16, మే 2026, శనివారం

*3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు

 💐💐💐💐💐💐

**3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు**

💐💐💐💐💐💐


ఒకసారి గ్రహాల మహిమ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రాజా విక్రమాదిత్యుడు శనీశ్వరుడికి సరైన గౌరవం ఇవ్వలేదని ఒక కథ చెబుతుంది. దాంతో శనీశ్వరుడు విక్రమాదిత్యునికి తన ప్రభావాన్ని అనుభవింపజేశాడు.


ఆ రాజు తన రాజ్యం, గౌరవం, సౌఖ్యాలు కోల్పోయి అనేక కష్టాలు అనుభవించాడు. కానీ అతను ధైర్యం, నిజాయితీ, సహనం కోల్పోలేదు.


చివరికి శనీశ్వరుడు ప్రత్యక్షమై, “కష్టాలలో కూడా నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నీకు మళ్లీ గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయి” అని అనుగ్రహించాడని కథ చెబుతుంది.


**కథ భావం:**

శని కాలం వచ్చినప్పుడు మనిషి పరీక్షించబడతాడు. కానీ నిజాయితీ, సహనం, ధర్మం విడవకపోతే చివరికి మంచి ఫలితం వస్తుందని ఈ కథ చెబుతుంది.

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*906393956💐💐💐💐💐💐

**3. రాజా విక్రమాదిత్యుడు మరియు శనీశ్వరుడు**

💐💐💐💐💐💐


ఒకసారి గ్రహాల మహిమ గురించి చర్చ జరుగుతున్నప్పుడు, రాజా విక్రమాదిత్యుడు శనీశ్వరుడికి సరైన గౌరవం ఇవ్వలేదని ఒక కథ చెబుతుంది. దాంతో శనీశ్వరుడు విక్రమాదిత్యునికి తన ప్రభావాన్ని అనుభవింపజేశాడు.


ఆ రాజు తన రాజ్యం, గౌరవం, సౌఖ్యాలు కోల్పోయి అనేక కష్టాలు అనుభవించాడు. కానీ అతను ధైర్యం, నిజాయితీ, సహనం కోల్పోలేదు.


చివరికి శనీశ్వరుడు ప్రత్యక్షమై, “కష్టాలలో కూడా నీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే నీకు మళ్లీ గౌరవం, ఐశ్వర్యం లభిస్తాయి” అని అనుగ్రహించాడని కథ చెబుతుంది.


**కథ భావం:**

శని కాలం వచ్చినప్పుడు మనిషి పరీక్షించబడతాడు. కానీ నిజాయితీ, సహనం, ధర్మం విడవకపోతే చివరికి మంచి ఫలితం వస్తుందని ఈ కథ చెబుతుంది.

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*9063939567*

💐💐💐💐💐💐7*

💐💐💐💐💐💐

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః ।

మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః ।। 23 ।।



ప్రతిపదార్థ:



యది — ఒకవేళ; హి — నిజముగా; అహం — నేను; న — కాదు; వర్తేయం — ప్రవర్తించు; జాతు — ఎప్పటికీ; కర్మణి — విహిత కర్మలు ఆచరించటంలో; అతంద్రితః — జాగ్రత్తగా; మమ — నా యొక్క; వర్త్మ — దారిని; అనువర్తంతే — అనుసరిస్తారు; మనుష్యాః — అందరు మనుష్యులు; పార్థ — అర్జునా, ప్రిథ పుత్రుడా; సర్వశః — అన్ని విధములుగా.



తాత్పర్యము : 



నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో, ఓ పార్థా, అందరు మనుష్యులు నా దారినే అన్ని విధాలుగా అనుసరిస్తారు.

   


వివరణ:


భూలోకంలో తన దివ్య లీలలలో భాగంగా, శ్రీ కృష్ణుడు ఒక రాజుగా మరియు గొప్ప నాయకుడుగా, తన పాత్రను నిర్వహించాడు. ఈ భౌతిక ప్రపంచంలో శ్రీ కృష్ణుడు, అత్యంత ధర్మాత్ముడైన వసుదేవ మహారాజు పుత్రునిగా, వృష్ణి వంశంలో అవతారమెత్తాడు. ఒకవేళ శ్రీ కృష్ణ పరమాత్మయే తన వేదవిహిత కర్మలను చేయకపోతే, అలా ఉల్లంఘించటమే ప్రామాణిక పద్ధతి అని అనుకొంటూ, ఎంతోమంది సామాన్య జనులు ఆయన అడుగుజాడల్లో నడుస్తారు. అలా చేస్తే జనులను తప్పుదారి పట్టించటంచే దోషుడనవుతాను అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.

16-05-2026 శనివారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

16-05-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. నూతన వస్తులాభాలు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.  

---------------------------------------  


వృషభం


సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


మిధునం


నూతన ఋణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికమౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన ఋణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల అండదండలతో ముందుకు సాగుతారు.

---------------------------------------


కన్య


ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొన్ని వ్యవహారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి.

---------------------------------------


తుల


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఆశజనకంగా సాగుతాయి. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది.  

