వచ్చెననుచు బీపి వదల కుండా మాత్ర
వేస్తె లైఫు లాంగు వేదనొచ్చు
చక్కబరచు యోగ చక్కనౌ హోమ్యోతొ
సకురు అప్ప రావు సత్య మిదిర!
భావం: బీపీ హెచ్చుతగ్గులకు గురవ్వటం అనేది అందరి జీవితం లోనూ సహజమైన విషయం. కానీ తరచుగా అధిక రక్తపోటుకు గురౌతూ ఉంటే, అధిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ద్వారా నిరంతర సాధన చెయ్యాలి. అలాగే టీ, కాఫీ, టిఫిన్ లు మానేసి, ఉదయపు ఆహారంగా చద్దన్నం లేదా పెరుగన్నం తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు వరి అన్నం బదులు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తో చద్దన్నం, జావ చేసుకుని, పెరుగు కలిపి తీసుకోవాలి. కారాలూ, పచ్చళ్ళూ, మషాళాలూ తగ్గించుకోవాలి. కిడ్నీలో రక్తాన్ని శుద్ధి చేసే ఫిల్టర్లను 'నెఫ్రాన్లు ' అంటారు. అవి ఒక్కొక్క కిడ్నీలో దాదాపు పది లక్షల వరకూ ఉంటాయి. ఈ ఫిల్టర్ల తలలు టోపీలాగా ఉంటాయి. ఈ తలలపై ఉండే కణాలు "రెనిన్" అనే హార్మోన్ ను ఉత్పత్తి చేసి, రక్తం శుద్ధి అయ్యి, తిరిగి శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఆ మంచి రక్తంలో ఆ హార్మోన్ ను కలిపి పంపుతుంది. ఈ హార్మోన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కిడ్నీలోని ఫిల్టర్లు పాడైన వారికి ఈ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం కూడా అధిక రక్తపోటుకు కారణమౌతుంది. మానసికంగా, శారీరకంగా ఏర్పడిన సమస్యలను చక్కదిద్దడం మానేసి, రోజుకో బీపీ మాత్ర మింగేసి, బీపీ ని కంట్రోల్ లో పెట్టుకుంటూ, సమస్యలను దాచుకోవడం వలన, ఈ పనికిమాలిన టెంపరరీ మాత్రలను అదేపనిగా వాడటం వలన వాటిలోని రసాయనాల దెబ్బకు త్వరలో కిడ్నీలు పాడవ్వడం, గుండెపోటు కు గురవ్వడం, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, సెరిబ్రల్ హేమరేజ్ తో పక్షవాతానికి గురవ్వడం, కంటిలోని రక్తనాళాలు చిట్లి, దృష్టి దెబ్బతినడం, వెర్టిగో సమస్యతో తరచుగా తల విసిరి పడిపోవడం, ఇలా ఎన్నో సమస్యలకు గురౌతారు. బీపీ మాత్రలతో అనేక సంవత్సరాల పాటు బీపీ పేషెంట్ గా బ్రతుకుతూ సర్వ నాశనం అయ్యే బదులు హోమియో మందులు వాడుకుంటే కేవలం కొద్ది రోజులలోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, మీ అవయవాలను సైతం సైడ్ ఎఫెక్ట్స్ బారినుండి కాపాడుకోవచ్చు! ఏ సమస్య వచ్చినా దానికో టాబ్లెట్ వాడుకుంటూ, జీవితకాలం పాటు ఆ పేషెంట్ గా బ్రతకటమే నిజమైన వైద్యమని, అలా చేసేదే సైన్స్ అనీ, దానినే ఫాస్ట్ వైద్యమంటారనీ, ఈ పిచ్చి మెదళ్ళకు పచ్చిగా పట్టేసింది! వీళ్ళని ఈ భ్రమ నుంచి లాగడం భగవంతుని తరం కూడా కాదు!
సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం!
ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870
(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)