1, మే 2026, శుక్రవారం

నరసింహాపాసన అంటే సంధ్యోపాసనే )

 శ్రీరామ (131)


        (నరసింహాపాసన అంటే సంధ్యోపాసనే )


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                        -----------------------  


అన్ని ఉపాసనల కంటే "సంధ్యోపాసన" చాలా గొప్పది.

సంధ్యోపాసన అనగా రెండు సమయముల మధ్య సంధి, 

రెండు ప్రాంతముల మధ్య సంధి,

రెండు ఆలోచనల మధ్య సంధి,

రెండు అక్షరముల మధ్య సంధి,

ఉచ్ఛ్వాస, నిశ్శ్వాసల మధ్య సంధి,

మొదలైనవి.


ఆ "సంధుల" మధ్య ఉన్నదానిని (సత్) "సంధ్య" అంటారు.

అదే ఆత్మ.

దానిని గమనించడమే సంధ్యోపాసన.

సంధ్యలో మహత్తరమైన "ఉత్పాదన" శక్తి ఉంటుంది.

ఆ శక్తిని "సవిత" అంటారు.

ఆ శక్తిని ఉపాసించి తరించడానికే మనకు "సంధ్యోపాసన" చెప్పబడింది.

ఈ శక్తికి ప్రతీక అయిన సూర్యుని అగస్త్య మహర్షి ఉపదేశించిన ' ఆదిత్య హృదయము ' ను పఠించి, శ్రీరాముడు ఉపాసించాడు.

ఆవిధంగా ఉపాసించిన తరువాత "శ్రీ రాముడు" రావణాసురుని అవలీలగా సంహరించగలిగాడు.


సీతాదేవి కూడా " సంధ్యోపాసన" చేసినట్లు వాల్మీకి రామాయణం లోని "సుందరకాండ" లో చెప్పారు.


చెరుకు గడ యొక్క "కణుపు" లో విత్తనం లేకుండా 

"చెరుకు మొక్క" ను పుట్టించే శక్తి ఉన్నది.

ఆ కణుపును "పర్వం" అంటారు.

"ఉదయ సంధ్య", "సాయం సంధ్య"  

గ్రహణములు,పుష్కరములు, మొదలైనవి కాల పర్వములు.

కాశీ మొదలైన పుణ్యక్షేత్రములు దేశ పర్వములు.

ఈ దేశ, కాల, పర్వములు అత్యంత శక్తివంతమైనవి.

 ఆ యా పర్వములలో చేసే జప, ధ్యాన, పూజాదులు,ఇతర సమయములలో చేసే జపాదుల కంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్ని ఇస్తాయి.


నరసింహ స్వామి పగలు, రాత్రి, మధ్య ఉండే సంధ్యాసమయంలో ఆవిర్భవించాడు.

ఆ "సంధ్య" లో ఉన్న మహాశక్తే నరసింహ స్వామి రూపంలో మహాబలుడైన హిరణ్యకశిపుని అవలీలగా సంహరించింది.

ఆ శక్తే "అహో బలం" అని దేవతలచే స్తుతింపబడి, 

"అహోబిలం" లో వేంచేసి ఉన్నది.


శక్తికి ప్రతీక అయిన ఆ నరసింహస్వామిని ఉపాసిస్తే "సంధ్యోపాసన" ఫలితం సిద్ధిస్తుంది.

విశేషించి సంధ్యా సమయములలో చేసే నరసింహోపాసన సర్వ శ్రేయస్సులను ప్రసాదిస్తుంది.


శ్లో//శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ/

తాపత్రయోపశమనాయ భవౌషధాయ/

తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ/

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే//.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

1-5-'26.

సీస పద్యముసీస పద్యము

 🌸పార్వతి దేవి స్తుతి🙏

సీస పద్యము 


శాంకరి శాంభవి శర్వాణి శారద

కరుణతో కాపాడు కాళికాంబ

భవునిరాణి భవాని బాధలు దూరము 

చేసియు  చాముండి చింత తీర్చు

కళ్యాణి భగవతి కామాక్షి నిర్మల

బహుభుజ భార్గవి వందనములు

మాతంగి మాతృక మాలిని మలయమ్మ

మమ్ము కావుము దేవి మమత తోడ

తే  శంభుప్రియగౌరి  పార్వతి శరణు శరణు

సర్వమంగళ సావిత్రి జయము జయము

 సింహరథ సింహ వాహిని శీఘ్రముగను

శైలముదిగిరాశ్యామల శంభురాణి

 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - స్వాతి -‌‌ భృగు వాసరే* (01.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

