25, మార్చి 2026, బుధవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                       1️⃣7️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *175 వ రోజు*                   

*విరాట పర్వము ద్వితీయాశ్వాసము*


*నర్తనశాల*```


ఇద్దరూ నర్తనశాలను చేరుకున్నారు. నర్తనశాలలో ఒక పక్కగా ఉత్తర పడుకునే పాన్పు మీద భీముడు పడుకున్నాడు. ద్రౌపది ఆ పక్కనే కనపడకుండా దాక్కున్నది. ఇంతలో కీచకుడు మధ్యం సేవించి మత్తుగా అక్కడకు వచ్చాడు. మాలిని అప్పటికే అక్కడికి వచ్చి ఉంటుందని అనుకున్నాడు. మంచంలో పడుకున్న భీముని చూసి పిచ్చివాడై తన చేతిని ఆ శయ్య పై వేసాడు. భీమునికి పట్టరాని కోపం వచ్చింది. కీచకుడు భీమునిపై చేయి వేసి “మాలినీ! నీ కోసం ఎన్నో కానుకలు తెచ్చాను. ఇంత వరకు నా కోసం వచ్చే స్త్రీలు నాకు కానుకలు సమర్పించే వారు. నన్ను చూసిన స్త్రీలు మరొకరిని కన్నెత్తి చూడరు. నా కోసమే తపిస్తారు. అలాంటిది నేను నీకోసం తపిస్తున్నాను” అన్నాడు కీచకుడు. 


భీముడు కూడా స్త్రీ సహజమైన గొంతుతో “మిమ్మల్ని మీరు పొగుడు కుంటున్నారు కాని అసలు నా వంటి స్త్రీ మీకు దొరుకునా. నా శరీరానికి నీశరీరం తగిలినప్పుడు కలిగే అనుభూతి తెలుసుకుంటావులే. నన్ను తాకిన నీకు మరొకరిని తాకే పని ఉండదులే. నన్ను తాకిన ఫలితం అనుభవిస్తావులే” అని తటాలున పైకి లేచాడు. కీచకుని తల పట్టుకుని వంచాడు. కీచకుడు మాలిని భర్త గంధర్వుడు వచ్చాడు అనుకున్నాడు. భీముని పట్టు విడిపించుకుని కింద పడవేసి మోకాళ్ళతో అదిమాడు.

```

*కీచక భీములపోరాటం*```


ఇరువురి మధ్య భయంకర యుద్ధం సాగింది. ఒకరిని మించి ఒకరు పోరాడుతున్నారు. ఇరువురిలో కొంత భయం ఉంది పరువు పోతుందని కీచకుడు, అజ్ఞాతవాస భంగం ఔతుందేమోనని భీముడు మౌనంగా యుద్ధం చేస్తున్నారు. 


క్రమంగా కీచకుని బలంతగ్గి పోయింది భీన్మసేనుని బలం ద్విగుణీకృతం అయింది. ఆ విషయం గ్రహించిన భీముడు కీచకుని ఉదరభాగంలో భయంకరంగా పొడిచాడు. ఆ దెబ్బకు కీచకుడు విలవిలా తన్నుకున్నాడు. కీచకుని దారుణంగా చంపాలనుకున్న భీముడు కీచకుని తలని, కాళ్ళను, చేతులను మొండెంలోకి జొనిపి నేల మీద వేసి పొర్లించి నలిపి మాంసం ముద్దగా చేసాడు. కీచకుడు మరణించాడు. భీముడు ద్రౌపదిని పిలిచి కీచకుని శవాన్ని చూపించాడు. ద్రౌపది ఆనందంగా చూసింది. ఆమె మనసులో “కీచకా! ఇందుకా ఈ సుఖం పొందటానికా ఇంతగా ఆరాట పడ్డావు” అనుకున్నది. 


భీముడు “ద్రౌపదీ! నీ మాట నెరవేర్చాను ఆనందమేగా. నిన్ను ఎవరైనా దుర్బుద్ధితో చూస్తే వారికి 

నా భుజబలంతో ఇలాంటి మరణాన్ని ప్రసాదిస్తానని తెలుసుకున్నావా. నీ మనసు శాంతించింది కదా” అన్నాడు. 


ద్రౌపది ఆనందంతో “నిన్న కొలువులో కీచకుడు నన్ను అవమానించినప్పుడు నీవు చూపిన నిగ్రహం మెచ్చతగినది. ఈ నాడు ఇలా మరొకరి సాయం లేక కీచకుని వధించిన నీ శౌర్యం కొనియాడ నా తరమా భీమసేనా” అన్నది. 


ద్రౌపది మాటలకు భీముడు పొంగి పోయాడు. అతనిలో వివేకం మేలుకొంది. ద్రౌపదీ “ఇక నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు వెళుతున్నాను" అని చెప్పి వడివడిగా వంటశాలవైపు వెళ్ళాడు.

```

  ``

*విరాట పర్వము..* *ద్వితీయాశ్వాసము సమాప్తం*


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

26మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🌷గురువారం🌷*

*🌹26మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*                                        

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - శుక్ల పక్షం* 


*తిథి : అష్టమి* ఉ 11.48 వరకు ఉపరి *నవమి*  

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 04.19 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : శోభన* రా 12.32 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : బవ* ఉ 11.48 *బాలువ* రా 10.55 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:* 

*ఉ 09.00-10.00 & 11.00-12.00 సా 04.00-06.00*               

అమృత కాలం  : *ఉ 06.50 - 08.21*

అభిజిత్ కాలం  : *ప 11.49 - 12.38*

*వర్జ్యం    : రా 03.51 - 05.24 తె*

*దుర్ముహూర్తం  : ఉ 10.11 - 11.00 మ 03.04 - 03.53*

*రాహు కాలం   :మ 01.45-03.16*

గుళికకాళం      : *ఉ 09.10 - 10.42*

యమగండం    : *ఉ 06.07 - 07.39*

సూర్యరాశి : *మీనం*                     

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 06.16*  

సూర్యాస్తమయం :*సా 06.28*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.07- 08.34*

సంగవ కాలం      :*08.34 - 11.00*

మధ్యాహ్న కాలం    :*11.00 - 01.26*

అపరాహ్న కాలం :*మ 01.26-03.53*

*ఆబ్ధికం తిధి    : చైత్ర శుద్ధ నవమి*

సాయంకాలం    :*సా03.53- 06.19*

ప్రదోష కాలం      :*సా 06.19- 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.49*

నిశీధి కాలం        :*రా 11.49- 12.36*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.32 - 05.19*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*శత్రునాశకరం స్తోత్రం* 

*జ్ఞానవిజ్ఞానదాయకమ్*

*సర్వపాపం శమం యాతి* 

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 25 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

         *36 - 37వ భాగం*


*ధ్రువ చరిత్ర*```


ప్రస్తుత బ్రహ్మ జీవితకాలంలో భూమండలాన్ని పద్నాలుగు మంది మనువుల పరిపాలిస్తారు. వారిలో స్వాయంభువ మనువు మొదటి వాడు. స్వాయంభువ మనువుకి శతరూపకు ప్రియవ్రతుడు, ఉత్తాన పాదుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఉత్తానపాదునికి ఇద్దరు భార్యలు. పెద్దభార్య సురుచికి ఉత్తముడు, రెండవ భార్య సునీతికి ధ్రువుడు పుత్రులుగా జన్మించారు.


