22, మార్చి 2026, ఆదివారం

గుమ్మడి గింజలు*

 


            *గుమ్మడి గింజలు*

                ➖➖➖✍️


*గుమ్మడికాయ గింజలు మనం తరచుగా నిర్లక్ష్యం చేస్తాము కానీ అత్యంత శక్తివంతమైన కండరాలకు మద్దతు ఇచ్చే ఆహారాలలో ఒకటి.*


*వీటిలో ఉన్న మెగ్నీషియం పరిమాణం పాలకూర కంటే దాదాపు ఆరు రెట్లు ఎక్కువ.*



*మెగ్నీషియం కండరాల సంకోచం, విస్తరణ (Relaxation), మరియు పునరుద్ధరణ (Recovery) లో కీలక పాత్ర పోషిస్తుంది.*


*శరీర బలం పెంచుకోవాలనుకునే వారికి లేదా శారీరక పనితీరు మెరుగుపరచుకోవాలనుకునేవారికి ఇది అత్యవసరమైన ఖనిజం.*


*గుమ్మడికాయ గింజల్లో సస్య ఆధారిత ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.*


*ఇవన్నీ కండరాల పునరుద్ధరణను వేగవంతం చేస్తాయి, నొప్పిని తగ్గిస్తాయి మరియు తీవ్ర వ్యాయామ సమయంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యాన్ని కాపాడుతాయి.*


*ఈ ఖనిజ సమృద్ధమైన గింజలు కణ స్థాయిలో శక్తి ఉత్పత్తికి మద్దతు ఇస్తాయి. మాగ్నీషియం ఆహారాన్ని ATP గా మారుస్తుంది — ఇది మన కండరాలు లిఫ్టింగ్, పరుగులు మరియు దైనందిన కదలికల కోసం ఉపయోగించే శక్తి రూపం.*


*మాగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు క్రాంపులు, అలసట, మరియు వ్యాయామ పనితీరు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.*


*గుమ్మడికాయ గింజలను ఆహారంలో చేర్చడం ద్వారా కండరాలు ఎల్లప్పుడూ శక్తివంతంగా, స్థిరంగా, మరియు చురుకుగా ఉంటాయి.*


*ఇవి హార్మోన్ సమతౌల్యం మరియు రోగనిరోధక శక్తికి సహాయపడతాయి — ఇవి దీర్ఘకాలిక శారీరక పనితీరుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు.*


*గుమ్మడికాయ గింజలను ఆహారంలో సులభంగా చేర్చవచ్చు :*


*సలాడ్లపై చల్లి తినండి, స్మూతీల్లో కలపండి, స్నాక్స్‌లలో ఉడకపెట్టండి లేదా ఒక స్పూన్ గింజలను నేరుగా తినండి.*


*తరచుగా వీటి సేవనం వల్ల శక్తి, సహనశక్తి మరియు కండరాల విశ్రాంతి గణనీయంగా మెరుగుపడతాయి. తక్కువ ఖర్చుతో పెద్ద ఫలితాలు ఇచ్చే ఈ సాధారణ ఆహారం — గుమ్మడికాయ గింజలు — శారీరక దృఢత్వం కోసం అత్యంత ప్రభావవంతమైన ఎంపిక.*✍️

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

వివాహం




                  *వివాహం..!*

      *అమ్మాయిలు-అబ్బాయిలు*

                *తల్లితండ్రులు*

                ➖➖➖✍️



*🌺వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్న అమ్మాయిలు / అబ్బాయిలు మరియు వారి తల్లితండ్రులు ఈ క్రింది (సూచనలను) వాస్తవాలను తప్పక గ్రహించాలి.....*



