28, ఫిబ్రవరి 2026, శనివారం

దత్తపది

 🌸పద్య భారతి దత్తపది


కాంచన జమున అంజలి జయప్రద


స్వేచ్ఛ చందస్సులో గణపతి ప్రార్ధన

తేటగీతి పద్యము


భుజమునభుజకీర్తులతోడ భూరిగాను

కాంచనమయపీఠమునున్న గణపతికిని

భక్తితోయంజలిఘటించి పద్యములను

పాడినజయప్రదమగును పనులు మనకు




సాహితీ శ్రీ జయలక్ష్మి

అరుదైన దృశ్యం

అరుదైన దృశ్యం

 ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం దాదాపు 20నిముషాలకు పైగా బుధ, శుక్ర, గురు, శని, యురెనస్ (ఇంద్ర) నెఫ్టోన్ (వరుణ) ఫ్లూటో(యమ) గ్రహాలు ఓకెవరుసక్రమంలో కనిపిస్తాయి ఈ అరుదైన దృశ్యం కంటికి నేరుగా కనిపిస్తాయి స్పష్టంగా చూడాలి అంటే బైనాస్కోప్ లేక టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు

సీతారాముల కళ్యాణం

 ☸️☸️☸️☸️☸️☸️

🌸సీతారాముల కళ్యాణం🙏🙏

కన్యాదాన సమయంలో 

జనకుడు చెప్పిన శ్లోకం…*

               ➖➖➖✍️


*శ్లోకం :

*ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ|*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||*

*పతివ్రతా మహాభాగా చాయేవానుగతా సదా||*


ఈమె సీత నా బిడ్డ! ఈమె ను సహధర్మచారిణి గా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్ట నష్టాలలో అయినా నీకు నీడ లా వెన్నంటి ఉండే పతివ్రత ను 

నీ చేతిలో పెడుతున్నాను.

నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాట గా నిలవాలి...” అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు.



*శ్రీరామచంద్ర స్వామి ప్రవర :*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత


వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణో నప్త్రే|

 అజ మహారాజ వర్మణః పౌత్రాయ|

 దశరథ మహారాజ వర్మణః పుత్రాయ|

  ..... గోత్రోద్భవాయ| త్రిభువనాధీశాయ| 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ| తత్వాతీతాయ| సచ్చిదానంద మూర్తయే| సూర్యవంశ పావనాయ| శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవాయ|    

శ్రీరామచంద్ర వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ||



*శ్రీ సీతాదేవి ప్రవర:*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత|


గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం|

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం|

 జనక మహారాజ వర్మణః పుత్రీం|

    .......గోత్రోద్భవాం| చతుర్దశ భువనాధీశ్వరీం| అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం| తత్వస్వరూపిణీం| చంద్రవంశ ప్రదీపికాం| నిమివంశోద్భవాం|


శ్రీ సీతా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం ||


. శ్రీరామ జయరామ జయ జయ రామ  

                       🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!



సేకరణ

ఖాద్రి ( కదిరి) బ్రహ్మోత్సవాల

 🕉 [ బ్రహ్మోత్సవాల సందర్భంగా]


🔅 అనంతపురం జిల్లా : ఖాద్రి ( కదిరి) 


🔅శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం : కదిరి :

🔅 దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలశాయని పురాణాల్లో తెలిపారు. 

ఈ స్వయంభువ విగ్రహాల రహస్యాలను వేలాది ఏళ్లుగా తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. వీటిని వెనుక దైవం ఉన్నాడని భావించిన భక్తులు పూజిస్తూ, తమ కోరికలను తీర్చమని వేడుకుంటున్నారు. 


👉మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆలయాలు మనకు దర్శనం కల్పిస్తాయి.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో స్వామివారికి ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి.

ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే కదిరి నరసింహ స్వామి ఆలయం


👉అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉంది మహిమాన్వితుడిగా పేరుమోసిన నరసింహస్వామి కొలువైన ఆలయం. 


👉ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురం వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దీన్ని భ్రుగుతీర్థమని పిలుస్తారు.


🌀 పౌరాణిక ప్రాశస్త్యం 🌀


👉అటు మనిషితోగానీ, జంతువు, ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా వరం పొందిన హిరణ్యకసిపుడు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. విష్ణు భక్తులను హింసిస్తూ, చివరికి తనయుడు ప్రహ్లదుడిని కూడా విడిచిపెట్టలేదు.

నరసింహుడి రూపంలో  వచ్చిన శ్రీమహావిష్ణువు  హిరణ్యకసిపుని  సంహరించారు. ఇది జరిగిన ప్రదేశం అహోబిలం . 


