3, ఫిబ్రవరి 2026, మంగళవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 3 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము* 

           

                    *124 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*కుమారస్వామి పదవులను ఇప్పించుట*```


ఈ సమయమున భర్తలచే విడువబడిన సప్తఋషి పత్నులు అక్కడకు వచ్చారు. “కుమారా! దుర్జనులు కొందరు మేము అగ్నిదేవునితో చేరి నిన్ను కన్నామని అసత్యప్రచారం చేసారు. ఏ పాపం ఎరుగని మమ్ము భర్తలు వదిలి వేసారు. పుత్ర సమానుడవైన నీవే మమ్ములను రక్షించాలి” అని ప్రార్ధించారు. 


కుమారస్వామి దేవేంద్రునితో “అమ్మా! మీరు నాకు తల్లులు సందేహం లేదు” అని “దేవేంద్రా వీరికి తగిన పదవులు ఇమ్ము” అన్నాడు. 


దేవేంద్రుడు “కుమారా! దక్షప్రజాపతి కుమార్తెలు చంద్రుని వివాహమాడి అతని చుట్టూ తారలుగా విర్రాజిల్లు తున్నారు. అందులో రోహిణి నక్షత్రం పక్కన ఉన్న అభిజిత్ అనే తార చంద్రుని ప్రేమను అందరికన్నా అధికంగా పొందాలని తపస్సు చేసుకోవడానికి వెళ్ళింది. ప్రస్తుతం ఆస్థానంలో ఈ ఆరుగురు కృత్తికలను ఉంచవచ్చు” అన్నాడు. 


ఇంతలో స్వాహాదేవి అక్కడకు వచ్చి “కుమారా! నీవు నా పుత్రుడవు నాకు ఎప్పుడూ నీ దగ్గర ఉండాలని కోరికగా ఉంది” అన్నది. 


“అలాగే నీవు ఎల్లప్పుడూ నా చెంతనే ఉండి నాచే మీ కోడలుచే సపర్యలందుకుంటూ సుఖంగా ఉండు” అన్నాడు. 


ఇంతలో సప్తమాతృకలైన హవిష, కాళి, కౌశికి, ఉద్ధత, శారిక, ఆర్య, వైధాత్రి అక్కడకు వచ్చారు. వారు “షణ్ముఖా! ఇప్పుడు లోకమాతలుగా ఉన్న వారిని తొలగించి మమ్ములను ఆపదవిలో ఉంచు” అన్నారు. 


కుమారస్వామి “ఇప్పటివరకు ఉన్న మాతలను ఎలా తొలగిస్తాం. మీరు వేరే వరం కోరుకోండి” అన్నాడు.


వారు “లోకంలోని పసిపాపలను బాధించి పీడించే వరం ప్రసాదించు” అన్నారు. 


కుమారస్వామి “ఇలాంటి వరం కోరడం అనుచితము అలాంటి వరం ఇస్తున్నాను. మీకు మొక్కిన బాలలను ఎలాంటి హాని లేకుండా రక్షించండి. మీరు నరులను పదనారు వయసు వచ్చేదాకా బాధించండి. మీకు నా అంశతో పుట్టిన వాడిని రక్షగా నియమిస్తాను” అన్నాడు. 


ఇంకా శకుని మాత వినత, దైత్యమాత దితి, గోమాత సురభి, శునక మాత సరమ, వృక్షమాత కరంజ, సర్ప మాత కథ్రువ, కుమారుని మాత లోహితాస్య ఈ మాతృకలతో కలసి శిశువులను బాధిస్తూ ఉంటారు. అలాగే దేవ గ్రహములు, పితృ గ్రహములు, గంధర్వ గ్రహములు, యక్ష గ్రహములు నరులను బాధిస్తుంటాయి. కాని ధర్మరాజా! శివభక్తులను, పరిశుభ్రంగా ఉండే వారిని, శాంతి కాముకులకు, ఇంద్రియాలను జయించిన వారిని బాధించవు” అన్నాడు.```


*కుమారస్వామి స్వాహాదేవిని అనుగ్రహించుట*```


ఇంతలో అగ్నిదేవుని భార్య అక్కడకు వచ్చి “కుమారా! నేను దక్షప్రజాపతి కూతురును. నా తండ్రి నన్ను చిన్నతనంలోనే అగ్నిదేవునకిచ్చి వివాహం చేసాడు. నా భర్తకు నాపై అనురాగం లేదు నీవెలాగైనా అనురాగం కలిగేలా చెయ్యి” అని కోరింది. 


కుమారస్వామి “అమ్మా! బ్రాహ్మణులు అగ్నిలో హవ్యములు వేసేటప్పుడు స్వాహా కార మంత్రంతో వేస్తారు. అందు వలన నీకు నీ భర్తతో నిరంతర సాన్నిహిత్యం లభిస్తుంది” అన్నాడు. 


బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న శివుని చూసి “కుమారా! ఈయన మహాశివుడు త్రినేత్రుడు, త్రిపురాంతకుడు. ఈమె ఈయన భార్య పర్వతరాజ పుత్రి పార్వతి. వీరు నీ తల్లి తండ్రులు. వీరు యోగ బలంచే తమ తేజస్సును అగ్నియందు అతని భార్య యందు ప్రవేశపెట్టి నిన్ను కన్నారు. వీరిని భక్తితో ఆరాధించు” అన్నాడు. 


కుమారస్వామి పార్వతీపరమేశ్వరులకు భక్తితో నమస్కరించాడు. శివుడు కుమార సమేతుడై భద్రవటం చేరుకున్నాడు. వారి వెంట కుబేరుడు, దేవేంద్రుడు, అమోఘుడు అనే యక్షనాయకుడు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, యముడు, ఆదిత్యుడు, చంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్నిదేవుడు వెంట నడిచారు.```


     *మహిషాసురమర్ధన*```


ధర్మరాజా! ఆ సమయంలో మహిషాసురుడు రాక్షస సేనలతో దండెత్తి వచ్చాడు. క్షణాలలో దేవసైన్యాన్ని చిందరవందర చేసాడు. ఇది చూసి దేవతలు యుద్ధం చేయడం ఆపి పారిపోయారు. దేవేంద్రుడు వారికి ధైర్యం చెప్పి యుద్ధోన్ముఖులను చేసాడు. దేవతలకు రాక్షసులకు మధ్య భీకర పోరు జరిగింది. ఆ యుద్ధంలో శివుడు కూడా పాల్గొన్నాడు. మహిషాసురుడు శివుని రథం పట్టుకున్నాడు. దేవతలు శివుడు మహిషాసురుని చేతిలో మరణిస్తాడని భయపడ్డారు. శివుడు కుమారస్వామిని చూసి “కుమారా! చూసితివా వీడి సాహసం. నా రథాన్ని పట్టుకున్నాడు. వీడికి ఆయుషు మూడింది. వెంటనే వీడిని సంహరించు” అన్నాడు. కుమారస్వామి శక్తి ఆయుధాన్ని మహిషాసురుని పై ప్రయోగించాడు. అది మహిషాసురునితో అతని సైన్యాన్ని దహించింది. దేవతలు కుమారస్వామిని స్తుతించారు. 


శివుడు దేవతలతో “ఇతని పరాక్రమం చూసారా! ఇకపై మీరు నన్ను ఎలా పూజ్య భావంతో సేవిస్తారో ఇతనిని అలాగే సేవించండి” అని చెప్పి భద్రవటానికి వెళ్ళాడు. 


ఈ విధంగా కుమారస్వామి దేవతల శత్రువులను ఒక్క రోజులో జయించాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నక్షత్రం:ఆరుద్ర(Arudra/Aardra)*

 🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*మంగళవారం 3 ఫిబ్రవరి 2026*


          *నక్షత్ర స్తోత్ర మాలిక*

                

                *6 వ రోజు*

*నక్షత్రం:ఆరుద్ర(Arudra/Aardra)*


ఆరుద్ర నక్షత్రం సాక్షాత్తు పరమశివుని (రుద్రుని) జన్మ నక్షత్రంగా భావిస్తారు. 


*ఈ నక్షత్రానికి అధిదేవత రుద్రుడు. గ్రహాధిపతి రాహువు.*


రాహు గ్రహ దోషాలు పోవడానికి మరియు ఉగ్ర రూపంలో ఉన్న రుద్రుని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రం అద్భుతమైనది.


*అధిపతి: రాహువు (Rahu)*


*ఆరాధించాల్సిన దైవం: రుద్రుడు (శివుడు)*


​ఆరుద్ర నక్షత్ర జాతకులు, రాహు దోషం ఉన్నవారు మరియు శివ అనుగ్రహం కోరుకునేవారు పఠించాల్సిన విశేష స్తోత్రం:


           *"శ్రీ రుద్రాష్టకం:”*


​*నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపమ్।*

*నిజం నిర్గుణం నిర్వికల్పంనిరీహం చిదాకాశ మాకాశ వాసం భజేఽహమ్ ॥ 1॥*


​*నిరాకార మోంకార మూలం తురీయం*

*గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్।*

*కరాలం మహాకాల కాలంకృపాలం గుణాగార సంసార పారం నతోఽహమ్ 2॥*


​*తుషారాద్రి సంకాశ గౌరం గభీరం. మనోభూత కోటి ప్రభా శ్రీ శరీరమ్।*

*స్ఫురన్మౌలి కల్లోలినీ చారు గంగా లసద్భాల బాలేందు కంఠే భుజంగా ॥ 3 ॥*


​*చలత్కుండలం భ్రూ సునేత్రం విశాలం*

*ప్రసన్నాననం నీలకంఠం దయాలమ్ ।*

*మృగాధీశ చర్మాంబరం ముండమాలం*

*ప్రియం శంకరం సర్వనాథం భజామి ॥ 4 ॥*


​*ప్రచండం ప్రకృష్టం ప్రగల్భంపరేశం అఖండం అజం భానుకోటి ప్రకాశమ్ ।*

*త్రయః శూల నిర్మూలనం శూలపాణిం*

*భజేఽహం భవానీపతిం భావగమ్యమ్॥5॥*


​*కళాతీత కల్యాణ కల్పాంతకారి సదా సజ్జనానంద దాతా పురారి।*

*చిదానంద సందోహ మోహాపహారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారి॥6॥*


​*న యావద్ ఉమానాథ పాదారవిందం*

*భజంతీహ లోకే పరే వా నరాణామ్।*

*న తావత్ సుఖం శాంతి సంతాప నాశం*

*ప్రసీద ప్రభో సర్వభూతాధివాస॥7॥*


​*న జానామి యోగం జపం నైవ పూజాం*

*నతోఽహం సదా సర్వదా శంభు తుభ్యమ్।*


*జరా జన్మ దుఃఖౌఘ తాతప్యమానం*

*ప్రభో పాహి ఆపన్నమామీశ శంభో ॥ 8 ॥*

​*రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే।*

*యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ॥*


*​॥ ఇతి శ్రీ గోస్వామి తులసీదాస కృతం శ్రీ రుద్రాష్టకం సంపూర్ణమ్ ॥*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

వృద్ధుల కోసం

 *,,,,


 వృద్ధుల కోసం ఉచిత తిరుపతి బాలాజీ దర్శన పథకం ప్రారంభించారు*


*లబ్ధిదారులు: 65 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులు...*


*ఉచిత దర్శన సమయాలు:*

* ఉదయం 10:00 గంటలకు

* మధ్యాహ్నం 3:00 గంటలకు


*ప్రవేశించే విధానం:*

* మీరు *కౌంటర్ S-1* వద్ద మీ *ఫోటో గుర్తింపు కార్డు* మరియు *వయస్సు ధృవీకరణ పత్రం* చూపితే సరిపోతుంది.


*దేవాలయానికి మార్గదర్శకం:*

* వంతెన కింద ఉన్న గ్యాలరీ గుండా, దేవాలయం యొక్క కుడి గోడ వెంబడి ముందుకు సాగండి.

* మెట్లు ఎక్కవలసిన అవసరం లేదు.

* విశాలమైన స్థలం అందుబాటులో ఉంది.


*సౌకర్యాలు:*

1. *ఉచిత భోజనం:* దర్శనం తర్వాత, మీకు *ఉచితంగా వేడి సాంబార్ అన్నం, పెరుగు అన్నం మరియు వేడి పాలు* అందిస్తారు.

2. *బ్యాటరీ కార్లు:* సౌకర్యం కోసం, *బ్యాటరీ కార్లు* కూడా అందుబాటులో ఉన్నాయి, ఇవి మిమ్మల్ని *పార్కింగ్ ప్రాంతం* నుండి *కౌంటర్* వరకు మరియు అక్కడి నుండి నిష్క్రమణ ద్వారం వరకు తీసుకువెళ్తాయి.


*ముఖ్య గమనిక:*

* ఎటువంటి *బలవంతం* లేదా *ఒత్తిడి* లేదు - *దర్శనం* కేవలం *వృద్ధుల* కోసం మాత్రమే *కేటాయించబడింది*.

* మీరు *దర్శనం క్యూ*లో చేరిన తర్వాత, కేవలం *30 నిమిషాల్లో* మీ *దర్శనం* పూర్తి చేసుకుని *బయటకు* రావచ్చు.


*సహాయం కోసం సంప్రదించండి:*

*టిటిడి (తిరుమల తిరుపతి దేవస్థానం) హెల్ప్‌డెస్క్ నంబర్:* *8772277777*


*ప్రత్యేక అభ్యర్థన:* దయచేసి ఈ సమాచారాన్ని మీ ఇతర గ్రూపులలో కూడా అందరితో పంచుకోండి...!!

హెచ్చరిక

 ⚠️ హెచ్చరిక ⚠️

36 సంవత్సరాల వయస్సు గల ఒక పురుషునికి క్యాన్సర్ వచ్చింది. అది చివరి దశలో ఉంది. అతను తన జీవితంలో ఎప్పుడూ గుట్కా, సిగరెట్, పాన్ లేదా మద్యం సేవించలేదు. సమయానికి ఉద్యోగానికి వెళ్లడం, కుటుంబంతో సంతోషంగా జీవించడం — అదే అతని జీవితం. ఎలాంటి వ్యాధి లేదు, ఎలాంటి ఆందోళన లేదు.

కేవలం 2–3 రోజులుగా కడుపు నొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించి చికిత్స ప్రారంభించాడు. కానీ ఉపశమనం లేకపోవడంతో పెద్ద డాక్టర్‌ను కలిశారు. అన్ని పరీక్షలు చేయించగా కడుపులోని పేగుల్లో క్యాన్సర్ ఉందని తేలింది.

డాక్టర్ల చికిత్స ప్రారంభమైంది. చికిత్స సమయంలో అతని మొత్తం పొదుపు డబ్బుతో పాటు ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చింది. అయినప్పటికీ చివరికి అతను మరణించాడు.

డాక్టర్లు కుటుంబ సభ్యులకు శవ సంస్కారం చేయకుండా, మానవ సేవార్థం పరిశోధన కోసం శరీరాన్ని హాస్పిటల్‌కు దానం చేయమని సూచించారు. కుటుంబ సభ్యుల చర్చ అనంతరం శరీరాన్ని హాస్పిటల్‌కు పరిశోధన కోసం దానం చేశారు.

పరిశోధన తర్వాత తెలిసింది ఏమిటంటే — ప్లాస్టిక్‌లో వేడి ఆహారం తీసుకోవడం, ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు త్రాగడం వల్ల విడుదలయ్యే రసాయనాల కారణంగా ఈ క్యాన్సర్ వచ్చింది.

డాక్టర్లు వారి ఆహారపు అలవాట్ల గురించి తెలుసుకున్నారు. అతనికి రోజుకు 5–6 కప్పుల టీ తాగే అలవాటు ఉండేది. అతను టీ తాగిన చోట ప్లాస్టిక్ సంచిలో టీ తెచ్చి, ప్లాస్టిక్ కప్పుల్లో అందించేవారు అని తెలిసింది.

చాలా సార్లు మనం ప్లాస్టిక్ సంచుల్లో వేడి టీ, వేడి కూరలు లేదా ఇతర ఆహార పదార్థాలు తీసుకుని అదే తింటుంటాం. అదే నెమ్మదిగా మన శరీరంలో క్యాన్సర్‌గా మారుతుంది.

అతనితో పనిచేసిన సహచరులకూ వైద్య పరీక్షలు చేయించగా, చాలామందిలో క్యాన్సర్ ప్రభావం ఉన్నట్లు తేలింది. అందుకే డాక్టర్లు వారికి కూడా చికిత్స సూచించారు.

ప్రభుత్వం ఇంత ప్రమాదకరమైన, ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి కూడా హానికరమైన ప్లాస్టిక్ తయారీకి ఎలా అనుమతి ఇస్తుందో అని మనం ఆశ్చర్యపోతాం.

ప్రభుత్వం ప్లాస్టిక్ వాడకూడదని ప్రచారం చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. కానీ మనం మాత్రం అర్థం చేసుకోవడం లేదు. మనమే మనల్ని, మన కుటుంబ సభ్యులను నిర్లక్ష్యంగా మరణం వైపు నడిపిస్తున్నాం. ఫ్యాషన్ అనే అంధ పోటీలో పరిగెడుతున్నాం.

కాబట్టి వినమ్రంగా అందరికీ మనవి — ప్లాస్టిక్ వాడకాన్ని ఎంతవరకు సాధ్యమో తగ్గించండి. ప్లాస్టిక్ పాత్రల్లో వేడి ఆహారం తినకండి. ప్లాస్టిక్ బాటిల్‌లో నీరు త్రాగవద్దు. ముఖ్యంగా వేడి టీ, కాఫీని ప్లాస్టిక్ కప్పుల్లో త్రాగకండి.

ఈ సందేశాన్ని ఎక్కువగా గ్రూపులలో, మిత్రులకు పంపండి. వాళ్లను కూడా మరింత మందికి పంపమని కోరండి.

   ఇలాంటి సందేశాలు పంపితే ప్రకృతి, మానవ జీవితానికి పెద్ద అద్భుతాలు జరగవచ్చు.🙏

03ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

  🍁 *మంగళవారం*🍁

 *🌹03ఫిబ్రవరి2026🌹*                  

   *దృగ్గణిత పంచాంగం* 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : విదియ* ‌రా 12.40 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : మఖ* రా 10.10 ఉపరి *పూర్వ ఫల్గుణి* *( పుబ్బ )*

*యోగం : శోభన* రా 02.39 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : తైతుల* మ 01.11 *గరజి* రా 12.40 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 08.00 - 08.45 సా 04.30 - 05.30*

అమృత కాలం  :*రా 07.50 -09.24*

అభిజిత్ కాలం  :*ప 11.58-12.44*

*వర్జ్యం    : ఉ 10.29 - 12.02*

*దుర్ముహూర్తం  : ఉ 08.55 - 09.41 రా 11.06 - 11.56*

*రాహు కాలం  :మ 03.13-04.39*

గుళికకాళం      : *మ 12.21 - 01.47*

యమగండం    : *ఉ 09.30 - 10.55*

సూర్యరాశి : *మకరం*        

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.48* 

సూర్యాస్తమయం :*సా 06.12*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.38- 08.55*