ఉత్తానపాదుడు పెద్దభార్య సురుచికిపై ఎక్కువ ప్రేమ చూపిస్తూ చిన్న భార్య సునీతిని దూరంగా ఉంచేవాడు. పెద్దభార్య కుమారుడు ఉత్తముడికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవాడు. చిన్నభార్య సునీతి గమనించి తన కుమారుడు ధ్రువునికి నారాయణుని పై భక్తి అలవాటు చేసింది. అయినా ధ్రువునికి మనస్సులో తండ్రి ప్రేమాభిమానాలు పొందాలని, తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని ఉండేది.


ఒకరోజు సింహాసనంపై ఉత్తానపాదుడు తన పెద్ద కుమారుడు ఉత్తముని ఊరువు(తొడ)పై కూర్చుండబెట్టుకుని ప్రేమతో లాలిస్తూ ఆడించసాగాడు. అది చూసిన ధ్రువుడు తనూ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోవాలి అని పరిగెత్తుకుంటూ దగ్గరకు వెళ్లాడు. పెద్దరాణి సురుచి చూసి పట్టుకుని ఆపి “ధ్రువా! ఉత్తముడు పట్టపురాణి అయిన నా కుమారుడు కనుక సామ్రాజ్యానికి వారసుడు. చక్రవర్తి అంకపీఠంపై(తొడపై) కూర్చునేందుకు అర్హత ఉంది. నీవు నా సవతి కుమారుడివి. కనుక రాజ్యార్హత, తండ్రి ఒడిలో కూర్చుని ప్రేమాభిమానాలు పొందే అర్హత, అధికారం నీకు లేదు" అని కసిరి వెళ్లిపొమ్మంది. 


తండ్రి ఉత్తానపాదుడు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. 


బాలుడైన ధ్రువుడు దుఖంతో తల్లి వద్దకు వెళ్లి జరిగింది చెప్పి ఏడవసాగాడు. తల్లి సునీతి ధ్రువుని కన్నీరు తుడిచి "లోకంలో అందరికి నారాయణుడు వారి పూర్వజన్మ కర్మ ఫలాల బట్టి సుఖాలు, అదృష్టాలు, అర్హతలు ప్రసాదిస్తాడు. మీ పెద్దమ్మ కుమారుడు ఉత్తముడు పూర్వజన్మ పుణ్య ఫలం వలన పట్టపురాణికి పుట్టి తండ్రి ప్రేమాభిమానాలు, రాజార్హత సంపాదించాడు. నీవు నావంటి దురదృష్టరాలికి పుట్టావు. ఇంతే ప్రాప్తం అని సర్దుకుపోవాలి" అంటూ ఓదార్చింది.


తల్లి మాటల వలన ధ్రువునికి నారాయణుడి అనుగ్రహం సంపాదిస్తే తన తలరాత మారి తండ్రి ప్రేమాభిమానాలు లభిస్తాయి అని అర్థమైంది. 


వెంటనే లేచి తల్లికి నమస్కరించి “అమ్మా! నేను తపస్సు చేసి నారాయణుని అనుగ్రహం పొంది తండ్రి ప్రేమాభిమానాలు సంపాదించుకుంటాను. ఆశీర్వదించి అనుమతి ఇవ్వండి" అని కోరాడు. 


కుమారుని మాటల్లో గల ధృఢ సంకల్పం గ్రహించి సునీతి ఆశీర్వదించి అనుమతిచ్చింది.


ధ్రువుడు అడవికి తపస్సుకి బయలుదేరి వెళ్లాడు. 


పూర్వజన్మ పుణ్య ఫలం వలన ధ్రువునికి మార్గ మధ్యలో నారదుడు, సప్తర్షుల దర్శన భాగ్యం కలిగింది. వారు బాలుడైన ధ్రువుని వివరాలు తెలుసుకుని అతని ధృడ సంకల్పం విని సంతోషం చెందారు. నారాయణుని అష్టాక్షరి మహామంత్రం ‘ఓం నమో నారాయణాయ’ ను నారదుడు విధి పూర్వకంగా ఉపదేశం చేశాడు. 


“నాయనా! ధ్రువా! భక్తి శ్రద్థలతో ఈ నారాయణ మంత్ర జపం చేస్తూ తపస్సు చేయుము. నారాయణుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది" అని ఆశీర్వదించి వెళ్ళారు.  


ధ్రువుడు అడవిలో సరోవరం సమీపంలో మంచి ప్రదేశం చూసుకుని శుచియై తపస్సుకి కూర్చున్నాడు. నారాయణుని చిత్తములో నిలుపుకుని ధ్యానమగ్నుడై తపస్సు చేయసాగాడు.


కాలము, ఆకలిదప్పులను మరచిపోయాడు. ధ్రువుని తపస్సు యొక్క తేజస్సు క్రమ క్రమంగా పెరిగి ముల్లోకాలకు వ్యాపించి దహించసాగింది. దేవలోకము కంపించింది. దేవేంద్రుడు ధ్రువుని తపస్సు ఆపదలు కలిగిస్తుంది అని తలచి దిక్పాలకులను పిలిచి తపస్సు భంగం చేయమని ఆదేశించాడు. 


వరుణుడు కుంభవృష్టి కురిపించాడు.. వాయుదేవుడు సుడిగాలి ప్రభంజనాలు సృష్టించాడు. అగ్నిదేవుడు దావానలం సృష్టించి అడవిని దహనం చేశాడు. 


యముడు భయపెట్టాలని భూత ప్రేతాలు, భయంకర సర్పాలు ప్రయోగించాడు. 


ధృవుని చుట్టూ తపోతేజస్సు వలన ఏర్పడ్డ శక్తి వలయం వేటినీ దగ్గరికి రాకుండా, ధ్రువుని తపస్సుకి భంగం చేయకుండా చూసింది.  