👉హిరణ్యకశిప సంహారం తర్వాత కూడా స్వామి ఆగ్రహం చల్లారకపోవడంతో ఘీంకారం చేస్తూ కదిరికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతానికి చేరుకున్నాడు. దీన్ని గమనించి దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతం పైకి వచ్చి స్వామిని శాంతిపజేయడానికి అనేక స్త్రోత్రాలను పఠించారు. దీంతో నరసింహుడు శాంతించాడు, దేవతలు స్త్రోత్రాలను పఠించడం వల్లే ఈ పర్వతానికి స్త్రోత్రాద్రి అని పేరు వచ్చింది.


🔅 ఈ కదిరి ఆలయంలో కొలువై ఉన్న స్వామివారి పేరే కాటమరాయుడు.

అసలు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి

కాటమరాయుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? 


👉కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం శిరస్సు ఉన్నందునే ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అని పేరు వచ్చింది. 

' బేట్రాయి సామిదేవుడా! నన్నే లినోడు! బేట్రాయి సామి దేవుడా! కదిరి నరసింహుడా! కాటీమరాయడా!' అనే జానపదులు,చెలగి కదిరిలో శ్రీ వేంకటాద్రిమీద యెలగేటి చక్కటి రమణశ్రీ అన్న కీర్తనల్లోని నృసింహస్వామి ప్రాశస్తాన్ని కళ్ళారా చూడాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.

    

👉ఇక్కడి ఆలయంలోని నృసింహస్వామి, అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. 


👉 'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి ' ఖద్రి' అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఇప్పటికీ కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో 'ఖదిర (సంద్ర) వృక్షాలు అధికంగా ఉండడంతో ఈ పట్టణానికి కదిరి అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది.


👉చారిత్రిక, పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. 


👉ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఇక్కడ జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.

రథోత్సవం సమయంలో స్వామివారి రథంపై దవనం, మిరియాలు, పండ్లు చల్లుతుంటారు. కిందపడిన వీటిని ఏరుకొని తింటే సర్వరోగాలూ నయమవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మెత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఆ రోజు భక్తులు ఉపవాసముంటారు. 

ఈ పున్నమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దవనము సమర్పించడం ద్వారా స్వామివారు ప్రీతి చెందుతారని భావిస్తారు.


👉వసంతఋతువులో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారికి వసంత వల్లభుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.


👉వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామి వారికి పూజలు నివేదన,  సర్వదర్శనం, సాయంకాల నివేదన, తర్వాత మళ్ళీ సర్వదర్శనం ... ఈ క్రమంలో ఆలయల్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి.


👉అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం ఈ ఆలయం వైశిష్ట్యం హిందూ, ముస్లీం, క్రైస్తవులందరూ మతాలకతీకంగా ఇక్కడ జరిగే బ్రహెర్మాత్సవాల్లో పాల్గొని, పూజలు నిర్వహించడం విశేషం.

శ్రీహరిని నమ్ముకుంటే

 శ్రీరామ (100)


      (భక్తి ఒక్కటే ముక్తికి మార్గం - ప్రహ్లాదుడు)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                                ---------


మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.

అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి,

 అని ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు ఇలా బోధ చేస్తున్నాడు.

ఓ బాలకులారా! 

"మానవ జన్మ లభించడం చాలా కష్టం.

అదృష్టవశాత్తు లభించిన ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు.

మానవుని  ఆయుర్దాయం నూరు సంవత్సరములే.

అందులో సగము నిద్రకే పోతుంది.

మిగిలిన యాభై సంవత్సరాలలో, పసివాడుగా, బాలుడుగా, ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి.

మిగిలిన ముప్ఫై సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశుడై, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అనే బంధాలలో చిక్కుకుంటాడు.

వాటినుండి బయట పడలేక జీవితం అంతా వ్యర్థంగా గడుపుతాడు.

ప్రాణం కంటే ప్రియమైన " కామము (కోరిక)" నకు దాసుడవుతాడు.

కోరికల కారణంగా ఇతరుల ధనం అపహరించాలని చూస్తాడు.

ధనం కోసం ప్రాణాలను కూడా లెఖ్ఖచెయ్యడు.

రహస్యంగా " స్త్రీ సౌఖ్యం" కోరుకుంటాడు.

కాళ్ళకు బంధాలు వేసే భార్యలు ఏర్పడుతారు.

తియ్య తియ్యని,జిలిబిలి పలుకులతో,  ఆనందింపజేసే శిశువులు పుడతారు.

అందమైన కూతుళ్ళూ, వినయ విధేయతలతో కూడిన కొడుకులూ,

అన్నివిధాలా సహకరించే సోదరులు,

ప్రేమతోను,మమకారంతోను, కూడిన తల్లిదండ్రులు,

సహృదయంతో కూడిన బంధువులు,

ఈ విధంగా రక రకాలుగా ఆకర్షణీయంగా ఉన్న బంధాలలో కట్టుబడి పోతాడు.

