30, మే 2026, శనివారం

ఆదివారం*🌞 *🌹31, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

  *🌹31, మే, 2026🌹*

  *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : పౌర్ణమి* మ 02.14 వరకు ఉపరి *కృష్ణ పాడ్యమి*

*వారం    : ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : అనూరాధ* సా 04.12 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : సిద్ధ* పూర్తిగా రోజంతా *రాత్రితో సహా*

*కరణం  : బవ* మ 02.14 *బాలువ* రా 03.25 ఉపరి *కౌలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 07.00 - 09.00 మ 02.00 - 04.30*     

అమృత కాలం  : *శేషం ఉ 06.21 వరకు*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : రా 10.29 - 12.17*

*దుర్ముహూర్తం  :సా 04.52- 05.44*

*రాహు కాలం  :సా 04.59- 06.36*

గుళికకాళం     : *మ 03.21 - 04.59*

యమగండం   : *మ 12.05 - 01.43*

సూర్యరాశి : *వృషభం*           

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 05.41* 

సూర్యాస్తమయం :*సా 06.47*

*ప్రయాణశూల  : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం        :*ఉ 05.34- 08.10*

సంగవ కాలం        :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 04.00*

*ఆబ్ధికం తిధి        : శూన్య తిథి*

సాయంకాలం    :*సా 04.00- 06.36*

ప్రదోష కాలం      :*సా 06.36- 08.48*

రాత్రి కాలం         :*రా 08.48 - 11.43*

నిశీధి కాలం        :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

               *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *సవిత్రే నమః వామచక్షుషి* 

            *మాం రక్షతు*


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

_*శ్రీ రామ

 _*శ్రీ రామ జయరామ జయజయ రామరామ...!!*_

రామనామం మహా పవిత్రమైంది. రామనామ మహిమకు అటు ఆధ్యాత్మిక, ఇటు వైజ్ఞానిక కారణాలు ఎన్నో ఉన్నాయి. రామనామాన్ని అధికంగా ఉచ్చరించడం ద్వారా వ్యక్తిలో తేజస్సు పెరుగుతుంది. సమస్యలను పరిష్కరించుకునే శక్తి ఉత్పన్నమవుతుంది. తమకు అధికార సిద్ధి పరిపూర్ణంగా కలుగుతుంది. అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది.


భారతీయ మంత్రశాస్త్రం ప్రకారం అక్షరాలలో ‘రం’ అనేది అగ్ని బీజాక్షరం. దీనిని ఉచ్చరిస్తూ ఉంటే శరీరంలో వేడి పెరుగుతుంది. అందుకే, రామ తారక మంత్రంలోనూ అన్నీ రేఫలే (ర) ఉంటాయి. చాలామంది దేవతల పేర్లలోనూ ‘ర’ అనేది లేకుండా ఉండదు. ఉదాహరణకు శంకర, రమా, అపర్ణ, సరస్వతి, పార్వతి, సుబ్రహ్మణ్య, గాయత్రీ, ఈశ్వర మొదలైనవి చాలా ఉంటాయి. భాషాశాస్త్రం ప్రకారం ‘రం’ అక్షరాన్ని ‘ట్రిల్స్‌' అంటారు. ఈ అక్షరాన్ని ఉచ్చరిస్తుంటే మన నాలుక కొన్ని వేలసార్లు కంపనాలు పొందుతుంది. ఆ కంపనాలు నరాల వ్యవస్థ ద్వారా శరీరంలో అంటుకుపోయిన మలినాలను తొలగిస్తాయి. దానివల్ల శరీరంలోని వేర్వేరు ‘బ్లాక్స్‌' క్రమంగా కనుమరుగవుతాయి. 


శరీరంలోని అన్ని వ్యవస్థలలోని ‘బ్లాక్స్‌' తొలగిపోవడమే ‘పాపం’ దూరం కావడం. అందులోను దైవనామం బాహ్యోచ్చారణ చేసినా, అంతరోచ్చారణ చేసినా పాపనాశనమే అవుతుంది. బాహ్యోచ్చారణ ద్వారా ప్రత్యక్షంగా, అంతరోచ్చారణ ద్వారా పరోక్షంగా శరీర, మానసిక శుద్ధి కలుగుతుంది. నామాలకు ‘జయ జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా అది ‘జయాంతమాల’ అవుతుంది. ఇటువంటివి మంత్రశాస్త్రంలో వేర్వేరుగా ఉంటాయి. శ్రీరామ శబ్దానికి ‘జయ’ శబ్దాన్ని చేర్చడం ద్వారా సర్వకార్య విజయానికి, అధికార సిద్ధికి, ఆనంద ప్రదమైన, ఆరోగ్య ప్రదమైన జీవనానికి హేతువు అవుతుంది. అందుకే, ప్రతిరోజూ ‘శ్రీరామ జయరామ జయజయ రామరామ’ అనే జపాన్ని కనీసం 3 గంటల సేపు చేద్దాం. అన్ని సమస్యలను పరిష్కరించుకునే శక్తిని పెంచుకుని, విజయాన్ని సాధించి ఆనందంగా జీవిద్దాం.

వృద్ధాప్యంలో

  వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం"....కన్ఫ్యూషియస్ చెప్పిన ఒక గొప్ప పాఠం​...


"వృద్ధాప్యంలో మీ పిల్లలతో అతిగా కలిసి ఉండటం, విచిత్రంగా వారిని మీకు దూరం చేస్తుంది" అని కన్ఫ్యూషియస్ ఒకసారి హెచ్చరించారు. ఈ కథ 2,500 ఏళ్ల నాటిదైనా, నేటి కాలానికి, మనకు, మన తల్లిదండ్రులకు మరియు మన పిల్లలకు కూడా సరిగ్గా సరిపోతుంది.​


ఇది లీ వీ అనే వృద్ధుడి కథ. ఆయన తన మనసును వేధిస్తున్న ఒక ప్రశ్నతో గొప్ప తత్వవేత్త అయిన కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్ళాడు...


“మహాశయా, మన జీవితమంతా పిల్లల కోసమే ధారపోసిన తర్వాత కూడా... వృద్ధాప్యంలో మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాము?" అని అడిగాడు.​


లీ వీ చెడ్డ తండ్రి కాదు. నిజానికి, ఆయన తన పిల్లల కోసం సర్వస్వం ఇచ్చాడు. వారు దేనికీ లోటు లేకుండా ఉండాలని అహర్నిశలు కష్టపడ్డాడు. వారు సుఖంగా ఉండాలని తన సౌకర్యాలను త్యాగం చేశాడు. పిల్లలు పెరిగి, పెళ్లిళ్లు చేసుకుని స్థిరపడినప్పుడు, ఇక తాను విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని లీ వీ భావించాడు. తన ఇంటిని అమ్మివేసి కొడుకు దగ్గరకు వెళ్ళాడు. కుటుంబం,మనవళ్లు, మనవరాళ్లతో కలిసి ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుందని నమ్మాడు.​ కానీ ఆయన ఆశించిన సంతోషం దక్కలేదు. ఇల్లు కుటుంబంలోని అందరితో నిండిఉన్నా సరే , ఆయన హృదయం మాత్రం వెలితిగానే ఉండేది. పగలు అందరూ బిజీగా ఉండేవారు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చి, ప్రశాంతతను కోరుకునేవారు. వారు లీ వీ మాటలను అరకొరగా వినేవారు. ఆయన ఇచ్చే సలహాలు వారిని విసిగించేవి. ఆయన ఉనికిని వారు ఒక భారంగా భావించడం మొదలుపెట్టారు. ఆయన వారి దగ్గరికి చేరాలని ప్రయత్నించే కొద్దీ... వారు మరింత దూరమవుతూ వచ్చారు.​సమాధానం అన్వేషణ​ కోసం


లీ వీ కన్ఫ్యూషియస్ దగ్గరకు వెళ్లి తన బాధను ఇలా చెప్పుకొచ్చాడు...


“గురువుగారు, నా జీవితాన్ని పిల్లల కోసమే అంకితం చేశాను. వృద్ధాప్యంలో వారి దగ్గర ఉంటే నాకు శాంతి, ప్రేమ దొరుకుతాయని అనుకున్నాను. కానీ నేను అక్కడ ఎవరికీ అవసరంలేని వ్యక్తిలా మారిపోయాను... ఎందుకు?”​కన్ఫ్యూషియస్ ఆయనను వట్టి మాటలతో ఓదార్చలేదు. బదులుగా మూడు చిన్న పాఠాలు నేర్పాడు.​


అందులో మొదటి పాఠం...


ఆయన ఒక కూజాను తీసుకొని అంచు వరకు నీటితో నింపారు. “ఇందులో ఇంకా నీళ్లు పోస్తే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి పొంగిపొర్లుతాయి,” అని లీ వీ జవాబిచ్చాడు.“సరిగ్గా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “సంబంధాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇప్పటికే నిండిపోయిన ఒక ప్రదేశంలో మనం బలవంతంగా దూరాలని చూస్తే, అక్కడ అసమతుల్యత ఏర్పడుతుంది. నీ పిల్లలు ఎదగడానికి నువ్వు ఒక ఇల్లు కట్టావు. కానీ ఇప్పుడు నువ్వు మళ్లీ ఆ ఇంటికి కేంద్రం కావాలని చూస్తున్నావు. వారి జీవితాలకు ఇప్పటికే ఒక కేంద్రం ఉంది.అదే వారి స్వంత జీవితం, వారి పిల్లలు. ఖాళీ లేని పాత్రలో నువ్వు నిన్ను పోసుకోవాలని చూస్తున్నావు".


ఇక ​రెండవ పాఠం...


ఒకదానికొకటి అతి దగ్గరగా పెరుగుతున్న రెండు చెట్లను కన్ఫ్యూషియస్ చూపించారు. వాటి కొమ్మలు సూర్యరశ్మి కోసం ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి ఉన్నాయి.


“చెట్లు అతి దగ్గరగా పెరిగితే ఏమవుతుంది?” అని అడిగారు.“అవి ఒకదాని ఎదుగుదలను ఒకటి అడ్డుకుంటాయి,” అని లీ వీ అన్నాడు.“అవి బలంగా పెరుగుతాయా?...లేదు...అవి బలహీనంగా, ఆకారం లేకుండా మారిపోతాయి. జీవితంలో కూడా అంతే,” అన్నారు కన్ఫ్యూషియస్. “దగ్గరగా ఉండటమే ఐక్యత అని మనం అనుకుంటాం. కానీ అతి సామీప్యం ఒత్తిడిని కలిగిస్తుంది. పెరుగుదలకి కొంత ఖాళీ ప్రదేశం అవసరం".


మూడవ పాఠంగా...


కన్ఫ్యూషియస్ కొంచెం ఇసుకను తీసుకుని పిడికిలిని గట్టిగా బిగించారు.“నేను ఇలా గట్టిగా పట్టుకుంటే ఏమవుతుంది?”


“అది మీ వేళ్ల సందుల నుండి జారిపోతుంది,” అని లీ వీ చెప్పాడు.“మనుషుల మధ్య సంబంధాలు కూడా అంతే,” అని కన్ఫ్యూషియస్ బదులిచ్చారు. “ప్రేమ, గౌరవం ఒత్తిడిలో పెరగవు. నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటే, ఎంతగా సామీప్యాన్ని కోరుకుంటే... అది అంత వేగంగా మాయమవుతుంది. స్వేచ్ఛను ఇవ్వు, నీకు చెందాల్సింది నీ దగ్గరే ఉంటుంది."


"నువ్వు ఒక చెట్టును నాటినప్పుడు, వృద్ధాప్యంలో అది నీకు నీడ ఇస్తుందని ఆశిస్తావా?” అని కన్ఫ్యూషియస్ అడిగారు.“లేదు గురువుగారు. అది పెరగాలని నేను నాటుతాను. అది నీడ ఇస్తే అది ఒక బహుమతి మాత్రమే, తప్పనిసరి కాదు.”


