24, జులై 2026, శుక్రవారం

ఆకలి లేనివారికోసం

  ఆకలి లేనివారికోసం సులభ యోగాలు - 


 * మిరియాలను నూరి తీసిన రసం గాని మిరియాల కషాయం కాని తీసుకొనుచున్న అగ్నిమాంద్యం , ఆకలి లేకపోవటం వంటి సమస్య తొలగి జీర్ణశక్తి వృద్ది అగును.


 * వేడిగా ఉన్న అన్నం వార్చిన గంజిలో కొంచం పొంగించిన ఇంగువ , సౌవర్చ లవణం కలిపి తాగుచున్న అగ్నిమాంద్యం తొలగును .


 * యవాక్షారం , శొంఠి సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి పూటకు 5 గ్రాముల చొప్పున ఉదయం , సాయంత్రం తీసుకొనుచున్న మంచి ఆకలి కలుగును.


 * బెల్లం , జీలకర్ర సమాన భాగాలుగా కలిపి తినుచున్న ఆకలి పెరుగును .


 * పిప్పళ్లు చూర్ణం చేసి బెల్లముతో కలిపి తీసుకొనుచున్న ఆకలి పెరుగును .


 * కరక్కాయ , పిప్పళ్లు , సౌవర్చ లవణం సమపాళ్లలో తీసుకుని నూరి చూర్ణం చేసి పెరుగు పైన ఉండే నీటితో కలిపి సేవించుచున్న అగ్నిమాంద్యం తొలగి ఆకలి పెరిగి జీర్ణశక్తి వృద్దిచెందును.


         పైన చెప్పిన యోగాలలో మీకు ఏది సులభముగా చేయగలరో చూసుకుని పాటించి అగ్నిమాంద్యం సమస్య నుంచి విముక్తి పొందగలరు.


 అగ్నిమాంద్య సమస్య ఉన్నవారు పాటించవలసిన ఆహారనియమాలు -


 తినవలసినవి -


 తేలికైన పాతబియ్యపు అన్నం , పెసలు , పేలాలు , పెసర కట్టు, చిన్న చేపలు , లేత ముల్లంగి , వెల్లుల్లి , లేత అరటికాయలు , లేత మునగకాయలు , పొట్లకాయ , బీరకాయ , వంకాయ , నక్క దోసకాయ , కాకరకాయ , అల్లం , చుక్కకూర, చెంచలికూర , ఉశిరికాయ , దానిమ్మపండు , నారింజపండు , పలచని మజ్జిగ , తాంబూలం , వేడినీళ్లు సేవించవలెను , తేనె , కారం , నూనె , చేదు , వగరు పదార్థాలు , వ్యాయమం .


 తినకూడనవి -


        కొత్తబియ్యం , చేపలు , బచ్చలికూర , ఎక్కువుగా నీరు తాగరాదు , కంద , ఆలుగడ్డ మొదలగు దుంప కూరలు , నేరేడు పండ్లు , గోధుమలు , పిండివంటలు , మాంసపదార్దాలు , పాలు , పాలతో వండిన పదార్దాలు , చారపప్పు , ఎక్కువుగా నూనె ఉండు పదార్థాలు , పూర్తిగా ఉడకని పదార్ధాలు మరియు అన్నం , మద్యపానం, ముందు తినిన పదార్దాలు పూర్తిగా అరగకముందే మరలా భుజించటం , అమిత భోజనం , నిద్రపోకుండా మేలుకుని ఉండటం, మలమూత్ర నిరోధం .


        పైన చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ ఔషధ యోగాలు వాడుచున్న సమస్య త్వరగా పరిష్కారం అగును.


         

  

 

మానవ ధర్మ చంద్రిక -

 మానవ ధర్మ చంద్రిక -


• ఆవునేతి దీపారాధన జ్ఞానసిద్ధి. నువ్వులనూనె దీపారాధన సంపద వృద్ది. కీర్తి.


• ధర్మ మార్గమున సంపాదించిన ధనం ఇచ్చి కొన్న పూలతో దేవ పూజ చేసిన తన పూర్వులను,7 తరాల వారిని తరిమ్పచేయును .


• తులసి దళాలు సుర్యాస్తమయం తరువాత కోయరాదు.


• చాతుర్మాస వ్రతం - ఆషాడ శుద్ద ఏకాదశి నుండి కార్తీక శుద్ద ఏకాదశి వరకు జరుగునని నిర్ణయ సింధు తెలియచేస్తుంది. ఆ కాలం నందు తులసి మొక్క పెట్టరాదు.


• ఇంట్లో పూజించు విగ్రహాలు 2 లేక 3 అంగుళాల ఎత్తు ఉండవచ్చు.


• ధర్భాసనం గాని , వేడి చర్మం గాని , నూతన వస్త్రం గాని వేసుకొని కుర్చుండాలి . కుశాసనము - పౌష్టికం. కంబలాసనం - దుఃఖ విమోచనం. ఎర్రని ఆసనం - వశ్యధికమ్ . చిత్రాసనము - సర్వార్ధములు .తెల్లని ఆసనములు - శాంతి. కృష్ణ జిననము - జ్ఞాన సిద్ది. పులి చర్మము - మోక్ష సిద్ది. ఏ ఆసనము లేకున్నను ఒక దర్భ నయినా వేసుకొని కూర్చుండ వలెను.


• పచ్చటి పట్టుబట్ట ( పీతాంబరం ) పూజకు శుభం. తెల్లని పట్టుబట్ట శుభప్రదము. రంగులవి. బొమ్మలవి మానసిక చాంచల్యం. అంచుగలవి ధరించాలి. నారపట్టు చాలా మంచిది. ఉత్తమమైన విధావలి దీనికి ఎలాంటి దోషాలు లేవు .


• తమలపాకులు 5,7,10,12 మంచివి. ఒక వక్క తాంబూలంలో పెట్టిన ఆరొగ్యం, 3 వక్కలు శ్రేష్టం .


• నందికి ఏ పక్కనుండి వెళతారో, ఆ పక్కనుండే వెనకకు రావలెను. శివలింగం, నందికి మద్య నుండి రాకుడదు. అలా వచ్చినచో పూర్వ జన్మలో పుణ్యం కుడా పొతుంది.


• శివాలయంలో ప్రదిక్షణలు చేసే విధానం -


చండీ స్వరుడు ఉన్న చోటును అనగా( చండీ స్వరుడు లేకున్నను ) శివాబిషేక జలం బయటకు వచ్చు సోమసుత్రం నుండి ప్రారంబించి ధ్వజస్తంభం వద్దకు, ధ్వజస్థంభము నుండి తిరిగి ప్రదిక్షనముగా సోమసుత్రం వద్దకు , 2.అక్కడనుండి వెనకకు తిరిగి ద్వజస్థంభం వద్దకు. 3. ద్వజస్థంభం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు. 4. తిరిగి వెనుకకు ధ్వజం వద్దకు, 5. ద్వజం నుండి ముందుకు సోమాసుత్రం వద్దకు 6. తిరిగి సోమసుత్రం నుండి వెనకకు ద్వజం వద్దకు 7. ద్వజం నుండి ముందుకు సోమసుత్రం వద్దకు ,8. సోమసుత్రం నుండి ద్వజం వద్దకు 9. అక్కడనుండి శివాలయంలో ద్వజం ఎడమపక్కనుండి వెళ్లాలి . దీనినే చండ ప్రదిక్షణ అంటారు. ఇలా ఒకసారి చేస్తే శివునికి 30 వేల ప్రదిక్షణలు చేసిన పుణ్యము.


• మొదట నందీశ్వరుని అనుమతితో శివున్ని దర్శించుకోవాలి. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమచేయి ఉంచి వెనక బాగమున కుడి చేయి ఉంచి " ఓం హర హర శివ శివ " యంటూ శివుని దర్శించి ఆలయంలో ప్రవేశించాలి.


• రుద్రాక్ష దారణ వలన పునర్జన్మ ఉండదు. ఆరొగ్యం కలుగును. రుద్రాక్ష ముఖము నందు రుద్రుడు , పుచ్ఛము నందు విష్ణువు అధి దైవతములు , ఏకాదశ ముఖములు గల రుద్రాక్ష ఏక ముఖముతో సమానము .


• విబుతి దారణ వలన మానశిక ప్రశాంతత , ధైర్యము, ఆరోగ్యము, గ్రహపీడ, అకాల మరణములకు రక్షణ, రుద్రత్వం లబిస్తుంది.


• రుద్రునికి అబిషేక ద్రవ్యములు -

ఆవుపాలతో అభిషేకించిన సర్వ సౌఖ్యములు , ఆవు పెరుగుతో ఆరొగ్యం, సర్వసౌఖ్యములు, ఆవు నెయ్యితో ఐశ్వర్య వృద్ది, పంచదారతో దుఖ నాశనం,తేనెతో తెజోవ్రుద్ది, భస్మ జలంతో మహాపాపహరం, గందోధకంతో పుత్రలాభం, పుష్పోధకంతో భులాభం, బిల్వజలంతో బోగాబాగ్యాలు, దుర్వోధకం ( పారే నీరు ) తొ నష్టద్రవ్య ప్రాప్తి, నువ్వులనూనెతో అపంరుత్యుహారం రుద్రాక్షోధకంతో మహావైశ్వర్యమ్, సువర్ణ జలంతో ధరిద్రనాశనం , అన్నంతో రాజ్యప్రాప్తి, ఆయుర్వృద్ధి, ఆయుర్వృద్ధి, సుఖజీవనం, ద్రాక్షరసంతో సకల కార్యసిద్ది, ఖర్జురఫలంతో శత్రువులకు హాని , కస్తూరి జలంతో చక్రవర్తిత్వం, నవరత్నజలంతో ధాన్యం , గృహం, గోప్రాప్తి, మామిడిపండ్ల రసంతో ధీర్గవ్యాధి నాశనం, పసుపునీళ్ళతో మంగళ ప్రధం . ఆయాద్రవ్యములతో శివుని అభిషేకించిన ఆయాఫలములు లభించును.


• విభూతితో శివుని అభిషేకించిన అష్టైశ్వర్యములు కలుగును.


• నల్లనువ్వులచే అర్చించిన శివుడు శత్రు నాశనం కలగచేయును .


• శ్వేత ( తెలుపు ) అక్షతలతో శివుని అర్చించిన మోక్షప్రాప్తి - శివపాదోధకం తాగిన మోక్షము కలుగును.


• దేవుడు ఊరేగింపుకు వచ్చినపుడు , పెద్దలు ను నడిపించుకు వస్తున్నప్పుడు స్వాగతం చెప్పుటకు ప్రతి ఇంటి ముందర బిందెడు నీళ్లు నిలువుగా పొయాలి.


• ప్రతి గురువారం ఉదయం పాలు, నీళ్లు కలిపి తులసి చెట్టుకి పొస్తే లక్ష్మి నిలయం.


• గురువారం రావి చెట్టుకి సాయంత్రం పాలు , నీళ్లు కలిపి పొస్తే కార్యసిద్ధి.


• వరాన్వేషణకు మృగశిర నక్షత్రం మంచిది.


• శ్రీ శివాబిషేకం చేసిన నీళ్లు పోను గొట్టము నుండి బయటకు వచ్చిన తీర్థం మనము తాకి నెత్తిన చల్లుకోరాదు. అది చండీ స్వరునికి మాత్రమే అర్హత.


• యాగంటి బసవన్న దర్శనం - శని భాధ నివారణం.


• చైత్రమాసంలో సర్వ దేవతలకు " ధవనంతో " పూజ మంచిది అని ధర్మ సింధు చెప్తుంది.


• స్త్రీలు ఎల్లవేళలా పాపిట సింధూరం ధరించడం వలన అక్షయ సౌబాగ్యం కలుగుతుంది.


• మధురలో జననం వలన, శ్రీకాళహస్తి లొ అర్చన వలన , శ్రీశైలం లొ శిఖరదర్శనం వలన , కాశిలో మరణం వలన, అరుణాచలం లొ స్మరణ వలన వీటిలో ఏ ఒక్కటి ఆచరించినా మోక్షర్హత పొందుతారు. మంచి బుద్ధితో సన్మార్గాన్ని పొందండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగండి.


• ఉత్తర దిక్కుకి ప్రయాణం చేస్తున్నప్పుడు" ఓం ఖడ్గీ నమః " అను నామస్మరణతో సాగండి. అరిష్టాలు తోలుగుటకు" ఓం నమో నారాయణాయా నమః " అను మంత్రము జపించండి.


• అప్పు పుచ్చుకొనుట - అప్పు ఇచ్చుట . బుదవారం చేయరాదు . మంగళవారం సంక్రమణ దినం. హస్తా నక్షత్రం రోజున అప్పులిచ్చుట వలన తిరిగి రావడం చాలా కష్టం. ఆ రొజులలొ అప్పు చేయకుండా ఉండటం చాలా ఉత్తమం .


• జీవితం తొ కాలమే అదృష్టాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలకు అదే మూలం . జీవితం లొ నిత్య వసంతుడే కాలం.


• పాలు కారే చెట్లు, ముండ్ల చెట్లు, చింత, మునగ,కుంకుడు మొదలగునవి చెట్లు ఇంట్లో ఉండకూడదు .


• బియ్యం లేక గొధుమ నూకలు ప్రతి మంగళవారం గుప్పెడు పెరటిలో చల్లి భూతదయ చూపిన ధాన్యలక్ష్మి అనుగ్రహం కలుగును.


• విష్ణు సహస్రనామం ప్రతిధ్వనించిన చోటు దుష్ట శక్తులకు అది నిర్మూలనము.


• ఆయా నక్షత్రాల వారు ఇంటి ఆవరణలో గాని , రోడ్డు పైన గాని వృక్షము నాటి పోషిస్తే చాలా మంచిది.


