29, జూన్ 2026, సోమవారం

యోగవాసిష్ఠ రత్నాకరము*

  0026 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము


ఒకటవ అధ్యాయము 


రాఘవ వైరాగ్య వర్ణనము


పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,


శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన అవధూత సూర్య నారాయణ స్వామి మఠం 


1-68


దహనైకార్థ యోగ్యాని కాయకాష్ఠాని భూరిశః సంసారాబ్దా విహోహ్యాన్తే కించిత్తేషు నరం విదుః. 


కేవలము దహనము కొఱకు యోగ్యము లైనట్టి శరీరములను కట్టెలనేకము లీ సంసారమను సముద్రమున కొట్టుకొని పోవుచున్నవి. అందొకానొక కట్టె మనుజుడని చెప్పబడుచున్నది.


1-69


బద్దాస్థా యే శరీరేషు బద్దాస్థా యే జగత్థ్సితౌ 

తన్మోహమదిరోన్మత్తాన్‌ ధిగ్‌ధిగస్తు పునః పునః. 


ఎవరు శరీరములందును, 

జగత్స్థితి

యందును అవి సత్యములని, చిరకాల ముండునవి యని విశ్వాసము గలిగియుందురో, అజ్ఞానమను కల్లుత్రాగి ఉన్మత్తులైయున్నట్టి జనులకు మరల మరల ధిక్కారమగు గాక! 


1-70


నాహం దేహస్య నో దేహో మమనాఽయమహం తథా 

ఇతి విశ్రాన్తచిత్తా యే తే మునే పురుషోత్తమాః. 


ఓ మునీంద్రా! 'జడమగు ఈ దేహము నేను కాను, నేను దానికి సంబంధించినవాడను కాను, నాకు దేహము లేదు' అని విచారించి ఆత్మయందు విశ్రాంతి నొందువారే మనుజులలో నుత్తములు.

రావణుడిని సంహరించావా?"

 శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ఆయన తల్లి కౌసల్య అడిగింది:

"రామా నువ్వే రావణుడిని సంహరించావా?"

శ్రీరాముడు చెప్పాడు "అమ్మా... రావణుడు అసాధారణ పండితుడు,మహా పరాక్రమశాలి, శివభక్తుడు, అతడు శివతాండవ స్తోత్రం రచించిన గొప్ప భక్తుడు. అతన్ని జయించింది నా బలం కాదు... అతని అహంకారమే అతన్ని ఓడించింది."

ఈ కథ మనకు చెప్పే సత్యం:ఎంత జ్ఞానం, శక్తి, ప్రతిభ ఉన్నా అహంకారం పెరిగితే అవన్నీ వృథా అవుతాయి. వినయం ఉన్నవారే నిజమైన విజేతలు.అహంకారం నాశనానికి దారి...వినయం విజయానికి పునాది.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 23*


*యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే*

*యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిమ్ ।*

*యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం*

*మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ॥*


*భావము :*


*జగన్మాతా! ఎర్రని సంధ్యాప్రకాశము, నీ పాదములవంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నీ నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటుంది. లేలేత చిగురుటాకులు, నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 23*


*యయోః సాంధ్యం రోచిః సతతమరుణిమ్నే స్పృహయతే*

*యయోశ్చాంద్రీ కాంతిః పరిపతతి దృష్ట్వా నఖరుచిమ్ ।*

*యయోః పాకోద్రేకం పిపఠిషతి భక్త్యా కిసలయం*

*మ్రదిమ్నః కామాక్ష్యా మనసి చరణౌ తౌ తనుమహే ॥*


*భావము :*


*జగన్మాతా! ఎర్రని సంధ్యాప్రకాశము, నీ పాదములవంటి ఎరుపు రంగును వాంఛిస్తుంది. వెన్నెల అంటావా, నీ నఖముల తెల్లని కాంతిని పొందాలనుకుంటుంది. లేలేత చిగురుటాకులు, నీ పాదములంత మృదువుగా ఉండాలనుకుంటాయి. అటువంటి పాదాలను నిత్యం స్మరిస్తాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

నాదత్తే కస్యచిత్పాపం న చైవ సుకృతం విభుః ।

అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః ।। 15 ।।




ప్రతిపదార్థ:



న, ఆదత్తే — స్వీకరించడు; కస్యచిత్ — ఏ ఒక్కని యొక్క; పాపం — పాపము; న — కాదు; చ — మరియు; ఏవ — తప్పకుండా; సు-కృతం — పుణ్య కర్మలను; విభుః — సర్వవ్యాపియైన భగవంతుడు; అజ్ఞానేన — అజ్ఞానముచే; ఆవృతం — ఆవరింపబడి; జ్ఞానం — వివేకము/జ్ఞానము; తేన — దానిచే; ముహ్యంతి — మోహితులై భ్రమకు లోనగుచున్నారు; జంతవః — జీవులు.



 

తాత్పర్యము : 


సర్వాంతర్యామియైన భగవంతుడు, ఏ ఒక్కని పాపపు లేదా పుణ్యకర్మల యందు కూడా పాలు పంచుకోడు. జీవుల వివేకము అజ్ఞానముచే కప్పబడిపోవటం వలన వారు భ్రమకు లోనగుతున్నారు.



వివరణ:


భగవంతుడు ఏ ఒక్కని పుణ్య, పాప పనులకు భాధ్యుడు కాడు. ఈ విషయంలో భగవానుని యొక్క పని మూడు అంచెలుగా ఉంటుంది: 1) ఆయన జీవాత్మకు కర్మలు చేసే శక్తి ఇస్తాడు 2) మనకు ఇవ్వబడిన శక్తితో, మనం పనులు చేయగానే మనం చేసినదాన్ని నోట్ చేసుకుంటాడు. 3) మనం చేసిన పనుల కర్మఫలములను అందజేస్తాడు.


ప్రతి జీవాత్మకు తన స్వంత నిర్ణయం ద్వారా మంచి లేదా చెడు పనులు చేయటానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ స్వతంత్రచిత్తమే సృష్టి కేళికి మూలాధారము మరియు ఎన్నో జీవాత్మల మధ్య ఉన్న వైవిధ్యానికి మూల కారణం. ఒక క్రికెట్ మ్యాచ్ లో అంపైర్‌లా ఉంటుంది భగవంతుని పని. ఫలితములను ఇస్తూనే ఉంటాడు, ‘నాలుగు పరుగులు!’, ‘ఆరు పరుగులు!’, ‘అతను ఔట్!’ అలా. నిర్ణయాలకు అంపైర్‌ని దోషుడిగా చేయలేము, ఎందుకంటే అవి ఆటగాడి ఆట తీరుని బట్టి ఉంటాయి.


భగవంతుడు, జీవులకు స్వతంత్ర-చిత్తమును (free-will) ఎందుకు ఇచ్చాడు అన్న సందేహము రావచ్చు. ఇది ఎందుకంటే, భగవంతుడు అభిజ్ఞ స్వరాట్ (సర్వ స్వతంత్రుడు), కాబట్టి జీవాత్మ కూడా, తన ఇంద్రియమనోబుద్ధులను తన ఇష్టానుకూలంగా ఉపయోగించుకోవటంలో అణుమాత్ర స్వతంత్రత కలిగి ఉంటుంది.


అంతేకాక, స్వతంత్ర చిత్తము లేకుండా ప్రేమ ఉండదు. ఒక యంత్రము ప్రేమించలేదు ఎందుకంటే దానికి నిర్ణయించుకునే స్వతంత్రత ఉండదు. స్వతంత్రంగా నిర్ణయించుకునే వ్యక్తిత్వానికే ప్రేమించగలిగే అవకాశం ఉంటుంది. ఆయనను మనం ప్రేమించాలానే ఉద్దేశంతోనే మనలను ఆ భగవంతుడు సృష్టించాడు కాబట్టి మనకు స్వతంత్ర చిత్తమును ప్రసాదించాడు. మన స్వతంత్ర చిత్తమును వాడుకోవటం వలన మంచి లేదా చెడు కర్మలు చేయబడుతాయి, అంతేకాని ఎప్పుడూ కూడా భగవంతుడిని తప్పు పట్టరాదు.