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


మకరం


ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

---------------------------------------


కుంభం


కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయుట మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారపరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు ఉంటాయి.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

---------------------------------------

‘శని జయంతి

 **✨ అత్యంత అరుదైన ‘శని జయంతి’ & ‘శని అమావాస్య’ శుభాకాంక్షలు! ✨**

చరిత్రలో ఎంతో విశిష్టమైన రోజు ఈరోజు! శని భగవంతుని జన్మదినమైన **శని జయంతి**, శని దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన **శనివారం** రోజే రావడం... దానితో పాటు **శని అమావాస్య** కూడా కలిసి రావడం ఒక మహా అద్భుతమైన యోగం. 🙏🌑

ఇలాంటి పవిత్రమైన రోజున శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకాలు, పూజలు చేసి, ఈ క్రింది మంత్రాన్ని జపిస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి:

*“నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం*

*ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం”*

మన కర్మఫలాలను ఇచ్చే శని దేవుడు, ఈ రోజున ఆయనను భక్తితో కొలిచే వారిని కష్టకాలంలో ఎల్లప్పుడూ వెన్నంటి ఉండి కాపాడతాడు. కాబట్టి ఈ అరుదైన రోజున అందరూ వీలైనంత వరకు పూజలు చేసుకుని, దానధర్మాలు చేసి, ఆ శ్రీ మహా శని మహాదేవుని కృపాకటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను.

**శ్రీ మహా శని మహదేవాయ నమః!** 🕉️🙏

 *భూపతి లక్ష్మీ నవీన్* *కుమార్*

15, మే 2026, శుక్రవారం

శనివారం🍁* *🌹16, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     *🍁శనివారం🍁*

  *🌹16, మే, 2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*                  


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : అమావాస్య* రా 01.30 ఉపరి *అధిక జ్యేష్ఠ మాసారంభః*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : భరణి* సా 05.30 వరకు ఉపరి *కృత్తిక*

*యోగం : సౌభాగ్య* ఉ 10.26 వరకు ఉపరి *శోభన*

*కరణం  : చతుష్పాద* మ 03.22 నాగ రా 01.30 ఉపరి *కింస్తుఘ్న*

*సాధారణ శుభ సమయాలు*

            *-ఈరోజు లేవు-*       

 అమృత కాలం  : *మ 01.15 - 02.40*

అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : శేషం ఉ 06.10 & రా.తె 04.01 - 05.25 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 05.37 - 07.20* 

*రాహు కాలం  :ఉ 08.50- 10.27*

గుళికకాళం      : *ఉ 05.37 - 07.13*

యమగండం    : *మ 01.41 - 03.18*

సూర్యరాశి : *వృషభం*                    

చంద్రరాశి : *మేషం/వృషభం*

సూర్యోదయం :*ఉ 05.44*  

సూర్యాస్తమయం :*సా 06.41*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:* 

ప్రాతః కాలం   :  *ఉ 05.37 - 08.12*

సంగవ కాలం    :*08.12 - 10.46*

మధ్యాహ్న కాలం    :*10.46 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.56*

*ఆబ్ధికం తిధి  :వైశాఖ అమావాస్య*

సాయంకాలం    :*సా 03.56 - 06.31*

ప్రదోష కాలం       :*సా 06.31- 08.44*

రాత్రి కాలం         :*రా 08.44- 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     *🙏శ్రీ వేంకటేశ్వర స్తోత్రం🙏*


*హరే వేంకటేశ ప్రసీద ప్రసీద* 

*ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ*


*!!.ఓం నమో వెంకటేశాయ నమః.!!*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️


        *🍁హనుమకృత🍁*

   *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*కౌసల్యా గర్భ సంభూతం* 

*వేదిగర్భోదితం స్వయం !*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><>><


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం


        *శ్రీ మహావిష్ణు పురాణం*                                       

                 *89వ భాగం*


*నరనారాయణ అవతారాలు*```


బ్రహ్మ మానస పుత్రుడైన ధర్ముడికి దక్ష ప్రజాపతి తన పది మంది కుమార్తెలను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మానికి అధిష్టాన దేవత అయిన ధర్ముడు తపస్సు చేసి విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించాడు. మహావిష్ణువు వరం కోరు కోమనగా శ్రీహరిని పుత్రుడిగా కావాలని కోరుకున్నాడు. తగిన సమయంలో జన్మిస్తాను అని వరమిచ్చి విష్ణువు అంతర్ధానమయ్యాడు.


కొంతకాలానికి ధర్ముడికి విష్ణువు "నరుడు నారాయణుడు" అనే నామాలతో ఇద్దరు కుమారులుగా జన్మించాడు. ధర్మదేవత ధర్ముడి పుత్రులైన నరనారాయణులు వేద విద్యలతో పాటు అధర్వణ వేదంలోని యుద్ద విద్యలు అభ్యసించారు. బ్రహ్మదేవుడు నరుడికి 'అజగవము' అనే ధనుస్సు, నారా యణుడికి 'శార్ఞగము" అనేధనుస్సు అక్షయ తూణీరాలతో ప్రసాదించాడు.


నరనారాయణులు తపోదీక్ష స్వీకరించి హిమాలయాలలోని బదరికావనానికి వెళ్లి తపస్సు చేయసాగారు. బదరికావృక్షములతో నిండి ఉండటం చేత ఆ వనానికి బదరికావనం అని పేరు వచ్చింది. బదరికాశ్రమం ఏర్పరచుకుని నరనారాయణులు లోకంలో ధర్మ సంస్థాపనకై చేస్తున్న తపస్సు కి వేయి సంవత్సరాలు గడిచాయి.


హిరణ్యకశిప సంహారం తరువాత రాజైన ప్రహ్లాదునికి చ్యవన మహర్షి ద్వారా సంవత్సరాల తరబడి ధర్మ సంస్థాపనకై తపస్సు చేస్తున్న మహర్షులు ఉండే ప్రదేశాలైన నైమిశారణ్యం, బదరికావనం గురించి విన్నాడు. యజ్ఞ యాగాదులతో, నిరంతర తపస్సులతో తపోభూములుగా ప్రసిద్ధికెక్కిన రెండు పుణ్యస్థలాలను దర్శించాలని బయలుదేరాడు.


మొదట నైమిశారణ్యం చేరిన ప్రహ్లాదుడు అక్కడి మహర్షులను దర్శించి ఆశీస్సులు పొందాడు. వారి ద్వారా నరనారాయణుల గురించి విని బదరికావనం బయలుదేరి వెళ్లాడు. బదరికాశ్రమంలో నిశ్చల ధ్యానంలో ఉన్న నరనారా యణులను దర్శించాడు. నారవస్త్రాలు ధరించి కృష్ణాజినాలపై తపస్సులో ఉన్న నర నారాయణుల ముందు ధనుస్సులు, అక్షయ తూణీరాలు (బాణాలు) ఉండటం గమనించి విస్మయం చెందాడు.


తపస్సు చేసేవారి వద్ద ఆయుధాలు ఉండటం ధర్మవిరుద్ధం అని భావించి ప్రహ్లాదుడు వారితో "నరనారాయణులారా! బ్రహ్మ వంశస్థులు, బ్రాహ్మణులైన మీరు మీ వర్ణాచారం ప్రకారం తపస్సు చేయాలి. మరి ఈ ధనుస్సులు బాణాలు ఎందుకు చేపట్టారు? ధర్మదేవత ధర్ముడి పుత్రులైన మీరు అధర్మంగా ఆయుధాలు చేపట్టడం తప్పు. ధర్మదేవత పుత్రులే అధర్ములైతే నేను సహించను. మీరు ఆయుధాలను తక్షణం వదిలేయండి" అని హెచ్చరించాడు.


నరుడు నవ్వి "ప్రహ్లాద మహారాజా! ధర్మ పరిరక్షణ కూడా బ్రాహ్మణుల విధ్యుక్త ధర్మంలో భాగము అని మీకు తెలియదా! వేదశాస్త్రాలతో పాటు యుద్దవిద్యలు మీవంటి వారికి నేర్పించేది మేమే అని మరచిపోయారు. సమస్త విద్యలకు ఆచార్యులమైన మేము తపస్సు చేయడానికి, ధనుస్సు ధరించడానికి అర్హులం, సమర్ధులం. అనవసర ప్రసంగం మాని మీరు మీ దారిన వెళ్ళండి" అని అన్నాడు.


మహావిష్ణువు ప్రియ భక్తుడైన ప్రహ్లాదునికి నరుడు చులకనగా మాట్లాడేసరికి ఆగ్రహం వచ్చింది. "మీరు మాతోటి యుద్దంచేయగల సమర్థులా? రండి!తేల్చుకుందాం" అని నరనారాయణులతో యుద్దానికి దిగాడు. 


సరేనని నరనారాయణులు ధనుస్సులు ధరించి యుద్దానికి దిగారు.


ప్రహ్లాదుడు, నరనారాయణుల మధ్య భీకర ధనుర్యుద్ధం మొదలైంది. బాణాలు శరపరంపరలుగా కురిశాయి. ఆకాశం బాణాలతో కమ్ముకుపోయింది. నారాయణుని ప్రియభక్తునికి, నారాయణుని అంశావతారాలైన నరనారాయణులకు నూరు సంవత్సరాలు యుద్దం జరిగింది. ప్రశాంత వాతావరణం కలిగిన బదరికావనం ధనుష్టంకార ధ్వను లతో, బాణాల శబ్దాలతో దద్దరిల్లి పోయింది.


తాపసులందరు యుద్దం ఆపేలా చేయమని వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుని ప్రార్ధించారు. మొరలాలకించిన శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ప్రహ్లాదుడు, నరనారాయణులు యుద్దం ఆపి నారాయణునికి నమస్కరించారు. నారాయణుడు ప్రహ్లాదుని చూసి


"ప్రహ్లాదా! నరనారాయణులు నా అంశావతారులుగా జన్మించారు. జితేంద్రియులైన వీరు భవిష్యత్తులో ధర్మ సంస్థాపన కోసం జన్మించబోయే అవతార మూర్తులుగా ఉండటానికి ఈ జన్మలో ధనుర్విద్యలు అభ్యసించి ధను ర్భాణాలు ధరించారు. ఈ జన్మ లో తపస్సుతో, వచ్చే జన్మలో శస్త్రాస్త్రాలతో ధర్మ ప్రతిష్టాపన చేస్తారు. కనుక నా అవతార మూర్తులతో యుద్దం తక్షణం విరమించు! అపజయం అని భావించక యుద్ద విరమణ చేసి నీ రాజ్యానికి వెళ్లుము" అని ప్రబోధించాడు.


ప్రహ్లాదుడు నారాయణునితో పాటు నరనారాయణులకు నమస్కరించి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. నరనారాయణులు శ్రీమహావిష్ణువుకి నమస్కరించి "శ్రీమన్నారాయణా! నీవు "బదరీనాథుడు" గా ఇక్కడ స్వయంభువు మూర్తిరూపంలో వెలసి భక్తులకు నీ సుందర విగ్రహ దర్శనం కలిగించుము" అని ప్రార్ధించారు.


శ్రీహరి వారి ప్రార్థనకి సంతోషించి "నేను బదరీనాథుడిగా స్వయంభువునై ఇక్కడ అవతరిస్తాను. మీరు మీ జన్మాంతమున నాకు ఇరు వైపులా నర-నారాయణ పర్వతములుగా వెలసి నన్ను దర్శించే భక్తులను రక్షిస్తుంటారు. కలియుగాంతం వరకు ఈ ప్రదేశం బదరీనాథ్ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉంటుంది" అని వరమిచ్చి వెలిసాడు. 


నరనారాయణుల తో జరిగిన యుద్దంలో ప్రహ్లాదుడు పరాజయం పొందాడని తెలిసి ఇంద్రుడు ఆందోళన చెందాడు. నరనారాయణులు స్వర్గాధిపత్యం కోసం తపస్సు చేస్తున్నారని భావించి భంగం చేయడానికి రంభ తిలోత్తమ మేనకాది అప్సరసలను రతీ మన్మథుల వెంట పంపాడు.


మన్మధుడు తన మాయతో బదరికావనంలో వసంత ఋతువు వచ్చేటట్టు చేసాడు. మన్మథ బాణాలు ప్రయోగించి మునులందరిని మన్మథవికారానికి గురి చేసాడు. రంభాది పద హారు వేల అప్సరసలు శృంగార నృత్యాలు చేస్తూ మునులకు తపోభంగం చేయసాగారు. నారాయ ణుడు కన్నులు తెరచి వారందరిని ఇంద్రుడు ఎందుకు పంపించాడో గ్రహించాడు. రంభాది అప్సరసల కన్నా సుందరమైన అప్సరసను సృష్టించి గర్వభంగం చేయాలని తన ఊరువుని (తొడను) గట్టిగా చరిచాడు.


రంభాదులను మించిన అద్భుత సౌందర్యరాశి నారాయణుని ఊరువుల నుండి ఉద్భవించింది. ఊరువుల నుండి పుట్టింది కాబట్టి "ఊర్వశి" అనే నామం పొందింది. రంభాది అప్సరసలకు "తామే జగదేక సౌందర్యవతులము, ఎటువంటి తపస్వులనైనా మోహపరచి తపోభంగం చేయగలం" అనే గర్వం భంగం అయ్యింది. నారాయణునికి నమస్కరించి తమ ఓటమిని అంగీకరించారు.


నారాయణుడు వారిని క్షమించి చిరునవ్వుతో "దేవకాంతలారా! మీ తప్పు లేదు. ఇంద్రుడు ఆదేశించగా వచ్చారు. ఓటమిని అంగీకరించిన నిలిచిన మీ వినయానికి ప్రసన్నుడైనాను. వరం ఇస్తాను. కోరుకోండి! ఈ ఊర్వశిని నా కానుకగా ఇంద్రుడికి అందచేయండి" అన్నాడు.


రంభాది పదహారు వేల యాభై దేవకాంతలు నరనారాయణుల పాదాలకు ప్రణమిల్లి "నారాయణ మహర్షీ! వరమిస్తాను అన్నారు కనుక మేమందరం ఒకే కోరిక కోరుతున్నాము. మాకు ఇంద్రుడు వద్దు స్వర్గము వద్దు మమ్మల్నందరి ని మీ భార్యలుగా చేసుకోండి. మీకు సేవలు చేస్తూ ఇక్కడే ఉండి పోతాం" అని కోరారు.


నారాయణ మహర్షి మందహాసంతో "దివ్యరమణులారా! ఈ జన్మలో మేము తపస్వులుగా ఉంటూ గృహస్థాశ్రమం స్వీకరించ కూడదు అని నిర్ణయించుకున్నాము. మా తపస్సు త్వరలో ముగించి ఈ దేహాలను వదిలే స్తాము. మా పార్థివ శరీరాలు నరనారాయణ పర్వతాలుగా మారి కలియుగాంతం వరకు బదరీనాథుని సేవిస్తాయి.


వచ్చే ద్వాపర యుగంలో నేను శ్రీకృష్ణుడిగా, నరుడు అర్జునుడిగా భూమిపై జన్మిస్తాము. అప్పుడు మీరు వివిధ దేశాల రాజకుమార్తెలుగా జన్మించి నరకాసురుని చెఱలో ఉంటారు. నేను మిమ్మల్ని రక్షించి వివాహం చేసుకుంటాను. అప్పుడు మీరందరు నా భార్యలు అవుతారు. అందాకా ఈఊర్వశిని తీసుకుని దేవలోకం వెళ్లి ఉండండి" అని చెప్పడంతో సంతృప్తి చెంది రంభాది అప్సరసలు ఊర్వశిని తీసుకుని వెళ్లి పోయారు.