*🔹వధువు / వరుడు గ్రహించాల్సిన అంశాలు....*

```

*వివాహం అంటేనే సర్దుకు పోవడం..!

*వివాహం అంటే స్వర్గం అని భావించకండి..!

*వివాహం బాధ్యతలతో కూడిన జీవితం..!


*ఆకతాయిగా తిరిగే అవకాశం అమ్మాయిలకు/అబ్బాయిలకు వివాహం తరువాత కుదరదు అనే వాస్తవాన్ని గ్రహించండి..!


*వివాహం తరువాత నాది,నీది అనే స్వార్థం వీడాలి..!


*వివాహం తరువాత ఫ్రెండ్స్ ని/సహ ఉద్యోగులను బయటి వరకే వుంచడం మంచిది..!


*మీరు కోరుకున్న అన్ని అంశాలు 

మీ జీవిత భాగస్వామిలో వుండటానికి అంగట్లో వస్తువు కాదని గ్రహించాలి..!


*మీరు పరస్పరం ఇరువురి తల్లి తండ్రులకు, బంధువులకు గౌరవం ఇవ్వటం నేర్చుకోవాలి..!


*సంతానం ను పొందటం బాధ్యత..!


*’విడాకులు’ అనే ఆప్షన్ మీ బ్రెయిన్ లో వుంటే వివాహం చేసుకోకపోవడమే మంచిది..!


*వివాహం తరువాత మీ భాగస్వామి మీ బానిస కాదు అని గ్రహించండి. ఒకరికి ఒకరు తోడు అని గ్రహించండి..!


*జీవిత భాగస్వామిని మించిన నేస్తం ఎవరు లేరని గ్రహించండి..!


*ముఖ్యంగా అమ్మాయిలు మీ అత్త గారి కుటుంబ విషయాలను మీ తల్లి తండ్రులకు చెప్పకండి..!


*భార్య భర్తలు తగువు ఆడటం సహజం..!

మళ్ళీ కలవటం మామూలే..!

మీరు పడే గొడవలను మీ తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళవద్దు..!

```


*🔹వధువు బాధ్యతలు :*```


*వంట పని, ఇంటి పనులు, అబ్బాయి తల్లి తండ్రుల బాగోగులు, కుటుంబంలో ఇంకా మీ కంటే చిన్న వారు వుంటే వారి బాధ్యత కూడా మీదే. అత్త వారి కుటుంబమే మీ కుటుంబం అని మరువకండి..!


*ప్రతి విషయం ను మీ పుట్టినింటితో పోల్చుకోవద్దు..!```



*🔹వరుడు బాధ్యతలు...*```


వధువు తన తల్లి తండ్రులను వదిలి మిమ్మల్ని, మీ తల్లి తండ్రులను నమ్మి వచ్చిందనే విషయం మరువకండి..!


*కుటుంబానికి కావాల్సిన ఆర్థిక వనరులు మీ బాధ్యత..!


*పెళ్లి అయిన కొత్తలో నా పెళ్ళాం మంచిది అని తొందరపడి కుటుంబం లో వున్న అన్ని విషయాలు విడమరిచి చెప్పకండి.


*మీ తల్లి తండ్రులు వలె మీ భార్య తల్లి తండ్రులను కూడా గౌరవించటం నేర్చుకోండి. ```



*🔹అమ్మాయి తల్లి తండ్రులు...* ```

అమ్మాయికి నేరుగా ఫోన్ చేసి సుత్తి వేయకండి. వియ్యంకులను గౌరవించటం నేర్చుకోండి..!


*కొత్తగా వెళ్లిన కుటుంబం లో కొన్ని ఇబ్బంది గా మొదట్లో అనిపిస్తాయని, సర్డుకోవడానికి సమయం పడుతుంది అని గ్రహించండి..!


*భార్య భర్తల గొడవలో అమ్మాయి తల్లి తండ్రులు తల దుర్చారాదు. 

*మీ అమ్మాయికి తల్లి తండ్రులు ఇకపై అత్త మామలో అనే విషయాన్ని అమ్మాయికి చెప్పండి.


*మీకు కూడా ఒక కోడలు వస్తుందని గ్రహించండి..!


