6, ఏప్రిల్ 2026, సోమవారం

ఈ ప్రశ్నకు బదులేది 13

 ఈ ప్రశ్నకు బదులేది 13



ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.


  నీచులు ఏ పని ప్రారంభించరు మధ్యములు ప్రారంభించి మధ్యలోనే వదులు వేస్తారు కానీ ఉత్తములు మాత్రము ఎటువంటి కష్ట నష్టం ఏర్పడ్డ వాళ్లు ప్రారంభించిన పనిని ఆశాంతం చేస్తారు అని తెలిపే ఏనుగు లక్ష్మణ కవి పద్యం ఏమిటి


 


 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

పంచాంగం

 


పచ్చ కర్పూరం*

 *పచ్చ కర్పూరం*

                  ➖➖➖✍️

```

*మన పూర్వికులు ఇచ్చినటువంటి సాంప్రదాయాలను మనం మర్చిపోతూనే ఉన్నాము.


అందులో ప్రధానంగా.. 

ఈ ‘పచ్చ కర్పూరం!’


*మనం వెనుకటి రోజుల్లో పచ్చ కర్పూరం లడ్డూలలో, తిండి పదార్థాలలో అతి ముఖ్యంగా పండుగ సందర్భాలలో ప్రసాదాలలో మనం ఉపయోగించే వాళ్ళము. 

కానీ ఇప్పుడు ఎంత మంది ఆచరణలో పెట్టారు కనీసం ఇప్పుడు ఎంత మంది ఇంట్లో పచ్చ కర్పూరం ఉంది?


*మీకు తెలుసా..?

మన పూర్వీకులు & ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి చిన్న మూలికలలో ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది… అది మనకు అర్థం కాకపోతే సాధారణంగా వస్తువుగా కనిపిస్తుంది,అర్థమైతే అది అమూల్యమైన ఔషధం అవుతుంది.


*అదే కోవకు చెందింది పచ్చ కర్పూరం మనం సాధారణంగా కేవలం పూజలో హారతి ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అని అనుకుంటాము కానీ ఇది…

మన శరీరాన్ని శుభ్రపరచే, గాలిని పవిత్రం చేసే,నరాలకు ఉత్తేజం ఇచ్చే, రోగాలను దూరం చేసే దివ్య శక్తి చిన్న పరిమాణంలోనే పెద్ద మార్పు తీసుకువచ్చే ఈ సహజ ఔషధం.

```

*పచ్చ కర్పూరం ఉపయోగాలు:*```

*నోటి దుర్వాసనను వెంటనే తగ్గిస్తుంది.


*జ్వరం, అలసట తగ్గించడంలో సహాయపడుతుంది.

*ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని శుభ్రపరుస్తుంది.

*రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

*కండరాలు, నరాలకు ఉత్తేజం ఇస్తుంది.

*ఫంగల్ ఇన్ఫెక్షన్, చిన్న చర్మ సమస్యలను తగ్గిస్తుంది.```


 *వాడే విధానం :*```

*లవంగం పరిమాణంలో నోట్లో వేసుకొని చప్పరించాలి.

*స్వీట్స్/లడ్డూలలో (1kgకి 2–3g) కలపాలి.

*నువ్వుల నూనెలో కలిపి నొప్పులపై రాయాలి.

*పసుపుతో కలిపి చర్మంపై రాయాలి.

*పూజ గదిలో ఉంచితే గాలి శుభ్రం అవుతుంది.


*స్వచ్ఛమైన పచ్చ కర్పూరం ఎలా గుర్తించాలి ?

*కాల్చితే పూర్తిగా ఆవిరైపోతుంది. ఎలాంటి మిగులు ఉండదు.

*తెల్లగా, చిన్న బిళ్లల రూపంలో ఉంటుంది.

*సహజమైన గట్టి వాసన ఉంటుంది (కెమికల్ వాసనలా కాదు).

*చేతిలో పట్టుకుంటే త్వరగా ఆవిరైపోతుంది.

*నీటిలో వేసితే పూర్తిగా కరగకుండా మెల్లగా ఆవిరవుతుంది.```


*నకిలీ (కెమికల్) కర్పూరం గుర్తులు :*```

*కాల్చినప్పుడు మిగులు (బూడిద/పొడి) మిగులుతుంది.

*వాసన చాలా కఠినంగా, అసహజంగా ఉంటుంది.

*చాలా చవకగా లభిస్తుంది.✍️```

-సేకరణ.

(కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే.)