  🌸పార్వతి దేవి స్తుతి🙏

సీస పద్యము 


శాంకరి శాంభవి శర్వాణి శారద

కరుణతో కాపాడు కాళికాంబ

భవునిరాణి భవాని బాధలు దూరము 

చేసియు చాముండి చింత తీర్చు

కళ్యాణి భగవతి కామాక్షి నిర్మల

బహుభుజ భార్గవి వందనములు

మాతంగి మాతృక మాలిని మలయమ్మ

మమ్ము కావుము దేవి మమత తోడ

తే శంభుప్రియగౌరి పార్వతి శరణు శరణు

సర్వమంగళ సావిత్రి జయము జయము

 సింహరథ సింహ వాహిని శీఘ్రముగను

శైలముదిగిరాశ్యామల శంభురాణి

 

సాహితీ శ్రీ జయలక్ష్మి పిరాట్ల

Mantra - 26

 Mantra - 26 ARUNAM 3 anuvaakam


వసంతం (వసువులు), గ్రీష్మం (రుద్రులు) తర్వాత వచ్చే వర్ష ఋతువు యొక్క వైభవాన్ని, అది ఇచ్చే ఫలాన్ని తరువాత వచ్చే మంత్రం వివరిస్తుంది.


"విశ్వరూపాణి వాసాగ్ంసి|

ఆదిత్యానాం నిబోధత|

సంవథ్సరీణం కర్మఫలమ్| 

వర్షాభిర్దద తాగ్ం సహ॥" 


ఇక్కడ ఆదిత్యులు (ద్వాదశ ఆదిత్యులు) వర్ష ఋతువుకు అధిపతులుగా చెప్పబడ్డారు.


విశ్వరూపాణి వాసాంసి: "విశ్వరూపాణి" అంటే అనేక రకాలైన రూపాలు లేదా రంగులు. "వాసాంసి" అంటే వస్త్రములు. వర్ష ఋతువులో ప్రకృతి అంతా రకరకాల రంగులతో (పచ్చని చెట్లు, రంగురంగుల పూలు, ఆకాశంలో హరివిల్లు) నిండి ఉంటుంది. ఆ వైవిధ్యాన్ని ఇక్కడ 'విశ్వరూప వస్త్రాలు'గా వర్ణించారు.


ఆదిత్యానాం నిబోధత: "ఇది ఆదిత్యుల యొక్క ప్రభావమని తెలుసుకోండి." ద్వాదశ ఆదిత్యులు (సూర్యుని 12 రూపాలు) వర్ష ఋతువులో మేఘాల వెనుక ఉండి లోకాన్ని పోషిస్తారు.


సంవత్సరీణం కర్మఫలమ్: "సంవత్సరమంతా చేసిన కర్మల యొక్క ఫలితం." ఒక రైతు ఏడాది పొడవునా పడ్డ కష్టానికి లేదా మనం చేసే యజ్ఞ యాగాదుల ఫలితం వర్షాల రూపంలో, సమృద్ధిగా పండే పంటల రూపంలో మనకు అందుతుంది.


వర్షాభిర్దదతాం సహ: ఈ ఆదిత్యులు వర్ష ఋతువుతో కలిసి ఆ కర్మఫలాన్ని (ఆహారాన్ని, జలాన్ని) మనకు ప్రసాదిస్తారు.


అరుణప్రశ్నలోని ఈ భాగం కాలచక్రం ఎలా మన జీవితాలను ప్రభావితం చేస్తుందో చెబుతుంది:

 

ఆదిత్యుల పాత్ర - వేదాల ప్రకారం ఆదిత్యులు లోక రక్షకులు. వారు సూర్యరశ్మి ద్వారా నీటిని గ్రహించి (గ్రీష్మంలో), వర్ష ఋతువులో తిరిగి భూమికి ప్రసాదిస్తారు.


కర్మఫలం - వర్షం - భారతీయ సంస్కృతిలో వర్షాన్ని దైవిక ప్రసాదంగా భావిస్తారు. "సకాలంలో వర్షాలు కురవడం" అనేది ఆ దేశపు పుణ్యఫలంగా, ధర్మబద్ధమైన పాలనకు సంకేతంగా చూస్తారు. అందుకే దీనిని "సంవత్సరీణం కర్మఫలమ్" అన్నారు.


 ప్రకృతి సౌందర్యం - "విశ్వరూపాణి" అనే పదం వర్షం పడినప్పుడు ప్రకృతిలో వచ్చే అనూహ్యమైన మార్పులను సూచిస్తుంది. ఎండిపోయిన భూమి ఒక్కసారిగా ప్రాణం పోసుకుని విభిన్న రూపాలలో ప్రకాశిస్తుంది.


అనేక వర్ణాల వస్త్రాలను ధరించి, ఆదిత్యులతో కలిసి వచ్చే వర్ష ఋతువు, మనం ఏడాది పొడవునా చేసిన కర్మల యొక్క శుభ ఫలితాన్ని (సమృద్ధిని) మనకు అందజేస్తుందని ఈ మంత్రం సారాంశం.


