26, ఏప్రిల్ 2026, ఆదివారం

శ్రీ మహావిష్ణు పురాణం* `` *66వ భాగం*``

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 23 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *66వ భాగం*``


*పరశురామ అవతారం*


తండ్రి ఆదేశంతో చంపిన.. 

తల్లి సోదరులను..

తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట: ```

కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు.  


కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు.


చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు.


క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు.


మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు.


జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు.


తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు.


జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు.


ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది.


జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది. 


జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు.


రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు. 


వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు.


జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.  


జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు.


తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు. 


జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు. 


పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు. 


భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. 


పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు.


పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ

  శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు


నమో ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


1080వ వారము


*అరుణ పారాయణము, సూర్య నమస్కారములు*


శ్రీ వరుణ సహిత సంజ్ఞా ఉషా ఛాయా పద్మినీ సువర్చలాంబా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కరుణా కటాక్షములతో, శ్రీ కాంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్యానుగ్రహముతో, శ్రీ పరాభవ నామ సంవత్సర, వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ దశమి భానువారము, అనగా *26-ఏప్రిల్-2026 తేదీన, ఉదయం 07:30 గంటల* నుండి అరుణ పారాయణము తో కూడిన సూర్య నమస్కారములు ఋత్విగ్వరేణ్యుల సత్సాంగత్యములో యథా శక్తి గా జరుపుటకు నిశ్చియించడమైనది. 

విశేషములు:

• గురు వందనం

• పరిషదనుజ్ఞ

• సభా నమస్కారము

• శ్రీమహాగణపతి పూజ

• పుణ్యహవచనం

• కలశ స్థాపన

• షోడశోపచార పూజ

• తృచ పారాయణ

• అరుణ ప్రశ్న తో కూడిన సూర్య నమస్కారములు

• నవగ్రహ సూక్త పారాయణ

• నక్షత్ర సూక్త పారాయణము

• పునః పూజ 

• అష్టోత్తర శత నామార్చన

• ఆదిత్య హృదయ పారాయణ

• వేద స్వస్తి

• మంగళ హారతి

• ప్రసాద స్వీకారం


ఈ కార్యక్రమములో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి అనుగ్రహముతో స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.


స్థలము

 Flat A-102, Isha Yara apartment, Vadakkupattu, Medavakkam, Chennai


జయతాచ్ఛంకరోగురుః

హర హర శంకర జయ జయ శంకర

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

పంచాంగశుద్ధి

 *నేటి పంచాంగశుద్ధి* 

  ------------------------------------

     26---04--2026 ఆదివారం     -------------------------------------

🌞శ్రీ పరాభవ సంవత్సరం 

_--------------------------------------

🌸ఉత్తరాయణం 🌸

------------------------------

🌞 వసంత ఋతువు 🌻

------------------------------

 🌞 వైశాఖ  మాసము 🌞

--------------------------------------


🌻శుక్ల  పక్షం 🌻

----------------------------------------                    .                           🌸దశమి   ఈరోజు  రాత్రి  8----44  ని  ఉంది  తదుపరి  ఏకాదశి🌸

---------------------------------------        

 🌞మఖ   నక్షత్రము  ఈరోజు   రాత్రి   10----57 ని వరకు  ఉంది  తదుపరి  పుబ్బ నక్షత్రము  🌞

------------------------------------

🌚రాహుకాలం  ఈరోజు  సాయంత్రం  4-----30. ని   నుండి  6.  గం   వరకు ఉంది

---------------------------------------

🌑 యమ గండం ఈరోజు మధ్యాహ్నం  12. గం  నుండి   1----30. ని వరకు   ఉంది 🌑

------------------------------------

వర్జ్యం ఈరోజు  ఉదయం  11----15  ని  నుండి  12---49 ని  వరకు  ఉంది. --------------------------------------- 

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - దశమి - మఘ -‌‌ భాను వాసరే* (26.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఋతుర్ ఋతునా నుద్యమానః।

 Mantra - 21 ARUNAM 3 anuvaakam


ఋతుర్ ఋతునా నుద్యమానః। 

విననాదాభిధావః |

షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః|

శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ|| 


ఇది కాల గమనాన్ని, ముఖ్యంగా రోజులు మరియు నెలల విభజనను ఒక అద్భుతమైన రూపకంతో (Metaphor) వర్ణిస్తుంది.


*ఋతుర్ ఋతునా నుద్యమానః*: 

ఒక ఋతువు మరొక ఋతువు చేత ముందుకు నెట్టబడుతోంది. అంటే కాల చక్రంలో వసంతం తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి. 


*విననాదాభిధావః*: 

ఆ కాలం లేదా సూర్యుడు గొప్ప శబ్దము చేస్తూ (ప్రకృతిలో కలిగే మార్పుల ధ్వని) వేగంగా పరిగెడుతున్నాడు. కాలం ఆగకుండా ప్రవహిస్తోందని దీని భావం.


*షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః*: 

ఇక్కడ కాల గణన స్పష్టంగా కనిపిస్తుంది.

త్రిగ్ం శకాః: అంటే 30 కాల ప్రమాణాలు. ఇవి ఒక నెలలోని 30 రోజులు లేదా 30 ఘడియలు గల ఒక పగటి కాలం లేదా రాత్రి కాలం.

షష్టిశ్చ: అంటే 60 కాల ప్రమాణాలు. ఇవి ఒక రోజులో 60 ఘడియలు లేదా ఋతువు లో 60 రోజులు.  వీటిని "వల్గాః" (గుర్రపు కళ్లెములు) అని పిలిచారు. అంటే ఒక గుర్రం కళ్లెముల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో, కాల చక్రం ఈ రోజులు, నెలల ద్వారా అలా నడపబడుతోంది.


Additional info:

వైదిక కాల విభజన క్రమం పరిశీలిద్దాం!

1 ఘడియ = 24 నిమిషములు

2 ఘడియలు = 48 నిమిషములు = 1 ముహూర్తం

2.5 ఘడియలు = 1 గంట

5 ఘడియలు = 2 గంటలు = 1 హోర 

30 ఘడియలు = 12 గంటలు = 1 పగలు / 1 రాత్రి

60 ఘడియలు = 24 గంటలు = 1 రోజు

60*60 ఘడియలు = 60 రోజులు = 1 ఋతువు 


ఒక రోజులో 60 ఘడియలు (షష్టి)

ఒక నెలలో 30 రోజులు (త్రింశక)


(వేదం జ్యోతిశ్శాస్త్రానికి బీజం అని పై లెక్కల ప్రకారం చెప్పవచ్చు)


షష్టిశ్చ (60): "షష్టిశ్చ" అంటే అరవై. దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:

కాల విభజన - ఒక కాల ప్రమాణంలో ఉండే 60 భాగాలు (ఉదాహరణకు, ఒక రోజులో 60 ఘడియలు

లేదా ఒక ఋతువులో 60 రోజులు)


శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ: 

"శుక్ల" (తెల్లని - వెలుగు) మరియు "కృష్ణ" (నల్లని - చీకటి). ఇక్కడ 60 పగుళ్లు 60 రాత్రుళ్ళు కలిపి 60 రోజులు ఒక ఋతు కాలం.


అరుణ కేతుక చయనంలో కాలాన్ని ఒక గుర్రంగా లేదా రథంగా ఊహిస్తారు. ఈ మంత్రం ఆ కాల చక్రంలోని విడి భాగాలను వివరిస్తోంది.

 

*కాల ప్రవాహం*: ఋతువులు ఒకదానినొకటి అనుసరిస్తూ రావడం అనేది సృష్టిలోని క్రమశిక్షణకు నిదర్శనం. భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు సుమారు 1,07,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాలం తరుముకు రావటం అంటే ఇదే


*సంవత్సర విభజన*: ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక్కో నెలలో 30 రోజులు, ఒక్కో ఋతువు లో 60 రోజులు ఉంటాయని, ఒక్కో రోజులో 60 ఘడియలు ఉంటాయని, ఒక్కో నెలలో రెండు పక్షాలు (శుక్ల, కృష్ణ) ఉంటాయని వేద కాలం నాటి ఖగోళ విజ్ఞానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.


సూర్యుడే ఈ కాలాన్ని నియంత్రించే శక్తి. ఆయనే ఈ రోజులను, రాత్రులను తన కళ్లెములతో (వల్గాః) నడిపిస్తున్నాడు.


