3, సెప్టెంబర్ 2026, గురువారం

ఆనెకాయలు , పులిపిరులు

 ఆనెకాయలు , పులిపిరులు , కాలిపగుళ్ళు హరించుటకు సులభ చిట్కాలు -


• ఉత్తరేణి చెట్టు సమూలం తెచ్చి ఎండబెట్టి దానిని భస్మం చేసి దానికి సమానంగా హరిదళం కలిపి నూనెతో నూరి లేపనం చేయుచుండిన యొడల ఆనెకాయలు , కాళ్ళు , చేతులు పగుళ్లు హరించును. కలిపేప్పుడు ఏ నూనెని అయినను వాడవచ్చు.


• దాల్చినచెక్క బూడిద , సున్నం సమానంగా నూనెతో కలిపి నూరి రాయుచుండిన యొడల ఆనెలు , కాళ్లు , చేతులు పగుళ్లు హరించును.


• గుగ్గిలముని వెన్నపూసతో కలిపి మర్దించి లేపనం చేసిన యెడల కాళ్లు , చేతుల పగుళ్లు హరించును.  


    

2, సెప్టెంబర్ 2026, బుధవారం

03సెప్టెంబర్26🌷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   *🌹గురువారం🌹*

*🌷03సెప్టెంబర్26🌷*  

 *దృగ్గణిత పంచాంగం*                      


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : సప్తమి* రా 02.25 వరకు ఉపరి *అష్టమి*

*వారం : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం   : కృత్తిక* రా 12.29 వరకు ఉపరి *రోహిణి*

*యోగం  : వ్యాఘాత* సా 06.33 వరకు ఉపరి *హర్షణ*

*కరణం   : భద్ర* మ 03.27 *బవ* రా 02.25 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ11.00-12.00 సా04.00- 06.00*

 అమృత కాలం  : *రా 10.12 - 11.43*

 అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.31*

*వర్జ్యం          : మ 01.06 - 02.37*

*దుర్ముహూర్తం  : ఉ 10.03 - 10.52 మ 03.00 - 03.50*

*రాహు కాలం  : మ 01.40- 03.13*

గుళికకాళం      : *ఉ 09.00 - 10.34*

యమగండం    : *ఉ 05.54 - 07.27*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మేషం/వృషభం* 

సూర్యోదయం :*ఉ 06.03*  

సూర్యాస్తమయం :*సా 06.28*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.52*

మధ్యాహ్న కాలం    :  *10.52 - 01.21*

అపరాహ్న కాలం  : *మ 01.21-03.50*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ సప్తమి*

సాయంకాలం     : *సా 03.50- 06.19*

ప్రదోష కాలం       : *సా 06.19-08.38*

రాత్రి కాలం        : *రా 08.38- 11.44*

నిశీధి కాలం       : *రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

    *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


           🌷*సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

శ్రీమద్భాగవతం - 37/42

 


*శ్రీమద్భాగవతం - 37/42* 


         *రుక్మిణీ కళ్యాణం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో ఈరోజు అత్యంత శక్తివంతమైన ఘట్టం రుక్మిణి కళ్యాణం గురించి తెలుసుకుని సకల శుభాలు పొందుదాం రండి.


గుహలో కాయవనుడు మరణించాక 

ముచుకుందునీ అనుగ్రహించిన పరమాత్మ తిరిగి మధురా నగరానికి వచ్చాడు, నగరం చుట్టూ కాలయవనుని సైన్యాలు భారీ సంఖ్యలో మోహరించి ఉన్నాయి వారిని అంతం చేసి ఎద్దుల బండ్ల పై వారి వద్ద ఉన్న అపార ధన రాశులను ద్వారకకు తరలించారు.


అదే సమయంలో అపార సైన్యంతో జరాసంధుడు మళ్ళీ దాడి చేయగా బల రామకృష్ణులు ప్రవర్శనగిరి అనే పర్వతం వైపు పరుగు తీశారు, అక్కడ ఎంత వెతికినా వీరి జాడ దొరకలేదు అని మొత్తం పర్వతానికి నిప్పు పెట్టాడు జరాసంధుడు, బల రామకృష్ణులు ఎగిరి 11 యోజనాల ఎత్తునుండి దూకి, ద్వారక చేరారు,అది తెలియని జరాసంధుడు బలరామ కృష్ణులను అంతం చేసాను అనుకుని తన సైన్యం తో రాజ్యానికి వెళ్లిపోయాడు.


ఆ సమయంలోనే కొంత కాలానికి ఆనర్త దేశాన్ని పాలించిన రైవతుడు (కకుద్మి) అనే రాజు తన కుమార్తె అయిన రేవతితో కలిసి బలరాముని వద్దకు వచ్చాడు.


గతంలో (కృతయుగంలో) రైవతుడు తన కుమార్తెకు తగిన వరుని నిర్ణయించమని బ్రహ్మదేవుని వద్దకు వెళ్లగా, అక్కడ గడిచిన కాసేపట్లోనే భూలోకంలో 27 చతుర్యుగాలు గడిచిపోయాయి. అప్పుడు బ్రహ్మదేవుడు, "రాజా! కాలం మారిపోయింది, ప్రస్తుతం భూమిపై శ్రీమహావిష్ణువు అంశగా బలరాముడు అవతరించి ఉన్నాడు. ఆయనకే నీ కుమార్తెను ఇచ్చి వివాహం చెయ్యి" అని ఆజ్ఞాపించాడు.


బ్రహ్మదేవుని ఆజ్ఞ ప్రకారం రైవతుడు రేవతిని ద్వారకకు తీసుకువచ్చాడు. అనంతరం సకల పెద్దల సమక్షంలో రేవతీ-బలరాముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది.(ఈ విశేషాలు నవమ స్కంధంలో వివరంగా ఉంటాయి)


1. రుక్మిణీదేవి అనురాగం & రుక్మి కుతంత్రం

విదర్భ దేశాన్ని పాలించే భీష్మక మహారాజు రాజధాని కుండిన నగరం. ఆయనకు ఐదుగురు కుమారులు (రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మమాలి) మరియు సాక్షాత్తు లక్ష్మీదేవి అంశయైన రుక్మిణీదేవి ఏకైక కుమార్తె.


