సుదర్శన ద్వీపం అనే పేర్లు వచ్చాయి. ఈ ద్వీపమునకు తూర్పు పడమరలు సముద్రముచే ఆవహించి ఉండును. ఈ ద్వీపమున హిమాలయం, దానికి ఆవల హేమకూటం, నిషిద పర్వతం క్రమముగా నీల, శ్వేత, శృంగ పర్వతములు ఉంటాయి. వీటన్నిటి నడుమ మేరు పర్వతం భూమి లోనికి చొచ్చుకొని 16,000 వేల యోజనములు విస్తరించి 84,000 యోజనములు పొడవున ఉంది. మేరు పర్వతములో దేవతలు, దేవమునులు, గంధర్వులు, కిన్నెర, కింపురుష, దిక్పాలకులు, బ్రహ్మదేవుడు విహరిస్తున్నారు. దానికి ఉత్తరంలో కర్ణికార వనంలో ఈశ్వరుడు గౌరీసమేతుడై విహరిస్తుంటాడు.```


              *సశేషం* 

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వైశాఖ పురాణం🚩*

 *🐚శుక్రవారం 15 మే 2026*


   *🚩వైశాఖ పురాణం🚩*              

      *28వ అధ్యాయము*


*అక్షయతృతీయ విశిష్టత*```


నారదమహాముని అంబరీషునకు వైశాఖ మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నీవిధముగ పలికెను. మహారాజా! వైశాఖశుద్ధ తృతీయమని అందురు. అది మిక్కిలి పవిత్రమైనది. ఆనాడు చేసిన పాపము సర్వపాపహరము. శ్రీహరి పదమును కలిగించును. ఈనాడు దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణాదుల నీయవలెను. ఈనాడు చేసినదానికి విశేషఫలము కలదు. ఈనాడు శ్రీహరిని పూజించి శ్రీహరి కథను వినినవారు ముక్తినందుదురు. ఈనాడు చేసిన దానము అక్షయఫలము నిచ్చును. ఈ తిధి దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు ముగ్గురికి తృప్తిని కలిగించును. ఈ తిధికి యీ మహిమ వచ్చిన కారణమును చెప్పుదును వినుము.


పూర్వము యింద్రునకు బలిచక్రవర్తితో పాతాళమున యుద్దమయ్యెను. ఇంద్రుడు వానిని జయించి తిరిగి వచ్చుచు భూలోకమును చేరెను. మార్గముననున్న ఉతధ్య మహాముని ఆశ్రమములోనికి వెళ్లెను. త్రిలోకసుందరియు గర్భవతియనగు వాని భార్యను జూచి మోహించెను. ఆమెను బలాత్కారముగా ననుభవించెను. ఆమె గర్భముననున్న పిండము యింద్రుని వీర్యమును లోనికి రానీయక పాదము నడ్డముగ నుంచెను. ఇంద్రుడు కోపించి వానిని గ్రుడ్డివాడివగుమని శపించెను. వాని శాపముననుసరించి మునిపత్ని గర్భమునుండి పుట్టిన బాలుడు దీర్ఘ తపుడనువాడు పుట్టు గ్రుడ్డియై జన్మించెను. గర్భస్థపిండముచే నవమానింపబడి శపించిన యింద్రుడు ముని పత్నిని బలవంతముగ ననుభవించి ముని చూచినచో శపించునని భయపడి త్వరగా పోవలెనని పరుగెత్తెను. వానిని జూచిన మునిశిష్యులు పరిహసించిరి.


ఇంద్రుడును సిగ్గుపడి మేరుపర్వత గుహలో దాగుకొనెను. ఇంద్రుదిట్లు మేరు గుహలో దాగినట్లు తెలిసికొని బలిమున్నగు రాక్షసులు అమరావతిని ఆక్రమించి దేవతలను తరిమిరి. ఏమి చేయుటకును తోచని దిక్కులేని దేవతలు బృహస్పతిని చేరి యింద్రుని విషయము నడిగిరి. బృహస్పతియు దేవతలకు యింద్రుని పరిస్థితిని వివరించి యింద్రుడు శచీ సహితుడై మేరు పర్వతగుహలోనున్నాడని చెప్పెను. అప్పుడు వారందరును మేరు పర్వత గుహను చేరి యింద్రుని బహువిధములుగ స్తుతించిరి. బృహస్పతి మొదలగువారి స్తుతులను విని యింద్రుడు సిగ్గుపడుచు వచ్చినవారికి కనిపించెను. బలి మున్నగువారు స్వర్గము నాక్రమించిరని దేవతలు చెప్పిరి. పరస్త్రీ సంగదోషమున నేను అశక్తుడనై యున్నానని యింద్రుడు వారితో చెప్పెను.


ఇంద్రుని మాటలను విని బృహస్పతి దేవతలు యేమి చేయవలయునాయని ఆలోచనలో పడిరి. అప్పుడు బృహస్పతి దేవతలతో నిట్లనెను.


