7, మే 2026, గురువారం

07-05-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

07-05-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ధనవ్యయ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు మరింత పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు అందరినీ ఆకట్టుకుంటారు. ఇంటా బయట ఆశ్చర్యకర సంఘటనలు చోటుచేసుకుంటాయి. నూతన వస్తులాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థుల అంచనాలు అందుకుంటారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. నూతన వాహన యోగం ఉన్నది. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

---------------------------------------


కర్కాటకం


వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులలో శ్రమ తప్పదు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. గృహమున కొందరి ప్రవర్తన శిరో బాధ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. 

---------------------------------------


సింహం


మానసిక సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఎంత శ్రమపడిన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కన్య


ఆపదల నుండి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపార వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగమున మీ విలువ మరింత పెరుగుతుంది.

---------------------------------------


తుల


మిత్రులతో ఊహించని మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  

---------------------------------------


వృశ్చికం


నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. 

---------------------------------------


ధనస్సు


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఇంటా బయట శ్రమాధిక్యత పెరుగుతుంది. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి.

---------------------------------------


మకరం


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవచింతన పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

---------------------------------------


కుంభం


విలువైన వస్త్ర ఆభరణలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన అనుకూలత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. అధికారులతో చర్చలు సఫలం అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ తప్పదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ద వహించాలి. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది.

---------------------------------------

పంచాంగము 🌓 07.05.2026

 🕉️


పంచాంగము 🌓 07.05.2026


🪔 శ్రీ రమాత్రివిక్రమాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం: 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: ఉత్తరాయణం 


ఋతువు: వసంత


మాసం: వైశాఖ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి: పంచమి ఉ‌.07:05 వరకు

తదుపరి షష్ఠి 

 

వారం: గురువారం - బృహస్పతివాసరే

 

నక్షత్రం: పూర్వాషాఢ ప‌.03:43 వరకు 

తదుపరి ఉత్తరాషాఢ


యోగం: సాద్య రా.01:12 వరకు

తదుపరి శుభ

 

కరణం: తైతుల ఉ‌.07:05 వరకు

తదుపరి గరజ‌ రా. 07:52 వరకు

తదుపరి వణిజ


వర్జ్యం: రా.12:29 - 02:14 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.10:04 - 10:55

మరియు ప‌.03:12 - 004:03


రాహు కాలం: ప‌.01:49 - 03:25


గుళిక కాలం: ఉ‌.08:59 - 10:36


యమ గండం ఉ‌.05:47 - 07:23

 

అభిజిత్: 11:47 - 12:37


సూర్యోదయం: 05:47


సూర్యాస్తమయం: 06:38


చంద్రోదయం: రా.11:30


చంద్రాస్తమయం: ఉ‌.09:53


సూర్య సంచార రాశి: మేషం


చంద్ర సంచార రాశి: ధనుస్సు


దిశ శూల: దక్షిణం


🚩 శ్రీ కశ్యప ఋషి జయన్తి 🚩


🏳️ సంత్‌ చౌఖమేలా పుణ్యతిథి‌🏳️


🎊 శ్రీ భువనేశ్వరి పాటోత్సవ్ 🎊

(గొండాల్ - గుజరాత్)


🛕చెన్నై శ్రీ కేశవ పెరుమాళ్

రథోత్సవం 🛕


🪄 శ్రీనివాసమంగాపురం శ్రీ 

 కల్యాణ వేంకటేశ్వరస్వామి 

 వసంతోత్సవారంభం‌  🪄


🛕తిరువల్లికేణి శ్రీ పార్థసారథి

 పెరుమాళ్ రథోత్సవం 🛕


🇮🇳 అల్లూరి సీతారామరాజు

స్మృతి దినం 🇮🇳


⚛️


వైశాఖే కృష్ణపక్షే తు 

పంచమ్యాం ఋషిసత్తమః |

కశ్యపః ప్రాదురభవత్ 

లోకానాం హితకామ్యయా ||


మరీచిః కశ్యపం తస్మాత్ 

సర్వలోక పితామహమ్ |

సృష్టవాన్ సర్వభూతాని

సదేవాసుర మానుషాన్ ||

మరీచి కుమారుడైన కశ్యపుడు,

దేవతలు, అసురులు మరియు

మనుష్యులతో సహా సమస్త

భూతజాలాన్ని సృష్టించిన లోక

పితామహుడు.


వైశాఖే మాసి సంభూతం

మరీచికుల నందనమ్ |

కశ్యపం సర్వలోకానాం 

పితరం ప్రణమామ్యహమ్ ||


మరీచేః కశ్యపో జజ్ఞే 

కశ్యపాత్తు సురాసురాః |

శశాంకవంశ్యాః సూర్యాశ్చ 

తథాన్యే చ చరాచరాః ||

మరీచి నుండి కశ్యపుడు

జన్మించాడు. కశ్యపుడి నుండే

దేవతలు, అసురులు,

చంద్రవంశీయులు,

సూర్యవంశీయులు మరియు

ఇతర చరాచర ప్రాణులు

ఉద్భవించాయి.