అశ్వని - జీడి మామిడి.భరణి - దేవదారు .కృత్తిక - మేడి చెట్టు.రోహిణి - నేరేడు .మృగశిర - మారేడు .ఆర్ద్ర - చింత చెట్టు.పునర్వసు - గన్నేరు .పుష్యమి - పిప్పిలి ( రావి చెట్టు ).ఆశ్లేష - భోప్పాయి.మాఘ - మర్రి.పుబ్బ - మొదుగ .ఉత్తర - జువ్వి .హస్త - కుంకుడు.చిత్త - తాడి చెట్టు.స్వాతి - మద్ది.విశాఖ - మొగలి.అనురాధ - పొగడ.జైష్ట - కొబ్బరి.మూల - వేగిస .పూర్వా షా డ - నిమ్మ .ఉత్తరాషాడ - పనస.శ్రవణం - జిల్లెడు.ధనిష్ట - జమ్మిశతబిషం - అరటి.పుర్వాబాద్రా - మామిడి.ఉత్తరాబాద్రా - వేప .రేవతి - విప్పచెట్టు.


• శివుణ్ణి గరికతో పూజిస్తే ఆయుషు , ఉమ్మెత్త పులతో పుజ చేస్తే సంతానం. అవిసె పూలతో పూజ చేస్తే కీర్తి. తులసి దళాలతో పూజిస్తే భుక్తి, ముక్తి . జిల్లెడు పూలతో పూజిస్తే శత్రుజయం. కరవీర( గన్నేరు ) పూలతో పూజిస్తే రోగాశాంతి, మంకెన. పూలతో పూజిస్తే అలంకారములు జాజిపులతో పూజిస్తే వాహనలాభం కలుగుతాయి.


• విష్ణువును అవిసె పూలతో పూజిస్తే పదివేల యజ్ఞఫలం . కదంభ పూలతో పూజిస్తే స్వర్గసుఖం.


• గణపతిని ఎరుపు రంగు పూలతో పూజిస్తే మంచిది . గరికతో పూజిస్తే అన్ని కష్టములు తీరును


• సర్వ వాస్తు దోషాలకు తెల్ల జిల్లెడు వినాయకుని పూజా మందిరం లొ ఉంచాలి.


• సిద్ది యొగములు :


మంగళవారం తదియ, త్రయోదశి బుధువారం విదియ, సప్తమి : గురువారం పంచమి, దశమి : శుక్రువారం పాడ్యమి, ఏకాదశి కార్యనుకులత, విశేష ఫలప్రధయకత.


• ముఖ్యంగా ప్రయాణానికి పనికి రానివి.:


విదియ మంగళవారం , సప్తమి సొమవారం, చవితి ఆదివారం, పంచమి గురువారం, తదియ శుక్రవారం షష్టి శనివారం.


• బూడిద గుమ్మడికాయ మంగళవారం ఇంటి సింహద్వారానికి కట్టిన సకల ద్రుష్టిదోషాలు పొతాయి.


• మారేడు చెట్టుకి తొమ్మిది సార్లు ప్రదిక్షణ చేస్తే శివానుగ్రహం లభిస్తుంది.


• తొమ్మిది గురువారములు సుర్యొదయం కాగానే శివ దర్శనం చేసుకుంటే గ్రహాల బాధలు తోలుగుతాయి.


• ఇంట్లో పెళ్లి కి వచ్చిన అమ్మాయి ఉంటే ఆమెకి అనుకూలమైన వరుడు లభించుటకు తరచు లక్ష్మి దేవి పూజ చేయాలి . శ్రీ మహాలక్ష్మి స్తోత్రమే ,శ్రీ సుక్తం పటించాలి .


• శనివారం నాడు ఆంజనేయ స్వామిని 108 తమలపాకులతో సేవిస్తే న్యాయ సమ్మతమైన కొరికలు నెరవేరును.


• షిరిడి సాయిబాబా వారిని గులాబిలతో పుజించి శుభాఫలితం పొందండి.


• గురు, శుక్ర వారాలలో చేతి , కాలి గోళ్లు తీయరాదు. ఆ రెండు రోజులు లక్ష్మీదేవికి ఇష్టమైనవి.


• శివాలయానికి వెళ్లి 108 ప్రదక్షిణలు చేసి , తొమ్మిది కొబ్బరిబొండాలు సమర్పిస్తే త్వరలో ఋణ విముక్తులు అవుతారు.


• ధన విషయం లొ సంపత్తార, ప్రయాణికులకు క్షేమతార, కార్యజయానికి సాధనతార, వివాహానికి మిత్రతార. వైద్య విషయానికి పరమ మిత్రతార లు మంచివి. శుభప్రదం.


• గృహప్రవేశ సమయంలో గాని , గృహ ప్రవేశం అయిన 27 రోజులలోపు గాని శ్రీ సూక్త పారయణంవిష్ణు సహస్రనామ పారయణం తప్పనిసరిగా చేయాలి . అప్పుడా ఇల్లు దేవతానిలయం అవుతుంది.


• కుజదోష నివారణకు , నొప్పులకు, సంతతికి , అన్యోన్యతకు శ్రీ సుబ్రమణ్య స్వరుని ఆరాధన చేయాలి .


• దేవుని పూజకు ఏ గదిలో వీలైతే ఆ గదిలో ఈశాన్య తూర్పు దిశ లేక ఉత్తర దిశలొ అమర్చుకోవాలి.


• పితృ కార్యముల రోజు కుంకుడు కాయలతో తల స్నానం చేయ రాదు.



         

తిరుమల వైభవం

 🔔 *తిరుమల వైభవం* 🔔


 *ఓం నమో వేంకటేశాయ 🙏*


రామానుజుల కాలంలో తిరుమల మూలమూర్తి శివుడని, అమ్మవారని, వీరభద్రుడని రకరకాల వాదనలు ఉండేవి. వాగ్వాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొని ఉండేది. అన్నింటికంటే, మూలమూర్తిని శివునిగా భావించే శైవుల వాదం ప్రబలంగా ఉండేది. రామానుజులవారు అప్పటి పాలకుడు, తన శిష్యుడైన యాదవరాజు సమక్షంలో పురాణ, ఇతిహాసాల ప్రామాణికతతో, హేతుబద్ధమైన తర్కంతో ఆ మూలమూర్తి విష్ణుమూర్తి అవతారమైన శ్రీ వేంకటేశ్వరుడేనని సాక్ష్యాధారాలతో నిరూపించారు.


🍃🌹రామానుజులవారి తర్కాన్ని యాదవరాజు విశ్వసించాడు గానీ, కరుడుగట్టిన శైవులు మాత్రం నమ్మలేదు. వాదోపవాదాలతో విసిగిపోయిన యాదవరాజు, రామానుజుల చొరవతో వైష్ణవులను, శైవులను సమావేశపరచగా వారిద్దరూ ఒక ఒప్పందానికి వచ్చారు. దాని ప్రకారం ఒకరోజు సుదర్శన చక్రం, శంఖం వంటి వైష్ణవ చిహ్నాలను చేయించి భగవంతుని సన్నిధిలో ఉంచారు.