సంగవ కాలం      :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.30*

అపరాహ్న కాలం    :*మ

01.30- 03.47*

*ఆబ్ధికం తిధి     :మాఘ బహుళ విదియ*

సాయంకాలం    :*సా 03.47- 06.05*

ప్రదోష కాలం      :*సా 06.05 - 08.35*

రాత్రి కాలం         :*రా 08.35 - 11.56*

నిశీధి కాలం        :*రా 11.56- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*

******************************

         *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


       *🍁శ్రీ ఆంజనేయ🍁*

*🍁సహస్రనామ స్తోత్రమ్.!!🍁*


*భర్గోరామో రామభక్తః* 

*కల్యాణః ప్రకృతిస్థిరః*

*విశ్వంభరో విశ్వమూర్తి* 

*ర్విశ్వాకారశ్చ విశ్వపః.!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 16వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷మంగళవారం 3 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 16వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *3వ తేదీ మంగళవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

            

మాఘ పురాణం పదహారవ అధ్యాయంలో…

పూర్వకాలమున ఒక విద్యాధరుడు సంతాన కాంక్షతో బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి, పుత్రికను వరంగా పొందినాడు. 

ఆమె అందగత్తె, సద్గుణాలతో తల్లిదండ్రులను మరియు చూసిన వారందరినీ సంతోషపెట్టేది. 

కానీ, ఎవరికిచ్చి పెళ్లి చేయాలా అని విద్యాధరుడు తికమక పడ్డాడు. అంతలో ఒక రాక్షసుడు ఆమెను చూసి మోహించి, బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించాడు. 

శివుని వరంగా త్రిశూలం పొందిన అతడు ఎవరినీ లెక్కచేయకుండా వుండేవాడు.

ఆపదలో ఉన్న కన్య నారదుడి సలహా మేరకు మాఘమాసమంతా మానస సరస్సులో స్నానం చేసి, శ్రీహరిని పూజించింది. మరోవైపు, శ్రీహరి భక్తుడైన హరిద్రధుడు నారదుడి ద్వారా ఆమె కష్టాలు తెలుసుకుని, సముద్రంలో ఉన్న రాక్షసుడిని శివుని త్రిశూలంతో సంహరించి, ఆమెను కాపాడాడు. వీరు వివాహం చేసుకుని, శ్రీహరికి ఎల్లప్పుడూ భక్తి చేస్తూ, మాఘమాస స్నానాలు, పూజలు చేసి, చివరికి శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందారు. 

ఈ కథ భక్తి శక్తి గొప్పదనం, మాఘమాస స్నాన మహిమ, మంచి పనుల ఫలితాలను చాటిచెబుతోంది..

 

        *విద్యాధర పుత్రిక కథ*```


“రాజా! మాఘ మాస స్నాన మహిమను తెలియచేయు మరియొక్క కథను వినుమని మరల ఇట్లు పలికెను... 

‘పూర్వము ఒక విద్యాధరుడు సంతానము కావలయునని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరము నందు తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడు ఇట్లు చిరకాలము తపస్సు చేయగా బ్రహ్మ సంతుష్టుడై అతనికి  ప్రత్యక్షమయ్యెను, వరమును ఇచ్చెదనని కోరుకొమ్మనెను. పుత్రునిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను. అప్పుడు బ్రహ్మ “నాయనా! నీకు పుత్ర సంతానయోగము లేదు. అయినను నీ తపముకై మెచ్చి పుత్రిక ననుగ్రహించుచున్నానని” అంతర్దానమునందెను. 


ఆమె పెరిగి పెద్దదయ్యెను, మిక్కిలి సుందరమై సద్గుణాన్వితయై కన్నవారికిని, తనను చూచినవారికిని, సంతోషమును కలిగించుచుండెను. విద్యాధరుడును ఆనందమును కలిగించు నీమెను యెవరికోయిచ్చి అత్తవారింటికి పంపజాలను. వివాహము చేసినను అల్లుడిని కూడ నా ఇంటియందు ఉంచుకొందునని నిశ్చయించుకొనెను.

ఒకనాడు ఒక రాక్షసుడు ఆమెను చూచెను, ఆ రాక్షసుడు దేవీ భక్తుడు. మిక్కిలి దివ్యశక్తులను సంపాదించెను, తాను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడ సంపాదించెను. ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమె పై మరులుకొనెను. ఆమెనెట్లైన వివాహము చేసికొనవలయునని తలచెను. ఆ రాక్షసుడు మిక్కిలి శక్తిమంతుడు, శివుని తపముచే మెప్పించి శివుని త్రిశూలమును వరముగా పొందెను. శివుడును వానికి శూలమును ఇచ్చుచు “ఓయీ! ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణించెదవని” చెప్పి ఇచ్చెను. వర గర్వితుడైన రాక్షసుడు నన్ను మించిన శత్రువు ఎవ్వడు నా ఆయుధము శత్రువునెట్లు చేరును అని తలచి వర గర్వితుడై ఎవరిని లెక్క చేయక ప్రవర్తించుచుండెను.

అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి “సుందరీ!నన్ను వరించుమ”ని యడిగెను, ఆమెయు నా తండ్రినడుగుమని చెప్పెను. రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తె నిచ్చి వివాహము చేయమని కోరెను. 


విద్యాధరుడు అతనికి తన కుమార్తె నిచ్చి వివాహము చేయుటకు తిరస్కరించెను. 


రాక్షసుడు చేయునది లేక తిరిగి వచ్చెను, విద్యాధరుని పుత్రికను హరించి సురక్షితంగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను. శుభ ముహూర్తమున ఆమెను వివాహమాడదలచెను.


విద్యాధరుడును తన పుత్రికయేమైనదో యని విచారించుచుండెను. ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తరువాత మంచి ముహూర్తము ఉన్నది, అంత వరకు ఆగమని చెప్పెను.


రాక్షసుడు అందుకు అంగీకరించెను. అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తరువాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును, ఈ లోపున నిన్నేమియు బాధింపను. నీవు కోరిన వస్తువులను తెచ్చి ఇచ్చెదననగా ఆమె ఏమియూ మాటలాడలేదు, రాక్షసుడు మరల మరల అడుగగా ‘నాకిప్పుడేమి అక్కరలేదు, ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతమున్నది, దర్శించి పూజించుటకు శివలింగం ఎచట ఉన్నదో చూపు మని అడిగెను. 


ఆ రాక్షసుడు పాతాళములో వున్న హటకేశ్వరుని చూపెను. 

విద్యాధర పుత్రికయు రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను. 