యదువీరుడైన శ్రీకృష్ణునియొక్క అందచందములను, బలపరాక్రమములను, గాంభీర్య, ఔదార్యాది సద్గుణములను, భోగభాగ్యములను గూర్చి తమ ఇంటికి వచ్చినవారు ప్రశంసించుచుండగా విని, ఆ కన్యకామణి ఎంతయు ముగ్ధురాలగుచుండెడిది. అందువలన ఆ స్వామియే తనకు తగిన వరుడని ఆమె నిశ్చయించుకొనెను.


 శ్రీకృష్ణుడును తన కడకు విచ్చేసిన మహాత్ములవలన రుక్మిణీదేవియొక్క బుద్ధికౌశలమును, శుభలక్షణములను, ఔదార్యమును, రూపసౌభాగ్యమును, సచ్ఛీలమును, ఉత్తమగుణములను గూర్చి వినియుండెను. ఆ కారణముగా ఆ సుందరియే 'తనకు తగిన వధువు' అని అతడు నిర్ణయించుకొనెను. ఈవిధముగా ఆ ఇరువురును పరస్పర ప్రేమానురాగబద్ధులైరి.


రుక్మిణీదేవి తన మనస్సును పరిపూర్ణంగా శ్రీకృష్ణునికే అర్పించింది. తండ్రి భీష్మకుడికి ఇతర సోదరులకు కూడా కృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలని ఇష్టముంది.


కానీ పెద్ద కుమారుడైన రుక్మి కృష్ణునిపై ద్వేషంతో, తన మిత్రుడైన చేది దేశపు రాజైన శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. వివాహానికి నిశ్చయ తాంబూలాలు ఇచ్చి, జరాసంధ, సాల్వ, దంతవక్త్రాది దుష్ట రాజులందరినీ ఆహ్వానించారు.


2. అగ్నిద్యోతనుని రాయబారం.


వివాహానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో రుక్మిణీదేవి తీవ్రమైన ఆవేదన చెందింది. సమయస్పూర్తి గల ఆ దేవి 

వెంటనే ఒక నమ్మకమైన, తనకు హితం కోరే ఒక వృద్ధ బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతనుడిని (సుదేవుడిని) పిలిచి, శ్రీకృష్ణునికి ఒక రహస్య లేఖను (సందేశ పత్రికను) ఇచ్చి ద్వారకకు పంపింది.


బ్రహ్మణ్యదేవుడైన (భూసురోత్తములయెడ భక్తినిరతిగల) శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుని జూచినంతనే తన ఉన్నతాసనమునుండి దిగెను. పిమ్మట ఆయనను సముచితాసనమునందు కూర్చుండబెట్టి, దేవతలు తనను కొలిచినట్లుగా ఆ స్వామి ఆ విప్రోత్తముని పూజించి, మంచి చెడులు అడిగి తెలుసుకుని తాము ఇక్కడికి వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు.


ఆ బ్రాహ్మణుడు ప్రభు నా పేరు అగ్నిద్యోతనుడు రుక్మిణి దేవి పంపగా ఈ లేఖ తీసుకుని వచ్చాను అని స్వామికి లేఖను అందించాడు


ఈ లేఖలో రుక్మిణీదేవి రాసిన **ఏడు శ్లోకాలు** భాగవతంలో పరమ పవిత్రమైన భక్తి ప్రపత్తులకు నిదర్శనం:


**రుక్మిణీ దేవి సందేశ సారాంశం:**(నిత్య పారాయణ చేత వివాహ సంబంధ దోషాలు తొలగిపోతాయి)


1. **రూప గుణ శ్రవణం (హృదయార్పణ):**

"ఓ భువన సుందరా! చెవుల ద్వారా ప్రవేశించి తాపత్రయాలను పోగొట్టే నీ దివ్య గుణాల గురించి, కనులకు ఆనందాన్నిచ్చే నీ సౌందర్యం గురించి విని నా మనసు సిగ్గు విడిచి నీయందే లగ్నమైంది."


2. **ఆత్మసమర్పణ:**

"ఓ ముకుందా! ఉత్తమ వంశం, రూపం, గుణం, విద్యా వివేకాలు, సంపదలు కలిగిన ఏ స్త్రీ మాత్రం నిన్ను పతిగా కోరుకోదు? అందుకే నా మనసుతో నిన్ను భర్తగా ఎప్పుడో వరించాను. నా శరీరాన్ని, ప్రాణాన్ని నీకే సమర్పిస్తున్నాను."


3. **హక్కును రక్షించుకోమనే వేడుకోలు:**

"ఓ కమలాక్షా! సింహం పాలుపంచుకోవలసిన భాగాన్ని నక్క (కుక్క) వచ్చి తాకడానికి చూసినట్లుగా... నీకు చెందవలసిన నన్ను చేదిరాజు శిశుపాలుడు తాకకముందే వచ్చి నీ సొంతం చేసుకో."


4. **సాహసంతో కూడిన మార్గం (యుద్ధ సవాలు):**

"నేను పూర్వజన్మల్లో లేదా ఈ జన్మలో ఇష్టాపూర్తములు, యజ్ఞాలు, దానాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటే... ఆ పుణ్యఫలంగా నీవే నాకు పతివి కావాలి. శిశుపాల జరాసంధుల సైన్యాలను ఓడించి, నన్ను నీ పరాక్రమంతో గెలుచుకో."


5. **అంతఃపుర సమస్య – ఉపాయం:**

"మా అన్న రుక్మి నా వివాహాన్ని శిశుపాలునితో నిశ్చయించాడు. నన్ను అంతఃపుర స్త్రీల మధ్య నుండి బంధువులను చంపకుండా ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచించవద్దు... దానికి ఒక సులువైన ఉపాయం ఉంది."