“మరి నీ పిల్లల విషయంలో ఎందుకు వేరుగా ఆలోచిస్తున్నావు? నువ్వు వారిని నీ కోసం పెంచలేదు.ఈ ప్రపంచం కోసం పెంచావు.”​


మొదటిసారి లీ వీకి అసలు విషయం అర్థమైంది.​


తరువాత కన్ఫ్యూషియస్


లీ వీ కు కొన్ని విత్తనాలతో ఉన్న సంచిని ఇచ్చాడు.“నువ్వు ఇంకా మొక్కలు నాటవచ్చు. ఇంకా నేర్పించవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. వృద్ధాప్యం అంటే వేచి ఉండటం కాదు...అది కొత్త ఆరంభాల సమయం.


పిల్లల నుండి ప్రేమ కోసం ఎదురుచూడకు. నీకు నచ్చిన పనిని మొదలుపెట్టు.”​ అని బోధించాడు.


లీ వీ తిరిగి తన గ్రామానికి వెళ్ళాడు...కానీ కొడుకు ఇంటికి కాదు. ఒక పాఠశాల దగ్గర చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని పిల్లలకు సహాయం చేయడం మొదలుపెట్టాడు. తనకు తెలిసిన విద్యను, కథలను పంచుకున్నాడు. వారితో కలిసి చెట్లను నాటాడు. త్వరలోనే అందరూ ఆయనను ‘మాస్టర్ లీ’ అని పిలవడం మొదలుపెట్టారు.​ఆయన తన ఉనికిని ఇతరులపై రుద్దడం మానేసే కొద్దీ, ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన శ్రద్ధను ఆశించడం మానేసే కొద్దీ, అందరూ ఆయనను ప్రేమగా చూడటం మొదలుపెట్టారు.​


ప్రేమ తిరిగి వచ్చిన వేళ​ ఒకరోజు కొడుకు నుండి ఉత్తరం వచ్చింది. “నాన్నా, నువ్వు వెళ్లి చాలా కాలమైంది. మేమంతా నిన్ను మిస్ అవుతున్నాము. పిల్లలు నీ గురించి అడుగుతూనే ఉన్నారు. మమ్మల్ని చూడటానికి రా.


మాతో ఉండటానికి కాదు, మాతో గడపడానికి రా.


”​లీ వీ వెళ్ళినప్పుడు, ఆయనకు సాదర స్వాగతం లభించింది.


ఏళ్ల తర్వాత మొదటిసారి ఆయన తనను తాను ఒక భారంగా కాకుండా, ఒక ఆత్మీయ అతిథిగా భావించాడు.​


అప్పుడే ఆయనకు అర్థమైంది...ఎప్పుడైతే ఆయన ప్రేమను ఆశించడం మానేశాడో... అప్పుడే అది వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చిందని .​


ఈ కథ ఇచ్చే సందేశం​“వృద్ధాప్యంలో పిల్లలతో కలిసి ఉండటం తప్పు” అని కాదు. నిజమైన సామీప్యం స్వేచ్ఛ నుండి పుడుతుంది...బాధ్యత లేదా బలవంతం నుండి కాదు.​


మనం ఎదుటివారి ఉనికిని శాసించాలని చూస్తే, వారిని ఊపిరి ఆడకుండా చేస్తాము. మనల్ని మనం వారిపై రుద్దితే, మనం వారికి అదృశ్యమైపోతాము.


ఎప్పుడైతే మనం పట్టు వదులుతామో, అప్పుడే మనం వారి మనసుల్లో స్థానం పొందుతాము.​


కన్ఫ్యూషియస్ చెప్పినట్లు...


ప్రేమ మరియు గౌరవాన్ని డిమాండ్ చేయలేము. వాటిని కేవలం పోషించగలం.


నిజం కదా మేము పెంచాము పెద్దవాళ్ళను చేసాము. మేము పెద్దవాళ్ళము అయ్యాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి. ఇది ఇచ్చి పుచ్చుకోవాటమ్ లాంటి ది.

ఆలా కాకుండా పెంచు, చదివించు, ప్రయోజకులను చెయ్యి, తరువాత ఆశించకు వాళ్ళనుంచి.

ఇప్పటి కాలం లవ్ అస్సలు జరగని పరిస్థితి. పెద్దాయన చెప్పినట్లు ఎదో ఒక పని చెయ్యి. ఎదో ఒక సహాయం చేస్తున్నావ్ ఉండు. బిడ్డలు వారంతట వారే మారతారు.


లాస్ట్ గా పిల్లలకు చెయ్యటం నే బాధ్యత.

గీతలో చెప్పినట్లు ఖర్మ ను చెయ్యి. ఫలితం ఎదురు చూడకు వాళ్ళు తిరిగి నీలాగా చెయ్యాలని ఆశించకు.


    🌿సుల్తానా. తిరుపతి 🌿

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *శనివారం 30 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                               

          *104 వ భాగం*

     

       *శ్రీకృష్ణావతారము-7*


      *కాళీయ మర్దనము*```


కృష్ణుడు, గోపబాలురు గోవులను కాచే ప్రదేశం సమీపంలో ఒక నీటి మడుగుఉంది. వర్షాకాలంలో యమునా నది పొంగి ప్రవహించే సమయంలో నీరు ఆ మడుగు లోకి వచ్చి చేరేది. అంతుతెలియని లోతు కలిగిన ఆ నీటి మడుగు దగ్గరకు అక్కడివారు ఎవ్వరు వెళ్లేవారు కాదు. ఆ నీరు సలసల కాగుతున్నట్టు ఉండి వేడి విషపు పొగలు చిమ్ముతూ ఉంటుంది.