అద్వైత తత్వార్థం

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం సృష్టిలోని వైవిధ్యం వెనుక ఉన్న ఏకత్వాన్ని మరియు కర్మ సిద్ధాంతాన్ని ఇలా వివరిస్తుంది:

విశ్వరూపాణి వాసాగ్ంసి - మాయా విలాసం

వర్ష ఋతువు రాగానే భూమి రకరకాల రంగులతో (పచ్చని గడ్డి, రంగురంగుల పూలు, ఇంద్రధనుస్సు) నిండిపోతుంది. దీనిని వేదం 'విశ్వరూప వస్త్రాలు' అని పిలిచింది. అద్వైతంలో, నిర్గుణ బ్రహ్మము తన 'మాయా' శక్తి ద్వారా అనంతమైన నామ-రూపాలను (విశ్వరూపాణి) ధరిస్తుంది. వస్త్రం శరీరాన్ని కప్పినట్లు, ఈ జగత్తు యొక్క వైవిధ్యం లోపల ఉన్న ఏకైక సత్యాన్ని కప్పి ఉంచుతుంది. ఈ వైవిధ్యం అంతా ఆ పరమాత్మ ధరించిన అలంకారమే తప్ప ఆయన కంటే వేరు కాదు.

కర్మఫల ప్రదాత (The Bestower of Fruits) - మనం చేసే కర్మలకు ఫలితం వెంటనే రాకపోవచ్చు. ఏడాది పొడవునా చేసిన వ్యవసాయానికి లేదా ప్రకృతిలో జరిగిన మార్పులకు ఫలితం 'వర్షం' రూపంలో వస్తుంది.

అద్వైత సిద్ధాంతం ప్రకారం, జీవుడు చేసే కర్మలకు ఫలాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు (Karma Phala Data). సూర్యుడు భూమి నుండి నీటిని గ్రహించి (గ్రహణం), తిరిగి వర్షం రూపంలో (త్యాగం) ఎలా ఇస్తాడో, పరమాత్మ కూడా మన కర్మలను అనుసరించి మనకు సుఖదుఃఖాలను లేదా జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.

ఆదిత్యానాం నిబోధత - చైతన్య వితరణ - ఇక్కడ 'ఆదిత్యులు' (బహువచనం) అంటే సూర్యుని పన్నెండు రూపాలు (ద్వాదశాదిత్యులు) అని అర్థం. పరమాత్మ ఒక్కడే అయినా, కార్య భేదం వల్ల అనేక రూపాల్లో కనిపిస్తాడు.

"నిబోధత" అంటే ఈ సత్యాన్ని మేల్కొని తెలుసుకోమని అర్థం. వర్షం పడటం అనేది ఒక భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు, అది పరమాత్మ యొక్క అనుగ్రహ శక్తి (Grace) కి సంకేతం. ఆ అనుగ్రహమే జీవుడిని సంసార తాపం నుండి రక్షించి, మోక్షానికి అర్హుడిని చేస్తుంది.

సమదృష్టి (Equanimity) - వర్షం అందరి మీద సమానంగా కురుస్తుంది. కానీ భూమి స్వభావాన్ని బట్టి ఒకచోట గడ్డి, ఒకచోట వృక్షం మొలుస్తుంది. అలాగే, పరమాత్మ చైతన్యం అందరిలోనూ సమానంగా ఉన్నా, వారి వారి సంస్కారాలను (కర్మఫలమ్) బట్టి ఫలితాలు మారుతుంటాయి. అద్వైత సాధకుడు ఈ ఫలితాల వెనుక ఉన్న 'దాత'ను దర్శించాలి తప్ప ఫలితాల మీద మమకారం పెంచుకోకూడదు.


ఈ జగత్తులో నీకు కనిపించే అనంతమైన రూపాలు (విశ్వరూపాలు) ఆ పరమాత్మ ధరించిన వస్త్రాలే. నీవు చేసే ప్రతి కర్మకూ ఫలితం ప్రకృతి ద్వారా, దైవ సంకల్పం ద్వారా లభిస్తుంది. వర్షం ఎలాగైతే భూమిని చల్లబరిచి జీవకళను ఇస్తుందో, ఆత్మజ్ఞానం కూడా నీ హృదయాన్ని శాంతింపజేసి నిన్ను సత్యం వైపు నడిపిస్తుంది.

గ్రీష్మ తాపం (తపస్సు/వైరాగ్యం) తర్వాత వచ్చే వర్షం (అనుగ్రహం/శాంతి) జీవుడి ఆధ్యాత్మిక పరిణామ క్రమాన్ని సూచిస్తుంది.

శుక్రవారం,మే.1,2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

శుక్రవారం,మే.1,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - శుక్ల పక్షం

తిథి:పూర్ణిమ రా9.28 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:స్వాతి తె3.26 వరకు  

యోగం:సిద్ధి రా8.28 వరకు

కరణం:భద్ర ఉ8.43 వరకు 

తదుపరి బవ రా9.28 వరకు

వర్జ్యం:ఉ7.37 - 9.21

దుర్ముహూర్తము:ఉ8.10 - 9.00 

మరల మ12.22 - 1.12

అమృతకాలం:సా5.57 - 7.41

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:తుల

సూర్యోదయం:5.39

సూర్యాస్తమయం:6.15

వైశాఖ పూర్ణిమ

సంపద గౌరీ వ్రతం & కూర్మ జయంతి

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి.

శ్రీ నరసింహ స్వామి ఆవిర్భావ

 శ్రీరామ (130 ).  


 ( పోతన మహాకవి రచించిన శ్రీ నరసింహ స్వామి ఆవిర్భావ ఘట్టం)


శ్లో//శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ/

తాపత్రయోపశమనాయ భవౌషధాయ/

తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ/

క్లేశవ్యయాయ హరయే గురవే నమస్తే//.

        

                            ---------------


 "శ్రీ నరసింహ స్వామి" ఆవిర్భావ ఘట్టాన్ని,

మహాకవి, మహాభక్తుడు, అయిన "పోతన" ,  

భక్తి పారవశ్యంతో,

 నరసింహోపాసకులకు అత్యంత ప్రీతిపాత్రమైనది, 

వేద మంత్రములతో సమానమైనది, 

గంభీరమైనదీ, 

అయిన గద్య రూపంలో ,

మధురాతి మధురమైన తెలుగు భాషలో వర్ణించారు.


శ్రీమద్భాగవతం లోని పుణ్యప్రదమైన ఆ గద్య భాగమును,తాత్పర్య సహితంగా పఠించి తరిద్దాం.


1. "ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును/

(తన తమ్ముడు హిరణ్యాక్షుని చంపాడనే ఉద్దేశ్యంతో శ్రీమహావిష్ణువుతో వైరంపెట్టుకున్న హిరణ్యకశిపునకు)


 2.వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును/

(ఆ శత్రుత్వంవల్ల, మనస్సులో క్రోధాగ్ని జ్వాలలు చెలరేగినవి)


3.రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును/

(ఆ క్రోధాగ్నిజ్వాలలు అతనిలోని విజ్ఞానాన్ని, వినయాన్ని కాల్చివేశాయి)


4.వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును/

(అతని హృదయం అహంకారంతో కూడి, తన శక్తియందున్న నమ్మకంతోను, ధైర్యముతోను, గాంభీర్యముతోను,చలించసాగింది)


 5.హృదయ చాంచల్యమాన తామసుండును/

(ఆ హృదయ చాంచల్యము వల్ల అతనిలో తామస గుణం విజృంభించింది).


6.తామస గుణ చంక్రమ్యమాణ స్థైర్యుండును నయి/

(ఆ తామస గుణంవల్ల అతని మానస స్థైర్యం కూడా విజృంభించి చిందులు త్రొక్క సాగింది)


7.విస్రంభంబున హుంకరించి/

(పట్టరాని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించాడు)


8.బాలుని ధిక్కరించి/

(ధిక్కారపూర్వకంగా ప్రహ్లాదునితో )


 9.హరి నిందు జూపుమని/

(ఓరీ!హరిని ఈ స్థంభంలో చూపించు, అని)


 10.కనత్కనక మణిమయ కంకణ క్రేంకార శబ్దపూర్వకంబుగా/

(తన చేతికున్న మణిమయములైన బంగారు కంకణాలు గణ గణ ధ్వనులు చేస్తుండగా)


11.దిగ్ధంతి దంత భేదన పాటవ ప్రసస్తం బగు హస్తంబున/

(దిగ్గజముల దంతములను విరిచివేశే సామర్ధ్యం గల తన హస్తముతో)


12.సభామండప స్థంభంబు వ్రేసిన/

(సభా మంటపం లోని ఒక స్తంభాన్ని పగలగొట్టాడు)


 13.వ్రేటు తోడన/

(అతని అరచేతి దెబ్బ తగలగానే)


 14. దశ దిశలును మిణుగురులు సెదర,జిటిలి,పెటిలి పడి/

(పది దిక్కులా, విష్ఫులింగాలను విరాజిమ్ముతూ, ఆ మహా స్థంభం చిట్లి ఫెళ్ళున విరిగిపోయింది)