ఆగ్రహం చెందిన ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. అది కూడా ధ్రువుని చుట్టు ఏర్పడిన తేజోవలయం దాటలేక వెనక్కు తిరిగి వచ్చింది. భయపడిన ఇంద్రుడు వైకుంఠం పరిగెత్తుకుంటూ వెళ్లి నారాయణుని దర్శనం పొంది నమస్కరించి


"నారాయణా! ధ్రువుడి తపస్సు వలన కలిగే అగ్ని ముల్లోకాలను దహిస్తోంది. తపస్సు భంగం చేయాలన్న దిక్పాలకుల ప్రయత్నాలు విఫలం అయ్యాయి. నా వజ్రాయుధం కూడా ఏమి చేయలేక వెనక్కు వచ్చింది. నీవు ధ్రువుని అనుగ్రహించి తపస్సు ఆపకపోతే ముల్లోకాలు ఆ పసివాడి తపశక్తికి కాలి బూడిదై పోతాయి. మమ్మల్ని, లోకాలను రక్షింపుము" అని ప్రార్ధించాడు.


ఇంద్రునికి అభయమిచ్చి పంపి నారాయణుడు ధ్రువుని తపస్సుకి మెచ్చి అతని ఎదుట ప్రత్యక్షమై "కుమారా! ధ్రువా! నీ భక్తికి ప్రసన్నత చెంది వచ్చాను. కన్నులు తెరువుము" అని అప్యాయంగా పిలిచాడు. ధ్రువునికి దివ్యదృష్టి లభించి కన్నులు తెరచి చతుర్భుజుడు, ముగ్ద మనోహరుడు అయిన నారాయణుని చూసి పరవశించి పోయాడు. కన్నుల నుండి ఆనందబాష్పాలు జలజలా జారుతున్నాయి.


"తండ్రీ! నారాయణా! నన్ను అనుగ్రహించి దర్శన భాగ్యం కలిగించావు. నా తల్లి వర్ణించినట్టు నీ దివ్య సుందర రూపం ఉంది. ఓం నమో నారాయణాయ" అని పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీహరి ప్రేమతో ధ్రువుని లేపి దగ్గరకు తీసుకుని "ధ్రువా! కోరుకో నాయనా! కోరినవన్నీ అనుగ్రహిస్తాను" అని పలికాడు.


ఆనందబాష్పాలు ఆపుకుంటూ భక్తి తన్మయత్వంతో "నారాయణా! నా సవతి తల్లి సురుచి చేసిన అవమానం భరించలేక నీ అనుగ్రహంతో తండ్రి ప్రేమాభిమానాలు, రాజ్యాధిపత్యం పొందాలని తపస్సు ఆరంభించాను. నీ దివ్య దర్శనంతో నాలోని కోరికలన్ని నశించి పోయాయి. సదా నీ సన్నిధిలో ఉండే దర్శనం పొందే భాగ్యం కలిగించుము" అని కోరుకున్నాడు.


నారాయణుడు మందహాసంతో "ధ్రువ కుమారా! భూమిపై జన్మించినవారు పూర్వజన్మల కర్మఫలం పూర్తిగా అనుభవించిన తరువాతే మోక్షము పొందగలరు. భూమి మీద సకల సంపదలు, సుఖములు, రాజ్యాధికారం అనుభవించుము. పిదప గ్రహనక్షత్ర మండలంలో అత్యున్నతమైన ధృవమండలంలో ధ్రువ నక్షత్రమై నీ తల్లితో కలసి ఉంటావు. ధ్రువ నక్షత్రంగా విశ్వానికి మార్గదర్శనం చేస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతావు. కల్పాంతంలో మోక్షం లభించి నా సన్నిధి చేరుతావు" అని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు.


ధ్రువుడు యుక్తవయసు రాగానే శంభువు అనే కన్యను వివాహమాడి శ్లిష్ట, భవ్యుడు అనే ఇద్దరు కుమారులను పొందాడు. ధ్రువ వంశం వీరి ద్వారా వృద్ధి చెందింది. అంగుడు, సమనుడు, అంగిరసుడు, శిబి చక్రవర్తి మొదలైన వారు ఈ వంశములో జన్మించారు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే-------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.



ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।

అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।



ప్రతిపదార్థ:



ప్రకృతేః — భౌతిక ప్రకృతి యొక్క; క్రియమాణాని — చేయబడును; గుణైః — మూడు గుణములచే; కర్మాణి — పనులు; సర్వశః — అన్ని రకాల; అహంకార-విమూఢ-అత్మా — అహంకారంతో భ్రమకు లోనై, తాము ఈ శరీరమే అనుకునే జీవులు; కర్తా — చేసేవాడిని; అహం — నేను; ఇతి — ఈ విధంగా; మన్యతే — భావించును.


 తాత్పర్యము : 


 

అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడును. కానీ, అజ్ఞానంలో, జీవాత్మ, తాను ఈ శరీరమే అన్న భ్రమతో, తానే కర్తను (చేసేవాడిని) అని అనుకుంటుంది.

  

 వివరణ:


ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని, అవి ప్రకృతిచే చేయబడినవి అని మనం గమనించవచ్చు. మన శరీరక్రియలను, మనం రెండు రకాలుగా విభజించవచ్చు 1) సహజంగానే జరిగే జీవ క్రియలు, అంటే, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, హృదయస్పందన వంటివి, మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి. 2) మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు - మాట్లాడటం, వినటం, నడవటం, నిద్రించటం, పని చేయటం వంటివి.


ఈ రెండు రకాల పనులూ కూడా మనస్సు-శరీరం-ఇంద్రియముల వ్యవస్థ ద్వారా చేయబడుతాయి. ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా, సత్త్వ-రజో-తమస్సులచే కూడి ఉన్న త్రి-గుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి. ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో, అవి సముద్రంలో భాగమో, అదే విధంగా ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త.


మరి ఎందుకు జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అనుకుంటుంది? ఎందుకంటే, ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫారం పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయనుకుందాం, ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలుని చూస్తున్నాడనుకుందాం. ఆ రెండో రైలు కదిలితే, మొదటి రైలు కదిలినట్టుఉంటుంది. అదే విధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అనుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం, తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది.


కానీ, జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు, శరీరం చేసే చర్యలకు, అది కర్మ సిద్ధాంత చట్రం లో ఎందుకు చిక్కుకుంటుంది? అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణ మేమిటంటే, జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది. ఉదాహరణకి, ఒక రథ సారథి, రథాన్ని తనే గుంజడు, కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు. ఇప్పుడు, ఒకవేళ ప్రమాదం జరిగితే, గుర్రాలను తప్పు బట్టలేము, సారథియే బాధ్యుడు. అదే విధంగా, మనస్సు-శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఇంద్రియములు-మనస్సు-బుద్ధి, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పని చేస్తాయి. ప్రేరణతో పని చేస్తాయి.

రామాయణం - 15 )

 శ్రీరామ  (22)


               ( వాల్మీకి రామాయణం  - 15 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26  ' మధ్యాహ్నం '  పోష్టు తరువాయి భాగము)


జనకుని మాటలు విని, వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, అతనితో ఇలా అన్నారు.


" ఇక్ష్వాకు వంశము, మీ విదేహ వంశము,చాలా గొప్పవి.