ఒకనాడామె పాతాళలోకమున నున్న హటకేశ్వర స్వామిని దర్శింప వెళ్లెను. అప్పుడఛటకు త్రిలోకసంచారియగు నారద మహర్షియు హటకేశ్వరుని దర్శింప వచ్చి యామెను జూచెను. 


ఆశ్చర్యపడి ‘అమ్మాయి! నీవిచటనున్నావేమని అడిగెను. 


ఆమెయు తన వృత్తాంతమును చెప్పెను. రాక్షసుడు తనను సముద్రము క్రింద నున్న గృహమున నిర్భంధించెనని చెప్పెను.               


నారదుడు ఆమె చెప్పినదంతయును వినెను. “అమ్మాయీ! భయపడకుము విష్ణుభక్తుడై నీకు భర్తయగు వానిని నీ వద్దకు పంపుదును. అతడే నీ భర్త విచారింపకుము. నా మాటను నమ్ముము. నీకొక ఉపాయమును చెప్పెదను వినుము. ఇచట శివునకెదురుగ మానస సరోవరము కలదు. మాఘమాసమున నీవీ సరస్సునందు స్నానమాచరింపుము. గంధపుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయుము. మాఘమాసమంతయు ఇట్లు చేయుము. ఇట్లు చేసిన వారు కోరినది లభించును. శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును. మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును. నా మాటను నమ్ముమ”ని చెప్పి నారదుదు తన దారిన పోయెను.


విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగ నమ్మెను. మాఘమాసమంతయు హటకేశ్వరపురమందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ మున్నగు వానిని చేయుచుండెను. 


నారదుని మాట యధార్థమగుటకై ఎదురు చూచుచుండెను. మాఘమాసమును వ్రతముతో గడపెను. నారదుడును లోకసంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీమహావిష్ణు భక్తుడగు హరిద్రధుడను మహారాజును జూచెను. ఆరాజు సర్వకాల సర్వావస్థలయందును శ్రీమహావిష్ణువును స్మరించుచుండును. అందరియందును శ్రీమన్నారాయణునే దర్శించును. వారిని హరీయని ఆహ్వానించును. విష్ణువాయని పిలుచును. గోవిందాయని మాటలాడును. శ్రీకృష్ణాయనుచు వస్తువును స్వీకరించును. దామోదరాయనుచు భుజించును, కేశవాయనుచు నిద్రించును. నరసింహాయని స్మరించును, హృషీకేశాయని మేల్కొనును, వామనాయనుచు తిరుగును, ఏపని చేయుచున్నను యెవరితో మాటలాడుచున్నను యేదో ఒక విధముగ శ్రీమన్నారాయణుని తలుచును. ఇట్లు విష్ణు భావనాతన్మయుడైన హరిద్రధుని వద్దకు నారదమహర్షి వెళ్లెను.

హరిద్రధుడును నారదమహర్షిని జూచి యెదురువచ్చి గౌరవించెను. తగిన ఆసనమున కూర్చుండబెట్టి అనేక ఉపచారములతో పూజించెను. 


నారదుడును “రాజా విద్యాధర కన్యనొక దానిని వర గర్వితుడైన రాక్షసుడొకడు బలాత్కారముగ నపహరించి సముద్ర గర్భమున దాచియుంచినాడు. ఆ విద్యాధర కన్యక త్రిలోకసుందరి, సద్గుణ శీల. నీవామెను భార్యగా స్వీకరింపవలెను. ఆ రాక్షసుని వాని శూలముతోనే సంహరింపవలయును.” అని వానికి తగినరీతిలో వివరించి నారదుడచట నుండి లోక సంచారార్థముపోయెను. 


హరిద్రధుడును సముద్రము వద్దకు పోయెను, నారదుడు చెప్పినట్లుగ సముద్రము వానికి తన లోనికి వచ్చుటకు మార్గము నొసగెను. 


హరిద్రధుడును ఆ రాక్షస గృహమును చేరెను. ఆ సమయమున రాక్షసుడింట లేడు. అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను. అతడు పోవుచు శూలము ఇంటిలో వుంచి వెళ్లెను. రాజు రాక్షసుని యింట నున్న శివుని శూలమును గ్రహించియుండెను.

రాక్షసుడింటికి వచ్చునప్పటికి తన శూలము పరహస్తగతమగుటను గమనించెను. ఆ రాజును చూచి యిట్టివానితో యుద్ధము చేసి మరణించినను మంచిదేయని తలచి హరిద్రధునితో యుద్ధము చేయసిద్ధపడెను. 


రాక్షసుడు-హరిద్రధుడు చాలా కాలము యుద్ధము చేసిరి, హరిద్రధుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను. 


ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను. ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకొనెను, వానిని భర్తగా వరించెను. హరిద్రధుడును ఆమెను వివాహమాడెను. ఆ దంపతులు విష్ణుభక్తులై విష్ణుపూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి. చిరకాలము సుఖశాంతులతో శుభలాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి,” అని వశిష్టుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```

 

*మాఘపురాణం పదహారవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

పురాణ కథ

  

శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹

ఒక స్త్రీ అనవసరంగా వైరం పెంచుకొని కురు వంశ పితామహుడైన భీష్మాచార్యుని మరణానికి ఎలా కారణమైందో చెప్పే ఈ పురాణ కథలో గొప్ప సందేశం ఉంది. మహిళలు తలుచుకొంటే ఒక కుటుంబాన్ని ఎంత వృద్ధి లోకి తీసుకురాగలరో, అదే పగబడితే ఎలా నాశనం చేయగలరో చెప్పే ఈ కథ తప్పక వినాలి. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు అందిస్తున్న పదవ పురాణ కథ. చరిత్ర లోని ఎన్నో విశేషాలు తెలిపే ఈ కథలు మిస్ అవకండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏



కుంభకర్ణుని ఆయుధమగు శూలము*

 *కుంభకర్ణుని ఆయుధమగు శూలము*

శత్రువులను క్షణములో పరిమార్చగలదు. 

పూర్తిగా నల్లని యినుముతో నిర్మితమైనది.

ఇంద్రుని వజ్రాయుధము వలె భయంకరమగునది. ప్రసిద్ధికెక్కినది.

దేవ దానవ యక్ష గంధర్వాదులను హతము చేయునది.

ఎర్రని మాలలతో అలంకరింపబడినది. 

మిక్కిలి తేజము కలది. 

సహజముగనే అగ్నికణములను విరజిమ్మునది.

దీని యొక్క బరువు వేయి బారువలు.


