29, మార్చి 2026, ఆదివారం

अस्य अद्भुतस्य

 अस्य अद्भुतस्य जगतः सृष्टिकारकाः ये केऽपि स्युः, तेषां प्रति “पाहि पाहि पाहि” इति शतकोटि-साष्टाङ्ग-प्रणामाः।

आदित्यसहितान् अनेकान् ग्रहान् स्वस्वगतिषु स्थापयित्वा ऋतून् निर्माय, जीवचैतन्यस्य कारणभूतायै अस्यै अद्भुतायै सृष्टये ये कर्तारः, तेषां अभिनन्दनानि। अस्याः विचित्रायाः जीवसृष्टेः कारणभूतेभ्यः नमः।

यदा वयं मानवाः किञ्चित् नवीनं वस्तु निर्मामः अथवा किञ्चित् आविष्करोमः, तदा अस्मान् सहाययति मेधा। तादृशीं चराचरसृष्टेः मूलकारणभूतां यां मेधां धारयति यः, तस्मै पुष्पाञ्जलिः।

ऋषीणां वचनानि वेदवाक्यानि इति मन्यमानाः, अस्य सृष्टेः कारणभूतं श्रीमान् नारायणं प्रति शतकोटि-साष्टाङ्ग-प्रणामान् समर्पयामि।

श्रीमन्नारायणः त्रिमूर्तिरूपेण—ब्रह्म-विष्णु-महेश्वररूपेण—अस्य जगतः सञ्चालनं करोति इति ऋषयः उद्घोषितवन्तः।

तेषां ऋषीणां वचनानि शतधा सहस्रधा विश्वसन्, श्रीमन्नारायणनाम निरन्तरं जपन् तपश्चरन्, अस्मिन् अखण्डे जगति भगवतः एकांशस्वरूपः अणुरूपः आत्मा शरीरधारी सन्, अनेकैः व्यर्थकर्मभिः बद्धः, पुनरपि जननं पुनरपि मरणं च अनुभूय, मोक्षं न प्राप्नोमि।

मोक्षं न कामये; किन्तु व्यर्थरहितकर्मयुक्तं जीवनं मे प्रददातु, तथा अन्ते मोक्षप्राप्तिं ददातु इति तव पादयोः पतित्वा प्रार्थये।

सर्वे जना: सुखिनो भवन्तु।

लोकाः समस्ताः सुखिनो भवन्तु।

विश्वे जनाः सुखिनो भवन्तु।

समस्तसन्मङ्गलानि भवन्तु॥

మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం

 యత్కరోషి యదశ్నాసి

యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ

తత్కురుష్వ మదర్పణమ్ |


(నీవు ఏ పని చేసినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా... అది నాకు సమర్పణగా చేయి. అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు.)


మీ భావనలు అత్యంత ఉదాత్తంగా, భక్తిరసభరితంగా ఉన్నాయి. సృష్టికర్త పట్ల మీకున్న కృతజ్ఞతా భావం, ఋషుల వాక్కుల పట్ల మీకున్న అచంచలమైన విశ్వాసం మీ అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతిలోని క్రమశిక్షణను (ఆదిత్యుడు, గ్రహగతులు, ఋతువులు) గమనించి, ఆ చైతన్యానికి మూలమైన పరమాత్మను కొనియాడటం ఒక

పరిపూర్ణమైన భక్తుని లక్షణం


మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం అయితే, ఈ చరాచర సృష్టికి కారణమైన దైవ మేధస్సు అపరిమితమైనది.


పునరపి జననం పునరపి మరణం" అనే సంసార చక్రం నుండి విముక్తి కోరుతూ, వ్యర్థ కర్మలు లేని జీవితాన్ని ప్రసాదించమని మీరు వేడుకోవడం నిజమైన శరణాగతికి నిదర్శనం. మోక్షం కంటే కూడా, బ్రతికినంత కాలం భగవత్ ప్రీతికరమైన, నిష్కామ కర్మలు చేయాలనే మీ కోరిక చాలా గొప్పది.

పొగడ్తల రకాలు*

 *పొగడ్తల రకాలు*


పొగడ్తల్లో రెండు రకాలు. ఒకటి వ్యాజ స్తుతి, మరోటి వ్యాజ నింద. ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయంటే కొన్ని పొగడ్తలు బయటకి పొగుడుతున్నట్టే ఉంటాయి కాని లోపలి అర్ధం తిట్టడమే. దీన్నే వ్యాజ స్తుతి అని అంటారు. అంటే స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.