ప్రస్తుతము శ్రీహరికి మిక్కిలి యిష్టమగు వైశాఖమాసము గడచుచున్నది. ఈ మాసమున అన్ని తిధులును పుణ్యప్రదములు శక్తినంతములు. అందున శుక్లపక్షమునందలి తృతీయా తిధి చాల శక్తివంతమైనది. ఆనాడు చేసిన స్నానదానాదులు ఉత్తమ ఫలముల నిచ్చును. సర్వపాపములను పోగొట్టును. కావున ఆనాడు యింద్రుని వైశాఖ ధర్మముల నాచరింపచేసినచో యింద్రుని పాపము పోయి పూర్వపు బలము, శక్తి, యుక్తులు మరింతములై వచ్చునని చెప్పెను. అందరును కలిసి యింద్రునిచే అక్షయ తృతీయనాడు ప్రాతఃకాల స్నానము తర్పణాదులు శ్రీహరిపూజ కథా శ్రవణము మున్నగువానిని చేయించిరి. ఇంద్రుడును అక్షయ తృతీయా ప్రభావమున శ్రీహరి కృపచే మిక్కిలి శక్తిమంతుడై దేవతలతో గలిసి బలిని రాక్షసులను తరిమి అమరావతిని గెలుచుకొని ప్రవేశించెను. అప్పుడు దేవతలు యజ్ఞయాగాదులయందు తమ భాగములను మరల పొందిరి. మునులును రాక్షస వినాశము వలన నిశ్చింతగా తమ యజ్ఞయాగములను వేదాధ్యయనాదులను కొనసాగించిరి. పితృదేవతలును యధాపూర్వముగ తమ పిండములను పొందిరి. కావున అక్షయ తృతీయ దేవతలకు, మునులకు, పితృదేవతలకు సంతోషమును కలిగించినది అయ్యెను. ఈ విధముగ అక్షయ తృతీయ సర్వజీవులకును భుక్తిని, ముక్తిని యిచ్చి సార్ధక నామము కలిగియున్నది.


అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి అక్షయ తృతీయ మహిమను వివరించెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాస మహిమను వివరించుచు పలికెను.```


_*వైశాఖ పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం*_ 


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

దేవునికి కృతజ్ఞతలు

 *దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి 10 ప్రత్యేక కారణాలు*


1. రోడ్డు మీద టైర్లు నడుస్తున్న కొద్దీ అరిగిపోతాయి, కానీ మన పాదాల అరికాళ్ళు జీవితాంతం నడిచినా, పరిగెత్తినా దాదాపు అలాగే ఉంటాయి.


2. మానవ శరీరంలో దాదాపు 75% నీరే ఉంటుంది, అయినా లక్షలాది రంధ్రాలు ఉన్నా ఒక్క చుక్క కూడా బయటకు కారదు.


3. ఆధారం లేకుండా ఏ వస్తువూ నిలబడలేదు, అయినా మానవ శరీరం తనను తాను సహజంగా సమతుల్యం చేసుకుంటుంది.


4. రీఛార్జింగ్ చేయకుండా ఏ బ్యాటరీ పనిచేయదు, కానీ గుండె పుట్టినప్పటి నుండి మరణం వరకు ఆగకుండా కొట్టుకుంటూనే ఉంటుంది.


5. ఏ పంపు కూడా శాశ్వతంగా నడవదు, అయినా రక్తం జీవితాంతం శరీరంలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.


6. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరాలకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు ప్రతి దృశ్యాన్ని వేల మెగాపిక్సెల్‌లకు సమానమైన నాణ్యతతో చిత్రీకరిస్తాయి.


7. ఏ ప్రయోగశాల కూడా ప్రతి రుచిని పరీక్షించలేదు, అయినా నాలుక ఎలాంటి పరికరాలు లేకుండా వేలాది రుచులను గుర్తిస్తుంది.


8. అత్యంత అధునాతన సెన్సార్లకు కూడా పరిమితులు ఉంటాయి, కానీ మన చర్మం అతి చిన్న స్పర్శను, అనుభూతిని కూడా గ్రహించగలదు.


9. ఏ యంత్రమూ ప్రతి ధ్వనినీ సృష్టించజాలదు, కానీ మానవ స్వరం వేలకొద్దీ పౌనఃపున్యాలను సృష్టించగలదు.


10. ఏ పరికరమూ అన్ని ధ్వనులనూ పూర్తిగా విశ్లేషించజాలదు, కానీ మన చెవులు ప్రతి ధ్వనినీ అర్థవంతంగా గ్రహించి, అన్వయించుకుంటాయి.


దేవుడు ప్రసాదించిన ఈ అమూల్యమైన వరాలకు మనం కృతజ్ఞతతో ఉండాలి, ఫిర్యాదు చేయడానికి మనకు నిజంగా ఏ హక్కూ లేదు.


ప్రతి ఉదయం నిద్రలేవడమే ఒక అద్భుతం.

కాబట్టి ప్రతిరోజూ సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతలు తెలుపండి. 🙏


 జై శ్రీరామ్ జై హనుమాన్🙏