🍃🌹అలాగే త్రిశూలం, డమరుకం వంటి శైవ చిహ్నాలను కూడా ఆలయంలో ఉంచారు. ఆనాటి రాత్రి కట్టుదిట్టమైన కాపలాతో ఆలయ ద్వారాలు మూసి ఉంచారు. తెల్లవారేసరికి స్వామి ఏ చిహ్నాలను ధరిస్తే అదే అవతారంగా అందరూ అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. ఆరోజు రాత్రి తన తపశ్శక్తితో శ్రీనివాసుణ్ణి సాక్షాత్కారం చేసుకున్న రామానుజులు, శంఖు చక్రాలను స్వీకరించాల్సిందిగా శ్రీవారిని పరిపరివిధాలుగా వేడుకున్నారు.


🍃🌹మరునాడు ఉదయం ఆలయ ద్వారాలు తెరిచేటప్పటికి స్వామివారు కరుణించి ఉభయహస్తాలతో శంఖు-చక్రాలు ధరించి దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. దాంతో శైవుల వాదం వీగిపోయింది. రామానుజులవారు ఆలయానికి మహాసంప్రోక్షణ గావించి, తిరుమల నిర్ద్వంద్వంగా వైష్ణవ క్షేత్రమేనని, అందులో కొలువుండేది సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీనివాసుడేనని దేశమంతటా ప్రచారం చేశారు.


🍃🌹తిరుమల వైష్ణవ క్షేత్రమేనని నిరూపించబడటంతో, వైఖానస ఆగమ కైంకర్యాలు పూర్తిస్థాయిలో జరగడం మొదలయ్యాయి. రామానుజులు పంచరాత్ర ఆగమ సంప్రదాయానికి చెందినవారైనప్పటికీ, ఎలాంటి పక్షపాతం చూపకుండా, అనూచానంగా వస్తున్న ఆలయ ఆచారం ప్రకారం వైఖానస ఆగమ సంప్రదాయాన్నే కొనసాగించారు.




🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

జ్ఞాన జ్యోతి*

 **********నేటి జ్ఞాన జ్యోతి*********. 1. "ఉడుప" అంటే అర్థం - చంద్రుడు. 2."దక్షిణ ద్వారక" అని ఏ క్షేత్రానికి పేరు? - పండరీపురం..3. పండరీపురం లో" భీమానది" ని ఏమని పిలుస్తారు?! - చంద్రభాగానది. 4. శ్రీకృష్ణ పరమాత్మ "పాండురంగస్వామి"గా కొలువైన క్షేత్రం పేరు ఏమి?! - "పండరీ పురం". 5. శ్రీహరి కి యోగనిద్రా కాలం? - ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు 4మాసాలు..6.గ్రామదేవతల తమ్ముడు ? -" పోతురాజు". 7. "ఉడుపి" క్షేత్ర పూర్వ నామం?! - శివళ్ళీ. 8.పూరీ జగన్నాథ స్వామి నైవేద్యాలకోసం వండే బియ్యాన్ని ఏమంటారు ?! - "అమూన్యం".. 9. పూరీ జగన్నాథునికి వున్న ఇద్దరు పిన్ని గార్ల పేర్లు ? - 1. గుండీచా 2. మౌసీమా. 10. "మానస సరోవరం" ఎక్కడ ఉంది?! - చైనాకు చెందిన టిబెట్ ప్రాంతంలో ఉంది..

22, జులై 2026, బుధవారం

సెప్టోలెసెంట్స్

 ‘సెప్టోలెసెంట్స్’ (Septolescents) కోసం ప్రత్యేకంగా, సరికొత్త శైలిలో రూపొందించిన ఒక అద్భుతమైన జీవన ప్రణాళిక (Life Manifesto & Roadmap):

సెప్టోలెసెంట్ విప్లవం: వయసు పెరగడం సహజం.. వృద్ధులైపోవడం మీ ఇష్టం!

రిటైర్మెంట్ కాగానే ఈజీ చైర్‌లో కూర్చుని, శేషజీవితాన్ని కేవలం గడిపేసే పాతకాలపు ఆలోచనలకు ఇక కాలం చెల్లింది. సమాజంలో ఇప్పుడు ఒక కొత్త తరం దూసుకొస్తోంది. వారు 70 ఏళ్లు దాటినప్పటికీ, నూతన ఉత్సాహంతో, సరికొత్త జీవనశైలితో వృద్ధాప్య సూత్రాలను తిరగరాస్తున్నారు. వారే ‘సెప్టోలెసెంట్స్’.


బాల్యం నుండి యవ్వనంలోకి అడుగుపెట్టడాన్ని 'అడోలెసెన్స్' (Adolescence) అంటారు. మరి, 70 ఏళ్ల తర్వాత జీవితాన్ని ఎంతో స్వేచ్ఛగా, అర్థవంతంగా, సంతోషంగా ఒక పండగలా మార్చుకోవడమే ఈ ‘సెప్టోలెసెన్స్’ (Septolescence).

ఈ అద్భుతమైన జీవనశైలిని మీ సొంతం చేసుకోవడానికి ఇక్కడ ఒక సరికొత్త రోడ్‌మ్యాప్ ఉంది.


సెప్టోలెసెంట్ జీవనశైలికి 4 ముఖ్య స్తంభాలు

సెప్టోలెసెంట్‌గా పరిపూర్ణమైన జీవితాన్ని గడపడానికి, రోజువారీ జీవితంలో ఈ నాలుగు కోణాలను సమతుల్యం చేసుకోవాలి.


1. మేధో శక్తి (ఎప్పుడూ కొత్తగా ఆలోచించడం)

సెప్టోలెసెంట్స్ తమ మెదడుకు ఎప్పుడూ విశ్రాంతి ఇవ్వరు. వీరికి రిటైర్మెంట్ అంటే పని ముగియడం కాదు, తమకు నచ్చిన ప్యాషన్ ప్రాజెక్ట్స్ ప్రారంభించడం.

 చిన్న చిన్న విషయాలు నేర్చుకోవడం: మొబైల్ యాప్స్ వాడటం, కొత్త భాష నేర్చుకోవడం, డిజిటల్ ఫోటోగ్రఫీ లేదా తమ జీవిత విశేషాలను పుస్తకరూపంలో రాయడం వంటివి చేస్తూ మెదడును చురుకుగా ఉంచుతారు.

 "రోజుకో కొత్త విషయం" సూత్రం: గత ఏడాది మీకు అస్సలు తెలియని ఒక కొత్త విషయం లేదా నైపుణ్యం గురించి తెలుసుకోవడానికి రోజుకు కనీసం 30 నిమిషాలు కేటాయించండి.