డబ్బు,బంగారం, ఆభరణాలు, భవనాలు, వాహనాలు, పాడిపంటలు, సేవకులు, మొదలైన సంపదలను వదిలిపెట్టలేక, 

మానవుడు సంసారంలో పూర్తిగా మునిగి పోతాడు.

సాలీడు గూటిలో చిక్కుకొని బయటపడలేక పోతున్న కీటకం లాగా, మానవుడు ఈ సంసారమనే సంకెళ్ళ నుండి బయట పడలేడు.

కుటుంబ పోషణలో పడి, ముక్తిని పొందే మార్గం కనుగొన లేక,తర,తమ భేదాలు పాటిస్తూ అజ్ఞానం అనే చీకటిలో ఉండిపోతాడు.

కాబట్టి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు, చిన్నప్పటినుండే భగవంతునియందు అనురక్తుడయే "భాగవత ధర్మాన్ని" అనుష్ఠించాలి.


మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.

అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి.


 వాటి కోసం విలువైన  జీవిత కాలాన్ని వృథా చేసుకో కూడదు.

ఆ శ్రీహరిని నమ్ముకుంటే ముక్తి వస్తుంది.

ఆయనే ప్రాణులందరికీ అధిపతి.

ఆ పరమ పురుషుని పాదపద్మములను భావించి,సేవించటం ఒక్కటే ముక్తికి మార్గం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

28-2-'26.

లోక నీతి

 లోక నీతి 👌

*ఎలుక రాతిది అయితే* *పూజిస్తాం... ప్రాణాలతో* *వుంటే తరిమేస్తాం.* *పాము రాతిది అయితే* *పాలు పోస్తాం...* *ప్రాణాలతో వుంటే* *కొట్టి చంపేస్తాం.* *తల్లిదండ్రులు* *ఫోటోలో ఉంటే* *దండ వేసి* *దండం పెడతాం...* *ప్రాణాలతో వుంటే* *వృద్ధాశ్రమంలో* *వదిలేస్తాం.* *చనిపోయిన వాడికి* *భుజాన్ని అందిస్తాం ...* *బతికి ఉన్న వాడికి* *చేయూతను ఇవ్వలేం.* *రాయిలో దైవత్వం* *వుందని తెలుసుకున్నాం...* *మనిషిలో మానవత్వాన్ని* *గుర్తించలేక పోతున్నాం.* *జీవం లేని వాటిపై ఉన్న* *భక్తి, ప్రేమ... ప్రాణంతో* *ఉన్నవాటిఫై ఎందుకు* *లేదో... మనిషిగా* *ఆలోచిద్దాం కొద్దిగా..!*

మీ

శ్రేయోభిలాషి

-ఎస్.వి.రమణా చార్య(సేకరణ)