అజ్ఞానంతో కొందరు జీవులు, వారికి తమ కార్యకలాపములు చేసుకునే స్వేచ్ఛ తమకు ఉందని తెలుసుకోక, తమ తప్పులకు భగవంతుడిని బాధ్యుడిని చేస్తారు. మరికొందరు, స్వేచ్ఛాచిత్తము ఉందని తెలుసుకుంటారు, కానీ, శారీరక అహంకారం లో కర్తృత్వభావన కలిగి ఉంటారు (చేసేది నేనే అన్న భావన). ఇది కూడా అజ్ఞానానికి చిహ్నమే. ఈ అజ్ఞానాన్ని ఎట్లా నిర్మూలించుకోవాలో తదుపరి శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు.

పంచాంగం 29.06.2026 Monday,

ఈ రోజు పంచాంగం 29.06.2026  Monday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస శుక్ల పక్ష పౌర్ణమి తిథి ఇందు వాసర మూల నక్షత్రం శుక్ల యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: పౌర్ణమి 


 

నమస్కారః , శుభోదయం

28, జూన్ 2026, ఆదివారం

నేనే శివుడిని CB

 

 నేనే శివుడిని  

ప్రతి సాధకుడు ఒక్క విషయన్ని తెలుసుకోవాలి సృష్టి మొత్తం ఈశ్వరుడిదే అయి వున్నదిఅటువంటప్పుడు సృష్టిలో ఈశ్వరుడు కానిది, ఈశ్వరుడికన్నా బిన్నంగా వున్నది ఏది లేదు. అటువంటప్పుడు జగత్తులో భక్తుడు, భగవంతుడు అని రెండు లేవు. వున్నది ఒక్కటే ఒక్కటి పరమేశ్వరుడే అయి వున్నాడు సత్యమే మనకు పరి పరి విధాలుగా అనేక పరియాయలు మన మహర్షులు బోధిస్తూ వున్నారుకానీ దేహ వ్యామోహంతో వున్న మనం  నేను దేహాన్ని అని నేను భగవంతుని ఆరాధిస్తూ వున్నానని, దేముడిని మా తోటలోని మల్లెపూలతో, చామంతి పూలతో మందార పూలతో పూజిస్తూ వున్నానని అర్చిస్తూ వున్నానని, అలంకరిస్తూ వున్నానని గర్వంగా చెప్పుకుంటూ ఉండటం సహజం. నిజానికి నాకు తోట ఉన్నదా? తోటలో పూలు పుస్తున్నవి అవి నాకు చెందినవా పుల మీద నాకు అధికారం వున్నది అని ప్రతి సాధకుడు ఆలోచించాలి

సాధకుడు ఒక్క విషయం ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకోవాలి అదేమిటంటే తానూ ధరించిన తన శరీరం తనది కాదని అది కేవలం తన తల్లిదండ్రుల వలన భౌతిక ప్రపంచములో తయారయినదనిదానికి బిన్నంగా దానిని ఆసరాగా చేసుకొని తాను వున్నానని తెలుసుకోవాలి సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడే సాధకునికి అర్ధం అవుతుందితన శరీరమే తనది కానప్పుడు శరీరానికి సంబందించిన బంధాలు కూడా తనవి కావు అని తెలుసు కుంటాడుఅటువంటప్పుడు ఇక ఆస్తి పాస్తులు తనవి యెట్లా   అవుతాయి.తాను నాటిన చెట్లను మొలకెత్తించి పురుషుపించే టట్లు చేసింది ఎవరు ఈశ్వరుడు తప్ప ఇంకెవరు. పద్మ పురాణంలోని శ్లోకాన్ని ఒకసారి చూడండి.

ఋణానుబంధ రూపేణ! పశు పత్నీ సుతాలయాః!
ఋణక్షయే క్షయం యాంతి! కా తత్ర పరిదేవనా!!

దేహాన్ని ఆశ్రయించి వున్న జీవునికి జన్మ జన్మల కర్మ ఫలితంగా ఏర్పడిన రుణముల కారణంగా మాత్రమే పశు , పత్ని, సుతుడు, గృహాలు ఇంకా ఇతర ఆస్తి పాస్తులు కలుగుతున్నాయిఎప్పుడైతే ఋణం క్షీణిస్తుందో అప్పుడు అవి బందంనుంచి తొలగుతాయి.  