మీ వంశములు వియ్యమందటము, అందరికి క్షేమం కలిగిస్తుంది.

నీ తమ్ముని కుమార్తెలయిన మాండవీ, శ్రుతకీర్తులను, దశరథ పుత్రులైన, భరత, శత్రుఘ్నులకు భార్యలుగా మేము వరించుచున్నాము.

ఈ వివాహ సంబంధము వల్ల మీ ఇరువురి వంశములు దృఢమైన బంధముకలవి అగుగాక" అన్నారు.


జనకుడు, కుశధ్వజుడు, మహర్షులు చెప్పినదానికి చాలా సంతోషంతో అంగీకరించారు.


శ్లో//ఏవం భవతు భద్రం వః కుశధ్వజ సుతే ఇమే/

పత్నీ భజేతాం సహితౌ శతృఘ్న భరతావుభౌ/

ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాంమహామునే/

పాణీన్ గృహ్ణన్తు చత్వారో రాజపుత్రా మహాబలాః//


(అట్లే అగుగాక.మీకు భద్రమగు గాక.ఈ కుశధ్వజుని కుమార్తెలగు "మాండవీ" "శృతకీర్తులు"  ఎప్పుడూ సన్నిహితంగా మెలిగే ఈ భరత శతృఘ్నులకు(వరుసగా) భార్యలై వారిని సేవించెదరు గాక.

ఓ మహామునీ! మహాబలశాలులగు ఈ రాజపుత్రులు నలుగురు ఒకే దినమున నలుగురు రాజపుత్రికలను వివాహమాడుదురు గాక).


దశరథ మహారాజు అప్పుడు జనకుని వద్ద సెలవు తీసుకుని,వసిష్ఠ,విశ్వామిత్రులతొ

తన విడిదికి వెళ్లి, యథా శాస్త్రముగా చేయవలసిన కార్యములు నిర్వర్తించాడు.


మరుసటి రోజు ప్రాతః:కాలంలో, స్నాతకము, గోదానము మొదలైన విహిత కృత్యములను నిర్వహించాడు.


ఆ రోజు,భరతుని మేనమామ, కేకయమహారాజు కుమారుడు, అయిన యుధాజిత్తు అక్కడకు వచ్చాడు.


మేనల్లుడైన భరతుని చూచుటకు తాను అయోధ్యాపట్టణానికి వెళ్లాననీ, అక్కడ రాముని వివాహవిషయం తెలిసి ఇక్కడకు వచ్చాననీ, చెప్పాడు.

అతని రాకకు అందరూ చాలా సంతోషించారు.

శ్లో// అథ రాజా దశరథః ప్రియాతిథి ముపస్థితమ్ /

దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్//

(పిమ్మట దశరథుడు వచ్చిన ఆ ప్రియాతిథిని చూచి పూజార్హుడైన అతనిని అనేక సత్కారములు చేసి గౌరవించాడు)



అందరూ మరుసటిరోజు జరగబోయే వివాహ విషయాలు ముచ్చటించుకుంటూ ఆ రాత్రి సుఖంగా గడిపారు. 

                                  


                    శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                      ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


( సశేషం )

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26


(రేపు స్మార్తులకు శ్రీరామనవమి.

ఆ సందర్భంగా శుభప్రదమైన సీతారామ కళ్యాణం చెప్పుకుందాము)

వాల్మీకి రామాయణం - 14)

 శ్రీరామ (21)


               ( వాల్మీకి రామాయణం - 14)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (25-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


జనకమహారాజు ఆహ్వానాన్ని పురస్కరించుకుని దశరథ మహారాజు , విశ్వామిత్రాది ఋషులతోను, బంధువులతోను జనకుని సభకు వచ్చాడు.

ధర్మాత్ముడు, మా కులగురువు, అయిన వసిష్ఠమహర్షి నా పక్షమున మా వంశక్రమమును చెప్పగలడని జనకునకు తెలియజేశాడు.

వసిష్ఠమహర్షి జనకునితో ఇలా అన్నాడు.

శ్లో// అవ్యక్తప్రభవో బ్రహ్మా శాశ్వతో నిత్య అవ్యయః /

తస్మాన్మరీచిః సంజజ్ఞే మరీచేః కాశ్యపః సుతః //

(అవ్యక్తమునుండి జన్మించిన వాడు, శాశ్వతంగా ఉండేవాడు, నిత్యుడు, వినాశము లేనివాడు, అయిన బ్రహ్మదేవుని నుండి మరీచియు, మరీచినుండి కాశ్యపుడును జన్మించిరి).

కాశ్యపుని కుమారుడు సూర్యుడు.

సూర్యుని కుమారుడు మనువు.

మనువునకు ఇక్ష్వాకువుజన్మించాడు.

ఆయనే అయోధ్యకు మొదటి రాజు.

ఇక్ష్వాకుని పుత్రుడు "కుక్షి".

అతని కుమారుడు "వికుక్షి".

వికుక్షి కుమారుడు "బాణుడు"

"అనరణ్యుడు" బాణుడి కుమారుడు.

అనరణ్యుని పుత్రుడు "పృథు చక్రవర్తి".

పృథువు కుమారుడు "త్రిశంకువు".

అతనికి "దుంధుమారుడు", (అతనికే "యువనాశ్వుడు"అనే పేరు కూడా ఉంది)

యువనాశ్వుని కుమారుడు "మాంధాత".

మాంధాత కుమారుడు. "సుసంధి".

సుసంధికి "ధ్రువసంధి" , "ప్రసేనజిత్" అనే ఇద్దరు కుమారులు.

ధ్రువసంధి కుమారుడు "భరతుడు".

భరతుని కుమారుడు "అసితుడు".

శత్రువులచేత ఓడింపబడి అడవులకు వెళ్లిన అసితుడు "చ్యవన మహర్షి" అనుగ్రహం వల్ల "సగరుడు"అనే పుత్రుని పొందెను.

సగరుని పుత్రుడు "అసమంజుడు".

అసమంజుని కుమారుడు "అంశుమంతుడు"

అంశుమంతుని కుమారుడు "దిలీపుడు".

దిలీపుని కుమారుడు "భగీరథుడు".

భగీరథుని కుమారుడు "కకుత్థ్సుడు".

కకుత్థ్సుని కుమారుడు "రఘుమహారాజు".

రఘువు కుమారుడు " పురుషాదకుడు " కల్మాషపాదుడు,అనే నామములతో పిలువబడే "ప్రవృద్ధుడు" 

అతని కుమారుడు"శంఖణుడు".

శంఖణుని కుమారుడు. "సుదర్శనుడు".

అతని కుమారుడు"అగ్నిపర్ణుడు".

అగ్నిపర్ణుడి కుమారుడు "శీఘ్రగుడు".

అతని కుమారుడు. "మరువు".

మరువు కుమారుడు "ప్రశుశుక్రుడు".

