14, ఆగస్టు 2026, శుక్రవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।

సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।



ప్రతిపదార్థ:


సర్వ-భూత-స్థితం — అన్ని ప్రాణుల యందు స్థితుడనై ఉన్న; యః — ఎవరైతే; మాం — నన్ను; భజతి — ఆరాధించునో; ఏకత్వం — ఏకమై ఉండి; ఆస్థితః — స్థితుడై; సర్వథా — అన్ని రకాలలో; వర్త-మానః — ఉండినా; అపి — కూడా; సః — అతను; యోగీ — ఒక యోగి; మయి — నాయందే; వర్తతే — నివసించును.



తాత్పర్యము: 


నా యందే ఏకత్వంలో స్థితుడై ఉండి, మరియు నన్నే సర్వ భూతముల యందు స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములు చేస్తునే ఉన్నా, నా యందే నివసించును.



వివరణ:


భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన సర్వభూతముల హృదయములలో పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. 18.61వ శ్లోకంలో శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొంటున్నాడు: ‘నేను సమస్త ప్రాణుల హృదయములలో కూర్చుని ఉన్నాను.’ ఈ విధంగా ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ.


వ్యక్తుల ఆధ్యాత్మిక పరిణితి బట్టి ఇది ప్రధానంగా నాలుగు స్థాయిల దృష్టికోణానికి దారితీస్తుంది


1. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు, మరియు జాతి, కులము, లింగము, వయస్సు, సామాజిక స్థాయి, దేశపౌరసత్వం వంటి వాటి ఆధారంగా భిన్నముగా చూస్తారు.


2. అంతకన్నా ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు, అందుకే 5.18వ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు: ‘దివ్య జ్ఞాన చక్షువులుకల నిజమైన పండితులు - ఒక బ్రాహ్మణుడిని, ఒక ఆవుని, ఒక ఏనుగుని, ఒక కుక్కని, మరియు ఒక చండాలుడిని అందరినీ ఒకే దృష్టితో చూస్తారు’


3. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు కూడా భౌతిక జగత్తుని గ్రహిస్తారు, కానీ దాని పట్ల ఉదాసీనంగా ఉంటారు. వారు హంస లాంటి వారు, అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి.


4. అత్యునత స్థాయి యోగులని 'పరమహంస' లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు, వారికి ఈ ప్రపంచం స్పృహ ఉండదు. భాగవతంలో చెప్పబడిన విధంగా వేదవ్యాస తనయుడైన శుకదేవుని విజ్ఞాన స్థాయి ఇదే.


యం ప్రవ్రజంతమనుపేతమ్ అపేత కృత్యం,

ద్వైపాయనో విరహ-కాతర ఆజుహావ

పుత్రేతి, తన్-మయతయా తరవో ఽభినేదుస్

తం సర్వ-భూత-హృదయం మునిమానతోఽస్మి (1.2.2)


చిన్నతనంలోనే తన ఇంటి నుండి వెళ్ళిపోతూ, శుకదేవుడు సన్యాసాశ్రమము స్వీకరించినప్పుడు, ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడంటే ఆయనకు ఈ ప్రపంచంపు స్పృహే లేదు. ఆయన అటుగా వెళ్తూ, కొలనులో నగ్నంగా స్నానం చేస్తున్న అందమైన యువతులను గమనించనేలేదు. ఆయన చూసినది అంతా భగవంతుడినే; ఆయన విన్నది అంతా భగవంతుడినే; ఆయన తలచినది అంతా భగవంతుడినే, అని ఈ శ్లోకం పేర్కొంటున్నది.


ఈ శ్లోకంలో, శ్రీ కృష్ణుడు, పైన పేర్కొనబడిన స్థాయిల్లో, మూడవ, నాలుగవ స్థాయిలో ఉన్న పరిపూర్ణ సిద్ది సాధించిన యోగుల గురించి మాట్లాడుతున్నాడు.

శుక్రవారం రాశి ఫలితాలు

 శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

14-08-2026 శుక్రవారం రాశి ఫలితాలు


మేషం


వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. సంతాన విద్యా ఫలితాలు నిరుత్సాహ పరుస్తాయి. దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి.      

---------------------------------------


వృషభం


చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వాతావరణం నిరుత్సాహంగా ఉంటుంది.

---------------------------------------


మిధునం


సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు అమలు పరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. 

---------------------------------------


కర్కాటకం


చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగమున అదనపు బాధ్యతలు చికాకు పరుస్తాయి.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

---------------------------------------


తుల


బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. సంతానం పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

---------------------------------------


ధనస్సు


నిరుద్యోగులు నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుటుంబ పెద్దల ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిలువక నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.

---------------------------------------


మకరం


ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిన్నపాటి వివాదాలు తప్పవు. 

---------------------------------------


కుంభం


దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరంగా అనుకూలత సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభఫలితాలు పొందుతారు.