.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

బ్రహ్మచారి

 **బ్రహ్మచారి* : సదా బ్రహ్మమందు ఎవరి మనస్సు సంచరిస్తూ ఉంటుందో వారు బ్రహ్మచారి.అంతే కాని పెళ్లి కానివారు అని చెబుతుంటారు.పెళ్లి మాత్రం చేసుకోకుండా తక్కిన కార్యక్రమాలు చేసేవారు బ్రహ్మచారులు కానేకారు. బ్రహ్మచర్యం అనేది నాలుగు ఆశ్రమాలలో మొదటిది. వేద జ్ఞానాన్ని అభ్యసిస్తూ, మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా జీవించేవారిని బ్రహ్మచారులు అంటారు. బ్రహ్మచారులు ప్రధానంగా నిష్ఠ, కాల పరిమితిని బట్టి రకాలుగా ఉంటారు. *ముఖ్యమైన రకాలు:* నైష్ఠిక బ్రహ్మచారి (ఆజన్మాంతం బ్రహ్మచర్యం పాటించేవారు), మరియు ఉపేతక బ్రహ్మచారి (విద్య పూర్తయ్యే వరకు పాటించేవారు). 

శాస్త్రమ్ ప్రకారం బ్రహ్మచారులు మరికొన్ని రకాలుగా కూడా వర్గీకరించబడ్డారు:

 *సావిత్ర:* ఉపనయన  తర్వాత, కనీసం మూడు రోజులు బ్రహ్మచర్యం పాటించే బ్రహ్మచారి.

 *ప్రాజాపత్య:* దీక్ష తర్వాత కనీసం ఒక సంవత్సరం పాటు కఠినంగా బ్రహ్మచర్యాన్ని పాటించేవారు.

 *బ్రహ్మ-బ్రహ్మచారి:* వేద అధ్యయనం కోసం కొంతకాలం బ్రహ్మచారిగా ఉండేవారు.

 *అస్ఖలిత బ్రహ్మచారి* : మనస్సు, శరీరం ద్వారా ఎటువంటి కామ వికారాలకు లోనుకాకుండా స్థిరమైన బ్రహ్మచర్యం పాటించేవారు. 

 *ముఖ్యమైన విభజన* :

 *నైష్ఠిక బ్రహ్మచారి* : జీవితాంతం వివాహం చేసుకోకుండా సత్య, శౌచ, నియమాలతో గడిపేవారు.

 *ఉపేతక / గృహస్థ-బ్రహ్మచారి* : చదువు పూర్తయ్యాక గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు. 

వాల్మీకి రామాయణం - 27)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం  - 27)

                (పరశురాముడు  -  4)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


       (5-4-'26 పోష్టు తరువాయి భాగము)



కార్తవీర్యార్జునుడు రాజు కాబట్టి, రాజవధ పాపం అన్న తండ్రి మాటను మన్నించి,ఆయన ఆజ్ఞానుసారం ఒక సంవత్సరం దీక్షతో  తీర్థ యాత్రలు చేసి, పరశురాముడు తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.


 ఒక రోజు జమదగ్నిమహర్షి భార్య, రేణుకాదేవి, గంగానదీ తీరంలో,అప్సరసలతో కూడి జలక్రీడలాడుతున్న గంధర్వ రాజు చిత్రరధుని చూచింది.

కొన్ని క్షణములు, మనస్సు చలించి,చిత్రరథుని మీది కోరికతో, ఆమె మన్మథ వికారానికి లోనైంది. 

దివ్య దృష్టితో అది గ్రహించాడు జమదగ్నిమహర్షి.

పాతివ్రత్య నియమాలతో అత్యుత్తమ స్థితి సాధించిన రేణుకాదేవిని, తాత్కాలిక మానసిక వ్యభిచార దోషంతో  అధోలోకాలలో పడకుండా సంస్కరించడం కోసం, జమదగ్ని మహర్షి ఆమె  శిరస్సును ఖండించమని తనపుత్రులను ఆజ్ఞాపించాడు.

అయితే ఆ ఘోర కృత్యం చేయడానికి వారంతా నిరాకరించారు.

 తల్లిని,సోదరులను కూడా సంహరించమని జమదగ్ని, అప్పుడే అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చిన పరశురాముని ఆదేశించాడు.

తండ్రి యొక్క తపఃప్రభావము తెలిసిన పరశురాముడు, వెంటనే తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు.

ప్రీతి చెందిన జమదగ్ని పరశురాముని వరము కోరుకొమ్మన్నాడు.

