11, జూన్ 2026, గురువారం

పంచాంగము


 

అధరం మధురం

  అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం | హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 1 ||


వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం | చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 2 ||


వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ | నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 3 ||


గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం | రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం || 4 ||

శుక్రవారం🌹* *🪷12,జూన్, 2026🪷*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌹శుక్రవారం🌹* 

 *🪷12,జూన్, 2026🪷*       

   *దృగ్గణిత పంచాంగం* 

              

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం* 


*తిథి      : ద్వాదశి* రా 07.36 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం   : అశ్విని* ఉ 06.28 *భరణి* రా.తె 04.05 వరకు

*యోగం  : అతిగండ* రా 09.26 వరకు ఉపరి *సుకర్మ* 

*కరణం   : కౌలువ* ఉ 09.10 *తైతుల* రా 07.36 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

        *-ఈరోజు లేవు-* 

 అమృత కాలం  : *రా 11.46 - 01.12*

 అభిజిత్ కాలం  : *ప 11.41 - 12.34*

*వర్జ్యం      : మ 03.07 - 04.33*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.04 మ 12.34 - 01.28*

*రాహు కాలం  :ఉ10.29 - 12.07*

గుళికకాళం      :*ఉ 07.13 - 08.51*

యమగండం    : *మ 03.24- 05.02*

సూర్యరాశి : *వృషభం*                 

చంద్రరాశి : *మేషం*

సూర్యోదయం :*ఉ 05.41*  

సూర్యాస్తమయం :*సా 06.51*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34- 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.49*

మధ్యాహ్న కాలం    :*10.49 - 01.26*

అపరాహ్న కాలం  :*మ 01.26- 04.03*

*ఆబ్ధికం తిధి        : అధిక జ్యేష్ఠ బహుళ ద్వాదశి*

సాయంకాలం  :*సా 04.03 - 06.40*

ప్రదోష కాలం      :*సా 06.40 - 08.51*

రాత్రి కాలం       :*రా 08.51 - 11.46*

నిశీధి కాలం      :*రా 11.46 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.07 - 04.51*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

           

              *🪷ఓం🪷* 

*🌷శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


         🌷*సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

గొప్ప తరం

 *ఒక గొప్ప తరం వెళ్ళిపోతోంది.!*


     గొప్పగా బతికిన వారు ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక గొప్పతరం కనుమరుగవుతోంది.


    అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం. 

   ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం. బాధ్యతల్ని ఎరిగిన తరం. 

   'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం. 


  డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం. 

    గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం. 


    ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం. 

    కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం. 

    మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం. 

   TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం. 

    GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం. 

    సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం. 

   ACలు, కూలర్లు లేకున్నా

ఆరుబయట హాయిగా నిద్రించిన తరం. 

     మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం. 

   పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం. 


      రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం. 

     ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం. 

    ఏడు ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం. 

     కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం. 

    క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం. 

    వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం. 


    సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం. 

ఇంటిముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం. 

     పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం. 

     బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం. 

    ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిచ్చిన తరం. 

     ఉమ్మడికుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం. 

   భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం. 


     వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం. ఇతరుల మేలు కోరుకున్న తరం. 

    నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం. 

    రాళ్లు తిన్నా అరిగించుకోగలిగిన తరం. 


    కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం. 

   హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం. 

   బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం. 

    లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం. 

   కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం. 

    ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం. 

   ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. 

పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం. 

     త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. 

    కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం. 


   అలాంటి తరంలోని అపురూపమైన గొప్పవ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు. 

వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది. 

   వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!

  *అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు *

🙏🙏

ఏ వ్యాధి వస్తుంది

 మానవులకు ఏ గ్రహం వలన ఏ వ్యాధి వస్తుంది .


• టై ఫా యి డు దీనిని సన్నిపాత జ్వరం అంటారు.ఇది గురు - బుద గ్రహాల సంభందం వలన వస్తుంది.


• డ య బె టిక్ అనగా మధు మేహం ఇది గురు - బుద గ్రహాల వలన వస్తుంది.


• జాండిస్ అనగా కామెర్లు అంటారు. ఇది గురు - శుక్ర గ్రహాల వలన వస్తుంది.


• రాచ పుండు ఇది రవి గ్రహం వలన వస్తుంది.


• మలేరియా ఇది శని గ్రహం వలన వస్తుంది.


• అతిసారం ఈ వ్యాధి కుజుడు, బుదుడు,శని, కేతువు మొదలయిన గ్రహాల సంభందం వలన వస్తుంది.


• మొలల వ్యాధి కుజ - రాహు గ్రహాల సంభందం వలన వస్తుంది.


• అజీర్ణ వ్యాధి ఇది శని గ్రహం వలన వస్తుంది.


• క్షయ వ్యాధి శుక్ర గ్రహ ప్రభావం వలన వస్తుంది.


• ఉబ్బసం శని, బుదుడు, కేతువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• ఉన్మాదం రవి , కుజుడు, శని కలయిక వలన వస్తుంది.


• ధనుర్వాతం ఇది రవి, కుజుడు, శని కలయిక వలన వస్తుంది.


• పక్షవాతం ఇది శని ప్రభావం వలన వస్తుంది.


• కుంటి తనం శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.అన్ని రకాల వాతాలకు శని గ్రహ ప్రభావమే కారణం.


• ముగతనం ఇది బుద, కేతు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• గౌట్ దీనిని వాత రక్త వ్యాధి అంటారు.ఇది రవి, శుక్ర గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• శూల నొప్పి ఇవి శని, కుజ, రాహు గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• గుండె రోగాలు ఇవి శుక్ర గ్రహ ప్రభావం వలన కలుగుతాయి.


• హెర్నియా దీనిని బు డ్డ గిలక అంటారు.ఇది బుద గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• బుడ్డ ( వరిబీజము) ఇది బుద గ్రహం వలన ఏర్పడుతుంది.


• భయంకర చర్మ వ్యాధులు ఇవి కేతువు , శుక్ర , చంద్ర గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• దంత రోగాలు ఇవి గురు, శని గ్రహాల ప్రభావం వలన కలుగుతాయి.


• చెవుడు ఇది శని గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• తలనొప్పి ఇది కుజుడు, రాహువు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• ఉబ్బు రోగాలు ఇవి కేతువు గ్రహ ప్రభావం వలన కలుగుతుంది.


• కాన్సర్ ఈ భయంకర వ్యాధి రవి, కుజ,గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• స్త్రీ తెల్ల బట్ట ఇది కుజుడు , శుక్రుడు గ్రహాల ప్రభావం వలన వస్తుంది.


• స్త్రీల ఎర్రబట్ట ఇది రవి, కుజుడు గ్రహల వలన వస్తుంది.


• గోడ్డ్రాలితనం ఇది కుజ ,శని,బుద,శుక్ర గ్రహాల కలయిక వలన వస్తుంది.పైన చెప్పిన వ్యాదులు మందులు వాడుతున్నా తగ్గక పొతే ఆయా గ్రహాలకు శాంతులు, జపాలు చేయించడం వలన వ్యాధి ప్రభావం నుంచి బయట పడవచ్చు. 


       మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.



దక్షిణావర్తి శంఖం

 దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత - 

శంఖములలో రెండు రకాలు కలవు . అవి

• వామావర్తి శంఖము .

• దక్షిణావర్తి శంఖము .


       పైన చెప్పిన రెండురకాల శంఖాలలో దక్షిణావర్తి శంఖం సులభముగా లభ్యం అగును. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు . దీనిని పూజలలో మహాలక్ష్మితో సమానంగా భావించెదరు .తంత్రగ్రంధాల ప్రకారం వామావర్తి అంటే ఎడమ చేయి వైపు "కడుపు" కలది అనగా ఎడమచేయి వైపు తెరిచి ఉండేది అని దక్షిణావర్తి అంటే కుడివైపు తెరచి ఉండేదని అర్థం . ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ మీకు ఇస్తాను . శంఖం అనేది " ఘోoఘా " అనే సముద్రజాతికి చెందిన జంతువు . ఇది తెరుచుకొని ఉన్న భాగమే దీని కడుపు లేక నోరు . తలవలే ఉండి ఊదే భాగం దానియొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం లేక తోకభాగం . దీనికే గుండ్రని కన్నం చేసి నోటితో ఊదుతారు. దక్షిణవర్తి శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు . సముద్రము నందు జన్మించడం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడిన వస్తువు . సమస్త సిరులు , భోగభాగ్యాలు ప్రసాదించును . శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయము నందు తప్ప మిగిలిన సమయాలలో పూజా మందిరము నందు ఉంచి పూజించేవారు . దీనిని లక్ష్మీదేవి సహోదరిగా చెప్పుదురు . ఇది అరుదుగా లభ్యం అగును . రామేశ్వరం , కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశాలలో దొరకదు . ఈ దక్షిణావర్తి శంఖం మోగదు . మోగేది దొరుకుట అదృష్టము మరియు కష్టం . దోషయుక్తం అనగా పగిలిన మరియు విరిగిన శంఖం ఇంటి యందు ఉంచరాదు .  


 ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .) అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి .


మంత్రం -


"ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః ".

 

ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది .

దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు -

• ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు .

• గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును .

• అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును .

• దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును .

• నెగిటివ్ శక్తి నశించును .పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను .

దోషములు గురించి వివరణ -

• పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు .

• శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు .

• మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు .

• శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు .శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది . 


                       సమాప్తం  



        

సప్త చిరంజీవుల శ్లోకం:*

 *✡️సప్త చిరంజీవుల శ్లోకం:*


*అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః|*

*కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః||*

*సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం!*

*జీవేద్వర్షశ్శతమ్ సాపి సర్వవ్యాధి వివర్జిత||*.        


ఈ శ్లోకం హిందూ సనాతన ధర్మంలో అత్యంత ప్రసిద్ధమైనది. దీనిని రోజూ స్మరించడం లేదా పఠించడం వల్ల అకాల మరణం (అపమృత్యువు) తొలగిపోయి, ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు లేకుండా నిండు నూరేళ్ళు (100 సంవత్సరాలు) ఆయుష్షు లభిస్తుందని నమ్ముతారు.


*🔵శ్లోక తాత్పర్యం (అర్థం):*"అశ్వత్థామా, బలిచక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు - ఈ ఏడుగురు చిరంజీవులు (అమరులు). ఈ ఏడుగురితో పాటు ఎనిమిదవ వానిగా మార్కండేయుడిని నిత్యం స్మరించుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా స్మరించే వారికి ఎలాంటి వ్యాధులు సోకవు మరియు వారు నూరేళ్ల ఆయుష్షుతో సుఖంగా జీవిస్తారు".


*🔴సప్త చిరంజీవులు (ఏడుగురు అమరులు) ఎవరు?* పురాణాల ప్రకారం ఈ ఏడుగురు ఇప్పటికీ భూమిపై సూక్ష్మ రూపంలో లేదా భౌతిక రూపంలో సంచరిస్తూ, లోక కళ్యాణానికి తోడ్పడుతున్నారని విశ్వాసం.


*అశ్వత్థామ:* ద్రోణాచార్యుని కుమారుడు.

*బలి చక్రవర్తి:* వామనుడికి మూడడుగుల నేల దానం చేసి, పాతాళానికి అధిపతి అయిన దానవ రాజు.

*వ్యాస మహర్షి:* వేదాలను విభజించి, మహాభారతాన్ని రచించిన వారు.

*హనుమంతుడు:* రామ భక్తుడు, అంజనీ పుత్రుడు, బ్రహ్మచారి.

*విభీషణుడు:* రావణుని తమ్ముడు, ధర్మాత్ముడు.

 *కృపాచార్యుడు:* కౌరవ పాండవుల కులగురువు.

*పరశురాముడు:* విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం. 

(ఈ ఏడుగురితో పాటు ఎనిమిదవ వారిగా చిరంజీవి అయిన మార్కండేయ మహర్షిని కూడా స్మరిస్తారు).