1400 గ్రాములు = ఒక వీసె,

8 వీసెలు = ఒక మణుగు (11200 గ్రాములు),

20 మణుగులు = ఒక బారువ

(2,24,00 గ్రాములు)

వేయిబారువలు = 224000000 గ్రాములు,

అనగా 2,24,000 రెండులక్షల ఇరువదినాలుగువేల కేజీలు.

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*639 వ రోజు*

అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసము

పితృయజ్ఞము

ధర్మరాజు " పితామహా ! పితృయజ్ఞము గురించి నాకు వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! దేవతారాధన కంటే పితృదేవతలను ఆరాధించడం ఎంతో గొప్పది. మనుష్యులకు తమ పితృదేవతలను ఆరాధించడం సర్వశుభములు చేకూరుస్తుంది. ప్రతి అమావాస్య నాడు పితృయజ్ఞము, పిండప్రదానం భక్తిశ్రద్ధలతో చేసిన వాడు నిత్యము పితృదేవతలను ఆరాధించిన ఫలము పొందుతాడు. పితృయజ్ఞము చేయాలో వివరిస్తాను. పాడ్యమి నాడు పితృదేవతలను పూజించిన వాడు అందమైన భార్యను పొందుతాడు. విదియనాడు పితృదేవతలను పూజించిన వాడికి అందమైన కుమార్తెలు జన్మిస్తారు. తదియ, చవితి తిధుల నాడు పితృదేవతల పూజించిన వాడు ధనికుడు ఔతాడు. పంచమినాడు పితృదేవతలను పూజించిన వాడు పుత్రవంతుడు ఔతాడు. షష్ఠి నాడు పితృదేవతల పూజించిన వాడు విద్యావంతుడు ఔతాడు. సప్తమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యవసాయ భూములకు అధిపతి ఔతాడు. అష్టమినాడు పితృదేవతల పూజించిన వాడు వ్యాపారవేత్త ఔతాడు. నవమినాడు పితృదేవతల పూజించినవాడు ఆవుల మందలను పొందుతాడు. దశమినాడు పితృదేవతల పూజించినవాడు లోహసంపదలు పొందుతాడు. ఏకాదశి నాడు పితృదేవతల పూజించినవాడు మంచి కుమారులను పొందుతాడు. ద్వాదశి, త్రయోదశినాడు పూజించినవాడు ధనధాన్యములను పొందుతాడు. చతుర్ధశినాడు పితృదేవతల పూజించినవాడు వీరస్వర్గం పొందుతాడు. పౌర్ణమి అమావాస్యలనాడు పితృదేవతల పూజించినవాడు సకలకోరికలను పొందగలడు.

పితృకార్య విధులు

ధర్మనందనా ! శ్రాద్ధకర్మ చేయుటకు కృష్ణపక్ష తిధులు, అపహార్ణము మంచివి. కాని పాడ్యమి, దశమి, చతుర్ధశి పితృ కార్యముకు పనికి రావు. పితృ కార్యములో తిలలు, పాయసము, నెయ్యి ఉత్తమము. ఆవుల పాలు, పెరుగు, వెన్న, నెయ్యి శ్రేష్టము. మత్స్యములు, మాంసము తగినంతగా ఉపయోగించిన ఫలితము లభిస్తుంది. పితృదేవతల అర్చనలో గొర్రె మాంసం, ఖడ్గ మృగ మాంసం, గండ మృగ మాంసం, మేక మాంసం, ఒక దాని కంటే ఒకటి మేలైనవి.

నక్షత్రాలు పితృకార్య విధులు

కృత్తిక నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన శత్రుభయం ఉండదు. రోహిణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన పుత్రసంతానప్రాప్తి కలుగుతుంది. మృగశిర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఓజస్సు ప్రాప్తిస్తుంది. ఆరుద్ర నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన క్రూరుడౌతాడు. పునర్వసు నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన తన కృషిఫలిస్తుంది. పుష్యమి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన మంచి పుష్టిగా ఉంటారు. ఆశ్లేష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వీరకుమారులు జన్మిస్తారు. మఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కులము వర్ధిల్లుతుంది. పూర్వ ఫల్గుణి నక్షత్రము పితృకార్యం నిర్వహించిన సౌభాగ్యవంతులు ఔతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతానవంతులు ఔతారు. హస్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్యసఫలత సిద్ధిస్తుంది. చిత్త నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన 'అందమైన సంతానం కలుగుతుంది. స్వాతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన వర్తక వాణిజ్యములు వృద్ధి చెందుతాయి. విశాఖ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది. అనూరాధ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం దక్కుతుంది. జ్యేష్ట నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజపూజితులు ఔతారు. మూల నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. పూర్వాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన సకలశోకాలు తొలగి పోతాయి. శ్రవణ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఉత్తమగతులు ప్రాప్తిస్తాయి. ధనిష్ఠ నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన రాజ్యాధికారం ప్రాప్తిస్తుంది. శతభిష నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన కార్య సాఫల్యత సిద్ధిస్తుంది. పూర్వాబాధ్ర నక్షత్రము, ఉత్తరాబాధ్ర నక్షత్రములలో పితృకార్యం నిర్వహించిన గోసంపద పెరుగుతుంది. రేవతి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన లోహవృద్ధి కలుగుతుంది. అశ్వని నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన అశ్వసంపదవృద్ధి చెందుతుంది. భరణి నక్షత్రములో పితృకార్యం నిర్వహించిన ఆయుః ప్రమాణం వృద్ధి చెందుతుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

నక్షత్రం- మృగశిర(Mrigashira)* *అధిపతి - కుజుడు (Mars)



          *నక్షత్ర స్తోత్ర మాలిక*

                 ➖➖➖✍️

                   5 వ రోజు


*నక్షత్రం- మృగశిర(Mrigashira)*


*అధిపతి - కుజుడు (Mars)


*అధిదేవత_ సోముడు* (చంద్రుడు)


*ఆరాదించాల్సిన దైవం*


*చంద్రశేఖరుడు* 


*అపమృత్యు భయాలు పోవడానికి, ఆరోగ్యానికి మరియు రక్షణ కోసం పఠించాల్సిన స్తోత్రం.*


 *శ్రీ చంద్రశేఖరాష్టకం:* 


*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్।*

*చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్॥*


*రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం*

*సింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానన సాయకమ్।*

*క్షిప్రదగ్ధ పురత్రయం త్రిదివాలయై రభివందితం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 1 ॥*


*పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం*

*ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మథ విగ్రహమ్।*

*భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 2 ॥*


*మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం*

*పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్।*

*దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర జటాధరం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 3 ॥*