పొరబాటున ఆ నీరు త్రాగే జంతువులు, ఆ మడుగు పై ఎగిరి విషపు గాలి పీల్చేపక్షులు నల్లబడి కింద నీటిలో చనిపోయేవి. నీరు త్రాగడానికి వచ్చే జంతువులను, ఆ మడుగులో ఉండే కాళీయుడు అనే ఐదు తలల మహాసర్పము తన తోకతో పట్టి లాగి తినేసేది.  తెలిసిన గోపాలురు తమ గోవులను మడుగు సమీపానికి వెళ్ల కుండా చూసేవారు.


కృష్ణుడి మధుర మురళీగానంలో మునిగిపోయి గోపాలురుండగా ఒక గోవత్సము(దూడ)  చెంగు చెంగున ఎగురుతూ కాళీయమడుగు తీరానికి వెళ్లింది. గోపబాలుడు ఒకడు చూసి దానిని మళ్ళించుకురావడానికి పరుగెత్తి వెళ్లాడు.  గోపబాలుడు పట్టుకునేలోపు మడుగు నుంచి ఐదు తలల కాళీయ సర్పము లేచి తన తోక చాచి తీరాన ఉన్న ఆవుదూడను చుట్టుకుని పట్టుకుని మడుగు లోకి లాగివేసింది. ఆవుదూడ భయంతో అంబా అంబా అని అరుస్తుంటే గోపబాలుడు భయ పడి పరిగెత్తుకుంటూ కృష్ణుడి వద్దకు వచ్చాడు.


“కన్నయ్యా! మన దూడను మడుగులో ఉండే సర్పం పట్టుకుని నీళ్ళ లోపలికి లాగేసింది” అని ఏడుస్తూ కృష్ణుడికి చెప్పాడు. కృష్ణుడు వెంటనే చెట్టు మీద నుంచి దిగి మడుగు దగ్గరికి పరిగెత్తుకు  వెళ్లాడు. బలరాముడు, గోపబాలురు వెంట పరిగెత్తారు.  మడుగు దగ్గరకు వెళ్లిన కృష్ణుడు అక్కడ ఉండే పెద్ద చెట్టు పైకెక్కి మడుగు మధ్యకు వ్యాపించిన చెట్టు కొమ్మను చేరి ఆవుదూడను సర్పము నీట ముంచుతున్న ప్రదేశంలోకి దూకాడు.


బలరాముడు నిబ్బరంగా ఉన్నా, చూస్తున్న గోపబాలురు భయ పడ్డారు. హాహాకారాలు చేశారు. కొందరు నంద యశోదలకు చెప్పడానికి గ్రామానికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. నీటిలో దూకిన కృష్ణుడు సర్పము తోకకు చుట్టుకుని అరుస్తున్న ఆవుదూడను విడదీసి ఒడ్డుకు నీటినుండే విసిరేశాడు. బలరాముడు పట్టుకుని ఆ దూడకు సపర్యలు చేశాడు.


కాళీయ సర్పానికి తన బంధనం నుంచి దూడను విడిపించిన కృష్ణుడిపై ఆగ్రహం వచ్చింది. కృష్ణుని తోకతోచుట్టి నాగపాశంతో బంధించి తన పడగల నుంచి విషపు గాలులు కృష్ణుని పైకి వదిలాడు. బాలకృష్ణుడు సృహ తప్పాడు.


తరువాత కథ చెప్పే ముందు కాళీయుడు ఎవరో చెబుతాను..   


రసాతలంలో కాళీయుడు అనే సర్పరాజు భార్యలు, పిల్లలు, సేవకులతో నివసించేవాడు. 

తన విషపు అగ్ని జ్వాలలతో రసాతల వాసులను భయ భ్రాంతులను చేసేవాడు. దొరికిన వారిని చంపి ఆహారంగా తీసుకునేవాడు. రసాతల వాసులు గరుత్మంతుడితో మొర పెట్టుకుని కాళీయుని నుంచి రక్షించమని కోరారు. గరుత్మంతుడు కాళీయుని చంపడానికి బయలుదేరి వెళ్లాడు.


గరుత్మంతుడు వస్తున్నాడని తెలుసుకున్న కాళీయుడు ప్రాణాలు రక్షించుకోవడానికి తనవారిని తీసుకుని సముద్రం ద్వారా యమునకు, యమున నుంచి నీటి మడుగుకు వచ్చి దాక్కున్నాడు. మడుగు సమీపానికి వచ్చే జంతువులను, మనుషులను చంపి ఆకలి తీర్చుకోసాగాడు. కాళీయుని విషానికి మడుగు నీరు విషపూరితమై త్రాగడానికి పనికిరాకుండా పోయింది.


ఇక కథలోకి వస్తే, సమాచారం తెలిసిన నందుడు యశోద గోపికలు గోపబాలురతో కలసి కాళింది మడుగు దగ్గరకు వచ్చారు. కృష్ణుడు కనపడలేదు. కాళింది మడుగు మధ్య నుండి ఉబుకుతున్న వేడి నీరు, పొగలుగా చిమ్ముతున్న విషపు జ్వాలలు చూసి యశోద “కన్నయ్యా” అంటూ దుఖంతో సృహతప్పింది. నందుడు, గోపికలు,గోపాలురు దుఖిస్తున్నారు. మడుగులోకి వెళ్లే సాహసం ఎవ్వరికీ లేదు.


బలరాముడికి తన అవతారాంశ జ్ఞప్తికి వచ్చి మడుగులోపల సృహ తప్పి కాళీయుడి బంధనంలో చిక్కిన కృష్ణుని కన్నులు మూసుకుని దివ్యదృష్టితో చూశాడు. మనస్సులోనే నమస్కరిస్తూ “శ్రీహరీ! మీ అవతారాన్ని లోకానికి చూపించే సమయం వచ్చింది. సృహకి వచ్చి కాళీయుడికి బుద్ది చెప్పి శిక్షించండి. లేదంటే నా ఆదిశేష రూపము ప్రకటించవలసి వస్తుంది” అని ప్రార్ధించాడు.


మడుగులో నాగపాశానికి బందీ అయ్యి సృహతప్పిన కృష్ణుని బలరాముని ప్రార్ధన మేలుకొలిపింది.  క్షణంలో  శరీరము సవరించుకొని ఒక్క ఉదుట్న నాగపాశం నుండి విడిపించుకున్నాడు. చేతిలో కాళీయుడి తోక చివరి భాగం పట్టుకుని చటుక్కున కాళీయుడి పడగల పైకి ఎగిరాడు. కాళీయుని పడగలను పాదాలతో మర్ధిస్తూ నాట్యం చేయసాగాడు.


కృష్ణుడి పాద ధాటికి కాళీయుడి ఐదు పడగల నుంచి విషం,రక్తం బయటకు వచ్చాయి. మడుగు మధ్య నుండి రక్తము ఉబికి రావడంతో నందుడు గోపాలురు హాహాకారాలు చేశారు. బలరాముడు వారికి “కృష్ణుడికి ఏమి కాలేదు” అని ధైర్యం చెబుతూ త్వరలో మడుగు నుంచి సురక్షితంగా కృష్ణుడు వస్తాడని హామి ఇచ్చాడు.


కాళీయుడి రక్తం అంతా పోయింది. ప్రాణాలు మరికొన్ని క్షణాలలో పోతాయి అనుకునే సమయంలో కాళీయుని పత్నులు కృష్ణుడి ముందుకు వచ్చి చేతులు జోడించి  పతికి ప్రాణభిక్ష పెట్టమని ప్రార్ధించారు. కాళీయుడు కూడా ‘పాహి మాం కృష్ణా’ అని శరణు వేడాడు. 


కృష్ణుడు శాంతించి “మీరు తక్షణమే ఈ మడుగు వదలి రసాతలం వెళ్లి పోవాలి. నా అడుగుల ముద్రలు పడగల పైన ఉండటంతో గరుత్మంతుడు కాళీయుని ఏమీ చేయడు. ఇక జీవ జంతువులను విషంతో చంపకుండా రసాతలంలో లభించేవి తిని ఆకలి తీర్చు కోవాలి. ఇలా ప్రమాణం చేస్తే వదిలేస్తాను. ఈ మడుగు ఇకనుంచి కాళింది మడుగు అనే పేరుతో ప్రసిద్దమవుతుంది” అన్నాడు.


కాళీయుడు అంగీకరించాడు. పడగలపై వేణుగానం పలికిస్తూ నాట్య భంగిమలో ఉన్న తనను నీటి పైకి తీసుకెళ్లమని కాళీయుని కృష్ణుడు ఆదేశించాడు. కాళీయుడు కృష్ణుని మడుగు నీటి నుండి పైకి తీసుకొచ్చాడు.  కాళీయుడి పడగల పై వేణుగానం చేస్తూ నృత్యభంగిమలో ఉన్న కృష్ణుని నందుడు, గోపాలురు, గోపికలు, గోపబాలురతో పాటు అప్పుడే సృహలోకి వచ్చిన యశోద చూసి ఆనందించింది. గోపాలురు హర్షధ్వానాలు చేసారు.


కాళీయుడు శ్రీకృష్ణుని తీరాన దించి తన భార్యలు, పిల్లలు, పరివారంతో మడుగు వదలి రసాతలానికి వెళ్లి పోయాడు. యశోద నందులకు తమ కుమా రుడు దివ్యబాలుడు, నారాయణుడి అవతారమని అర్ధమయ్యింది. కృష్ణుడికి అర్ధం అయ్యి యశోదను కుదుపుతూ “అమ్మా! చాలా ఆకలిగా ఉంది. వెన్న పెట్టవా అమ్మా!” అని మారాం చేస్తూ ముద్దు ముద్దుగా అడిగాడు. 


యశోద పై విష్ణుమాయ ప్రభావం పడి భగవంతుడు అనే మాట మరచిపోయింది. మాతృప్రేమ బయటకు వచ్చి “పదరా కన్నా! ముందు దిష్టి తీసి తరువాత కడుపు నిండేంత వెన్న తింటానికి  ఇస్తాను" అంటూ చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్లింది. బలరాముడు నందుడు ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకున్నారు.


*తరువాత కథ  రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

గొప్ప వారు ఎవరు

 *గొప్ప వారు ఎవరు - మంచి వారు ఎవరు???*


ఈరోజుల్లో చాలా మంది మా పిల్లవాడు చాలా గొప్ప వాడు కావాలి, చాలా చదువు చదవాలి, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు తేవాలి అని ఆత్రుత పడుతుంటారు...!!

 మరి కొంత మంది తలితండ్రులు నా కుమారుడు చాలా మంచి వాడు కావాలని అని కోరుకుంటారు!!... 

ఈ రెండింటిలో చాలా వ్యత్యాసం ఉంది,

గొప్పవాడు కావాలని కోరేటువంటి తల్లి, సరియైనటువంటి కోరిక కాదు.  

నీవు గొప్పవాడు కావాలనుకుంటే, గొప్ప లావా ? లేక ఎత్తా? లేకపోతే గొప్ప పేరు ప్రతిష్టలా ? లేక శ్రీమంతుడా? లేక బలవంతుడా? లేక గుణవంతుడా? మంచి పేరు అనేటువంటిది గుణముతో వస్తుంది.


కనుకనే... *గొప్పవాడు రావణుడు, మంచి వాడు రాముడు*.  

చదివినటువంటి చదువులు అన్నియు కూడను ప్రాక్టికల్ లో పెడుతూ వచ్చాడు రాముడు, ఆచరించి చూపాడు రాముడు,...


కానీ ఎన్నియో చదువులు చదివాడు రావణుడు, కానీ ఆచరించలేదు, అజ్ఞానం ఆవరించిపోయింది.  

కనుకనే అతనికి గొప్ప పేరు వచ్చింది కానీ, మంచి పేరు రాలేదు.  


"రాముడు ఆచరించి, ఆనందించి పది మందికి పంచి పెట్టినటువంటి వాడు కనుకనే, అతనికి మంచి పేరే వచ్చింది కానీ, గొప్ప పేరు రాలేదు."

ఇప్పుడు మనం ఆలోచించాల్సింది, మన పిల్లవాడు రాముడు కావాలా, రావణుడు కావాలా అని!!...