హిమాలయాలలో అనేక మంది యోగులు

 ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం


కథలు అనే విషయాన్ని నేను అసలు అంగీకరించను ఇప్పటికి కూడా హిమాలయాలలో అనేక మంది యోగులు కఠిన తపస్సు చేస్తున్నారన్నది వాస్తవం గడ్డగట్టిన నీటిని చదువుకొని ఆ చల్లటి నీటితో స్నానాలు చేస్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఏమాత్రం నరసంచారం లేని అతి శీతలమైన హిమాలయాలలో నిరంతరం తపస్సులో నిమగ్నమైన మహానుభావులు ఎందరో ఈరోజు కూడా ఉన్నారు. నేను అనుకుంటాను సమాజంలో ఎన్నో పాపాలు నిత్యం జరుగుతున్న ఇంకా సమాజంలో ధర్మం ఉందంటే అటువంటి మహానుభావుల నిరంతర తప శక్తి కారణం  అయి ఉండవచ్చు ఈ రోజుల్లో చాలా మటుకు భక్తి అనేది ఒక ప్రదర్శనగా మారుతున్నది అని చెప్పటానికి నేను సిగ్గుపడుతున్నాను నిజానికి త్రీకరణ శుద్ధిగా పరమేశ్వరుని ఆరాధిస్తే తప్పకుండా ప్రతివారు శిద్దులే అవుతారు నిత్యం భౌతిక ప్రపంచంలో జీవిస్తూ అరిసెట్ వర్గానికి బానిసలై బ్రతుకుతూ ఉంటే వారికి దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు కనబడదు అనేటువంటి మూర్ఖపు సందేహాలు వస్తూ ఉంటాయి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది నిత్యం మన జీవనం గడవడానికి అనేక విధాలుగా కష్టపడుతున్నామే మరి ఈ జగత్తుకు మూలకారకుడైన ఆ పరమేశ్వరుని చేరటానికి ఇంకా ఎంత కష్టపడాలి అనేటువంటి భావన ఉన్నవాళ్లు తప్పకుండా సాధన మొదలు పెడతారు సాధనాత్ సాధ్యతే సర్వం ముక్తి కూడా తప్పకుండా సిద్ధిస్తుంది మనకు హృదయమే పరిశుద్ధంగా లేనప్పుడు ఇక తపస్సు ఎలా చేయ గలుగుతాం నిరంతరం ఈ సమాజం చుట్టూ ఒక మంచి పేరు ఒక గొప్పతనం చాటి చంపాలనే తపనతోటే అనేక పనులు చేస్తూ సాటివారి మెప్పును అభిలాషీస్తూ ఉంటే వారికి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా మనసు భగవంతుని మీదికి పోదు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఏ కొద్దో శక్తి సంపాదించిన ప్రతి వాళ్లు నేనే దేవున్ని అని చాటుకుంటూ వాళ్ల చుట్టూ అనేకమంది శిష్యబృందాలను ఏర్పాటు చేసుకుంటూ నిరంతరం భోగా లాలసులై జీవిస్తూ ఉండటమే కాకుండా ఆ పరమేశ్వరుని కూడా విమర్శిస్తూ నిందిస్తూ ఉన్నారంటే ఇక వారి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మన హిందుత్వంలో శివ కేశవ బేధం లేదు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడో సెలవిచ్చారు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి శ్రీ ఆది శంకర చార్యుల వారి బోధనలు మాత్రమే శరణ్యం శంకరుల వారు అనుచరులమై వారు స్థాపించిన అద్వైత మతాన్ని ఆచరిస్తూ ఉంటే తప్పకుండా సమాజం సుభిక్షంగా ఆనందకరంగా సంతోషమయంగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు మనకు మొట్టమొదటగా ఉద్భవించిన శుక్ల యజుర్వేద దానికి సంబంధించిన ఉపనిషత్తు ఈసా వాసు ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు జగత్తు మొత్తం ఈశ్వరునిదే అయినది అనే మంత్రంతో మొదలవుతుంది అక్కడ నేను నీవు లేనే లేవు కేవలం జగత్తులో జీవులు నిర్జీవులు అన్ని ఈశ్వరుడే ఈ భావం అందరికీ కలిగితే ముందుగా తాను ఈశ్వరుడు అని తలుస్తాడు అప్పుడు భగవంతుడు తప్పులు చేయడు అని తెలుసుకొని తాను  సత్ ప్రవర్తన పరుడవుతాడు అంతేకాకుండా తాను చూసే జగత్తు పూర్తిగా ఈశ్వరుడి మయంగా తలంచి ప్రతి వారిలో ఈశ్వరుని దర్శించి తాను ఈశ్వరునితో అంటే భగవంతునితో ఎలా ప్రవర్తిస్తాడో అలానే అందరితో ప్రవర్తించగలుగుతాడు కాబట్టి ప్రతివారికి ఈ ఒక్క ఉపనిషత్తు పూర్తిగా కూడా అవసరం లేదు కేవలం మొట్టమొదటి మంత్రం తెలుసుకుంటే చాలు ప్రతివారు తముతాను ఉద్ధరించుకుంటాడు సమాజాన్ని ఉద్ధరించుకోవటానికి తోడ్పడుతాడు కోపము ద్వేషము అసహనము స్వార్థం మొదలైన భావాలు నశించి మనస్సు స్వచ్ఛత చేకొరితే మన భార తావనే స్వర్గసీమగా వెలుగొందుతుంది అనటానికి సందేహం లేదు అటువంటి జగత్తు కావాలని ఆ జగదీశ్వరుని నిత్యం మనం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను

ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం

  శ్రీరామ (97)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఎండా, వానా లెక్కచేయకుండా తపస్సు చేసి ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం.

కానీ, ఆ! అవన్నీ కథలండీ, ఈ కాలానికి వర్తించేవి కావు అంటాం.

అంటే మనం చదివే పురాణాలు, వినే ప్రవచనాల మీద మనకు నమ్మకం లేదన్నమాట !

అవన్నీ కాలక్షేపానికే గాని, ఆచరణలో పెట్టేందుకు కాదు.


అంతేకాదు,

మనం చేసే కొద్దో గొప్పో పూజాదికమైనా,

 ఆ పూజకు, లేదా వ్రతానికి చెప్పబడిన నియమ, నిష్ఠలతో కూడి వుండదు. 

పైపెచ్చు,

ఇతరుల చేత గొప్ప అనిపించుకోడానికి చేసే

భారీ పిండి వంటలు మొదలైన ఆడంబరాలతో కూడి ఉంటుంది.

కానీ, ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావడంలేదని మాత్రం అంటాము.