కొంతకాలానికి నరనారాయణులు దేహం వదలి నారాయణునిలో లీనమై పోయారు. వారి దేహాలు పర్వతాలుగా మారి బదరీనాథు నికి ఇరువైపులా నర-నారాయణ గిరులుగా ప్రసిద్ధి చెందాయి. బదరీ నాథుడు రెండు పర్వతాల మధ్య ఉన్నత ప్రదేశంలో ఉండి భక్తులకు దర్శన భాగ్యం ఇస్తున్నాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగము

 


దేవుడి పూజలో దీపం

 *దేవుడి పూజలో దీపం - అలంకారం ఏది ముందు? వత్తులు ఎన్ని?* 🙏


మీ సందేహం చాలా మందికి ఉంటుంది. శాస్త్రం ప్రకారం క్లియర్‌గా చెప్తాను.


*1. దీపం ముందా? అలంకారం ముందా?*


*జవాబు: ముందు దీపం వెలిగించాలి, తర్వాతే అలంకారం.*


*కారణం*: 

1. *దీపం = జ్యోతి స్వరూపుడు*. దేవుడు జ్యోతి రూపంలో వస్తాడు. దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహం - దీపమే పరబ్రహ్మం, చీకటిని పోగొట్టేది. 

2. చీకట్లో దేవుడికి అలంకారం చేయకూడదు. *వెలుగులోనే దేవుడిని చూసి, అలంకరించాలి*. 

3. పూజ మొదలుపెట్టేదే *దీపారాధనతో*. దీపం వెలిగించాకే దేవుడు మన ఇంట్లో ఉన్నట్టు, ఆహ్వానించినట్టు. ఆ తర్వాత స్నానం, అలంకారం, నైవేద్యం.


*సరైన క్రమం*: 

స్నానం → శుభ్రమైన బట్టలు → *దీపం వెలిగించడం* → గంట కొట్టడం → ఆచమనం → అలంకారం, పూలు పెట్టడం → ధూపం, నైవేద్యం → హారతి.


*2. దేవుడి ముందు దీపంలో ఎన్ని వత్తులు వేయాలి?*


వత్తుల సంఖ్యకు చాలా అర్థం ఉంది. *బేసి సంఖ్యలో వేయాలి - 1, 3, 5, 7, 9*.

వత్తుల సంఖ్య ఫలితం ఎవరికి పెట్టాలి

1 వత్తి ఆయుష్షు, ఆరోగ్యం రోజూ దీపారాధనకు, దేవుడి పటాలకు

2 వత్తులు పెట్టకూడదు అశుభం. శవానికి మాత్రమే 2 వత్తులు.

3 వత్తులు త్రిమూర్తులు, సంతానం లక్ష్మీదేవి, దుర్గమ్మకు విశేషం

5 వత్తులు పంచ భూతాలు, ఐశ్వర్యం అన్ని దేవుళ్ళకు శ్రేష్టం

7 వత్తులు సప్త ఋషులు, విజయం వెంకటేశ్వరుడికి, శివుడికి

9 వత్తులు నవగ్రహ దోష నివారణ అమ్మవారు, సుబ్రహ్మణ్యుడికి

*రోజూ ఇంట్లో పెట్టే దీపానికి 1 లేదా 5 వత్తులు చాలు*. పండుగలు, శుక్రవారం, మంగళవారం నాడు 5 లేదా 9 వత్తులు పెట్టండి.


*3. "3 వత్తులు వేస్తే 2 ఒకటిగా, 1 విడిగా ఉంచాలి" - నిజమేనా?*


*అవును అండి, ఇది 100% నిజం. శాస్త్ర సమ్మతమే.*


*కారణం*: 

1. *2 వత్తులు కలిపి ఒకటిగా* వెలిగించాలి, *మూడో వత్తి విడిగా* ఉంచాలి.

2. ఎందుకంటే *2 వత్తులు విడివిడిగా వెలిగిస్తే అది అశుభం*. 2 వత్తులు శవానికి, ఆపదలకు గుర్తు. 

3. 3 వత్తులు పెట్టినప్పుడు 2+1 = 3 అవుతుంది. అంటే బేసి సంఖ్య. ఇది శుభం.


*ఎలా పెట్టాలి*: 3 వత్తులు తీసుకుని, 2 వత్తులను పేని ఒకటిగా చేయండి. మూడోది అలాగే ఉంచండి. ఇప్పుడు దీపంలో *రెండు జ్వాలలు* మాత్రమే వస్తాయి - ఒకటి లావుగా, ఒకటి సన్నగా. ఇదే సరైన పద్ధతి.


*లక్ష్మీదేవికి 3 వత్తులు* పెడితే - 2 వత్తులు లక్ష్మీనారాయణులకు, 1 వత్తి మన ఇంటి క్షేమానికి అని అర్థం.


*4. వత్తులకు సంబంధించి ఇంకొన్ని ముఖ్య నియమాలు*


1. *వత్తులు*: పత్తితో చేసినవి శ్రేష్టం. తామర వత్తులు లక్ష్మీదేవికి, అరటి నార వత్తులు శివుడికి ఇష్టం.

2. *నూనె*: ఆవు నెయ్యి ఉత్తమం, తర్వాత నువ్వుల నూనె, కొబ్బరి నూనె. వేరుశనగ నూనె వాడకూడదు.

3. *దిశ*: దీపం జ్వాల *తూర్పు లేదా ఉత్తరం* వైపు ఉండాలి. దక్షిణం వైపు అస్సలు పెట్టకూడదు.