---------------------------------------


మీనం


చిన్ననాటి మిత్రులతో గృహమున విందు వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగమున మీ పని తీరుకు అధికారుల నుండి గుర్తింపు లభిస్తుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలలో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.  

---------------------------------------

13, ఆగస్టు 2026, గురువారం

ప్రతి రోజు చావొద్దు

 “చావు ఒకరోజు వస్తుంది… కానీ ఆసుపత్రి మంచంపై ప్రతి రోజు చావొద్దు!”




“ఏది పడితే అది తిను…

జీవితం ఒక్కసారే వస్తుంది…”


ఈ మాటలు చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు.


కానీ…


షుగర్ వచ్చిన తర్వాత టాబ్లెట్ మీ కోసం వాళ్లు మింగరు.

బీపీ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ వాళ్లు వేయించుకోరు.

కిడ్నీ పాడైతే డయాలసిస్‌కు వాళ్లు వెళ్లరు.

లివర్ దెబ్బతింటే బాధ వాళ్లది కాదు.


బాధంతా మీదే…


ఒకప్పుడు నేనూ ఇదే తప్పు చేశాను.


93 కిలోల బరువు…


ప్రీ-డయాబెటిస్…


గ్రేడ్-3 ఫ్యాటీ లివర్…


కిడ్నీలో రాళ్లు…


నాలుగు నెలలకు ఒకసారి ఆసుపత్రి.


స్కాన్లు…

బ్లడ్ టెస్టులు…

మందులు…

మళ్లీ అదే సమస్య.


అప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది.


“మందులు మార్చాలా… లేక నా జీవితాన్నే మార్చాలా?”


నేను రెండో దారిని ఎంచుకున్నాను.


ఆ రోజు నుంచి ఆసుపత్రిపై కాదు…

నా అలవాట్లపై నమ్మకం పెట్టుకున్నాను.


ఈరోజు వెనక్కి తిరిగి చూస్తే ఒక విషయం అర్థమైంది.


మన శరీరాన్ని చంపేది వయసు కాదు… మన నిర్లక్ష్యం.



నా జీవితాన్ని మార్చిన 10 అలవాట్లు


1. ప్రతి రోజు నడవడం


వాచ్‌లో 10,000 స్టెప్స్ వచ్చాయని కాదు.


బాత్రూమ్‌కు వెళ్లినవి…

ఇంట్లో తిరిగినవి…

వంట చేసినవి…


అవి వ్యాయామం కావు.


రోజుకు కనీసం 30–60 నిమిషాలు ఆగకుండా నడవండి.


మీ గుండె పని చేయాలి.

చెమట పట్టాలి.

అప్పుడే కొవ్వు కరుగుతుంది.



2. ప్లేట్‌లో రంగులు పెంచండి


తెల్ల అన్నం తగ్గించండి.


ఆకుకూరలు…

కూరగాయలు…

పప్పులు…

గుడ్లు…

పెరుగు…

చేపలు లేదా మంచి ప్రోటీన్ ఆహారం పెంచండి.


ప్రతి భోజనంలో…


40% ప్రోటీన్


30% మంచి కార్బోహైడ్రేట్స్


30% కూరగాయలు, ఫైబర్


మీ ప్లేట్ మారితే…

మీ రక్తం మారుతుంది.

మీ శరీరం మారుతుంది.



3. చక్కెర ఒక మెల్లి విషం


టీలో వేసే చక్కెర మాత్రమే కాదు…


బిస్కెట్లు…

కూల్‌డ్రింక్స్…

స్వీట్లు…

బేకరీ పదార్థాలు…


ఇవి కూడా శరీరానికి భారమే.


ఒక్క రోజు తింటే ఏమీ కాదు.


కానీ…

రోజూ తింటే శరీరం నిశ్శబ్దంగా కూలిపోతుంది.



4. రాత్రి భోజనం త్వరగా ముగించండి


సాధ్యమైతే సాయంత్రం 7 గంటలలోపు.


అవకాశముంటే వారంలో కొన్ని రోజులు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి.


శరీరానికి కూడా విశ్రాంతి అవసరం.



5. నిద్రను ఎప్పుడూ తక్కువ అంచనా వేయొద్దు


మొబైల్‌కు ఛార్జింగ్ పెడతాం.


కానీ మన శరీరానికి ఛార్జింగ్ అయిన నిద్రను దూరం చేస్తున్నాం.


రోజుకు 7–8 గంటలు నిద్రపోండి.


నిద్రే శరీరానికి సహజ వైద్యుడు.



6. యోగా… ధ్యానం… శ్వాస


రోజుకు 10 నిమిషాలు అయినా కళ్లుమూసుకుని ప్రశాంతంగా కూర్చోండి.


ప్రాణాయామం చేయండి.


ధ్యానం చేయండి.


మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.