అతని కుమారుడు "అంబరీషుడు".

అంబరీషుని కుమారుడు "నహుష చక్రవర్తి".

నహుషుని కుమారుడు "యయాతి".

అతని కుమారుడు "నాభాగుడు"

నాభాగుని కుమారుడు "అజ మహారాజు".

అజ మహారాజు పుత్రుడు "దశరథ మహారాజు"

దశరథ మహారాజు కుమారులు రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు.

పరిశుద్ధమైన వంశచరిత్ర కలిగిన వారు, వీరులు,‌

పరమ ధార్మికులు, సత్యవాదులు అయిన ఇక్ష్వాకు వంశంలో పుట్టిన ఈ రామ, లక్ష్మణుల కొరకు నీ కుమార్తెలైన "సీత" "ఊర్మిళ" లను వరించు చున్నాను.

రామ లక్ష్మణులకు, నీ కుమార్తెలయిన సీత, ఊర్మిళ లను ఇచ్చి వివాహము చేయుము, అని వశిష్ఠ మహర్షి చెప్పి, ముగించాడు.

                         

అప్పుడు వసిష్ఠమహర్షికి చేతులు జోడించి జనక మహారాజు ఇలా అన్నాడు.

సత్కుల ప్రసూతులైన వారు,కన్యాదాన సమయంలో తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను.

మా వంశమునకు మూల పురుషుడు "నిమి" చక్రవర్తి.

ఆ నిమి చక్రవర్తి కుమారుడు"మిథి".

ఆయనే ఈ మిథిలానగరాన్ని నిర్మించిన మొదటి జనకుడు.

మిథి కుమారుడు ఉదావసువు.

ఉదావసువు కుమారుడు నందివర్థనుడు.

అతని కుమారుడు సుకేతువు.

సుకేతువునకు,ఈ శివ ధనుస్సును పొందిన వాడు,ప్రఖ్యాతుడు అయిన"దేవరాతుడు"జన్మించాడు.

దేవరాతుని కుమారుడు బృహద్రథుడు.

అతని కుమారుని పేరు"మహావీరుడు".

ఆయన పుత్రుడు సుధృతి.

సుధృతి కుమారుడు దృష్టకేతువు.

ఆయన కుమారుడు హర్యశ్వుడు.

హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను.

మరుని పుత్రుడు ప్రతింధకుడు.

ప్రతింధకుని కుమారుడు కీర్తిరథ మహారాజు.

కీర్తిరథునకు దేవమీఢుడు జన్మించాడు.

దేవమీఢుని పుత్రుడు విబుధుడు.

విబుధుని కుమారుడు మహీధ్రకుడు.

అతని కుమారుడు కీర్తిరాతుడు.

కీర్తిరాతునకు మహారోముడు జన్మించాడు.

మహారోముని కుమారుడు స్వర్ణరోముడు.

స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు.

ధర్మాత్ముడైన హ్రస్వరోమునకు నేను జ్యేష్ఠ కుమారుడను.

నా తమ్ముడైన కుశధ్వజుడు రెండవ కుమారుడు.

జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి,కుశధ్వజుని నా పోషణలో ఉంచి, హ్రస్వరోమ మహారాజు తపస్సు ఆచరించేందుకు అరణ్యములకు వెళ్లాడు.

నేను కుశధ్వజుని సాంకాస్య పురమునకు రాజును చేసాను.

ఇదీ మా వంశ వృత్తాంతము.

ఓ మహర్షీ! మీకు మంగళ మగుగాక.

మీరు చెప్పినట్లు నా జ్యేష్ఠ కుమార్తె సీతను రామునకు, రెండవ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహం చేస్తాను.


శ్లో//వీర్య శుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్/

ద్వితీయా మూర్మిళాం చైవ త్రిర్దదామి నసంశయః//

(వీర్య శుల్కయు,దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను రామునకు, రెండవ కుమార్తె అయిన ఊర్మిళను లక్ష్మణునకు ఇచ్చి వివాహము చేసెదనని ముమ్మారు నొక్కి వక్కాణించుచున్నాను.

ఈ విషయమున సందేహము లేదు).

ఇక్కడ "త్రిః దదామి" అను పదమునకు మనో,వాక్కాయములను మూడు కరణముల చేత అనగా త్రికరణశుద్ధిగా ఇచ్చుచున్నాను అని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యాతలు చెప్పారు.


జనకుడు దశరథ మహారాజుతో ఇలా అన్నాడు.

ఓ మహారాజా ! ఈరోజు మఖా నక్షత్రము. 

ఎల్లుండి సంతానప్రదుడైన " భగుడు" అధిదేవతగాగల ఉత్తర ఫల్గునీ నక్షత్ర మందు వివాహముజరిపింపుము.

ఈ లోపు గోదానము, మొదలైన శాంతి కార్యములు చేయింపుము"


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

25-3-'26.

వేదాలకు భాష్యాలు

 వేదాలకు భాష్యాలు మాత్రమే ఎందుకు రచించారు భాష్యకారులు? టీక, అనువాదములు వంటి ప్రక్రియలు వేదములకు ఎందుకు లేవు ?

వేదములకూ, బ్రహ్మసూత్రాలకు తదితర మంత్రాత్మకమైన వాఞ్మయానికి భరతవర్షంలో భాష్యాలు చెప్పబడినాయి. శుష్కమైన తాత్పర్యాలు లేవు.


అసలు భాష్యం అంటే ఏమిటి?


సూత్రార్థా వర్ణితం యత్ర పదై సూత్రాంత సారిభిః |


స్వపదాని చ వర్ణాంతే భాష్యం భాష్యవిదో విదుః ||


ఎక్కడైతే మంత్రములో గల శబ్దాలు స్పష్టంగా వివరింపబడి, ఆ వివరణకు ఉపయోగించిన శబ్దజాలానికి అర్థమూ వివరింపబడునో దానిని భాష్యమని భాష్యవిదులు పేర్కొంటారు.


అనగా భాష్యం - మంత్రములకు చెప్పబడుతుంది.


మంత్రములో గల ప్రతి శబ్దానికి వివరణ ఉంటుంది. దీనిని వృత్తి అంటారు.


వృత్తిని స్పష్టీకరించడమూ ఉంటుంది. దీనిని వార్తికము అంటారు. వార్తికం అంటే వృత్తిని విపులంగా చర్చించేది. (వృత్తిం వేదయతి ఇతి వార్తికం)


అంటే భాష్యం అన్నది ఒక సర్వతోముఖమైన, సమగ్రమైన ప్రక్రియ.


"మంత్రబ్రాహ్మణయోర్వేద నామధేయమ్" అని ఆపస్తంబుని సూత్రీకరణ. వేదములు అంటే మంత్రములు, ఆ మంత్రములతో కూడిన యజనక్రియలు.