ఒక నది ప్రవాహంలో రెండు తుంగాలు కొట్టుకొని వస్తున్నాయటఅవి ప్రవాహంలో కలుసుకున్నాయటఆలా ఒక దానితో ఒకటి కలిసి కొంత దూరం ప్రయాణం చేసి తరువాత వీటి దోవన అవి విడిపోయి వెళ్లిపోయాయట ప్రపంచంలో దేహంతో ఏర్పడే బంధాలు కూడా అటువంటివేవాటినే శాశ్వితం అని సామాన్యులు భావిస్తారుకానీ సాధకులు నగ్న సత్యాన్ని తెలుసుకొని జాగరూకులై నిత్యం, సత్యం, అనంతము అయినటువంటి ఈశ్వరునితో మాత్రమే సంబంధం పెట్టుకొని అనుక్షణం ఈశ్వరునితో లయం అయి బ్రహ్మనందాన్ని పొందుతూ వుంటూ దేహం కేవలం తనకు ఆశ్రయాన్ని ఇచ్చిన ఒక ఉపకరణం లాగ మాత్రమే తలుస్తూ జీవితాన్ని గడుపుతారునీవు కొంత దూరం వెళ్ళాలి దానికోసం ఒక కారుని ఏర్పాటు చేసుకొని ప్రయాణిస్తావు అనుకోనీ గమ్యాన్ని చేరుకున్న తరువాత నీవు కారు దిగి నీ పనిమీద వెళతావుఅదేవిధంగా కారు లాంటిదే రోజు నీవు ధరించిన శరీరం సత్యాన్ని కేవలం సాధకులు మాత్రమే తెలుసుకోగలుగుతారుసామాన్యులు శరీరమే తాను అని భావన చేస్తూ అరిషడ్వార్గాలతో అనుబంధాన్ని పెంచుకొని వాటి సాధనే జీవిత లక్ష్యం అనుకోని చెతుర్విధ పురుషార్ధాలలో మధ్య రెండు పురుషార్ధలైన అర్ధ కామదులే పరమావధిగా భావించి మొదటిది, చివరిది ఐన ధర్మాన్ని, మోక్షాన్ని విస్మరించి జీవనం సాగించి అనేక పాప కృత్యాలు చేస్తూ భవిష్యత్తులో నీచ జీవులుగా జన్మలను పొంది జరామరణ చక్రంలో పరిభ్రమిస్తూ వుంటారు

సాధకులు మాత్రము ధర్మాచరణపరులై జీవనం కొనసాగిస్తూ, జీవిత పరమ లక్ష్యం చతుర్ధ పురుషార్థం మాత్రమే అని నమ్మి దాని సాధనకొరకు నిరంతరం అనన్య సామాన్య కృషి చేస్తూ ఒక సద్గురువుని శరణు చొచ్చి మోక్ష పదాన్ని చేరుకోవటానికి ప్రయత్నిస్తారు

ఈశావాస్యమిదం సర్వం, యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుంజీథాః, మా గృధ: కస్య స్విద్ధనం , 1  

జగత్తులో ప్రతి ఆణువణువూ లోపల బైట కేవలం ఈశ్వరునిచే వ్యాపించి వున్నది. కాబట్టి ఇక్కడ నాది అనేది ఏది కూడా లేదు ప్రతిదీ ఈశ్వరునిది మాత్రమే  త్యాగ బుద్దితో ఈశ్వరునిది నీవు అనుభవిస్తున్నట్లుగా భావించి జీవనం గడపవలెను

మొట్ట మొదటి ఉపనిషత్తుగా భాసిల్లిన ఈశావాసోపనిషత్తు శుక్ల యజుర్వేదంలోనిది. ఒక సాధకుడు తరించటానికి వేరే గ్రంధాలు చదవనవసరం లేదు. కేవలం అంటే కేవలం  ఈశావాసోపనిషత్తులోని మొదటి మంత్రాన్ని చదివి అర్ధం చేసుకొని ఆకళింపు చేసుకొని తన జీవితానికి అనుసంధానము చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే సాధకుడు నిత్ర్య ముక్తుడే