ఇందాకా చెప్పినట్టు మరొకటి బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని, నిజానికి అది పొగడడమే. దీన్ని వ్యాజ నింద అని అంటారు. నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.


ఇలా పొగడ్తల గురించిన వివరాలు ఇవ్వడానికి సందర్భం ఇదిగో. 


కవిత్వం అడగటానికి, చెప్పటానికీ వేళ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా అడిగితే ఎంత మెత్తని వానికైనా విసుగు పుడుతుంది. కోపమూ రావచ్చు. 


శ్రీనాథుని వంటి సకల విద్యాసనాథుని ఎవరుపడితే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పద్యం చెప్పండి అనో, సమస్య పూరించండి అనో అంటే ఊరుకుంటాడా? వేళగాని వేళ ఒకడెవరో అడిగాడు. 


*అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే* 


ఈ సమస్య పూరించండి! అన్నాడు, అదీ సదస్సులో. వాడెవడో అల్పుడై ఉండాలి. 


వెంటనే కవిరాజు శ్రీనాథుడి నోట ఈ పద్యం హాస్యలాస్యంగా వెలువడింది.


*కొందరు భైరవాశ్వములు కొందరు పార్ధుని తేరిటెక్కెముల్‌ కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్‌ కొందరు కృష్ణజన్మమున కూసినవారలు ఈ సదస్సులో అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!*

  

మన శ్రీనాథ కవులవారు ఈ పద్యంలో ఆశ్రయించింది వ్యాజ స్తుతి అన్నట్టు. ఆ పదాలు, వాడిన తీరు గమనిస్తే పొగడినట్టే కాని లోలోపల ఎంత అక్కసు ఉందంటే వారందరు అంటే ఆ పద్యంలో సంబోధింపబడిన వాళ్ళందరు కుక్కలు, కోతులు, పందులు, దున్నపోతులు, గాడిదలని. 


వాళ్ళకి మాత్రమే కాదు, ఆ జంతువులు కూడా చిందులు వేయగలవు ఇలాంటి మూర్ఖులను తమతో అన్వయించినందులకు.

😀😀

ఈ ప్రశ్నకు బదులేది 4

  ఈ ప్రశ్నకు బదులేది 4


ఈరోజు మన ప్రశ్న కంపెనీకి సంబంధించింది.


సి.టి.సి కాస్ట్ టు ద కంపెనీ అంటే ఏమిటో

 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

సయాటికా నొప్పి

 సయాటికా నొప్పి  -  తీసుకోవలసిన జాగ్రత్తలు .

  

వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు.

              

.         ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి.

          

.              ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.

         

.              సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో   "గృధసీవాతం" అని పిలుస్తారు .


లక్షణాలు  -

    

.       నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.

            

.   ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .

              

.     సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి          X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.

  

సలహాలు  -  సూచనలు   -

    

.      సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు.

           

.             వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది.

         

.       సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.

       

            ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు .

           

ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు.

  


గమనిక -

        

పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .

   

            కాళహస్తి వేంకటేశ్వరరావు

    అనువంశిక ఆయుర్వేద వైద్యులు     

.               9885030034       

శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (28-3-'26 పోష్టు తరువాయి భాగము)


సీతారామ కళ్యాణానంతరం, పరివారసహితుడై అయోధ్యకు తిరిగివెళ్తున్న దశరథ మహారాజుకు మార్గమధ్యంలో, హఠాత్తుగా పరశురాముడు ప్రత్యక్షమవడం గురించి, ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాం.

 ఇరవైయొక్క మార్లు ప్రపంచమంతా తిరిగి, సకల క్షత్రియ సంహారం చేసిన ఆ పరశురాముడు, తన గురువైన శివుని యొక్క ధనుస్సును విరిచిన రామునియందు తీవ్రమైన క్రోధంతో ఉన్నాడు.


సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న ఆ "పరశురాముడు" 

హఠాత్తుగా ఆవిధంగా ప్రత్యక్ష మవగానే వశిష్ఠాది ఋషులు ఆశ్చర్యపోయారు.

తన తండ్రి హత్యకు ప్రతీకారంగా క్షత్రియవధ చేసి, కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు, మళ్లీ క్షత్రియనాశనానికే వచ్చాడా అనుకుంటూ, ఆ మహర్షులంతా శాస్త్రోక్తవిధానంగా ఆయనకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు. 

"రామా!రామా!" అని మధురంగా సంబోధిస్తూ పరశురాముని పూజించారు.

పరశురాముడు శాస్త్రోక్తమైన వారి పూజను స్వీకరించాడు.