*🟢ఈ శ్లోకం యొక్క ప్రాముఖ్యత మరియు ఎలా ఉపయోగించాలి:*

ఆయుష్షును పెంచే మంత్రం. నిత్యం ఉదయాన్నే నిద్ర లేవగానే లేదా పూజ చేసుకునే సమయంలో ఈ శ్లోకాన్ని చదవడం ద్వారా ఆరోగ్యం మరియు దీర్ఘాయుస్సు సిద్ధిస్తుంది.

*🔹పుట్టినరోజున పఠనం:* విశేషించి పుట్టినరోజు (Birthday) నాడు ఈ శ్లోకాన్ని పఠించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. *🔹విధానం:* ఒక పాత్రలో ఆవు పాలు, బెల్లం, నల్ల నువ్వులు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత ఈ సప్త చిరంజీవి శ్లోకాన్ని పఠించి, ఆ మిశ్రమాన్ని మూడు సార్లు తీర్థంగా స్వీకరించాలి. దీనివల్ల జీవితంలో జరగబోయే ప్రమాదాలు, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.


        *🪷సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🪷*

ఒక ఆలోచన

 *ఒక కప్పు టీ... ఒక ఆలోచన"

-కథానిక


శ్రీశైలం క్షేత్రంలో బస్‌స్టాండ్‌కు దగ్గరగా వెంకట్రావు ఒక చిన్న జిరాక్స్ షాపు నడిపేవాడు. జిరాక్స్‌లు, ప్రింట్లు, ఆన్‌లైన్ టికెట్లు—అన్నీ అతని షాపులో చేసేవారు. పనిలో ఎంత బిజీగా ఉన్నా, తన దగ్గరకు వచ్చిన వారితో రెండు మాటలు మాట్లాడటం అతని అలవాటు.


ఒకరోజు ఉదయం హైదరాబాద్‌ నుంచి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన ఆనందరావు, దర్శన టికెట్ ప్రింట్ తీసుకోవడానికి వెంకట్రావు షాపుకు వచ్చాడు.


"అన్నా, ఈ టికెట్ ప్రింట్ కావాలి," అని ఫోన్ చూపించాడు.

వెంకట్రావు ఫైల్ ఓపెన్ చేసి చూస్తుండగా, అప్పటికే కొందరు కస్టమర్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

"కాస్త ఆలస్యం అవుతుంది సార్... మీరు కూర్చోండి," అన్నాడు.

"పర్వాలేదు," అని చిరునవ్వుతో పక్క కుర్చీలో కూర్చున్నాడు ఆనందరావు.

ఆ చిరునవ్వులో ఏదో ప్రశాంతత ఉంది. ఆలస్యం అవుతున్నా అసహనం లేదు. గడియారం వైపు పదేపదే చూడటం లేదు. 

అది వెంకట్రావును ఆకర్షించింది.


"టీ తాగుతారా?" అని అడిగాడు.

అయ్యో ఎందుకులెండి అనాలనుకున్నా "తాగుతాను," అన్నాడు ఆనందరావు.

వెంటనే పక్కనే ఉన్న టీ దుకాణం నుంచి రెండు టీలు తెప్పించాడు వెంకట్రావు.

టీ తాగుతుండగా ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి.


"మా అబ్బాయి, కోడలు హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు," అన్నాడు వెంకట్రావు.

"చాలా మంచిది," అన్నాడు ఆనందరావు.

"మంచిదే గానీ... ఒక చిన్న సమస్య ఉంది. వాళ్లు బాగా సంపాదిస్తున్నారు. కానీ పొదుపు చేయడం లేదు. అందుకే నెలకు నలభై వేల రూపాయలు నాకు పంపమని చెప్పాను. ఆ డబ్బుతో వాళ్ల పేరుమీద ఇల్లు కొనాలని అనుకున్నాను."

"అయితే పంపించారా?"

వెంకట్రావు నవ్వాడు.

"అదే కథ. మొదట అడిగితే వాళ్లిద్దరికీ కోపం వచ్చింది. నేను వాళ్ల డబ్బు మీద కన్నేశానని అనుకున్నారు."

"మరి?"

"అప్పుడు ఒక చిన్న అబద్ధం చెప్పాను. నీ చదువు కోసం అప్పులు చేశాను, అవి ఇంకా తీర్చాల్సి ఉందని చెప్పాను. వెంటనే ఒప్పుకున్నారు."

ఆనందరావు ఆశ్చర్యంగా చూశాడు.

"అంటే నిజంగా అప్పులు లేవా?"

"లేవు. కానీ వాళ్ల భవిష్యత్తు కోసం చేసిన అబద్ధం అది. వాళ్లకు తెలియకుండా వాళ్లకోసం దాచుతున్నాను."


కొద్దిసేపు ఆనందరావు మౌనంగా ఉన్నాడు.

తర్వాత చిరునవ్వు నవ్వాడు.

"మీరు నాకు ఒక గొప్ప ఐడియా ఇచ్చారు."

"ఏమిటది?" అడిగాడు వెంకట్రావు.

"నాకూ ఇద్దరు కొడుకులు. వాళ్లు కూడా బాగా సంపాదిస్తున్నారు. నేను డబ్బు ఇవ్వమని అంటే అవసరం ఏమిటని అడుగుతారు. ఇప్పటివరకు నేను అడగలేదు. కానీ వృద్ధాప్యంలో కొంత భద్రత ఉండాలని అనిపిస్తోంది."


వెంకట్రావు ఆసక్తిగా విన్నాడు.

"ఇప్పుడే మీరు చెప్పిన వ్యూహం వాడతాను. నేను కూడా మీ చదువు కోసం అప్పు చేశానని మా పిల్లలకు చెబుతాను," అని నవ్వుతూ అన్నాడు ఆనందరావు.

వెంకట్రావు కూడా నవ్వాడు.

ఒక మాట కూడా అన్నాడు

"అయ్యో! నేను చెప్పింది కాపీ కొట్టేస్తున్నారే!"

"మీ షాపు జిరాక్స్ షాపు కదా! ఇక్కడ కాపీలు తీయడం సహజమే," అన్నాడు ఆనందరావు.

ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.


అంతలో టికెట్ ప్రింట్ పూర్తయింది.

టికెట్ తీసుకుంటూ ఆనందరావు,

 "మీరు నాకు ప్రింట్ మాత్రమే ఇవ్వలేదు. ఒక ఆలోచన కూడా ఇచ్చారు. ధన్యవాదాలు," అన్నాడు.

వెంకట్రావు చిరునవ్వుతో, 

"స్వామి దర్శనం బాగా చేసుకుని వెళ్లండి సార్," అన్నాడు.

ఆనందరావు బయలుదేరాడు.

షాపు బయటకు వెళ్లిపోతున్న అతన్ని చూస్తూ వెంకట్రావు మళ్ళీ పనిలో పడిపోయినా తన మాటలు ఇంకో వ్యక్తిలో తెచ్చిన మార్పు గురించి ఇలా అనుకున్నాడు

"కొన్నిసార్లు మనం అనుకోకుండా చెప్పిన మాట, ఎదుటివారి జీవితంలో ఒక కొత్త ఆలోచనకు విత్తనమవుతుంది. ఒక కప్పు టీ తో మొదలైన పరిచయం, ఒక జీవిత పాఠంగా మిగిలిపోవచ్చు"


సి.యస్.రాంబాబు

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము


యోగసన్న్యస్తకర్మాణం జ్ఞానసంఛిన్నసంశయమ్ ।

ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ।। 41 ।।



ప్రతిపదార్థ:

 

 యోగ-సన్న్యస్త-కర్మాణం — కర్మ కాండలను త్యజించి, శరీరము-మనస్సు-ఆత్మ ను భగవత్ సేవకే ఉపయోగించే వారు; జ్ఞాన — జ్ఞానముచే; సంఛిన్న — పోగొట్టబడి; సంశయమ్ — సంశయములు (సందేహాలు); ఆత్మ-వంతం — ఆత్మ జ్ఞానంలో స్థితులై; న — కాదు; కర్మాణి — కర్మలు; నిబధ్నంతి — బంధించును; ధనంజయ — అర్జునా, సంపదను జయించేవాడా.