ఇది దృష్టిలో పెట్టుకొని శ్రీ ధూర్జటి మహాకవి ఇలా అంటున్నారు : 


మ// దయ జూడుండని కొందరాడుదురు నిత్యంబున్ నినుంగొల్చుచున్/

నియమంబెంతొ ఫలంబు నంతియె కదా నీవీయ, పిండెంతో అం/

తియకా నిప్పటియుం దలంపనను బుద్ధింజూడ,నేలబ్బు ని/

ష్క్రియతన్ నిన్ను భజింప కిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర!//


(చాలామంది, ప్రతిరోజు నిన్ను పూజిస్తూ,"స్వామీ ! నీకు ఇంకా మామీద దయరాలేదు" అంటారు.

నిజానికి మన పూజలు ఫలితమివ్వడం అనేది చిత్తశుద్ధితో మనం పాటించే నియమాలపై ఆధారపడి ఉంటుంది.

పిండి ఎంతో రొట్టె (ఇప్పటి అనే పిండి వంట) కూడా అంతే ప్రమాణంలో వస్తుంది కాని అధికంగా రాదుగదా!

అలాగే మనం ఎంత శ్రద్ధతో నియమ నిష్ఠలు పాటిస్తామో అంత త్వరగా భగవదనుగ్రహం లభిస్తుంది.

 ఆ నియమ, నిష్ఠలు పాటించకుండా, ఆశించిన ఇష్ట సుఖములు ఎలా వస్తాయి? )


మనస్సు శుచిగా ఉంటే ఈ నియమ నిష్ఠలు అనవసరం అంటారు మేధావులమనుకొనే కొందరు అజ్ఞులు.

మనస్సు శుచి అవడానికే నియమ నిష్ఠలు అని ముందు తెలుసుకోవాలి.

శుచి అయిన మనస్సులోనే శ్రద్ధ, అనగా భగవంతుని మీద విశ్వాసం ఉదయిస్తుంది.

 శ్రద్ధతో చేసే భగవదారాధన మాత్రమే మనకు సత్వర ఫలితాలనిస్తుందని ధూర్జటిగారి భావం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

28-2-'26.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - ద్వాదశి - పునర్వసు -‌‌ స్థిర వాసరే* (28.02.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

విష్ణు స్తుతి🙏

 ☘️🌸☘️ విష్ణు స్తుతి🙏


కేశవా! హరిహృషీకేశ నారాయణా

   దామోదర మధుసూదన మహాత్మ

విష్ణు అధోక్షజా!జిష్ణు త్రివిక్రమ

   పద్మనాభ !యుపేంద్ర వాసుదేవ

యచ్యుత గోవింద యనిరుద్ధ మాధవ

  శ్రీధరా !శ్రీకృష్ణ శిష్ట పోష

సంకర్షణ నృసింహ శాశ్వతా యనుచును

మునులునిన్ కొలిచిరి ముదముతోడ

తే..వాసుదేవమాధవనీకు వందనములు

 నందగోపాల శ్రీ పతి నాగశయన 

సకల దేవతా పూజిత శరణు శరణు 

విన్నపాలు వినుము దేవ విష్ణుమూర్తి



సాహితీ శ్రీ జయలక్ష్మీ

చంద్రగ్రహణం

 మార్చి 3వ, తేదిన మన భారతదేశంలో చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. 


ఈ సందర్భంలో ఈ గ్రహణం గురించి కొన్ని విషయాలు.


*యస్మిన్ రాశౌ తు దృశ్యేత*

*గ్రహణం తత్ర సూతకం |*

*అదృశ్యే నైవ కర్తవ్యం*

*స్నానదానాదికక్రియా ||*


ఏ ప్రాంతంలో (రాశిలో/ప్రదేశంలో)

గ్రహణం కనిపిస్తుందో అక్కడ

మాత్రమే సూతకం (నియమాలు)

వర్తిస్తుంది. గ్రహణం కనిపించని

చోట స్నాన, దానాది క్రియలు

చేయవలసిన అవసరం లేదు.


స్పర్శ మరియు మోక్ష స్నానాలు

గ్రహణం పట్టుకున్నప్పుడు,

విడిచినప్పుడు స్నానం చేయాలి.


*నాఽదృశ్యే గ్రహణే స్నానం*

*కుర్యాన్ముక్తిః కదాచన |*

*దృశ్యమానే తు కర్తవ్యం*

*స్నానదానాదికక్రియా ||*

కంటికి కనిపించని గ్రహణానికి

స్నానము, మోక్షము వంటివి

పాటించాల్సిన పనిలేదు. గ్రహణం

ఎప్పుడు దృశ్యమానం

(కనిపిస్తుందో) అవుతుందో,

అప్పుడే స్నానము, దానము వంటి

క్రియలు చేయాలి.