కశ్యపస్య ప్రభావన లోకాః

సృష్టాశ్చరాచరాః |

తస్మాత్ సర్వమయం లోకం

కశ్యపం పరిచక్షతే ||

కశ్యపుని ప్రభావం వల్లనే ఈ

చరాచర జగత్తు సృష్టించబడింది.

అందుకే ఈ లోకమంతా

కశ్యపమయము.


అదితిర్దితిస్తథా దనుః కాష్ఠా 

అరిష్టా సురసా ఇలా |

మునిః క్రోధవశా చైవ తాసాం 

భర్త్రే నమో నమః ||"

కశ్యపుని భార్యలైన అదితి, దితి

మొదలైన వారిని పేర్కొంటూ,

సమస్త జీవరాశికి తండ్రి అయిన

కశ్యపునికి నమస్కారం.


కశ్యపాయ నమస్తుభ్యం

సర్వభూత హితైషిణే |

మరీచిపుత్ర ధర్మజ్ఞ 

గృహాణార్ఘ్యం మయా దత్తమ్ ||

సర్వ భూతాల మేలు కోరేవాడా,

మరీచి పుత్రుడా, ధర్మం తెలిసిన ఓ

కశ్యప మహర్షీ! నేను సమర్పిస్తున్న

ఈ అర్ఘ్యాన్ని స్వీకరించు.


🔯


Mantra - 32

 Mantra - 32 ARUNAM 4 anuvaakam


నిన్నటి మంత్రంలో ‘నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు’ అని తెలుసుకున్నాము కదా ఇప్పుడు శరదృతువు వర్ణనలో ఉన్న తత్త్వాన్ని చూద్దాం తదుపరి క్రింది మంత్రంలో.


"ఏతా వాచః ప్రయుజ్యంతే|

శరద్యత్రోప దృశ్యతే|

అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ। 

వాతవన్తో మరుద్గణాః||”


ఈ మంత్రం ప్రకృతిలో కలిగే మార్పులను, ముఖ్యంగా శరదృతువులో వాయువు యొక్క చలనాన్ని మరియు మరుద్గణాల (వాయు దేవతల) ప్రభావాన్ని వర్ణిస్తుంది.


"ఏతా వాచః ప్రయుజ్యంతే" - ఈ వాక్కులు / మంత్రాలు ఉచ్ఛరించబడుతున్నాయి/ ప్రయోగించబడుతున్నాయి.


"శరద్యత్రోపదృశ్యతే" - శరదృతువు ఎక్కడైతే కనిపిస్తుందో, ప్రవేశిస్తుందో. వర్షాకాలం ముగిసి, ఆకాశం నిర్మలంగా మారే శరత్ కాలం నాటి వాతావరణాన్ని ఇది సూచిస్తుంది.


“అభిధూన్వన్తోభిఘ్నన్త ఇవ" - కంపపింపజేస్తూ, కొడుతున్నట్లుగా (వేగంగా వీస్తూ) - గాలి వేగంగా వీస్తూ చెట్లను, ప్రకృతిని కదిలించే తీరును ఇక్కడ వర్ణించారు.


“వాతవన్తో మరుద్గణాః" - వాయువుతో కూడిన మరుద్గణములు - వేదాలలో 'మరుత్తులు' అంటే వాయుదేవతలు. వారు గుంపులుగా (గణములు) ఉండి, ప్రకృతిలో శక్తివంతమైన చలనాన్ని కలిగిస్తారు.


వర్షాలు తగ్గుముఖం పట్టి, పంటలు చేతికి వచ్చే సమయంలో వీచే గాలులు శరదృతువుకు చిహ్నం. ఈ సమయంలో వాయువు ప్రసరణ ప్రకృతిని శుద్ధి చేస్తుందని భావిస్తారు.


మరుత్తులు రుద్రుని పుత్రులుగా, ఇంద్రుని సహాయకులుగా వేదాల్లో వర్ణించబడ్డారు. వారు తుఫానులకు, గాలులకు అధిదేవతలు. వారు "అభిధూన్వంతః" (కదిలించడం) ద్వారా ప్రకృతిలోని జడత్వాన్ని తొలగిస్తారని అర్థం.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలు సూర్యుడు, కాలం, మరియు వాయువు మధ్య ఉన్న సమన్వయాన్ని వివరిస్తాయి. సూర్యరశ్మి వల్ల కలిగే వేడి, దానివల్ల వచ్చే వర్షం, ఆపై వీచే గాలులు - ఈ క్రమమంతా ఈశ్వర సృష్టిలోని ఒక అద్భుతమైన చక్రం.