*మీ అమ్మాయి చెప్పేవన్నీ నమ్మి ఆవేశపడకండి.```



*🔹అబ్బాయి తల్లి తండ్రులు...*

```

*మీ కోడలికి మీ అమ్మాయి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని మరువకండి.


*మీ వంశమును నిలబెట్టే సంతానం మీ కోడలి గర్భం ద్వారా జరుగుతుంది. అలాంటి మీ ఇంటి కోడలిని అపురూపము గా చూసుకోవాలి అని మరువకండి..!


*మీ కోడలు బాగోగులు కుటుంబ పెద్దగా పూర్తిగా మామ గారివే!

*మీ కూతురు, కొడుకు మీ ముందు కన్నీరు పెట్టినా పర్వాలేదు. కానీ మీకోడలు ఎప్పుడూ కన్నీరు పెట్టకుండా చూసే బాధ్యత మీదే..!


*మీ కోడలిని మీరు ఎలా చూసుకుంటారో, మీ కూతురుని వాళ్ళ అత్త గారు అలాగే చూసుకుంటారని అబ్బాయి తల్లి గ్రహించాలి. మీ కూతురు కంటే మీకు మీ కోడలే ముఖ్యం అని అర్థం చేసుకోండి. ఇదే పద్ధతి లో మీ కూతురు కి వర్తిస్తుంది అని గ్రహించండి.


పాటిస్తే అందరూ హాయిగా ఉంటారు…✍️```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

నాదరూపా

 🌹నాదరూపా🌹


నాదరూపముగా ప్రకటితమవుతున్న మహాశక్తినే నాదరూపా అంటున్నాం. 

నాదము ఈ సృష్టి అంతా ఎల్లెడలా నిండి వుంది. ప్రకృతి అంతా నాదమయం. 

రోదసి నిత్యమూ చేస్తున్న శబ్దము ఓంకారము అని శాస్త్రజ్ఞులు తెలుసుకుని ప్రకటించారు కూడా. 

అమ్మవారిని ఓంకార పంజర శుకీమ్ అని కీర్తిస్తాం. ఓంకారమనే నాదపంజరంలో 

ఆ కీరవాణి మన హృదయాలలోనే వుంది. వాయువు స్పర్శ లేకుండా పుట్టే ధ్వనిని 

అనాహతము అంటారు. ఆ శబ్దం హృదయపద్మం దగ్గర పుడుతుంది.

హృదయనాద రూపంలో ప్రతి జీవుడిలో కూడా ఆ అమ్మ ఉనికి తెలుస్తూనే ఉంటుంది.

శంకరుడికి కూడా తనువెల్లా నాదమే అని త్యాగరాజు కీర్తించాడు, 'నాద తనుమనిశం శంకరం' అని. 

శ్రీకృష్ణుడు కూడా తన వేణునాదం ద్వారా ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుని, గోపికా వల్లభుడయ్యాడు. 

నారదుడు, తుంబురుడు మొదలైన వారు, నాదోపాసన చేసి ఆ స్థాయిని అందుకున్నారు. 

అమ్మ నాదరూపిణి, అమ్మని "నాదబిందు కళాది నమో నమః" అని అరుణగిరినాథర్ కీర్తించాడు.

పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని వాక్కు నాలుగు విధములు. 

ఈ నాలుగు కలిసి ఒక్కటిగా నాదమవుతున్నాయి. ప్రాణంలో వాయువు కదలుతున్నప్పుడు

వచ్చేవే ఈ నాదాలు. హంసోపనిషత్తు ప్రకారము నాదములు పది. 

అవి, చిణీ, చిణిచిణీ, ఘంటా, శంఖ, వీణా, తాళ, వేణు, భేరీ, మృదంగ, మేఘ నాదాలు. 

నాదస్థానము సూక్ష్మతమమైనది. దానిని అందుకోవటానికి ఉపాసన కావాలి. 

ఎవరు ఏ నాదంలో ఆ అమ్మ అనుభూతిని పొందుతారో ఆ నాదమే అమ్మ. 

నాదరూపంలో అందరీనీ తరింపచేస్తున్న, ఆ నాదరూప కు వందనం.🌹 


🌹 నామరూప వివర్జితా🌹


నామ రూపములు రెండిటినీ త్యజించినది ఆ అమ్మ, అని ఈ నామానికి అర్ధం. 

ఎవరి గురించైనా తలచుకోవాలంటే, మొదటిలో నామం, రూపం అవసరం. 

సాధన చేస్తూ ఉంటే, ఆ రెండూ అవసరం లేదు. తలిస్తే చాలు తలపున ప్రత్యక్షమయ్యే 

జనని ఆ జగన్మాత. మన అమ్మ పేరు చెప్తేనే అమ్మ మనకు గుర్తు వస్తుందా, అక్కర్లేదే. 

అమ్మ, నాన్న అని అనుకోంగానే వాళ్ళు మనసులో మెదలటం లేదూ. అమ్మని పేరుతో 

పిలుస్తున్నామా, రూపాన్ని చూసే అమ్మ అంటున్నామా, నిత్యం చూసేవారిని చూడటానికి 

నామరూపాలు అవసరం లేదు. ముఖం కేసి చూసి మాట్లాడినా కూడా, ధ్యాస ఆ ముఖం మీద 

ఉండదు కదా. అదే విధంగా ఆ జగన్మాత విషయంలో కూడా అంతే. కొన్నింటికి నామం వుండి 

రూపం ఉండదు, కొన్నింటికి రూపం వుండి నామం ఉండదు. అమ్మకు ఆ రెండూ లేవు.  

కేవలము ఉండుట మాత్రమే ఉన్నది. దేనికీ కట్టుబడని, ఆ నామరూప వివర్జిత కు వందనం. 🌹


🌹హ్రీంకారీ🌹


హ్రీం అనేది ఆ తల్లి బీజాక్షరం. హ్రీః అంటే లజ్జ, సిగ్గు.

అమ్మని ఈ నామంలో హ్రీంకారీ అంటున్నామంటే, సిగ్గును కలుగచేస్తున్న తల్లి అని భావం. 

హకారం సృష్టి శక్తినీ, రకారం స్థితి శక్తినీ, ఈకారం లయ శక్తినీ సూచిస్తాయి. 

హ్రీం శబ్దములోనే హరి నామం కూడా వుంది. తద్వారా, హరి కూడా అమ్మే అని తెలుస్తోంది. 

హ్రీంకారము రూపాన్ని ఇస్తుంది, ఆ రూపానికి అందాన్నిస్తుంది, దానికి ప్రకాశాన్నిస్తుంది. 

హిరణ్యానికి ఆ కాంతులు, ఆ వర్ణాలు ఈ అమ్మ వలననే వచ్చాయి. హిరణ్మయి అంటేనే అమ్మ. 

సూర్యుడికి కూడా ఆ బంగరు కిరణాలు ఈ అమ్మ నుంచే వచ్చాయి. 

హిరణ్మయం అంటే అంతా అమ్మే అని చెప్పటం. 

శ్రీ సూక్తం కూడా 'హిరణ్యవర్ణాం హరిణీం' అనే ప్రారంభం అవుతుంది. 

సహజంగా ఉండాల్సిన సిగ్గు రూపంలో అందరిలోనూ ఉంటున్న, ఆ హ్రీంకారి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

వ్యశేమ దేవహితం

 *వ్యశేమ దేవహితం యదాయుః* (కృ.య.తై.ఆరణ్యకం 1-1-1)


దేవ - దేవతలారా! ప్రకృతి ప్రసాదించిన (తం) జీవిత కాలాన్ని (ఆయుః) మేము అర్థవంతంగా, పవిత్రంగా మరియు ఇతరులకు మేలు చేసే విధంగా (హి) గడపాలి (వ్యశేమ) అని అర్థం. మనకు లభించిన జీవితాన్ని వృధా చేయకుండా, ఉన్నతమైన ఆశయాల కోసం వినియోగించాలనే గొప్ప సందేశాన్ని ఈ శాస్త్ర వాక్యం ఇస్తుంది.


ఒక్కోశాస్త్ర వాక్యాన్ని శ్రవణం చేసి (గురువు ద్వారా విని యుక్తులతో వాటి తాత్పర్యాన్ని స్పష్టంగా గ్రహించి నిశ్చయం చేసుకున్న) తరువాత మననం (logical గా ఆలోచిస్తూ విన్న అర్ధాన్ని సాధక‑బాధకాలు, లోకాలౌకిక విషయాలతో పరిశీలన) చేస్తూ ఉంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. తరువాత అనుభవంలోకి (నిదిధ్యాసన) తెచ్చుకుంటే జీవితం సార్థక మయినట్లే కదా! ఇంత చిన్న మంత్రంలో ఎంత అర్థం ఉందో కదా!

