8, మే 2026, శుక్రవారం

తద్దినం ఎందుకు ?

  సైన్స్ : తద్దినం ఎందుకు ?


 మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు.  అతనికి రేవతి అనే అందమైన కూతు రు ఉండేది.  అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.


ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.


దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...


ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం... ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.

కూతురంటే అతనికి ప్రాణం. 


ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.

తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో.  అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని (Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.


అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా.  వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు.   అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం.  నాలుగవ డైమెన్షన్ కాలం.


అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట.

అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట.  అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు.  అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.


ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.

ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు.  అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు.  ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలతో  సమానం.


పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే  "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం (Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది.


అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.


ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం.  పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం.  కాని, స్వర్గం ఉండేది భూమిపై కాదు.   మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయాలకు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.  నాక్కుడా వచ్చింది.


పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.  హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్స్ ఉన్నాయన్న మాట. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది.


మన హిందూ సనాతన ధర్మము ప్రకారం, మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు.  ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు.  ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు.


ఎందుకో తెలుసా, చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు.  అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం.  ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం.  ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం.  అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.  ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు.  అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.


ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి.  ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం.


ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు.


ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం, మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పర మాయలో పడుతున్నారు.  మన తరువాత ఎప్పుడో వచ్చిన  మాయలు ఇలాంటి విజ్ఞానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు.


కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.  కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది.


|| ఓం నమః శివాయ ||

దివ్యశక్తి ని పొందాలంటే ?ఎలా

 *దివ్యశక్తి ని పొందాలంటే ?ఎలా??...* 


ఈరోజుల్లో చాలా మంది భక్తులు దేవుడు ఎక్కడ వున్నాడు, దేవుడు వుంటే నాకు ఇది జరగాలి, అది జరగాలి అని చాలా చాలా మాటలు చెబుతుంటారు, ఇంకొందరు తిడుతూ శాపనార్థాలు పెడుతుంటారు ... !!1..


అసలు ఆ భగవంతుడే లేకుంటే !!...

పూవు లోని పరిమళములు, గ్రుడ్డులోని పిట్ట, 

చెఱకులోని తీపి, 

మిరప లోని కారము, 

వేప లోని చేదు..

. ఇవన్నీ ఎక్కడనుండి ప్రారంభ మయ్యాయి? 


వీటిని అర్థం చేసుకోవడానికే మానవునికి సాధ్యం కావట్లేదు, కానీ ఇవన్నీ దైవసృష్టి లోని విచిత్ర ములే! 


మానవుడు దైవాన్ని గుర్తించడం కోసం ఈ రకమైన సృష్టి ఏర్పడింది. 


ఎత్తైన పర్వతాలు,

 నదీ ప్రవాహాలు,

 ఉప్పొంగే సముద్రాలలో ఎంతటి అందమున్నది! 

ఇవన్నీ దైవము యొక్క పరమాద్భుత మైన సౌందర్యము నకు ప్రతీకలు. 


దైవము యొక్క సౌందర్యము ను వర్ణింప ఎవరికీ సాధ్యము కాదు. 

అలాగే ...

దైవము యొక్క శక్తి సామర్థ్యము లను గుర్తింప వీలుకాదు. 

అల్ప బుద్ధి గలవారు అనంతమైన దైవ స్వరూపాన్ని ఏరీతిగా అర్ధము చేసుకోగలరు? 


దైవత్వమును పొందాలంటే, తగిన అర్హతను మనము పొందాలి. 

ఉపనిషత్తుల సారమిదే!! ...

రాముడా, 

కృష్ణుడా, ?

గోవిందుడా? 

నారాయణుడా?  

అసలు ఆ దివ్య శక్తి కి రూపమే లేదు. 

అందులో పరిపూర్ణ మైన జ్ఞానము, ఆనందము తప్ప అన్యములేదు. 


స్థిరమైన భక్తి, నిర్మల త్వము, నిస్వార్థ మును సాధించాలి అప్పుడే దివ్య శక్తి గోచర మౌతుంది. 


            *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

పంచాంగము



 

Mantra - 33

 Mantra - 33 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘శరత్కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు’ అన్న సందేశం తరువాత, ఈ క్రింది మంత్రం లో ప్రకృతి శక్తులను, ముఖ్యంగా మరుద్గణాలను (వాయు దేవతలను) అత్యంత శక్తివంతమైన యుద్ధ వీరులతో పోలుస్తూ వర్ణించే అద్భుతమైన ఘట్టం కనిపిస్తుంది.


“అముతో జేతుమిషుముఖమివ। 

సన్నద్ధాస్సహ దదృశే హ |

అపధ్వస్తైర్వస్తివర్ణైరివ |

విశిఖాసః కపర్దినః॥”


“అముతో జేతుమిషుముఖమివ" - అక్కడి నుండి (ఆకాశం నుండి) విజయం సాధించడానికి సిద్ధంగా వదులబడిన బాణం అంచు వలె.

ఇక్కడ వాయువు లేదా మేఘాల కదలిక ఎంత వేగంగా, ఎంతటి గురితో ఉందో వివరించడానికి 'ఇషుముఖం' (బాణం అంచు) అనే ఉపమానాన్ని వాడారు.


"సన్నద్ధాస్సహ దదృశే హ” - వారందరూ కలిసి యుద్ధానికి సన్నద్ధులైన వీరుల్లా కనిపిస్తున్నారు. 

అంటే ప్రకృతిలోని శక్తులు ఒక క్రమశిక్షణ కలిగిన సైన్యంలా ఏకధాటిగా కదులుతున్నాయని అర్థం.


“అపధ్వస్తైర్వస్తివర్ణైరివ” - ధూళి వల్ల లేదా అలసట వల్ల వివర్ణమైన (రంగు తగ్గిన) వస్త్రాలు ధరించిన వారి వలె.

ఇది ఆకాశంలోని మేఘాల బూడిద రంగును లేదా గాలి వల్ల రేగిన ధూళి రంగును సూచిస్తుంది.


“విశిఖాసః కపర్దినః” - జుట్టు విరబోసుకున్న వారు (విశిఖాసః) మరియు జటలు ధరించిన వారు (కపర్దినః). వేగంగా వీచే గాలికి మేఘాలు చెల్లాచెదురుగా, జటల్లా కనిపిస్తాయి. ఇది వాయువు యొక్క ఉగ్రరూపాన్ని, రుద్రుని అంశను ప్రతిబింబిస్తుంది.


వేదమంత్ర దృష్ట ఆకాశంలో కదిలే మేఘాలను, వీచే గాలులను చూసి, అవి అసుర శక్తులపై పోరాటానికి వెళ్తున్న దేవతా సైన్యంలా ఉన్నాయని ఊహించడం (Metaphor) ఇక్కడి విశేషం.


మరుత్తులు రుద్రుని కుమారులు. తండ్రి లాగే వీరు కూడా జటలు (కపర్దము) ధరించి, శత్రు భయంకరులుగా ఉంటారని పురాణోక్తి. ఆ గంభీరత ఈ మంత్రంలో కనిపిస్తుంది.


"విశిఖాసః" వంటి పదాలు వైదిక సంస్కృతంలోని ప్రత్యేక రూపాలు (Vedic Nominative Plural). ఇవి లౌకిక సంస్కృతంలో "విశిఖాః" అని మారుతాయి. వేద పారాయణంలో ఈ శబ్దాలు మంత్రానికి ఒక ప్రత్యేకమైన శబ్ద గాంభీర్యాన్ని ఇస్తాయి.


అరుణప్రశ్నలో సూర్యుడిని ఆరాధించే క్రమంలో, ఆయన ప్రేరణతో ప్రకృతిలో కలిగే ఈ చలనం, జీవరాశిని ఏ విధంగా రక్షిస్తుందో ఈ మంత్రాలు వివరిస్తాయి. ఈ మంత్ర పఠనం మనస్సులో ధైర్యాన్ని, కార్యశూరత్వాన్ని నింపుతుందని విశ్వాసం. ఈ మంత్రాల్లోని అలంకార శాస్త్రం మరియు శబ్ద సౌందర్యాన్ని గమనించవచ్చు.


తత్వాన్ని విచారిస్తే…

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రంలోని ప్రతీకలు సాధకుని అంతర ప్రయాణాన్ని సూచిస్తాయి:


‘ఇషుముఖమివ’ - ఏకాగ్రత - బాణం అంచు ఎంత సూటిగా, తీక్షణంగా ఉంటుందో, అద్వైత సాధకుని బుద్ధి అంత ఏకాగ్రతతో ఉండాలి.


‘జేతుమ్’ - ఇక్కడ జయించడం అంటే బయటి రాజ్యాలను కాదు, మనస్సులోని అజ్ఞానాన్ని, అరిషడ్వర్గాలను జయించడం.


జ్ఞానమనే బాణంతో అజ్ఞానమనే లక్ష్యాన్ని ఛేదించడమే ఇక్కడ యుద్ధ సన్నద్ధత.


‘విశిఖాసః కపర్దినః’ - ద్వంద్వాతీత స్థితి (Beyond Outer Forms)

ఇక్కడ 'విశిఖులు' (శిఖ లేని సన్న్యాసులు) మరియు 'కపర్దులు' (జడలు ధరించిన యోగులు) అనే ప్రస్తావన ఉంది. సన్న్యాసం అనేది త్యాగానికి గుర్తు, యోగం అనేది చిత్త వృత్తి నిరోధానికి గుర్తు.

అద్వైత దృష్టిలో, బయటి రూపం (శిఖ ఉందా లేదా అనేది) ముఖ్యం కాదు. అంతరంగా పరమాత్మతో అనుసంధానం అవ్వడమే ముఖ్యం. కిరణాలు భిన్న రూపాల్లో ఉన్నట్లు అనిపించినా, వాటన్నింటికీ మూలం సూర్యుడే. అలాగే, సాధకులు ఏ మార్గంలో ఉన్నా, అందరూ ఆ ఏకైక బ్రహ్మ వైపుకే ప్రయాణిస్తున్నారు.


అపధ్వస్తైర్వస్తివర్ణైరివ - దేహాభిమాన త్యాగం:

యుద్ధంలో లేదా తపస్సులో ఉన్నప్పుడు శరీర రంగు, అలంకరణల మీద దృష్టి ఉండదు.

అద్వైత సాధనలో 'దేహాభిమానం' (నేను ఈ శరీరాన్ని అనుకోవడం) వదిలేయాలి.

సూర్యకిరణాలు మేఘాలను, చీకటిని చీల్చుకుంటూ వచ్చినప్పుడు వాటి రంగులు మారినట్లు అనిపిస్తాయి, కానీ సూర్య ప్రకాశం మారదు. అలాగే, ఉపాధి వల్ల కలిగే మార్పులు ఆత్మకు అంటవు (అసంగత్వం).


‘సన్నద్ధాః’ - నిరంతర జాగృతి (Constant Awareness)

సూర్యకిరణాలు ప్రపంచాన్ని చీకటి నుండి రక్షించడానికి ఎల్లప్పుడూ ఎలా సన్నద్ధంగా ఉంటాయో, ఆత్మ చైతన్యం మనలో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది.

మనం చేయవలసిందల్లా ఆ సన్నద్ధతను గుర్తించడం. యుద్ధానికి సిద్ధమైన వీరుడిలా, సాధకుడు మాయా ప్రవాహానికి ఎదురు నిలిచి, తన నిజ స్వరూపాన్ని రక్షించుకోవాలి.


మంత్ర సారం:

అజ్ఞానమనే శత్రువును జయించడానికి నీ బుద్ధిని బాణం వలె తీక్షణంగా మార్చుకో. బాహ్య రూపాలతో సంబంధం లేకుండా (సన్న్యాసి లేదా యోగి), నీ లోపల వెలిగే ఆత్మ చైతన్యంతో యుద్ధానికి (జ్ఞాన సాధనకు) సన్నద్ధుడవు కావాలి. మాయా పొరలను చీల్చుకుంటూ వచ్చే సూర్యకిరణమే నీకు మార్గదర్శి.


ఈ మంత్రం ద్వారా ప్రకృతిని ఒక రణరంగంగా, జ్ఞాన సాధనను ఒక వీరకృత్యంగా అరుణ ప్రపాఠకము అభివర్ణించింది.

7, మే 2026, గురువారం

కల్తీCB

 మనం తినే మామిడి పండ్లు నూటికి 90 శాతం కార్బెట్ తో పండించినవే అందులో అనుమానమే లేదు


 మనం తినే ఆహారంలో నిత్యం అనేక రకాలైన రసాయనాల కల్తీలతో ఉన్నవే అందుకే మనకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలు వస్తున్నాయి 


ముఖ్యంగా మనం వాడే వంట నూనెలు చాలా మటుకు కల్తీ నూనెలే 


మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక కిలో పల్లీలు రెండు వందల రూపాయలు ఉంటే ఒక లీటరు పల్లీ నూనె 150 ,170 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతారు.అంటే అవి నిజంగా స్వచ్ఛమైన నూనెలు కావని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా కాదా


 ఒక కిలో పల్లీలను నూనెగా తీస్తే ఒక పావు కిలో నూనె మాత్రమే వస్తుంది అంటే స్వచ్ఛమైన పల్లీలతోటి కిలో నూనె తీయాలంటే నాలుగైదు కిలోల పల్లీల అవసరపడతాయి.


అట్లా చేస్తే మీకు కిలో నూనె ఎనిమిది వందల రూపాయలకి తక్కువకి దొరకదు.


అదే విధంగా ఇతర నునెలలో కూడా  చాలా కల్తీలు ఉన్నాయి అని అంటున్నారు.


ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనం వాడే పాలలో యూరియా వంటి కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారట.అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.


ఇది ఇట్లా ఉంటే నేను మాకు దగ్గరలో ఉన్న పశువుల షెడ్డు నుంచి అప్పుడే తీసిన పాలను తెచ్చుకుంటున్నాను అందులో ఎటువంటి కల్తీ లేదని కూడా మనం అనటానికి వీల్లేదు.


ఎందుకంటే గేదెలకు పాలు రావటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు అలానే డ్రైనేజీ నీళ్లలో పెంచిన గడ్డి తినిపిస్తున్నారు.


దానివల్ల ఆ గేదల నుంచి వచ్చే పాలు పూర్తిగా కలిసికతమై ఉంటున్నాయి.


ఇంకా బియ్యానికి వస్తే మనం తినే బియ్యం స్టీమ్డ్ రైస్, హెచ్ఎంటి  బియ్యం లను పాత బియ్యంగా విక్రయిస్తున్నారు.


ఆ బియ్యమును పాలిష్ చేసి దాని మీద పూర్తిగా తౌడును తొలగించి తెల్లగా నిగలాడేరట్టు చేయటం వలన బియ్యంలోని పోషక విలువలు పూర్తిగా పోయి కేవలం పిప్పి మాత్రమే మిగులుతున్నది.


మనలో చాలామందికి బి కాంప్లెక్స్ లోపము ఏర్పడటానికి కారణం ఇదే.


మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, ప్రోటీన్లు విలువైన ఆహారపు విలువలు లేని కేవలం పిప్పిని మాత్రమే భుజిస్తున్నాము.


ఇక వాతావరణం విషయానికొస్తే మనం రోజు అనేక రకాల రేడియేషన్స్ కి గురి అవుతున్నాము.


కొన్ని మన ఇంట్లో మనమే సృష్టించుకుంటున్నాము.