అద్వైత సిద్ధాంతం ప్రకారం, శరత్ ఋతువు వర్ణన వెనుక ఉన్న గూఢార్థాలు ఏమిటంటే..

"అభిధూన్వన్తః" (కదిలించడం) మరియు "అభిఘ్నన్తః" (దెబ్బతీయడం) అనే పదాలు మాయ యొక్క ‘విక్షేప శక్తి' ని సూచిస్తాయి. నిశ్చలంగా ఉన్న సముద్రం మీద గాలి వీచినప్పుడు తరంగాలు ఎలా వస్తాయో, నిర్గుణ బ్రహ్మపై మాయా వాయువు వీచినప్పుడు ఈ జగత్తు అనే చలనం పుడుతుంది.  


శరత్ కాలంలో వీచే గాలులు చెట్లను, ఆకులను ఎలా కదిలిస్తాయో, మన లోపల ఉన్న వాసనలు (Desires) మనస్సును అలా కదిలిస్తూ ద్వైత భ్రమను కలిగిస్తాయి. ఇదే మాయా విక్షేపం - The Disturbance of Maya.


వాయువు లేదా మరుత్తులు మన శరీరంలోని 'ప్రాణ శక్తి' కి సంకేతం. అద్వైతంలో ప్రాణము ఆత్మకు అత్యంత సన్నిహితమైన ఉపాధి. గాలి కంటికి కనిపించదు కానీ దాని స్పర్శ, క్రియ మనకు తెలుస్తుంది.

అలాగే, ఆత్మ మనకు నేరుగా కనిపించకపోయినా, ప్రాణ చలనం ద్వారా దాని ఉనికిని మనం గుర్తించవచ్చు. వాయువు సర్వవ్యాపి అయినట్లు, ఆత్మ చైతన్యం కూడా సర్వవ్యాపి.‘మరుద్గణాః’ అన్న వేద వాక్యము నకు ప్రాణ శక్తి అని భావం (అధ్యాత్మంలో). 


అధిభౌతికంలో (Physical/Material) లో వాయువే, అధ్యాత్మంలో (Microcosmic) లో ప్రాణ శక్తి యే, ఆదిదైవికంలో (Macrocosmic) బ్రహ్మ లేదా హిరణ్యగర్భుడు. దీనికి ప్రమాణం గా ‘నమస్తే వాయో! త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాऽసి’ - ఓ! వాయు దేవతా! నీవు సాక్షాత్ బ్రహ్మ వే - అని తైత్తిరీయ ఉపనిషత్ శిక్షా వల్లి వేద వాక్యాన్ని చెప్పవచ్చు.


వర్ష ఋతువులో బురదగా ఉన్న నీరు శరత్ కాలం రాగానే నిర్మలంగా మారుతుంది. అద్వైత సాధనలో ఇది ఒక ముఖ్యమైన స్థితి. మనస్సులోని అజ్ఞానమనే బురద తొలగిపోయి, ఆత్మ అనే ఆకాశం నిర్మలంగా కనిపించే సమయం ఇది. 


"వాతవన్తః" అంటే వాయువు గూడు కట్టుకున్న మేఘాలను చెదరగొట్టినట్లు, జ్ఞానమనే వాయువు అజ్ఞానపు మేఘాలను తొలగించి సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. శరత్ - మల నివృత్తి - Clarity of Consciousness. పై విధంగా తాప త్రయాలను అన్వయించుకోవచ్చు.


శరత్ కాలంలో లోక వ్యవహారాలు (వాక్కులు) చురుగ్గా సాగుతాయి. కానీ అద్వైతం ఏం చెబుతుందంటే—ఈ మాటలు, ఈ పనులు అన్నీ 'ఇవ' (లాగా) మాత్రమే. అంటే ఇవి ప్రాతిభాసిక సత్యాలే తప్ప పరమార్థ సత్యాలు కావు. గాలి వీచినప్పుడు కలిగే శబ్దం ఎలా వచ్చి పోతుందో, ఈ జగత్తులోని వ్యవహారాలు కూడా అలాగే వచ్చి పోతుంటాయి. వాచః ప్రయుజ్యంతే అంటే నామరూప జగత్తు.


ఈ మంత్రం సారాంశం రెండు మాటల్లో చెప్పాలంటే, గాలి వీచినప్పుడు వృక్షాలు కదులుతున్నట్లు, మాయా ప్రభావం వల్ల నీ మనస్సులో వికారాలు కలగవచ్చు. కానీ గాలికి ఆధారం ఆకాశం ఎలాగో, ఆ ప్రాణ చలనానికి ఆధారం నీలోని ఆత్మయే. శరత్ కాలపు ఆకాశంలా నీ మనస్సును నిర్మలం చేసుకున్నప్పుడు, కదిలే వాయువులోనూ, కదలిక లేని ఆత్మను దర్శించగలవు. ఈ మంత్రం ద్వారా ప్రకృతిలోని చలనాన్ని అంటే Kinetic energy, ఆత్మ యొక్క నిశ్చలత్వంతో రథచక్రం ఇరుసు (axle) వలె అనుసంధానం చేయడం జరిగింది.

