5, ఫిబ్రవరి 2026, గురువారం

36 recommendations

 


This is a list of 36 recommendations for a happy and healthy post-retirement life. This is a circulation by the HR department of a reputed company.


1. Avoid travelling alone.


2. Travel with your spouse.


3. Avoid going out during peak hours.


4. Avoid excessive exercise or walking.


5. Avoid excessive reading, mobile use or watching TV.


6. Avoid overmedication.


7. Visit doctors on time and take medications regularly.


8. Avoid property dealings after retirement.


9. Always carry your ID and important phone numbers.


10. Forget the past and don't worry too much about the future.


11. Eat what suits you, and chew slowly.


12. Be cautious in the bathroom and toilet.


13. Avoid smoking and drinking, they're harmful.


14. Don't boast about your achievements.


15. Travel extensively for a few years after retirement, then avoid crowded places.


16. Don't discuss your property and assets with others.


17. Exercise according to your capacity and health.


18. Avoid headstands and kapalabhati if you have high BP or heart issues.


19. Stay positive and avoid excessive emotions.


20. Don't sleep immediately after eating

.

21. Don't lend money to others.


22. Avoid giving unsolicited advice to the next generation.


23. Respect others' time.


24. Don't try to earn more if you don't need to


25. Avoid daytime naps to sleep well at night.


26. Have your own space and respect others' privacy.


27. Make a will and consult your spouse.


28. Avoid giving your retirement savings to the next generation.


29. Join a senior citizens' group, but avoid conflicts.


30. Don't disturb others if you can't sleep.


31. Don't pluck flowers from trees.


32. Avoid discussing politics, or accept differing opinions.


33. Don't constantly complain about your health.


34. Avoid quarreling with your spouse, they're your primary support.


35. Attend spiritual events, but don't become a blind follower.


36. Live a stress-free life with a smile.


This post is shared by the National Senior Citizens' Welfare Association of India is very useful for everyone. Please go through and try to understand and follow.


*🥰🌹😂 for retired people*

celebrating of ages 60, 70, 80, 90 and 100 :

 In the southern part of India the practice of celebrating of ages 60, 70, 80, 90 and 100 :


Someone once asked me the Reason....

“Why do we celebrate ages like 60, 70, 80, 90, and 100 so grandly?

Are these numbers spiritual, or are they just cultural traditions?”


The answer lies in a powerful story from the Mahabharata—the story of King Yayati....


King Yayati lived life to the fullest—power, pleasures, success, everything. But when old age suddenly arrived, it shook him deeply. After deep reflection, he realized a profound truth:

“Pleasure has limits, but desire never ends.”

This single realization transformed his life. He accepted old age and explained that life has five inner turning points—not based on age, but on understanding.


Remarkably, these five turning points align with the traditional Indian milestones of 60, 70, 80, 90, and 100 years. Let us understand them in simple terms.


*60 – Shashti*


The mind shifts from accumulation to understanding


Around 60, something changes—not in the body, but in priorities.

The question “How much more can I get?” slowly fades, and

“What truly matters now?” takes its place.


Introspection begins.

Noise, applause, and external validation are no longer needed.

Clarity is what one seeks.


This is not decline—it is maturity catching up with ambition.


*70 – Bheemaratha Shanthi*


Peace feels more powerful than proving a point


In the 40s and 50s, we explain ourselves to the world.

At 70, a quiet shift occurs.


You no longer react instantly.

Arguments lose their attraction.

Preserving relationships matters more than winning debates.


One realizes:

Being peaceful is more valuable than being right.

That is why the 70th year is celebrated.


*80 – Sathabhishekam*


Your presence itself becomes healing


At 80, people don’t come seeking advice.

They come seeking something deeper—

the reassurance that life can be lived, processed, and understood.


At this age, your presence becomes a blessing.

Words are no longer necessary.

Your very being says:

“Everything was okay. Life finds its way.”


That is why 80 is considered sacred.


*90 – Navathi*


The ego quietly retires


At 90, something rare happens.


You no longer feel the urge to correct people.

You don’t cling to opinions.

Things are not taken personally.

You are not easily hurt.


Not because of weakness—

but because life has already shown you enough.

Petty matters no longer deserve your energy.


A gentle stillness settles in.

This humility is true spirituality.


*100 – Shatamanam*


Life moves beyond personal stories


Reaching 100 is not just about the number of years.

It is a state where the larger picture becomes visible.


You realize that many of the worries you carried were unnecessary.

The love you gave was what truly mattered.

And life was always being held by a mysterious, compassionate force.


At 100, a person becomes less of an individual

and more of a presence.


Essence


Our sages did not celebrate age.

They celebrated the inner transformation that comes with age.


•⁠ ⁠60 – Priorities shift

•⁠ ⁠70 – Peace becomes strength

•⁠ ⁠80 – Presence becomes healing

•⁠ ⁠90 – Ego dissolves quietly

•⁠ ⁠100 – Life reaches completion


Age is not deterioration.

Age is a filtration process—

through which wisdom, gentleness, and grace remain.


Thought for the Day


*Growing older means life is becoming purer, wiser, and gentler.* 🌹🙏🌹

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

05ఫిబ్రవరి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹05ఫిబ్రవరి2026🌹*

   *దృగ్గణిత పంచాంగం*                

                

           *ఈనాటి పర్వం*

       *సంకష్టహర చతుర్ధి* 

   

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : చవితి* ‌రా 12.22 వరకు ఉపరి *పంచమి*

*వారం   : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : ఉత్తర* రా 10.57 వరకు ఉపరి *హస్త*

*యోగం : సుకర్మ* రా 12.04 వరకు ఉపరి *ధృతి* 

*కరణం  : బవ* మ 12.10 *బాలువ* రా 12.22 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ09.30-10.15సా04.00-06.00*