 తాత్పర్యము : 


 ఓ అర్జునా, యోగాగ్నిలో కర్మలను త్యజించి, జ్ఞానంతో తమ అన్ని సందేహాల నివృత్తి చేయబడి, ఆత్మ జ్ఞానమందే స్థితులైన వారిని కర్మలు బంధించవు.



వివరణ:



‘కర్మ’ అంటే విహిత ఆచారములు మరియు సామాజిక విధులు నిర్వర్తించటంలో ఉన్న అన్ని క్రియాకలాపములు; ‘సన్యాసం’ అంటే ‘త్యజించుట/విడిచిపెట్టుట’; ‘యోగ్’ అంటే ‘భగవంతునితో ఐక్యత’. ఇక్కడ శ్రీ కృష్ణుడు యోగసన్న్యస్త కర్మాణం అన్న పదం వాడాడు, అంటే ‘పూజాది అన్ని కర్మకాండలను త్యజించి, తమ శరీర-మనస్సు-ఆత్మలను భగవంతునికే అంకితం చేసేవారు’ అని. అలాంటి వారు తమ అన్ని క్రియలను భగవత్ సేవగా చేస్తారు. భక్తి యుక్తముగా వారు చేసే పనులు వారిని కర్మ బంధములలో పెనవేయవు అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు.


తన స్వార్థ ప్రయోజనం కోసం చేసే కర్మలే వ్యక్తిని కర్మ బంధములలో కట్టివేస్తాయి. ఎప్పుడైతే పనులను కేవలం భగవత్ ప్రీతి కోసం మాత్రమే చేసినప్పుడు, వాటికి కర్మ ప్రతిక్రియలు ఉండవు. అంటే సంఖ్యలను 0 (సున్నా) తో గుణించినట్టే. పదిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నా; వెయ్యిని సున్నాతో గుణిస్తే ఫలితం సున్నాయే; లక్షను సున్నాతో గుణిస్తే, ఫలితం ఇంకా సున్నాగానే ఉంటుంది. అదే విధంగా, జ్ఞానోదయమైన జీవాత్మలు ఈ లోకంలో చేసే పనులు, వారిని కర్మ బంధములలో పడవేయవు, ఎందుకంటే వాటిని యోగాగ్నిలో భగవత్ అర్పితము చేస్తారు, అంటే భగవత్ ప్రీతి కోసమే చేస్తారు. ఈ విధంగా, అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా, మహాత్ములు కర్మ బంధములలో చిక్కుకోరు.

గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

11-06-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


ఆప్తుల నుండి అవసరానికి సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు లభిస్తాయి. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మ విశ్వాసంతో పని చేసి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. దాయాదులతో ఆస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఆశించిన సహకారం అందుతుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశలు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------


మిధునం


ఋణ ఒత్తిడి అధికమై మానసిక శిరో భాధలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతాన విషయమై ఊహించని విషయాలు తెలుస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు కష్టం మీద పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

---------------------------------------


కర్కాటకం


మిత్రులకు మీ అభిప్రాయాలు నచ్చే విధంగా ఉండవు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేయలేరు. కుటుంబ పెద్దలతో మాటపట్టింపులుంటాయి. ఇంటా బయట ఒత్తిడి వలన శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల ఆగ్రహానికి గురికావాల్సివస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. 

---------------------------------------


సింహం


బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి. వాహన అనుకూలత కలుగుతుంది. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానలు అందుతాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రవర్తనకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. శారీరక మానసిక సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగమున విలువైన పత్రముల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు కలిసిరావు. కుటుంబ విషయంలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. దైవ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది.

---------------------------------------


వృశ్చికం


నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

---------------------------------------


ధనస్సు


కీలక వ్యవహారాలలో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుని లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------


మకరం


అనవసర వస్తువులపై ధనవ్యయం చేస్తారు. సమయానికి నిద్రహారాలు ఉండవు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి

--------------------------------------


కుంభం


సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధు మిత్రుల నుండి విలువైన బహుమతులు పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విందు వినోద కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. సంతానం విద్యా విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

ఇంటా బయటా జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కావు. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి. ఇంటా బయట వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

---------------------------------------