6, మే 2026, బుధవారం

Mantra - 31

 Mantra - 31 ARUNAM 4 anuvaakam


అజ్ఞానమనే పొర నీ కంటిని కప్పి ఉంచినంత కాలం నీకు సత్యం కనిపించదు. సాధన ద్వారా ఆ పొరను తొలగించుకున్నప్పుడు, నీ బుద్ధి నిర్మలమై (విప్రసన్నే), నీవు ఏకత్వాన్ని దర్శిస్తావు అని పూర్వ మంత్రం ఉపదేశిస్తే, ఈ క్రింది మంత్రం సూర్యుడిని జీవన ప్రదాతగా కొలుస్తుంది.


"కనకాభాని వాసాగ్ంసి। 

అహతాని నిబోధత|

అన్నమశ్నీత మృజ్మీత। 

అహం వో జీవనప్రదః||”


ఇది సూర్యారాధనలో అత్యంత పవిత్రమైన మంత్రంగా పరిగణించ బడుతుంది. ఎందుకంటే ఇది భగవానువాచ. పరమాత్మ స్వయంగా చెప్పిన మాట ‘వలే’ ఈ మంత్రంలో ఉంది. ఇక్కడ సూర్య భగవానుడు స్వయంగా మానవాళికి తన ఉనికిని, రక్షణను మరియు జీవనాధారాన్ని వివరిస్తున్నట్లుగా ఉంటుంది.


‘కనకాభాని వాసాగ్ంసి’ - సూర్యుడు అంటున్నాడు - "’నేను బంగారు కాంతితో మెరిసిపోయే వస్త్రాలను ధరించిన వాడిని’ అని. ఇక్కడ వస్త్రాలు అంటే సూర్యుడి చుట్టూ ఉండే కిరణాలు లేదా ఆయన తేజస్సు అని అర్థం. సూర్యుడు బంగారు రంగులో ప్రకాశిస్తూ లోకాన్ని కప్పుతాడు.


“అహతాని నిబోధత” - ఆ సూర్యుని వస్త్రాలు (కాంతి పుంజములు) ఎప్పటికీ చెక్కుచెదరనివి (అహతాని - కొత్తవి లేదా నశించనివి) అని తెలుసుకోండి. సూర్య కాంతి ప్రతిరోజూ నూతనంగా, స్వచ్ఛంగా ప్రసరిస్తుంది. ఆ దివ్యమైన కాంతిని గుర్తించమని (నిబోధత) వేదం చెబుతోంది.


"అన్నమశ్నీత మృజ్మీత” - సూర్యుడు అంటున్నాడు - ‘అన్నాన్ని భుజించండి, పరిశుద్ధులుగా ఉండండి’ అని. (మృజ్మీత - స్నానాదుల ద్వారా లేదా అంతఃశుద్ధి ద్వారా నిర్మలమవ్వడం)’. భగవంతుడు ప్రసాదించిన ఆహారాన్ని స్వీకరిస్తూ, శరీరాన్ని మరియు మనస్సును శుద్ధి చేసుకోవాలని దీని అర్థం.


“అహం వో జీవనప్రదః" - సూర్య భగవానుడు స్వయంగా చెపుతున్నాడు - ‘నేనే మీకు జీవనాన్ని ప్రసాదించేవాడిని’ - అని. సూర్యుడు లేనిదే సృష్టిలో ప్రాణం లేదు. ఆయనే సకల ప్రాణకోటికి ఆహారాన్ని (photosynthesis ద్వారా), శక్తిని, ఆయుష్షును ఇచ్చే 'జీవనదాత'.


ఈ మంత్రం సూర్యుడిని 'ప్రత్యక్ష నారాయణుడు' గా స్థాపిస్తుంది. మనం తినే అన్నం (Energy) సూర్యుడి నుండే వస్తుంది కాబట్టి, ఆయనకు కృతజ్ఞతగా ఈ మంత్రాన్ని పఠిస్తాము. సూర్యుడు - జీవనదాత.


‘మృజ్మీత’ అనే పదం కేవలం బాహ్యమైన స్నానమే కాకుండా, సూర్యరశ్మి ద్వారా కలిగే ఆరోగ్య శుద్ధిని కూడా సూచిస్తుంది. ఆరోగ్యం మరియు శుద్ధి కారకుడు.


