15, జూన్ 2026, సోమవారం

చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం

  చాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి.

జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలిచాంద్రమానం ప్రకారం జ్యేష్ఠమాసం మూడవ నెల. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠానక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వల్ల దీనికి జ్యేష్ఠమాసం అని పేరు ఏర్పడింది. ఈ మాసం అత్యంత ఫలప్రదమైంది. మహా విష్ణువుకు వైశాఖ మాసం ప్రీతిపాత్రమైనట్లు ఈ మాసం బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. బ్రహ్మదేవుడికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రతిరోజూ బ్రహ్మదేవుడిని పూజించాలని శాస్త్రవచనం.

ఈ మాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు దశమి వరకు అంటే తొలి పదిరోజులూ కాశీలోని దశాశ్వమేధఘాట్ లో బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేయడంతో పాటు గంగానదిని పూజించాలి. అందుకు వీలుకాని వారు సమీపంలోని నది గానీ, లేదా ఇంటిలో గానీ గంగానదిని స్మరిస్తూ స్నానం చేయాలి.

జ్యేష్ఠమాసంలో త్రివిక్రముని ప్రీతి కొరకు నీటి కుంభమును, నీరు, విసనకర్రను, చందనమును దానం చేయాలి..

మంగళవారం🍁* *🌹16, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁మంగళవారం🍁*

  *🌹16, జూన్, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

                  

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 


*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*నిజ జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : విదియ* రా 12.52 వరకు ఉపరి *తదియ*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* సా 04.12 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం* :*వృద్ధి* రా12.35ఉపరి *ధ్రువ*

*కరణం  : బాలువ* మ 02.39 *కౌలువ* రా 12.52 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.00 - 11.00 సా 04.00 - 06.00* 

అమృత కాలం  :*ఉ 07.25-08.50*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*

*వర్జ్యం    :రా02.54 -04.20తె*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.05 రా 11.03 - 11.46*

*రాహు కాలం   :మ03.25- 05.03*

గుళికకాళం      : *మ 12.08 - 01.46*

యమగండం    : *ఉ 08.52 - 10.30*

సూర్యరాశి : *మిధునం*                 

చంద్రరాశి : *మిధునం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.35 -08.12*

సంగవ కాలం        :*08.12 - 10.50*

మధ్యాహ్న కాలం    :*10.50 - 01.27*

అపరాహ్న కాలం   :*మ 01.27- 04.04*

*ఆబ్ధికం తిధి        : నిజ జ్యేష్ఠ శుద్ధ విదియ*

సాయంకాలం     :*సా 04.04- 06.41*

ప్రదోష కాలం      :*సా 06.41- 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం       :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

సోమవారం

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

     🕉️ *సోమవారం*🕉️

  *🌹15, జూన్, 2026🌹*

     *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం*

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి : అమావాస్య* ఉ 08.23 ఉపరి *నిజ మాసారంభః*

*పాడ్యమి* రా.తె 04.30 వరకు ఆపైన *విదియ*

*వారం   :సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం  : మృగశిర* రా 07.08 వరకు ఉపరి *ఆరుద్ర*

*యోగం : శూల* ఉ 08.56 ఉపరి *గండ* రా.తె 04.39 వరకు 

*కరణం  : నాగ* ఉ 08.23 *కింస్తుఘ్న* సా 06.26 ఉపరి

*బవ* రా.తె 04.30 వరకు ఆపైన *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

           *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  : *ప 11.28 - 12.52*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.34*

*వర్జ్యం    : రా 02.30 - 03.55*

*దుర్ముహూర్తం  : మ 12.34 - 01.27 & 03.11 - 04.04*

*రాహు కాలం  :ఉ 07.13 -08.51*

గుళికకాళం      :*మ 01.46 - 03.25*

యమగండం    : *ఉ10.30 - 12.08*

సూర్యరాశి : *వృషభం/మిధునం*

చంద్రరాశి : *వృషభం/మిధునం*

సూర్యోదయం :*ఉ 05.42*

సూర్యాస్తమయం :*సా 06.52*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ 05.35- 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :*10.49 - 01.27*