 

*"సర్వే గంగా సమం తోయం*

*సర్వే బ్రాహ్మణ సమో గురుః |*

*గ్రహణే స్పర్శనే స్నానం*

*మధ్యే హోమజపాదికం |*

*ముచ్యమానే భవేద్దానం*

*ముక్తే స్నానం విధీయతే ||*


స్పర్శనే స్నానం: 

గ్రహణం పట్టుకున్న వెంటనే (స్పర్శసమయంలో) స్నానం చేయాలి. మధ్యే హోమజపాదికం: గ్రహణం

మధ్య కాలంలో హోమం, జపం,

పారాయణం వంటివి చేయాలి.


ముక్తే స్నానం: 

గ్రహణం పూర్తిగా

విడిచిన తర్వాత (మోక్ష కాలంలో)

మళ్ళీ స్నానం చేయాలి.


శాస్త్రం ప్రకారం "చక్షుః స్పర్శే

స్నానం" (కంటికి కనిపించినప్పుడే

స్నానం) అని కూడా అంటారు.

మార్చి 3, 2026 న మనకు

మధ్యాహ్నం నుంచి గ్రహణం

ఉన్నా, అది భూమికి అవతలి

వైపు ఉండటం వల్ల మనకు

స్పర్శ కనిపించదు.

సాయంత్రం 6:24 గంటలకు

చంద్రుడు మనకు కనిపించినప్పుడే 

అది "స్పర్శ" (మన దృష్టికి)

అవుతుంది. కాబట్టి ఆ

సమయంలో చేసే స్నానమే పట్టు

స్నానం అవుతుంది.


ఆ తర్వాత 24 నిమిషాలకే

గ్రహణం విడిచిపోతుంది కాబట్టి,

6:48 కి చేసే స్నానం విడుపు

స్నానం అవుతుంది.


గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగులు 

మాత్రం గ్రహణం మనకు

 కనిపించకపోయినా, భూమిపై గ్రహణ

 ప్రభావం ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం

 నుంచే జాగ్రత్తలు పాటించడం

 శ్రేయస్కరం.


కేవలం 24 నిమిషాలే గ్రహణం

కనిపిస్తుంది కాబట్టి, ఆ కొద్ది

సమయం వీలైనంత వరకు దైవ

నామస్మరణలో గడపడం విశేష

ఫలితాన్నిస్తుంది.


గ్రహణే గతే స్నానం 

సచేలం తు విధీయతే |

అకృత్వా స్నానమశ్నన్ 

హి భుంక్తే విణ్మూత్రమేవ సః ||


​గ్రహణం పట్టుకున్నప్పుడు

మరియు విడిచినప్పుడు సచేల

స్నానం (బట్టలతో సహా చేసే

స్నానం) చేయాలి. ఒకవేళ స్నానం

చేయకుండా ఆహారం తీసుకుంటే,

అది మలమూత్ర సమానమైన

పాపంతో సమానం.


రాహుదర్శనసంవాదే

స్నానదానాదికక్రియాః |

అదృశ్యే రాహుమణి చ

 న స్నానం న చ భోజనమ్ ||

రాహువు (గ్రహణం) కంటికి

 కనిపించినప్పుడు మాత్రమే

 స్నాన, దానాది క్రియలు చేయాలి.

 గ్రహణం ఉన్నా అది మనకు

 అదృశ్యంగా ఉంటే, ఆ

 సమయంలో స్నాన నియమాలు

 గానీ, భోజన నియమాలు గానీ

 వర్తించవు.


వారణాస్యాం కురుక్షేత్రే 

గ్రహణే యత్ఫలం భవేత్ |

తత్ఫలం కోటిగుణితం 

రాహుగ్రస్తే నిశాకరే ||

​కాశీ (వారణాసి) లేదా

 కురుక్షేత్రంలో స్నాన, దానాలు చేస్తే

 ఎంత పుణ్యం వస్తుందో, గ్రహణ

 సమయంలో చేసే దానం దానికి

 కోటి రెట్లు ఎక్కువ ఫలితాన్ని

 ఇస్తుంది. ముఖ్యంగా చంద్రగ్రహణ

 సమయంలో చేసే దానానికి

 అంతటి విశిష్టత ఉంది.


సూర్యగ్రహే తు యామాన్త్రీన్

చంద్రగ్రహే చతుష్టయమ్ |

భోజనం నైవ కర్తవ్యం వేధః

పూర్వం తథా భవేత్ ||


చంద్రగ్రహణానికి 3 యామముల

 (9 గంటల) ముందు నుండి వేధ

 ప్రారంభమవుతుంది. ఆ

 సమయంలో భోజనం

 చేయకూడదు.


సర్వేషామపి వర్ణానాం 

సూతకం రాహుదర్శనే |

తత్కాలం భోజనం త్యాజ్యం 

శుద్ధిః స్నానేన జాయతే ||

రాహువు (గ్రహణం) కంటికి

కనిపించినప్పుడు అన్ని వర్ణాల

వారికి సూతకం (వేధ) వర్తిస్తుంది.