7. కోపం తగ్గించండి


ఇంట్లో గొడవలు…

ఆఫీసులో ఒత్తిడి…


ఇవి కూడా ఒక రకమైన విషమే.


ఒత్తిడి పెరిగితే…


బీపీ పెరుగుతుంది.


బరువు పెరుగుతుంది.


షుగర్ ప్రమాదం పెరుగుతుంది.


మనసు ప్రశాంతంగా ఉంటే సగం వ్యాధులు దూరమవుతాయి.



8. ఉప్పు తగ్గించండి


అధిక ఉప్పు అంటే…


అధిక బీపీ…


శరీరంలో నీరు నిల్వ…


గుండెపై ఒత్తిడి…


రుచికోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దు.



9. నీళ్లు తాగండి… శరీరాన్ని కదిలించండి


లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఎక్కండి.


దగ్గర దూరాలకు నడవండి.


ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవద్దు.


ప్రతి గంటకోసారి లేచి కదలండి.


శరీరం కదిలితేనే జీవితం కదులుతుంది.



10. మీ కుటుంబానికి మీరు అవసరం


మీరు అనారోగ్యానికి గురైతే…


ముందుగా ఏడ్చేది మీ అమ్మ.


నిద్రపోకుండా చూసేది మీ భార్య.


భయపడేది మీ పిల్లలు.


మీరు ఆరోగ్యంగా ఉంటేనే…


మీ కుటుంబానికి వెన్నెముక.


డబ్బు సంపాదించడం గొప్ప కాదు.


ఆ డబ్బును ఆసుపత్రుల్లో ఖర్చు పెట్టకుండా ఉండడం గొప్ప.



చివరిగా…


నేను డాక్టర్‌ను కాదు.


కానీ…


ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న మనిషిని.


మందుల విలువ తెలిసిన మనిషిని.


ఆరోగ్యం పోతే జీవితం ఎలా మారిపోతుందో చూసిన మనిషిని.


అందుకే చెబుతున్నాను…


40 సంవత్సరాలు దాటిన తర్వాత డబ్బు సంపాదించడం మాత్రమే కాదు… ఆరోగ్యాన్ని కూడా సంపాదించాలి.


శరీరాన్ని ప్రేమించండి.


మనసును ప్రశాంతంగా ఉంచండి.


ఆహారాన్ని మందుగా మార్చుకోండి.


లేకపోతే…


ఒక రోజు మందులనే ఆహారంగా తినాల్సి వస్తుంది.


చనిపోవడం తప్పదు…


కానీ చావు వచ్చే వరకు ఆసుపత్రి కారిడార్లలో తిరుగుతూ బతకడం మాత్రం మన చేతుల్లోనే ఉంది.


ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోండి.


“నా ఆరోగ్యం… నా బాధ్యత.”


ఈ వ్యాసం మీకు ఉపయోగపడితే…


ఒక్కసారి షేర్ చేయండి.


మీ ఒక్క షేర్ వల్ల…


ఒక వ్యక్తి బరువు తగ్గవచ్చు.


ఒక కుటుంబం షుగర్ నుంచి బయటపడవచ్చు.


ఒక తండ్రి తన పిల్లలతో ఇంకొన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించవచ్చు.


ఆరోగ్యాన్ని పంచండి… ఈ వ్యాసాన్ని కూడా పంచండి.

ఇది చావు బతుకులమధ్య కొట్టుమిట్టాడుతున్న...

ఓ మనిషి..

తనతో గుండె చెప్పింది🌱🍀🍀🙏

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐

 

శుక్రవారం, ఆగష్టు 14, 2026


శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం- వర్ష ఋతువు

శ్రావణ మాసం - శుక్ల పక్షం

తిథి:విదియ రా8.31 వరకు

వారం:శుక్రవారం(భృగువాసరే)

నక్షత్రం:మఖ ఉ6.55 వరకు

యోగం:పరిఘము మ12.45 వరకు

కరణం:బాలువ ఉ9.14 వరకు తదుపరి కౌలువ రా8.31 వరకు


వర్జ్యం:మ2.45 - 4.19

దుర్ముహూర్తము:ఉ8.15 - 9.08

మరల మ12.30 - 1.20

అమృతకాలం:ఉ6.09 వరకు మరల రా12.09 - 1.43

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 -4.30


సూర్యరాశి:కర్కాటకం

చంద్రరాశి:సింహం


సూర్యోదయం:5.46

సూర్యాస్తమయం:6.24


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


అభిప్రాయాలను తెలపండి

  మీ అభిప్రాయాలను తెలపండి 


మన బ్లాగును దేశ విదేశాల నుండి అనేకమంది వీక్షకులు చూస్తున్నట్లుగా నాకు సమాచారం అందుతున్నది.