వేదాంగములు ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పమ్. భాష్యకారుడికి ఈ ఆరు వేదాంగములలో పావీణ్యంతో బాటు, మంత్రము యొక్క అర్థం అనుభవజ్ఞానం ఉండవలె. "సమ్యగనుభవసాధనం ప్రమాణమ్";" అనధిగతార్థగంతృప్రమాణమ్".


చిన్న వివరణ. ఉదాహరణకు "ఆకలి" అన్న శబ్దం ఉందనుకోండి. ఆ శబ్దానికి అర్థం ఆ వచనం లో లేదు. ఆకలి శబ్దానికి కేవలం "ఒక సంవేదన" అన్న శుష్కార్థంలో ఇముడదు.ఆకలి కి నిజమైన అర్థం తెలియాలంటే శబ్దజ్ఞానంతో బాటు, ఆ ఆకలి యొక్క అనుభవజ్ఞానం, అన్నం విలువ, దాని పవిత్రత, ఆహారం పెట్టినవాని దయ, ఆ అన్నాన్ని పండించిన వాడి కృషి, వీటి సమగ్రస్వరూపం తెలియాలి.


భౌతికజీవితంలోని అర్థాలకే సమగ్రత్వం ఈ విధంగా ఉన్నప్పుడు - మంత్రస్వరూపంగా వేలాది ఏళ్ళు సాంప్రదాయంలో, సంస్కృతిలో, ప్రతి క్రతువులో, కర్మలో, వ్రతంలో, అనుష్ఠానంలో మమేకమైన వేద మంత్రాలకు భాష్యార్థం ఎంతో శ్రమపడితే తక్క మహనీయులకు కూడా తెలియదు.


వేదాలకు భాష్యం రచించడానికి సాయణాచార్యుడు (మాధ విద్యారణ్యుల వారి తమ్ముడు) 24 ఏళ్ళు శ్రమపడవలసి వచ్చిందని చెప్పుకున్నాడు.


ఋగ్వేదంలో మంత్రాలకు నిరుక్తంలో భాష్యం ఉంది. నిరుక్తకారుడు యాస్కాచార్యుడు. (మనకు 9 నిరుక్తాలు ఉండేవట. ఇప్పుడు దొరికేది యాస్కాచార్యుని నిరుక్తం ఒకటే). సాయణాచార్యుడు చతుర్వేదాలకు భాష్యం రచించినాడు. ఆసక్తి పెంచుకొని ఎవరైనా చదవగలిగితే ఎంతో మంగళకరమైన, మనోజ్ఞమైన భావనలు అందు కనిపిస్తాయి.


వేదభాష్యానికి ఒక్క ఉదాహరణ. ఈ మంత్రాన్ని హిందువులయొక్క ప్రతిక్రతువులోనూ, వ్రతంలోనూ, పెళ్ళికి ముందు వధువు చేసే గౌరీపూజలోనూ పఠిస్తారు. వేల ఏళ్ళుగా భారతసంస్కృతిలో మమేకమైన అందమైన ఋగ్వేదమంత్రం ఇది.


గౌరీ (నిర్)మిమాయ సలిలాని తక్షత్యేకపదీ ద్విపదీ సా చతుష్పదీ |


అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ ||


ఈ ఋక్కుకు సాయణాచార్యుని భాష్యం ఇలా ఉంది.


వాగ్దేవి మొట్టమొదట పరమవ్యోమంలో పరబ్రహ్మలో అంతర్గతంగా వున్న గౌరిగా ఏకపది. అదే ప్రణవరూపం.


పిదప సలిల సదృశములైన వర్ణపదవాక్యములను ఆమె సృష్టించింది. వ్యాహృతి (మంత్ర) రూపంలో సావిత్రిగ ద్విపది.


తర్వాత వేదచతుష్టయ రూపంలో చతుష్పది అయినది.


అటుపై, వేదాంగములు, స్మృతి పురాణ ధర్మశాస్త్రములలో అష్టాపది;


మీమాంసా, న్యాయ సాంఖ్య, యోగ, పాంచరాత్ర, పశుపత, ఆయుర్వేద ధనుర్వేద, గాంధర్వ వేదవిద్యా రూపిణియై నవపది. తదనంతరము అనంతవాక్యరూపమున వాగ్దేవి ప్రపంచమంతా ప్రతిభాసిస్తున్నది.


అయితే యాస్కాచార్యుడు గౌరిని - మేఘాల మధ్య విద్యుత్తు అని పేర్కొన్నాడు. ఆయన భాష్యం ఈ క్రింది బొమ్మల్లో చదుకోవచ్చు.మంత్రార్థము (వృత్తి), భాష్యార్థము (వార్తికము) ఇక్కడ చూడవచ్చు.




సాంప్రదాయికంగా భరతవర్షంలో వేదాలకు భాష్యాలు ఉన్నాయని, అవి ఎంతో మనోహరమైన కృతులని చెప్పుకున్నాం.


ఆధునిక కాలంలో - వేదాలను పనిగట్టుకుని నాశనం చేసిన వారు ఆంగ్లేయులు. మనకు సంస్కృతం ఓ మోస్తరుగా కావ్యాలు చదువుకునేంత మోతాదున నేర్చుకోవడానికే జీవితకాలం పడుతుంది. వేదభాష్యాలకు సాయణాచార్యుడంతటి పండితుడికి 24 ఏళ్ళు పడితే ఆంగ్ల అనువాదకులకు యుక్తవయసుకే వేదాలు అర్థం చేసుకునేంత జ్ఞానం వచ్చిందట! అదీ ఒక్క ముక్క సాంప్రదాయం తెలియకుండానే! నిజానికి వీరికి సంస్కృతభాషలో రామ శబ్దం కూడా తెలియదు. అయితే వీరు పేద బ్రాహ్మలతో అర్థాలు చెప్పించుకుని, పెడర్థాలు తీసి "అనువాదాలు" రచించడానికి అనతికాలమే పట్టింది. వీరు చేసింది అనువాదం. అదీ కూడా అక్కడక్కడా పరమహీనమైన పద్ధతిలో ఉంది. ఈ అనువాదకుల్లో రాల్ఫ్ గ్రిఫిత్, మేక్స్ ముల్లర్ లు ముఖ్యులు.


పైన "గౌరీమిమాయ ..." కు అర్థం చూచాం. అసలా అర్థం తెలియకున్నా గౌరి అంటే భారతదేశంలో అమ్మవారు అని అందరికీ తెలుసు 

ఆంగ్ల యులు దానిని

వేరే విధంగా అనువాదం చేయటం జరిగింది

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*మంగళవారం 24 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *35వ భాగం*``


*బ్రహ్మ వంశ క్రమము*```


శౌనకాది మునుల కోరిక పై సూత మహర్షి బ్రహ్మ నుంచి సృష్టి ఆరంభమైన విధానం, బ్రహ్మవంశ వృద్ధి వివరించి చెప్పసాగాడు:


“మునులారా! శ్రీమన్నారాయణుని నాభి కమలం నుండి బ్రహ్మ జన్మించిన సంగతి మీకు తెలుసు. బ్రహ్మ నుండి మానస పుత్రులుగా ఇరవై ముగ్గురు ప్రజాపతులు, మహర్షులు, మనువులు ఉద్భవించి సృష్టిని విస్తరింపచేశారు. వంశాభివృద్ది ఎలా జరిగిందో వినండి..