క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు CB

 

క్రియా శీలకత్వమే లక్ష్మీదేవి నివాసాలు ఇది వినటానికి ఆశ్చర్యంగా కనిపిస్తున్నది కదా కానీ ఇది ముమ్మాటికీ నిజం. ముందుగా త్రిమూర్తులను గూర్చి తెలుసుకుందాము. మొదటగా బ్రహ్మగారు ఆయనగారు సృష్టి రచన చేస్తారు అది మనందరికీ తెలుసు. ఆయన ధర్మపత్ని సరస్వతీదేవిగారు అమ్మగారు చదువుల తల్లి. సృష్టి రచనచేయటానికి కావలసింది జ్ఞ్యానం అందుకే ఆయనకు సహధర్మచారిణిగా వున్న తల్లి చదువుల తల్లితరువాత విష్ణుమూర్తిగారు ఆయన స్థితికారకుడు అంటే బ్రహ్మ సృష్టించిన సృష్టిని నిర్వహించే (మేనేజ్దేముడు ఒక సంస్థానిర్వహించాలంటే కావలసింది ధనం అంటే సంపద కాబట్టి ఆయనగారి ధర్మపత్ని లక్ష్మీదేవిగారు తల్లి సకల సంపదలకు కారకురాలు. ఇక మూడవ దేవుడు పరమశివుడుగారు ఆయన పని లయకారకుడు అనగా సృష్టిని నశింపచేయటం అట్లా చేయాలంటే కావలసింది శక్తీ శక్తిలేకుండా వినాశనం జరగదు అది మనందరికీ తెలుసు అందుకే దేవదేవుడు పత్ని పార్వతీదేవి తల్లి శక్తి స్వరూపిణి. ఇటువంటి క్రమాన్ని మనకు అందించిన వేదాలు, మన మహర్షులు ఎంతటి మేధావులొకదా 

యతిభావం తత్ భవతి అనే ఆర్యోక్తి ననుసరించి మనం దేవుడిని లేక ఏదేవతను ఆరాధిస్తామో దేవీదేవతలు మనకు ప్రసన్నలై వారి ఆధిపత్యంలో వున్న శక్తిని మనకు  ప్రసాదిస్తారు. అంటే చదువు కొరకు సరస్వతి అమ్మవారిని, సంపదలకొరకు లక్ష్మి అమ్మవారిని అదేవిధంగా శక్తికొరకు పార్వతి తల్లిని మనం కొలవటం కద్దు

ప్రతి పురుషుని ప్రయోజకత్వంలో తన ధర్మపత్ని సహాయసహకారాలు ఉంటాయి అంతేకాదు నడిపేశక్తి కేవలం అంటే కేవలం స్త్రీమూర్తిదే అదే మనం మనదేవుళ్ల ద్వారా తెలుసుకోవచ్చు

ఇక విషయానికి వస్తే క్రియాశీలత్వము అంటే ఒక కార్యం చేయాలనే భావన భావనే మనం లక్ష్మి అమ్మవారుగా భావించవచ్చు అదెట్లాగో తెలుసుకుందాం

నీవు నీ ఇంటిని వదిలి ఏదో ఊరుకు వెళ్లి కొంతకాలం తరువాత తిరిగి వచ్చావు అప్పుడు తలుపు తీయంగానే ఇల్లు మొత్తం దుమ్ము దూళితో పేరుకొని వుంది నీ శ్రీమతి వెంటనే మీరు కాసేపు బయట వుండండి ముందు ఇల్లు ఊడుస్తాను అని అనటం పరిపాటిఇల్లు ఊడవాలి అనే భావనే క్రియాశీలత్వం దానిని అమలు చేసినతరువాతే అంటే ఊడ్చిన తరువాతే ఇల్లు పరిశుభ్రంగా వున్నది. ఇటువంటివి కోకొల్లలుగా మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అందుకే మానధర్మంలో గృహిణిని గృహలక్ష్మి అని పేర్కొన్నారు అని అనిపిస్తుంది