 కానీ ఎవరికి ఏ పోస్ట్ నచ్చుచున్నది ఎందుకు నచ్చుచున్నది ఏ పోస్ట్ నచ్చటం లేదు ఎందుకు నచ్చటం లేదు మొదలైన విషయాలు మాత్రం నాకు తెలియటం లేదు కాబట్టి నేను ప్రతి వారిని కోరేది ఏమిటంటే మీకు ఏ పోస్ట్ నచ్చినా నచ్చకపోయినా దాన్ని  వివరణ ఆత్మకంగా దానికి సంబంధించినటువంటి కామెంట్లు చేయగలరు.


మీరు చేసే కామెంట్ల  ఈ బ్లాగును ఇంకా మంచిగా తీర్చేదించడానికి అనువుగా ఉంటుందన్న విషయం మరచిపోవద్దు 

స్నేహానికి కూడా మాంద్యం

 #######################

*స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది!*

 ######################

వేల మంది పరిచయస్తులు…``` 

కానీ ఒక్క ఫోన్ చేయడానికి ఒక్క స్నేహితుడు కూడా లేని పరిస్థితి! 

ఒకప్పుడు మనిషికి డబ్బు లేకపోతే పేదవాడు అనేవారు. ఇప్పుడు?


డబ్బు ఉంది. ఉద్యోగం ఉంది. మంచి ఇల్లు ఉంది. ఖరీదైన కారు ఉంది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. సోషల్ మీడియాలో వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ… రాత్రి పదకొండు గంటలకు మనసు బాగోలేకపోతే ఫోన్ చేసి “రా… కాసేపు మాట్లాడాలి” అని చెప్పగలిగే స్నేహితుడు లేడు.


ఇదే ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న కొత్త సంక్షోభం. 

Friendship Recession. అంటే ఆర్థిక మాంద్యం కాదు… స్నేహాల మాంద్యం.


అమెరికాలో 1990లో కేవలం 3 శాతం మంది మాత్రమే తమకు ఒక్క సన్నిహిత స్నేహితుడు కూడా లేడని చెప్పారు. 2021 నాటికి ఆ సంఖ్య 12 శాతానికి చేరింది. ఇదే సమయంలో 10 మందికి పైగా సన్నిహిత స్నేహితులున్నవారి శాతం 33 నుంచి 13కి పడిపోయింది.


తాజా 2024 గణాంకాలను చూస్తే పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా కనిపిస్తోంది. సన్నిహిత స్నేహితులు లేరని చెప్పేవారి శాతం 17కి చేరినట్టు తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.


అంటే…

సోషల్ నెట్‌వర్క్ పెరుగుతోంది.

సోషల్ కనెక్షన్ తగ్గుతోంది.


ఇదే అసలు విషాదం.


ఫేస్‌బుక్‌లో 5 వేల మంది… కానీ మనసులో ఒక్కరూ లేరా?


ఇరవై, ముప్పై ఏళ్ల క్రితం స్నేహం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అవసరం ఉండేది కాదు.


టీ కొట్టులో కూర్చుంటే పక్కన కూర్చున్న వ్యక్తితో మాట కలిసేది.


బస్సులో ప్రయాణిస్తే పక్క సీట్లో ఉన్నవారితో పరిచయం అయ్యేది.


కాలేజీలో, ఆఫీసులో, క్లబ్‌లో, ఆట మైదానంలో… ఎక్కడైనా మనుషులు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు.

అలా పరిచయం స్నేహంగా మారేది.

స్నేహం అనుబంధంగా మారేది.


ఇప్పుడు?

కాఫీ షాపులో పక్క టేబుల్‌లో ముగ్గురు కూర్చున్నారు.

ముగ్గురి చేతుల్లో మూడు ఫోన్లు.

ఒకరు ఇన్‌స్టాగ్రామ్‌లో.

మరొకరు యూట్యూబ్‌లో.

ఇంకొకరు వాట్సాప్‌లో.

ముగ్గురు మనుషులు ఒకే టేబుల్ దగ్గర ఉన్నారు.

కానీ ముగ్గురు మూడు ప్రపంచాల్లో ఉన్నారు.

ఇది కేవలం అమెరికా కథ కాదు.

మన నగరాల్లో కూడా ఇదే మార్పు కనిపిస్తోంది.


పరిచయాలు పెరిగాయి.

కాంటాక్ట్స్ పెరిగాయి.

ఫాలోవర్లు పెరిగారు.

వాట్సాప్ గ్రూపులు పెరిగాయి.

కానీ…

“నిజంగా నా మనిషి ఎవరు?” అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలిగేవారి సంఖ్య తగ్గుతోంది.```

*friendship recession*```

ఒంటరిగా తినడం కూడా ఒక సంకేతమే!

అమెరికాలో ఒంటరిగా భోజనం చేసే వారి సంఖ్య చాలా కాలంగా పెరుగుతోంది.

2023లో దాదాపు ప్రతి నలుగురు అమెరికన్ పెద్దల్లో ఒకరు—26 శాతం—తాము ముందు రోజు రోజంతా భోజనాలన్నీ ఒంటరిగానే చేశామని చెప్పారు. 2003తో పోలిస్తే ఇది 50 శాతానికి పైగా పెరుగుదల.