2. ఆత్మీయ బంధాలు (ముగ్గురు మిత్రుల బలం)

ఒంటరితనం అనేది ఆరోగ్యానికి పెద్ద శత్రువు. సెప్టోలెసెంట్స్ మంచి మిత్రులను కలిగి ఉంటూ దీనిని అధిగమిస్తారు.

 కనీసం ముగ్గురు ప్రాణస్నేహితులు: 

మీకు పెద్ద గుంపు అవసరం లేదు. కాఫీ తాగుతూ మనసు విప్పి మాట్లాడుకోవడానికి, సాయంత్రం వేళ సరదాగా నడవడానికి కనీసం ముగ్గురు "నమ్మకమైన స్నేహితులు" ఉంటే చాలు.


 తరాల వారధి (Intergenerational Bridge): కేవలం మీ వయసు వారితోనే కాకుండా.. యువతతో, మనవలు-మనవరాళ్లతో స్నేహితుల్లా ముచ్చటించండి. వారి ఉత్సాహాన్ని మీరు కూడా అందిపుచ్చుకోండి.

3. అన్వేషణా గుణం (చిన్న చిన్న ప్రయాణాలు)

ప్రపంచాన్ని చుట్టేయడానికి ఫస్ట్-క్లాస్ ఫ్లైట్ టికెట్లే అవసరం లేదు. సెప్టోలెసెన్స్ అంటే లగ్జరీ కాదు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడాలనే కుతూహలం.

 స్థానిక పర్యాటకం: 

మీ ఊరిలోనే మీరు ఎప్పుడూ వెళ్లని మ్యూజియం లేదా పార్కుకు వెళ్లండి. రోజూ వెళ్లే దారి కాకుండా కొత్త దారిలో ప్రయాణించండి. పక్క ఊరికి వెళ్లి అక్కడి వంటకాలను రుచి చూడండి.


 జ్ఞాపకాల సేకరణ: 

వస్తువులను కొని దాచుకోవడం కంటే, కొత్త ప్రదేశాల సంస్కృతులను, అక్కడి మనుషుల అనుభవాలను మీ మనసులో దాచుకోండి.

4. నిరంతర చురుకుదనం (20 నిమిషాల మంత్రం)

ఆరోగ్యం అంటే మారథాన్ పరుగులు తీయడం కాదు, శరీరానికి రోజూ కాస్త శ్రమ ఇవ్వడం.

 రోజువారీ నడక: 

రోజుకు కనీసం 20 నిమిషాల పాటు ఉత్సాహంగా నడవడం అస్సలు మరువవద్దు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది, గుండెకు మంచిది.


 ఆహారం పట్ల గౌరవం: 

ఏదో పత్యం పాటిస్తున్నట్లు కాకుండా, గత ఏడు దశాబ్దాలుగా మనల్ని కాపాడుతున్న మన శరీరం పట్ల గౌరవంతో ఆరోగ్యకరమైన, సాత్విక ఆహారాన్ని ఆనందంగా తీసుకోండి.

📊 సెప్టోలెసెంట్ సంపద సూచిక (The Wealth Matrix)

సాధారణ సమాజం సంపదను బ్యాంక్ బ్యాలెన్స్‌తో కొలుస్తుంది. కానీ ఒక సెప్టోలెసెంట్ తన సంపదను పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తారు:


సాధారణ సంపద / సెప్టోలెసెంట్ సంపద:

1. ఆస్తులు, ఇళ్లను కూడబెట్టడం/అద్భుతమైన అనుభవాలను, జ్ఞాపకాలను కూడబెట్టడం.

2. లేని వాటి గురించి ఆందోళన చెందడం/ఉన్న వాటిని మనసారా ఆస్వాదించడం.

3. వయసు అయిపోతుందని భయపడడం / ప్రతి సూర్యోదయాన్ని కృతజ్ఞతతో ఆహ్వానించడం.

4. పెద్ద బంగళాలో ఒంటరిగా ఉండటం/చిన్న ఇల్లయినా ఆత్మీయుల మధ్య గడపడం.


సెప్టోలెసెంట్ పరమార్థం: "మన దగ్గర ఉన్నదానితో మనం తృప్తిగా ఉన్నామని గ్రహించిన క్షణంలోనే, మనం ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులం (ఆధ్యాత్మిక కోటీశ్వరులం) అయిపోతాం."


 రోజువారీ మేనిఫెస్టో: ఉదయాన్నే వేసుకోవాల్సిన 

3 ప్రశ్నలు

మీలోని సెప్టోలెసెంట్ స్ఫూర్తి ఎల్లప్పుడూ వెలిగిపోవాలంటే, ప్రతిరోజూ ఉదయం నిద్ర లేవగానే మీకు మీరే ఈ మూడు ప్రశ్నలు వేసుకోండి:

1. "ఈరోజు నేను ఏ కొత్త విషయం నేర్చుకోబోతున్నాను?" (ఇది మెదడును చురుకుగా ఉంచుతుంది)

2. "ఈరోజు నేను ఎవరి ముఖంలో చిరునవ్వు నింపబోతున్నాను?" (ఇది హృదయాన్ని బంధాలతో ముడిపెడుతుంది)

3. "ప్రస్తుతం నా జీవితంలో ఉన్న ఏ చిన్న విషయానికి నేను కృతజ్ఞత తెలపాలి?" (ఇది ఆత్మకు ప్రశాంతతను ఇస్తుంది)

వృద్ధాప్యాన్ని హుందాగా ఎదిరించడం

వయసు పెరగడం అనేది శారీరక నియమం. కానీ చర్మంపై ముడతలు పడినంత మాత్రాన.. మనసుకు ముడతలు పడాలని లేదు.

సెప్టోలెసెంట్‌గా జీవించడం అంటే కాలానికి ఎదురునిలిచి గెలవడం. 70 ఏళ్ల వయసును జీవిత చరమాంకంగా కాకుండా, బంగారు వర్ణంలో మెరిసిపోయే ఒక అందమైన సాయంత్రంలా చూడటమే. మీ వయసును ఒక గౌరవ కిరీటంగా భావించండి, మనసారా నవ్వండి, ఎల్లప్పుడూ ప్రేమిస్తూ, ఉత్సాహంగా ముందుకు సాగండి.

మీ జీవితంలోని అత్యంత అద్భుతమైన సరికొత్త అధ్యాయానికి స్వాగతం పలకండి!


డాక్టర్ వెలగపూడి ఉమామహేశ్వరరావు,

మాజీ రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం,

లయన్స్ జిల్లా గవర్నర్ (2000-2001),

మేనేజింగ్ ట్రస్టీ, లయన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, విశాఖపట్నం.

పాపం - పుణ్యం పాపం - పుణ్యం

  *"పాపం - పుణ్యం"*


*శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః*

*పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం*

భావం;- కోట్ల కొలది ధర్మ శాస్త్ర గ్రంథాలు వివరించిన విషయాన్ని అర శ్లోకంలో వ్యాసుడు చెప్పాడు. పరోపకారమే పుణ్యం, పర పీడనమే పాపం. 


రామాయణంలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది.


*శుభకృచ్ఛుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే*

*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*

భావం;- శుభ కర్మ చేసిన వాడికి ఉత్తమ ఫలం, పాప కర్మ చేసిన వాడికి దుఃఖం సంభవిస్తుంది. విభీషణుడికి తన శుభ కర్మ వల్ల సుఖం లభిస్తే, నువ్వు చేసిన పాప కర్మల వల్ల ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది.


వాటి ఫలితాలని అనుభవించే వాడు చేసిన వాడే కనుక, దుష్ట కర్మలు చేసే వాడు తనకి తనే శతృవు. సుకర్మలు చేసే వాడు తనకి తనే మిత్రుడు.


*ఆత్మైవహ్యాత్మనొబన్ధురాత్మైవ రిపురాత్మనః*

*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*

భావం:- మనిషి తనకు తానే బంధువు, తనకు తానే శతృవు, తనకు తానే శుభాశుభ కర్మలకి సాక్షి.

<><><><><><><><*"పాపం - పుణ్యం"*


*శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః*

*పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనం*

భావం;- కోట్ల కొలది ధర్మ శాస్త్ర గ్రంథాలు వివరించిన విషయాన్ని అర శ్లోకంలో వ్యాసుడు చెప్పాడు. పరోపకారమే పుణ్యం, పర పీడనమే పాపం. 


రామాయణంలో మండోదరి రావణుడితో ఇలా చెప్పింది.


*శుభకృచ్ఛుభమాప్నోతి పాపకృత్ పాపమశ్నుతే*

*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*

భావం;- శుభ కర్మ చేసిన వాడికి ఉత్తమ ఫలం, పాప కర్మ చేసిన వాడికి దుఃఖం సంభవిస్తుంది. విభీషణుడికి తన శుభ కర్మ వల్ల సుఖం లభిస్తే, నువ్వు చేసిన పాప కర్మల వల్ల ఇలాంటి దుఃఖాన్ని అనుభవించాల్సి వచ్చింది.


వాటి ఫలితాలని అనుభవించే వాడు చేసిన వాడే కనుక, దుష్ట కర్మలు చేసే వాడు తనకి తనే శతృవు. సుకర్మలు చేసే వాడు తనకి తనే మిత్రుడు.


*ఆత్మైవహ్యాత్మనొబన్ధురాత్మైవ రిపురాత్మనః*

*ఆత్మైవహ్యాత్మనః సాక్షికృతస్యాపకృతస్యచ*

భావం:- మనిషి తనకు తానే బంధువు, తనకు తానే శతృవు, తనకు తానే శుభాశుభ కర్మలకి సాక్షి.

<><><><><><><><><><><><><><><><>><><><><><><><><>

ఋగ్వేద ఆశీర్వచనం

 1. 📖 ఋగ్వేద ఆశీర్వచనం 🙏


వేదమాత కృపతో అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, శాంతి, శుభం కలగాలని ప్రార్థిస్తున్నాను.

ఓం శాంతిః శాంతిః శాంతిః॥


2. వేదధ్వని వినిపించే చోట దైవానుగ్రహం నిలుస్తుంది. ✨

ఈ ఋగ్వేద ఆశీర్వచనం సర్వలోక క్షేమార్థం. 🙏



3. వేదో నిత్యమధీయతామ్। 🕉️


4. 🕉️ శతమానం భవతి శతాయుః పురుషః।

శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి॥🕉️



 4.ఋగ్వేద ఆశీర్వచనంతో ప్రతి ఇంటా శుభం, ప్రతి హృదయంలో శాంతి నిండాలని ఆకాంక్ష. 🌺


🕉️ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు।

విద్యా-వివేక-వినయ-సంపదో భవంతు।

ధర్మార్థకామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధిరస్తు।

సర్వమంగళాని భవంతు।

శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సర్వశుభమస్తు॥🕉️🕉️

పంచాంగము

 🕉️


పంచాంగము 🌓 22.07.2026


🪔 శ్రీ వృషాకపీవామనాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: గ్రీష్మ 


మాసం: ఆషాఢ


పక్షం: శుక్ల - శుద్ధ 


తిథి: అష్టమి ఉ‌.08:01 వరకు

తదుపరి నవమి

 

వారం: బుధవారం - సౌమ్యవాసరే


నక్షత్రం: స్వాతి రా.02:01 వరకు

తదుపరి విశాఖ


యోగం: సాద్య సా.05:57 వరకు 

తదుపరి శుభ

 

కరణం: బవ ఉ‌.08:01 వరకు

తదుపరి బాలవ రా.08:32 వరకు

తదుపరి కౌలవ


వర్జ్యం: ఉ‌.06:28 - 08:10 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.11:56 - 12:48


రాహు కాలం: ప‌.12:22 - 02:00


గుళిక కాలం: ఉ‌.10:44 - 12:22


యమ గండం: ఉ‌.07:29 - 09:07

 

అభిజిత్: 11:56 - 12:48


సూర్యోదయం: 05:52


సూర్యాస్తమయం: 06:52


చంద్రోదయం: ప‌.01:01


చంద్రాస్తమయం: రా.12:29


సూర్య సంచార రాశి: కర్కాటకం


చంద్ర సంచార రాశి: తుల


దిశ శూల: ఉత్తరం


💫 బుధాష్టమి‌ 💫


🌹 దుర్గా పూజ 🌹


🔱 దుర్గాష్టమి 🔱


🎋 మహిషాసురమర్ధిని పూజ 🎋


🚩 పరశురామాష్టమి - విష్ణుపూజ 🚩


💧 దేవ సుగంధస్నాన‌ - అర్చన💧


🎊 కాశ్మీర్ భవానీ ఉత్సవం 🎊


🎉 శ్రీ నందీశ్వర అష్టాహ్నిక‌ 

వ్రతారంభం 🎉


🏳️చేరమాన్ పెరుమాళ్

 నాయనార్ గురుపూజ 🏳️


🌹 మధురై శ్రీ మీనాక్షి అమ్మన్

 పుష్ప పల్లకి ఉత్సవం 🌹


 🏳️ సుందరమూర్తి నాయనార్

 గురుపూజ 🏳️


🌟శ్రీ పక్షిరాజ తిరునక్షత్రం‌ 🌟


🏳️ శ్రీ దాశరథి కృష్ణమాచార్య 

జయంతి 🏳️


🔯

అద్భుతమైన కథ*

  🟡🔵🔴🟢🙏🟢🔴🔵🟡


బ్రాహ్మణ పురాణము నుండి ఒక చిన్న కథ 


*ఇల - అద్భుతమైన కథ*


చాలా కాలం క్రితం సూర్యుడికి వైవస్వత మనువు అనే కుమారుడు ఉండేవాడు. ఆయన భార్య పేరు శ్రద్ధ. వాళ్ళిద్దరికీ చాలా కాలం పిల్లలు లేరు. 