అరుణప్రశ్నలోని ఈ మంత్రాలను చదువుతున్నప్పుడు, సూర్యరశ్మి మన శరీరంపై ప్రసరించేలా చూసుకుంటే అటు ఆధ్యాత్మికంగా, ఇటు ఆరోగ్యపరంగా (ప్రాణశక్తి మరియు Vitamin D) ఎంతో మేలు జరుగుతుందని సదాచార సంపన్నులు అందరూ చెబుతుంటారు. భౌతిక భావన చూసాము. ఇంక…


తత్వాన్ని విచారిస్తే…

అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం జీవుడికి మరియు పరమాత్మకు మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని వివరిస్తుంది:


‘కనకాభాని’ - హిరణ్మయ పురుషుడు, - 

బంగారం ఎలాగైతే స్వచ్ఛతకు, వికార రహిత తత్వానికి సంకేతమో, పరమాత్మ కూడా అలాగే ఉంటాడు. ఉపనిషత్తులు పరమాత్మను 'హిరణ్మయ పురుషుడు' (బంగారు కాంతి గలవాడు) అని వర్ణిస్తాయి. ‘హిరణ్మయః పురుషుః’ - నారాయణోపనిషత్; హిరణ్మయేన పాత్రేణ - ఈశావాస్యోపనిషత్)

ఇక్కడ 'వస్త్రాలు' అంటే సూర్యుడి కిరణాలు మాత్రమే కాదు, సృష్టిలోని అనంతమైన శక్తులు.

అద్వైత దృష్టిలో, బంగారం నుండి తయారైన నగలు ఎలా బంగారమే అవుతాయో, ఆ హిరణ్మయ పురుషుడి నుండి వచ్చిన ఈ జగత్తు కూడా ఆ పరమాత్మ స్వరూపమే. 


‘అహతాని’ - అవ్యయ తత్వం - 'అహత' అంటే దెబ్బతిననిది లేదా చిరగనిది. లౌకికమైన వస్త్రాలు పాతబడిపోతాయి, కానీ సూర్యుడి ప్రకాశం లేదా పరమాత్మ చైతన్యం ఎప్పటికీ పాతబడదు. అది నిత్య నూతనం. ‘నిబోధత’ అని అనడం ద్వారా—బయట కనిపించే అనిత్యమైన వస్తువుల మీద కాకుండా, ఎప్పటికీ నశించని (అహత) ఆత్మ తత్వం మీద దృష్టి పెట్టమని వేదం బోధిస్తోంది.


‘అన్నమశ్నీత మృజ్మీత’ - ఉపాధి ధర్మం - అద్వైతం ప్రపంచాన్ని మిథ్య అని చెప్పినా, శరీరమనే ఉపాధిని నిర్లక్ష్యం చేయమని చెప్పదు. ‘అన్నమశ్నీత’ (అన్నం తినండి) అంటే దేహాన్ని సక్రమంగా (bare minimum) ఉంచుకోమని అర్థం. ఎందుకంటే *శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం*—ఆత్మ విచారణ చేయాలన్నా ఈ శరీరం ఒక సాధనం. ‘మృజ్మీత’ అంటే శుద్ధి. కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, జ్ఞానమనే నీటితో అంతఃకరణను (మనస్సును) శుద్ధి చేసుకోవడం. శుద్ధమైన మనస్సులోనే సత్యం ప్రతిబింబిస్తుంది.


‘అహం వో జీవనప్రదః’ - అద్వైత సిద్ధాంతం ప్రకారం,

ఇక్కడ 'అహం' Pure I, Pure consciousness, నేను - అనేది సూర్యమండల మధ్యవర్తి అయిన పరమాత్మను సూచిస్తుంది. అద్వైతంలో 'అహం' అంటే పరిమితమైన అహంకారం (ego) కాదు, అది సర్వవ్యాప్తమైన 'నేను' (The Universal Self).


‘మీ అందరికీ జీవనాన్ని ఇచ్చేది నేనే’ అని చెప్పడం ద్వారా - జీవుడిలో ఉన్న ప్రాణ శక్తి, పరమాత్మ చైతన్యం కంటే వేరు కాదని స్పష్టమవుతోంది. సూర్యుడు లేనిదే ప్రాణం లేదు, ఆత్మ లేనిదే ఉనికి లేదు.


బంగారు కాంతితో నిరంతరం వెలిగే ఆత్మ వస్త్రం (చైతన్యం) నీలోనే ఉంది. నీవు తీసుకునే అన్నం, నీవు చేసే కర్మలు అన్నీ ఆ పరమాత్మ శక్తి వల్లే సాధ్యమవుతున్నాయి. నీవు వేరు కాదు, ఆ జీవనప్రదాత అయిన పరమాత్మ వేరు కాదు. ఆ ఏకత్వాన్ని గుర్తించి, పరిశుద్ధమైన మనస్సుతో జీవించు అని మంత్ర భావన. ఈ చిన్న మంత్రంలో ఊహకి అందని భావం ఎంత ఉందో కదా!