అమృత కాలం  : *మ 03.32 - 05.11*

అభిజిత్ కాలం  : *ప 11.59 - 12.44*

*వర్జ్యం    : శేషం ఉ07.17 వరకు*

*దుర్ముహూర్తం  : ఉ 10.27 - 11.13 మ 03.02 - 03.48*

*రాహు కాలం  :మ01.48- 03.14*

గుళికకాళం      : *ఉ 09.29 - 10.55*

యమగండం    : *ఉ 06.37 - 08.03*

సూర్యరాశి : *మకరం*                       

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 06.47* 

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 06.37 - 08.55*

సంగవ కాలం         :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం    :*11.13 - 01.30*

అపరాహ్న కాలం  :*మ01.30- 03.48*

*ఆబ్ధికం తిధి     : మాఘ బహుళ చవితి*

సాయంకాలం    :*సా 03.48- 06.06*

ప్రదోష కాలం      :*సా06.06- 08.36*

రాత్రి కాలం        :*రా 08.36 - 11.56*

నిశీధి కాలం       :*రా 11.56 - 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*

******************************

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ సద్గరుభ్యో నమః.!!*


*చైతన్యః శాశ్వతఃశాంతో* 

*వ్యోమాతీతో నిరంజనః*

*బిందునాద కలాతీతః*

*తస్మై శ్రీగురవే నమః*

           

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

మాఘ పురాణం - 18వ*

  🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷గురువారం 5 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 18వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *5వ తేదీ గురువారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*


మాఘ పురాణం     పద్ధెనిమిదవ అధ్యాయంలో, 

శ్రీ మహా విష్ణువు       దేవతలతో మాఘమాస మహిమను వివరించాడు. 

మాఘ పూర్ణిమ నాడు స్నానం, పూజ చేసిన వారి పాపాలు నశిస్తాయని, మాఘమాస  వ్రతం ఆచరించిన వారు వైకుంఠం చేరుతారని చెప్పాడు. .


        *ఇంద్రుని శాపవిముక్తి*```


శ్రీమహా విష్ణువు దేవతలతో మరల నిట్లనెను. దేవతలారా! మాఘమాస మహిమను యెంత చెప్పినను చాలదు. మాఘ పూర్ణిమ నాడు మాఘస్నానము, పూజ మున్నగునవి చేసిన వాని పాపములన్నియు నశించును. మాఘ వ్రతమును ఆచరించిన వారు నాకిష్టులు వారు దేవతలై వైకుంఠమును చేరుదురు.

మాఘస్నానము ఆపదలను పోగొట్టి సంపదలనిచ్చును. మాసములలో మాఘమాసము గొప్పది. సూర్యుడు ప్రకాశించువారిలో గొప్పవాడు. అశ్వర్థ వృక్షము   వృక్షములలో ఉత్తమము. దేవతలలో నేను(విష్ణువు) ఉత్తముడును. వేదములు శాస్త్రములలో ఉత్తమము. ద్విజుడు అన్ని వర్ణములలో గొప్పవాడు. రాజులలో శ్రీరాముడు ఉత్తముడు. ఋతువులలో వసంతము గొప్పది. మంత్రములలో రామతారకము ఉత్తమము. స్రీలలో లక్ష్మి దేవి ఉత్తమురాలు. నదులలో గంగ ఉత్తమమైనది.  పర్వతములలో మేరువు గొప్పది. అన్ని  దానములలో ధనదానము గొప్పది. మాఘమాస వ్రతము అన్ని వ్రతములలో ఉత్తమము. మాఘమాస వ్రతము సర్వ ఫలప్రదము. కృష్ణవేణి, గంగా, కావేరీ ఇలా సర్వ నదులయందును పది సంవత్సరముల పాటు సూర్యోదయ సమయమందు స్నానము చేసిన వచ్చు పుణ్యము, మూడు దినములు అరుణోదయ సమయమందు మాఘ స్నానము వలన వచ్చును. మాఘ స్నానము చేసి పూజ  మొదలగువానితో వివిధ పుష్పములతో సాలగ్రామ రూపమున నున్న నన్ను పూజించిన మోక్షము వచ్చును, అని శ్రీమన్నారాయణుడు దేవతలకు మాఘవ్రత మహిమను వివరించెను..

దేవతలు విష్ణు వాక్యమును శిరసా వహించి ఇంద్రుని వెదకుచు పద్మగిరి పర్వతమును చేరుకొనిరి. ఇంద్రుని వెదకుతూ ఉన్న వారికి చిన్న పాదములు, పెద్ద శరీరము కల విచిత్రమైన తొండ ఒకటి కనిపించెను. ఆ తొండ వారిని చూచి భయంకరమగు ధ్వనిని చేసినది. దేవతలు ఆ తొండ ఒక రాక్షస రూపమని వారు తలచిరి. వారు దానిని తీగలతో బంధించిరి.  ఎంత ప్రయత్నించినను ఆ తొండ కదలలేకపోయినది. మాఘమాస వ్రతము అమోఘమని శ్రీమహావిష్ణువు చెప్పిన మాట యెట్టిదో చూడవచ్చునని తలచి మరునాడు మాఘస్నానాదికమును చేసి ఆ తీర్థమును తొండపై పోసిరి.

పవిత్రోదకముచే తడిసిన తొండ దివ్యాలంకారములు కల స్త్రీగా మారెను. దేవతలామెను చూచి ఆశ్చర్యపడిరి. నీవెవరివని ఆమెనడిగిరి. ఆమెయు శాప విముక్తికి సంతసించుచు దేవతలకు నమస్కరించి యిట్లు పలికెను. నేను సుశీలయను పేరు కలదానను. కాశ్మీరమున నివసించు బ్రాహ్మణుని పుత్రికను. మా తండ్రి నాకు వివాహము చేసెను. నా దురదృష్టవశమున నా భర్త పెండ్లి జరిగిన నాల్గవనాడు మరణించెను. మా తల్లితండ్రులు చాలా యెక్కువగా దుఃఖించిరి. నా తండ్రి “మానవ జన్మము కష్ట ప్రదము, స్త్రీగా పుట్టుట మరింత కష్టము. బాల్యముననే వైధవ్యమునందుట మరింత కష్టము.                ఇట్లు బాల్యము నందు భర్తను పోగొట్టుకొన్న ఈమెను చూడజాలను, ఈమెను బంధువులకు అప్పగించి వనమునకు పోయి తపమాచరించుట మేలని” తలంచెను. పుత్రిక అయిన నన్ను బంధువుల వద్ద నుంచి నా తల్లి తండ్రులు ఇద్దరును వనవాసమునకు పోయిరి. అచటనే మరణించిరి.