          *_శుభమస్తు_*

🙏 శ్రీ సద్గురు పీఠం నుండి....✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

న్యాయం సాధించడానికి

 న్యాయం సాధించడానికి అసాధారణ పద్ధతులను ఉపయోగించడం గురించిన మన అవగాహనపై మహాభారతం వంటి కథలు ఎలాంటి ప్రభావం చూపుతాయి?



ధర్మరాజు యక్షుడితో సంవాదం


యదిహాస్తి తదన్యత్ర

యన్నేహాస్తి నతత్ క్వచిత్ "

- ఆది పర్వం, మహాభారతం


ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే నాలుగు సద్గుణాల గురించి మహర్షి వ్యాసుడు ఇలా అన్నారు: మహాభారతంలో లభించే సమాచారమే బయట కూడా లభిస్తుంది. మహాభారతంలో లభించని ఏ సమాచారమైనా మరెక్కడా ఎప్పటికీ బయట లభించదు " అని.


మహర్షి విశ్వాసం అలాంటిది.


విదురనీతి ఓ అద్భుత సంకలనం. యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు ఇచ్చిన సమాధానాలు ఉత్తమం. మేధావులు నేటికీ ఆ గ్రంథాల ద్వారానే మార్గనిర్దేశం పొందుతున్నారు.


శాంతి పర్వంలో భరద్వాజ, భృగు మహర్షుల మధ్య చెట్ల గురించి జరిగిన చర్చ అత్యుత్తమమైనది. దానిలో చెట్లకు ప్రాణం, స్పర్శ జ్ఞానం, ప్రతిస్పందించే సామర్థ్యం, ​​చూసే శక్తి, వినే సామర్థ్యం ఉన్నాయని ప్రస్తావించబడింది—ఇది ఎంతటి అద్భుతమైన జ్ఞానం.


వేల సంవత్సరాల తర్వాత, ఇంత కాలం గడిచాక, కేవలం ఇప్పుడే—విదేశీ శాస్త్రవేత్తలు క్రమంగా ఈ వాస్తవాలను కనుగొనడం ప్రారంభించారు.


అయినప్పటికీ, మన భారతీయ వృక్షశాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్ర బోస్ ఈ భావనలను వివరించిన తర్వాతే, విదేశీ పరిశీలకులు మరియు శాస్త్రవేత్తలు చివరకు సత్యాన్ని గ్రహించారు.


చాలా మంది బోస్‌పై తన " రేడియో " ఆవిష్కరణకు పేటెంట్ పొందమని ఒత్తిడి చేశారు, కానీ ఆయన, “నాకు పరిశోధనపై మాత్రమే ఆసక్తి ఉంది, డబ్బు సంపాదించడంపై కాదు” అని అన్నారు. మార్కోనీ బోస్ ఈ ఆవిష్కరణను ఉపయోగించుకున్నారు. ఆ సమయంలో బోస్ జాతి వివక్షను ఎదుర్కొన్నారు, మరియు ఆయన చేసిన సేవలు విస్మరించబడ్డాయి . మార్కోనీ 1909లో రేడియో రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు.


ఈ విషయం " మన విజ్ఞానం ఎటువంటిదో, దేనికోసమో " కుహనా మేధావులకు తెలియచేయడం కోసమే.


అలాంటి పరిస్థితుల్లో, ఇతిహాసాలలోని సమాచారం అసాంప్రదాయ పద్ధతులకు ఎలా మద్దతునిస్తాయి.

ఇతిహాసాలు కేవలం ధర్మబద్ధమైన మరియు సాంప్రదాయ పద్ధతులను మాత్రమే అందిస్తాయి.


శుభమస్తు

*దైవం తో సంబంధం ఎలా??...*

 *దైవం తో సంబంధం ఎలా??...*

భగవంతునితో సఖ్యత పెంచుకోవాలి, జపం, పూజ, ధ్యానం, వ్రతాలు మాత్రమే భక్తి కాదు!!... 

అవికూడా చేయవలసినవే! ఇవి రోజూ చేయడంవలన మనకు దైవంతో అనుబంధం, ప్రేమ పెరగుతుంది, ఆయనను ప్రేమించడం మనవిధి.


రూపనామములతో మనిషిగా దైవాన్ని గుర్తించి, ప్రేమించి పూజించడం, అంటే అది పూర్వ జన్మ సంస్కారమే. 

అందరికీ భగవంతుని తో బంధం కలగదు, ఆయన అనుగ్రహం ఉన్నవారికే అది సాధ్యం అవుతుంది...


సఖ్యత భగవంతుని తో కుదరాలంటే, ఎప్పుడూ ఆయన మన దృష్టిలో, భావనలో ఉండాలి, ప్రేమ పూర్వకంగా అతనితో ముచ్చట సలపాలి.

దేవుని చూడగానే చెంపలను కొట్టుకోవడం, నమస్కారం చేయడం మాత్రమే కాదు, నమస్కారము అంటే -

ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియములు...

ఈ పది ఇంద్రియాలతోనే మనం ప్రవర్తిస్తున్నాము. 

"ఇవన్నీ భగవంతుడు ఇచ్చినవే, " ఇవి నీవే స్వామీ, వీటిని సక్రమంగా వినియోగించు కోగలగాలి," అని ప్రార్థించాలి.

దేహములు మాత్రమే దూరముకానీ, బింబ ప్రతి బిఁబములవలె, అవినాభావ సంబంధం దైవంతో ఏర్పడుతుంది.  

   

           *_శుభమస్తు_*

🙏శ్రీ సద్గురు పీఠం నుండి...✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

సామాజిక స్పృహ

 *సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 8*


సభ్యులకు నమస్కారములు 


*ఓం సంగచ్చత్వం, సంవదత్వం సంవో మనాంసి జానతామ్, దేవభాగం యధా పూర్వే, సంజనానా ఉపాసతే* (ఋగ్వేద మంత్రం) అర్థం:- మనమందరం కలిసి ఉమ్మడి లక్ష్యం వైపు అడుగులేద్దాం. మన ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకుంటూ సామరస్యంగా మాట్లాడుకుందాము. మన మనసులు, ఆలోచనలు ఏకతాటిపై ఉండాలి. పూర్వ కాలంలో దేవతలందరు తమ బాధ్యతలను కల్సి పంచుకుని సామరస్యంగా ఏలా జీవించారో మనం కూడా ఆలా జీవిద్దాం. 