అపరాహ్న కాలం  :*మ 01.27- 04.04*

*ఆబ్ధికం తిధి       : నిజ జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం    :*సా 04.04- 06.41*

ప్రదోష కాలం     :*సా 06.41 - 08.52*

రాత్రి కాలం        :*రా 08.52 - 11.46*

నిశీధి కాలం       :*రా 11.46 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


          🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

అక్షర ప్రేమికుడు*

 *అక్షర ప్రేమికుడు*

================

రచన :- సురేష్ వంకాయలపాటి (పిఠాపురం )

==================



    పచ్చని పొలాలు మధ్య  గోదావరి గాలులు చల్లదనానికి  సాయం సంధ్య వేళ  వేళ పక్షుల రమణీయమైన  కిలకిలారావాలతో  సందడి చేసే  ఒక చిన్న పల్లెటూరు లో మహేంద్ర అనే వ్యక్తి  ప్రశాంతంగా తన అభిరుచి కి అనుగుణంగా అందరినీ అలరిస్తూ పలకరిస్తూ....

చిన్నప్పటి నుంచే చదువులో మంచి ప్రతిభ  చూపిస్తూ  నే అన్ని రకాల పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అతనికి ఎంతో ఇష్టంమైన వ్యాపకం  గా చేసుకున్నాడు...

           మహేంద్ర  కష్టపడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.   దురదృష్టవశాత్తు  తన చదువుకు తగిన మంచి ఉద్యోగం దొరకలేదు. అయినా నిరాశ పడకుండా అన్ని  ప్రయత్నాలు చేస్తూ ఇంటర్వ్యూలకు వెళ్లాడు . ఎంతో  ఆశతో ఎదురు చూశాడు చూసిన ప్రతీ సారి తనకి  నిరాశే ఎదురైంది.

    తర్వాత కొన్ని   ప్రైవేట్  సంస్థల్లో ఉద్యోగాలు చేశాడు.  చివరగా మరో ప్రైవేట్ కంపెనీలో  క్లర్క్‌గా  చాలా కాలం పని చేశాడు. అతను చేసే పని  అతనికి  నచ్చలేదు.. జీతం సమస్య కాకపోయినా ఎందుకో తన మనసుకు తృప్తి కలగలేదు. చివరకు ఆ ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు.

       మహేంద్రకు చిన్నప్పటి నుండి తనకటూ మరో లోకము ఉంది అదే అక్షర ప్రపంచం.

       అతనికి కథలు, కవితలు వ్రాయడం అంటే  చాలా ఇష్టం. ప్రకృతి అందాలు వర్ణిస్తూ  సగటు మనుషుల జీవిత విశేషాలు,  సమాజంలో జరిగే సంఘటనల  ఆలోచనలు తన  కలంతో  కథలుగా మారేవి.

     నిద్ర లేని ఎన్నో రాత్రిళ్ళు కాగితం మీద  తన భావాలను పదాలుగా మార్చేవాడు. పుస్తకాలు, కాగితాలు అతని నేస్తాలు.

కాల క్రమంలో జీవితంలో కొన్ని మార్పులు అనివార్యం అవుతూ వచ్చాయి.  వాళ్ల  పొలాలు అమ్మి రాజమండ్రి గోదావరికి 

చేరువుగా తన అభిరుచికి తగ్గట్టు ఒక ఇల్లు  కొనుగోలు చేశాడు. కొంత  డబ్బును బ్యాంకులో జమ చేశాడు. వచ్చే వడ్డీతో కుటుంబం సాదాసీదాగా ఒడి దుడుకులు లేకుండా ముందుకు సాగిపోతోంది.