6. **పార్వతీ పూజా ఘట్టం (తరుణం):**

"పెళ్లికి ముందు రోజు కులదేవత అయిన పార్వతీదేవి (గిరిజ) దర్శనార్థం వధువు నగరం వెలుపల ఉన్న ఆలయానికి ఊరేగింపుగా వెళ్లడం మా ఆచారం. నేను ఆ పార్వతీదేవి గుడికి వచ్చే సమయానికి నీవు వచ్చి, నన్ను నీ రథంపై ఎక్కించుకుని తీసుకువెళ్లు."


7. **చివరి ప్రతిజ్ఞ:**

"ఒకవేళ నీ పాదపద్మ ధూళిని పొందే భాగ్యం నాకు దక్కకపోతే, వ్రతాలు నియమాలతో నా శరీరాన్ని కృశింపజేసి ప్రాణాలైనా విడుస్తానే తప్ప మరొకరిని వరించను. ఎన్ని జన్మలకైనా నీ పాదసేవనే కోరుకుంటాను."


3. శ్రీకృష్ణుని కుండిన నగర ప్రవేశం & అంబికా పూజ (53వ అధ్యాయం)


లేఖను చదివిన శ్రీకృష్ణుడు అగ్నిద్యోతనుని చేతులు పట్టుకుని: "విప్రోత్తమా! రుక్మిణిపై నా మనస్సు కూడా అలాగే లగ్నమై ఉంది" అంటూ వెంటనే రథాన్ని సిద్ధం చేయించి, దారుకుని రథసారథ్యంలో అగ్నిద్యోతనుని ముందు ఉంచుకుని వాయువేగంతో కుండిన నగరానికి చేరుకున్నాడు.


అయితే శ్రీకృష్ణునికి వైరులు అయిన జరాసంధుడు, దంత్రవక్త్రుడు,విధూరధుడు,పౌండ్రకుడు వేలాదిగా శిశుపాలుని వెంట వచ్చారు, ఎలాగైనా రుక్మిణీ దేవి నీ శిశుపాలునికే దక్కేలా చేయాలి శ్రీకృష్ణుడు వస్తె అడ్డు పడాలి అని వారి తంత్రం.


ఆ విషయం తెలుసుకున్న బలరాముడు కూడా యాదవ సైన్యంతో బయలుదేరాడు.


భీష్మకునికి శ్రీకృష్ణ పరమాత్మ యందు వైరభావం లేకున్న పెద్ద కుమారుడి మాటను కాదనకుండ వివాహం జరిపిస్తూ ఉన్నాడు, రాజ్యం మొత్తం అంగ రంగ వైభవంగా అలంకరింప బడి ఉంది.


కుండిన నగరంలో వివాహ బాజాలు మోగుతున్నాయి. అటు రుక్మిణి దేవి అయ్యో ఇక ఒక్క రాత్రి మాత్రమే మిగిలి ఉంది సందేశం పంపిన బ్రాహ్మణుడు రాలేదు, శ్రీ కృష్ణుడు రాలేదు అని చింతిస్తూ ఉంటుంది.అదే సమయంలో ఆమెకు అనేక శుభ శకునాలు కలుగుతాయి.అదే సమయంలో బ్రాహ్మణుడు కూడా వచ్చి అమ్మా శ్రీకృష్ణుడు వచ్చి ఉన్నాడు నిన్ను తీసుకుని వెళ్తాడు అని చెప్పాడు. మహానుభావ నీవు చేసిన మేలుకు నేను ప్రత్యుపకారం చేయలేను అని ఆ బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేసింది.


భీష్మకుడు కూడా బలరామ కృష్ణులు నగరానికి వచ్చిన సంగతి తెలుసుకుని , కుమార్తె వివాహానికి వచ్చినందుకు సంతోషించి అనేక కానుకలు సమర్పించాడు.వారికి తగిన విడిది గృహం ఏర్పాటు చేశాడు.ఆ నగరం లోనీ ప్రజలంతా స్వామీనీ చూసి ఎంతో ఆనందం పొందారు.మా చక్కని తల్లి రుక్మిణి కి ఈ చక్కని స్వామే తగినవాడు కదా,వారిద్దరి జంట బాగుంటుంది అలా చూసే భాగ్యం కలిగితే బాగుండు కదా అని వాళ్ళలో వారు అనుకున్నారు.


ఇంతలో రుక్మిణీదేవి సఖీమణులతో, రాజభటుల రక్షణ నడుమ నగరం వెలుపల ఉన్న అంబికాలయానికి నడుస్తూ వచ్చింది. అక్కడ పార్వతి దేవిని ప్రార్ధించింది.(పూజ చేసింది)


* **రుక్మిణీ ప్రార్థన:**

"నమస్యే త్వాంబికేఽభీక్ష్ణం స్వసంతానయుతాం శివామ్ |

 భూయాత్ పతిర్మే భగవాన్ కృష్ణస్తదనుమోదతామ్ ||


 *"తల్లీ జగన్మాతా! పరమేశ్వరా! శ్రీకృష్ణుడే నాకు పతి అయ్యేలా అనుగ్రహించు!"* అని భక్తితో పూజించి. ముత్తైదువలు అయిన విప్ర వనితలకి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారి ఆశీసులు పొందింది.


4. రుక్మిణీ హరణం & రాజుల పరాభవం


పూజ ముగించుకుని రుక్మిణీదేవి ఆలయం వెలుపలికి వచ్చింది. ఆమె సౌందర్యాన్ని చూసి అక్కడున్న రాజులందరూ చేతుల్లోని ఆయుధాలు జారిపడి మంత్రముగ్ధులయ్యారు.


అదే క్షణంలో శ్రీకృష్ణుడు ఆ రాకుమారి తన రథం ఎక్కుటకు సుముఖంగా ఉంది అని గమనించి మెరుపులా దూసుకువచ్చి, సమస్త రాజులు చూస్తుండగానే రుక్మిణీదేవి చేయి పట్టుకుని తన రథంపైకి ఎక్కించుకున్నాడు.


అప్పుడు శిశుపాలుడు, జరాసంధుడు మొదలైనవారు తమ సైన్యాలతో కృష్ణుడిని అడ్డుకోవడానికి రాగా, అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీ బలరాముడు మరియు యాదవ సైన్యం వారిని చిత్తుచిత్తుగా ఓడించి తరిమికొట్టింది.


5. రుక్మి గర్వభంగం & ద్వారకలో దివ్య పరిణయం


తన సోదరిని తీసుకెళ్తున్నాడని తెలిసి రుక్మి తీవ్ర క్రోధంతో: "కృష్ణుడిని చంపకుండా, రుక్మిణిని తీసుకురాకుండా కుండిన నగరంలో అడుగుపెట్టను!" అని శపథం చేసి కృష్ణుని రథాన్ని వెంబడించాడు.


శ్రీకృష్ణుడు సునాయాసంగా రుక్మి రథాన్ని విరిచి, అతన్ని సంహరించడానికి ఖడ్గాన్ని ఎత్తాడు. రుక్మిణీదేవి కన్నీళ్లతో

"ప్రభూ! నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు, దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలిసికొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు. తిరుగులేని భుజబలము గలవాడవు, కల్యాణ స్వరూపుడవు. (మంగళప్రదమైన కల్యాణము చేసికొనబోవు చున్నవాడవు. ) ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు, నీకు బావమఱది. ఇతడు నిన్ను శరణుగోరకున్నను ఇతని పక్షమున నేను శరణువేడుచున్నాను. కావున ఇతని చంపుట యుక్తముగాదు.అని వేడుకుంది.


 శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవి మాటను మన్నించి, రుక్మిని చంపకుండా ఊరుకున్నాడు అయిన అతని మూర్ఖ చేష్టలు మానలేదు దానితో 

ఆయన అహంకారానికి శిక్షగా బందించి ఖడ్గంతో తలమీద, మీసాలపై కొన్ని చోట్ల జుట్టును గొరిగి (విరూపం చేసి)వదిలివేశాడు.

అపార సేనలను చెల్లాచెదురు చేశారు. రుక్మిణి దేవి తన అన్నకు ఇలా అవమానం జరిగినందుకు ఎంతో పరితాపం పొందింది కానీ బలరాముని బోధ చేత కుదురుకుంది 


అటు అవమానంతో ఎప్పటి వరకైతే కృష్ణుని వధించి రుక్మిణి ని తీసుకు వస్తానో అప్పటి వరకు కుండిన నగరంలో అడుగు పెట్టను అని రుక్మి కుండిన నగరానికి వెళ్లలేక 'భోజకటం' అనే నూతన నగరాన్ని నిర్మించుకుని అక్కడే ఉండిపోయాడు.


* **కళ్యాణ మహోత్సవం:** 

అలా శ్రీకృష్ణుడు అందరిని జయించి రుక్మిణీ సమేతుడై సువర్ణ ద్వారకకు చేరుకున్నాడు. సమస్త దేవతలు, మునులు, బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య **శ్రీకృష్ణ-రుక్మిణుల దివ్య కళ్యాణం** అత్యంత వైభవంగా జరిగింది. సమస్త ద్వారకా నగర ప్రజలు పరమానందంతో ఉత్సవాలు జరుపుకున్నారు.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **అనన్య శరణాగతి:** రుక్మిణీదేవి సందేశం జీవాత్మ పరమాత్మను చేరడానికి అత్యుత్తమ నిదర్శనం. భగవంతుని రూప, గుణాలను శ్రవణం చేయడమే భక్తికి మొదటి మెట్టు.


2. **గురుకృప – బ్రాహ్మణ దూత:** అగ్నిద్యోతనుడనే బ్రాహ్మణుడు (గురువు) జీవాత్మ (రుక్మిణి)ని పరమాత్మ (శ్రీకృష్ణుడు) వద్దకు చేర్చే దివ్య వారధిగా నిలిచాడు.


3. **రుక్మిణీ కళ్యాణ ఫలశ్రుతి:** భాగవతంలో రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని శ్రవణం చేసినా లేదా పఠించినా సమస్త గ్రహబాధలు తొలగి, సకల మంగళాలు, దాంపత్య సౌఖ్యం లభిస్తాయని విశ్వాసం. వివాహం అవ్వని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది.


.....సశేషం 

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

శ్రీమద్భాగవతం - 38/42*🙏


*శ్రీమద్భాగవతం - 38/42*🙏


*శమంతకమణి కథ & శ్రీకృష్ణుని అష్టమహిషులు*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో నిన్న రుక్మిణి కళ్యాణ ఘట్టం స్మరించి తరించాము, ఈరోజు శ్యమంతకోపాఖ్యానం, మిగిలిన వివాహా ఘట్టాలు స్మరించే ప్రయత్నం చేద్దాం.


*ప్రద్యుమ్నుని జననం – శంబరాసుర సంహారం*


 పూర్వం పరమశివుని నేత్రాగ్నికి భస్మమైన మన్మథుడు, కొంతకాలానికి శ్రీకృష్ణ-రుక్మిణుల ప్రథమ సంతానంగా "ప్రద్యుమ్నుడు" అనే పేరుతో అవతరించాడు.


అయితే ప్రద్యుమ్నుడు పుట్టిన పది రోజులకే, తనకు కాబోయే శత్రువని గ్రహించిన శంబరాసురుడనే రాక్షసుడు ఆ శిశువును అపహరించి సముద్రంలో పడేశాడు. ఆ పసిబిడ్డను ఒక మహా మత్స్యం (చేప) మింగింది.

 

 ఆ చేప జాలరుల వలలో చిక్కగా, వారు దానిని శంబరాసురుని వంటశాలకు కానుకగా ఇచ్చారు. ఆ చేప కడుపును చీల్చగా లభించిన దివ్య బాలుడిని చూసి, శంబరాసురుని ఇంట దాసిగా ఉన్న రతీదేవి (మాయావతి పేరుతో ఉన్నది) నారద మహర్షి ఉపదేశంతో ఆ బాలుడే తన పతి అయిన మన్మథుడని గ్రహించి అల్లారుముద్దుగా పెంచింది. భర్త భావంతోనే పెంచింది.


  శంబరాసుర సంహారం:

ప్రద్యుమ్నుడు యుక్తవయస్కుడయ్యాక, మాయావతి అతనికి సకల మాయా విద్యలను, యుద్ధ తంత్రాలను ఉపదేశించి అసలు వృత్తాంతం చెప్పింది. అనంతరం ప్రద్యుమ్నుడు శంబరాసురునితో ఘోర యుద్ధం చేసి, తనపై ప్రయోగించిన మాయాస్త్రాలన్నింటినీ తిప్పికొట్టి వాడియైన ఖడ్గంతో వాడి తల నరికి సంహరించాడు.


శంబరాసురుని వధించిన తర్వాత ప్రద్యుమ్నుడు మాయావతితో కలిసి ఆకాశమార్గంలో ద్వారకకు చేరుకున్నాడు. అచ్చం శ్రీకృష్ణుడి రూపలావణ్యాలతో ఉన్న ప్రద్యుమ్నుడిని చూసి అంతఃపుర స్త్రీలు మొదట శ్రీకృష్ణుడేమోనని భ్రమపడ్డారు. రుక్మిణీ దేవికి పుత్రప్రేమ ఉప్పొంగింది. నారద మహర్షి వచ్చి అసలు విషయం చెప్పడంతో ద్వారకానగరం అంతా ఆనందోత్సవాల్లో మునిగిపోయింది.


అప్పుడు పరీక్షితు మహారాజు సత్రాజిత్తు వృత్తాంతం వివరంగా చెప్పమని అడుగగా, శుక మహర్షి దాన్ని ప్రారంభం చేశాడు..


*సూర్యభగవానుని శమంతకమణి & సత్రాజిత్తు* 


ద్వారకలో నివసించే యాదవ శ్రేష్ఠుడైన సత్రాజిత్తు సూర్యభగవానుని ఉపాసించి మెప్పించాడు. సూర్యుడు ప్రసన్నుడై తన మిత్రుడు అయిన సత్రాజిత్తు కు తన తేజోవంతమైన 'శమంతకమణి'ని ప్రసాదించాడు. అతడు ఆ మణి మెడలో ధరిస్తే సాక్షాత్ సూర్యుని వలె తేజరిల్లుతూ ఉండేవాడు,ఆ వెలుగులో సాధారణ జనులు అతన్ని గుర్తుకూడా పట్టేవారు కాదు. (ఆ వెలుగుకు దూరం నుండే కళ్ళు మూతలు పడేవి)


**మణి ప్రభావం:** ఆ మణిని నిత్యం శుచిగా పూజిస్తే ప్రతిరోజూ ఎనిమిది బారువుల (దాదాపు 80 తులాల పైగా) బంగారాన్ని ప్రసాదిస్తుంది. ఆ మణి ఉన్న చోట క్షామం, వ్యాధులు, పాములు, అకాల మరణాలు,మానసిక, శారీరక సమస్యలు, చోర బాధలు ఉండవు.


**కృష్ణుని సూచన & సత్రాజిత్తు తిరస్కారం:**ఒకానొక సమయంలో ప్రజాహితం దృష్ట్యా ఆ దివ్య మణిని చక్రవర్తియైన ఉగ్రసేనునికి సమర్పించమని శ్రీకృష్ణుడు సూచించాడు, సత్రాజిత్తు లోభంతో అందుకు నిరాకరించాడు.


ప్రసేనుని మరణం & శ్రీకృష్ణునిపై అపనింద 


అనంతరం ఒకరోజు సత్రాజిత్తు సోదరుడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని మెడలో ధరించి వేట కోసం అడవికి వెళ్లాడు. అడవిలో ఒక సింహం ప్రసేనుడిని, ఆయన గుర్రాన్ని చంపి ఆ ప్రకాశవంతమైన మణిని నోట కరచుకుని ఒక కొండగుహ వైపు వెళ్ళిపోయింది.


**జాంబవంతుని చేతికి మణి:**అప్పుడు ఆ మణిని ఆశించి సింహాన్ని రామాయణ కాలం నాటి భక్తాగ్రేసరుడు, భల్లూకరాజైన **జాంబవంతుడు** సంహరించి, ఆ మణిని తన గుహలోకి తీసుకువెళ్లి తన చిన్ని కుమారుడైన సుకుమారుడికి ఆటవస్తువుగా ఇచ్చి వేశాడు.(ఊయల మీద కట్టాడు)

 **నీలాపనింద:**ఎంతకూ అడవి నుండి ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో, ద్వారకలో సత్రాజిత్తు అతని కొరకు దుఃకింప సాగాడు. మణిని కంఠం లో ధరించి అడవికి వెళ్ళిన నా తమ్ముని బహుశా ఆ

*"శమంతకమణిని లాక్కోవడానికి కృష్ణుడే చంపించి ఉంటాడు"* అని నిరాధారమైన నిందను ప్రచారం చేశాడు. 


ఆ వార్త క్రమంగా శ్రీకృష్ణుని చేరింది శ్రీకృష్ణుడు తనపై వచ్చిన నిందను బాపుకోవడానికి కొందరు ప్రముఖులతో/పౌరులతో కలిసి అడవికి ప్రసేనుడు వెళ్ళిన మార్గంలోనే బయలుదేరాడు.


జాంబవంతునితో 28 రోజుల యుద్ధం & రామ దర్శనం


వారు కొంత దూరం వెళ్లిన తదుపరి సింహం చే చంపబడిన

ప్రసేనుని శవాన్ని, అతని గుర్రాన్ని.మరి కొంత దూరంలో ఎలుగుబంటి చేతికి చచ్చిన సింహాన్ని చూస్తూ ఆ అడుగుజాడల వెంట వెళ్లి శ్రీకృష్ణుడు జాంబవంతుని చీకటి గుహదగ్గరకు వెళ్ళాడు, ప్రజలను బయటే ఉంచి తాను ఒంటరిగా లోపటికి ప్రవేశించాడు.


గుహలోకి వెళ్ళిన పిదప ఆ దివ్యమణి ఒక బాలునకు ఆటవస్తువు గా ఉండటం గమనించాడు,ఆ మణిని తీసుకోవడం కోసం బాలుని సమీపించి అక్కడ నిలబడ్డాడు.


అప్పుడు ఇక దాది కృష్ణుడిని చూసి అరవగా,అది విన్నంతనే జాంబవంతుడు క్రోధంతో కృష్ణునిపైకి లంఘించాడు.


* **28 రోజుల ద్వంద్వ సమరం:** శ్రీకృష్ణ-జాంబవంతుల మధ్య రాళ్లు, చెట్లు, పిడిగుద్దులతో రాత్రింబగళ్లు నిరంతరాయంగా **ఇరవై ఎనిమిది రోజుల పాటు** భీకర ద్వంద్వ యుద్ధం జరిగింది.


చివరకు పరమాత్మ పిడిగుద్దుల దెబ్బకు జాంబవంతుని అవయవాలు అన్ని నుగ్గునుగ్గయ్యాయి అతని బలం మొత్తం క్షీణించి పోయింది.


ఆశ్చర్యానికి లోనైన జాంబవంతుడు 

*"ఈ సమస్త బ్రహ్మాండంలో నన్ను బాహుయుద్ధంలో ఓడించగల సమర్థుడు నా ఆరాధ్య దైవమైన **శ్రీరామచంద్రుడు** తప్ప మరొకరు లేరు!"అని భావించి


 వెంటనే యుద్ధం ఆపి, కృష్ణుని పాదాలపై పడి కన్నీళ్లతో ప్రార్థించాడు. శ్రీకృష్ణుడే రాముడు అని గ్రహించాడు.స్వామి జాంబవంతుని అనుగ్రహించాడు.


అప్పుడు స్వామి జాంబవంతుని వెన్ను తట్టి జాంబవంత జనులు ఈ మణి నేనే దొంగిలించాను అని నింద వేశారు,అది తొలగించుకోవడం కోసమే నేను ఈ గుహలోకి వచ్చాను అన్నాడు 


అంతట జాంబవంతుడు పరమానందంతో శమంతకమణితో పాటు తన ముద్దుల కుమార్తెయైన **జాంబవతీదేవిని**శ్రీకృష్ణునికి సమర్పించి పరిణయం జరిపించాడు.


ఇటు జనులు 12 రోజులు వేచి చూసినా స్వామి బయటకు రాలేదా అని తీవ్ర దుఃఖం తో ద్వారకకు తిరిగి వెళ్ళారు, దేవకి వసుదేవులకు విషయం చెప్పారు, ప్రజలంతా సత్రాజిత్తు ను తిట్టి పోశారు, స్వామి క్షేమంగా రావాలి అని దుర్గా ఆరాధన చేపట్టారు సరిగా అదే సమయంలో.....


సత్యభామా కళ్యాణం & శమంతకమణి కథ ముగింపు 


ద్వారకకు తిరిగి వచ్చిన శ్రీకృష్ణుడు నీ చూసి జనులు ఎంతయో ఆనందం పొందారు 


శ్రీకృష్ణుడు సత్రాజిత్తు ను ఉగ్రసేన మహారాజు సభను పిలిపించి, మణి లభించిన విధానం తెలిపి ఆ శమంతకమణిని సత్రాజిత్తుకు అప్పగించి నిజం నిరూపించాడు.


* **సత్రాజిత్తు పశ్చాత్తాపం:** నిష్కారణంగా పరమాత్మపై నింద మోపినందుకు భయపడి దీనికి నిష్కృతి ఏమి అని ఆలోచించి, తన సౌందర్యవతియైన కుమార్తె **సత్యభామాదేవిని**, శమంతకమణితో సహా కృష్ణునికి సమర్పించాడు.


* శ్రీకృష్ణుడు సత్యభామను అర్ధాంగిగా స్వీకరించి, శమంతకమణిని మాత్రం సత్రాజిత్తు వద్దనే ఉంచుకోమని తిరిగి ఇచ్చివేశాడు.


(ఒకానొక సమయంలో పాండవులు లక్క ఇంట్లో కాలిపోయారూ అన్న వార్త విని బలరామ కృష్ణులు హస్తినాపురం వెళ్తారు అప్పుడు శతధన్వుడు సత్రాజిత్తును చంపి మణిని దాచగా, కృష్ణుడు శతధన్వుడిని సంహరించి మణిని నిష్కళంకుడైన అక్రూరుని వద్ద సురక్షితంగా ఉంచాడు


5. శ్రీకృష్ణుని అష్టమహిషుల వైభవం 


 * 1. కాళింది (యమున):

   శ్రీకృష్ణుడు లక్క ఇంటి నుండి క్షేమంగా బయట పడ్డ పాండవల వడ్డే నాలుగు నెలలు ఉన్నాడు ఆ సమయంలో ఒకరోజు అర్జునుడితో కలిసి యమునా తీరంలో విహరిస్తుండగా, పరమాత్ముడే పతిగా రావాలని ఘోర తపస్సు చేస్తున్న సూర్యపుత్రిక 'కాళింది' కనిపించింది. ఆమె భక్తికి మెచ్చి కృష్ణుడు ఆమెను వివాహం చేసుకున్నాడు.


 * 2. మిత్రవింద:

   అవంతీ దేశపు రాజకన్య (శ్రీకృష్ణుని మేనత్త కూతురు). ఆమె మనసులో కృష్ణుడినే కోరుకుంది. కానీ ఆమె సోదరులు విందుడు, అనువింధుడు దుర్యోధనుడికి స్నేహితులు ఆమెను అతనికే ఇవ్వాలని చూశారు. దాంతో స్వయంవర సభ నుండే శ్రీకృష్ణుడు ఆమెను రథంపై తీసుకొచ్చి ధర్మబద్ధంగా పరిణయమాడాడు.


 * 3. సత్య (నాగ్నజితి):

   కోసల దేశపు రాజు నగ్నజిత్తు... "ఎవరైతే తన ఏడు క్రూరమైన కొమ్ములు తిరిగిన ఎద్దులను లొంగదీస్తారో వారికే తన కూతురు సత్యను ఇస్తానని" షరతు పెట్టాడు. శ్రీకృష్ణుడు ఏకకాలంలో ఏడు రూపాలు ధరించి, క్షణాల్లో ఆ ఏడు ఎద్దులను బంధించి ఆమెను చేపట్టాడు.


 * 4. భద్ర:

   కేకయ దేశపు రాజకన్య (శ్రీకృష్ణుని మరో మేనత్త శ్రుతకీర్తి కుమార్తె). ఆమె సోదరులే స్వయంగా సంతోషంతో కృష్ణుడి వద్దకు తీసుకొచ్చి శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.


లక్షణ (మద్రరాజ పుత్రిక):

మద్రదేశాధిపతి అయిన బృహత్సేనుని కుమార్తె లక్షణ. ఆమె స్వయంవరంలో ఉన్న సమయంలో, శ్రీకృష్ణుడు గరుడుడు అమృతాన్ని తెచ్చిన రీతిలో, సభలోని రాజులందరినీ ఎదిరించి ఒంటిచేత్తో ఆమెను తీసుకువెళ్ళి వివాహం చేసుకున్నాడు.


ఇలా శ్రీకృష్ణునికి ప్రధానంగా ఎనిమిది మంది పట్టపురాణులు (అష్టమహిషులు) ఉన్నారు. వీరంతా భగవంతుని వివిధ శక్తుల దివ్యాంశలు.. 


ఈ అష్టమహిషులతో పాటు శ్రీకృష్ణుడు నరకాసురుని చెర నుండి విడిపించిన **16,100 మంది దివ్య కన్యలను** కూడా లోకాపవాదు నుండి రక్షించి, వారికి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించడానికి ఏకకాలంలో అన్ని వేల రూపాలను ధరించి వారిని వివాహమాడాడు.


🌟ఆ లీల గురించి రేపు తెలుసుకుందాం, అనేక అనుమానాలు తొలగిపోతాయి తప్పక చదవండి..🌟


📝 నేటి అంతరార్థం


1. **వినాయక చవితి శమంతకోపాఖ్యానం:** భాద్రపద శుక్ల చవితి నాడు ప్రమాదవశాత్తు చంద్రుడిని చూసినవారికి నీలాపనిందలు రాకుండా ఉండటానికి ఈ 'శమంతకమణి కథ'ను పఠించి అక్షతలు శిరస్సున ధరించడం సంప్రదాయమైంది.(ఈ విషయం ఇక్కడ చెప్పలేదు కానీ వేరొక చోట ఉన్నది)


2. **భక్త వాత్సల్యం:** త్రేతాయుగంలో శ్రీరామునితో బాహుయుద్ధం చేయాలన్న జాంబవంతుని చిరకాల కోరికను ద్వాపరంలో శ్రీకృష్ణుడు 28 రోజుల యుద్ధం ద్వారా తీర్చి అనుగ్రహించాడు.


3. **అష్టమహిషుల అంతరార్థం:** భగవంతుని అష్టమహిషులు కేవలం ప్రాపంచిక భార్యలు కారు; వారు పరమాత్మ యొక్క అష్ట ప్రకృతి శక్తులు (భూమి, ఆపస్సు, తేజస్సు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం). అష్టమూర్తి తత్వమే అష్ట భార్యలు.


.....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

అరణ్యవాసం

 *మహాభారతం: అరణ్యవాసం* 

పాశుపతాస్త్రం పొందడం వంటి అనేక సంఘటనలతో పాటు,పాండవులు అరణ్యవాసంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు.కౌరవులతో జరిగిన జూదంలో ఓడిపోవడంతో పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో నివసించాల్సి వచ్చింది.ధర్మరాజు,భీముడు, అర్జునుడు,నకులుడు,సహదేవుడు,ద్రౌపది కలిసి అడవుల్లో జీవించారు.ఈ సమయంలో వారు అనేక ఋషులను కలుసుకుని వారి నుంచి జ్ఞానం,ధర్మబోధలు పొందారు.

అరణ్యవాసంలో పాండవులు ఎన్నో ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కొన్నారు.అర్జునుడు దేవతలను ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలను సంపాదించాడు.భీముడు,ఇతర పాండవులు తమ శక్తిసామర్థ్యాలను పెంచుకున్నారు.కష్టకాలంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా,ఐకమత్యంతో జీవించడం ద్వారా వారు భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమయ్యారు.

 *అజ్ఞాతవాసం* 

పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం పూర్తయిన తరువాత పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది.వారు ఎవరికీ తమ నిజమైన గుర్తింపు తెలియకుండా విరాట రాజు కొలువులో వివిధ వేషాలలో  *ధర్మరాజు కంకుడుగా,భీముడు వలలుడుగా,అర్జునుడు బృహన్నలగా,నకులుడు గ్రంథికుడుగా,సహదేవుడు తంత్రీపాలుడుగా,ద్రౌపది సైరంధ్రిగా ఉన్నారు.* 

 *అజ్ఞాతవాసంలో* పాండవులు తమ గుర్తింపు బయటపడకుండా చాలా జాగ్రత్తగా జీవించారు.విరాటరాజు కుమారుడు ఉత్తరుడికి అర్జునుడు యుద్ధ విద్య నేర్పి,కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సహాయం చేశాడు.అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తవడంతో పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు సిద్ధమయ్యారు.

పంచాంగం

  ఈ రోజు పంచాంగం 02.09.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష పంచమి తదుపరి షష్ఠి తిథి సౌమ్య వాసర భరణి నక్షత్రం ధ్రువ యోగః తైతుల తదుపరి గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: షష్ఠి



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।

అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।



ప్రతిపదార్థ:


ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.



తాత్పర్యము: 


అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.



వివరణ:



ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది.


ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.7మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (⁸ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.

వరదల విలయంలో ఓ చీర 21 మందిని

నేపాల్ ఆకస్మిక వరదల విలయంలో ఓ చీర 21 మందిని కాపాడింది. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చీర అతి ముఖ్యమైనది. అలాంటి చీర 21 మంది ప్రాణాలను కాపాడగలిగిందంటే గొప్ప విషయం. అందులోనూ చీర సాయంతో బయటపడ్డ వారంతా వృద్ధులే. 26 తేదీన సంభవించిన నేపాల్ ప్రళయంలో టిబెట్ సరిహద్దుల్లో ఉన్న రషువా జిల్లాలో తమిళనాడుకు చెందిన 21 మంది భక్తులు మానస సరోవరం కైలాస యాత్రకు పోతున్నారు. ఈ సందర్భంగా ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయారు. బస్సు మూడు వంతులు మట్టిలో కూరుకుపోతోంది. వరద వేగం పెరుగుతుంది. అప్పుడే అరవై అయిదు ఏళ్ల ఓ మహిళ కష్టపడి బస్సు పైకి ఎక్కి అక్కడి నుంచి గట్టు పైకి ఎక్కింది . తన చీర వవిప్పదీసి కిందకు జార విడిచింది. అదృష్టం ఏమిటంటే ఆమె చీర జారవేసిన పక్కనే ఒక కేబుల్ వైర్ కూడా ఉంది . చీరను పట్టుకున్న మహిళలు ఆసరాగా కేబుల్ వైర్ కూడా పట్టుకుని అతి కష్టం మీద మృత్యువు తరుముకొస్తున్న తరుణంలో 21 మంది వృద్ధ మహిళలు నిమిషాల మీద ఆ చీర సాయంతో పైకి చేరుకున్నారు. మధ్యలో ఆ చీరకు మరో ఇద్దరు మహిళలు తమ చీరలను కూడా దానికి కలిపి ముడి వేసి కిందకు వదిలారు. 21 మంది పైకెక్కిన తర్వాత విచిత్రంగా బస్సు కూడా కొట్టుకుపోయింది. మహిళలు భగవంతుడే తమను ఈ ప్రమాదంలో నుంచి రక్షించాడని కైలాస శిఖరం వైపు తిరిగి కన్నీళ్ళతో దండం పెట్టుకున్నారు. ఈ వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు వాళ్లు తెలియజేశారు. ఆ బృందం ఢిల్లీకి చేరుకున్న సందర్భంగా జై శంకర్ వారికి స్వాగతం చెప్పారు . అప్పుడు ఆ మహిళ చెప్పిన అద్భుతమైన ఈ సంఘటన విని ఆయన కళ్ళు చెమర్చాయి. 
చీర భారతీయ సంస్కృతికి, సాంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనం . మహా విలయంలో నుంచి ప్రాణాలు కాపాడింది..

1, సెప్టెంబర్ 2026, మంగళవారం

పంచాంగము 🌓 01.09.2026

  🕉️


పంచాంగము 🌓 01.09.2026


🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి చవితి ఉ‌.07:44 వరకు

తదుపరి పంచమి

 

వారం: మంగళవారం - భౌమవాసరే

 

నక్షత్రం: అశ్విని రా.03:47 వరకు 

తదుపరి భరణి


యోగం: వృధ్ధి రా.11:03 వరకు

తదుపరి ధృవ

 

కరణం: బాలవ ఉ‌.07:44 వరకు

తదుపరి కౌలువ‌ రా.06:49 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.11:55 - 01:27 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:21

మరియు రా.11:06 - 11:52 


రాహు కాలం: ప‌.03:22 - 04:56


గుళిక కాలం: ప‌.12:16 - 01:49


యమ గండం: ఉ‌.09:09 - 10:42

 

అభిజిత్: 11:51 - 12:39


సూర్యోదయం: 06:02


సూర్యాస్తమయం: 06:29


చంద్రోదయం: రా.09:12


చంద్రాస్తమయం: ఉ‌.09:29


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: మేషం


దిశ శూల: ఉత్తరం


🌹 భౌమ‌ చతుర్థి 🌹


🐍 నాగ పంచమి 🐍

( గుజరాత్)


💫 భౌమాశ్విని‌ అమృతసిద్ధి

 యోగం 💫


🚩 శ్రీ సుజ్ఞానేంద్రతీర్థ‌ 

పుణ్యతిథి‌ 🚩


🌹 మంగళగౌరీ వ్రతం 🌹


🏳️ శ్రీ ఫలసిద్థినాథ్‌

స్వామి పుణ్యతిథి 🏳️


🚩టెంబ్యేస్వామి జయంతి 🚩


🪄 గురుగ్రంథ్ సాహిబ్

 ప్రకాశోత్సవం 🪄


🛕 శ్రీ వైకుంఠం శ్రీ వైకుంఠపతి

పెరుమాళ్ రథోత్సవం 🛕


🎉 తిరుచెందూరు కేదాయ

శ్రీ సుబ్రహ్మణ్య రథోత్సవం 🎉


🔯

పంచాంగం 01.09.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 01.09.2026 Tuesday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష చతుర్థి తిథి భౌమ వాసర అశ్విని నక్షత్రం వృద్ధి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: పంచమి 



 

నమస్కారః , శుభోదయం