పై మంత్రం మరియు ఆచరణ సంఘ బలానికి ఉన్న విశిష్టతను తెలియజేస్తున్నది. ఐకమత్యమే సంఘ శక్తికి నిదర్శనం. ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, మానసిక ధైర్యానికి, అన్యాయాల నిలువరింతకు, దుర్మార్గాల కట్టడికి మరియు సామూహిక శ్రేయస్సుకు సామాజిక శక్తి ప్రధానం.


*ముందు అనాగరిక చర్యలు ఎలాంటివో చూద్దాము* వల్లించడానికి ఎన్నెన్నో ఆదర్శాలు, ఆచరణ ఏది. సాధారణ జన జీవితంలో మనం ప్రత్యక్ష సాక్షులుగా ఉండే ఘటనలు కొన్ని పరిశీలిద్దాము. *కాలని పేరు ఆదర్శ కాలని, లోపభూయిష్టాలకు లోటులేదు*. ఈ కాలని భారత దేశంలో ఎక్కడో మారుమూల ఉన్న కాలని కాదు. భాగ్యనగరం నడి బొడ్డున కాలని.

1) గృహాలకు Cellar భాగము ఉండదు. వాహన నిలుపుదల సౌకర్యం అమర్చుకోరు. రహదారి *వీధులను Car Garages* గా మార్చేస్తారు. *రాకపోకలు సాగించే వారికి ఇబ్బంది*.

 2) గృహముల ముందు మెట్లు, Ramps ప్రక్కకు అరుగులు, వృక్ష సంపద పేరుపై ఇంటి ప్రక్కనే కంచెలు. ప్రభుత్వ రహదారులను కబళిస్తారు. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*. 3) నీరు వృధాచేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ ఇంటి ముందున్న ప్రభుత్వ Cement రహదారి స్థలాన్ని శుభ్రత పేరుతో కుళాయి పైపు తో అందునా పెద్ద ధారతో నీటిని వృధా చేస్తారు. *Mop తో శుభ్రం చేయవచ్చును గాని చేయరు గాక చేయరు*. వాహనాలు వెళ్లినప్పుడు పాదచారులపై మరియు పరిసరాలపై ఆ మురికి నీళ్లు చిమ్ముతాయి. *రాకపోకలు సాగించేవారికి ఇబ్బంది*.

4) ధరలు తక్కువగా ఉన్నప్పుడు కాలనీలలో Plots కొంటారు. ఏండ్లు గడిచినా వాటిని శుభ్రంగా ఉంచుదామన్న స్పృహ ఉండదు. వాటికి సరిహద్దు (Boundary walls) గోడలు కట్టరు. ఇందుకు అదనంగా కాలనీవాసులు అందులో చెత్తా చెదారం, విరిగిన వస్తువులు, సోఫాలు వేసి ఆ స్థలాన్ని చెత్త దిబ్బలుగా మారుస్తారు. ఆ స్థలాన్ని అపరిశుభ్రతా నిలయంగా రూపుదిద్దుతారు. ఇన్ని అవకతవకలను కాలని ASSOCIATION పట్టించుకోదు. *అక్కడ ఉండే తోటివారికి ఇబ్బంది*. 


ఈలాంటి వాతావరణం మీ ప్రాంతంలో లేదా. అవుతే *ఈ విభాగంలో* మీరు నాగరికులే. ధన్యవాదములు


*చిన్నవిగానే కనబడినా పై కార్యకలాపాలన్నీ నాగరికము కానే కావు*


ధన్య*సామాజిక స్పృహ - పూర్ణ నాగరికతా చైతన్యము 7*


సభ్యులకు నమస్కారములు.


*ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా* అనేది వేద వచనం. *అర్థం*:- ధర్మమే సమస్త విశ్వానికి మరియు జగత్తుకు మూలాధారం. 

అన్నిటికంటే.... సుఖ సంతోషాలను, శాంతి భద్రతలను అందించగల్గేది *ధర్మమే* అనునది భీష్మ పితామహుడి వచనం. ఇతర ప్రాణులకు నిర్దేశింపబడనిది, మానవులకు మాత్రమే నిర్దేశించబడినది *ధర్మం*. ఆచరించగల్గిన సమర్థత కల్గిన *ప్రాణి కూడా మనుష్యుడొక్కడే.* ధర్మాన్ని ప్రారంభించాలి, కొనసాగించాలి. ఇది మానవులు ఉపేక్షించరాని సత్యము మరియు బాధ్యత. *అభివృద్ధి అయినా, నాగరికత ఐనా ప్రతి ఒక్కరు తమ తమ ధర్మాన్ని క్రమం తప్పకుండా నిర్వహించాలి*. ధర్మాన్ని ఆచరిస్తూ మనుష్యులుగా జీవిద్దామా లేక ధర్మాన్ని తప్పి *చతుష్పాదులుగా దిగజారాలా*...ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సి విషయం. 


మానవ ధర్మం అనగా మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరు నైతిక విలువలు, విధులు పాటిస్తూ సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇవి సకల మానవాళికి కల్గి ఉండే సార్వత్రిక ధర్మాలు. 


మనిషి మనిషిలా బ్రతకాలంటే ధర్మాన్ని అనుసరించడం, అనుష్టించడంతో బాటు ధర్మ ప్రచారం గూడా అవసరమే. *ఎవరి ధర్మం వారు పాటించాలి*. ధర్మము, ధర్మాత్ములు రక్షింపబడాలి ఇది ప్రభువుల ప్రధాన ధర్మం. ఈ కాలంలో ప్రభువులు అంటే ప్రభుత్వము, ప్రభుత్వ అధినేతలు. 