ఇది “ఒంటరిగా తినడం తప్పు” అనే విషయం కాదు.

ఒక్కోసారి ఒంటరిగా కాఫీ తాగడం, భోజనం చేయడం, సినిమా చూడడం చాలా ఆరోగ్యకరమైన వ్యక్తిగత సమయం కావచ్చు.

కానీ ఒక సమాజంలో కలిసి తినే సంస్కృతి తగ్గిపోవడం మాత్రం ఒక పెద్ద సామాజిక మార్పుకు సంకేతం.

ఎందుకంటే భోజనం అనేది కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు.

అది సంభాషణ.

అది అనుబంధం.

అది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే ఒక చిన్న సామాజిక ఆచారం.

అందుకే ప్రపంచ సంతోష నివేదికలు కూడా ఇతరులతో కలిసి భోజనం చేసే అలవాటుకు మెరుగైన శ్రేయస్సుతో సంబంధం ఉందని చూపిస్తున్నాయి.


మనకు స్నేహితులు లేరా? లేక సమయం లేదా?

ఇది అసలు ప్రశ్న.


నిజానికి చాలామందికి స్నేహితులు కావాలనే ఉంటుంది.

కానీ సమయం ఉండదు.

ఉదయం ఆఫీసు.

సాయంత్రం ట్రాఫిక్.డ

ఇంటికి వచ్చేసరికి అలసట.

మిగిలిన సమయం ఫోన్.

వీకెండ్ వస్తే వ్యక్తిగత పనులు.

అలా నెలలు గడుస్తాయి.

తర్వాత…

“అరే! వాడితో మాట్లాడి చాలా కాలమైపోయింది కదా!”

అని గుర్తొస్తుంది.

కాల్ చేయాలనిపిస్తుంది.

కానీ…

“ఇప్పుడు చేస్తే ఏం అనుకుంటాడు?”

అని ఆలోచిస్తాం., లేదా వాడు చేయచ్చు కదా అని ఇగో 

అదే స్నేహానికి మొదటి శత్రువు.

సమయం లేకపోవడం కాదు.

స్నేహానికి సమయం కేటాయించకపోవడం.

సోషల్ మీడియా మనల్ని కలిపిందా? విడదీసిందా?

సోషల్ మీడియా వచ్చినప్పుడు ప్రపంచం దగ్గరైపోతుందని అనుకున్నాం.

నిజమే.

దూరంగా ఉన్న మనిషిని ఒక్క క్షణంలో పలకరించగలిగాం.

కానీ ఒక విచిత్రమైన పరిణామం జరిగింది.

మనకు ఇప్పుడు ఎక్కువ మంది పరిచయం.

తక్కువ మంది స్నేహితులు.

వందల మంది పోస్టులు చూస్తున్నారు.

వేల మంది మన పోస్టులు చూస్తున్నారు.

కానీ మన బాధను చూసేవారు ఎంతమంది?

మన విజయాన్ని నిజంగా సంతోషించేవారు ఎంతమంది?

మన ఓటమిలో మన పక్కన నిలబడేవారు ఎంతమంది?

ఇదే అసలు స్నేహానికి పరీక్ష.


లైక్ కొట్టేవాడు స్నేహితుడు కాదు.

కామెంట్ చేసేవాడు స్నేహితుడు కాదు.

ప్రతిరోజూ మెసేజ్ చేసేవాడు కూడా తప్పనిసరిగా స్నేహితుడు కాదు.

మనకు ఏమీ ఇవ్వలేని సమయంలో కూడా మనతో ఉండేవాడే స్నేహితుడు.

ఒంటరితనం కేవలం భావోద్వేగ సమస్య కాదు.

ఇక్కడే ఈ విషయం మరింత సీరియస్ అవుతుంది.

అమెరికా సర్జన్ జనరల్ 2023లో సామాజిక అనుబంధం లేకపోవడం ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని హెచ్చరించారు. వారి నివేదిక ప్రకారం ఒంటరితనం, సామాజిక దూరం గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్, డిమెన్షియా, ఆందోళన, డిప్రెషన్‌తో సంబంధం కలిగి ఉన్నాయి. సామాజిక అనుబంధం లేకపోవడం వల్ల అకాల మరణ ప్రమాదం కూడా పెరుగుతుంది.


“రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం” అనే ప్రసిద్ధ పోలిక కూడా ఇదే నివేదిక నుంచి వచ్చింది.

అయితే దీన్ని “ఒంటరితనం = రోజూ 15 సిగరెట్లు” అనే వైద్య సమీకరణంగా తీసుకోవడం సరికాదు. ఇది అకాల మరణ ప్రమాదాన్ని పోల్చి చెప్పే ఒక ఆరోగ్య హెచ్చరిక.