4. *వెలిగించడం*: అగ్గిపుల్లతో నేరుగా వెలిగించకూడదు. వేరే దీపంతో లేదా కర్పూరంతో వెలిగించాలి.

5. *ఆర్పడం*: నోటితో ఊది ఆర్పకూడదు. పువ్వుతో గానీ, పత్తితో గానీ నెమ్మదిగా అదమాలి.


*గుర్తుంచుకోండి*: ఏక వర్తికా దీపం వా యో దద్యాత్ సదాశివే - ఒక్క వత్తితో దీపం పెట్టినా చాలు, భక్తితో పెడితే శివుడు సంతోషిస్తాడు.


కాబట్టి *ముందు దీపం, తర్వాత అలంకారం*. వత్తులు *1 లేదా 3 లేదా 5*. 3 పెడితే *2+1* పద్ధతి పాటించండి.


మిమ్ము దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటు...🙏🏻

శంఖుపూల మొక్కశంఖుపూల మొక్క

 🙏🌺 *శంఖుపూల మొక్క* 🌺🙏


🌺మతిమరుపు... యాభై పైబడిన వాళ్లలో క్రమేణా పెరుగుతోంది. క్యాన్సర్‌... వయసుతో సంబంధం లేకుండా నిశ్శబ్దంగా కబళిస్తోంది. ఆందోళన... చిన్నాపెద్దా అందరినీ కుంగదీస్తోంది. బీపీ, మధుమేహం... ఇలా మరెన్నో ఆరోగ్య సమస్యలు ఎందరినో ముప్పుతిప్పలు పెడుతున్నాయి. వీటన్నింటికీ చూడచక్కని పరిష్కారమే శంఖుపుష్పి అంటున్నారు సంప్రదాయ వైద్యులు..!🌺


🌺అనగనగా ఓ అడవి... అక్కడ మనుషులతోపాటు చిత్రమైన జంతువులూ ఉండేవట. ఒకరోజు ఇస్రా అనే మహిళని సగం మనిషి సగం పక్షి ఆకారంలో ఉన్న కిన్నారి అనే విచిత్రజీవి వచ్చి ఓ పూలవనంలోకి తీసుకెళ్లిందట. అక్కడ ఇస్రాకి ఎన్నడూ చూడని ఓ నీలి పుష్పం కనిపించింది. ‘ఈ మొక్కని తీసుకెళ్లి పాకించు. ఊరందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది’ అని చెప్పింది కిన్నారి. అలాగే చేసింది ఇస్రా. కొన్నాళ్లకి అది గోడంతా పాకి విరబూసింది. ఓ పువ్వుని కోసి, కాసిని మరిగించిన నీళ్లలో వేసి, నిమ్మరసం పిండింది. అది కాస్తా గులాబీ రంగులోకి మారిపోయింది. ఆ రంగుని చూసి ఆనందపడిపోతూ ఇస్రా చుట్టుపక్కలవాళ్లకీ ఆ పానీయాన్ని ఇచ్చిందట. ఆ రంగుకి ఫిదా అయిపోయిన వాళ్లంతా దాన్ని తాగడం అలవాటు చేసుకుని ఆరోగ్యంగా జీవించారట. థాయ్‌లాండ్‌ వాసులు నీలి టీని చప్పరిస్తూ ఇప్పటికీ ఈ జానపద కథని తలచుకుంటారు. ఆ కథలోని నీలి పువ్వే మన శంఖుపుష్పి. దీన్నే అపరాజిత, గోకర్ణ, గెంతన... ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఊదా, తెలుపూ రంగుల్లో మాత్రమే కనిపించే ఈ పూల తీగ, ఎరుపూ గులాబీ నీలం రంగుల్లోనూ వికసిస్తోంది. ఆ టీని ఇప్పుడు మన దగ్గరా చప్పరిస్తున్నారు.🌺


🌺అవునండీ... ఈమధ్య కొందరి ఇళ్లల్లో ఓ తీగ మొక్క కనిపిస్తోంది. అయితే ఆ మొక్కకి పువ్వులు మాత్రం కనిపించడం లేదు. వాటిని ఏ రోజుకారోజు కోసుకుని టీ రూపంలో తాగేస్తున్నారు మరి. నిజానికి శంఖుపుష్పం పూలతీగగా మనకీ సుపరిచితమే. పశుగ్రాసంగానూ వాడేవారు. కానీ అదో అద్భుతమైన ఔషధమొక్క అన్నది సంప్రదాయ, ఆయుర్వేద వైద్యులకే తెలుసు.🌺


🌺శంఖు మొక్క పువ్వులే కాదు, ఆకూ వేరూ కాండమూ గింజా అన్నీ ఆరోగ్యకరమైనవే. నెలసరి ఇబ్బందులకి పూల కషాయాన్ని ఇస్తే, విషపదార్థాలకి విరుగుడుగా వేళ్లతో చేసిన మందుని ఇచ్చేవారట. పాముకాటుకి తెలుపురంగు శంఖు మొక్క వేళ్లను నూరి ఇస్తుంటారు. సొరియాసిస్‌కీ ఈ మందు పనిచేస్తుందట. పంచకర్మ వైద్యంలోనూ వాడతారు. ఇక, ఈ పూలని ఆగ్నేయాసియా దేశాల్లో ఆహారపదార్థాల్లో రంగుకోసం పూర్వం నుంచీ వాడుతున్నారు. వాటితో వంటలూ చేస్తుంటారు. ఈ మొక్క లేతకాయల్ని కూరగానూ వండుతారట. అంతర్జాలం పుణ్యమా అని ఇప్పుడు ప్రపంచమంతా ఆ పూలని తింటున్నారు, తాగుతున్నారు.🌺


🌺ఎందుకు మంచిదంటే.