15. బంభాజ్యమానం బగు న మ్మహాస్తంభంబు వలన/

(ఆ విధంగా భయంకర శబ్దములు చేస్తూ విరిగిన ఆ మహా స్థంభం నుండి),


16. ప్రళయ వేళా సంభూత సప్త స్కంధ బంధుర సమీరణ సంఘటిత జోఘుష్యమాణ మహా వలాహక వర్గ నిర్గత నిబిడ నిష్టుర దుస్సహ నిర్ఘాత సంఘ నిర్ఘోష నికాశంబులైన ఛట చ్ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావ పుంజంబులు జంజన్యమానంబు లయి యెగసి యాకాశ కుహరాన్తరాళంబు నిరవకాశంబు సేసి నిండినం/

(ప్రళయకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే, సప్త మహా వాయువులచేత కొట్టబడిన, భీకర కాలమేఘములు పిడుగులను వర్షిస్తాయి. స్థంభం పగులుతున్నప్పుడు ఆ ఉరుములు చేసే ధ్వనులవంటి "ఛట ఛట ఫట ఫట" ధ్వనులు, ఆకాశానికి ఎగసినవి.కర్ణకఠోరమైన ఆ శబ్దాలతో ఆకాశమంతా, ఏమాత్రమూ ఖాళీ లేకుండా నిండిపోయింది).


17. బట్టు చాలక, దోధూయమాన హృదయంబులై పరవశంబులైన పితామహ మహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతు జాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి, పరిస్ఫోటితంబుగా/

(ఆ భయంకర శబ్దం వల్ల,బ్రహ్మ, మహేంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని, మున్నగు దేవతలంతా, వారు కూర్చున్న స్థానాలలో పట్టు లేనివారై, తేలిపోతున్నట్లుగా అయినారు.

భయంతో వారిగుండెలు అవిసి పోయాయి.

వారితోనూ,చరాచర జంతుజాలముతోను,నిండిన బ్రహ్మాండమనే భాండం ఆ ధ్వనికి పగిలి పోయినట్లు అయినది.

స్తంభం ఛిన్నాభిన్నమైంది. 

అప్పుడు ఆ స్తంభంలో నుండి శ్రీ నరసింహదేవుడు అవిర్భవించాడు).


 18. బ్రఫుల్ల పద్మ యుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును/

(ఆ నరసింహ స్వామి యొక్క దివ్య పాదతలములు చక్రము, బాణము, నాగలి, వజ్రాయుధము, అంకుశము, మత్స్యము మొదలైన శుభరేఖలతో ప్రకాశిస్తున్నవి) ,


 19.చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరా భార ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును/

(ఉగ్రరూపంతో ఉన్న ఆ స్వామి నడుస్తుంటే,ఆ పాదముల భారమునకు, భూమిని మోసే అష్ట దిగ్గజములు,ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు, అణిగి మణిగి పోతున్నారు) ,


20. దుగ్ద జలధి జాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును/

(ఆయన ఊరువులు, క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం యొక్క తొండం లాగా బలిసి,ఉన్నాయి) ,


21.ఘణ, ఘణాయమాన మణికింకిణీగణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర శోభిత కటి ప్రదేశుండును/

(పచ్చని పట్టు వస్త్రము ధరించిన ఆ స్వామియొక్క కటి ప్రదేశము మణులు చెక్కిన ఒడ్డాణముతో కూడినదై,ఆ వడ్డాణమునకు కూర్చిన మువ్వల ఘణ ఘణ శబ్దములతో శోభిల్లుతున్నది) ,


22. నిర్జర నిమ్నగా వర్త వర్తుల కమలాకర గంభీర నాభి వివరుండును/

(ఆకాశగంగ యందు సుడులు తిరుగుతున్న సరస్సు లాగా ఆ స్వామి నాభి ప్రదేశం గంభీరంగా ఉన్నది) ,


23. ముష్టి పరిమేయ వినుత తనుతర స్నిగ్ధ మధ్యుండును/

(ఆ నరసింహుని నడుము పిడికిటిలో ఇమిడేటంత సన్నగా ఉండి నిగ నిగ లాడుతోంది) ,


24. కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును/

(ఆయన వక్షస్థలం కులపర్వతముయొక్క చరియ వలె, కఠినముగాను,విశాలముగాను,ప్రకాశిస్తున్నది) ,


25. దుర్జన దనుజభట ధైర్యలతికా లవిత్రయామాన/

(రాక్షస సేనల ధైర్యమనే లతలను త్రెంపే కొడవళ్ల వలెను),


26. రక్షో రాజ వక్షో భాగ విశంకట క్షేత్ర విలేఖన చుంచులాంగాలాయమాన/

(రాక్షస రాజైన హిరణ్యకశిపుని యొక్క బండబారిన వక్షస్థలమనే క్షేత్రాన్ని దున్నే నాగళ్ల వంటివి) ,