      మహేంద్ర కు మేనమావ కూతురు శ్రీవల్లి  తో వివాహం అయింది. వారికి  ఒక్క గాని ఒక్క కూతురు . ఆమెకు సరస్వతి  అని పేరు పెట్టీ గారంగా పెంచుతున్నారు. సరస్వతి పేరుకు తగ్గట్టు చదువులో ముందు ఉండేది.  తెలివైన అమ్మాయి. ఆమెకు  తండ్రి అంటే  ఎంతో గౌరవం. 

     మహేంద్ర కు కూడా కూతురు అంటే అంతే ప్రేమ.  అమ్మాయి చదువు విషయంలో ఎప్పుడూ రాజీపడలేదు. కష్టపడి ఆమెను బి.టెక్ వరకు చదివించాడు.

అలాగే  మహేంద్ర తనకి ఇష్టమైన రచన వ్యాపకం   కొనసాగిస్తూ ఉన్నాడు. ఎక్కడ  సాహితీ సభలు జరిగితే అక్కడ పాల్గొనేవాడు  . అవకాశం  వచ్చినపుడు తన కవితలు తను వ్రాసిన కథలు చదివేవాడు. అలా ఎందరో  సాహిత్యప్రియులు తో సాన్నిత్యం  ఏర్పడింది. వారంతా అతనిలోని ప్రతిభ ను గుర్తించి తన  రచనలను మెచ్చుకునేవారు.

      కావలసిన వారు ,  చుట్టుపక్కల ఉన్నవారికి మాత్రం మహేంద్ర చేస్తున్న పని అంతగా రుచించలేదు. ఉద్యోగం , సద్యోగం లేకుండా కవితలు. గోష్టి అంటూ తిరిగితే ఏంటి ప్రయోజనం అంటూ జాలి పడుతూ హేళన చేసేవారు.

ఇరుగు పొరుగు అమ్మలక్కలు   శ్రీవల్లి తో...

మీ వారు రోజంతా ఇంట్లో కూర్చుని ఏవేవో  రాస్తుంటాడు. ఎక్కడికి వెళ్లాడా ఏ  పని చేయడా అని ఆడి పోసుకునేవారు..” పైగా ఇలాగే కొనసాగితే ఎదిగిన కూతురు పెళ్లి ఎలా  చేస్తారు అంటూ   దెప్పి పొడవటం మొదలు పెట్టారు. క్రమేణా శ్రీవల్లి వాళ్ళ మాటలకు భయపడటంతో తనలో కొంత మార్పు వచ్చింది. ఆమె భర్త తో అయిన దానికి కానిదానికి రుస రుస లాడటం కారణం లేకుండా  గొడవ పడటం మొదలు పెట్టింది.

“రోజంతా ఆ పుస్తకాలు, కాగితాలు ముందు వేసుకుంటే  వాటి వల్ల  మన జీవితాలు మారిపోతాయా అంటూ రుస రుస లాడటం కూడా  మొదలు పెట్టింది.

మహేంద్ర  ఆమె ప్రవర్తన చూసి కాస్త ఆశ్చర్య పడుతూ అంతలోనే  శాంతంగా నవ్వుకునేవాడు.

చూడు శ్రీ వల్లి … నువ్వు తీసి  పడేస్తున్న ఈ రచనలకు  కూడా ఒక రోజు వస్తుంది.”అని చెప్పటానికి ప్రయత్నిస్తుంటే 

      శ్రీవల్లి  మాత్రం ఆ మాటలను పెద్దగా పట్టించుకోలేదు.

కళ్ళ ముందు రోజులు గడిచి పోయాయి  నెలలు గడచి పోతున్నాయి.

ఒక రోజు మహేంద్ర రాసిన కథ ఒక ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. ఆ కథలో గ్రామీణ జీవితం, అక్కడ మనుషుల భావాలు చాలా హృదయానికి హత్తుకునేలా వ్రాయటం తో  అందరికీ బాగా  నచ్చింది.

       చివరకు ఆ కథ సినిమా దర్శకుడు  సురేష్ వంకాయలపాటి చదవటం జరిగింది. కథ చదివిన వెంటనే చాలా ఇంప్రెస్స్ అవటమే కాకుండా  చాలా  ఆశ్చర్యపోయాడు. ఇలాంటి 

మంచి కథ ఎవరు రాశారు?”  అని వాకబు చేయటం మొదలు పెట్టాడు.

పత్రికలో ఉన్న చిరునామాతో  మహేంద్ర ఆచూకీ తేలుకుని  ఒక  మంచి రోజు అతని ఇంటికి వెళ్ళాడు.

తలుపు తడితే  మహేంద్ర బయటికి వచ్చాడు.

“మీరు మహేంద్ర గారేనా?” అని అడిగాడు సురేష్.

“అవును… నేను మహేంద్రనే” అంటూ  సమాధానం ఇచ్చాడు. నేను దర్శకుడు సురేష్ ను అంటూ పరిచయం చేసుకున్నాడు.

“మీరు రాసిన కథ నేను చదివాను. అద్భుతం. ఆ కథను నేను సినిమాగా తీయాలనుకుంటున్నాను.” అని చెప్పటంతో  అతని మాటలకు 

మహేంద్ర ఒక్క క్షణం ఆశ్చర్యపోయాడు.

          సురేష్ వెంటనే ఒక కవర్ తీసి అతని చేతిలో పెట్టాడు.

“ఇది అడ్వాన్స్. మిగతా విషయం తరువాత మాట్లాడుకుందాం.”

ప్రక్కగా నిలబడి  చూస్తున్న శ్రీవల్లి కి ఒకటే  ఆశ్చర్యం.  తను తక్కువగా చూస్తున్న భర్త చేతి వ్రాతలే  వారి ఇంటికి  ఇంత గౌరవం తీసుకొచ్చాయి అని తెలుసుకుని  ఆశ్చర్యము తో ఆనందపడిపోతోంది.

నెమ్మదిగా  ఆ వార్త కాలనీ అంతా తెలిసిపోయింది.

ఇప్పటివరకు మహేంద్రను విమర్శించిన వారు  అతని దగ్గరకు వచ్చి అభినందనలు తెలియచేస్తున్నారు ఒక్కొక్కరుగా .

“మహేంద్ర గారూ! మేము మీలో ఉన్న  ప్రతిభ ను  గుర్తింక ఏవేవో  మీ గురించి తప్పుగా మాట్లాడాం అంటూ సంజాయిషీ చెప్పుకుంటున్నారు.

            త్వరలోనే కాలనీలో ఒక చిన్న సభ కూడా  ఏర్పాటు చేశారు. సభలో అందరూ ఆయన్ని కొనియాడారు. చివరగా  మహేంద్రను మాట్లాడమని కోరారు.

మహేంద్ర మైక్ దగ్గరకు వెళ్లి నెమ్మదిగా మాట్లాడటం ప్రారంభించాడు.

“ప్రియమైన మిత్రులారా…మీ అందరికీ  నా హృదయ పూర్వక నమస్కారములు. మీ విమర్శలే నన్ను చైతన్య వంతుణ్ణి  చేశాయి. రచయిత అంటే 

 కేవలం పదాలు అల్లేవాడు  మాత్రమే  కాదు. రచయిత ఎప్పుడూ   మనుషుల మనసులను అర్థం చేసుకునే వ్యక్తి. వారి  మనోగతాలను అవగాహన చేసుకునే శక్తి గల వ్యక్తి కూడా...

కవిగా పుట్టడం అంటే ఒక వరం.పూర్వ జన్మ సుకృతం.

కవిత్వం అంటే భావాలను అక్షరాలుగా మార్చే కళ. కొందరికి కొన్నిటి మీద మక్కువ. సైంటిస్టు కి ఏదో  ఒక కొత్తది కనిపెట్టాలి అనే తపన.  వ్యాపారం చేసేవారికి డబ్బు సంపాదించాలన్న కోరిక, మరొకరికి పదవి అంటే ప్రాణం.  అలాగే కొందరికి సాహిత్యం అంటే ఇష్టం. ఏ రంగంలో ఎవరికైనా 

డబ్బు వెంటనే రాకపోవచ్చు. గౌరవం కూడా ఆలస్యంగా రావచ్చు. కానీ నిజమైన అక్షరాలు ఎప్పటికైనా తమ విలువను చూపిస్తాయి. సంఘంలో గౌరవాన్ని పెంచుతాయి.