ఈ మొక్కలో ఫ్లేవనాయిడ్లూ కెటెచిన్‌లూ పాలీఫినాల్సూ... ఇలా అనేక యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. అవన్నీ రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు హానికర పదార్థాలను బయటకు పంపిస్తాయి. పూలల్లో కాల్షియం, మెగ్నీషియం, సోడియం... వంటి పోషకాలూ ఉంటాయి. ఇందులోని ప్రొయాంథోసైనిన్‌ అనే యాంటీఆక్సిడెంటు రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందట. అందుకే ఈ పూలతో చేసిన టీ తాగడం పెరిగింది.🌺


🌺మతిమరుపు రాకుండా: శంఖు పూలు, ఆకులు, వేళ్లతో చేసిన పొడి నాడీవ్యవస్థ పనితీరుని పెంచడం ద్వారా జ్ఞాపకశక్తినీ తెలివితేటల్నీ పెంచుతుందనీ; నిద్రలేమికీ డిప్రెషన్‌కీ మందులా పనిచేస్తుందని ఆధునిక వైద్యులూ చెబుతున్నారు. ఇందులోని ఆర్గనెల్లోలిన్‌ అనే పదార్థం, శరీరంలో ఎసిటైల్‌ కోలీన్‌ అనే న్యూరోట్రాన్స్‌మిటర్‌ శాతాన్ని పెంచి మెదడు పనితీరుకి తోడ్పడుతుందనీ, తద్వారా వయసుతోబాటు వచ్చే మతిమరపుని తగ్గిస్తుందనీ అంటున్నారు.


జీర్ణశక్తికి: వారానికి రెండుసార్లు చొప్పున పరగడుపున శంఖుపూలూ లేదా ఆకుల్ని మరిగించిన కషాయం తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ పోయి జీర్ణవ్యవస్థ బాగుంటుంది. ఇది పొట్టలో మంటనీ మలబద్ధకాన్నీ తగ్గిస్తుంది. గ్యాస్ట్రైటిస్‌, వాంతులు, వికారాలకీ మందే. ఈ మొక్క గింజల్ని పొడి చేసి గ్రా. చొప్పున రెండు పూటలా తిన్నా మంచిదేనట.🌺


🌺చర్మసౌందర్యానికి: కొల్లాజెన్‌ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం సాగుదలని పెంచి, వయసుతోబాటు వచ్చే ముడతల్నీ చర్మంమీది మచ్చల్నీ తగ్గిస్తుందట. అందుకే ప్రస్తుతం దీన్ని అనేక సౌందర్యోత్పత్తుల్లోనూ వాడుతున్నారు. ఇందులోని క్యుయెర్సిటిన్‌ అనే ఫ్లేవనాయిడ్‌ జుట్టుని త్వరగా నెరవనీయదట.


క్యాన్సర్లకి: ఈ పూల టీలోని సైక్లోటైడ్లు క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకుంటాయట. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ నివారణలో శంఖుపూల కషాయం మంచి ఫలితాన్ని ఇచ్చినట్లు పరిశీలనలు చెబుతున్నాయి.🌺


🌺జ్వరంగా ఉంటే: ఈ టీ తాగితే జ్వర తీవ్రత, దగ్గు, జలుబు తగ్గుతాయట. 


చూపు తగ్గుతుంటే: శంఖుపువ్వులోని ప్రొయాంథోసైనిడిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కంటి నరాల్లో రక్తసరఫరాని పెంచడం ద్వారా గ్లకోమాని నిరోధించడంతోబాటు రెటీనా దెబ్బతినకుండా చేస్తుంది. తరచూ కళ్లు ఎర్రబడటం, వాయడం, ఇన్ఫెక్షన్‌కు గురయ్యేవాళ్లకి ఈ పూల టీ మంచి మందు.🌺


🌺సంతానోత్పత్తికి: రోగనిరోధకశక్తికి మారుపేరైన శంఖుపుష్పం శృంగారప్రేరితం కూడా. క్రమం తప్పక తాగడం వల్ల శుక్రకణాల శాతం పెరుగుతుందట. నెలసరిని క్రమబద్ధీకరించేందుకూ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పనితీరుకీ తోడ్పడుతుంది.


కొవ్వు పెరిగితే: రోజూ శంఖుపూల టీని తాగితే కొలెస్ట్రాల్‌ శాతం తగ్గినట్లు పరిశీలనలు చెబుతున్నాయి. అయితే పూలకన్నా వేళ్ల నుంచి తీసిన ఎక్స్‌ట్రాక్ట్‌ లేదా గింజలను పొడి చేసి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి మంచి కొలెస్ట్రాల్‌ పెరిగినట్లు చెబుతున్నారు. రక్తంలో క్లాట్స్‌ ఏర్పడకుండానూ బీపీని అదుపులో ఉంచేందుకూ తోడ్పడుతుందీ మొక్క.🌺


🌺చక్కెరవ్యాధికి: శంఖుపూలలో సమృద్ధిగా ఉండే ఫినాలిక్‌ ఆమ్లం, ఫినాలిక్‌ అమైడ్‌లు ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచడంతోపాటు జీవక్రియను నియంత్రిస్తాయి. అంటే- రక్తంలో గ్లూకోజ్‌ నిల్వలు లేకుండా చేస్తాయి. భోజనానికి ముందు ఈ టీ లేదా కషాయాన్ని తాగడం వల్ల ఆకలిని నియంత్రించడం ద్వారా బరువు తగ్గడానికీ తోడ్పడుతుంది.