27.ప్రతాప జ్వలన జ్వాలాయమాన/

(ప్రతాపంతో మంటలు మండుతున్న నెగళ్ళ లాగా ఉన్నవి) ,


28.శరణాగత నయన చకోర చంద్ర రేఖాయమాణ/

(శరణాగతి పొందిన భక్తుల నేత్రములనే చకోరపక్షులకు ఆహ్లాదం కలిగించే చంద్రకాంతిలాగా అందమైనవి) ,


29. వజ్రాయుధ ప్రతిమాన భాసమాన/

(కఠినమైన వజ్రాయుధముల వలె ప్రకాశిస్తున్నవి) ,


30.నిశాత ఖరతర ముఖ నఖరుండును/

(వాడితేలి,వంకరలు తిరిగి తీక్షణముగా ఉన్న గోళ్ళతో శోభిల్లుచున్న వాడును) ,


31.శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత,తోమర, ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగ సన్నిభ వీరసాగర వేలాయమాన,మాలికా విరాజమాన, నిరర్గళానేక శత భుజార్గళుండును/

(మహోన్నత పర్వత శిఖరములవంటి నరసింహస్వామి బాహువులు, శంఖ, చక్ర, గదా, ఖడ్గ, కుంత, తోమరములాదిగా వివిధ ఆయుధములను ధరించి ఉన్నవి.

అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్న అసంఖ్యాకములైన ఆ బాహువులు వీర రసం అనే సాగరానికి చెలియలి కట్టలవలె ఉన్నవి) ,


32. మంజు మంజీర మణిపుంజ రంజిత మంజుల హార కేయూర కంకణ కిరీట మకర కుండలాది భూషణ భూషితుండును/

(మణి ఖచితములై మనోహరంగా ప్రకాశిస్తున్న కాలి కడియములు, హారములు, కేయూరములు,కంకణములు, కిరీటము, మకర కుండలములు మొదలైన, 

కాంతులు విరజిమ్ముచున్న భూషణములతో,

 స్వామి ధగ ధగా వెలిగి పోతున్నాడు) ,


33. త్రివళీయుత శిఖరి శిఖరాభ పరిణద్ధ బంధుర కంధరుండును/

(ఆ ప్రభువు కంఠం మూడు రేఖలతో కూడి, పర్వత శిఖరంలాగా దృఢంగా ఉన్నది) ,


34. ప్రకంపన కంపిత పారిజాత పాద పల్లవ ప్రతీకాశ కోపావేశ సంచలితాధరుండును/

(గాలికి చలిస్తున్న పారిజాతవృక్షము యొక్క చిగురుటాకులాగా,నరసింహస్వామి పెదవులు కోపంతో కదలుచున్నవి) ,


35. శరత్కాల మేఘజాల మధ్య ధగద్ధగాయమాన,తటిల్లతా సమాన దేదీప్యమాన,

దంష్ట్రాంకురుండును/

(శరత్కాలంలో మేఘముల మధ్య మెరిసే విద్యుల్లతలలాగా స్వామి కోరలు ధగధగలాడుతున్నాయి) ,


36. కల్పాంతకాల సకల భువన గ్రసన విలసన విజృంభమాణ,సప్తజిహ్వ జిహ్వా తులిత, తరళ తరాయమాన,విబ్రాజమాన జిహ్వుండును/

(ప్రళయకాలంలో లోకముల నన్నింటినీ దహించడానికి విజృంభిస్తున్న కాలాగ్నిజ్వాలలాగా ఆ స్వామి జిహ్వ ఎఱ్ఱగా భయంకరంగా ప్రకాశిస్తున్నది) ,



37. మేరు మందర మహా గుహాంతరాళ విస్తార విపుల వక్త్ర నాసికా వివరుండును/

(ఆ నరసింహుని నోరు, నాసికా రంధ్రములు, మేరు, మందర పర్వతముల గుహలలాగా విస్తారంగా ఉన్నవి) ,


38. నాసికా వివర నిస్సర న్నిబిడ నిశ్శ్వాస నికర సంఘట్టన సంక్షోభిత సంతప్యమాన సప్తసాగరుండును/

(ఆ నాసికా రంధ్రములనుండి వస్తున్న వేడి వేడి నిశ్శ్వాసలతో సప్తసాగరాలు అల్లకల్లోలమై, సాగర జలాలు సల సల కాగుతున్నవి) ,


39. పూర్వ పర్వత విద్యోతమాన ఖద్యోత మండల సదృక్ష సమంచిత లోచనుండును/

(ఉదయాచలముపై ప్రకాశిస్తున్న సూర్య మండల కాంతుల లాగా స్వామివారి నేత్రములు ప్రకాశిస్తున్నాయి) ,


40. లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కీలాభీల విస్ఫులింగ వితాన రోరుధ్యమాన తారకా గ్రహ మండలుండును/