తల్లిని, సోదరులను బ్రతికించమని, వారెవ్వరికీ తాము సంహరింపబడి,తిరిగి బ్రతికామన్న స్మృతి ఉండకూడదని, పరశురాముడు తండ్రిని వరం అడిగాడు.

జమదగ్ని ఆ వరము ఇవ్వగానే, రేణుకాదేవితో సహా,మరణించిన ఆమె నలుగురు పుత్రులు నిద్రనుండి లేచినట్లు లేచారు. 

వారెవ్వరికి జరిగినదేమీ గుర్తులేదు.


అటు, కార్తవీర్యార్జునుని సంహారమైన సంవత్సరం తరువాత  కార్తవీర్యార్జునుని  పది వేలమంది పుత్రులు,  మాహిష్మతీ పట్టణంలో తిరిగి కలుసుకున్నారు.

వారందరు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని,  అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు, మూకుమ్మడిగా వారు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి,

 శాంతంగా ధ్యానంలో ఉన్న ఆ మహర్షి మీద దాడి చేసారు.

అడ్డువచ్చిన రేణుకా దేవిన తోసి వేసి, బ్రహ్మర్షి, పరమ శాంత స్వభావుడు అయిన  జమదగ్ని మహర్షిని పరమ దారుణంగా సంహరించారు. 

ఆ మహర్షి శిరస్సును ఖండించి పట్టుకు పోయారు.


పతివ్రతయగు,రేణుకాదేవి, శిరోవిహీనమైన జమదగ్ని కాయాన్ని ఒడిలో పెట్టుకొని, "రామా! రామా!" అంటూ బిగ్గరగా విలపించ సాగింది.

ఇరవై యొక్కమార్లు ఆమె అలా విలపించగా,

ఆమె రోధనధ్వని విన్న పరశురాముడు, పరుగు,పరుగున వచ్చి, ఆ దృశ్యం చూచి నిశ్చేష్టుడు అయ్యాడు. 

పరమ శాంతుడు,తపఃపరాయణుడు అయిన తన తండ్రి ఆ విధంగా సంహరింపబడటం చూసి, పరశురాముడు దుఃఖం ఆపుకోలేక పోయాడు.

బిగ్గరగా రోదించాడు.

కొద్ది సేపటికే ఆయన శోకం తీవ్ర క్రోధంగా మారింది.

ఆ క్రోధం వెల్లువలాగా పెల్లుబికింది.

" పరిపాలకులైన క్షత్రియులకు వివేకజ్ఞానం నశించింది.

వారి అధర్మ వర్తనకు ఇది పరాకాష్ట. 

అందువల్ల ఈ క్షత్రియజాతిని మొత్తం నాశనం చెయ్యాలి"

అని నిర్ణయం తీసుకున్నాడు.

తండ్రి దేహమును సోదరులకు అప్పజెప్పి తాను గండ్రగొడ్డలి ధరించి, బ్రహ్మర్షి హత్య అయిన  మరుక్షణమే శోభావిహీనమైన ఆ మాహిష్మతీ పట్టణానికి ఒంటరిగా వెళ్ళాడు.

భయంకరమైన యుద్ధంలో,తా నొక్కడే  కార్తవీర్యుని పుత్రులు పదివేలమందిని సైన్యముతో సహా సంహరించాడు.

ఖండింపబడిన వారందరి శిరస్సులు నగరం మధ్యలో  ప్రోగు పెట్టాడు.

అది ఒక  పెద్ద కొండవలె కనిపించింది.

వారి రక్తము ఒక నది వలె ప్రవహించింది.


పరశురాముని క్రోధం అంతటితో శమించ లేదు.

ఆనాటి పాలకులందరూ క్షత్రియులే కాబట్టి  వారందరినీ భూమండల మంతా వెతికి వెతికి సంహరించాడు.

భూమండలమంతా  పరశురాముని స్వాధీనం అయింది. 


శ్రీమద్భాగవతంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు.



శ్లో//హేతుం కృత్వా పితృ వధం,క్షత్రే౽మంగలళకారిణి/

త్రిస్సప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః/

సమంతపంచకే చక్రే శోణితోదాన్ హ్రదాన్నృప//


(ఓ పరీక్షిన్మహారాజా!తండ్రి వధను, నిమిత్తంగా చేసుకొని, క్షత్రియులు అత్యాచార పరులైనందున,ఇరవైఒక్క మారులు, భూమండలమంతా వెతికి,వెతికి ఆ పరశురామప్రభువు సకల క్షత్రియ సంహారము చేశాడు.