నేనును బంధువుల వద్దనే ఉంటిని, వారి నిరాదరణ ఫలితముగ చూచు వారెవరును లేక పోవుటచే భిక్షాటనముచే జీవించుచూ ఉంటిని.


నిలువయున్నదానిని భుజించుచు బిక్షలో వచ్చిన మంచి ఆహారమును అమ్ముకొనుచు జీవించుచుంటిని. భక్తి, వ్రతము మున్నగువానిని ఎరుగను. ఉపవాసమనేమో తెలియదు. ఏకాదశీ వ్రతము చేయువారిని చూచి పరిహాసము చేసితిని. ధనమును దాచి సంపాదన పరురాలనైతిని. నన్ను కోరిన వారికి నన్ను అర్పించుకొనుచు, నేను కోరిన వారిని పొందుచు నీతి నియమములను విడిచి దురాచార వంతురాలనై జీవితమును గడిపితిని, తరువాత మరణించి నరకమును చేరితిని. అచట పెక్కు రీతుల శిక్షింపబడితిని.

పులి, కోతి, ఎద్దు మున్నగు పెక్కు జంతువుల జన్మనొందితిని, పెక్కు బాధలను పడితిని. ఒక నాటి జన్మలో అయిదు దినముల క్రిందటి ఆహారమును ఆకలి కొన్న వానికి పెట్టితిని, ఆ చిన్న మంచి పని వలన మీరు దయయుంచి నాకు శాప విముక్తిని కలిగించిరి అని పలికెను మాఘ మాస పవిత్ర నదీజల స్పర్శచే ఆమె దేవతత్వము పొంది  దేవప్రియ అను పేరును గాంచెను. దేవతలలో ఒకరామెను వివాహమాడెను. మాఘమాస మహత్యమును దేవతలు గమనించి విస్మితులైరి. ఇంద్రుని వెదుకసాగిరి. పద్మగిరి గుహలలో వికార రూపముతో తిరుగుచున్న ఇంద్రుని జూచి బాధపడిరి. ఇంద్రుడును వారిని చూచి సిగ్గుపడెను, లోనికిపారిపోయెను. దేవతలు ఇంద్రుని చూసి వెంబడించి అతడిని ఊరడించి ధైర్యము చెప్పిరి. నీవు చేసిన పాపములను పొగొట్టుకొనుటకు మహావిష్ణువు నీ శాప విముక్తికి మార్గమును సూచించెను, ఆ ప్రకారము చేయుదము రమ్మని తుంగభద్రా తీరమునకు తీసికొని వచ్చిరి. మాఘమాసమంతయు వానిచేత మాఘస్నానము చేయించిరి. ఇంద్రుడును శాపవిముక్తుడయ్యెను. కృతజ్ఞుడై విష్ణువును స్తుతించెను.

ఇంద్రుడును దేవతలతో కలసి స్వర్గమునకెగెను. రాక్షసులను జయించి సుఖముగనుండెను. గృత్నృదమద మహర్షి జహ్ను మునికి యీ విధముగ మాఘమాస స్నాన మహిమను వివరించెనని పలుకుతుండగా జహ్ను ముని, స్వామీ! ఈ  విష్ణు కథామృతము ఇంకను వినవలెనని ఉన్నది, ఇంకను చెప్పమని కోరెను. గృత్నృమదుడిట్లనెను పూర్వము పంపా తీరమున ధనవంతుడైన వైశ్యుడొకడు కలడు. ధనసంపాదనము తప్ప ధనవినియోగము నాతడు చేయలేదు. పూజ, దానము మున్నగు మంచిపనులను గూడ చేయలేదు. అందువలన మరణించిన తరువాత నరలోకమును చేరెను. అచట కొంతకాలముండి దరిద్రుడై జనించెను. దరిద్రుడై మరిన్ని పాపకార్యములను చేసెను. మరణించి పిశాచమై పంపా తీరమున మఱ్ఱిచెట్టు పైనుండి అచటకు వచ్చిన వారిని పీడించుచుండెను.

ఒకప్పుడు వశిష్ఠమహర్షి ఆ ప్రాంతమునకు శిష్యులతో వచ్చి మఱ్ఱిచెట్టు సమీపమున నివసించుచు మాఘస్నానము పూజ మున్నగునవి చేయుచు శిష్యులకు మాఘమాస మహత్త్యమును వివరించుచుండెను, అతదు మాఘస్నాన మహిమను వివరించుచు నొకనాడు మాఘస్నానము చేసిన వారి సర్వపాపములను సూర్యోదయమున చీకట్లు నశించినట్లుగా నశించును. మాఘస్నానము చేయనివాడు నరకమునకు పోవును అనుచు మాఘమాస వ్రతమును చేయవలసిన విధానమును చేయుట వలని శుభములను, చేయక పోవుటవలన అశుభములను వివరించుచుండెను. ఆ సమయమున పిశాచరూపము పైనుండి క్రిందపడింది. ఆ పిశాచము వశిష్ఠుడు మంత్రోదకమును వానిపై జల్లుచు పంపా జలమున మాఘ స్నానమును వానిచే చేయించెను. వశిష్ఠుడు చెప్పిన హరికథలను వినుట వలన, మాఘ స్నానము వలన వాని పిశాచ రూపము పోయి దివ్య రూపము వచ్చినది. మాధవానుగ్రహము వలన వైకుంఠమును చేరెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```

 

*మాఘపురాణం పద్దెనిమిదవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷* 

*న్యాయపతి నరసింహారావు*

భజన వల్ల

  *భజన వల్ల మనసు, నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతాయి...*


*సామూహికంగా భగవన్నామావళిని లయబద్ధంగా గొంతు కలిపినపుడు మనసు అలౌకిక ఆనందంలో తేలుతుంది. పదిమందితో కలిసినపుడు తాత్కాలికంగా సమస్యలన్నీ మరచి, భగవంతుని భజించడం వల్ల మానసిక, శారీరక ప్రశాంతత కలుగుతుంది... అలసటను మరచిపోయి నూతన ఉత్త్తేజం పొంది ఉత్సాహవంతులు అవుతారు...*