బుధవారం,మే 6,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం,మే 6,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:పంచమి పూర్తి

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:మూల మ1.16 వరకు 

యోగం:సిద్ధం రా10.49 వరకు

కరణం:కౌలువ సా5.48 వరకు

తదుపరి తైతుల తె4.51 వరకు

వర్జ్యం:ఉ11.29 - 1.16 మరల రా11.48 - 1.33

దుర్ముహూర్తము:ఉ11.31 - 12.21

అమృతకాలం:ఉ6.10 - 7.57

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:మేషం

చంద్రరాశి:ధనుస్సు     

సూర్యోదయం:5.36

సూర్యాస్తమయం:6.17

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి🙏🏻

హనుమంతుడు

 శ్రీరామ (137 ) హనుమంతుడు - 5


( వాల్మీకి మహర్షి ధ్వనిరూపంలో చెప్పిన కుండలనీ యోగమే సుందరకాండ )



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్//

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                        ----------------------



నిన్నటి (5-5-'26) పోష్టులో,

 హనుమంతుడు శ్రీవిద్యోపాసకుడని,సుందరకాండ హనుమంతుడు ఆచరించిన కుండలినీ యోగమన్న విషయం ఈ క్రింది శ్లోకాన్ని బట్టి పండితులు వ్యాఖ్యానిస్తున్నారని చెప్పుకున్నాము.


శ్లో// కృత్వా మూర్ధ్ని పదన్యాసం రావణస్య దురాత్మన:/

త్వాం ద్రష్టు ముపయాతో౽హం, సమాశ్రిత్య పరాక్రమమ్//


(నేను నా పరాక్రమాన్ని ఆశ్రయించి దురాత్ముడైన రావణుని శిరస్సు పై పాదము పెట్టి,నిన్ను దర్శించుటకు ఇక్కడకు వచ్చితిని. తల్లీ! ) 


అని, అశోకవనంలో సీతాదేవిని దర్శించిన హనుమంతుడు అన్నాడు.


పై శ్లోకాన్ని వివరిస్తూ, సాధకుడు మూర్ధ్ని స్థానమైన సహస్రార చక్రంలో దృఢంగా పాదము నిలిపి శిఖాస్థానమైన " పీఠక " చక్రంలో ఉన్న చిచ్ఛక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని దర్శించాలని పరమపూజ్యులు శ్రీ చందోలు శాస్త్రిగారు చెప్పిన విషయం కూడా నిన్నటి పోష్టులో చెప్పుకున్నాము.


ఆ శ్లోకంలోని ' రావణస్య దురాత్మనః ' అంటే ఏమిటి?

కామ, క్రోధములకు వశుడై, అంతులేని సంసారచక్రములో పరిభ్రమిస్తూ ఉంటాడు జీవుడు.

ఆజీవుడే రావణుడు. 


దురాత్ముడు (నిష్కల్మష చిత్తం లేనివాడు) అయిన అట్టి రావణుని శిరస్సుపై పాదము పెట్టాను అన్నాను హనుమంతుడు.


 అనగా యమ, నియమాదులు బాగా అభ్యసించి, రాగద్వేషములను జయించిన చిత్తము కలవాడినయ్యాను అనటం.


సుందరకాండ ప్రారంభ శ్లోకంలోనే హనుమంతుడు శత్రుకర్శనుడు అనగా శత్రువులను క్షీణింపజేసినవాడు అనే పదం వాడబడింది.


శ్లో// తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్శనః/

ఇయేష పదమన్వేష్టుం చారణా చరితే పథి//


( జాంబవంతుడు,మొదలైన వారు ప్రేరేపించగా, శత్రువులను కృశింపజేసిన హనుమంతుడు, రావణుడు అపహరించిన సీతా దేవిని వెదకుటకై,చారణులు మొదలైన దేవతలు సంచరించు ఆకాశమార్గము ద్వారా లంకకు వెళ్లవలెనని నిశ్చయించుకొనెను).


సుందరకాండ లోని ఈ మొదటి శ్లోకంలో హనుమంతుడు " శత్రుకర్శనుడు" అని కీర్తింపబడ్డాడు.


సముద్ర లంఘనమునకు ముందు హనుమంతుడు ఏ శత్రువులను నశింపజేయలేదు.


అందువలన " శత్రుకర్శనుడు " అంటే ఈసందర్భంగా కామ,క్రోధాది అంతశ్శత్రువులను నశింపజేసిన వాడు, అనే అర్థం అని పండితులు వ్యాఖ్యానించారు.


" కామ క్రోధాదులను జయించి, కల్మషరహితమైన అంత:కరణము కలవాడినై,

 నీ దర్శనము కోసము వచ్చాను తల్లీ ! "


అని హనుమంతుడు సాక్షాత్తు చిచ్ఛక్తి స్వరూపిణి, జగన్మాత, అయిన సీతాదేవితో విన్నవించడము, పై శ్లోకము యొక్క తాత్పర్యము అని పండితుల అభిప్రాయం.