ముందుగా బయట రేడియేషన్స్ తేల్చుకుందాం.


మన చుట్టూ అనేక మైక్రోవేవ్ రేడియేషన్లు సెల్ఫోన్ టవర్ల నుండి వెలువడుతున్నాయి.



ఇక రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉండనే ఉన్నది.


మన ఇంట్లో మనం వైఫై ఏర్పాటు చేసుకొని ఆ రేడియేషన్కు కూడా గురి అవుతున్నాము.


ఇది చాలదు అన్నట్లు మనము బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బ్లూటూత్ రేడియేషన్ కూడా కొని తెచ్చుకుంటున్నాము.


ఈ రకమైన రేడియేషన్లు మన శరీరంలో ఉన్న నరాల మీద ప్రభావితం చూపెడతాయి ఇంకా మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద కూడా చూపెడతాయి.


సెల్ఫోన్ టవర్లకి దగ్గరగా ఉన్న మానవులకి మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మెదడు లోపల అనేక చెడు లక్షణాలు కనబడుతున్నాయి.


మొదలుగా తలనొప్పి వస్తుంది తర్వాత నరాలకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.


ఇక మనంతట మనమే కొని చేర్చుకున్న అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చూద్దాం.


మనం రోజు ఎక్కువ సమయం సెల్ ఫోను లాప్టాప్ టీవీ చూడటం లో గడుపుతున్నాము.


దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ కి ఇంకా ఎక్కువ ప్రకాశమైనా వెలుతురుని చూడటం వల్ల అది మన కంటిలోని రెటీనా మీద ప్రభావం చూపెట్టి కను గుడ్లు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.


చిన్న వయసులోనే పిల్లలకి కళ్ళజోళ్ళు రావడం మనం గమనిస్తున్నాము.


ఇంకా సెల్ ఫోనులో మన యొక్క పూర్తి ఏకాగ్రత ఉంచి వీడియోలు చూడటం వలన అవి మెదడు మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇటువంటివి అనారోగ్య సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి.


ఇట్లా ఉంటే వాహనాల  పొగ వలన వాతావరణంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకీ తగ్గుతున్నది.


ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వృక్షాలను మానవులు కొట్టివేసి ఆ స్థలాలలో అనేక మల్టీస్టోరీడ్ బిల్డింగులు కట్టడం వలన ఆక్సిజన్ తక్కువ అవుతున్నది.


అందువలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది.


ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనుషులు పూర్తిగా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు అన్నది సత్యం.


ఇక శారీరిక దృఢత్వానికి వస్తే పూర్వకాలంలో ఆడవారు కానీ మగవారు కానీ బావిలో చేత వేసి నీళ్లు చేదుకునేవాళ్లు దానివల్ల వాళ్లకి చక్కటి వ్యాయామం అయ్యేది.


అప్పుడే పెతికిన పాలు తాగేవాళ్లు దంచిన బియ్యం తినేవాళ్లు దానివల్ల పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఆరోగ్యకరమైనటువంటి అంటే వ్యాయామ కరమైనటువంటి అలవాట్లు ఉండేవి.


ఇప్పుడు ప్రతిదీ యాంత్రికం కావడం వలన శారీరిక శ్రమ పూర్తిగా తగ్గింది వంట ఇంట్లో ఆడవారు పిండి రుబటం లేదు.


మిక్సీలో పడుతున్నారు కట్టెలపై  పొయ్యి వెలిగించటం లేదు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నారు.


కూర్చొని వండటం వల్ల చక్కగా ఆ వంట కుదురుగా ఉండి రుచికరంగా ఉండేది.


ఇప్పుడు వండటం నిల్చమని తినటం కుర్చీలో కూర్చొని.


ఇటువంటి అలవాట్ల వల్ల మనం తినే ఆహారం శరీరానికి సరిగా పట్టటం లేదు.


దానివలన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి ఇకపోతే శారీరకంగా ఏమాత్రం అలసట చెందకుండా తినంగానే వెంటనే పడుకోవటం వలన కడుపు ఉబ్బి లావుగా తయారవుతున్నారు.


ఆహారం సరిగా అరగటం లేదు  దానివల్ల అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి.


ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు.


ఒక్క మాటలో చెప్పాలంటే మనము పూర్తిగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నాం తింటున్నాం  పడుకుంటున్నాము.


ఇది సత్యము సత్యము సత్యము ముమ్మాటికీ

07-05-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

07-05-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

---------------------------------------


సింహం


మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కన్య


ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------


తుల


మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  

---------------------------------------


వృశ్చికం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

---------------------------------------


మకరం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

---------------------------------------


కుంభం


విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

---------------------------------------

పంచాంగము 🌓 07.05.2026

 🕉️


పంచాంగము 🌓 07.05.2026


🪔 శ్రీ రమాత్రివిక్రమాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: ఉత్తరాయణం 


ఋతువు: వసంత


మాసం: వైశాఖ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పంచమి ఉ‌.07:05 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతివాసరే

 

నక్షత్రం: పూర్వాషాఢ ప‌.03:43 వరకు 

తదుపరి ఉత్తరాషాఢ


యోగం: సాద్య రా.01:12 వరకు

తదుపరి శుభ

 

కరణం: తైతుల ఉ‌.07:05 వరకు

తదుపరి గరజ‌ రా. 07:52 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: రా.12:29 - 02:14 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:04 - 10:55

మరియు ప‌.03:12 - 004:03


రాహు కాలం: ప‌.01:49 - 03:25


గుళిక కాలం: ఉ‌.08:59 - 10:36


యమ గండం ఉ‌.05:47 - 07:23

 

అభిజిత్: 11:47 - 12:37


సూర్యోదయం: 05:47


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: రా.11:30


చంద్రాస్తమయం: ఉ‌.09:53


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


దిశ శూల: దక్షిణం


🚩 శ్రీ కశ్యప ఋషి జయన్తి 🚩


🏳️ సంత్‌ చౌఖమేలా పుణ్యతిథి‌🏳️


🎊 శ్రీ భువనేశ్వరి పాటోత్సవ్ 🎊

(గొండాల్ - గుజరాత్)


🛕చెన్నై శ్రీ కేశవ పెరుమాళ్

రథోత్సవం 🛕


🪄 శ్రీనివాసమంగాపురం శ్రీ 

 కల్యాణ వేంకటేశ్వరస్వామి 

 వసంతోత్సవారంభం‌  🪄


🛕తిరువల్లికేణి శ్రీ పార్థసారథి

 పెరుమాళ్ రథోత్సవం 🛕


🇮🇳 అల్లూరి సీతారామరాజు

స్మృతి దినం 🇮🇳


⚛️


వైశాఖే కృష్ణపక్షే తు 

పంచమ్యాం ఋషిసత్తమః |

కశ్యపః ప్రాదురభవత్ 

లోకానాం హితకామ్యయా ||


మరీచిః కశ్యపం తస్మాత్ 

సర్వలోక పితామహమ్ |

సృష్టవాన్ సర్వభూతాని

సదేవాసుర మానుషాన్ ||

మరీచి కుమారుడైన కశ్యపుడు,

దేవతలు, అసురులు మరియు

మనుష్యులతో సహా సమస్త

భూతజాలాన్ని సృష్టించిన లోక

పితామహుడు.


వైశాఖే మాసి సంభూతం

మరీచికుల నందనమ్ |

కశ్యపం సర్వలోకానాం 

పితరం ప్రణమామ్యహమ్ ||


మరీచేః కశ్యపో జజ్ఞే 

కశ్యపాత్తు సురాసురాః |

శశాంకవంశ్యాః సూర్యాశ్చ 

తథాన్యే చ చరాచరాః ||

మరీచి నుండి కశ్యపుడు

జన్మించాడు. కశ్యపుడి నుండే

దేవతలు, అసురులు,

చంద్రవంశీయులు,

సూర్యవంశీయులు మరియు

ఇతర చరాచర ప్రాణులు

ఉద్భవించాయి.


కశ్యపస్య ప్రభావన లోకాః

సృష్టాశ్చరాచరాః |

తస్మాత్ సర్వమయం లోకం

కశ్యపం పరిచక్షతే ||

కశ్యపుని ప్రభావం వల్లనే ఈ

చరాచర జగత్తు సృష్టించబడింది.

అందుకే ఈ లోకమంతా

కశ్యపమయము.


అదితిర్దితిస్తథా దనుః కాష్ఠా 

అరిష్టా సురసా ఇలా |

మునిః క్రోధవశా చైవ తాసాం 

భర్త్రే నమో నమః ||"

కశ్యపుని భార్యలైన అదితి, దితి

మొదలైన వారిని పేర్కొంటూ,

సమస్త జీవరాశికి తండ్రి అయిన

కశ్యపునికి నమస్కారం.


కశ్యపాయ నమస్తుభ్యం

సర్వభూత హితైషిణే |

మరీచిపుత్ర ధర్మజ్ఞ 

గృహాణార్ఘ్యం మయా దత్తమ్ ||

సర్వ భూతాల మేలు కోరేవాడా,

మరీచి పుత్రుడా, ధర్మం తెలిసిన ఓ

కశ్యప మహర్షీ! నేను సమర్పిస్తున్న

ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు.


🔯


Mantra - 32

 Mantra - 32 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు’ అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు శరదృతువు వర్ణనలో ఉన్న తత్త్వాన్ని చూద్దాం తదుపరి క్రింది మంత్రంలో.


"ఏతా వాచః ప్రయుజ్యంతే|

శరద్యత్రోప దృశ్యతే|

అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ। 

వాతవన్తో మరుద్గణాః||”


ఈ మంత్రం ప్రకృతిలో కలిగే మార్పులను, ముఖ్యంగా శరదృతువులో వాయువు యొక్క చలనాన్ని మరియు మరుద్గణాల (వాయు దేవతల) ప్రభావాన్ని వర్ణిస్తుంది.


"ఏతా వాచః ప్రయుజ్యంతే" - ఈ వాక్కులు / మంత్రాలు ఉచ్ఛరించబడుతున్నాయి/ ప్రయోగించబడుతున్నాయి.


"శరద్యత్రోపదృశ్యతే" - శరదృతువు ఎక్కడైతే కనిపిస్తుందో, ప్రవేశిస్తుందో. వర్షాకాలం ముగిసి, ఆకాశం నిర్మలంగా మారే శరత్ కాలం నాటి వాతావరణాన్ని ఇది సూచిస్తుంది.


“అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ" - కంపపింపజేస్తూ, కొడుతున్నట్లుగా (వేగంగా వీస్తూ) - గాలి వేగంగా వీస్తూ చెట్లను, ప్రకృతిని కదిలించే తీరును ఇక్కడ వర్ణించారు.


“వాతవన్తో మరుద్గణాః" - వాయువుతో కూడిన మరుద్గణములు - వేదాలలో 'మరుత్తులు' అంటే వాయుదేవతలు. వారు గుంపులుగా (గణములు) ఉండి, ప్రకృతిలో శక్తివంతమైన చలనాన్ని కలిగిస్తారు.


వర్షాలు తగ్గుముఖం పట్టి, పంటలు చేతికి వచ్చే సమయంలో వీచే గాలులు శరదృతువుకు చిహ్నం. ఈ సమయంలో వాయువు ప్రసరణ ప్రకృతిని శుద్ధి చేస్తుందని భావిస్తారు.


మరుత్తులు రుద్రుని పుత్రులుగా, ఇంద్రుని సహాయకులుగా వేదాల్లో వర్ణించబడ్డారు. వారు తుఫానులకు, గాలులకు అధిదేవతలు. వారు "అభిధూన్వంతః" (కదిలించడం) ద్వారా ప్రకృతిలోని జడత్వాన్ని తొలగిస్తారని అర్థం.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు సూర్యుడు, కాలం, మరియు వాయువు మధ్య ఉన్న సమన్వయాన్ని వివరిస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే వేడి, దానివల్ల వచ్చే వర్షం, ఆపై వీచే గాలులు - ఈ క్రమమంతా ఈశ్వర సృష్టిలోని ఒక అద్భుతమైన చక్రం.


అద్వైత సిద్ధాంతం ప్రకారం, శరత్ ఋతువు వర్ణన వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటంటే..

"అభిధూన్వన్తః" (కదిలించడం) మరియు "అభిఘ్నన్తః" (దెబ్బతీయడం) అనే పదాలు మాయ యొక్క ‘విక్షేప శక్తి' ని సూచిస్తాయి. నిశ్చలంగా ఉన్న సముద్రం మీద గాలి వీచినప్పుడు తరంగాలు ఎలా వస్తాయో, నిర్గుణ బ్రహ్మపై మాయా వాయువు వీచినప్పుడు ఈ జగత్తు అనే చలనం పుడుతుంది.  


శరత్ కాలంలో వీచే గాలులు చెట్లను, ఆకులను ఎలా కదిలిస్తాయో, మన లోపల ఉన్న వాసనలు (Desires) మనస్సును అలా కదిలిస్తూ ద్వైత భ్రమను కలిగిస్తాయి. ఇదే మాయా విక్షేపం - The Disturbance of Maya.


వాయువు లేదా మరుత్తులు మన శరీరంలోని 'ప్రాణ శక్తి' కి సంకేతం. అద్వైతంలో ప్రాణము ఆత్మకు అత్యంత సన్నిహితమైన ఉపాధి. గాలి కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ, క్రియ మనకు తెలుస్తుంది.

అలాగే, ఆత్మ మనకు నేరుగా కనిపించకపోయినా, ప్రాణ చలనం ద్వారా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు. వాయువు సర్వవ్యాపి అయినట్లు, ఆత్మ చైతన్యం కూడా సర్వవ్యాపి.‘మరుద్గణాః’ అన్న వేద వాక్యము నకు ప్రాణ శక్తి అని భావం (అధ్యాత్మంలో). 


అధిభౌతికంలో (Physical/Material) లో వాయువే, అధ్యాత్మంలో (Microcosmic) లో ప్రాణ శక్తి యే, ఆదిదైవికంలో (Macrocosmic) బ్రహ్మ లేదా హిరణ్యగర్భుడు. దీనికి ప్రమాణం గా ‘నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాऽసి’ - ఓ! వాయు దేవతా! నీవు సాక్షాత్ బ్రహ్మ వే - అని తైత్తిరీయ ఉపనిషత్ శిక్షా వల్లి వేద వాక్యాన్ని చెప్పవచ్చు.


వర్ష ఋతువులో బురదగా ఉన్న నీరు శరత్ కాలం రాగానే నిర్మలంగా మారుతుంది. అద్వైత సాధనలో ఇది ఒక ముఖ్యమైన స్థితి. మనస్సులోని అజ్ఞానమనే బురద తొలగిపోయి, ఆత్మ అనే ఆకాశం నిర్మలంగా కనిపించే సమయం ఇది. 


"వాతవన్తః" అంటే వాయువు గూడు కట్టుకున్న మేఘాలను చెదరగొట్టినట్లు, జ్ఞానమనే వాయువు అజ్ఞానపు మేఘాలను తొలగించి సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. శరత్ - మల నివృత్తి - Clarity of Consciousness. పై విధంగా తాప త్రయాలను అన్వయించుకోవచ్చు.


శరత్ కాలంలో లోక వ్యవహారాలు (వాక్కులు) చురుగ్గా సాగుతాయి. కానీ అద్వైతం ఏం చెబుతుందంటే—ఈ మాటలు, ఈ పనులు అన్నీ 'ఇవ' (లాగా) మాత్రమే. అంటే ఇవి ప్రాతిభాసిక సత్యాలే తప్ప పరమార్థ సత్యాలు కావు. గాలి వీచినప్పుడు కలిగే శబ్దం ఎలా వచ్చి పోతుందో, ఈ జగత్తులోని వ్యవహారాలు కూడా అలాగే వచ్చి పోతుంటాయి. వాచః ప్రయుజ్యంతే అంటే నామరూప జగత్తు.


ఈ మంత్రం సారాంశం రెండు మాటల్లో చెప్పాలంటే, గాలి వీచినప్పుడు వృక్షాలు కదులుతున్నట్లు, మాయా ప్రభావం వల్ల నీ మనస్సులో వికారాలు కలగవచ్చు. కానీ గాలికి ఆధారం ఆకాశం ఎలాగో, ఆ ప్రాణ చలనానికి ఆధారం నీలోని ఆత్మయే. శరత్ కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు. ఈ మంత్రం ద్వారా ప్రకృతిలోని చలనాన్ని అంటే Kinetic energy, ఆత్మ యొక్క నిశ్చలత్వంతో రథచక్రం ఇరుసు (axle) వలె అనుసంధానం చేయడం జరిగింది.

6, మే 2026, బుధవారం

Mantra - 31

 Mantra - 31 ARUNAM 4 anuvaakam


అజ్ఞానమనే పొర నీ కంటిని కప్పి ఉంచినంత కాలం నీకు సత్యం కనిపించదు. సాధన ద్వారా ఆ పొరను తొలగించుకున్నప్పుడు, నీ బుద్ధి నిర్మలమై (విప్రసన్నే), నీవు ఏకత్వాన్ని దర్శిస్తావు అని పూర్వ మంత్రం ఉపదేశిస్తే, ఈ క్రింది మంత్రం సూర్యుడిని జీవన ప్రదాతగా కొలుస్తుంది.


"కనకాభాని వాసాగ్ంసి। 

అహతాని నిబోధత|

అన్నమశ్నీత మృజ్మీత। 

అహం వో జీవనప్రదః||”


ఇది సూర్యారాధనలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించ బడుతుంది. ఎందుకంటే ఇది భగవానువాచ. పరమాత్మ స్వయంగా చెప్పిన మాట ‘వలే’ ఈ మంత్రంలో ఉంది. ఇక్కడ సూర్య భగవానుడు స్వయంగా మానవాళికి తన ఉనికిని, రక్షణను మరియు జీవనాధారాన్ని వివరిస్తున్నట్లుగా ఉంటుంది.


‘కనకాభాని వాసాగ్ంసి’ - సూర్యుడు అంటున్నాడు - "’నేను బంగారు కాంతితో మెరిసిపోయే వస్త్రాలను ధరించిన వాడిని’ అని. ఇక్కడ వస్త్రాలు అంటే సూర్యుడి చుట్టూ ఉండే కిరణాలు లేదా ఆయన తేజస్సు అని అర్థం. సూర్యుడు బంగారు రంగులో ప్రకాశిస్తూ లోకాన్ని కప్పుతాడు.


“అహతాని నిబోధత” - ఆ సూర్యుని వస్త్రాలు (కాంతి పుంజములు) ఎప్పటికీ చెక్కుచెదరనివి (అహతాని - కొత్తవి లేదా నశించనివి) అని తెలుసుకోండి. సూర్య కాంతి ప్రతిరోజూ నూతనంగా, స్వచ్ఛంగా ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన కాంతిని గుర్తించమని (నిబోధత) వేదం చెబుతోంది.


"అన్నమశ్నీత మృజ్మీత” - సూర్యుడు అంటున్నాడు - ‘అన్నాన్ని భుజించండి, పరిశుద్ధులుగా ఉండండి’ అని. (మృజ్మీత - స్నానాదుల ద్వారా లేదా అంతఃశుద్ధి ద్వారా నిర్మలమవ్వడం)’. భగవంతుడు ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ, శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవాలని దీని అర్థం.


“అహం వో జీవనప్రదః" - సూర్య భగవానుడు స్వయంగా చెపుతున్నాడు - ‘నేనే మీకు జీవనాన్ని ప్రసాదించేవాడిని’ - అని. సూర్యుడు లేనిదే సృష్టిలో ప్రాణం లేదు. ఆయనే సకల ప్రాణకోటికి ఆహారాన్ని (photosynthesis ద్వారా), శక్తిని, ఆయుష్షును ఇచ్చే 'జీవనదాత'.


ఈ మంత్రం సూర్యుడిని 'ప్రత్యక్ష నారాయణుడు' గా స్థాపిస్తుంది. మనం తినే అన్నం (Energy) సూర్యుడి నుండే వస్తుంది కాబట్టి, ఆయనకు కృతజ్ఞతగా ఈ మంత్రాన్ని పఠిస్తాము. సూర్యుడు - జీవనదాత.


‘మృజ్మీత’ అనే పదం కేవలం బాహ్యమైన స్నానమే కాకుండా, సూర్యరశ్మి ద్వారా కలిగే ఆరోగ్య శుద్ధిని కూడా సూచిస్తుంది. ఆరోగ్యం మరియు శుద్ధి కారకుడు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలను చదువుతున్నప్పుడు, సూర్యరశ్మి మన శరీరంపై ప్రసరించేలా చూసుకుంటే అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా (ప్రాణశక్తి మరియు Vitamin D) ఎంతో మేలు జరుగుతుందని సదాచార సంపన్నులు అందరూ చెబుతుంటారు. భౌతిక భావన చూసాము. ఇంక…


తత్వాన్ని విచారిస్తే…

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం జీవుడికి మరియు పరమాత్మకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తుంది:


‘కనకాభాని’ - హిరణ్మయ పురుషుడు, - 

బంగారం ఎలాగైతే స్వచ్ఛతకు, వికార రహిత తత్వానికి సంకేతమో, పరమాత్మ కూడా అలాగే ఉంటాడు. ఉపనిషత్తులు పరమాత్మను 'హిరణ్మయ పురుషుడు' (బంగారు కాంతి గలవాడు) అని వర్ణిస్తాయి. ‘హిరణ్మయః పురుషుః’ - నారాయణోపనిషత్; హిరణ్మయేన పాత్రేణ - ఈశావాస్యోపనిషత్)

ఇక్కడ 'వస్త్రాలు' అంటే సూర్యుడి కిరణాలు మాత్రమే కాదు, సృష్టిలోని అనంతమైన శక్తులు.

అద్వైత దృష్టిలో, బంగారం నుండి తయారైన నగలు ఎలా బంగారమే అవుతాయో, ఆ హిరణ్మయ పురుషుడి నుండి వచ్చిన ఈ జగత్తు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. 


‘అహతాని’ - అవ్యయ తత్వం - 'అహత' అంటే దెబ్బతిననిది లేదా చిరగనిది. లౌకికమైన వస్త్రాలు పాతబడిపోతాయి, కానీ సూర్యుడి ప్రకాశం లేదా పరమాత్మ చైతన్యం ఎప్పటికీ పాతబడదు. అది నిత్య నూతనం. ‘నిబోధత’ అని అనడం ద్వారా—బయట కనిపించే అనిత్యమైన వస్తువుల మీద కాకుండా, ఎప్పటికీ నశించని (అహత) ఆత్మ తత్వం మీద దృష్టి పెట్టమని వేదం బోధిస్తోంది.


‘అన్నమశ్నీత మృజ్మీత’ - ఉపాధి ధర్మం - అద్వైతం ప్రపంచాన్ని మిథ్య అని చెప్పినా, శరీరమనే ఉపాధిని నిర్లక్ష్యం చేయమని చెప్పదు. ‘అన్నమశ్నీత’ (అన్నం తినండి) అంటే దేహాన్ని సక్రమంగా (bare minimum) ఉంచుకోమని అర్థం. ఎందుకంటే *శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం*—ఆత్మ విచారణ చేయాలన్నా ఈ శరీరం ఒక సాధనం. ‘మృజ్మీత’ అంటే శుద్ధి. కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, జ్ఞానమనే నీటితో అంతఃకరణను (మనస్సును) శుద్ధి చేసుకోవడం. శుద్ధమైన మనస్సులోనే సత్యం ప్రతిబింబిస్తుంది.


‘అహం వో జీవనప్రదః’ - అద్వైత సిద్ధాంతం ప్రకారం,

ఇక్కడ 'అహం' Pure I, Pure consciousness, నేను - అనేది సూర్యమండల మధ్యవర్తి అయిన పరమాత్మను సూచిస్తుంది. అద్వైతంలో 'అహం' అంటే పరిమితమైన అహంకారం (ego) కాదు, అది సర్వవ్యాప్తమైన 'నేను' (The Universal Self).


‘మీ అందరికీ జీవనాన్ని ఇచ్చేది నేనే’ అని చెప్పడం ద్వారా - జీవుడిలో ఉన్న ప్రాణ శక్తి, పరమాత్మ చైతన్యం కంటే వేరు కాదని స్పష్టమవుతోంది. సూర్యుడు లేనిదే ప్రాణం లేదు, ఆత్మ లేనిదే ఉనికి లేదు.


బంగారు కాంతితో నిరంతరం వెలిగే ఆత్మ వస్త్రం (చైతన్యం) నీలోనే ఉంది. నీవు తీసుకునే అన్నం, నీవు చేసే కర్మలు అన్నీ ఆ పరమాత్మ శక్తి వల్లే సాధ్యమవుతున్నాయి. నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు. ఆ ఏకత్వాన్ని గుర్తించి, పరిశుద్ధమైన మనస్సుతో జీవించు అని మంత్ర భావన. ఈ చిన్న మంత్రంలో ఊహకి అందని భావం ఎంత ఉందో కదా!

బుధవారం,మే 6,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం,మే 6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:పంచమి పూర్తి

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:మూల మ1.16 వరకు 

యోగం:సిద్ధం రా10.49 వరకు

కరణం:కౌలువ సా5.48 వరకు

తదుపరి తైతుల తె4.51 వరకు

వర్జ్యం:ఉ11.29 - 1.16 మరల రా11.48 - 1.33

దుర్ముహూర్తము:ఉ11.31 - 12.21

అమృతకాలం:ఉ6.10 - 7.57

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:ధనుస్సు     

సూర్యోదయం:5.36

సూర్యాస్తమయం:6.17

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