*పాటలకు అనుగుణంగా తాళం వేయడం, పాడే వారితో గొంతు కలిపి, భక్తిపారవశ్యంలో ఓలలాడటం ద్వారా మానసికానందంలో మునిగి తేలుతారు... భజనవల్ల హృదయస్పందన బాగుంటుంది, గుండె పనితీరు మెరుగుపడుతుంది...*

 

*దురాలోచనలు దూరమై, చైతన్యం పెరుగుతుంది. రెండుచేతులూ కలవడం వల్ల నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది... క్రమపద్ధతిలో సాగే శృతిలయల వల్ల ఆల్ఫా, తీటా, డెల్టా తరంగాలు విడుదలవుతాయి. శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది. మనసుకు ఎంతో ఉపశమనం కలుగుతుంది... చివరగా భగవన్నామం ఉచ్చరించడం అంటే భగవంతునికి ప్రీతికరం, భగవంతుని కృపకు పాత్రులవుతాం🚩🙏*😊👍

పంచాంగం 05.02.2026 Thursday,

  ఈ రోజు పంచాంగం 05.02.2026 Thursday,


స్వస్తి శ్రీ చాన్ద్రమాన విశ్వావసు నామసంవత్సర: ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాస కృష్ణ పక్ష చతుర్థి తిథి బృహస్పతి వాసర ఉత్తరఫల్గుని నక్షత్రం సుకర్మ యోగః బవ తదుపరి బాలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు. 

  


శ్రాద్ధ తిథి: చతుర్థి


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 20*


*శ్వేతా మంథరహసితే శాతా మధ్యే చ వాఙ్మనోతీతా।*

*శీతా లోచనపాతే స్పీతా కుచసీమ్ని శాశ్వతీ మాతా॥*


*భావము :*


*జగన్మాతా! నీకు అది అంతములు లేవు. మందస్మితపదనారవిందవు నీవు. క్షీరముతో నిండి ఉన్న మాతృస్థానముల బరువుతో వంగిన సన్నని నడుము కలిగిన చక్కని తల్లివి నీవు. నీ రూపము భావనాతీతమైనది. అటువంటి పరబ్రహ్మమును ఆరాధిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 21*


*పురతః కదానుకరవై పురవైరివిమర్దపులకితాంగలతామ్ |*

*పునతీం కాంచీదేశం పుష్పాయుధవీర్యసరసపరిపాటీమ్ ||*


*భావము :*


*మన్మధుని వీరత్వము అమ్మ ప్రసాదించినదే. అటువంటి అమ్మ యొక్క సన్నని దేహము ఈశ్వరుని ఆలింగనంలో ఆనందములో మునిగి తేలుతుంది. కాంచీపురమును చల్లగా చూస్తున్న ఆ తల్లి నాకు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందో కదా?*


🙏🙏🙏*శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


యదా సంహరతే చాయం కూర్మోఽఙ్గానీవ సర్వశః ।

ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 58 ।।


ప్రతిపదార్థ:


యదా — ఎప్పుడైతే; సంహరతే — ఉపసంహరించి; చ — మరియు; అయం — ఇది; కూర్మః — తాబేలు; అంగాని — అంగములు; ఇవ — ఆ విధంగా; సర్వశః — పూర్తిగా; ఇంద్రియాణి — ఇంద్రియములు; ఇంద్రియ-అర్థేభ్యః — ఇంద్రియ వస్తు-విషయముల నుండి; తస్య — అతని; ప్రజ్ఞా — దివ్య జ్ఞానం; ప్రతిష్ఠితా — స్థిరమవును.


 తాత్పర్యము :


తాబేలు దాని అంగములను తన పైచిప్ప లోనికి ఉపసంహరించుకున్నట్టుగా, ఇంద్రియములను వాటి విషయార్థముల నుండి వెనుకకు మరల్చగలిగిన వాడు, దివ్యమైన ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరచిత్తుడగును.

  

 వివరణ:


ఇంద్రియములు కోరుకునే భోగ వస్తు, విషయములను ఇచ్చి ఇంద్రియముల ఆర్తిని తీర్చటానికి ప్రయత్నించటం అనేది నేతిని పోసి మంటను ఆపటానికి ప్రయత్నించటం వంటిది. క్షణకాలం నిప్పు కొద్దిగా తగ్గినట్టు అనిపించినా, రెండింతల ఉదృతితో అది మళ్ళీ పైకి లేస్తుంది. కాబట్టి, కోరికలు అనేవి అవి తీర్చబడినప్పుడు సమసిపోవు; అవి మరింత ప్రబలంగా తిరిగొస్తాయి, అని శ్రీమద్భాగవతం పేర్కొంటున్నది:


న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి ।

హవిషా కృష్ణ-వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే (9.19.14)


‘ఎలాగైతే నేతిని సమర్పించటం వల్ల, అగ్ని ఆరిపోకపోవటమే కాక, ఇంకా ఎక్కువ ఎగసి పడుతుందో, ఇంద్రియ వాంఛలను తీర్చటం ద్వారా ఆ కోరికలు చల్లారిపోవు.’


ఈ కోరికలను మన ఒంటి మీద కలిగే దురదతో పోల్చవచ్చు. దురద చాలా అసౌకర్యంగా ఉండి, గోక్కోవాలనే తీవ్ర వాంఛను కలుగ చేస్తుంది. కానీ, గోకటం సమస్యని పరిష్కరించదు. కొద్ది సమయం పాటు ఉపశమనం ఉన్నా, మళ్లీ ఇంకా ఎక్కువ ఉధృతితో తిరిగి వస్తుంది. దీనికి బదులుగా, దురదను కొంచెం సేపు సహించగలిగితే, దాని పోటు తరిగిపోయి, క్రమంగా క్షీణించిపోతుంది. దురద నుండి విముక్తి కావటానికి ఉన్న రహస్యం ఇదే. ఇదే పద్ధతి కోరికలకు కూడా వర్తిస్తుంది. మనస్సు మరియు ఇంద్రియములు ఆనందం కోసం అనేకానేక వాంఛలను కోరుతాయి, మనము వాటిని నెఱవేర్చుతూ ఉన్నంతవరకూ నిజమైన ఆనందం, ఎండమావిలా ఒక భ్రాంతిలా ఉండిపోతుంది. కానీ, మనం ఆ కోరికలన్నిటినీ త్యజించటం నేర్చుకుని, భగవంతుని యందే ఆనందాన్ని వెతుక్కుంటే, మనస్సు ఇంద్రియములు మనతో ప్రశాంతంగా ఉంటాయి.


కాబట్టి, జ్ఞానోదయమైన ముని, వివేకముతో మనస్సు ఇంద్రియములను జయిస్తాడు. ఈ శ్లోకంలో తాబేలు ఉదాహరణగా చెప్పబడింది. ప్రమాదం ఎదురైనప్పుడల్లా తాబేలు తన అంగములను, తలను లోపలికి తీస్కొని తనను తాను సంరక్షించుకుంటుంది. ఆ ప్రమాదం తొలగిపోయిన తరువాత, తన అంగములను, తలను బయటకు తీసి ముందుకు సాగిపోతుంది. జ్ఞానోదయమయిన జీవాత్మ, మనస్సు, ఇంద్రియములపై ఇదే విధమైన నియంత్రణ కలిగి, పరిస్థితులకు తగినట్టుగా వాటిని వాడటం లేదా ఉపసంహరించటం చేస్తుంది.

4, ఫిబ్రవరి 2026, బుధవారం

LKG నుండి PG వరకు

 ▪️ తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ అయిన Hyderabad *Amma Jyothi Foundation* వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటుంది వారికి అన్ని ఉచితం 


* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


1.నో హాస్టల్ ఫీజు

2.నో స్కూల్ ఫీజు

3 నో కాలేజ్ ఫీజు.

4.నో బిల్డింగ్ ఫీజ్. 


📘 *ముఖ్య గమనిక:* 

తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే *Amma Jyothi Foundation*  సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.


*హాస్టల్ ఫీజు ఉచితం

*మెస్ ఫీజు ఉచితం

* LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం


📞 వివరాలకు సెల్:

*9490043272*

9573411887


ఇతర గ్రూపులకు పంపండి

పేద విద్యార్దులకు  సహాయంచేయండి.

మనకు అవసరము లేకపోవచ్చు, 

కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!🙏

పంచాంగం

 


శివనామమ్ము సమస్త మానవులకుం

  *శివనామమ్ము సమస్త  మానవులకుం జేcదౌను భావింపగన్*

ఈ సమస్యకు నా పూరణ. 


ధవుగా గోరితి  జేతునే తపమునే  తప్పెన్నగా వచ్చితే


భవుడే భస్మపుధారియైన సరియే భాగ్యంబు మాదౌనులే


శివనామమ్ము సమస్త మానవులకుం -  జేcదౌను భావింపగన్


భవదీయమ్మగు బోధలున్ వినినచో  వల్లించగా నాస్తికా!



అల్వాల లక్ష్మణ మూర్తి.

04ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷బుధవారం🌷*

 *🪷04ఫిబ్రవరి2026🪷*      

   *దృగ్గణిత పంచాంగం*                 


          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*మాఘమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : తదియ* ‌రా 12.09 వరకు ఉపరి *చవితి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం  : పుబ్బ* రా 10.12 ఉపరి *ఉత్తరఫల్గుణి ( ఉత్తర )*

*యోగం : అతిగండ* రా 01.05 వరకు ఉపరి *సుకర్మ(

*కరణం  : వణజి* మ 12.19 *భద్ర* రా 12.09 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30 - 10.15 సా 04.00 - 06.00*

అమృత కాలం  : *మ 03.48-05.24*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం    : ఉ 06.11 - 07.47*

*దుర్ముహూర్తం  :ప 11.58- 12.44*

*రాహు కాలం   :మ 12.21-01.47*

గుళికకాళం      : *ఉ 10.55 - 12.21*

యమగండం    :*ఉ 08.03 - 09.29*

సూర్యరాశి : *మకరం*                  

చంద్రరాశి : *సింహం*

సూర్యోదయం :*ఉ 06.47* 

సూర్యాస్తమయం :*సా 06.13*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం        :*ఉ 06.38- 08.55*

సంగవ కాలం       :*08.55 - 11.13*

మధ్యాహ్న కాలం   :*11.13 - 01.30*

అపరాహ్న కాలం   :*మ 01.30-03.48*

*ఆబ్ధికం తిధి  :మాఘ బహుళ తదియ*

సాయంకాలం     :*సా03.48- 06.05*

ప్రదోష కాలం      :*సా 06.05 - 08.36*

రాత్రి కాలం         :*రా 08.36- 11.56*

నిశీధి కాలం        :*రా 11.56- 12.46*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.57- 05.47*

******************************

        *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌷శ్రీ సరస్వతీ శ్లోకం🌷*


*శుద్ధస్ఫటికరూపాయై* 

*సూక్ష్మరూపే నమో నమః*

*శబ్దబ్రహ్మి చతుర్హస్తే* 

*సర్వసిద్ధ్యై నమో నమః*


🌷 *ఓం సరస్వత్యై నమః* 🌷


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

మాఘ పురాణం - 17వ*

 🕉️🌹🌷🪔🛕🪔🌷🌹🕉️


*🌷బుధవారం 4 ఫిబ్రవరి 2026🌷*

_*మాఘ పురాణం - 17వ* 

      _*అధ్యాయము*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


      *4వ తేదీ బుధవారం*

         *వేకువఝామున*

       *చదువు కొనుటకు*

```

మాఘ పురాణం పదిహేడవ అధ్యాయంలో… 

ఒకప్పుడు, ఇంద్రుడు ఒక ముని భార్యను మోహించి ఆమెను అనుభవించి శాపం పొందాడు.

ఆ శాపం వలన అతనికి గాడిద ముఖం వచ్చింది. సిగ్గుతో, అతను పద్మగిరి గుహలో దాక్కున్నాడు. దేవతలు శ్రీమహావిష్ణువును ఆశ్రయించి ఇంద్రుని శాప విముక్తి గురించి అడిగారు. 

శ్రీమహావిష్ణువు మాఘమాస స్నాన మహిమను వివరించి, గాడిద ముఖంతో ఉన్న ఇంద్రుడు మాఘమాసంలో నదీ స్నానం చేస్తే శాపం నుండి విముక్తి పొందుతాడని చెప్పాడు. 

తన మాటలకు బలపరిచే ఉదాహరణగా, విశ్వామిత్రుని కథను కూడా చెప్పాడు…

ఒకసారి, విశ్వామిత్రుడు ఒక గంధర్వ స్త్రీతో కామ క్రీడలలో లీనమై తన తపస్సును కోల్పోయాడు. శాపం వలన అతనికి కోతి ముఖం వచ్చింది. కానీ, మాఘమాస స్నానం చేసి శ్రీమహావిష్ణువును ధ్యానించడం ద్వారా అతను శాపం నుండి విముక్తి పొందాడు. 

శ్రీమహావిష్ణువు సలహా మేరకు, దేవతలు గాడిద ముఖంతో ఉన్న ఇంద్రునిచే మాఘమాస స్నానం చేయించారు. దాని ఫలితంగా, ఇంద్రుడు తన శాపం నుండి విముక్తి పొంది తిరిగి తన దివ్య శక్తులను పొందాడు. ఈ కథ మాఘమాస స్నానం యొక్క పుణ్య మహిమను మరియు భక్తి శక్తి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది...

```

*ఇంద్రునికి కలిగన శాపము*```


వశిష్ఠ మహర్షి దిలీపునితో మరల ఇట్లనెను. “రాజా! మాఘమాస మహిమను వివరించు మరియొక కథను చెప్పెదను వినుము... ‘పూర్వము గృత్నృమదుడను మహర్షి గంగానది తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాదికము చేస్తూ తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహా విష్ణువు మహత్మ్యమును వివరించుచుండెను. జహ్నువను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింప కోరగా గృత్నృమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసము ప్రారంభం అగును. అటువంటి  మాఘమాసమున చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాప నాశము కూడ అగుచున్నది. మాఘమాసమున ప్రాతః కాలమున నదీ స్నానము చేసిన వారు ఇంద్రుడు మహా పాతక విముక్తుడు అయినట్టుగా పాప విముక్తులగుదురు ఆ విషయమును వినుడు..

పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను అధ్యయనం చేసిన మిత్రవిందుడను ముని ఒక్కడు ఆశ్రమమును నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి, ఆమె ఒక నాడు తుంగభద్రా నదిలో స్నానము చేసి పొడి బట్టలు కట్టుకొని కేశములను ఆరబెట్టు కొనుచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలసి ఆకాశ మార్గమున పోవుచున్న ఇంద్రుడు ఆమెను చూచి మోహ పరవశుడయ్యెను. 


ఆమెను ఎటులనైనా పొందవలయునని నిశ్చయించుకొనెను. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు 

ఆ ఆశ్రమముపై భాగమున నుండి మిత్రవిందముని భార్య అందమును, ఆమె చేష్టలను గమనిస్తూ ఉండెను.


మిత్రవింద ముని తెల్లవారు జామున శిష్యులను మేలుకొలిపి వేద పఠనము చేయింపవలయునని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్లెను. ఇంద్రుడును ఆశ్రమములోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను, విడిపించుకొని పోవుచున్న ఆమెకు తాను ఎవరోనని చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెయును కామ పరవశమై ఇంద్రుని పొందుకు  అంగీకరించెను, కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి వెళ్లేందుకు యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వానిని పట్టుకొని నీవు ఎవడవని అడిగెను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవిందుడును జరిగిన దానిని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడవు అయి స్వర్గమునకు పోలేక భూలోకముననే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడియుండుమని శపించెను. ఆ చోటును విడిచి గంగా నదీ తీరమును చేరి అక్కడ తపము ఆచరించి యోగ శక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యెను.

ముని శాపము వలన ఇంద్రుని ముఖము మాత్రమే గాడిద మిగిలిన శరీరము మామూలుగనేయుండును. అచట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరియను పర్వతమును చేరి అచటి గుహలోనుండి అచట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడట్లు పన్నెండు సంవత్సరములు గడిపెను. రాజైన ఇంద్రుడు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి దేవతలతో యుద్ధము చేయుచుండిరి. దేవతలు రాక్షసులతో యుద్ధము చేయలేకపోయిరి. తమ ప్రభువగు ఇంద్రుని వెదుకసాగిరి. ఇంద్రుని కనుగొనలేక వారు స్వర్గమునకు తిరిగి వచ్చిరి. రాక్షసులు మరల వారిని తరిమి కొట్టిరి. దేవతలు ఇంద్రుని వెదకుచు నదీతీరముల యందు సముద్రతీరము నందు తిరుగుచుండిరి. అప్పుడు మాఘమాసము అగుటచే మాఘమాసమున నదీ స్నానము చేసి తీరిగి వచ్చు మునులను చూచిరి.


మాఘమాస మహిమను ముచ్చటించు కొనుచున్న మునులకు నమస్కరించి మీరు చేయు వ్రతమేమి దాని వలన వచ్చు ఫలమేమి అని ప్రశ్నించిరి. మునులు వారిట్లనిరి. దేవతలారా వినుము మేము చేయు వ్రతము మాఘమాస వ్రతము సూర్యుడు మకర రాశి యందుండగా ప్రాతఃకాలమున తటాకమునందు స్నానము చేయుట శ్రీమహా విష్ణు పూజ, పురాణ పఠనము, యధా శక్తి దానము. దీనివలన దుర్లభమైన మోక్షము కూడ సులభమగును. మాఘమాసమున చేసిన మాధవ స్మరణ సర్వపాపములను నశింపచేయును. మాఘమాస స్నానము పూజ మున్నగునవి చేయు వారి అదృష్టమనంతము. మాఘ శుద్ధ చతుర్దశి యందు గోదానము, వృషోత్పర్జనము, తిల దానము ఆవూప దానము, పాయస దానము, వస్త్రకంబళముల దానము, విష్ణులోక ప్రాప్తిని కలిగించును. శ్రీమహా విష్ణువు దయవలన సర్వలోకములు సులభములై ఉండును అనుచు, మునులు దేవతలకు మాఘమాస మహిమను వివరించిరి.