*యక్షరాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం*

*శైలరాజ సుతాపరిష్కృత చారువామ కళేబరమ్।*

*క్ష్వేలనీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 4 ॥*


*కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం*

*నారదాది మునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరమ్।*

*అంధకాంధక నాశనం అమరాధిప ప్ర్రియం అద్వయం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 5 ॥*


*భేషజం భవరోగిణాం అఖిలాపదాం అపహారిణం*

*దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్।*

*భుక్తి ముక్తి ఫలప్రదం సకలాఘసంఘ నిబర్హణం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 6 ॥*


*భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం*

*సర్వభూత పతిం పరాత్పరమ్ అప్రమేయమ్ అనుత్తమమ్।*

*సోమవారిన హుతాశన సోమ పాద్యఖిలాకృతిం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 7 ॥*


*విశ్వసృష్టి విధాయినం పునరేవ పాలన తత్పరం*

*సంహరంత మపి ప్రపంచమ్ అశేషలోక నివాసినమ్।*

*క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం*

*చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః॥ 8 ॥*


*మృత్యుభీత మృకండుసూను కృతస్తవం శివసన్నిధౌ*

*యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్।*

*పూర్ణమాయు రరోగతాం అఖిలార్థ సంపదమాదరం*

*చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః॥*


॥ *ఇతి శ్రీ మార్కండేయ కృత చంద్రశేఖరాష్టకం సంపూర్ణమ్॥*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

పరోపకారం

 పరోపకారం చేసే వారి కోసమే పుణ్యం ఎదురు చూస్తూ ఉంటుంది.

వారిని చూసిన, వారి గురించి విన్నా, వారి తో కలిసి పనిచేసే అవకాశం కూడా పుణ్యం తో కూడినదే.

వారిని కష్ట నష్టా లకు గురి చేయడం వలన కొంత సమయం తరువాత మనం పశ్చాత్తాపం చెందడం కూడా పుణ్యమే.

అందుకే పరోపకారం చేయడం, లేదా అటువంటి వారి సాంగత్యం కాలక్రమంలో మానవ జన్మకు సార్ధకత చేకూరుస్తుంది

దేహం తండ్రి ప్రసాదం*

 


          *దేహం తండ్రి ప్రసాదం*

                  ➖➖➖✍️



*’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.*


*‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు  స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.*


*తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.*


*తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది.*


*తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.*


*తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.*


*‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.*


*‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి.*

*దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు.*


*అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.*


*వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన ‘శ్రవణ కుమారుడు’ …*


*అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ‘ప్రవరాఖ్యుడు’ …*


*అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు …*


*ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.*


*అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.*


*అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’ కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.*


*ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే!*


*కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం.*

*‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.*


*కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’ లను మొదటి రెండుగా చెబుతారు.*


*వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక!*


*ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక!*


*లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.*


*అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!*


*అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.*


*ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!*


*అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.*


*శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం🕉️🚩🕉️

శ్రీ వేద గిరిశ్వర ఆలయం

  🕉 మన గుడి : నెం 1376


⚜  తమిళనాడు : తిరుకలుకుండ్రం - కాంచీపురం


⚜  శ్రీ వేద గిరిశ్వర ఆలయం 


💠 తమిళనాడులోని వేదగిరీశ్వర ఆలయం కృతయుగంలో ఉద్భవించి త్రేతా మరియు ద్వాపర యుగాలలో కొనసాగిన శివాలయాలలో ప్రస్తుత కలియుగంలో ఉనికిని చూపించే పక్షి తీర్థంగా ప్రసిద్ధి చెందింది.


💠 శివుడు నాలుగు వేదాలను తిరుకలుకుండ్రం కొండపై నాలుగు శిలలుగా మార్చి వాటిపై నివసించాడు. 

ఆ విధంగా నాలుగు భాగాల తిరుకలుకుండ్రం కొండ వేదగిరిగా మరియు వేదాలచే ఏర్పడిన కొండపై ప్రతిష్టించబడిన వేదగిరీశ్వర్ పేరుతో శివుడిగా మారిందని చెబుతారు.


💠 తిరు అంటే గౌరవం, కజుగు అంటే రాబందు లేదా డేగ, మరియు కుంద్రం అంటే తమిళ భాషలో కొండ. తిరుకరుకుంద్రం ఈ మూడు పదాల కలయిక.


💠 వేదగిరీశ్వర ఆలయం తమిళంలో కజుకు కోయిల్ అని పిలువబడే పక్షి తీర్థంలో ఉంది, దీనిని తిరుకలుకుండ్రం అని కూడా పిలుస్తారు. 

పక్షి తీర్థం రెండు గద్దలు (గండబెరుండ పక్షులు) ఆలయానికి వచ్చి కొండపై ఉన్న ఆలయాన్ని చుట్టుముట్టడానికి ప్రసిద్ధి చెందింది.  వేల సంవత్సరాల నుండి రెండు గద్దలు ప్రతిరోజూ మధ్యాహ్నం వచ్చి పూజారి నుండి ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. 


💠 శాస్త్రీయంగా రాబందులు అని పిలువబడుతున్నప్పటికీ, విష్ణువు వాహనం అయిన గరుడ వంటి ఈ పక్షులు పూజారి నుండి సాంప్రదాయకంగా బియ్యం, గోధుమలు, నెయ్యి మరియు చక్కెరతో చక్ర పొంగల్ అని పిలువబడే ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తాయి. 

తరువాత ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు.


💠 పర్యాటకులు మరియు భక్తులు వేచి ఉండి పక్షుల ఆశీర్వాదాలను స్వీకరిస్తారు, ఋషుల ఆశీర్వాదం అనే భావనతో పర్యాటకులు మరియు భక్తులు పక్షులను ఆకర్షించడానికి చాలా పూజలు చేస్తారు.


💠 పక్షి తీర్థంలో గరుడ పక్షుల రాక గురించి పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుడి మనస్సు నుండి జన్మించిన ఎనిమిది మంది కుమారులు తమ ఆనందాలను నెరవేర్చుకోవడానికి శివుడి కోసం తీవ్రమైన తపస్సు చేశారు. 

శివుడు కనిపించినప్పుడు, వారు సంకోచించి మోక్షాన్ని కోరుకున్నారు.


💠 శివుడు వారి ఉద్దేశాన్ని గ్రహించి, వారి చెడు మనస్తత్వం కారణంగా వారిని గద్దలుగా జన్మించమని శపించాడు. 