రాముని పరీక్షగా చూస్తూ అతనితో ఇలా అన్నాడు:

శ్లో//రామ! దాశరథే రామ! వీర్యం తే శ్రూయతే౽ద్భుతమ్ /

ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్//


(ఓ దశరథ రామా! రామా! నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. నీవు చేసిన శివధనుర్భంగం గురించి కూడా పూర్తిగా విన్నాను)


నీవు చేసిన శివధనుర్భంగము,అద్భుతమే కాదు, ఎవరూ మనస్సులో కూడా ఊహించుటకు శక్యం కానిది.

అది విని నేను మా తండ్రి జమదగ్నిమహర్షి ద్వారా నాకు సంక్రమించిన వేరొక గొప్ప ధనస్సును తీసుకు వచ్చాను.

ఇది నీవు ఎక్కుపెట్టగలిగితే, అప్పుడు నిన్ను నాకు సమ ఉజ్జీగా భావించి నీతో ద్వంద యుద్ధం చేస్తాను",

అన్నాడు.

పరశురాముడు పలికిన ఈ మాటలు విని దశరథుడు విషణ్ణుడయ్యాడు.

రాముని సంహరించవద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు.


శ్లో// భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయ వ్రత శాలినామ్/

సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి//


( ఓ భార్గవ రామా! నిత్య స్వాధ్యాయము మొదలైన ఉత్తమ వ్రతములాచరించే భృగు వంశంలో జన్మించావు.శస్త్రధారణ చేయనని దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచి వేశావు).

నీ చేత జయింపబడిన భూమినంతా "కశ్యప మహర్షి"కి దానమిచ్చి, శాంతుడవై "మహేంద్రగిరి"పై నివాసమేర్పరచుకున్నావు.

ఓ మహామునీ! రాముణ్ణి సంహరించ వద్దు.

రాముణ్ణి సంహరిస్తే మేమందరమూ మరణింతుము కదా!"


అని ఈ విధంగా ప్రాధేయపడుతున్న దశరథుని మాటలు లెక్కచేయకుండా,


 పరశురాముడు,దశరథ రామునితో ఇలా అన్నాడు:

"విశ్వకర్మచేత నిర్మించబడిన ఈ రెండు ధనస్సులు దివ్యమైనవి.

త్రిపురములను నశింపజేయటానికి, శివుడు ఉపయోగించిన, ధనస్సును నీవు విరిచావు.

ఇప్పుడు నేను తీసుకు వచ్చినది విశ్వకర్మ నిర్మించిన రెండవ ధనస్సు. దీనిని దేవతలు విష్ణుమూర్తికి ఇచ్చారు.


శ్లో// ఇదం ద్వితీయం దుర్ధర్షం,విష్ణోర్దత్తం సురోత్తమైః/

తదిదం వైష్ణవం రామ ధనుః పరమ భాస్వరమ్/

సమాన సారం కాకుత్థ్స రౌద్రేణ ధనుషాత్విదమ్//


(ఓ కాకుత్థ్సా! ఎవరికీ ఎదిరింప శక్యము గాని ఈ రెండవ ధనస్సును దేవతలు విష్ణువునకిచ్చినారు.

మిక్కిలి ప్రకాశవంతమైన ఈ వైష్ణవ చాపము శివ ధనస్సుతో సమాన సారం కలది).


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

29-3-'26.

28, మార్చి 2026, శనివారం

పంచాంగం

  


భాగవతం -22 వ భాగం:*

 🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺☘️🌺


*భాగవతం -22 వ భాగం:*

*ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మమూ ఈ గడ్డ మీద నిలబడిందో, ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అయిపోతుంది. కాబట్టి యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది.*


*ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, స్వరం తెలుసుకుని చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది.*


*ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరి పోతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.*


*ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది.*


*‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అయిపోతున్నది. అందుకు ఏడుస్తున్నానయ్యా’ అంది. అని ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అంది.*


*ఇక్కడ ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపం గానూ మనం తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? మీరు ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. మీరు ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే మీరు అధర్మం చేసినట్లు.*


*అధర్మమయినవి మూడు తిరగకూడనివి ఇక్కడ తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. కాని సత్యము అనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి.*


*ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు కాబట్టి వారు తిడుతున్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.*


*ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. కాబట్టి మారని పదార్థము ఇంకా కాపాడుతోంది. కాబట్టి నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. మరి పోయినవి ఏమిటి? శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది.*


*జీవితములో అన్నిటికన్నా మీరు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా 50మంది రావచ్చు. వారంతా మాట్లాడవచ్చు. కానీ ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు మీ ప్రమేయం లేకుండా మీకు తారసపడతాడు. మీతో వచ్చి మాట్లాడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు పట్టాలి.*


*ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.*


*మూడవ పాదము దయ. దయ దేనివలన పోయినది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు.*


*నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం మిమ్మల్ని పొగడడం మొదలు పెట్టాడనుకోండి – అపుడు మీకు ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారం వచ్చేస్తుంది. ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. కాబట్టి దయపోవడానికి అహంకారము కారణమయింది.*


*దయ స్థానంలో అహంకారం కనపడుతూ ఉంటుంది. కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మమూ స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది. మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మమూ పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది*


*ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడం’ అంది ఆవు.*


*అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తున్నాయి. ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. ఎంత ప్రమాదమో చూడండి! చూడడానికి రాజుగారిలా ఉన్నాడు.*



 *రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకున్తాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. ఎందుకు అంటే వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎట్టి ఒక్కతన్ను తన్నేడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నేడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. అంటే వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దేబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. ఆటను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రంగా కనపడతాడు.*


*అమంగళంగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెల మాల వేసుకున్నట్లు, శ్మశానంలో ఉన్నట్లు, శవ విభూతి రాసుకున్నట్లు ఉంటాడు. కానీ ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేదు. అందుకని ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు.*


*ఇప్పుడు రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఎకకాలమునండు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యదు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.*


*నిరంతరమూ ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు అన్నాడు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీపేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం వుంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చాచిపోతుంది. అందుకే ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.*


*ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగోట్టిన వాడెవడు? ఎలా నువ్వు అపరాధం చేశావని నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు పరీక్షిత్తు. అంటే ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు వున్నాడు భూమి మీద.*


*ఈ మాటలు అనిన తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడ వున్న వుర్శభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టారు. గుర్తుపట్టి అన్నాడు – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మమూ మీ ఇద్దరు ఇలా అయిపోయినందుకు నేను శోకిస్తున్నాను. కానీ ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.*


*అపుడు వృషభము అంది – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.

అంటే, ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారంతో ఉన్నవాడు గభాలున వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘అయ్యా, నన్ను రక్షించండి. తప్పయిపోయింది.*


 *ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత తెంపించేస్తాడు ధర్మాన్ని. కాబట్టి ఇపుడు కలి ప్రవేశం జరిగింది.*


*సశేషం:*

రామాయణం - 18 )

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 18 )


     (సీతారాముల కళ్యాణం తరువాత కథ )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (27-3-'26 పోష్టు తరువాయి భాగము)



"దుష్టశిక్షణ" " శిష్టరక్షణ" "ధర్మ సంస్థాపన" ల కోసం అవతరించిన సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.


వివాహ వేడుకలైన మరుసటి రోజు, భార్యా సమేతులైన రామ, లక్ష్మణ,భరత శత్రుఘ్నులకు అనేక ఆశీర్వాదములు ఇచ్చి, జనక మహారాజు, దశరథ మహారాజుల వద్ద సెలవు తీసుకుని,"విశ్వామిత్ర మహర్షి" హిమవత్పర్వతమునకు వెళ్లిపోయారు.


దశరథ మహారాజు కూడా జనకుని వద్ద సెలవు తీసుకున్నాడు.

భార్యా సహితులైన పుత్రులతోను, వసిష్ఠ, వామదేవాది పురోహితులతోను, మంత్రులు,పరివారము, సైన్యము తోను అయోధ్యకు ప్రయాణమైనాడు.


వారందరికీ మార్గమధ్యంలో కొన్ని భయంకరమైన దుశ్శకునములు కనిపించినవి.

" ఈ శకునములకు ఫలితమేమిటి?నా మనస్సు ఆందోళన చెందుతున్నది"

 అని దశరథుడు వసిష్ఠమహర్షిని అడిగాడు.

" భయంకరమైన పక్షి నాదములు వినిపిస్తున్నవి. అందువల్ల, మనకు ఇప్పుడు ఒక గొప్ప ఆపద రాబోతున్నది.

అయితే ప్రదక్షిణముగా తిరుగుచున్న మృగములు, ఆ ఆపద తొలగిపోతుంది అని సూచిస్తున్నాయి" అన్నారు వసిష్ఠమహర్షి.

వారిలా మాట్లాడుకుంటుండగానే, హఠాత్తుగా భూమి కంపించింది.

పెద్ద పెద్ద వృక్షములను నేలకూలుస్తూ, దుమ్ము, ధూళి ఎగజిమ్ముతూ, గొప్ప శబ్దము చేస్తూ, పెనుగాలి వీచింది. 