రుద్రుడు అంటే దుఃఖంని హరించే వాడు అని అర్ధంఅంటే ఆనంద స్వరూపుడు అని తెలుసుకోవాలి. సాధకుడు రుద్రుడిని పూజించాలంటే ముందుగా తాను రుద్రుడిగా మారాలి

నారుద్రో రుద్రమర్చయేత్ అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము

మరి ఒక సామాన్యుడు రుద్రునిగా ఎలా అవుతాడు అంటే దానికి ఒక ప్రక్రియను మన మహర్షులు తెలిపారుఅదే  అంగన్యాస,కరన్యాసాలు. భక్తుడు తన శరీరంలోని ప్రతి అంగాన్ని పవిత్ర మైనటువంటి మంత్రాలతో న్యాసం  అంటే దైవ శక్తిని  స్థాపన చేసి తదుపరి రుద్రుని అర్చించాలని మన మహర్షులు ప్రబోధించారునేటికీ రుద్రార్చన చేసేవారితో పౌరోహితులవారు అంగన్యాస, కరన్యాసాలని చేయించటం మనం గమనిస్తూ వున్నాము. ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి భక్తుడు తప్పకుండా రుద్రుడు కావలసిందేనా అంటే అవును అని సమాధానం

సాధారణ వ్యవహార సరళిలో మనమంతా అనుకుంటాము నేను అపవిత్రంగా వున్నాను అని భావించి శిరస్నానం చేసి దేహాన్ని శుద్ధి చేసుకుంటాముకానీ మన శరీరంలో రక్త మాంసాలు, చీము నెత్తురు, మల మూత్రాదులతో అశుద్ధంగా ఉంటుంది అని సర్వుల భావన అటువంటి దోషం తొలగాలి న్యాసం చేయాలనీ కొందరి అభిమతంఏది ఏమైనా భక్తుడు రుద్రుడు కాకుండా రుద్రర్శన చేయ వీలు లేదనేది యదార్ధం

ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడుఅట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది

 

ఉపనిషత్తు మంత్రార్ధాన్ని కనుక పరిగణలోకి తీసుకొని లోతుగా యోచిస్తే జగత్తు మొత్తం ఈశ్వరుడే అయి వున్నాడుఅట్టి తరి భక్తుడు ఈశ్వరుడి కన్నా బిన్నంగా ఉన్నదా అంటే లేదు అని అర్ధం చేసుకోవాలి. అప్పుడు సదా పరిశుద్ధుడు అయినా ఈశ్వరుని అంశగా భక్తుడు భావిస్తే ఇక అశుద్ది అనేది ఎక్కడ వున్నది. వున్నదంతా ఒక్కటే అయితే పూర్తిగా అది ఈశ్వరుడే అయితే అంటా శుద్ధి అని అర్ధం చేసుకోవాలి. మరి సాధకుడు రుద్రుడే అయి ఉంటాడు. మరి రుద్రుడు యెట్లా అయి ఉంటాడు అనే సందేహం కలుగుతుంది

ప్రతి  సాధకుడు ఒక విషయాన్నీ ఎప్పుడు మననం చేస్తూ ఉండాలి అదేమిటంటే తాను ఈశ్వరుడు అని. ఎలా అంటే తాను  నిత్యం తన ఇంద్రియాలను పూర్తిగా ఈశ్వరుని మీదనే లగ్నం చేసి జీవనం చేస్తూ ఉండాలి.ఇక్కడ ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా వీటిని ఆధీనంలో ఉంచుకున్న మనస్సు వెరసి మొత్తం పదకొండుఅందుకేనేమో మనకు రుద్రులు ఏకాదశ రుద్రులుగా పేర్కొన్నారు. పదకొండు సాధకుడు నిత్యం, అనుక్షణం, నిరంతరమూ తదేకంగా అహర్నిశలు ఈశ్వరునితో అనుసందానం చేసి ఈశ్వరుడు తప్ప మరొక జాస లేకుండా జీవితాన్ని ఎడతెరపి లేకుండా లగ్నాత చేస్తూ ఉంటే అప్పుడు కలిగే స్థితే ఆత్మా సంయమనం స్థితిదానికే సమాధి స్థితి అని తురీయా స్థితి అని మన మహర్షులు నొక్కి  వక్కాణిస్తున్నారు. స్థితిని పొందటం చాలాకష్టతరం,