కవి ఆలోచనలు ఏదో ఒక  రోజు సమాజానికి అద్దం పడతాయి. అందుకే అక్షరాలను నమ్ముకున్న వాణ్ణి  , ప్రేమించే వాడిని  తక్కువగా చూడకూడదు.”

ఒక్కసారిగా అతని మాటలు వింటున్న ప్రతీ ఒక్కరు లేచి నిలబడి  గట్టిగా చప్పట్లు కొట్టారు.

శ్రీవల్లి  కళ్లలో ఆనందబాష్పాలు సుళ్ళు తిరుగుతున్నాయి. 

        సభ ముగిసిన తరువాత ఆమె మహేంద్ర దగ్గరకు వెళ్లి క్షమార్పణ కోరుతున్నట్టు నెమ్మదిగా  చెప్పింది.

“నన్ను క్షమించండి. నేను మీ అభిరుచి , మీ  అభీష్టం   అర్థం చేసుకోలేకపోయాను.” అంటుంటే

మహేంద్ర చిరునవ్వుతో  ఆమెను దగ్గరగా తీసుకుంటూ 

కొన్నింటి  విలువ తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. దానికి కొంచెం ఓపిక ఉండాలి అంటూ ప్రేమతో మరింత దగ్గరికి తీసుకున్నాడు. గోదావరి మీద నుండి వస్తున్న చల్లటి  గాలి తెర ఇద్దర్ని ఆశీర్వదించింది.

గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు -

 గుండె బలహీనత పోగొట్టు సిద్ద యోగములు -


• తవాక్షరి చూర్ణంని తేనెతో సేవించుచున్న గుండెకు మంచి బలం కలిగి గుండె బలహీనత తొలగును .


• కోడిగుడ్డు సొన పాలతో బాగుగా కలియునట్లు చేసి దానిలో మిరియాల చూర్ణం , చక్కెర కలిపి ఉదయమే సేవించుచున్న బలహీనత తగ్గును. గుండెకు సత్తువ ఇచ్చును.


• బెల్లపు పానకం లో మద్దిచెక్క చూర్ణంని కలిపి తాగిన గుండెజబ్బులు పోవును . దీర్గాయువుని ఇచ్చును.


• గోధుమలు , మద్దిచెక్క చూర్ణములను ఆవునెయ్యి మేకపాలలో వేసి పక్వముగా చేసి దానిలో చక్కర చేర్చి సేవించుచున్న గుండెజబ్బులు తొలగును . గుండె బలహీనత పొవును .


• మద్దిచెక్క చూర్ణం, నెయ్యి, పాలు కలిపి తాగుచున్న గుండె బలహీనత తగ్గును.


• పెద్ద ముత్తువపులాగ చూర్ణంని పాలతో కలిపి తాగుచున్న గుండెబలహీనత , గుండెజబ్బు తగ్గును.


• 12 గ్రాముల స్వచ్ఛమైన తేనెను నీళ్లతో కలిపి ఉదయాన్నే తాగుచున్న గుండెజబ్బు నయం అగును.


• మద్దిచెక్క చూర్ణంని పంచదారతో కలిపి తాగిన గుండెజబ్బు నయం అగును.


• కటుకరోహిణి గంధమును గుండెకు పట్టువేసిన గుండెజబ్బు తొలగును .


• మారేడు వేరును కషాయంగా చేసి తాగుచున్న గుండెదడ హరించును .