అందుకని వాళ్ళు మహర్షి అగస్త్యుడిని పెద్దగా నియమించి "మిత్రావరుణేష్టి" అనే యజ్ఞం చేశారు. కొడుకు కావాలని మనువు కోరుకున్నాడు. కానీ కూతురు పుట్టాలని శ్రద్ధ కోరిక. ఆడపిల్లను అనుగ్రహించమని శ్రద్ధ మనసులోనే ప్రార్థించింది.


యజ్ఞ ఫలితంగా శ్రద్ధకు కూతురే పుట్టింది. ఆ పాపకు 'ఇల' అని పేరు పెట్టారు. కానీ కుమారుడు కావాలని సంకల్పించి యజ్ఞం చేసినందుకు మనువు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు "సంకల్పదోషం వల్ల కూతురు పుట్టింది" అని చెప్పాడు. వశిష్ట మహర్షి తన తపోమహిమతో 'ఇల'ను మగపిల్లవాడిగా మార్చాడు. అతనికి "సుద్యుమ్నుడు" అని పేరు పెట్టారు.


ఒకరోజు సుద్యుమ్నుడు మిత్రులతో కలిసి వేటకు వెళ్ళాడు. దారిలో వాళ్ళు కైలాసానికి దగ్గర్లో ఉన్న కుమారవనంలోకి ప్రవేశించారు. ఆ వనంలోకి అడుగుపెట్టగానే అందరూ ఆడవాళ్ళుగా మారిపోయారు. 


అసలు ఏం జరిగిందంటే... ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఆ వనంలో ఉండగా శంకరుడి మహిమను చూడడానికి మునులు వచ్చారు. లజ్జతో పార్వతి ఒక పొద చాటున దాక్కుంది. ఆ స్థితిని చూసిన మునులు వెంటనే వెళ్ళిపోయారు. దాంతో కోపం వచ్చిన పరమేశ్వరుడు "ఇకపై ఈ వనంలోకి ప్రవేశించే ఏ పురుషుడైనా సరే వెంటనే స్త్రీగా మారిపోతాడు" అని శపించాడు.


శాపం తెలియక వచ్చిన సుద్యుమ్నుడు కూడా స్త్రీగా మారిపోయాడు. చాలా రోజులు అడవిలోనే ఉండిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. అలా సుద్యుమ్నుడు మళ్ళీ 'ఇల'గా మారాడు.


ఇల రూపంలో ఉన్నప్పుడు బుధుడు ఆమెను చూసి మోహించాడు. వాళ్ళిద్దరి అనురాగానికి పురూరవుడు అనే కుమారుడు పుట్టాడు. తర్వాత ఇల మళ్ళీ పురుషుడిగా కావాలని వశిష్టుడిని వేడుకుంది. వశిష్టుడు పరమేశ్వరుడిని ప్రార్థించాడు. ఈశ్వరుడు కరుణించి "ఇకపై ఇల నెలకు 15 రోజులు పురుషుడిగా, 15 రోజులు స్త్రీగా ఉంటుంది" అని వరం ఇచ్చాడు.


పురుషుడిగా ఉన్న రోజులు సుద్యుమ్నుడు రాజ్యాన్ని పాలించేవాడు. స్త్రీగా ఉన్న రోజులు ఇల రాజప్రాసాదంలోని మందిరంలో పూజలు చేసుకునేది. 


ఇల-బుధుల కుమారుడు పురూరవుడు పెద్దయ్యాక రాజ్యాన్ని చేపట్టాడు. అప్పటివరకు ఇల సోదరుడు ఇక్ష్వాకుడు రాజ్యాన్ని చూసుకున్నాడు. 


తర్వాత వైవస్వత మనువుకు ఇల తర్వాత ఇంకా పదిమంది కుమారులు పుట్టారు. వాళ్ళతోనే సూర్యవంశం మొదలైంది.


పురూరవుడు రాజ్యభారం తీసుకున్నాక సుద్యుమ్నుడు తపస్సుకు వెళ్ళాడు. నారదుడు ఉపదేశించిన మంత్రంతో దేవిని స్తుతించాడు. దేవి ప్రసన్నురాలై మోక్షాన్ని ప్రసాదించింది.


పురూరవుడు జనార్దనుడిని ఆరాధించి గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఊర్వశిని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు పదిమంది కుమారులు కలిగారు. కొన్ని పురాణాల ప్రకారం ఆరుగురు, మరికొన్నింటి ప్రకారం తొమ్మిదిమంది అని కూడా ఉంది.

🔵🔴🟢🟡🙏🟡🟢🔴🔵

మరణం తర్వాత

 మరణం తర్వాత స్వర్గం దొరుకుతుందనే ఆశతో మనిషి జీవితాంతం ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎవరో ఉపవాసం ఉంటారు, ఎవరో దానధర్మాలు చేస్తారు, ఎవరో తీర్థ యాత్రలు చేస్తారు, మరి కొందరు దేవుడికి మొక్కులు మొక్కుతారు. స్వర్గం ఏదో కొత్త హౌసింగ్ సొసైటీలా ఉంది, అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కోసం పుణ్యపు పాయింట్లు జమ చేయాల్సిన అవసరం ఉందన్నట్లుగా...


కానీ ఒక్క క్షణం ఆగి ఇలా కూడా ఆలోచించండి.....


ఏమో..మనం ఇప్పటికే స్వర్గంలోనే ఉంటున్నామేమో?

ఉదయం లేవగానే చుట్టూ ఒకసారి చూడండి.


ఒక బటన్ నొక్కితే చీకటి వెలుగుగా మారుతుంది.


రెండో బటన్ నొక్కితే ఫ్యాన్ తిరగడం మొదలవుతుంది.


మూడోది నొక్కితే చల్లని గాలి గదిని నింపేస్తుంది.


కాలువ తిప్పగానే నీరు పారుతుంది.


గ్యాస్ వెలిగించగానే కొన్ని నిమిషాల్లోనే భోజనం రెడీ అయిపోతుంది.


జేబులో నుండి మొబైల్ తీస్తే మొత్తం ప్రపంచం మీ అరచేతిలోకి వచ్చేస్తుంది.


వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ....మీ ప్రియమైన వ్యక్తి కొన్ని సెకన్లలో..... మీ ముందు కనిపిస్తాడు.*


ఇంత అద్భుతమైన సౌకర్యాలు... కానీ వీటిని మనం చాలా సాధారణంగా తీసుకుంటున్నాం, ఇవి మన జన్మహక్కు అన్నట్లు.


కాస్త ఊహించండి...


రెండు వందల సంవత్సరాల క్రితం ఒక రాజు.. ఈరోజు మీ ఇంటికి వస్తే.. బహుశా తిరిగి తన రాజభవనానికి వెళ్లడానికి కూడా ఇష్టపడక పోవచ్చు.


అతను ఆశ్చర్యంగా అడుగుతాడు -

*"ఇదేంటి?

వేడి నీరు.

*"మరి ఇది?

చల్లని గాలి.

*"ఇది?

ప్రపంచం మొత్తం సమాచారం.

*"మరి ఇది?

పది నిమిషాల్లో ఇంటికి వచ్చే ఆహారం."


అప్పుడు అతను నవ్వుతూ ఇలా అంటాడు -

"నేను జీవితాంతం రాజ్యం చేశాను, యుద్ధాలు గెలిచాను,

అపార ధనం సంపాదించాను...

కానీ ఇలాంటి సుఖం నాకు కూడా ఎప్పుడూ దొరకలేదు."


*ఇదే నిజం!*


ఈరోజు ఒక సాధారణ మనిషి కూడా అనేక సౌకర్యాల విషయంలో గతం- లోని అత్యంత శక్తివంతమైన రాజుల కంటే చాలా గొప్పవాడు.


అయినా కూడా......


మనం సంతోషంగా లేము.


ఎందుకు?


ఎందుకంటే మనిషికి ఏది దొరికితే..దాని విలువ క్రమంగా తగ్గిపోతుంది.


*AC నడుస్తోంది - సంతోషం లేదు.*

ఆగిపోతే - ఇబ్బంది మొదలవుతుంది.


*మొబైల్ ఉంది - సంతోషం లేదు.*

నెట్ వర్క్ పోతే - ప్రపంచమే అంతమైపోయినట్లు.


*మన ఇల్లు ఉంది - సంతోషం లేదు.*

పక్కింటి ఇల్లు పెద్దది - అదే బాధ.


*మన కారు ఉంది - సంతృప్తి లేదు.*

ఇంకొకరి కారు పెద్దది - అదే బాధ.


*అంటే మనిషి తన స్వర్గం- లోనే నిలబడి, ఇంకొకరి స్వర్గంతో తనను పోల్చు- కుంటూ ఉంటాడు.*


కానీ అదే భూమి మీద ఇంకొక ప్రపంచం కూడా ఉంది...


*అక్కడ ఈరోజు కూడా లక్షల మంది ఒక బిందె నీళ్ల కోసం గంటల తరబడి క్యూలో నిలబడుతున్నారు.*

*అక్కడ లక్షల కుటుంబాలకు పక్కా ఇల్లు కూడా లేదు.*

*రెండు పూటలా తిండి కూడా గ్యారెంటీ లేదు.*

*పిల్లల కలలు.. స్కూల్ కి వెళ్లేలోపే విరిగిపోతాయి.*

*దేహాన్ని కప్పుకోవడానికి సరైన బట్టలు కూడా లేవు.*


*మనం "సాధారణం" అని అనుకునే సౌకర్యాలే, మరొకరికి అతి పెద్ద కల.*


మనకు AC రిమోట్ దొరకకపోతే కోపం వస్తుంది. వాళ్లకు ఎండ నుండి కాపాడటానికి చెట్టు నీడ కూడా దొరకదు.


మనం డైట్ చార్ట్ వెతుకుతాం.వాళ్లు వచ్చే పూట రొట్టె గురించి ఆలోచిస్తూ పడుకుంటారు


*అప్పుడు అర్థమవుతుంది...*


*స్వర్గం, నరకం అనేవి మరణం తర్వాత దొరికే ప్రదేశాలు కావు..*


*అవి ఇక్కడే ఉన్నాయి...

*ఈ భూమి మీదనే...

*ఈ నగరంలోనే...

*ఈ వీధిలోనే...*

*మరియు కొన్నిసార్లు ఒకే గోడకు రెండు వైపులా.


ఒక ఇంటి పిల్లవాడు తన కొత్త మొబైల్ కొంచెం స్లో అయిందని బాధ పడు- తున్నాడు. ఎదురింటి పిల్లవాడు ఆన్లైన్ చదువుకు మొబైల్ లేనే లేదని బాధపడుతున్నాడు.


ఒక వ్యక్తి వేడి నీరు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిందని ఫిర్యాదు చేస్తాడు. ఇంకొక వ్యక్తి ఈరోజు నీరు దొరికితే చాలు అనుకుంటాడు.


తేడా పరిస్థితుల్లో మాత్రమే కాదు...


తేడా దృక్పథంలో కూడా ఉంది.


కొంతమంది కష్టమైన పరిస్థితుల్లో కూడా నవ్వడం తెలుసు.

మరికొంతమంది అన్ని సుఖ సౌకర్యాల మధ్య కూడా ఫిర్యాదుల నుండి బయటకు రాలేరు.


మనిషి యొక్క అతి విచిత్రమైన అలవాటు ఇదే -తన దగ్గర ఏమి లేదో ప్రతిరోజు లెక్కిస్తాడు...


కానీ తన దగ్గర ఎంత ఉందో ఎప్పుడూ లెక్కించడు.


*ప్రతి రాత్రి పడుకోవడానికి ముందు కేవలం ఐదు విషయాలు రాసుకుంటే -*

1. ఈరోజు నేను ఊపిరి పీల్చగలుగుతున్నాను.

2. ఈరోజు నా దగ్గర తాగడానికి నీరు ఉంది.

3. ఈరోజు నాకు భోజనం దొరికింది.

4. ఈరోజు నాకు తల దాచుకునే చోటు ఉంది.

5. ఈరోజు నా వాళ్లు నాతో ఉన్నారు.

అయితే బహుశా మన జీవితమే మారిపోతుంది.


బహుశా ‘స్వర్గం అనేది ఒక ప్రదేశం కాదు...!

*ఒక అనుభూతి.!*


మరియు నరకం కూడా ఒక ప్రదేశం కాదు...!

*ఆ అనుభూతిని మర్చిపోవడమే.!*


*మన దగ్గర ఉన్నదాన్ని విలువ ఇవ్వడమే స్వర్గం.!*

*దొరికినదాన్ని మర్చిపోయి కేవలం ఫిర్యాదులు చేస్తూ ఉండటమే నరకం!*


*మరణం తర్వాత ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు.*

కానీ బ్రతికి ఉండగానే మనకు భూమి లాంటి అందమైన గ్రహం, ఊపిరి పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి అన్నం, ప్రేమించే మనవాళ్లు, ఒక బటన్ నొక్కగానే దొరికే లెక్కలేనన్ని సౌకర్యాలు ఉన్నాయి...


ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎప్పుడూ దుఃఖంగా ఉంటే... అంతకంటే పెద్ద దురదృష్టం ఇంకేముంటుంది?


*బహుశా పైన ఉన్న భగవంతుడు కూడా నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడేమో -*

*"నేను నిన్ను స్వర్గంలో పెట్టాను... మరియు నువ్వు అక్కడ కూడా ఫిర్యాదుల ఆఫీస్ పెట్టుకున్నావు!"*


అందుకే ఈరోజు నుండి ఫిర్యాదులు కాదు... "’కృతజ్ఞతలు’" లెక్కించండి.


*ఎందుకంటే ""కృతజ్ఞత"" ఉన్న మనసులోనే స్వర్గం ఉంటుంది.* 


🌹🌹🌹🌹🌹🌹🌹

*సేకరణ...పసుపులేటి* 

9441767340