ఫలానా వారి అబ్బాయికి పెండ్లి అయిందిగా వాళ్ళ కోడలిని చూసావా యెట్లా ఉంటుంది అని ఒకామె అడిగితె దానికి ఆమె స్నేహితురాలు ఇచ్చే జవాబు అమ్మాయి చక్కగా వుంది సాక్షాత్తు లక్షిం దేవిలా వుంది అనటం మనం చూస్తూ ఉంటామునిజానికి ప్రపంచంలో ఎవ్వరు లక్ష్మి అమ్మవారిని చూడలేదు మరి ఎలా అలా అంటారు అంటే మనం లక్ష్మి అమ్మవారికి కొన్ని గుణాలను ఉంటాయి అని తెలుసుకున్నాము కాబట్టి అటువంటి సద్గుణాలు వున్న స్త్రీలను తల్లితో పోలుస్తూవుంటాము

ప్రతి గృహస్తు తన దైనందిక జీవితాన్ని సుఖవంతంగా గడపటానికి ఉద్యోగమో, వ్యాపారమో చేయక తప్పదు. గడియారం ముల్లులాగా పరిగెత్తక తప్పదు అందుకే లక్ష్మీదేవిలాంటి సహధర్మచారిణి లభించి ప్రతి విషయంలోనూ తనక్రియాశీలకత్వాన్ని చూపెడితే పురుషుడు పురుషార్ధాలను సాధించగలడు

భర్త ఏదైనా కార్యార్థిగా వెళుతుంటే తన కార్యం సఫలంకావాలనే ఆపేక్షతో పత్నిని ఎదురు రమ్మనటం మన సాంప్రదాయం దానికి అర్ధం తన భార్య లక్ష్మి దేవిలాగా చక్కగా నుదిటిన కుంకుమ దిద్దుకొని, కురుల పువ్వులు పెట్టుకొని చేతులకు గాజులు వేసుకొని మనోహారిగా ఉన్న భార్య ముఖకమలం చూసి తన కార్యోన్ముఖుడు అయితే రోజంతా మనస్సు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉండి తానూ చేసే పనిమీద మనసు లగ్నాత చేయగలడు. తత్వారా కార్యసిద్ధి కలుగుతుంది. మన సాంప్రదాయంలో స్త్రీలకు మహోన్నత స్థానాన్ని ఇచ్చారు 

యత్ర నార్యంతు పూజ్యతే, రమంతే తత్ర దేవత..' అంటే ఎక్కడ నారీ మణులు పూజింప బడుతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని.. భారత్లో పురాణాలు, ధర్మ శాస్త్రాలు చెప్పాయి. మన భారతీయ సంస్కృతీ స్త్రీ శక్తిని వేదకాలంలోనే పేర్కొన్నాయి. పురుషుని అభివృద్ధికి స్త్రీమూర్తే కారణం అదేవిధంగా స్త్రీ పౌభాగ్యానికి పురుషుడు కారకుడు

లక్ష్మి నివాసాలు 

గురు భక్తి .దేవ భక్తి .మాతాపితృ భక్తి .కలవారిలో లక్ష్మీ కటాక్షం ఉంటుంది.
అతి నిద్ర లేని వారిలో. ఉత్సాహం .చురుకుదనం. ఉన్నవారిలో లక్ష్మీకళ ఉంటుంది.
ముగ్గు. పసుపు .కుంకుమ. పువ్వులు .పళ్ళు .పాలు లక్ష్మి స్థానాలు.
దీపం .ధూపం .మంగళ ద్రవ్యాలు . తల్లికి నివాసాలు.
పాత్ర శుద్ధి శుభ్ర వస్త్రధారణ కలిగిన ఇల్లు అమ్మవారి నివాస స్థలం.
బుద్ధి .ధైర్యం .నీతి .శ్రర్థ.గౌరవించే స్వభావం .శాంతి. లక్ష్మి ని పెంచే శక్తులు.
సంతృప్తి లక్ష్మికి ప్రధాన నివాసం.

దీనిని పట్టి మనకు అర్ధం అయ్యేది ఏమిటంటే లక్మి దేవి మంగళకారిని సకల శుభాలకు కారణం లక్షి అమ్మ వారు   తల్లి అంటే చురుకుదనం, ఉత్సాహం, సత్వగుణం, శాంత స్వభావం, నిజాయితీ, ధర్మాచరణ ఇటువంటి గుణాలు అంటే ఇవ్వన్నీ కూడా క్రియాశీలకత్వమే కానీ వేఱొక్కటి కాదు. భార్గవశర్మ చెప్పేది ఏమిటంటే ప్రతి వారు క్రియాశీలకత్వాన్ని పెంపొందించుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించగలరు.  

ఇట్లు

మీ 

చేరువేల భార్గవ శర్మ