• ఇంగువ 10 గ్రాములు , హారతి కర్పూరం 10 గ్రాములు ఇవి రెండు నీళ్లతో నూరి గురిగింజలు అంత మాత్రలు చేసి పూటకి ఒకమాత్ర చొప్పున రోజూ రెండుపూటలా వేసుకొని అనుపానంగా 40 గ్రాములు జటామాంసి కషాయం తాగుచున్న యెడల గుండెదడ , ఆయాసం హరించిపోవును .


• మూసామ్బారం నీళ్లతో నూరి గుండెలకు పట్టువేసిన యెడల గుండెలాగుట , పీకుట , ఆయాసం తగ్గును.


• గుండెల్లో మంట గా ఉంటే పుచ్చగింజలు 20 గ్రాములు నీటిలో రాత్రిపూట నానబెట్టి ఉదయమున ఆ నీటిలో ఆ గింజలను బాగా పిసికి పటికబెల్లం పొడి కొద్దిగా కలిపి ఆ తరువాత దానిని వడపోసి ఆ ద్రవమును తాగవలెను .


• రావి ఆకులను నీళ్లలో నానబెట్టి మరునాడు ఉదయము దానిని వడబోసి తెల్లటి సీసాలో నిలువ ఉంచవలెను. ఆ ద్రావకం రోజుకి మూడుమార్లు 50ml చొప్పున తాగుచున్న గుండెదడ తగ్గును. పైన చెప్పిన వాటిలో కొలతలు లేకున్నచో 3 నుంచి 5 గ్రాములు చూర్ణపు మోతాదు తీసుకోవచ్చు . ద్రవపదార్థం 100 ml నుంచి 150 ml వరకు తీసుకోవచ్చు .



మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.


రేపటికి పునాదులు*

  *రేపటికి పునాదులు*


*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు,*

 


ఎండలు మండిన కాలానంతరం

బడుల్లో నవ క్రాంతి

భవిత కేంద్రాలకు కొత్త కాంతి

 

కొన్ని ఆశలు

హరివిల్లులై సాక్షాత్కరిస్తాయి

కొన్ని ఆశయాలు

గాలిపటాలై

అక్కడి వినువీధుల్లో

కనువిందు చేస్తాయి

కొన్ని కలలు

అక్కడ రంగురంగుల

రంగవల్లికలై

భూమాత హృదయానికి

రంగుల కలలద్దుతాయి

కొన్ని మెలకువలు

కిలకిలరావాలై

అక్కడ గాలి చేసే నృత్యానికి

నేపథ్య రాగాలవుతాయి

కొన్ని నెమళ్లు 

అక్కడ పురివిప్పి

నృత్యాలు చేస్తాయి

కొన్ని సీతాకోకచిలుకలు

అక్కడ మనసులకు రెక్కలిస్తూ  

పరిసరాలకు                                                     

ఆహ్లాదపు లేపనమద్దుతాయి

కొన్ని కంఠాలు   

దోస్తులను దూరం చేసిన

సెలవులను

నవ్వుల పువ్వులు               

వెదజల్లుతూ వెక్కిరిస్తాయి


ఇప్పుడు అక్కడ

పాత వెలుగులు

కొత్త మెరుగులు దిద్దుకుంటాయి

రేపటికి పునాదులు వేసుకుంటాయి


*(తెలంగాణలో పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా)*

పరిపూర్ణ వికాస దిశగా

 *సందర్భం: జూన్ 15వ తేదీ పాఠశాలల పునఃప్రారంభం*


*పరిపూర్ణ వికాస దిశగా …*

*-డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు* 


ఇక్కడి గోడలు

తిమిర నిర్మూలనకు

కంకణం కట్టుకున్న

విజ్ఞాన కేంద్రాలు


నోట్లోని శ్వేత కుడ్యాల చాటు నుండి

బుజ్జి నాలుకలు

లోపలికీ బయటికీ

కిందికీ పైకీ

లేలేత పెదాలు పైకీ కిందికీ

కదులుతూ

ఇక్కడి పరిసరాల్లో

అనునిత్యం జరిగే శబ్దప్రసారం  

అడుగడుగునా చేతనకు కారణమవుతుంది.