అదీగాక, కొన్ని రకాల మొక్కల్లోనే సైక్లోటైడ్లూ పెప్టైడ్లూ ఉంటాయి. అలాంటివాటిల్లో ఒకటైన శంఖు మొక్కలోని సైక్లోటైడ్లకి హెచ్‌ఐవీ వైరస్‌నీ అడ్డుకునే గుణం ఉందట. ఇంకా శంఖుపూలు మూత్ర, శ్వాస సమస్యల్నీ నివారిస్తాయి. పంటినొప్పికీ మశూచికానికీ డయేరియా నివారణకీ గొంతు శ్రావ్యంగా ఉండేందుకూ తలనొప్పికీ... ఇలా ఎన్నో సమస్యలకు శంఖుమొక్క మంచి మందు. సాధారణంగా పండ్లూ కూరగాయలన్నింట్లోనూ ఉండే ఫ్లేవనాయిడ్‌ శంఖు పూలల్లోనూ ఉంటుంది. అది చురుకైన యాంటీఆక్సిడెంట్‌లా పనిచేస్తూ వయసుతోబాటు పెరిగే హానికర ఫ్రీరాడికల్స్‌ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా అనేక వ్యాధుల్ని అడ్డుకుంటుంది. అందుకే ఇంటింటా ఓ శంఖుపూల మొక్క ఉంటే అంతా మేలే.🌺


🌺ఎలా వాడతారు


ఈ పువ్వుని గ్రీన్‌ టీ మాదిరిగానే తాగితే మంచిది. పువ్వుల్ని సలాడ్లలో తినొచ్చు. ఎండబెట్టి చేసిన పువ్వులూ లేదా పొడిని కాఫీలో కేకుల్లో ఐస్‌క్రీముల్లో డెజర్ట్‌ల్లో జ్యూసుల్లో... ఇలా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. కాసిని పూలని నీళ్లలో వేసి మరిగించి దించాక వచ్చిన నీలి రంగు టీలో కాస్త నిమ్మరసం పిండితే అది ముదురు గులాబీరంగులోకి మారుతుంది. రసం పిండేకొద్దీ లేత రంగులోకి వస్తుంటుంది. అందులో మళ్లీ తేనె కలిపితే ముదురు గోధుమ వర్ణం వస్తుంది. దీన్ని వేడిగా చల్లగా ఎలా తాగినా మంచిదే. పైగా గులాబీ ఎరుపూ రంగుల్లో విరబూసే శంఖుపూలూ ఉంటున్నాయి. కాబట్టి ఈ పూలను మరిగించి చల్లార్చిన నీటిలో నిమ్మరసం పిండి, రెండు ఐస్‌క్యూబ్స్‌ వేసిన షర్బత్‌లను అతిథులకి అందిస్తే ఆ రంగుల గమ్మత్తుని చూస్తూ గ్లాసు ఖాళీ చేసి మిమ్మల్ని అభినందించేేయడం ఖాయం!

( సేకరణ)

అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో

  భారత ఉపఖండంలోని అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న త్రిపుర సుందరి ఆలయంలో (దీనిని భక్తులు ప్రేమగా 'మాతాబారి' అని పిలుచుకుంటారు) భక్తులు అమ్మవారిని అపారమైన భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.


​కూర్మ పీఠం: ఈ ఆలయం తాబేలు ఆకారంలో నిర్మించబడటం వల్ల దీనిని "తాబేలు దేవాలయం" అని కూడా పిలుస్తారు. ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు శాంతిని, ఐశ్వర్యాన్ని మరియు ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రసాదిస్తుంది.


​కళ్యాణ్ సాగర్: ఆలయం చుట్టూ పవిత్రమైన 'కళ్యాణ్ సాగర్' సరస్సు ఉంది. ఇందులో ఉండే తాబేళ్లు మరియు చేపలను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రకృతికి, భక్తికి మరియు ప్రాచీన తాంత్రిక సంప్రదాయాలకు మధ్య ఉన్న సామరస్యానికి నిదర్శనం.


​దైవ స్వరూపం: నల్లరాతితో మలచబడిన త్రిపుర సుందరి దేవి విగ్రహానికి భక్తులు పూలు, దీపాలు, నైవేద్యాలను సమర్పించి ప్రార్థిస్తారు. అమ్మవారిని అనంతమైన సౌందర్యానికి, విశ్వజనీన ప్రేమికు మరియు దైవిక చైతన్యానికి స్వరూపంగా భావిస్తారు.


​మాతాబారిలోని పవిత్ర శక్తి భక్తులను అమ్మవారికి శరణాగతి అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఇక్కడ లభించే అంతర్గత ప్రశాంతత మరియు భక్తి, శక్తి యొక్క శాశ్వతమైన కృపను అనుభూతి చెందేలా చేస్తాయి.