అంటే…

స్నేహం ఒక విలాసం కాదు.

మనిషి ఆరోగ్యానికి అవసరమైన సామాజిక పోషకం.

80 ఏళ్ల పరిశోధన చెప్పిన విషయం ఇదే!


డబ్బు సంపాదించాలి.

కెరీర్‌లో ఎదగాలి.

పేరు తెచ్చుకోవాలి.

స్థానం సంపాదించాలి.

ఇవన్నీ జీవితంలో అవసరమే.


కానీ దాదాపు ఎనిమిది దశాబ్దాలుగా సాగుతున్న Harvard Study of Adult Development మనిషి దీర్ఘకాలిక సంతోషం, ఆరోగ్యంతో మంచి సంబంధాల ప్రాముఖ్యతను పదేపదే చూపించింది.


అంటే చివరికి మనిషి జీవితాన్ని నిలబెట్టేది బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే కాదు.

ఎవరితో జీవించాం?

ఎవరిని ప్రేమించాం?

ఎవరికి మనసు విప్పి మాట్లాడాం?

మన కష్టకాలంలో ఎవరు మన పక్కన నిలబడ్డారు?

అవే ముఖ్యమైన ప్రశ్నలు.


ఒకప్పుడు స్నేహం కోసం గంటలు కేటాయించేవాళ్లం…

మన తరం గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది.

సాయంత్రం ఇంటి ముందు నాలుగు కుర్చీలు.

ఒకడు టీ తీసుకొస్తాడు.

మరొకడు బిస్కెట్లు తెస్తాడు.

మరొకడు ఏదో రాజకీయ వాదన మొదలుపెడతాడు.

రాత్రి ఎప్పుడైందో తెలియదు.

ఇప్పుడు అదే నలుగురు స్నేహితులు ఒక వాట్సాప్ గ్రూపులో ఉన్నారు.

రోజుకు వంద మెసేజీలు వస్తాయి.

కానీ నాలుగు నెలలుగా ఎవరూ ఒకరిని ఒకరు కలవలేదు.

టెక్నాలజీ మన సంభాషణను పెంచింది.

కానీ మన అనుబంధాన్ని పెంచలేదు.

స్నేహానికి కూడా “మెయింటెనెన్స్” కావాలి

కారు సర్వీసింగ్ చేయాలి.

ఇంటికి పెయింటింగ్ చేయాలి.

బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలి.

శరీరాన్ని వ్యాయామంతో చూసుకోవాలి.

మరి స్నేహాన్ని?


దానిని మాత్రం “అది అలాగే ఉంటుంది” అని వదిలేస్తాం.


అలా ఉండదు.

ఎప్పుడో కలిసిన స్నేహితుడికి ఒక ఫోన్ చేయాలి.

“ఎలా ఉన్నావు?” అని అడగాలి.

అవసరం లేకపోయినా కలవాలి.

పాత గొడవలు ఉంటే కొన్ని మర్చిపోవాలి.

మన స్నేహితుడు కష్టంలో ఉన్నప్పుడు అతని దగ్గరకు వెళ్లాలి.

ఎందుకంటే…

స్నేహం కూడా ఒక మొక్కలాంటిదే.

నీళ్లు పోయకపోతే ఎండిపోతుంది.

చివరికి మనిషి ఏం మిగుల్చుకుంటాడు?

ఇల్లు ఉండొచ్చు.

డబ్బు ఉండొచ్చు.

పదవి ఉండొచ్చు.

పేరు ఉండొచ్చు.


కానీ జీవితంలో ఒక దశకు వచ్చాక మనిషి వెనక్కి తిరిగి చూసుకుంటాడు.


అప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్‌తో మాట్లాడలేడు.

పదవితో నవ్వలేడు.

ఫాలోవర్లతో కౌగిలించుకోలేడు.

అప్పుడు గుర్తొచ్చేది…

“ఆ రోజుల్లో మనం ఎంత నవ్వుకున్నాం!”

అని చెప్పగలిగే మనుషులే.

అందుకే ఈ “Friendship Recession” కథనం కేవలం అమెరికా గణాంకాల కథ కాదు.

మన ఇళ్లలోకి కూడా నెమ్మదిగా వస్తున్న ఒక సామాజిక మార్పు గురించి హెచ్చరిక!


మన దగ్గరున్న మంచి స్నేహితుడిని కోల్పోయిన తర్వాత కొత్త స్నేహితుడిని సంపాదించడం కష్టం.


అందుకే…

ఈరోజే ఒక స్నేహితుడికి ఫోన్ చేయండి.

ఎటువంటి పని లేకుండా.

ఎటువంటి అవసరం లేకుండా.

కేవలం…

“ఏరా… ఎలా ఉన్నావ్?”

అని అడగండి.

బహుశా ఆ ఒక్క ఫోన్ కాల్ మీ స్నేహితుడికే కాదు…

మీ జీవితానికీ అవసరమై ఉండొచ్చు.

పరిచయాలు జీవితాన్ని నింపవు.

నిజమైన స్నేహాలే నింపుతాయి.

స్నేహితులను సంపాదించండి.

ఉన్న స్నేహాలను కాపాడుకోండి.

ఎందుకంటే డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు.

పదవి పోతే మళ్లీ రావచ్చు.


కానీ…

మనసుకు దగ్గరైన ఒక నిజమైన స్నేహితుడు దూరమైతే ఆ ఖాళీని పూరించడం అంత సులభం కాదు.

పెయిను కిల్లరేసి

 పెయిను కిల్లరేసి పిట్టలా తిరిగేస్తె

ముడుకు లరిగి మీరు మూలకెళ్ళు

నమ్ము హోమియోను నయమౌను నిజముగా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కీళ్ళనొప్పులు, స్పాండిలైటిస్ (మెడ నొప్పి), సయాటికా, నడుం నొప్పి, అలాగే ఇతర నొప్పులకూ పెయిన్ కిల్లర్లూ, పై పూతలు(పెయిన్ బామ్, ఆయింట్ మెంటూ), స్టెరాయిడ్ ఇంజక్షన్లూ వాడేసి, సమస్య తగ్గిపోయిందనుకుని ఆనందంగా తిరిగేస్తే, అది మీ పిచ్చితనమే! ఏడుస్తున్న పిల్లాడి మూతికి స్టిక్కర్ అంటించి, ఏడుపు సౌండు లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉన్నాడనుకోవడం ఎంత మూర్ఖత్వమో, పెయిన్ కిల్లర్ తో సమస్య తగ్గిందనుకోవడం కూడా భ్రమే! క్రమంగా ముడుకులు,కీళ్ళు అరిగిపోయి, పూర్తిగా కదలలేని పరిస్థితికి చేరుకుంటారు! అంతేగాక తప్పుడు ఇంగ్లీషు మందుల వాడకంతో అల్సర్, కిడ్నీ ట్రబుల్, బి.పి, షుగర్, లివర్ ప్రోబ్లమ్, కేన్సర్ మొదలైన జబ్బులు అదనపు బోనస్ గా వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది! కాబట్టి హోమియో మందులు వాడుకుంటే నాలుగు రోజులు సమయం పట్టినా, చక్కగా కీలు సందులో కార్టిలేజ్ తయారై, కీలు సక్రమంగా రిపేరై, సహజంగా తిరగ గలుగుతారు! ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు! 

సకురు అప్పారావూ ఇది నిజంగా నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

గురువారం🌹* *🌷13ఆగష్టు2026🌷* *దృగ్గణిత పంచాంగం*

  


  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌹గురువారం🌹*

 *🌷13ఆగష్టు2026🌷*  

  *దృగ్గణిత పంచాంగం*                  


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - శుక్లపక్షం* 


*తిథి : పాడ్యమి* రా 08.41 వరకు ఉపరి *విదియ*

*వారం  : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఆశ్లేష* ఉ 06.06 ఉపరి *మఖ* రా.తె 04.38 వరకు

*యోగం : వరీయాన్* మ 12.16 వరకు ఉపరి *పరిఘ*

*కరణం  : కింస్తుఘ్న* ఉ 09.50 *బవ* రా 08.41 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు;*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 05.00*

అమృత కాలం  : *రా 02.23 - 03.53*

 అభిజిత్ కాలం  : *ప 11.47 - 12.38*

*వర్జ్యం    :సా 05.22- 06.52*

*దుర్ముహూర్తం  : ఉ 10.05 - 10.56 మ 03.10 - 04.01*

*రాహు కాలం  : మ 01.48- 03.23*

గుళికకాళం      : *ఉ 09.02 - 10.37*

యమగండం    : *ఉ 05.51 - 07.26*

సూర్యరాశి : *కర్కాటకం*                               

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*

సూర్యోదయం :*ఉ 05.59* 

సూర్యాస్తమయం :*సా 06.43*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.51- 08.23*

సంగవ కాలం       : *08.23- 10.56*

మధ్యాహ్న కాలం   : *10.56 - 01.28*

అపరాహ్న కాలం  : *మ 01.28-04.01*

*ఆబ్ధికం తిధి       : శ్రావణ శుద్ధ పాడ్యమి*

సాయంకాలం     : *సా 04.01- 06.34*

ప్రదోష కాలం     : *సా 06.34- 08.49*

రాత్రి కాలం        : *రా 08.49- 11.50*

నిశీధి కాలం       : *రా 11.50 - 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.21 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

   *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సౌఖ్యమా... అదెక్కడ?

  సౌఖ్యమా... అదెక్కడ?