నోటి నుండి వెలువడే శబ్దానికి

రూపం కల్పిస్తూ

పలకపై రాసిన అక్షరాన్ని

మెదడు ఛాయాచిత్రంగా భద్రపర్చుకుంటుంది

ఆ ఛాయాచిత్రమే డీకోడ్ అయి

తిరిగి పెదవుల గుండా

పరావర్తనమవుతుంది


నల్లబల్లపై చిత్రితమయ్యే

అక్షరమాలలు

అరవై అవతారాలెత్తి  

ఒకేసారి అరవై గమ్యాలకు

ప్రయాణం చేస్తాయి  


ఇంటర్వెల్ బెల్లు కొట్టగానే

పరుగులు తీసే చిట్టి కాళ్లు

పాదముద్రలతో

బడినేలపై హాజరు వేసుకుంటాయ్


ఇక్కడే

చిట్టి నెమళ్లు

పరిసరాల్ని మరచి

పురివిప్పుకుని ఆడతాయ్  

చదువులూ

ఆటలూ

పాటలూ

పోటాపోటీగా కొనసాగుతాయ్  

సమగ్ర మూర్తిమత్వమూ

పరిపూర్ణ వికాసమూ

గమ్యాలుగా

అడుగులు కదులుతాయ్

అరుణాచలేశ్వరా

 _తండ్రీ అరుణాచలేశ్వరా!🌹_ 


ఎక్కడెక్కడో ఉన్నావని 

పిలిచి పిలిచి

అలసి సొలసి డస్సిపోయాను

ఎదలో కొలువైనావని 

ఎరిగే జ్ఞానము లేదు

ఆగని ఆరాటం 

అంతులేని ఉక్రోషం తో

మాటలు రాక మూగబోయిన మనసు

ఆర్తితో జాలువారిన 

కన్నీరు ఇంకిపొయింది

మరో కన్నీటి బొట్టు జనిస్తే

నీ అభిషేకానికి వాడుకో మహదేవా

నా ఎదలో చెమ్మతో మీరు 

ఎపుడూ చల్లంగా ఉండాలి


 _హరః నమః పార్వతీ పతయే హరహర మహాదేవ శంభో శంకర!🙏_

మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*

  *మన మనస్సులో కలిగే ఆలోచనలే మన స్వభావాన్ని నిర్మిస్తాయి.*


*ఎల్లవేళలా భగవంతుణ్ణే స్మరిస్తూ, కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. మన మనోబుద్ధులు ఆయనకే సమర్పించాలి. అప్పుడు నిస్సంశయంగా ఆయననే పొందుతాము.*


*పవిత్రములైన వాటి గురించి యోచిస్తే, మనం పవిత్రులం అవుతాము.*


*మన హృదయం సదా ప్రేమతో నిండి ఉంటే ద్వేషానికి అక్కడ తావులేదు. అప్పుడు మనలోని శాంతిని ఎవరూ భగ్నపరచలేరు.*


*మనం అజాగ్రత్తగా వ్యవహరిస్తే మన స్వభావం మారిపోగలదు. ఎవరి గురించైనా చెడు తలపు కలిగే ముందు ఆ చెడు మనలో ప్రవేశిస్తుంది.*


*మనం సాధు వర్తనను కలిగి ఉంటే సాధుశీలురం అవుతాము. దాని గురించి యోచిస్తే, ఆ సాధుత్వం మనలో స్ఫూర్తిని కలిగిస్తుంది.*


*మనకు సరియైన త్రోవను చూపుతుంది. మన జీవితాన్నే మార్చివేస్తుంది.*

ధనం పెరిగిన కొద్దీ

  “ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”


వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, 

ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది.


ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం !


అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు. 


ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పద్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి.


చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా, ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. 


క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైనత ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి.


మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. 


దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది! ఇది సత్యం ..!!

.