ఆ సమయంలో భోజనం

వదిలివేయాలి. గ్రహణం విడిచిన

తర్వాత స్నానం చేయడం వల్లనే

శుద్ధి కలుగుతుంది.


గ్రహణాత్ పూర్వయామం తు 

న భుంజీత కదాచన |

పానీయమపి వర్జ్యేత 

అశక్తేర్నాస్తి నియమః ||


గ్రహణానికి ఒక యామము (3

 గంటలు) ముందు నుండి ఆహారం

 అస్సలు తీసుకోకూడదు.

 వీలైనంత వరకు నీటిని కూడా

 తీసుకోకపోవడం ఉత్తమం.

 అయితే, అనారోగ్యంతో

 ఉన్నవారు లేదా శక్తి లేని వారికి

 (అశక్తులకు) ఈ నియమం

 వర్తించదు.


బాలవృద్ధాతురైః సార్ధం 

భోజనం నైవ త్యజ్యతే |

గ్రహణాత్ పూర్వయామం తు

భోజనం నైవ కారయేత్ ||


పిల్లలు (బాలలు), ముసలివారు

(వృద్ధులు) మరియు రోగులు

(ఆతురులు) 9 గంటల వేధ

 పాటించలేకపోతే, వారు

 గ్రహణానికి ఒక యామము (3

 గంటల) ముందు వరకు ఆహారం

 తీసుకోవచ్చు. అంటే వీరికి వేధ

 సమయం కేవలం 3 గంటలు

 మాత్రమే.


పక్వమన్నం పరిత్యజ్యం 

జలమపి చ రాహుదర్శనే |

కుశైః స్పర్శం చ కర్తవ్యం

తైలఘృత్యాదిషు సర్వదా ||


గ్రహణ సమయంలో వండిన

అన్నాన్ని, నీటిని వదిలివేయాలి.

అయితే పాలు, పెరుగు, నెయ్యి,

నూనె వంటి పదార్థాలలో దర్భలు

 (కుశలు) వేయడం ద్వారా అవి

 అపవిత్రం కాకుండా

 రక్షించబడతాయి.


గర్భిణీ నైవ పశ్యేత 

రాహుగ్రస్తం నిశాకరం |

యథాశక్తి జపేన్మంత్రం 

కుశధారణ పూర్వకం ||

గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని

చూడకూడదు. వారు దర్భను 

దగ్గరఉంచుకుని, యథాశక్తి దైవ

నామస్మరణ లేదా జపం చేయాలి.


పురశ్చరణకృన్మంత్రః 

గ్రహణే చంద్రసూర్యయోః |

తస్మాత్సర్వం పరిత్యజ్య 

జపమేవ సమాచరేత్ ||

చంద్ర లేదా సూర్యగ్రహణ

 సమయాల్లో మంత్ర జపం

 చేయడం వల్ల ఆ మంత్రం త్వరగా

 సిద్ధిస్తుంది. అందుకే మిగిలిన

 పనులన్నీ వదిలిపెట్టి, ఆ కొద్ది 

సమయం కేవలం జపం మాత్రమే

 చేయాలి.


ఖననం దంతధావనం చ

వృక్షచ్ఛేదం చ వర్జయేత్ |

గ్రహణే పతితే భూమౌ న

 కుర్యాత్కామ్యకర్మ చ ||

గ్రహణ సమయంలో భూమిని 

తవ్వడం, పళ్ళు తోముకోవడం,

చెట్లు లేదా కొమ్మలు నరకడం 

వంటి పనులు అస్సలు

చేయకూడదు. ఇవి

దోషపూరితమైనవి.


భూగతం నిర్మలం తోయం

ఉద్ధృతం చైవ తాత్కాలమ్ |

గ్రహణే సర్వగంగాఖ్యం పునీతే

 స్నానదానయోః ||"

గ్రహణ సమయంలో భూమిపై

 ఉన్న నిర్మలమైన జలమంతా

 గంగానదితో సమానమైన

 పవిత్రతను పొందుతుంది. 

ఆ సమయంలో బావి నుండి

 తోడిన నీరు లేదా ప్రవహించే నీరు

 స్నానానికి, దానానికి అత్యంత

 శుభప్రదమైనవి.


చంద్రగ్రహే లక్షగుణం 

ఆదిత్యే దశలక్షకమ్ |

పుణ్యం కోటిగుణం ప్రోక్తం

గంగాయాం గ్రహణే సతి ||


సాధారణ చంద్రగ్రహణ

 సమయంలో చేసే జపం లక్ష 

రెట్లు ఫలితాన్నిస్తుంది.

సూర్యగ్రహణంలో పది లక్షల రెట్లు

 ఫలితాన్నిస్తుంది. అదే గంగానది

 తీరంలో గ్రహణ సమయంలో

 జపం చేస్తే కోటి రెట్లు పుణ్యం

 లభిస్తుంది.