అలాగే " పరాక్రమమును ఆశ్రయించి" (సమాశ్రిత్య పరాక్రమం) అనే పదములను పెద్దలు ఇలా వ్యాఖ్యానిస్తున్నారు.


" పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరీ, అని నాలుగు విధములుగా వుండే "వాక్కు" లో, మొదటిదైన "పరా" వాక్కు వుండే స్థానం "మూలాధార చక్రము".

అక్కడ నుండి క్రమముగా ( పరాక్రమం) "స్వాధిష్ఠానము", "మణిపూరము", "అనాహతము", "విశుద్ధము", " "ఆజ్ఞా", అనే ఆరు చక్రములను దాటి ఏడవ చక్రమైన "సహస్రారము" చేరుకోవటం, 

 "సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదానికి అర్థం అని పండితులు చెబుతున్నారు.

అలాగే,

" త్వాం ద్రష్టు ముపయాతోహం" లోని చివరి అక్షరం "హం",

" సమాశ్రిత్య పరాక్రమమ్" అనే పదములోని మొదటి అక్షరం "సం" ,

ఈ రెండు అక్షరములు కలిసి "హంసం"అవుతుంది.

ఇదే ప్రాణశక్తి స్వరూపమైన హంస గాయత్రి.


"హంస హంస:పరమహంస స్సోహం హంస స్సోహం హంస:"

"హంస హంసేతి యో బ్రూయాత్, హంసో నామ సదాశివ:" 

రుద్రాభిషేకం సందర్భంగా మహాన్యాసం లో చెప్పే పై మంత్రం "హంస" అంటే సదాశివుడు అని అర్థం చెబుతున్నది.

హంస గాయత్రి అంటే ఆ సదాశివుని మంత్రమే.


ఆ హంస గాయత్రి మంత్రమును ఆశ్రయించి,పరా,పశ్యంతి,మధ్యమా, వైఖరీ క్రమమున నీ దర్శనం కోసం వచ్చాను తల్లీ, అని సీతాదేవితో హనుమంతుడు అన్నట్లుగా ప్రఖ్యాత కవులు, శ్రీవిద్యా ఉపాసకులు అయిన కీ.శే.లు 

శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు వ్యాఖ్యానించారు.


ఈ పదములను,సుందరకాండలోని ఇతర శ్లోకములను కూడా వ్యాఖ్యానిస్తూ, సుందరకాండ, కుండలినీ యోగమే అని చెప్పారు.( షోడశి రామాయణ రహస్యాలు).


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

6-5-'26.

నేనెవరు

 *'నేనెవరు'*🧘‍♂️🧘‍♂️🧘‍♂️


*జీవితంలో ప్రతి మానవుడు 'నేనెవరు' అని ప్రశ్నించుకోవాలి., తనలోకి తాను చూడగలగాలి. "అంతర్మథనం" సాగాలి. అదే నిజమైన సత్యాన్వేషణ, ఆధ్యాత్మిక ప్రయాణం, వేదాంత జ్ఞానం., కనిపించేది అంతా కనుమరుగు అవుతుంది. శాశ్వతమైన సత్యమార్గాన్ని తెలుసుకోగలుగుతాము... అదే భగవంతుని తత్వం.* .


*“శరీరం తాత్కాలికం, కనిపించని ఆత్మ శాశ్వతం. కనిపించని పరమాత్మ దానికి ఆధారం.”*


*“ క్లిష్టమైన సంస్కృత శ్లోకాలతో వేద ప్రామాణికాలతో సాగే ప్రబోధాలవల్ల సామాన్య మానవుడు 'నేనెవరు' అనేది గుర్తించడం లేదు. తనను తాను విచక్షణతో తెలుసుకోలేక సందేహంలో ఊగిసలాడుతున్నాడు., ఆధ్యాత్మిక జ్ఞానం వైపు దృష్టి సారించలేకపోతున్నాడు.*


*సరళమైన, సులభమైన గురుబోధ నరేంద్రుణ్ని వివేకానందుడిగా తీర్చిదిద్దింది.*🙏🙏🙏


*నేనెవరు అని ప్రశ్నించుకొని, “నీలోకి నిన్ను చూడు” అనే సందేశంతో తనలో దాగి ఉన్న అంతరార్థం “మానవత్వ మార్గం”., గ్రహాల పైకి ప్రయాణించే మానవుడు, అగాధమైన సముద్రం లోతుకు వెళ్లే మానవుడు, కొన్ని అంగుళాల లోపల ఉన్న అంతరంగంలోకి వెళ్లలేక పోతున్నాడు., దానినే మాయ అని అంటారు.* 