(సూర్యమండల కాంతితో తేజరిల్లుచున్న స్వామి నేత్రములయొక్క, క్రీగంటి చూపులనుండి బయల్వెడలిన, విష్ఫులింగ సమూహములు,తమ తమ సంచారంతో ప్రాణుల భవిష్యత్తును నిర్ణయించే నక్షత్ర, గ్రహ, మండల సంచారాన్ని అడ్డగిస్తున్నాయి ) ,


 41. శక్ర చాప సురుచిరోదగ్ర మహా భ్రూలతాబంధ బంధుర భయంకర వదనుండును/

(స్వామియొక్క కనుబొమలు, ఇంద్రధనస్సు లాగా వంగి, క్రోధముతో ముడిపడి ఉండటం వల్ల ముఖం భయంకరంగా ఉన్నది) ,


42.ఘనతర గండ శైల తుల్య కమనీయ గండ భాగుండును/

(గండ శిలల లాగా కఠినమైన స్వామి కపోలములు చూచుటకు కమనీయముగా ఉన్నవి) ,


43. సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహా భ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును/

(సంధ్యా సమయంలో ఎర్రబారిన మేఘ మాలికల లాగా ఎఱ్ఱగా మెరుస్తూ, మబ్బుల నొరయుచున్న స్ఫుటమైన జూలుతో స్వామి విరాజిల్లుతున్నాడు ) ,


44. సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును/

(జూలు విదల్చడం వల్ల పుట్టిన వాయువు, తీవ్ర వేగంతో, ఆకాశంలో సంచరిస్తున్న దేవతల విమానాలను, వైమానికులతో సహా ఊగిపోయేటట్లు చేస్తోంది) ,



45. నిష్కంపిత శంఖ వర్ణ మహోర్ద్వకర్ణుండును/

( స్వామి కర్ణములు ఊర్ధ్వముఖంగా నిక్కబొడుచుకుని, చలనం లేకుండా పెద్ద శంఖముల వలె తెల్లగా ప్రకాశిస్తున్నవి) ,


46. మంథదండాయమాన మందర వసుంధరాధర పరిభ్రమణ వేగ సముత్పద్యమాన,

వియన్మండల మండిత సుధారాశి కల్లోల శీకరాకార భాసుర కేసరుండును /

(దేవ దానవులు,మందరపర్వతాన్ని కవ్వంగా చేసి, క్షీరసముద్రమును మధిస్తున్నప్పుడు, అతి వేగంగా తిరుగుతున్న ఆ పర్వతము యొక్క వేగానికి ఆకాశమంతా వ్యాపించిన పాల సముద్ర తరంగముల తుంపురుల వలె స్వామి కేసరములు అందముగా భాసిస్తున్నవి) ,


47. పర్వాఖర్వ శిశిర కిరణ మయూఖ గౌర తనూరుహుండును /

(ఆ స్వామి శరీరం మీది రొమరాజి పూర్ణిమనాటి చంద్రుని వెన్నెల కిరణముల వలె ఆహ్లాదకరంగా ఉన్నది) ,



48. నిజ గర్జా నినాద నిర్దళిత కుముద, సుప్రతీక, వామ,నైరావత, సార్వభౌమ, ప్రముఖ ధిగిభరాజ కర్ణ కోటరుండును/

(ఆ నృసింహుని భయంకరమైన సింహగర్జనకు, కుముద, సుప్రతీక, వామన, ఐరావత, సార్వభౌమాది, ప్రముఖ దిగ్గజముల కర్ణములు పగిలిపోతున్నవి) ,


49. ధవళ ధరాధర దీర్ఘదురవలోకనీయ దేహుండును/

(ఆ దేవుని తెల్లని దేహము ఎత్తైన వెండి కొండ అయిన కైలాసపర్వతమువలె, విశేష కాంతితో వెలిగిపోతూ, ఎవరికీ తేరిపార చూడడానికి శక్యం కాకుండా ఉన్నది) ,



50. దేహ ప్రభాపటల నిర్మథ్యమాన పరిపంథి యాతుధాన నికురుంబ గర్వాంధకారుండును/

(తామస గుణోపేతులైన శత్రు రాక్షససమూహముల "గర్వము" అనే అంధకారాన్ని రూపుమాపు తున్నవా అన్నట్లు స్వామివారి శరీరకాంతులు ధగ ధగలాడుతున్నవి) ,


51. ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును/

(ఆ నరసింహ స్వామి "అంతరంగం" భక్తుడైన ప్రహ్లాదునకు సంతోషం కలిగిస్తూ, కరుణా రసముతోను," "బహిరంగము" అనగా ఆకారము, తనయందు శతృభావంతో ఉన్న హిరణ్యకశిపునకు, సంతాపం కలగజేస్తూ, "వీర రసము" తోను విలసిల్లుతున్నవి) ,


52. మహా ప్రభావుండును నయిన శ్రీ నృసింహదేవుం డావిర్భవించినన్/  

(మహాప్రభావసంపన్నుడైన శ్రీ నృసింహస్వామి సభలోని స్తంభంనుండి ఆవిధంగా ఆవిర్భవించగా!) ,


53. గనుంగొని, 

(ఆ ఆవిర్భావం చూచి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయి ఇలా అనుకుంటున్నాడు).