27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పంచాంగం

 


శుక్రవారం*_ 🌹 *🪷27ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

*🪷27ఫిబ్రవరి2026🪷*      

  *దృగ్గణిత పంచాంగం* 

                       

          *ఈనాటి పర్వం*  

 *సర్వేషాం అమలకైకాదశి*

 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : ఏకాదశి* ‌రా 10.32 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* ఉ 10.48 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : ఆయుష్మాన్* రా 07.44 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : వణజి* ఉ 11.31 *భద్ర* రా 10.32 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 11.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*

*వర్జ్యం    : రా 10.12 - 11.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.45 - 09.38 మ 12.44 - 01.31*

*రాహు కాలం : ఉ 10.52 - 12.20*

గుళికకాళం      : *ఉ 07.55 - 09.23*

యమగండం    :*మ 03.17 - 04.45*

సూర్యరాశి : *కుంభం*                  

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.36* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 06.27 - 08.48*

సంగవ కాలం      :*08.48 - 11.10*

మధ్యాహ్న కాలం    :*11.10 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31- 03.52*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం   :*సా 03.52 - 06.14*

ప్రదోష కాలం    :*సా 06.14 - 08.40*

రాత్రి కాలం         :*రా08.40 - 11.55*

నిశీధి కాలం        :*రా11.55 -12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48- 05.37*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


       *ఉమా భగవతీ దుర్గా*

     *చాంద్రీ దాక్షాయణీ శివా*

           

           *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సరస్వతీ స్తుతి

  🌸సరస్వతీ స్తుతి🙏🙏

            

  సీ౹౹వాణిపుస్తకపాణి వాగ్దేవి శారద

    నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్ర 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

  శాబ్ది పావకి శ్రుతదేవి జయము జయము🙏🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 26 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣4️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*       

     

                    *147 వ రోజు*                    

*వన పర్వము సప్తమాశ్వాసము*


       *లంకపై దండెత్తుట*```


రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా! ఇక ఆలస్యం ఎందుకు లంకపై దండెత్తుటకు తగు సన్నాహాలు చెయ్యి” అని చెప్పాడు. 


సుగ్రీవుడు వానరులందరికీ వర్తమానం పంపాడు. నలు దిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేషణుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబ వంతుడు భల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభ ముహూర్తం చూసి రాముడు రావణుని పై దండయాత్రకు బయలు దేరాడు. హనుమంతుడు సేనా నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు అతనికి సాయం నిలిచారు. కపి సైన్యం దక్షిణ తీరానికి చేరింది. 


రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి” అన్నాడు. 


కొంత మంది వానరులు తెప్పలు కట్టుకుని దాటుదాం అన్నారు. 


రాముడు “ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది. వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేక ఏమీ చేయలేము. సముద్రుడు లొంగక పోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు. 


ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమైయ్యాడు. రాముడు “మాకు ససైన్యంగా దారి ఇవ్వు. లేకున్న సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు. 


సముద్రుడు “రామా! నేను నీకు ఎటువంటి ఆటంకం కలిగించను. నీవు ఈ రోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపి వీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాని సాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగ కుండా కాపాడతాను. మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు” అన్నాడు. 


నలుడు వంద యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు.```


*విభీషణుడు రాముని చేరుట*```


విభీషణునికి రావణుడితో పొసగ లేదు. అతడు లంక నుండి బయటకు వచ్చి శ్రీరాముని శరణు జొచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర సేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు. శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు. రావణుని గూఢచారులైన సారణుడు, శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరులలో కలిసి పోయారు. 

విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు. 

రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపాడు. 


వారు రావణుని వద్దకు పోయి రాముడి సేన అజేయమని గెలువ సాధ్యం కానిదని చెప్పారు. 


రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. 


శ్రీరాముడు అంగదుని పిలిచి..  “అంగదా! నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడువమని చెప్పు. తగిన విధముగా బుద్ధి మతి చెప్పుము” అన్నాడు. 


అంగదుడు రావణుని కొలువు కూటమిలో ప్రవేశించి “రావణా! సూర్య వంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. ‘అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేసావు ఇవన్నీ ఒక ఎత్తు! నీవు నాపట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేసావు. ఆమెను నాకు అప్పగించు లేకున్న నాతో యుద్ధం చెయ్యి. నీకు మరొక మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది. రాక్షసకులం అన్నది లేకుండా చేస్తాను జాగ్రత్త” అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు. 


రావణుడు కను సైగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టు కోవడానికి వచ్చారు. అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు తోసాడు. 

ఆ తోపిడికి వారు మరణించారు. తరువాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినది చెప్పాడు. ```

            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