సూర్యుడు (అరుణుడు) కాల స్వరూపుడిగా మారి, ఈ సృష్టిని ఎలా పరిపాలిస్తున్నాడో, మనం ఆ కాలాన్ని ఎలా గౌరవించాలో ఈ మంత్రాలు బోధిస్తున్నాయి.


అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం 'మాయ' మరియు 'బ్రహ్మము' మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది:


*కాలము - ఒక మిథ్య* (Time as an Appearance)

కాలం నిరంతరం మారుతూ ఉంటుంది (ఋతువుల మార్పు). అద్వైతంలో మారుతున్న ప్రతిదీ 'మిథ్య' (Relative Truth). ఈ మంత్రం వర్ణించిన కాలప్రవాహం అంతా చైతన్యం మీద కదిలే ఒక చిత్రపటం వంటిది. కాలం కదులుతోంది అంటే, ఆ కదలికను గమనించే 'సాక్షి' (Observer) ఒకడు ఉండాలి. ఆ సాక్షియే కాలాతీతుడైన పరమాత్మ.


*విభజనలో అవిభజితత్వం* (Unity in Division)

మంత్రంలో అరవై, ముప్పై, శుక్ల, కృష్ణ అని కాలాన్ని ముక్కలుగా విభజించారు. కాల ప్రమాణాలు 1, 2, 2.5, 5, 30, 60… మొదలైనవి కానీ ఈ విభజనలన్నీ ఒకే సంవత్సరంలో (కాలచక్రంలో) అంతర్భాగాలు. అలాగే, జగత్తులో మనకు కనిపించే నామ-రూప భేదాలన్నీ ఆ ఒక్క బ్రహ్మము లోనివే. సముద్రంలో తరంగాలు వేరు వేరుగా ఉన్నా, అన్నీ నీరే అయినట్లుగా, కాలగతులు వేరైనా అవన్నీ ఒక్క సత్యం మీద ఆధారపడి ఉన్నాయి.


*నుద్యమానః* - నిరంతర పరిణామం

ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ఒక ఋతువు పోయి మరొకటి రావడం అనేది జగత్తు యొక్క అనిత్యత్వాన్ని (Impermanence) సూచిస్తుంది. అద్వైత సాధకుడు ఈ మార్పులను చూసి, వీటన్నింటికీ మూలమైన, మార్పు లేని (అవికారి) తత్వం వైపు దృష్టి సారించాలి.


*విననాదః* (The Cosmic Sound)

శబ్దం లేదా నాదం అనేది ఆకాశానికి గుణం. ‘శబ్ద గుణక మాకాశం’. వేదాంత పరంగా, ఈ సృష్టి అంతా ఓంకార నాదం నుండి వ్యక్తమైంది. కాలం వేగంగా పరిగెడుతూ చేసే ఈ 'విననాదం', సృష్టిలోని చైతన్య శక్తిని (Prana Shakti) సూచిస్తుంది.


Conclusion:

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మంత్రం కాలం యొక్క భీకరమైన వేగాన్ని, క్రమశిక్షణను వర్ణిస్తుంది.

అద్వైత కోణంలో:

మారుతున్న నిమిషాలు, ఘడియలు, హోరలు, అహోరాత్రములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అన్నీ కాల స్వరూపాలు. కానీ వీటన్నింటికీ ఆధారం, కాలానికి కూడా కాలమైన (కాలాకాలాయ), మార్పు లేని ఆ పరమాత్మ ఒక్కడే.

25, ఏప్రిల్ 2026, శనివారం

పంచాంగం

 


మూత్ర కృచ్చ వ్యాధి

 మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .


మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .


కారణాలు -


ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.


నివారణ -


చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .


నా అనుభవ యోగం -


మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్

 భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ (Quantum Entanglement) భావనలు మనకు కనిపిస్తాయి.


ఎలాగో చూద్దాం!


మొదటగా క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ అంటే సరళంగా ..

క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత విస్మయకరమైన అంశం. రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా (విశ్వం అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉన్నా), ఒక కణం యొక్క స్థితిని మార్చితే, రెండో కణం యొక్క స్థితి తక్షణమే మారుతుంది. ఈ మార్పు కాంతి కన్నా వేగంగా ఉంటుంది. అనగా కాంతి యూనివర్స్ లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి కొన్ని కాంతి సంవత్సరాలు పడితే, క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం అంటే దూరం లో ఉన్న కణాల స్థితి మారటానికి ఎట్టి సమయమూ పట్టదు.



భగవద్గీతలోని శ్లోకాలు భౌతిక శాస్త్ర పరంగా రాకపోయినా, అందులో వివరించిన క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగం మరియు విభూతి యోగం క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) ఇచ్చే ఏకత్వ సందేశాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.


గీతలోని కొన్ని ముఖ్యమైన భావనలను ఎంటాంగిల్మెంట్‌తో పోల్చి చూద్దాం:


సర్వవ్యాపకత్వం (Interconnectedness)

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత (గీత 13.3) - అన్ని శరీరాల్లో (క్షేత్రాలలో) ఉన్న తెలుసుకొనే శక్తి (క్షేత్రజ్ఞుడు) నేనే అని తెలుసుకో అని భావన.

ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ - ఈ చరాచర జగత్తు అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు.



క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం, రెండు కణాలు ఎక్కడ ఉన్నా అవి ఒకే వ్యవస్థలో భాగమై ఉంటాయి. అలాగే, గీత ప్రకారం విశ్వంలోని ప్రతి అణువులోనూ ఒకే పరమాత్మ చైతన్యం ఉంది. అంటే, బాహ్యంగా మనం వేర్వేరుగా కనిపించినా, లోపల ఉన్న 'కనెక్టివిటీ' ఒక్కటే.


2. విభజన లేని ఏకత్వం (Unity in Diversity)

అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికమ్ (గీత - 18.20) - విడిపోయి ఉన్నట్లు కనిపించే ప్రాణులన్నింటిలోనూ విభజించలేని ఒకే తత్వాన్ని చూడటమే నిజమైన జ్ఞానం.


ఎంటాంగిల్డ్ కణాలు కూడా మనకు స్పేస్‌లో విడివిడిగా (Separated) కనిపిస్తాయి. కానీ ఒక దాని స్థితి మారగానే రెండోది వెంటనే మారుతుంది—దీని అర్థం అవి 'అవిభక్తం' (Non-separated). భౌతిక దూరం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని గీత మరియు క్వాంటం ఫిజిక్స్ రెండూ చెబుతున్నాయి.


3. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ (గీత - 7.7)

దారంలో గుచ్చిన పూసల వలె ఈ విశ్వమంతా నాలోనే పొదగబడి ఉంది.

ఒక దారాన్ని పట్టుకుని లాగితే అన్ని పూసలు కదిలినట్లే, క్వాంటం లెవల్‌లో విశ్వం ఒక 'క్వాంటమ్ ఫీల్డ్' (Quantum Field) తో అనుసంధానమై ఉంది. ఒక చోట జరిగే మార్పు విశ్వంలోని మరో మూల ప్రభావం చూపగలదు అనే నాన్-లోకాలిటీ (Non-locality) సిద్ధాంతానికి ఇది సరైన పోలిక.


4. కారణ-కార్య సంబంధం - ఎంటాంగిల్మెంట్‌లో ఒక కణం యొక్క 'స్పిన్' (Spin) మారితే రెండో దాని 'స్పిన్' తక్షణమే మారుతుంది. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం మరియు ప్రకృతి గుణాల ప్రభావం కూడా ఇలాగే వివరించబడ్డాయి. మనం చేసే ప్రతి ఆలోచన లేదా చర్య ఈ విశ్వవ్యాప్తమైన వలలో (Cosmic Web) ఒక ప్రకంపనను సృష్టిస్తుంది.


అద్వైత మరియు సర్వం ఖల్విదం బ్రహ్మ అనే తాత్విక భావనలు క్వాంటం ఎంటాంగిల్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటాయి.


క్వాంటం ఫీల్డ్ థియరీ ప్రకారం, విశ్వమంతా ఒక శక్తి క్షేత్రం (Field) ఆవరించి ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మ లేదా చైతన్యం కూడా ఒక నాన్-లోకల్ (Non-local) శక్తి. 


అంటే అది ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడం అనేది ఉండదు. ఎంటాంగిల్మెంట్ కూడా ఈ నాన్-లోకాలిటీ సూత్రం మీదే పనిచేస్తుంది.