ప్రచేతసులకు దక్ష ప్రజాపతి తిరిగి జన్మించాడు. ఆయనకు అసిక్ని అనే భార్య వలన ఐదువేల హర్యశ్వులు, వేయి మంది శబలాశ్వులు జన్మించారు. నారదుడు వీరిని వైరాగ్య మార్గానికి మళ్ళించాడు. తరువాత అరవై మంది కుమార్తెలు కలిగారు. వీరిలో అదితి, దితి, దనువు, అరిష్ట, సురస, ఖస, సురభి, వినత, తామ్ర, ధవశ, ఇర, కద్రువ, ముని అనే పదమూడు మంది కశ్యప ప్రజాపతికి భార్యలు అయ్యారు.


అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ధ్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, మఖ, పుబ్బ, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, శ్రవణం, ధనిష్ఠ, రేవతి అనే దక్ష కుమార్తెలు చంద్రునికి భార్యలు అయినారు.


దక్ష ప్రజాపతికి ఉత్తానపాదుని చెల్లెలు ప్రసూతి మరో భార్య. ఈమెకు ఇరవై నాలుగు మంది కుమార్తెలు జన్మించారు. 

వీరిలో శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తుష్టి, మేధ, పుష్టి, క్రియ, బుద్ది, లజ్జ, వపువు, శాంతి, సిద్ది, కీర్తి అనే పదమూడు మందిని ధర్ముడు వివాహం చేసుకున్నాడు.


దక్ష పుత్రికలలో ఖ్యాతిని భృగువు, సతీదేవిని శివుడు, సంభూతిని మరీచి, స్మృతిని అంగీరసుడు, ప్రీతిని పులస్త్యుడు, క్షమను పులహుడు, సంతితిని క్రతువు, అనసూయను అత్రి, ఊర్జను వసిష్టుడు, స్వాహను అగ్ని, స్వధను మనువు వివాహం చేసుకున్నారు.


కశ్యప ప్రజాపతికి దక్షుని పుత్రికలు పదమూడు మందితో కలిపి మొత్తం ఇరవైఒక్క మంది భార్యలు ఉన్నారు. దేవ రాక్షస దానవ మానవ పశుపక్ష్యాది జాతులన్ని వీరి నుంచే జన్మించాయి.


అదితికి ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు జన్మించారు. దితికి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, సింహిక జన్మించారు. దనువుకు శబరుడు, ఏకచక్రుడు, మహాబాహువు, తారకుడు, మహాబలుడు, స్వర్భానువు, వృషపర్వుడు, పులోముడు, విప్రచిత్తి మొదలైన దానవులు జన్మించారు.


సురభికి అజుడు, ఏకపాదుడు, ఏకాదశ రుద్రులు జన్మించారు. వినతకు అనూరుడు, గరుత్మంతుడు మొదలైన వారు జన్మించారు. కద్రువకు శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, ఆర్యకుడు, కాళీయుడు, మొదలైన నాగులు జన్మించారు. పశుపక్ష్యాది జాతులన్ని కశ్యపుని భార్యల సంతానంగా జన్మించి వృద్ది చెందాయి.


వసిష్టుడు తొలిజన్మలో అరుంధతిని చేసుకుని చిత్రసేనుడు, పురోచిషుడు, విరచుడు మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, ద్యుమంతులను పుత్రులుగా పొందాడు. రెండవ జన్మలో అక్షమాలను పెళ్లాడి నిమి చక్రవర్తి శాపం వలన మరణించాడు. మిత్రావరుణుల కుమారుడిగా మూడవ జన్మ ఎత్తిన ఊర్జను పెండ్లాడాడు. వీరికి రజస్సు, గోత్రుడు, ఊర్థ్వబాహువు, సవనుడు, అనఘుడు, సుతపసుడు, శుక్రుడు జన్మించారు.


భృగువుకి ఖ్యాతి యందు ధాత, విధాత, కవి, లక్ష్మి జన్మించారు. దాతకు ప్రాణుడు, ప్రాణునికి ద్యుతిమంతుడు, అతనికి రాజవంతుడు జన్మించారు. విధాతకు నియతి వలన మృకండుడు, మృకుండునికి మార్కండేయుడు జన్మించారు. వరణునికి కుమారునిగా జన్మించిన రెండవ జన్మలో భృగువుకి భూతుడు, చ్యవనుడు, వజ్రశీర్షుడు శుచి, శుక్రుడు, సవనుడు జన్మించారు.


మరీచికి కళయందు కశ్యపుడు, పూర్ణిముడు, ఊర్ణ యందు ఆరుగురు కుమారులు జన్మించారు. ఈ ఆరుగురు తరువాత జన్మలలో కాలనేమి పుత్రులు గాను, దేవకి వసుదేవులకు కృష్ణుడి కన్నా ముందు ఆరుగురి పుత్రులుగా జన్మించి కంసుడిగా పుట్టిన తండ్రి కాలనేమి చేతిలో చంపబడ్డారు.


వినతకు అనూరుడు, గరుడుడు కాకుండా అరిష్టనేమి, తార్ఖ్యుడు, అరుణి, శ్రీవారుణి జన్మించారు. సగరుడు అరిష్టనేమి కుమార్తె సుమతిని వివాహం చేసుకుని సూర్య వంశ మూలకర్త అయ్యాడు. హేతి తపస్సపన్నుండైనా శాపగ్రస్తుడు అవ్వటం వలన రాక్షస జాతికి జన్మనిచ్చాడు.


వివస్వంతుడు విశ్వకర్మ కుమార్తె సంజ్ఞను వివాహం చేసుకున్నాడు. వీరికి అశ్వనీ దేవతలు, నాసత్యుడు, దస్రుడు జన్మించారు. పృథువుకు అంతర్ధానుడు, అంతర్ధానుడికి హవిర్భానుడు, హవిర్భానుడికి ప్రాచీనబర్హి, శుక్రుడు, గయుడు, కృష్ణుడు, వ్రజుడు, అజినుడు జన్మించారు. ప్రాచీనబర్హికి ప్రచేతసులు జన్మించారు.


అంగీరసునికి స్మృతి యందు అనుమతి, కుహువు, సినీవాలి, ఖ్యాతి యందు ఉతథ్యుడు, బృహస్పతి, సంవృత్తుడు జన్మించారు. బృహస్పతి వంశంలో పావకుడు, పరమానుడు, శుచి జన్మించారు.