కురుక్షేత్ర మందలి  సమంత పంచకము నందు వారి రక్తజలముతో అయిదు సరస్సులను నిర్మించాడు).


తండ్రి తలను తెచ్చి దర్భలయందు ,మొండెముతో అతికించి,యజ్ఞము చేసి, సర్వదేవాత్మకుడయిన విష్ణుమూర్తిని ఆరాధించాడు.


కశ్యపుడు మొదలైన ఋత్విక్కులకు, సమస్త భూమినీ దానం చేశాడు.


సరస్వతీ నది యందు అవభృథస్నానము చేసి, సమస్త పాపములనుండి విముక్తుడై,మేఘములు తొలగిన సూర్యునివలె ప్రకాశించాడు.


పరశురాముని పూజలు అందుకొని, జమదగ్నిమహర్షి, సప్తర్షిమండలములో ప్రవేశించి అక్కడ ఏడవ మహర్షి అయినాడు.


చిరంజీవి అయిన పరశురాముడు, సిద్ధ, చారణ, గంధర్వాదులైన దేవ గణములతో,కీర్తింపబడుతూ  మహేంద్ర పర్వతముపై తపోదీక్ష వహించాడు. 



శ్లో//ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః/

అవతీర్య పరం భారం భువో౽హన్ బహుశో నృపాన్//

(విశ్వాత్ముడు, జగన్నాథుడు, అయిన శ్రీహరి భగవానుడు ఈ విధముగా భృగువంశమునందు,పరశురాముడై అవతరించి భూమికి అమితభారముగా పరిణమించిన రాజులను సంహరించాడు)


(సశేషం)


               శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                 ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

6-4-'26.

రామాయణం - 27)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 27)

                (పరశురాముడు - 4)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

                              ----


       (5-4-'26 పోష్టు తరువాయి భాగము)



కార్తవీర్యార్జునుడు రాజు కాబట్టి, రాజవధ పాపం అన్న తండ్రి మాటను మన్నించి,ఆయన ఆజ్ఞానుసారం ఒక సంవత్సరం దీక్షతో తీర్థ యాత్రలు చేసి, పరశురాముడు తండ్రి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు.


 ఒక రోజు జమదగ్నిమహర్షి భార్య, రేణుకాదేవి, గంగానదీ తీరంలో,అప్సరసలతో కూడి జలక్రీడలాడుతున్న గంధర్వ రాజు చిత్రరధుని చూచింది.

కొన్ని క్షణములు, మనస్సు చలించి,చిత్రరథుని మీది కోరికతో, ఆమె మన్మథ వికారానికి లోనైంది. 

దివ్య దృష్టితో అది గ్రహించాడు జమదగ్నిమహర్షి.

పాతివ్రత్య నియమాలతో అత్యుత్తమ స్థితి సాధించిన రేణుకాదేవిని, తాత్కాలిక మానసిక వ్యభిచార దోషంతో అధోలోకాలలో పడకుండా సంస్కరించడం కోసం, జమదగ్ని మహర్షి ఆమె శిరస్సును ఖండించమని తనపుత్రులను ఆజ్ఞాపించాడు.

అయితే ఆ ఘోర కృత్యం చేయడానికి వారంతా నిరాకరించారు.

 తల్లిని,సోదరులను కూడా సంహరించమని జమదగ్ని, అప్పుడే అరణ్యం నుండి ఆశ్రమానికి వచ్చిన పరశురాముని ఆదేశించాడు.

తండ్రి యొక్క తపఃప్రభావము తెలిసిన పరశురాముడు, వెంటనే తండ్రి ఆజ్ఞ నెరవేర్చాడు.

ప్రీతి చెందిన జమదగ్ని పరశురాముని వరము కోరుకొమ్మన్నాడు.

తల్లిని, సోదరులను బ్రతికించమని, వారెవ్వరికీ తాము సంహరింపబడి,తిరిగి బ్రతికామన్న స్మృతి ఉండకూడదని, పరశురాముడు తండ్రిని వరం అడిగాడు.

జమదగ్ని ఆ వరము ఇవ్వగానే, రేణుకాదేవితో సహా,మరణించిన ఆమె నలుగురు పుత్రులు నిద్రనుండి లేచినట్లు లేచారు. 

వారెవ్వరికి జరిగినదేమీ గుర్తులేదు.


అటు, కార్తవీర్యార్జునుని సంహారమైన సంవత్సరం తరువాత కార్తవీర్యార్జునుని పది వేలమంది పుత్రులు, మాహిష్మతీ పట్టణంలో తిరిగి కలుసుకున్నారు.

వారందరు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో లేనప్పుడు, మూకుమ్మడిగా వారు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి,

 శాంతంగా ధ్యానంలో ఉన్న ఆ మహర్షి మీద దాడి చేసారు.

అడ్డువచ్చిన రేణుకా దేవిన తోసి వేసి, బ్రహ్మర్షి, పరమ శాంత స్వభావుడు అయిన జమదగ్ని మహర్షిని పరమ దారుణంగా సంహరించారు. 

ఆ మహర్షి శిరస్సును ఖండించి పట్టుకు పోయారు.


పతివ్రతయగు,రేణుకాదేవి, శిరోవిహీనమైన జమదగ్ని కాయాన్ని ఒడిలో పెట్టుకొని, "రామా! రామా!" అంటూ బిగ్గరగా విలపించ సాగింది.

ఇరవై యొక్కమార్లు ఆమె అలా విలపించగా,

ఆమె రోధనధ్వని విన్న పరశురాముడు, పరుగు,పరుగున వచ్చి, ఆ దృశ్యం చూచి నిశ్చేష్టుడు అయ్యాడు. 

పరమ శాంతుడు,తపఃపరాయణుడు అయిన తన తండ్రి ఆ విధంగా సంహరింపబడటం చూసి, పరశురాముడు దుఃఖం ఆపుకోలేక పోయాడు.

బిగ్గరగా రోదించాడు.

కొద్ది సేపటికే ఆయన శోకం తీవ్ర క్రోధంగా మారింది.

ఆ క్రోధం వెల్లువలాగా పెల్లుబికింది.

" పరిపాలకులైన క్షత్రియులకు వివేకజ్ఞానం నశించింది.

వారి అధర్మ వర్తనకు ఇది పరాకాష్ట. 

అందువల్ల ఈ క్షత్రియజాతిని మొత్తం నాశనం చెయ్యాలి"

అని నిర్ణయం తీసుకున్నాడు.

తండ్రి దేహమును సోదరులకు అప్పజెప్పి తాను గండ్రగొడ్డలి ధరించి, బ్రహ్మర్షి హత్య అయిన మరుక్షణమే శోభావిహీనమైన ఆ మాహిష్మతీ పట్టణానికి ఒంటరిగా వెళ్ళాడు.

భయంకరమైన యుద్ధంలో,తా నొక్కడే కార్తవీర్యుని పుత్రులు పదివేలమందిని సైన్యముతో సహా సంహరించాడు.

ఖండింపబడిన వారందరి శిరస్సులు నగరం మధ్యలో ప్రోగు పెట్టాడు.

అది ఒక పెద్ద కొండవలె కనిపించింది.

వారి రక్తము ఒక నది వలె ప్రవహించింది.


పరశురాముని క్రోధం అంతటితో శమించ లేదు.

ఆనాటి పాలకులందరూ క్షత్రియులే కాబట్టి వారందరినీ భూమండల మంతా వెతికి వెతికి సంహరించాడు.

భూమండలమంతా పరశురాముని స్వాధీనం అయింది. 


శ్రీమద్భాగవతంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు ఈ విధంగా చెబుతున్నారు.



శ్లో//హేతుం కృత్వా పితృ వధం,క్షత్రే౽మంగలళకారిణి/

త్రిస్సప్తకృత్వః పృథివీం కృత్వా నిఃక్షత్రియాం ప్రభుః/

సమంతపంచకే చక్రే శోణితోదాన్ హ్రదాన్నృప//


(ఓ పరీక్షిన్మహారాజా!తండ్రి వధను, నిమిత్తంగా చేసుకొని, క్షత్రియులు అత్యాచార పరులైనందున,ఇరవైఒక్క మారులు, భూమండలమంతా వెతికి,వెతికి ఆ పరశురామప్రభువు సకల క్షత్రియ సంహారము చేశాడు.

కురుక్షేత్ర మందలి సమంత పంచకము నందు వారి రక్తజలముతో అయిదు సరస్సులను నిర్మించాడు).


తండ్రి తలను తెచ్చి దర్భలయందు ,మొండెముతో అతికించి,యజ్ఞము చేసి, సర్వదేవాత్మకుడయిన విష్ణుమూర్తిని ఆరాధించాడు.


కశ్యపుడు మొదలైన ఋత్విక్కులకు, సమస్త భూమినీ దానం చేశాడు.


సరస్వతీ నది యందు అవభృథస్నానము చేసి, సమస్త పాపములనుండి విముక్తుడై,మేఘములు తొలగిన సూర్యునివలె ప్రకాశించాడు.


పరశురాముని పూజలు అందుకొని, జమదగ్నిమహర్షి, సప్తర్షిమండలములో ప్రవేశించి అక్కడ ఏడవ మహర్షి అయినాడు.


చిరంజీవి అయిన పరశురాముడు, సిద్ధ, చారణ, గంధర్వాదులైన దేవ గణములతో,కీర్తింపబడుతూ మహేంద్ర పర్వతముపై తపోదీక్ష వహించాడు. 



శ్లో//ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః/

అవతీర్య పరం భారం భువో౽హన్ బహుశో నృపాన్//

(విశ్వాత్ముడు, జగన్నాథుడు, అయిన శ్రీహరి భగవానుడు ఈ విధముగా భృగువంశమునందు,పరశురాముడై అవతరించి భూమికి అమితభారముగా పరిణమించిన రాజులను సంహరించాడు)


(సశేషం)


               శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                 ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

6-4-'26.

ఈ ప్రశ్నకు బదులేది 12

 ఈ ప్రశ్నకు బదులేది 12

ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.

 ఎదుటివారి తప్పులను  ఎత్తి చూపే  వారి గురించి వేమన చెప్పిన పద్యం ఏమిటి? 

 సవివరంగా వివరించగలరు.

ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ 


గమనిక :: మీ జవాబును కింద కామెంట్ రూపంలో తెలియపరచగలరు

సోమవారం,ఏప్రిల్.6,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

సోమవారం,ఏప్రిల్.6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయనం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:చవితి మ12.01 వరకు

వారం:సోమవారం(ఇందువాసరే)

నక్షత్రం:అనూరాధ రా12.59 వరకు

యోగం:సిద్ధి మ1.52 వరకు

కరణం:బాలువ మ12.01 వరకు

తదుపరి కౌలువ రా1.03 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:మ12.26 - 1.15

మరల మ2.53 - 3.43

అమృతకాలం:మ1.29 - 3.15

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:మ10.30 - 12.00

సూర్యరాశి:మీనం

చంద్రరాశి:వృశ్చికం

సూర్యోదయం:5.55

సూర్యాస్తమయం:6.10

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - చైత్ర మాసం - కృష్ణ పక్షం - ‌చతుర్థి -‌ అనూరాధ -‌‌ ఇందు వాసరే* (06.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

5, ఏప్రిల్ 2026, ఆదివారం

సోమవారం*🕉️ *🌹06ఏప్రిల్ 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹06ఏప్రిల్ 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం*                  

   

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*చైత్రమాసం - కృష్ణ పక్షం* 


*తిథి : చవితి* మ 02.10 వరకు ఉపరి *పంచమి*

*వారం    : సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : అనూరాధ* రా 02.57 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : సిద్ధి* మ 03.25 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : బాలువ* మ 02.10 *కౌలువ* రా 03.21 ఉపరి *తైతుల* 

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00సా04.00-04.30*               

అమృత కాలం  :*మ 03.19 - 05.07*

అభిజిత్ కాలం  : *ప 11.45 - 12.35*

*వర్జ్యం    :శేషం ఉ 06.23 వరకు*

*దుర్ముహూర్తం  : మ 12.35 - 01.24 & 03.03 - 03.53*

*రాహు కాలం  :ఉ07.32 - 09.04*

గుళికకాళం      : *మ 01.43 - 03.16*

యమగండం    : *ఉ 10.37 - 12.10*

సూర్యరాశి : *మీనం*                  

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.07*  

సూర్యాస్తమయం :*సా 06.30*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 05.59 - 08.27*

సంగవ కాలం     :*08.27 - 10.56*

మధ్యాహ్న కాలం    :*10.56 - 01.24*

అపరాహ్న కాలం  :*మ 01.24- 03.53*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం    :*సా 03.53 - 06.21*

ప్రదోష కాలం      :*సా 06.21 - 08.40*

రాత్రి కాలం         :*రా 08.40 - 11.46*

నిశీధి కాలం        :*రా 11.46 - 12.33*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.12*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        🌷*ప్రతినిత్యం*🌷

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*


*తస్మాన్మాం శరణాగతం* *కరుణయా త్వం రక్ష రక్షాధునా*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