దేవతలును దివ్యమునుల మాటలను విని మాఘస్నానమును సముద్రమున చేసి శ్రీమహ విష్ణువు నర్చించిరి. వారికి శ్రీమహావిష్ణువు సాక్షాత్కరించెను.


మొట్టమొదటి జగద్గురువు అగు శ్రీమహా విష్ణువు మృదువైన శరీరము చతుర్భుజములు కలిగియుండెను. శంఖుచక్ర గదాపద్మములను నాలుగు చేతులయందు పట్టెను. పచ్చని వస్త్రమును ధరించి కిరీటముతో మరింత మనోహరముగ నుండెను. కంకణములు వారములు వైజయంతీమాల మున్నగు అలంకారములను ధరించి గంభీర మనోహర రూపముతో నుండెను. ఇట్లు సాక్షాత్కరించిన శ్రీమహావిష్ణువును దేవతలిట్లు స్తుతించిరి.

స్వామీ! నీవు జగములకే గురువువు వేదవేద్యుడవు నీ అనుగ్రహము లేనిదే ఎవరును నిన్నెంతటి వారైనను యెరుగజాలరు. చతుర్ముఖములు కల బ్రహ్మ వ్యాస మహర్షిని పాదముల మహిమను స్తుతించి కృతార్థులు అయినారు. అట్టి నీకు మా నమస్కారములు స్వామీ! నీవు ఆనంద సముద్రమును పెంపొందించు చంద్రుడవు. నీకు నచ్చిన ఉత్తములైన వారికి స్వర్గమును మోక్షమును అనుగ్రహింతువు సమస్తమును నీవే వ్యాప్తమైయున్నది. నీవు సచ్చిద్రూపుడవు సత్యవాక్కువు స్వామీ! అటువంటి నీకు నమస్కారము నీవు త్రిమూర్తి స్వరూపుడవై సృష్టి స్థితి లయముల నిర్వహించుచున్నావు. సర్వ సృష్టి నశించి జలమయ మైనప్పుడు మఱ్ఱి ఆకుపై పరుండి చిదానంద స్వరూపడువైయుందువు.


పరమాత్మ స్వరూపుడవైన నిన్ను నీవు తప్ప మరెవరును యెరుగజాలరు. కర్మ ప్రకృతి గుణభేదముల ననుసరించి సృష్టించి  వాని యాందాసక్తుడవై యున్నట్లుండి నిరాసక్తుడవై అద్వితీయరూపమున నున్న నీకు నమస్కారము. సర్వ వ్యాప్తుడవైన నిన్నెవరును యెరుగజాలరు. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు, పంచభూతములు అన్నింటిని సృష్టించిన వాడవు నీవే ధ్రువుడు, నారదుడు, ప్రహ్లాదుడు, ఉర్దవుడు మొదలగు ఉత్తమ పురుషులు మాత్రమే నన్నెరిగి సేవింపగలరు. నీవు జగములకు గురువువు. జగములును నీవే మాట మనస్సు మున్నగువానికి అందని నీరూపమును నిన్ను స్తుతించుట తప్పయేమియు చేయజాలని వారము. నాయకుడగు ఇంద్రుని గోల్పోయి రాక్షసులచే అవమానింపబడిన మమ్ము రక్షింపుము. అని దేవతలు పలు రీతుల శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

దేవతలయందు జాలిపడిన శ్రీమన్నారాయణుడు వారికి ప్రసన్నుడై యిట్లనెను. దేవతలారా ఇంద్రుడు ముని శాపముచే దివ్యశక్తులను కోల్పోయి గాడిద మొగము కలవాడై పద్మగిరి గుహలలో సిగ్గుపడి దాగియున్నాడు. అతడు ముని భార్యను మోహించి ఆమెననుభవించి దోషము చేసి మునిశాపమునొందెను. పద్మగిరి దోకర్ణ సమీపముననున్నది. పరమ పవిత్రమైన మాఘమాసమున అరుణోదయ పుణ్యకాలమున గార్దభ ముఖుడైన ఇంద్రునిచే నదీస్నానమును చేయింపుడు. అందువలన ఇంద్రుడు గాడిద ముఖమును విడిచి మంచి ముఖముకలవాడై, పూర్వమువలె దివ్య శక్తులను పొంది మిమ్ము రక్షింపగలడు, కావున మీరు వానిచే మాఘమాస అరుణోదయ పుణ్యకాలమున నదీస్నానము చేయింపుడని చెప్పెను.


దేవతలు శ్రీమహావిష్ణువు మాటలనువిని విస్మితులైరి. స్వామి ముని శాప పీడితుడైన ఇంద్రుడు కేవలం మాఘస్నానముచే స్వస్ధుడగునా? విచిత్రముగ నున్నదని పలికిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవతలారా! మాఘమాస స్నాన మహిమను మీరెరుగకపోవుటచే ఇట్లంటిరి. నేను చెప్పినట్లు చేసినచో ఇంద్రుడు యధా పూర్వరూపమును పొందుటలో ఆశ్చర్యము, సందేహము అక్కరలేదు. పూర్వము విశ్వామిత్ర మహర్షి ఇంద్రుని వలె పాపమును చేసి కపి ముఖుడై మాఘస్నానము చేసి పూర్వ స్థితి పొందెనని చెప్పెను. ఆ మాటలకు దేవతలు మరింత ఆశ్చర్యపడిరి. ఆ వృత్తాంతమును చెప్పుమని శ్రీమన్నారాయణుని కోరిరి. అప్పుడు విష్ణువిట్లు పలికెను. వినుడు పూర్వము విశ్వామిత్ర మహర్షి భూప్రదక్షిణము చేయుచు గంగాతీరమునకు వచ్చెను. మాఘమాస కాలము అగుటచే గంధర్వులు తమ భార్యలతో కలిసి గంగా స్నానము చేయవచ్చిరి.

అట్లు వచ్చిన దంపతులులలో ఒక గంధర్వుడు మాఘమాసమున నదీస్నానము చేయుచు భార్యను కూడ నదీస్నానము చేయుటకు రమ్మని పిలిచెను. భర్తతో భూలోకమునకు వచ్చి గంగా తీరమును చేరిన ఆమె ఈ చలిలో నాకీ చన్నీటి స్నానము బాధాకరము నేను స్నానము చేయజాలను. మీకు ఆసక్తి ఇష్టము ఉన్నచో మీరు చేయుడని గంగా స్నానమును నిరాకరించెను. గంధర్వుడెంత చెప్పినను అతని భార్య భర్త మాట వినలేదు. స్నానము చేయలేదు. గంధర్వుడు మిగిలిన వారితో కలసి స్నానము చేసెను. గంధర్వుడి భార్య మాఘ స్నానమును ధూషించి నిరాకరించుటచే ఆమె దివ్య శక్తులను కోల్పోయెను. స్నానము చేసి తిరిగి వచ్చి తమ లోకమునకు తిరిగి వెళ్లుసందడిలో గంధర్వుని భార్యను మిగిలినవారు గమనించలేదు. దివ్యశక్తులతో గంధర్వులు తమ లోకములకు వెళ్ళిరి. గంధర్వుని భార్య గంగాతీరమున దివ్యశక్తులను కోల్పోయి అసహాయురాలై తిరుగుచుండెను.

ఆమె అడవిలో తిరుగుచూ  విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటచూసెను. ఆమె అందానికి, యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరూ  కామక్రీడలలో తేలియాడుచుండగా, మరల ఆ గంధర్వుడు తన భార్యను వెదుకుచూ వచ్చి చూడగా, విశ్వామిత్రుడు గంధర్వస్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూచి మండిపడుచు తపస్వివై యుండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందున, నీకు కోతి ముఖము కలుగుగాకయని విశ్వామిత్రుని, పాషాణమై పడియుండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానర ముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయము తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామ వాంఛకు లోనై నీ తపశ్శక్తిని అంతా వదులుకున్నావు. సరేలెమ్ము గంగానదిలో స్నానము చేసి, నీ కమండలములో గంగా జలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము”, అని వివరించగా విశ్వామిత్రుడు గంగాస్నానముచేసి, విష్ణువును ధ్యానించి, కమండలముతో నీరు తెచ్చి, పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది, గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము నొందిన విశ్వామిత్రుడు తపస్సునకు వెళ్ళిపోయెను.

దేవతలారా! మాఘస్నానము మహిమ మాటలకు అందదు చాలా గొప్పది. కావున మీరు గాడిద ముఖము కలిగి సిగ్గుపడి పద్మగిరిలో నున్న ఇంద్రునిచే మాఘస్నానమును చేయింపుడు. అప్పుడు అతనికి శాపవిముక్తి యగునని శ్రీమన్నారాయణుడు దేవతలకు ఇంద్రుని శాపవిముక్తికి ఉపాయమును సూచించెను.```


*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*మాఘపురాణం పదిహేడవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

మళ్లీ మనకే ఓటేస్తారు

 ఒక రోజు హిట్లర్ ఒక కోడిని తీసుకుని కేబినెట్ సమావేశానికి వచ్చాడు. ఆ కోడి తలను తన చేతి కింద బిగించి పట్టుకున్నాడు. నడుస్తూనే, కోడి ఈకలను ఒక్కొక్కటిగా పీకడం మొదలుపెట్టాడు. కోడి తీవ్ర వేదనతో కేకలు వేస్తూ, తప్పించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. కానీ హిట్లర్ దానిని వదలలేదు; దాని అరుపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈకలు పీకుతూనే ఉన్నాడు. అది చూసిన కేబినెట్ సభ్యులు అన్నారు:


“పాపం ఆ జీవిన ఆలా హింసించకండి. దానిని వదిలేయండి.”


కానీ హిట్లర్ ఎవరి మాట వినలేదు. చివరికి ఆ కోడి ఈకలన్నీ పీకేసి, దాన్ని నేల మీదకు విసిరేశాడు. 


తర్వాత తన జేబులోంచి కొంత ధాన్యం తీసి, ఆ కోడికి వేయడం ప్రారంభించాడు. 


ఆ స్థితిలో, ఆకలితో అలమటిస్తున్న ఆ కోడి మళ్లీ హిట్లర్ చేతి వైపే చూడటం మొదలుపెట్టింది.


హిట్లర్ దానిని దగ్గరకు పిలుస్తూ ధాన్యం చూపించాడు. కొద్దిసేపటికి ఆ కోడి అతని దగ్గరకు వచ్చి కూర్చొని, ఆ కొద్ది ధాన్యాన్ని తినడం ప్రారంభించింది. 


ఇప్పటివరకు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అదే కోడి, ఇప్పుడు మళ్లీ అతని పక్కనే కూర్చుంది. కేవలం కొద్దిపాటి ధాన్యం కోసం..! 

దాన్ని చూసి కేబినెట్ సభ్యులు ఆశ్చర్యంతో అడిగారు:


“ఇది ఏమిటి?”


అప్పుడు హిట్లర్ అన్నాడు:

“ఓటర్లు కూడా ఇలాగే ఉంటారు. నాలుగున్నర సంవత్సరాల పాటు మనం వాళ్ల ఈకలు పీకుతాం. 

ఆ తర్వాత, చివరి ఆరు నెలల్లో కొద్దిపాటి ధాన్యం వేస్తాం. ఆ కొద్దిపాటి లాభాలకోసం, నాలుగున్నర సంవత్సరాల అన్యాయాలను ఓటర్లు మర్చిపోయి, మళ్లీ మనకే ఓటేస్తారు..!