*తాను, తన సంపద, అధికారం, పరివారం శాశ్వతమని మానవుడు భావిస్తున్నాడు.., అవే అకృత్యాలకు, స్వార్థానికి, సంకుచిత మనస్తత్వానికి కారణాలు... స్వార్థం తగ్గిస్తే శ్రేయస్సు, కోరికను అదుపు చేస్తే శాంతి.., మోహక్షయం మోక్షం....*


*నేనెవరు అని ప్రశ్నించుకొనే కనీస జ్ఞానం తనకు తాను ఇవ్వగలిగితే చాలు., మానవుడు తనలోని మనసు అనే క్షీరసాగరాన్ని మదించి అమృతాన్ని పొందగలడు., అంతర్యామి బాహ్యంలో లేదు. పదిఅంగుళాల పరిమాణంలో నీలోని నువ్వుగా ఉన్నాడని నారాయణసూక్తం చెబుతోంది. ప్రతి ప్రాణీ భగవంతుని స్వరూపమే. ఎవరికి సేవ చేసినా  ఆ భగవంతునికే చెందినట్లు. ఎవరిని బాధించినా ఆ భగవంతున్ని బాధించినట్లు. ఇదే “బ్రహ్మోపదేశం”*


*పట్టాభిషేకమైనా, వనవాసమైనా స్థిరచిత్తముతో సాగిన శ్రీరాముడు దేవుడిగా మారాడు. “శోకం వదలి, ఫలితాన్ని ఆశించకుండా తన కర్తవ్యాన్ని నిష్కామంగా నిర్వర్తించు” అని బోధించిన కృష్ణుడు దేవుడిగా పూజలందుకున్నాడు.*🙏🙏🙏


*అహింస పరమధర్మం., శాంతి సౌఖ్యాలు సమాజ సేవలోనే దొరుకుతాయి., హృదయాన్ని వీణగా భావించి కరుణ, విషాదం, ఆనందం, దుఃఖం, అవమానం, సత్కారం తీగలుగా రాగాలు పలికిస్తే- అదే మానవ జీవనానికి ఆధ్యాత్మిక ప్రయాణం.*🙏🙏🙏


*ధ్యాన సాధనతో, జ్ఞానముతో ప్రతి మానవుడు ఈ స్థితిని పొందగలడు.., "సాధన ముఖ్యం..," "సాధన ద్వారానే సాధించగలము.*


సర్వేజనాః సుఖినోభవంతు 

 శుభమస్తు🙏

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - కృష్ణ పక్షం - చతుర్థి - మూల -‌‌ సౌమ్య వాసరే* (06.05.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

5, మే 2026, మంగళవారం

పంచాంగము

  


మానవ జీవిత

 *మానవ జీవిత పరిణామక్రమం* 

🪷🪷🪷🪷🪷🪷🪷

*అవును... బాల్యంలో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే...తీసి స్కూల్ లో వేస్తారు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు...డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే,..లాగి పెట్టి ఒకటి పీకి,..పెళ్లి అనే బంధాన్ని ముడి వేస్తాడు... సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే...పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేసి వెనక్కు లాగుతాడు...కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి మేధావిలా ఈసారి దేవుడి మాట కూడా వినడు...కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు...హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవ్వరూ ఉండరు,..పిల్లలు పెద్ద వాళ్ళు అయిపోతారు...సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడు వాడి పిల్లల భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరి పోతారు...అప్పుడు ప్రతీ మగధీరుడుకి భార్య విలువ తెలవడం ప్రారంభిస్తుంది...కొందరు పిల్లలైతే ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళ బంగారు భవిషత్తు కోసం అని...తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. శక్తి మొత్తం క్షీణించి ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు సినిమా లా కదలాడుతుంది. తెలియకుండానే అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు. ఇదే సగటు మనిషి గా బతుకుతున్న జీవితం.*


*అందుకే మన జీవితంలో ప్రతి నిత్యం నీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకో...బాధ్యతల బరువుతో పాటూ నీ మరియు నీ జీవిత భాగస్వామీ సంతోషాన్ని ప్రతి దశలోనూ వెతుకు. Help ever, hurt never సూత్రాన్ని పాటించు...ఏదీ మోసుకుపోలేవని గుర్తెరిగి, నీకు వీలైనంతలో ఇవ్వడం నేర్చుకో, నవ్వడం నేర్చుకో, మన తల్లి దండ్రులు, భార్య/భర్త, మన పిల్లలు, మన రక్తసంబదీకులైన బంధువులు,మిత్రులతో గొడవలు పడకుండా ప్రశాంతంగా ఆనందంగా గడపడానికి గట్టిగా ప్రయత్నించు. ప్రతి పనిలో నీదైన ఆనందాన్ని వెతుకు. బ్రతకడం మాని ఆనందంగా, ఆరోగ్యంగా... నాలుగు మంచి జ్ఞాపకాలు మిగుల్చుకో.* 💐🙏🇮🇳