వారు తమ అజ్ఞానాన్ని క్షమించమని శివుడిని వేడుకున్నారు. 

శివుడు వారిద్దరినీ ప్రతి యుగంలో గద్దలుగా జన్మించి, తనను వేదగిరీశ్వరునిగా పూజిస్తే, వారు పాపం నుండి విముక్తి పొంది శాపం నుండి విముక్తి పొందవచ్చని చెప్పాడు. 


💠 మూలాల ప్రకారం, శివుడు శపించిన 8 మంది ఋషులు యుగానికి ఇద్దరు చొప్పున పక్షుల రూపంలో జన్మించారు మరియు యుగాంతం వరకు వేదగిరీశ్వరుడిని పూజించడం ద్వారా వారి శాపం నుండి విముక్తి పొందారు.  


💠 కృతంలో సంధనుడు మరియు ప్రశాంతుడు, త్రేతాయుగంలో సంపాతి మరియు జటాయువు, ద్వాపరంలో శంభుక్తుడు మరియు ముకుందుడు అనే ఆరుగురు ఋషులు గద్దలుగా జన్మించారు. 


💠 ఒక స్థానిక పురాణం ప్రకారం, వారు ఉదయం గంగానదిలో స్నానం చేసేవారు, మధ్యాహ్నం తిరుకలకుండ్రంలో ఆహారం తీసుకునేవారు, సాయంత్రం రామేశ్వరంలో శివుడిని పూజించేవారు మరియు రాత్రి చిదంబరం చేరుకుని వారి శాపం నుండి విముక్తి పొందేవారు.


💠 వేదగిరిశ్వరర్ అంటే సంస్కృతంలో "వేద పర్వతాల ప్రభువు (గిరులు)" అని అర్థం, మరియు వేదగిరిశ్వర ఆలయం నిర్మించబడిన కొండ శివుడు స్వయంగా సృష్టించిన వేదాలను సూచిస్తుంది. 


💠 భరద్వాజ మహర్షి అన్ని వేదాలను నేర్చుకోవడానికి దీర్ఘాయువు కోసం శివుడిని ప్రార్థించాడు. 

వేదాలను చూసి నేర్చుకోవాలనే కోరికకు ప్రతిస్పందనగా, శివుడు ఋగ్, యజుర్ మరియు సామ వేదాలు అనే మూడు పర్వతాలను సృష్టించాడు.  

శివుడు ఒక పిడికెడు మట్టిని తీసుకుని భరద్వాజతో, తాను నేర్చుకోగల వేదాలు పర్వతాలతో పోలిస్తే చాలా తక్కువని, మోక్షాన్ని పొందడానికి నేర్చుకోవడం మార్గం కాదని, కలియుగంలో మోక్షానికి సులభమైన మార్గం దేవుని పట్ల భక్తి, సేవ మరియు అతని సృష్టి పట్ల ప్రేమ అని చెప్పాడు.


💠 ఈ ఆలయం రెండు నిర్మాణాలను కలిగి ఉంది, ఒకటి కొండ దిగువన మరియు మరొకటి కొండ పైభాగంలో ఉంది. 

ప్రధాన ఆకర్షణ, పెద్ద ఆలయ కొండ పైభాగంలో ఉన్న ఆలయంలో 

వేదగిరిశ్వరుడు అనే పేరుతో శివుడు

ఉన్నాడు. 

కొండ దిగువన ఉన్న ఆలయం త్రిపురసుందరి అమ్మన్ అని పిలువబడే పార్వతి దేవికి అంకితం చేయబడింది.


💠 ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర్ వద్ద ఉన్న ఆలయ గోపురాల నిర్మాణాన్ని పోలి ఉంటాయి. 


💠 12 సంవత్సరాలకు ఒకసారి తీర్థంలో శంఖం పుడుతుంది. 

ఈ అద్భుతం ఇప్పటికీ జరుగుతుంది. 

ఆలయంలోని చెరువు మూలికా లక్షణాలను కలిగి ఉండటం గమనార్హం. 

మానసిక వికలాంగులు

ఇక్కడి శంఖు తీర్థంలో స్నానం చేసిన తర్వాత కొండ చుట్టూ తిరుగుతే మానసిక సమస్యలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. 


💠 తిరుకలుకుండ్రం వేదగిరిశ్వరర్ కొండల ఆలయం దాదాపు 264 ఎకరాల విస్తీర్ణంలో ఉంది, యాత్రికులు సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయంలో కొండ చుట్టూ తిరుగుతారు. 



💠 మహాబలిపురం నుండి 14 కి.మీ, చెన్నై నుండి 50 కి.మీ దూరం



రచన

©️ Santosh Kumar

ఎందరినేదరి జేర్చిన

  *2323*

*కం*

ఎందరినేదరి జేర్చిన

సందరమున నొంటరిగనె సాగు తరి గతిన్

అందరితో కలిసి బతికి

యందరి పరయానమొంటి యాతనె సుజనా.

*భావం*:-- ఎంతమందిని ఏ యే ఒడ్డులకు చేర్చిననూ సముద్రంలో నావ(తరి) ఒంటరిగా నే సాగే విధంగా అందరితో నూ కలిసి బతికే అందరియొక్క మరణయానమూ ఒంటరి వేదనయే.

*సందేశం*:-- అందరితోనూ కలిసే బతికిననూ చివరకు మరణము మాత్రం ప్రతీ ఒక్కరికీ ఒంటరి ప్రయాణమే,అంటే మృత్యువు (మరణం) ఏ ఒక్కరికో బంధువూ కాదు,ఎవరితోనూ మిత్ర శత్రు త్వాలు తనకు ఉండవు,అది కేవలం మన ఆత్మ ను భూలోకం నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళే నావ మాత్రమే.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

సుభాషితమ్

  🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝   *అత్యార్యమతిదాతారం*

            *అతిశూరమతివ్రతమ్* l

            *ప్రఙ్ఞాభిమానినం చైవ*

            *శ్రీర్భయాన్నోపసర్పతి* ll


      *మహాభారతమ్ - ఉద్యోగపర్వం*


తా𝕝𝕝 *"అతి మంచితనం కలవాడి దగ్గరకు, అతిగా దానం చేసేవాడి దగ్గరకు, అతి పరాక్రమవంతుడి దగ్గరకు, తన తెలివిమీద అభిమానం కలవాడి దగ్గరకు లక్ష్మీదేవి భయంతో చేరదు....*🧘‍♂️🪷


✍️🌹💐🌸🙏