జీవితానికి రెండే రెండు ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఆరాటం, మరొకటి పోరాటం. అన్ని సందర్భాల్లోనూ, అన్ని విషయాల్లోనూ ఆరాటమే. ఆశ, కోరిక, తపన- ఇలా ఎన్నో మూలాలున్నాయి దానికి. ఉదరపోషణార్థం పనిచేసుకోవడం, ఉద్యోగ వృత్తుల్లో నిమగ్నమవడం సమంజసమే. పదవులకోసం, డబ్బుకోసం, కీర్తికోసం దొడ్డిదారిన పాకులాడటమే మనుగడకు అనర్థమవుతుంది. 


జీవించడం అనేది ఒక కళ. ఆ కళ తెలిసినవాడు సుఖపడతాడు. తెలియనివాడు అగాధంలో పడిపోతాడు. ఈ అనంతకాలంలో మనిషి జీవితకాలం అతిస్వల్పం. వేదాంతపరంగా చెప్పాలంటే జీవితం క్షణభంగురం. ఈ సత్యం తెలిసి కూడా సామాన్యుల నుంచి, మాన్యులవరకూ దేనికోసమో నిత్యం వెంపర్లాడుతూనే ఉంటారు. 


మనిషి ఏడుస్తూ పుట్టాడంటే.. అందర్నీ ఏడిపించడానికి కాదు, ఆనందింప చేయడానికి, నవ్వించడానికి. పాపాలు నవ్వుతూ చేస్తే ఏడుస్తూ ఫలితం అనుభవించాలన్న సత్యం మనిషి గ్రహించడంలేదు. నూతిలో కప్ప అదే లోకం అనుకున్నట్లు- మనిషి తన భార్య, పిల్లలు బాగుంటే అదే సుఖమనుకుంటున్నాడు. సంఘజీవినని మర్చిపోతున్నాడు. సమాజంతో, గ్రామంతో, రాష్ట్రంతో, దేశంతో ప్రేమానుబంధం పెంచుకోవాల్సిన బాధ్యత తనపైన ఉంది. ఎందరో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు ఎన్నెన్నో బాధలూ కష్టాలు పడుతుంటారు. ఆపదల పొదల్లో చిక్కుకుపోయి రోదిస్తున్న వారి వైపు చూడాల్సిన అవసరం మనిషికి లేదా? పరోపకారార్థమిదం శరీరం... అన్న మాట గుర్తుకు రాదా?


సౌఖ్యానికి చిరునామా ఉంది. అది తెలుసుకోవాలి. ధర్మవర్తనలో సుఖముంది. సక్రమార్జనలో సుఖముంది. ప్రేమలో, సేవలో, త్యాగంలో, సంతృప్తిలో సుఖముంది. ప్రతిభను అభినందించి, ప్రోత్సహించడంలో సుఖముంది. మృష్టాన్న భోజనాన్ని కేవలం తానే ఆరగించడం కాదు, పదిమందితో కలిసి పప్పుభోజనం తినడంలో సుఖముంది.


సూది మొన మోపినంత భూమిని కూడా పాండవులకివ్వనన్న అహంకారి దుర్యోధనుడు వెంట ఏం తీసుకుపోయాడు? మనిషి కన్నుమూస్తే ‘అయ్యో, పాపం’ అనిపించుకోవాలి. ‘అమ్మయ్య, శని వదిలింది’ అనిపించుకోకూడదు. అదే మంచి మరణం. ఎంతటి భక్తుడైనా అహంకరిస్తే అంతర్యామి కనికరించడు. గర్వం సర్వం హరించాకగానీ హరి కరిని కాపాడలేదు.


జీవితం ఓ అమూల్య గ్రంథం. దాన్ని చదివే ఆసక్తి ఉన్నవాడు, గ్రహించగలిగినవాడు విజేత అవుతాడు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి గర్వపడాలి. బతికితే సమాజం గౌరవించాలి. మరణిస్తే శత్రువు కూడా కంటతడి పెట్టాలి. అదీ సుఖజీవనమంటే! మనిషి గెలవవచ్చు, గర్వించకూడదు. భయపడవచ్చు, పారిపోకూడదు. ఓడిపోవచ్చు, కుంగిపోకూడదు. జీవితంలో ఇవన్నీ సహజమే, సహించాలి. పదుగురికి ఉపయోగపడుతూ నడిస్తే బతుకంతా పాటలాగా సాగిపోతుంది.

దక్షిణామూర్తి

                *దక్షిణామూర్తి*

               ➖➖➖✍️

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించి నప్పుడు  ...


ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం...


బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు... ‘బ్రహ్మ జ్ఞానం’ కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు.


అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు.

ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.


ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని!


గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు.


అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.


స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. 


ఉత్తర భాగాన(అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు.


మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించే మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే.*


అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త.


ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు.


శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!


శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం.


దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోతాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.


మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.                 ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి.


దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు.


విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.


ఆ రూపాలు వరుసగా....


శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.


ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.


పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.


సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.


చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి, సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షమునకి అధిష్టానం అయి ఉంటాడు.