5. ఇంద్రజాలం (Indra's Net)

అధర్వణ వేదంలోని (8వ కాండ, 8వ సూక్తం, 8వ మంత్రం) ఇంద్రజలం అనే అద్భుతమైన భావన ఉంది. ఒక అనంతమైన వలలో ప్రతి సంధి వద్ద ఒక మణి ఉంటుంది. ఒక మణిని తాకితే, ఆ ప్రకంపనలు వలలోని అన్ని మణులకూ అందుతాయి.


వేదాంతం: సృష్టిలో ప్రతి అణువు ఇంకో దానితో ముడిపడి ఉంది, 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' (ఒకే మూలం), దేశ, కాలాలకు అతీతమైనది ఆత్మ అని చెపితే..


Quantum Entanglement అవే భావనలను కణాలు దూరంగా ఉన్నా స్పందిస్తాయి, ఒకే మూలం నుండి వచ్చిన కణాలు, దూరం అనేది ఒక భ్రమ (Non-locality) అని చెపుతాయి.

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - పంచమి - మృగశిర -‌‌ భౌమ వాసరే* (21.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భగవత్పాదులవారి రచనల గురించి

 శ్రీ రామ (128 )


(శ్రీ శంకర భగవత్పాదులవారి రచనల గురించి ఒక మిత్రుని సందేహం, నా సమాధానం, మరొక మిత్రుల అభిప్రాయం, చూద్దాం).


శ్లో //శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై, సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                          --------------------

            


శ్రీ శంకర భగవత్పాదుల వారి రచనలను గురించి అనేకమంది ఆస్తిక మహాశయులకు తరచుగా వచ్చే సందేహాన్నే " శ్రీ బి. సోమయాజులుగారు" అనే మా మిత్రులు ఈ విధంగా వెలిబుచ్చారు.


సందేహం.


" 🙏 ఓం నమో నారాయణాయ! "


అద్వైత మతాన్ని స్థాపించిన శ్రీ శంకర భగవత్పాదులవారు జగద్గురువులు ఎలా అయ్యారు ?


" అహం బ్రహ్మాస్మి " అని అద్వైతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకరులు అనేక స్తోత్రాలు అనేక దేవతలను ఉద్దేశించి వ్రాయడంలో అంతరార్థం ఏమిటి ?


 "సోహమ్" అన్న ఆచార్యులవారు స్తోత్రాలలో "దాసోహం" అని ఎందుకు అన్నారు?  

ఇది నాకు వచ్చిన సందేహం.

 పెద్దలు వివరించమని ప్రార్థన! "

                             ------


ఆ సందేహానికి నా సమాధానం.


యూనివర్సిటీ " (విశ్వవిద్యాలయం) అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా ఇక్కడ విద్య లభిస్తుంది అని భావం.

ఏ తరగతి వారికి ఏ విద్య చెప్పాలో దానిని "సిలబస్" అంటాం.

ఆ "సిలబస్" తో కూడిన పుస్తకాన్ని "టెక్స్ట్ బుక్" అంటాం.

అలా ప్రపంచం లోని సమస్త మానవులకు వారి, వారి, తరగతులకు అనుకూలంగా "సిలబస్" మరియు

"టెక్స్ట్ బుక్స్" రచించిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) శ్రీ శంకర భగవత్పాదులవారు.

ఆ విధంగా వారు విశ్వమంతకు గురువులు అయినారు.


రెండు వేల సంవత్సరముల క్రితం అవతరించి, 

"ఆధ్యాత్మిక అగాధాల్లో " కూరుకుపోయిన మానవజాతిని మేల్కొల్పి,

పిన్న వయస్సులోనే, సన్యసించి,  

ధర్మబోధ కోసం ఆశేతు శీతాచలం మూడుసార్లు భారతదేశమంతా పర్యటన చేసి, 

భక్తి, జ్ఞాన, యోగాది విషయములను ప్రజోపయోగం కొరకు గ్రంథస్థం చేసి,

ప్రజలకు జ్ఞానభిక్ష పెట్టిన "జగద్గురువులు"  

శ్రీ భగవత్పాదులవారు.


" సత్యం, జ్ఞాన, మనంతం బ్రహ్మ" (భగవంతుడు సత్య స్వరూపుడు. జ్ఞాన స్వరూపుడు. ఆద్యంతములు లేనివాడు), 

మరియు,

" ఆనందో బ్రహ్మ" (భగవంతుడు అంటే ఆనందమే),

అని వేదము ఉపదేశించిన పరతత్త్వమును "ఆత్మ " అనగా "తానే" అని తెలుసుకోవడమే, " అద్వైతం ".

ఇది పి.హెచ్.డి.

ఈ డాక్టరేటు (పి.హెచ్.డి) గమ్యంగా,

శ్రీ శంకర భగవత్పాదుల వారు,ఒకటవ తరగతి నుండి,

 పి. హెచ్.డి., దాకా పుస్తకాలు వ్రాసి ఉంచారు.

వారి వారి పూర్వజన్మ సంస్కారమునుబట్టి వివిధ దేవతల యందు ఏర్పడే భక్తి,

యోగ, జ్ఞానములయందు అనురక్తి,

పూర్వజన్మ వాసనలననుసరించి ఏర్పడే స్వభావము,

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, శివ స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు, దేవీ స్తోత్రాలు మొదలైన అనేక దేవతా స్తోత్రాలు,

యోగ తారావళి లాంటి యోగ శాస్త్రాలు,

జ్ఞాన బోధకములైన ఉపనిషత్తులకు, భగవద్గీతకు,బ్రహ్మసూత్రములకు భాష్యములు, 

మొదలైన అనేక రచనలు ఆచార్యులవారు చేశారు. 

సద్గురువులు ఆ యా తరగతి విద్యార్థులకు వారి వారి యోగ్యతానుసారంగా తగిన పాఠాలు చెబుతారు.

పదో తరగతి పాఠాలు ఒకటో తరగతి విద్యార్థికి అర్థం కావు.

పదోతరగతి విద్యార్థి ఒకటో తరగతి పాఠాలు చదువుతూ కాలం వ్యర్థం చేసుకోడు.

 శ్రీ శంకర భగవత్పాదుల వారు అన్ని తరగతుల విద్యార్థులకు, వారి వారి స్థాయికి తగినట్లు రచనలు చేసి మానవాళిని అనుగ్రహించారు అని మాత్రం అర్థం చేసుకుని,

వారు అనుగ్రహించిన గ్రంథములను మన స్థాయిని బట్టి అధ్యయనం చేస్తూ, 

గురువుల ద్వారా సందేహములు తీర్చుకుంటూ, ముందుకు పోవాలి.

క్రమంగా అన్ని సందేహములు తీరి డాక్టరేటు గమ్యం చేరుకుంటాము".


అద్వైతం లక్ష్యంగా సంస్కరింపబడి, ఇప్పుడున్న శైవ, వైష్ణవ,గాణపత్య,ద్వైత, విశిష్టాద్వైత,స్మార్తాది సమస్త సంప్రదాయములకు మూలం శ్రీ శంకరుల బోధలే.

సద్గురువులు ఆ యా కాలములలో అవతరించి ఈ బోధలను ప్రజల యోగ్యతానుసారం వివిధ రీతులలో ఉపదేశిస్తూ‌ ఉంటారు.

                                  -------


పై సమాధానమునకు శ్రీమతి మాలినీ శ్రీ గారు ఈ విధంగా స్పందించారు.


* నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏🙏 *


అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మృత్యువు నుంచి ముక్తి మార్గము వైపు నడిపించే వారు గురువులు 🙏🙏.


శంకరాచార్యుల వారు ఒక విశ్వవిద్యాలయం అని, ఆయన రచనలను పాఠ్యాంశాలు అని, ఎంతో చక్కగా సువిశాలమైన దృక్పథంతో కూడిన వివరణ అపూర్వం పెదనాన్న.


నిజమే కదా, అసలు శంకరాచార్యుల వారు లేక పోతే ఆధ్యాత్మిక చింతన, దేవాలయాలు, పూజలు, అనేవి ఉండేవి కావు. 

ధర్మం అట్టడుగున పడిపోయి ఇతర బౌద్ధం, జైనం, చార్వాక ధర్మాలు, కాపాలిక మతము మొదలైన ఆచరణలు విర్రవీగుతూ ఉన్న సమయంలో శివుడే స్వయంగా శ్రీ శంకరాచార్య స్వామి వారి రూపంలో అవతరించి ధర్మ సంరక్షణ చేశారు.


శంకరాచార్యులవారు సనాతన ధర్మాన్ని పదిలంగా నిలపడానికి జన్మించిన మహాపురుషుడు. 

ఈ వేదం, పురాణాలు, ఉపనిషత్తులు ఈరోజు ఇంకా నిలదొక్కుకొని ఉన్నాయంటే దానికి మూలం శ్రీ శంకరులు.


కొందరు అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉంటారు. 

కానీ అది అన్నిటికీ పునాది. 

ఒక ఆలయం నిలబడడానికి పునాది ఎలాగో అలాగే అద్వైతం. 

అద్వైతం పునాది అయితే దానిపై నిలబడిన ఆలయ గోపురాలు విశిష్టాద్వైత, ద్వైతములు.

 పునాది లేనిదే ప్రయోజనం లేదు.

ఇది చాలా మంది పెద్దల అభిప్రాయం.


గురువు అంటే శ్రేయస్సు కోరేవారు. శంకరులు సమస్త మానవాళికి, భూమికి శ్రేయస్సు కోరుతూ, దానికి అనువైన సనాతన ధర్మాన్ని కాపాడారు. అందుకే శంకరులు జగద్గురువు. 🙏


మీరు తరగతులు, దానికి తగినట్లుగా పాఠ్యాంశాలు, విద్యార్థుల అర్హత, పూర్వ జన్మ సుకృతం మేరకు ఆయన రచనలను అభ్యాసం చేస్తారు అన్నది అమోఘం. 

ఎంతో సత్యము, అంతరార్థము దాక్కుంది దానిలో 🙏


అద్వైతం నిజంగానే పి.హెచ్. డి.

అనంతమైన పాఠ్యాంశం ఉన్న పదవి. 

దానిని పొందడం కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం.


నేను కేవలం శంకరులు రచించిన స్తోత్రములు చదివే ఒకటో తరగతి విద్యార్థిని. 

ఇంతకే ధన్యురాలిని అనుకుంటా. 

ఇంకా కాస్త పై తరగతిలోకి ఉత్తీర్ణత సాధించగలిగితే అది తప్పకుండా శారదా మాత, గురువుల ఆశ్శీస్సులు. 🙏


శ్రీ శంకరులు పంచాయతన పూజా విధానం స్థాపించి సుబ్రహ్మణ్య స్వామిని అన్ని విధానాల్లో జ్యోతి స్వరూపంలో నిలిపారు.


 భారత దేశం మొత్తం నాలుగు దిక్కులా నాలుగు పీఠాలు స్థాపించి రక్షణా కవచాన్ని నిర్మించి ధర్మం నిలబెట్టారు. 🙏

అలా చేయడం వల్లే వైష్ణవ, మధ్వ, మరియు ఇతర మతాలు ఈనాడు మనగలుగుతున్నాయి.


శివ కేశవులకు అభేధం. అది గళస్య కంఠస్య బంధం. 


సోహం, దాసోహం వివరణ చాలా ఆలోచింప చేస్తుంది. సోహం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. 


అన్నీ నేనే, అన్నింటా నేనే అనేదే ఆత్మ తత్వము.

ఆ తత్త్వమును అలవరుచుకొని దానికి లోబడి ఉండడం దాసోహం, అని నేను అనుకుంటున్నాను.

ఇతర దేవతలకు దాసోహం అని పైకి తోస్తున్నా , వారిలో ఉన్న ఆత్మ తత్త్వానికి దాసోహం అని నేను అనుకుంటున్నాను.

అలా ఆ అద్వైత తత్వానికి శరణాగతి కావడం, ఆచరించడం మన కర్తవ్యం అని ఇంతమాత్రం నా చిన్న, పామర మెదడు అర్థం చేసుకుంది.


నా అభిప్రాయంలో తప్పులుంటే సరిదిద్దండి పెదనాన్న.


శంకరాచార్యుల వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.

 🙏. ఆయన అనంతం. 🙏

కేవలం నమస్కారం చేసే యోగ్యత మాత్రమే ఉంది.


నాకు చాలా చాలా నచ్చిన వ్యాసం ఇది పెదనాన్న. 

నాతో చాలా ఆలోచింప చేసి, నేను విన్న ఎన్నో విషయాలు స్ఫురణకు తెచ్చింది మీ వ్యాసం.

ధన్యవాదాలు పెదనాన్న.

మీరు మీ రచనలతో అందరికి ఎంతో జ్ఞానం పంచుతున్నారు 🙏


                            ------------

                 (25-4-'23 న పెట్టిన పోష్టు)

 

శుభమస్తు

తూములూరి మధుసూదనరావు,

25-4-'26