ప్రభుత్వము, ప్రభుత్వాలు, చట్టము మరియు నిబంధనలు అటుంచి మానవ ధర్మాలను అవలోకిద్దాము. 1) జననీ జనకులు తమ సంతానాన్ని తీర్చిదిద్దాలి 2) పురజనుడిగా ఎదిగిన పిమ్మట వ్యక్తిగత బాధ్యతలతో బాటు సామాజిక బాధ్యతలు పంచుకోవాలి. 3) పీఠాధిపతులు, ధర్మప్రభోధకులు, ప్రవచనకారులు దేశ కాల పరిస్థితులను గమనిస్తూ ప్రజలను జాగృత పర్చాలి. 

4) ధర్మానికి, సంస్కృతికి రక్షణగా ఉండాలి అంటే... *ధర్మ హింసా తదైవచ* అని కూడా ప్రజల దృష్టికి తేవాలి చట్టాల అనుసరణ యుక్తంగా చట్టాల రక్షణకు పాటుపడాలి. 5) చట్ట వ్యతిరేక చర్యలకు ఉద్వాసన పలకాలి. 6) చట్ట ఉల్లంఘనదారులను ఉపేక్షించ రాదు. అవినీతి పరులను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని, హింసావాదులను, దౌర్జన్యకారులను బాధ్యతగా చట్టానికి అప్పగించాలి. 7) సమాజ ద్రోహ విషయాలలో *నాకెందుకు* అను ఉదాసీనత వీడాలి. 8) నేను మరియు నా కుటుంబం బావుంటే చాలు. సమాజం ఏమైతే నాకెందుకు అను *హీన దృక్పథం* వీడాలి.


ధన్యవాదములు

*(సశేషం)*వాదములు

గురువులు

 *గురువులు ఎన్ని రకాలు ఉంటారు ?* 


*శ్రీ గురుభ్యో నమః.*🙏


*1) సూచక గురువు : బాల్యం నుండి మనకు నాలుగు అక్షరాలూ నేర్పించి కే.జి నుండి పి.జి వరకు బ్రతుకుతెరువు కోసం బోధన చేసే గురువులు ఎందరో . మన జీవితంలో మనం ఉన్నత స్దితిలో ఉండటం కోసం ఎన్నో సలహాలు ఇస్తారు . వీరిని సూచక గురువులంటారు . వీరి ద్వారా భుక్తిమార్గం తెలుసుకుంటాం.*


*2 ). వాచక గురువు : వీరు ధర్మాధర్మ విచక్షణ , మంచి చెడు విశ్లేషణ , చతురాశ్రమాలు, వాటి ధర్మాల గురించి చెపుతారు. ( బ్రహ్మ చర్యము , గృహస్థాశ్రమం , వానప్రస్దం , సన్యాసం ) . వీరి ద్వారా ఎలా జీవించాలి అని అవగాహన వస్తుంది .*


*3 ). బోధక గురువు* : *వీరు మహా మంత్రాలను ఉపదేశిస్తారు . లౌకికంగా కోర్కెలు తీర్చేవాటిని , అలౌకిమైన మోక్షానికి మార్గం చూపే వాటిని ఉపదేశిస్తారు. వీరిని బోధక గురువులంటారు . మనం లౌకికం నుండి అలౌకికం వరకు మెల్లగా అడుగులు వేయగలుగుతాము.*


*4 ) నిషిద్ద గురువులు* : *మారణ ప్రయోగాలు , వశీకరణాలు , వినాశనాలు - ఇలాంటివి నేర్పే గురువులను నిషిద్ద గురువులంటారు. ఇలాంటి వారి దగ్గరకు వెళ్ళకపోవడం చాలా మంచిది . చిత్తాన్ని శుద్ధి చేయరు. విత్తాన్ని హరిస్తారు . ( పతనం కావాలి అనుకుంటే ఇలాంటి గురువులను ఎన్నుకోవాలి )*


*5 ) విహిత గురువు* : *మన హితము కోరి సూచనలు సలహాలిస్తారు , నశించిపోయే విషయభోగాలపై ఆసక్తి తగ్గించి , సత్యమైన శాశ్వతమైన విషయాలపై అంతర్ముఖం చేయడం నేర్పుతారు. ( ఏది సత్యం, ఏదసత్యం అనే విచక్షణ తో జివించగలుగుతాము )*


*6) *కారణ గురువు* : *వీరు మోక్షం గురుంచి మాత్రమే చెపుతారు . ఎన్ని సుఖాలు అనుభవించినా, అంతిమ లక్ష్యం ముక్తి, ఐహిక బంధాల నుండి విముక్తి అని చెప్పి శిష్యులను ఎప్పుడు ఎరుకలో ఉంచుతూ ఉంటారు ,( నిత్య ఎరుకతో కర్మ యోగిలా కదిలి పోవడం నేర్చుకుంటాము)*


*7.) పరమ గురువు :* *వీరు సాక్షాత్ భగవత్ స్వరూపం. పరిపక్వం చెందిన శిష్యుని వెతుకుతూ వస్తారు .*

*శిష్యునికి సన్మార్గం బోధించి ‘’ ఈ చరాచరజగత్తు మొత్తం వ్యాపించి ఉన్నది నేనే’’ అని అనుభవ పూర్వకంగా తానూ తెలుసుకుని ‘’ అహం బ్రహ్మాస్మి" అనేది కేవలం పదం కాకుండా ఆ పదాన్ని మనకు ఆవాహన చేసి మనం అనుభూతి చెందగలిగే స్దితికి తీసుకు వెళ్ళేవారు ఈ పరమ గురువులు . వీరు ఎక్కడో కోటిలో ఒక్కరు మాత్రమే ఉంటారు . మన నిజజీవితంలో ఇలాంటి గురువు తారసపడితే సాక్షాత్ భగవంతుడు మనతో జత నడిచినట్లే . వీరు లభిస్తే మన జన్మ ధన్యమైనట్లే.*


సేకరణ....🙏🙏🙏