పులస్త్యుడికి హవిర్భువు, ప్రీతి, మానిని భార్యలు. మానినికి విశ్రవసుడు జన్మించాడు. విశ్రనసువుకి కైకసి వలన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ పుట్టారు. విశ్రవసునికి మరోభార్య దేవవర్ణి వలన కుబేరుడు జన్మించాడు.


పులహునికి క్షమయందు కర్దముడు, ఉర్వరీయుడు, సహిష్ణువు జన్మించారు. క్రతువుకి అరవైవేల వాలఖిల్యులు జన్మించారు. కర్దమునికి ఆకూతి యందు కపిలుడు జన్మించాడు. అత్రి అనసూయలకు దత్తాత్రేయుడు, చంద్రుడు, దుర్వాసుడు జన్మించారు.


చంద్రవంశంలో వరుసగా బుధుడు, పురూరవుడు, ఆయువు, నహుషుడు, యయాతి మొదలైన వారు జన్మించారు. యయాతికి దేవయాని, శర్మిష్ట వలన యదువు మొదలైన ఐదుగురు పుత్రులు జన్మించారు.


భూమండలం పైన సూర్య చంద్రులు వంశ మూలకర్తలగా అనేక వంశాలు అభివృద్ధి చెంది విస్తరించాయి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మందు ఎప్పుడు వేసుకోవాలి.

 ఏ మందు ఎప్పుడు వేసుకోవాలి.


✍🏻డా. ప్రతిభా లక్ష్మి 


చాలా మంది, వైద్యుల సలహా పాటించకుండా (లేక సరిగ్గా అర్ధం కాక), tablets ని ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటూ ఉంటారు. దానితో ఆ టాబ్లెట్ పూర్తి ప్రభావం ఉండకపోవడం, లేక కొన్ని దుష్ప్రభావాలు కలగడం జరగవచ్చు.


ఒక మాత్ర రోజుకు రెండు సార్లు వేసుకోవాలి అంటే, దాని ప్రభావం దాదాపు 12 గంటలు ఉంటుంది అని. అలాగే రోజు ఒకటి అంటే ఇరవై నాలుగు గంటలు, మూడు సార్లు అంటే ఎనిమిది గంటలు వరకు పని చేస్తుంది.  అందుకే సరయిన సమయానికి వేసుకోకపోతే ఆ మందుల పూర్తి ప్రభావం ఉండదు. 


- కడుపులో మంట, Acidity కోసం వేసుకునే మాత్రలు పొద్దున ఖాళీ కడుపుతో వేసుకోవాలి.


- Thyroid మాత్రలు, ఉదయాన్నే వేసుకొని, తరవాత గంట వరకు ఏమీ తినకూడదు.


- Antibiotics, hormone tablets వంటివి ప్రతి పూటా ఒకే సమయానికి వేసుకోవాలి.


- Cholesterol కోసం వేసుకునే మాత్రలు రాత్రి పడుకునే ముందు వేసుకోవడం మంచిది, ఎందుకంటే ఆ సమయంలో రక్తంలో cholesterol levels ఎక్కువ అవుతాయి.


- Azithromycin, cifran వంటి antibiotics తినడానికి గంట ముందు కానీ, తిన్నాక రెండు గంటలకు కానీ వేసుకోవాలి. అప్పుడే పూర్తిగా absorb అవుతాయి.


- నొప్పి మాత్రలు ఖచ్చితంగా తిన్న తరవాతే వేసుకోవాలి. లేనిచో కడుపులో మంట కలిగే అవకాశం ఉంటుంది. అలాగే రక్తం పలచన అయ్యే మాత్రలు కూడా.


- ఐరన్ tablets ఖాళీ కడుపుతో వేసుకొని, తరవాత గంట సేపు ఏమీ తినకుండా ఉంటే వాటి absorption బాగా ఉంటుంది. వాటితో పాటు vitamin c తీసుకుంటే ఇంకా మంచిది. Iron మాత్రలు వేసుకున్నాక కనీసం గంట వరకు టీ, కాఫీ తాగకూడదు. మరియు acidity మాత్ర వేసుకోకూడదు. కానీ ఐరన్ పెరిగే tablet తో ఎవరికైనా vomiting sensation కలుగుతుంటే అవి తిన్నాక ఒక 2 hours కి, అదీ తట్టుకోలేకపోతే తిన్న వెంటనే వేసుకోవాలి.


- Urine ఎక్కువ వచ్చేలా చేసే మాత్రలు (గుండె జబ్బు, ఒంట్లో నీరు, లేక BP కోసం ఇచ్చేవి) ఉదయం వేసుకుంటే మంచిది.


- Calcium carbonate tablets ఆహారంతో పాటు వేసుకుంటే, gastric acid వల్ల వాటి absorption బాగా ఉంటుంది. వీటితో ఐరన్ మాత్రలు కలిపి తీసుకోకూడదు. 


- ఎముకల బలానికి ఇచ్చే మందులు ఖాళీ కడుపుతో వేసుకుంటే బాగా పని చేస్తాయి.


- BP మాత్రలు ప్రతి రోజూ ఒకే సమయానికి వేసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. కొన్ని రకాల BP మాత్రలు సాయంత్రం వేసుకుంటే వాటి ప్రభావం మెరుగ్గా ఉంటుంది. 


- మధుమేహానికి వాడే మాత్రలలో కొన్ని ఖాళీ కడుపుతో, కొన్ని ఆహారంతో పాటు, కొన్ని తిన్నాక వేసుకునేవి ఉంటాయి. అలా వేసుకున్నప్పుడే వాటి ప్రభావం పూర్తిగా ఉంటుంది. (అందుకే combination tablets పూర్తి ప్రభావితం కాదు.)


- జలుబు, లేక allergy కోసం వేసుకునే మాత్రలు, లేదా నరాల నొప్పికి ఇచ్చే మాత్రల వల్ల కొంత వరకు నిద్ర మత్తు కలిగే అవకాశం ఉన్నందున, రాత్రి వేసుకుంటే మంచిది.


- విరేచనం సరిగ్గా అవ్వడానికి వేసుకునే syrup లేక tablet రాత్రి వేసుకోవాలి.


ఇలా చెబుతూ పోతే, ప్రతి మాత్రకు వేసుకోవలసిన time, food తో సంబంధం, వేరే tablets తో relation, frequency of administration, ఇలా చాలా విషయాలు ఉంటాయి. 


కాబట్టి., మాత్రలు వేసుకుంటున్నా ప్రభావం సరిగ్గా లేదు అనుకోని dose పెంచడం, లేక మందు మార్చడం చేయడానికి ముందు, ఆ మాత్రలు సరిగ్గా వేసుకుంటున్నామా అని చూసుకోవడం చాలా అవసరం.!


✍🏻డా. ప్రతిభా లక్ష్మి