క. నరమూర్తి గాదు,కేవల, హరిమూర్తియు గాదు మానవాకారము గే/

సరి యాకారము నున్నది, హరి మాయా రచితమగు యథార్థము చూడన్//

(ఇది పూర్తిగా నరరూపమూకాదు, పూర్తిగా సింహరూపమూ కాదు.

సరిగా పరిశీలించి చూస్తే, ఇది నరుడు,సింహము కలిసి ఏర్పడిన శ్రీ హరి యొక్క మాయారూపము).


                ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

                   

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

30-4-'26






.

నిత్యమూ సుప్రభాతం

 *నిత్యమూ సుప్రభాతం వినడం వలన కలిగే ప్రయోజనాలు* 

సుప్రభాతం వినడం లేదా పఠించడం వల్ల కలిగే ఉపయోగాలు ఆధ్యాత్మికంగా, మానసికంగా మరియు ఆరోగ్యపరంగా చాలా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, విశ్వామిత్ర మహర్షిచే రచింపబడినది, ఉదయాన్నే నిద్రలేవగానే వింటే ఎంతో ప్రశాంతత కలుగుతుంది.

 *సుప్రభాతం వలన కలిగే ప్రధాన ఉపయోగాలు:* 

 *1. మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత:* 

 *నిశ్శబ్ద వాతావరణం:* ఉదయమే సుప్రభాతం వినడం వల్ల మనస్సు ప్రశాంతంగా, ప్రశాంతమైన వాతావరణంలో దైవచింతన పెరుగుతుంది.

 *ఏకాగ్రత:* ఇది రోజు మొత్తానికి అవసరమైన ఏకాగ్రతను, మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది. 

 *2. దైవ అనుగ్రహం మరియు భక్తి:* 

 *మేలుకొలుపు:* ఇది కేవలం భగవంతుణ్ణి నిద్రలేపడం మాత్రమే కాదు, మనలోని ఆత్మను మేల్కొల్పి, దైవ సేవకు సిద్ధం చేయడం.

 *నిత్య పారాయణం:* ప్రతిరోజూ సుప్రభాతం పఠించడం వల్ల జ్ఞానోదయం, దైవానుగ్రహం కలుగుతుంది. 

 *3. ఆరోగ్య మరియు సానుకూలత:* 

 *సానుకూల శక్తి:* ఉదయాన్నే పవిత్రమైన మంత్రాలు,శ్లోకాలు మరియు భక్తి గీతాలు వినడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి (Positive Energy) పెరుగుతుంది.

 *నిద్రలేపుట:* అకస్మాత్తుగా అలారం మోతకు నిద్రలేవడం కంటే, సుప్రభాతంతో నిద్రలేవడం ఆరోగ్యకరమైన పద్ధతి. 

 *4. ఆధ్యాత్మిక ప్రయోజనాలు:* 

పాప నివారణ: భగవంతుని నామస్మరణ వల్ల పాపాలు తొలగిపోతాయని, మంగళం కలుగుతుంది.

 *జ్ఞానాభివృద్ధి:* సుప్రభాతంలోని శ్లోకాలు భగవంతుని లీలలను వివరిస్తూ, భక్తులలో జ్ఞానాన్ని పెంచుతాయి. 

 *5. సంప్రదాయం మరియు సంస్కృతి:* 

 *దినచర్య:* మన పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం, ఇది మన దినచర్యను సక్రమంగా, భక్తితో ప్రారంభించడానికి సహాయపడుతుంది. 

పంచాంగం 01.05.2026

 ఈ రోజు పంచాంగం 01.05.2026 Friday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి భృగు వాసర స్వాతి నక్షత్రం సిద్ద యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: పౌర్ణమి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 98*


*అంతరపి బహిరపి త్వం జంతుతతేరంతకాంతకృదహంతే।*

*చింతితసంతానవతాం సంతతమపి తంతనీషి మహిమానమ్॥*


*భావము :*


*సమస్త జీవుల అంతరాళములలోనూ, బహిరంతరములో నీవే కొలువై ఉన్నావు. నిరంతరము, నీ ధ్యానమగ్నులైన సాధకులను అత్యంత జ్ఞానవంతులుగా, నీ స్వరూపులుగా అనుగ్రహిస్తున్నావు.*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