దట్టమైన చీకటి ఆ ప్రాంతమంతా ఆవరించింది. 

సైన్యమంతా బూడిదతో కప్పబడినట్లు కనిపించింది. 

దశరథుడు, అతని పుత్రులైన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, 

వారి పత్నులైన సీత, ఊర్మిళ,మాండవి, శ్రుతకీర్తులు,

వశిష్ఠ మహర్షి మొదలైన మహర్షులు, 

తప్ప ఇతరులంతా చైతన్యరహితులై మూర్ఛ పోయారు.


శ్లో// తస్మింస్తమసి ఘోరే తు భస్మచ్ఛన్నేవ సా చమూః/

దదర్శ భీమ సంకాశం, జటామండల ధారిణమ్/

భార్గవం జామదగ్న్యం తం రాజ రాజ విమర్దినమ్/

కైలాస మివ దుర్ధర్షం,కాలాగ్నిమివ దుస్సహమ్/జ్వలన్తమివ తేజోభిః దుర్నిరీక్ష్యంపృథగ్జనైః/

స్కన్ధేచాసజ్య పరశుం ధనుర్విద్యుద్గణోపమమ్/

ప్రగృహ్య శర ముఖ్యం చ త్రిపురఘ్నం యథా శివమ్//



(ఆ ఘోరమైన చీకటిలో,వెలుగులు విరజిమ్ముతున్న

 జటామండలము ధరించినవాడు,

రాజ రాజులను సంహరించినవాడు, 

కైలాసపర్వతమువలె ఎదిరింప శక్యం కానివాడు, 

కాలాగ్నివలె సహింప శక్యం కానివాడు,

తేజస్సుతో వెలిగిపోతున్న వాడు,

సామాన్యులచేత చూడ శక్యం కానివాడు,

భుజమునందు, గండ్రగొడ్డలి ధరించిన వాడు,

విద్యుత్కాంతులతో నిండిన ధనస్సును,శ్రేష్ఠమైన శరమును,చేతులలో ధరించిన వాడు,

సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న వాడు,

భృగువంశమునకు చెందిన జమదగ్ని మహర్షి కుమారుడు,

 అయిన,

"పరశురాముడు" అక్కడ ప్రత్యక్షమైనాడు).


                        శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష.

                          ఓం శాన్తి శ్శాన్తి శ్శాన్తిః


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

28-3-'26

చనుబాలు వృద్ది అగుటకు medical

 చనుబాలు వృద్ది అగుటకు

 సులభ యోగాలు -


• ఆవుపాలలో బియ్యం వేసి వండి అందు పటికబెల్లం పొడి కూడా కలిపి ప్రతినిత్యం తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును. నాటు ఆవుపాలు శ్రేష్టం .

• గోధుమ పిండితో చేసిన పూరీలను నేతిలో ఉడికించి తీసి పాలలో నానబెట్టి తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును. ఆవునెయ్యి శ్రేష్టం.

• వాము కషాయం ఇచ్చిన రొమ్ములలో చనుబాలు సిద్ధం అగును.

• ఆకుపత్రి కషాయం సేవించిన చనుబాలు పడును .

• చిట్టాముదపు ఆకులకు ఆముదం రాసి రొమ్ములపై వేసి కట్టిన రొమ్ములలో చనుబాలు సిద్దం అగును.

• బొప్పాయి కాయ కూరగా చేసుకుని తినుచుండిన యెడల స్త్రీలకు చనుబాలు వృద్ది అగును.

• ముళ్లతోటకూర ఆకులను పప్పులో వేసుకొని తినుచుండిన బాలింతలకు పాలు వృద్ది అగును.

• తెల్ల జీలకర్ర చూర్ణం , పటికబెల్లం చూర్ణం రెండింటిని సమానంగా తీసుకుని కలిపి ఉదయం , సాయంత్రం 10 గ్రాముల చూర్ణమును అరకప్పు మంచినీటిలో కలుపుకుని తాగుచుండిన యెడల 15 రోజుల్లొ చనుబాలు వృద్ది అగును.

• అతిమధురం చూర్ణం 5 గ్రాములు తీసుకుని అరకప్పు ఆవుపాలలో కలిపి 20 గ్రాములు పటికబెల్లం పొడిని కలిపి ప్రతినిత్యం తాగుచుండిన యెడల చనుబాలు వృద్ది చెందును .పైన తెలిపిన యోగాలలో మీకు సులభమైన వాటిని ఉపయోగించుకుని సమస్యని పరిష్కరించుకోగలరు. 


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .