25, మే 2026, సోమవారం

🌹26, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

 🍁 *మంగళవారం*🍁

 *🌹26, మే, 2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*               


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*

*అధిక జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం* 


*తిథి : ఏకాదశి* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : మంగళవారం* ( భౌమవాసరే )

*నక్షత్రం  : హస్తా* పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*యోగం : సిద్ధి* రా 03.11 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : వణజి* సా 05.42 ఉపరి *భద్ర* పూర్తిగా రాత్రంతా 

*సాధారణ శుభ సమయాలు:*

*ప 12.00 - 01.00 సా 05.00 - 06.30*     

 అమృత కాలం  : *రా 11.29 - 01.13*

 అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.31*

*వర్జ్యం    : మ 01.10 - 02.53*

*దుర్ముహూర్తం  : ఉ 08.10 - 09.03 రా 10.59 - 11.42* 

*రాహు కాలం  :మ 03.20- 04.57*

గుళికకాళం      : *మ 12.05 - 01.42*

యమగండం    : *ఉ 08.49 - 10.27*

సూర్యరాశి : *వృషభం*         

చంద్రరాశి : *కన్య*

సూర్యోదయం :*ఉ 05.42* 

సూర్యాస్తమయం :*సా 06.45*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం      :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం   :*10.47 - 01.23*

అపరాహ్న కాలం  :*మ 01.23- 03.59*

*ఆబ్ధికం తిధి  :అధిక జ్యేష్ట శుద్ధ ఏకాదశి*

సాయంకాలం  :*సా 03.59 - 06.35*

ప్రదోష కాలం     :*సా 06.35 - 08.47*

రాత్రి కాలం        :*రా 08.47 - 11.42*

నిశీధి కాలం       :*రా 11.42 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

■■■■■■■■■■■■■■■■■■■■

            *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    *🍁హనుమకృత🍁* 

*🍁సీతారామ స్తోత్రమ్🍁*

       *మత్త మాతంగ గమనం* 

    *మత్త హంస వధూ గతాం !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><<>><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

   🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *సోమవారం 25 మే 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*                                       

              *99వ భాగం* 


      *శ్రీకృష్ణావతారము2*


           *శ్రీకృష్ణ జననం*..```


భూదేవికి, బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు అభయం ఇచ్చి పంపిన నారాయణుడు యోగమాయా దేవిని తలచాడు. యోగమాయ రాగానే “దేవీ! నేను భూలోకంలో వసుదేవుని పత్ని అయిన దేవకి గర్భాన అష్టమ పుత్రుడనై జన్మించాలని సంకల్పించాను. దానికి ముందు నీవు చేయవలసిన కార్యాలు ఉన్నాయి. చెబుతాను! విని ఆచరించు..


పాతాళ లోకంలో ‘తండ్రి చేతిలో మరణించాలని’ హిరణ్యకశిపుడి శాపంతో శాపగ్రస్తులైన కాలనేమి ఆరుగురు పుత్రులుగా జన్మించిన ఆత్మలను దేవకి గర్భంలో ఒకరి తరువాత ఒకరిని ప్రవేశపెట్టుము. ఈ జన్మలో వారు కంసుడిగా జన్మించిన కాలనేమి చేతిలో చంపబడి పుణ్యలోకాలు పొందుతారు. తరువాత సప్తమ పుత్రుడిగా ఆదిశేషుడు తన అంశను ప్రవేశపెడతాడు. ఆ సప్తమ గర్భపిండాన్ని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టుము. ఆదిశేషుడు రోహిణికి సంకర్షణుడు అనే నామంతో జన్మిస్తాడు.


కంసుడు దేవకి సప్తమ గర్భం విచ్ఛిన్నం అయ్యింది అని భావించి అష్టమ గర్భము కోసం ఎదురు చూస్తాడు. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశించినప్పుడు నీవు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు! ఇక్కడ నేను పుత్రుడుగా, అక్కడ నీవు పుత్రికగా ఒకే సమయంలో జన్మించుదాం. వసుదేవుడు నా ఆదేశం పాటించి నన్ను యశోద దగ్గర ఉంచి నిన్ను దేవకి వద్దకు తీసుకు వస్తాడు.


నిన్ను కంసుడు చంపబోయే సమయంలో ఆకాశంలో యోగమాయగా కంసుని హెచ్చరించి అదృశ్యం అవ్వాలి. ఇక నుంచి భక్తజనులు నిన్ను దుర్గ అంబిక కాళి నామాలతో పాటు హరిసోదరిగా కీర్తిస్తారు" అని ఉపదేశించాడు.


యోగమాయ శ్రీహరిని స్తుతించి తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యింది. దేవకి గర్భంలో ప్రధమ పుత్రుడిని ప్రవేశపెట్టింది. పుట్టిన తరువాత వసుదేవుడు ప్రమాణం చేసినట్టు శిశువుని తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు. కంసుడు శిశువని చూడకుండా నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అలాగే తరువాత ఐదుగురు మగ బిడ్డలు పుట్టడం, వసుదేవుడు కంసునికి అప్పగించడం, కంసుడు సంహరించడం వరుసగా జరిగిపోయింది.


దేవకి ఏడవ సారి గర్భం ధరించింది. ఆరుగురు శిశువుల సంహారం విన్న రోహిణి ఒకసారి నందుని వెంట వచ్చి రహస్యంగా రాత్రి పూట దేవకి వసుదేవులను కలసింది. ఏకాంతంగా కొంత సమయం వసుదేవునితో గడిపి గోకులం వెళ్ళిపోయింది. యోగమాయ విష్ణువు ఆదేశం పాటించి దేవకి గర్భంలో ఆకారం దాలుస్తున్న ఆదేశేషుడి అంశను దేవకి గర్భం నుంచి తీసి గోకులంలో రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టింది. దేవకి సప్తమ గర్భము పోయింది అని కంసుడు భావించాడు. అక్కడ గోకులంలో రోహిణి గర్భవతి అయ్యింది.


దేవకికి పుట్టబోయేవాడు అశరీరవాణి చెప్పినట్టు తనకు మృత్యువు నిచ్చే అష్టమ గర్భుడు అవ్వటంతో కంసుడు కారాగారం చుట్టూ భద్రత పెంచాడు. తనకు నమ్మకస్తులైన రాక్షస వంశజులను కాపాలాగా పెట్టాడు. దేవకి అష్టమ గర్భంలో మహావిష్ణువు అంశ, యశోద గర్భంలో యోగమాయ అంశ ఒకేసారి ప్రవేశించాయి. దేవకి అష్టమ గర్భం దాల్చింది అని తెలియగానే కంసునికి నిద్ర ఆహారాలు పోయాయి. అష్టమ పుత్రుడు పుట్టే క్షణం కోసం ఎదురు చూడసాగాడు.


కంసుడే కాదు, దేవతలు, మహర్షులు, కిన్నెర కింపురుషులు మొదలైనవారు ఊర్ద్వలోకాలవారితో పాటు సమస్త విశ్వము దేవకి ఎనిమిదవ పుత్రుని జననం కోసం ఎదురు చూడసాగింది. అందరు ఎదురు చూసే శుభ క్షణము రానే వచ్చింది. శ్రావణ బహుళ అష్టమి తిథి, అర్థరాత్రి, కృత్తికా నక్షత్రం. జగత్తుతో పాటు కారాగారం కాపాలా కాసేవారు నిద్రదేవి ఒడిలోకి వెళ్లి పోయారు.


ఆకాశంలో దేవతాగణాలు స్తుతిస్తుండగా, దేవదుందుభులు మ్రోగుతుండగా, గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తుండగా, ఊర్ధ్వలోకాల వారు పూలు కురిపించడానికి సిద్దంగా ఉండగా దేవకీదేవికి సుఖ ప్రసవమైంది. చతుర్భుజుడిగా మహావిష్ణువు దేవకి గర్భం నుంచి శిశువుగా జన్మించాడు.


దేవకి వసుదేవులు జన్మించి అఖండమైన తేజస్సుతో చతుర్భుజుడిగా అవతరించిన కుమారుని చూసి ఆశ్చర్యానందాలు చెందారు. మహావిష్ణువు తన కుమారునిగా జన్మించాడని భావించారు. వారనుకున్నట్టే శ్రీమహావిష్ణువు శంఖచక్ర గదాపద్మాలతో వారి ముందు సాక్షాత్కరించాడు. 


వారిరువురిని ప్రసన్న వదనంతో చూసి “దేవకి వసుదేవులారా! పూర్వజన్మలో మీరు తపస్సు చేసి నన్ను కుమారునిగా పొందాలని కోరుకున్నారు. అందుకే ఈ జన్మలో పుత్రునిగా జన్మించాను. నా అవతార రహస్యం ప్రస్తుతం మీరు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచండి” అని వసుదేవుని వంక చూసి..

“వసుదేవా! నీవు అత్యంత రహస్యంగా చేయవలసిన కార్యం ఉంది. నన్ను గోకులంలో యశోద చెంతకు చేర్చి, అక్కడ యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకు వచ్చి దేవకి వద్ద పడుకోబెట్టుము. యోగమాయ స్వరూపమైన ఆ శిశువుకు ఏమీ జరగదు. భయపడకండి. నేను గోకులంలో పెరిగి సమయం వచ్చినప్పుడు మధుర వచ్చి కంసుని సంహరించి మిమ్మల్ని విడిపిస్తాను” అని చేయవలసిన కార్యం చెప్పాడు. 


దేవకి వసుదేవులు మహావిష్ణువుకి ప్రణమిల్లి నమస్కరించారు. మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. పుట్టిన పసి బాలుని చతుర్భుజాలు మాయమై మానవబాలునిగా ద్విభుజుడు అయ్యాడు.


వసుదేవుని సంకెళ్లు, కారాగారం తాళాలు, తలుపులు తెరచుకున్నాయి. కాపాలావాళ్ళు అందరు గాఢనిద్రలో ఉన్నారు. గాఢాంధకారంలో జగత్తు అంతా మునిగి ఉంది.

దేవకీదేవి తన కుమారుడిని ముద్దాడి, హృదయానికి హత్తుకుని వసుదేవునికి కన్నీళ్ళ స్రవిస్తుంటే ఇచ్చింది. వసుదేవుడు వెదురు తట్టలో పసిబిడ్డను జాగ్రతగా పడుకోబెట్టి, పైన ఉత్తరీయము కప్పి తలపైకి ఎత్తుకుని గోకులానికి బయలుదేరాడు.


*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం

 


*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

      *సోమవారం 25 మే  2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*                                       

              *99వ భాగం* 


      *శ్రీకృష్ణావతారము2*


           *శ్రీకృష్ణ జననం*..```


భూదేవికి, బ్రహ్మాది దేవతలకు, మహర్షులకు అభయం ఇచ్చి పంపిన నారాయణుడు యోగమాయా దేవిని తలచాడు.  యోగమాయ రాగానే “దేవీ! నేను భూలోకంలో వసుదేవుని పత్ని అయిన దేవకి గర్భాన అష్టమ పుత్రుడనై జన్మించాలని సంకల్పించాను. దానికి ముందు నీవు చేయవలసిన కార్యాలు ఉన్నాయి. చెబుతాను! విని ఆచరించు..


పాతాళ లోకంలో  ‘తండ్రి చేతిలో మరణించాలని’ హిరణ్యకశిపుడి శాపంతో శాపగ్రస్తులైన కాలనేమి ఆరుగురు పుత్రులుగా జన్మించిన ఆత్మలను దేవకి గర్భంలో ఒకరి తరువాత ఒకరిని ప్రవేశపెట్టుము. ఈ జన్మలో వారు కంసుడిగా జన్మించిన కాలనేమి చేతిలో చంపబడి పుణ్యలోకాలు పొందుతారు. తరువాత సప్తమ పుత్రుడిగా ఆదిశేషుడు తన అంశను ప్రవేశపెడతాడు. ఆ సప్తమ గర్భపిండాన్ని దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టుము.  ఆదిశేషుడు రోహిణికి సంకర్షణుడు అనే నామంతో జన్మిస్తాడు.


కంసుడు దేవకి సప్తమ గర్భం విచ్ఛిన్నం అయ్యింది అని భావించి అష్టమ గర్భము కోసం ఎదురు చూస్తాడు. నేను దేవకి అష్టమ గర్భంలో ప్రవేశించినప్పుడు నీవు నందుని భార్య యశోద గర్భంలో ప్రవేశించు! ఇక్కడ నేను పుత్రుడుగా, అక్కడ నీవు పుత్రికగా ఒకే సమయంలో జన్మించుదాం. వసుదేవుడు నా ఆదేశం పాటించి నన్ను యశోద దగ్గర ఉంచి నిన్ను దేవకి వద్దకు తీసుకు వస్తాడు.


నిన్ను కంసుడు చంపబోయే సమయంలో ఆకాశంలో యోగమాయగా కంసుని హెచ్చరించి అదృశ్యం అవ్వాలి. ఇక నుంచి భక్తజనులు నిన్ను దుర్గ అంబిక కాళి నామాలతో పాటు హరిసోదరిగా కీర్తిస్తారు" అని ఉపదేశించాడు.


యోగమాయ శ్రీహరిని స్తుతించి తన కర్తవ్య నిర్వహణలో నిమగ్నమయ్యింది.  దేవకి గర్భంలో ప్రధమ పుత్రుడిని ప్రవేశపెట్టింది.  పుట్టిన తరువాత వసుదేవుడు ప్రమాణం చేసినట్టు శిశువుని తీసుకెళ్లి కంసుడికి అప్పగించాడు. కంసుడు శిశువని చూడకుండా నిర్దాక్షిణ్యంగా సంహరించాడు. అలాగే తరువాత ఐదుగురు మగ బిడ్డలు పుట్టడం, వసుదేవుడు కంసునికి అప్పగించడం, కంసుడు సంహరించడం వరుసగా జరిగిపోయింది.


దేవకి ఏడవ సారి గర్భం ధరించింది. ఆరుగురు శిశువుల సంహారం విన్న  రోహిణి ఒకసారి నందుని వెంట వచ్చి రహస్యంగా రాత్రి పూట దేవకి వసుదేవులను కలసింది. ఏకాంతంగా కొంత సమయం వసుదేవునితో గడిపి గోకులం వెళ్ళిపోయింది.  యోగమాయ విష్ణువు ఆదేశం పాటించి దేవకి గర్భంలో ఆకారం దాలుస్తున్న ఆదేశేషుడి అంశను దేవకి గర్భం నుంచి తీసి గోకులంలో రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టింది.  దేవకి సప్తమ గర్భము పోయింది అని కంసుడు భావించాడు. అక్కడ గోకులంలో రోహిణి గర్భవతి అయ్యింది.


దేవకికి పుట్టబోయేవాడు అశరీరవాణి చెప్పినట్టు తనకు మృత్యువు నిచ్చే అష్టమ గర్భుడు అవ్వటంతో కంసుడు కారాగారం చుట్టూ భద్రత పెంచాడు. తనకు నమ్మకస్తులైన రాక్షస వంశజులను కాపాలాగా పెట్టాడు. దేవకి అష్టమ గర్భంలో మహావిష్ణువు అంశ, యశోద గర్భంలో యోగమాయ అంశ ఒకేసారి ప్రవేశించాయి. దేవకి అష్టమ గర్భం దాల్చింది అని తెలియగానే కంసునికి నిద్ర ఆహారాలు పోయాయి.  అష్టమ పుత్రుడు పుట్టే క్షణం కోసం ఎదురు చూడసాగాడు.


కంసుడే కాదు, దేవతలు, మహర్షులు, కిన్నెర కింపురుషులు మొదలైనవారు ఊర్ద్వలోకాలవారితో పాటు  సమస్త విశ్వము దేవకి ఎనిమిదవ పుత్రుని జననం కోసం ఎదురు చూడసాగింది. అందరు ఎదురు చూసే శుభ క్షణము రానే వచ్చింది. శ్రావణ బహుళ అష్టమి తిథి, అర్థరాత్రి, కృత్తికా నక్షత్రం. జగత్తుతో పాటు కారాగారం కాపాలా కాసేవారు నిద్రదేవి ఒడిలోకి వెళ్లి పోయారు.


ఆకాశంలో దేవతాగణాలు స్తుతిస్తుండగా, దేవదుందుభులు మ్రోగుతుండగా, గంధర్వులు గానం చేస్తుండగా, అప్సరసలు నాట్యం చేస్తుండగా, ఊర్ధ్వలోకాల వారు పూలు కురిపించడానికి సిద్దంగా ఉండగా దేవకీదేవికి సుఖ ప్రసవమైంది. చతుర్భుజుడిగా మహావిష్ణువు దేవకి గర్భం నుంచి శిశువుగా జన్మించాడు.


దేవకి వసుదేవులు జన్మించి అఖండమైన తేజస్సుతో చతుర్భుజుడిగా అవతరించిన కుమారుని చూసి ఆశ్చర్యానందాలు చెందారు. మహావిష్ణువు తన కుమారునిగా జన్మించాడని భావించారు. వారనుకున్నట్టే శ్రీమహావిష్ణువు శంఖచక్ర గదాపద్మాలతో  వారి ముందు సాక్షాత్కరించాడు. 


వారిరువురిని ప్రసన్న వదనంతో చూసి “దేవకి వసుదేవులారా! పూర్వజన్మలో మీరు తపస్సు చేసి నన్ను కుమారునిగా పొందాలని కోరుకున్నారు. అందుకే ఈ జన్మలో పుత్రునిగా జన్మించాను. నా అవతార రహస్యం ప్రస్తుతం మీరు ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచండి”  అని వసుదేవుని వంక చూసి..

“వసుదేవా! నీవు అత్యంత రహస్యంగా చేయవలసిన కార్యం ఉంది.  నన్ను గోకులంలో యశోద చెంతకు చేర్చి, అక్కడ యశోదకు జన్మించిన ఆడపిల్లను తీసుకు వచ్చి దేవకి వద్ద పడుకోబెట్టుము. యోగమాయ స్వరూపమైన ఆ శిశువుకు ఏమీ జరగదు. భయపడకండి. నేను గోకులంలో పెరిగి సమయం వచ్చినప్పుడు మధుర వచ్చి కంసుని సంహరించి మిమ్మల్ని విడిపిస్తాను” అని చేయవలసిన కార్యం చెప్పాడు. 


దేవకి వసుదేవులు మహావిష్ణువుకి ప్రణమిల్లి నమస్కరించారు. మహావిష్ణువు అదృశ్యమయ్యాడు. పుట్టిన పసి బాలుని చతుర్భుజాలు మాయమై మానవబాలునిగా ద్విభుజుడు అయ్యాడు.


వసుదేవుని సంకెళ్లు, కారాగారం తాళాలు, తలుపులు తెరచుకున్నాయి. కాపాలావాళ్ళు అందరు గాఢనిద్రలో ఉన్నారు. గాఢాంధకారంలో జగత్తు అంతా మునిగి ఉంది.

దేవకీదేవి తన కుమారుడిని ముద్దాడి, హృదయానికి హత్తుకుని వసుదేవునికి కన్నీళ్ళ స్రవిస్తుంటే ఇచ్చింది.  వసుదేవుడు వెదురు తట్టలో పసిబిడ్డను జాగ్రతగా పడుకోబెట్టి, పైన ఉత్తరీయము కప్పి తలపైకి ఎత్తుకుని గోకులానికి బయలుదేరాడు.


*తరువాత కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మంత్రశాస్త్రం

 💐💐💐💐💐💐

*త్రిపుటి నుండి ఐక్యానుసంధానం వరకు — మంత్రశాస్త్రం, శ్రీవిద్యోపాసనలో అంతరార్థం*

💐💐💐💐💐💐

మంత్రశాస్త్రం, శ్రీవిద్యోపాసన వంటి విషయాలు అత్యంత గంభీరమైనవి. వాటిని సాధారణ వాదప్రతివాదాల స్థాయిలో కాకుండా, గురుపరంపర, శాస్త్రప్రామాణ్యం, ఉపాసనాధికారం, సాధకుని అంతరంగపక్వత — ఈ నాలుగు అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశీలించాలి. ఒకే శాస్త్రవాక్యం కూడా సాధకుని స్థాయి, ఉపాసనాపద్ధతి, సంప్రదాయభేదం, గురుముఖ ఉపదేశం ఆధారంగా వేర్వేరు కోణాలలో అర్థమవుతుంది. అందువల్ల ఇలాంటి విషయాలలో పరస్పర గౌరవం, వినయం, సందర్భజ్ఞానం చాలా అవసరం.


మంత్రసాధనలో ప్రాథమికంగా చెప్పబడే ఒక ముఖ్యమైన భావం — మంత్రం, మంత్రదేవత, మంత్రప్రదాత గురువు అనే త్రిపుటి. ఈ భావాన్ని క్రింది శ్లోకం స్పష్టంగా తెలియజేస్తుంది:


मन्त्रे तद्देवतायां च

तथा मन्त्रप्रदे गुरौ ।

त्रिषु भक्तिः सदा कार्या

सा हि सर्वार्थसिद्धिदा ॥


మంత్రే తద్దేవతాయాం చ

తథా మంత్రప్రదే గురౌ ।

త్రిషు భక్తిః సదా కార్యా

సా హి సర్వార్థసిద్ధిదా ॥


అర్థం — మంత్రమునందు, ఆ మంత్రానికి అధిదేవత అయిన దేవతయందు, అలాగే ఆ మంత్రమును ఉపదేశించిన గురువునందు — ఈ మూడింటి పట్ల ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తియే సర్వార్థసిద్ధిని ప్రసాదించేది.


ఇక్కడ “త్రిషు” అనే పదం ప్రత్యక్షంగా మూడు అంశాలను సూచిస్తుంది — మంత్రము, తద్దేవత, మంత్రప్రదాత గురువు. ఇది మంత్రసాధనలో మొదటి మరియు అత్యంత అవసరమైన పునాది. సాధకుడు మంత్రాన్ని కేవలం అక్షరాలుగా చూడకూడదు; ఆ మంత్రానికి అధిష్ఠానమైన దేవతను కేవలం బాహ్యరూపంగా మాత్రమే చూడకూడదు; మంత్రాన్ని ఉపదేశించిన గురువును సాధారణ వ్యక్తిగా మాత్రమే చూడకూడదు. ఈ మూడు పట్ల భక్తి, విశ్వాసం, శ్రద్ధ ఉన్నప్పుడే మంత్రసాధనకు అంతరంగ శక్తి కలుగుతుంది.


అయితే మంత్రశాస్త్రం ఇంతటితో ఆగిపోదు. కొన్ని ఉన్నత ఉపాసనాపద్ధతులలో త్రిపుటి భావనను మరింత లోతుగా తీసుకెళ్లి, ఐక్యానుసంధానం, అహంగ్రహోపాసన, సోహంభావన, దేవతా-ఆత్మాభేద భావన వంటి విషయాలు చెప్పబడతాయి. ఇవి సాధారణ మంత్రజపానికి మించిన, గురుముఖంగా గ్రహించవలసిన గంభీరమైన ఉపాసనారహస్యాలు.


శ్రీచక్రోపాసనలో కూడా ఈ భావాలకు విశిష్ట స్థానం ఉంది. శ్రీచక్రంలోని ఆవరాణాలు ఉపాసకుని అంతరంగయాత్రను సూచిస్తాయి. సాధకుడు బాహ్యపూజ నుండి అంతరారాధనకు, నామరూపభావన నుండి చైతన్యభావనకు, భేదదృష్టి నుండి అభేదానుభూతికి క్రమంగా ఎదగాలి. ఈ ప్రయాణంలో త్రికోణం, బిందువు వంటి చిహ్నాలు కేవలం జ్యామితీయ ఆకారాలు కాదు; అవి ఉపాసనలోని గూఢార్థాలను సూచించే తత్త్వసూచకాలు.


శ్రీచక్రంలోని త్రికోణం త్రిపుటి భావనను గుర్తు చేస్తుందని కొందరు ఉపాసనాసంప్రదాయాలలో వివరిస్తారు. ఉపాసకుడు, ఉపాస్యం, ఉపాసన — లేదా మంత్రం, దేవత, గురు — ఇలాంటి త్రిపుటి భావనలు సాధనలో మొదటి దశలో అవసరమైనవి. కానీ అంతిమంగా ఉపాసన పరమార్థం భేదాన్ని నిలబెట్టడం కాదు; భేదాన్ని అధిగమించి దేవతా చైతన్యంలో లీనమయ్యే దిశగా నడిపించడం. ఈ దృష్టిలో త్రిపుటి దాటి బిందువులో ఐక్యం పొందడం అనే భావన శ్రీవిద్యలో గంభీరంగా చెప్పబడుతుంది.


శ్రీచక్రంలో సర్వార్థసాధక చక్రం, సర్వానందమయ చక్రం వంటి ఆవరాణనామాలు కూడా ఉపాసనలోని క్రమోన్నతిని సూచిస్తాయి. సర్వార్థసాధన అంటే సాధకుని అభీష్టార్థాలు, ఆధ్యాత్మిక పురోగతి, చిత్తశుద్ధి, ఉపాసనాశక్తి — ఇవి సిద్ధించుట. కానీ ఉపాసన అక్కడితో ముగియదు. మరింత లోతుగా వెళితే సర్వానందమయ స్థితి, దేవతా చైతన్యంతో ఐక్యభావన, పరమానందానుభూతి వంటి ఉన్నత భావనలు ప్రాప్తిస్తాయని శ్రీవిద్యా సంప్రదాయం వివరిస్తుంది.


అహంగ్రహోపాసన అనే పదాన్ని కూడా సరిగా అర్థం చేసుకోవాలి. ఇది సాధారణ అహంకారం కాదు. “నేనే దేవుడు” అనే అహంభావం కాదు. ఇది శుద్ధమైన ఆత్మచైతన్యాన్ని దేవతా చైతన్యంతో అభేదంగా ధ్యానించే ఉన్నత ఉపాసనాభావం. ఈ భావం గురుముఖంగా, శాస్త్రవిధిగా, చిత్తశుద్ధి కలిగిన సాధకునికి మాత్రమే సురక్షితంగా అర్థమవుతుంది. లేకపోతే అది ఆధ్యాత్మిక అహంకారానికి దారి తీసే ప్రమాదం ఉంది.


“సోహం”, “అహం బ్రహ్మాస్మి”, “శివోఽహం”, “దేవ్యహం” వంటి భావనలు పరమార్థదృష్టిలో మహత్తరమైనవి. కానీ ఇవి నోటితో పలకడానికి మాత్రమే కాదు; మనస్సు, బుద్ధి, అహంకారం శుద్ధి పొందిన తరువాత ఉపాసనలో అనుభవించవలసిన భావాలు. గురుపరంపరలో వీటిని ఎలా ధ్యానించాలి, ఎప్పుడు చేయాలి, ఏ నియమాలతో చేయాలి అన్నది చాలా ముఖ్యం.


సౌందర్యలహరిలో “భవాని” పదానికి సంబంధించిన భావవ్యాఖ్యలో కూడా భక్తుడు దేవిని ఉద్దేశించి “భవాని” అని ప్రార్థించినపుడు, ఆ పదం ద్వారా “నీవే నేను అవుతున్నాను” అనే అభేదభావం సూచింపబడుతుందని కొందరు ఆచార్యులు వివరిస్తారు. ఇది భక్తి నుండి అభేదానుభూతికి ఎదిగే ఉపాసనామార్గాన్ని సూచించే సుందరమైన భావం. అయితే ఇలాంటి భావాలు సాధకునిలో వినయం, భక్తి, చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే శ్రేయస్కరంగా నిలుస్తాయి.


అందువల్ల రెండు స్థాయిలను వేరు వేరుగా అర్థం చేసుకోవాలి. మొదటి స్థాయి — సాధారణ మంత్రసాధకునికి అవసరమైన గురు–మంత్ర–దేవత భక్తి. రెండవ స్థాయి — అధికారం కలిగిన ఉపాసకునికి గురుముఖంగా బోధించబడే ఐక్యానుసంధానం, అహంగ్రహోపాసన, అభేదభావన. ఈ రెండూ పరస్పర విరోధకాలు కావు. మొదటిది పునాది; రెండవది క్రమోన్నతి. పునాది లేకుండా ఉన్నతభావం నిలవదు. ఉన్నతభావం తెలియకపోయినా పునాది భక్తితో సాధన చేసినవాడు తప్పు చేయడు.


కాబట్టి “సర్వార్థసిద్ధి అహంగ్రహోపాసన వల్ల రాదు” అని చెప్పిన మాటను ఒక సందర్భంలో అర్థం చేసుకుంటే — కేవలం అహంగ్రహ భావాన్ని మాటలుగా పలకడం వల్ల సిద్ధి రాదు అన్న భావం. కానీ శాస్త్రవిధిగా, గురుపరంపరగా, శుద్ధచిత్తంతో చేసిన అహంగ్రహోపాసన ఉన్నతమైన ఆనందసిద్ధికి దారి తీస్తుందని శ్రీవిద్యా దృష్టిలో చెప్పవచ్చు. ఇక్కడ విరోధం కంటే సందర్భభేదం ఎక్కువ.


మంత్రసాధనలో భక్తి స్థాయి, ఉపాసన స్థాయి, జ్ఞాన స్థాయి — ఇవన్నీ క్రమంగా పక్వం పొందాలి. మొదట మంత్రాన్ని పవిత్రంగా స్వీకరించాలి. తరువాత మంత్రదేవతను భక్తితో ఆరాధించాలి. గురువును దైవానుగ్రహద్వారంగా భావించాలి. ఆచరణలో నియమం, శుచిత్వం, వినయం, శ్రద్ధ ఉండాలి. తరువాత గురుపరంపర అనుమతితో ఉన్నత ఉపాసనాభావాలలో ప్రవేశించాలి.


ఇక్కడ అత్యంత ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే — ఉన్నత ఉపాసనాభావాలను సాధారణ బుద్ధితో చర్చించి నిర్ణయించలేము. అవి వాదవిషయాలు కావు; అనుభవసాధ్యమైన, గురుముఖసాధ్యమైన విషయాలు. కాబట్టి అవి తెలిసినవారు వినయంతో చెప్పాలి; వినేవారు శ్రద్ధతో వినాలి; అర్థం కానివారు తొందరగా ఖండించకూడదు; అర్థమైందనుకునేవారు గర్వించకూడదు.


మన వ్యాస విషయమైన “గురువుపట్ల విశ్వాసము, శ్రద్ధ — తపస్సు” అనే సందర్భంలో ఈ చర్చ నుండి తీసుకోవలసిన సారం ఏమిటంటే — గురువుపట్ల విశ్వాసం మొదటి పాదం. మంత్రంపై శ్రద్ధ రెండవ పాదం. మంత్రదేవతపై భక్తి మూడవ పాదం. ఈ మూడు బలంగా ఉన్నప్పుడు తపస్సు స్థిరమవుతుంది. తపస్సు స్థిరమైతే చిత్తశుద్ధి వస్తుంది. చిత్తశుద్ధి వచ్చినప్పుడు ఐక్యానుసంధాన భావనలు కూడా శాస్త్రసమ్మతంగా, గురుకృపతో, అంతరంగంలో సరిగా వెలుగుతాయి.


అంతిమంగా చెప్పవలసినది — త్రిపుటి భావం సాధకుని మొదటి మెట్టు; ఐక్యభావం ఉపాసనలో ఉన్నత మెట్టు. భక్తి లేకుండా ఐక్యం మాటగా మిగులుతుంది. శ్రద్ధ లేకుండా మంత్రం శబ్దంగా మిగులుతుంది. గురుకృప లేకుండా ఉపాసన తన గమ్యాన్ని చేరడం కష్టం. కాబట్టి మనం ఎవరి భావాన్నీ తిరస్కరించకుండా, సందర్భానుసారం రెండు కోణాలనూ గౌరవంగా గ్రహించాలి.


*గురు–మంత్ర–దేవత త్రిపుటిలో భక్తి పునాది; ఐక్యానుసంధానంలో పరమార్థస్ఫూర్తి పరాకాష్ఠ. రెండూ గురుకృపతో, శాస్త్రసమ్మతంగా, వినయంతో గ్రహించవలసినవే.*

💐💐💐💐💐💐

*Kumara Sharma*

*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*

*జగద్గురు జ్ఞానపీఠం*

*9063939567*

💐💐💐💐💐💐

పోతనగారి పద్యరాజము🙏

 🙏పోతనగారి పద్యరాజము🙏


అమ్మలఁ గన్నయమ్మ,ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె

ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.... . . . భా-1-10-ఉ.




తాత్పర్యం

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడ్డగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.

వ్యాఖ్యానం

అమ్మల గన్న యమ్మని తలచి ప్రారంభించిన తెలుగీకరింపబడిన శ్రీమద్భాగవత రచన అజరారమరం, మధురాతి మధురం, మహా మహిమాన్వితం అయింది.

దుర్గమ్మని స్తుతించే ఈ మహాద్భుత పద్యం అమ్మ గురించీ అంటూ అడగటం మొదలు పెట్టడం ఆలస్యం మనసులో మెదులుతుంది. ఎంతటి పండితులైనా తలచుకోకుండా ఉండలేని మధురమైన పద్యం యిది. పోతన గారు తన యసమాన ప్రతిభతో అమ్మ అన్న తియ్యని పిలుపుని మహామంత్రంగా మలిచిన ఈ దుర్గాదేవి స్తోత్రం తెలుగువారికి అందిన అమూల్య వర ప్రసాదం. భక్తుడికీ, భగవంతుడికీ మధ్య దూరాన్ని చెరిపేసిన కమ్మటి ప్రార్థన. ఇలా "దుర్గ మాయమ్మ" అని ఆర్తిగా, ప్రేమగా పిలుచుకునే భావన్ని, భాగ్యాన్ని ప్రసాదించిన ఆ మహానుభావుడి పాదాలకు ఎన్ని శతకోటి వందనాలు చేసినా తక్కువే. ఎప్పుడో ఒకప్పుడు ఈ పదాలు నోట్లో మెదలని తెలుగువాడు ఉండడు. నిత్యపూజలో కాని ఏ శుభారంభంలో కాని ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని మంత్రాలు జపించినా “అమ్మ” పూజ మొదలెట్ట దగ్గది ఈ తియ్యటి పిలుపు లాంటి ఈ మహామంత్రం. సర్వ శుభాలని సకల విజయాలు సమకూరతాయి


ఆవిడ అమ్మల గన్న యమ్మ ముగు రమ్మల మూలపు టమ్మ – అవును అసలు స్త్రీ దేవత లంతా దుర్గనుండే పుట్టిన వారే. త్రిమూర్తుల భార్యలు లక్ష్మీ, సరస్వతీ, పార్వతులు ముగ్గురితో సహా సర్వులు దుర్గమ్మ అంశతో పుట్టిన వారే. అసలు ఈ సృష్టి మొత్తం స్త్రీ, పురుష లక్షణం కలదిగా విభాగింప దగ్గది. పురుష లక్షణం గల దేవత లందఱు విష్ణువునుండి గాని, శివుడినుండి గాని పుట్టినట్లు చెప్తారు. కాని కాళీ, దుర్గ, లలిత, మహేశ్వరి, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైన దేవతలు; వారాహి, చండీ, బగళా మొదలైన మాతలు; రేణుక ఇత్యాది శక్తులు; చివరకు గ్రామదేవతలు అంతా శ్రీమహాదుర్గా దేవతాంశ సంభూతులు గానే చెప్పబడతారు.


ఈ సర్వసృష్టి కూడా స్త్రీ నుండి సంభవిస్తోంది. పురుషుడు ప్రాణప్రదాత, స్త్రీ శరీరదాత్రి. ఈ కార్యకారణ సంఘాత మంతా పంచభూతాలనుండి పుడుతుంది. చేతన రూప మైన పురుషుడు ప్రధాన చైతన్యం యొక్క లక్షణం. అతడు పైనుండి నడిపేవాడు. కాని ఈ సృష్టి అంతా స్త్రీ స్వరూపం. అంతా ఒక ముద్ద. ఎక్కడ ఎప్పుడు ఎలా పుట్టినా పంచభూత సమాహార మై, పంచేంద్రియ లక్షణ భూత మై పుడుతోంది. (పంచభూతాలు = భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. (పంచేంద్రియాలు = చూసే కళ్ళు, వాసనలు పీల్చే ముక్కు, రుచినీ తెలిపే నాలుక, శబ్దాలని వినిపించే చెవులు, స్పర్శని తెలియ జేసే చర్మం) ఈ ఐదిటి వల్లే మనోవికారాలన్నీ కలుగుతాయి. కాని జీవలక్షణం కలిగిన చైతన్యం ప్రతి జీవికీ భిన్నంగా ఉంటుంది. అది కర్మను పోగు చేసుకుంటూ ఉంది. బహుజీవులుగా పుడుతుంది, చస్తుంది, మళ్ళా జన్మిస్తుంది. కాని పంచభూతాలకి ఆ లక్షణం లేదు. అది సర్వదా ఒక్కటే శక్తి. రూపాన్ని బట్టి, దేశ కాల పరిస్థితులని బట్టీ భిన్న మౌతుంది, కాని చైతన్య స్వరూపాన్ని బట్టీ, కర్మని బట్టి మారదు. అదే మహాశక్తి. ఆమే దుర్గ. మాతృత్వ గుణానికి కారణ భూతురాలు.


ఆవిడ చాల పెద్దమ్మ. ఆమె సనాతని. ఇప్పటిది అని చెప్పలేము. ఎప్పటిదో కూడా చెప్పలేము. ఈ సృష్టి ఉన్నప్పుడూ, లేనప్పుడూ కూడా ఆమె ఉంది.


ఆవిడ సురారు లమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ. ఈ రెండు పదాలూ కలిపి చదివితే ఒకలాగా, విడదీసి చూస్తే ఒకలాగా అర్థాన్నిస్తాయి. కలిపి చదివితే. (అ) రాక్షసులు (సురారులు దేవతల = శత్రువులు). వారి తల్లి దితి. వాళ్ళవల్ల ఆ తల్లికి కడుపు చేటు, బాధ. మరి ఆ రాక్షసుల్ని చంపి ఆ తల్లి కడుపాఱడి తీర్చింది అమ్మల గన్న యమ్మ దుర్గమ్మ. (ఆఱడి = గాయం, బాధ), (పుచ్చుట = మాన్పటం) ; (ఆ) విడదీసి చదివితే సురారు లమ్మ ఆ తల్లి దేవతలకే కాదు, రాక్షసులకి కూడా తల్లే మరి. మంచివాళ్ళకీ, చెడువాళ్ళకీ, ఈ సృష్టి అంతటికీ అమ్మే కదా. కడుపు ఆఱడి పుచ్చిన యమ్మ మనకి ఏ బాధ వచ్చినా, ఏ కష్ట మొచ్చినా కడుపులో ఆకలి తీర్చే తల్లిలా తీర్చ గలది, తీర్చేది ఆ అమ్మె (కడు = మిక్కలి).


ఆవిడ తన్ను లోనమ్మిన వేల్పు టమ్మల మనంబుల నుండెడి యమ్మ . తనని లోనుగా తలచెడి వారు (లోనమ్మిన) వేల్పు టమ్మలు = సర్వ దేవతా మూర్తుల యందు నిలిచి ఉండెడి మాతృతత్వం. సకల జీవులలోను ఉండే సహజ దయాస్వభావం. మాతృ దేవతలు. ఆ తత్వాన్ని వారి మనసులలో నిద్రలేపి అనుగ్రహం అందించే తల్లి ఆమె.


కృపాబ్ధి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అలాంటి అమ్మవు, మా యమ్మవు నీవు మాకు సర్వ సంపదల్నీ (మహత్వం కీర్తి ధనం, విద్య కవితా శక్తి, పటుత్వం శక్తి సామర్థ్యాలు = సంపదలు అన్నీ) సముద్ర మంత కృపతో ప్రసాదించు తల్లీ.


అమ్మల గన్న యమ్మ అని ప్రార్థిస్తూ ఇలా ప్రారంభించిన భాగవత ఆంధ్రీకరణ అలా అత్యద్భుతంగా శాశ్వతత్వాన్ని సర్వామోదాన్ని అందుకుంది. మాతృత్వం అంత మధుర్యాన్ని అందుకుంది

విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కోవెలలో ఇప్పటికీ రాజద్వారం మీద ఈ పద్యం రాసి ఉంటుంది. ఈ పద్యం పైకి ఒకలా కనపడుతుంది. మీరు తెలిసికాని, తెలియక కాని పోతనగారు వ్రాసిన పద్యములు కొన్ని నోటికి వచ్చినవి మీరు చదివినట్లయితే అవి సత్ఫలితాన్ని ఇచ్చేస్తాయి. మంత్రంము, బీజాక్షర యుక్తముగా ఉంటే మనము, కొన్ని కొన్ని చదవకూడదు. కొన్ని కొన్ని చేయకూడదు. పక్కన గురువు వుంటే లేదా గురుముఖతా ఉపదేశము పొంది ఉంటే తప్ప మేరువుని, శ్రీచక్రమును ఇంట్లోపెట్టి పూజ చెయ్యలేము. ఉచ్ఛారణా దోషాలు లేకుండా జాక్షరములను ఉపాసన అందరూ చెయ్యలేరు . అది కష్టం. కానీ పోతనగారు ఈ దేశమునకు, మనకు బహూకరించిన గొప్ప కానుక ఆయన రచించిన భాగవత పద్యములు.

""అమ్మలనుకన్న దేవతా స్త్రీలయిన వారి మనస్సులయందు ఏ అమ్మవారు ఉన్నదో అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్ – ఈ నాలుగింటికోసము నమస్కరిస్తున్నాను. అటువంటి దుర్గమ్మ మాయమ్మ. ’ఇవీ ఆయన ఈ పద్యంలో చెప్పిన విషయములు, మీరు చెయ్యలేని ఒక చాలా కష్టమయిన పనిని పోతనగారు చాలా తేలికగా మీకు ప్రమాదం లేని రీతిలో మీతో చేయించేయడానికని ఇటువంటి ప్రయోగం చేశారు.


అమ్మలగన్నయమ్మ’– అమ్మలని చెప్పబడ్డవారు ఎవరు ? మనకి లలితాసహస్రం ’శ్రీమాతా’ అనే నామంతో ప్రారంభమవుతుంది. ’శ్రీమాతా’ అంటే ’శ’కార ’ర’కార ’ఈ’కారముల చేత సత్వరజస్తమోగుణాధీశులయిన బ్రహ్మశక్తి, విష్ణుశక్తి రుద్రశక్తులయిన రుద్రాణి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి – ఈ ముగ్గురికీ అమ్మ – ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చినటువంటి పెద్దమ్మ అమ్మ ఎవరు వున్నదో ఆయమ్మ – అంటే ’లలితాపరాభట్టారికా స్వరూపం’ – ఆ అమ్మవారికీ దుర్గాస్వరూపమునకు భేదం లేదు – అందుకని ’అమ్మలగన్నయమ్మ’ ’ముగ్గురమ్మల మూలపుటమ్మ’ – ఆ ముగ్గురు అమ్మలే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి స్వరూపములుగా కొలిచే తల్లులు. ఈ ముగురమ్మల మూలపుటమ్మ. ’చాల పెద్దమ్మ’ – ఇది చాలా గమ్మత్తయిన మాట. చాల పెద్దమ్మ అనే మాటను సంస్కృతంలోకి తీసుకువెడితే మహాశక్తి – అండపిండ బ్రహ్మాండములంతటా నిండిపోయిన బ్రహ్మాండమయిన శక్తిస్వరూపము బ్రహ్మాండములనన్నిటినీ సృజించి, ధరించి వ్యాపించి పోషించే బ్రమ్హాన్డభాన్డోదరి ఈ శక్తి స్వరూపిణి చిన్నపెద్దా భేదంలేకుండా సమస్త జీవరాశులలోను ఇమిడి ఉంది. అలా ఉండడం అనేదే మాతృత్వం, దయ, దీనిని సౌందర్యం అంటారు. దయకు సౌందర్యం అని పేరు. అది ప్రవహిస్తే సౌందర్యలహరి.

అండపిండ బ్రహ్మాండములనన్నిటి యందు నిండిపోయి ఈ భూమిని తిప్పుతూ, లోకములనన్నిటినీ తిప్పుతూ ఇవన్నీ తిరగడానికి కారణమయిన అమ్మవారు ఎవరో ఆ అమ్మ.

’సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ’ – సురారి అనగా దేవతలకు శత్రువయిన వాళ్ళ అమ్మ. అనగా దితి. దితి అయ్యో అని ఏడిచేటట్టుగా ఆవిడకు కడుపుశోకమును మిగిల్చింది. అనగా రాక్షసులు నశించడానికి కారణమయిన అమ్మ. దేవతలలో శక్తిగా ఈమె ఉండబట్టే రాక్షసులు మరణించారు.

’తన్నులోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ’ – ఇదొక గొప్పమాట. అమ్మవారిని మనస్సులో నమ్ముకుని శక్తితో తిరుగుతున్న వారెవరు?

బ్రాహ్మి – మాహేశ్వరి – వైష్ణవి – మహేంద్రి

చాముండ – కౌమారి – వారాహి – మహాలక్ష్మి

మనకి సంప్రదాయంలో ’అష్టమాతృకలు’ అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి, చాముండ, కౌమారి, వారాహి, మహాలక్ష్మి.

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని ’అష్టమాతృకలు’ అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

 "రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సౌభాగ్యసుందరాం వైష్ణవీం శక్తిమద్భుతామ్ "",  

అని అంటారు దేవీభాగవతంలో వ్యాసభగవానుడు. ఈ ఎనమండుగురికీ శక్తినిచ్చిన అమ్మవారెవరో ఆవిడే వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ – దుర్గమాయమ్మ – ఈ దుర్గమ్మ ఉన్నదే లలితాపరాభట్టారిక – ఆవిడ లలితా పరాభట్టారిక – ఆ అమ్మ మాయమ్మ.

’మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్’ – ఇప్పుడు ఆవిడ నాకు దయతో మహత్త్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి. నాకు అర్హత ఉన్నదని ఇవ్వనక్కరలేదు. దయతో ఇచ్చేయ్యాలి.

అమ్మవారికి ’శాక్తేయప్రణవములు’ అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐంహ్రీంశ్రీంక్లీంసౌః – ఈ ఆరింటిని శాక్తేయ ప్రణవములు అని పిలుస్తారు. దానిని ఎలాబడితే అలా ఉపాసన చెయ్యకూడదు. కాబట్టి బీజాక్షరములను అన్నివేళలా ఉపాసన చేయలేము. కానీ ఇప్పుడు పోతనగారు ఒక గొప్ప ప్రయోగం చేశారు. మహత్వమునకు బీజాక్షరము ’ఓం’, కవిత్వమునకు బీజాక్షరము ’ఐం’, పటుత్వమునకు భువనేశ్వరీ బీజాక్షరము ’హ్రీం”, ఆ తర్వాత్ సంపదల్ – లక్ష్మీదేవి – ’శ్రీం’.

ఇపుడు ’ఓంఐంహ్రీంశ్రీం’ – అమ్మలగన్నయమ్మ *’శ్రీమాత్రేనమః’*

మీరు బీజాక్షరములతో అస్తమానూ అలా అనడానికి వీలులేదు. కానీ మీరు రైలులో కూర్చున్నా, బస్సులో కూర్చున్నా స్నానం చెయ్యకుండా కూడా ఎక్కడ ఉన్నా కూడా.

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ –అంటున్నారనుకోండి అపుడు మీరు మరోరూపంలో ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ – ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రేనమః’ అనేస్తున్నారు.

మీరు అస్తమాననూ అమ్మను తలచుకున్నట్లు అవుతుంది. అపుడు అమ్మవారు చాలా తొందరగా మీకు పలుకుతుంది. అందుకే లలితా సహస్రం ’శ్రీమాతా’ అంటూ అమ్మతనంతో ప్రారంభమవుతుంది.

ఆవిడ రాజరాజేశ్వరి. అయినా ఆవిడముందు అమ్మా అమ్మా అనేసరికి ఆవిడి పొంగిపోతుంది. ఇన్నిమార్లు ఆ పద్యంద్వారా అటూ ఇటూ అమ్మని మీరు పిలుస్తుంటే విసుక్కోవడం చేతకాని దయాస్వరూపిణి అయిన అమ్మ మీకోరికను తీరుస్తుంది. ఇప్పుడు మీరు ’ఓంఐంహ్రీంశ్రీం శ్రీమాత్రే నమః’ అనలేకపోవచ్చు, లేదా గురువు ముఖతా ఉపదేశము లేదు కదా,,, 

కానీ ’అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ ’ 

అనడానికి కష్టం ఏమిటి ?

ఈవిధంగా పోతనగారు శ్రీవిద్యా రహస్యములన్నిటిని ఔపోసనపట్టి తెలుగు వారందరికీ ఒక మహత్తరమయిన కానుకను బహూకరించిన మహాపురుషుడు ఆయన ఒక ఋషి,, నిజానికి మనకాలానికి "బ్రహ్మర్షి "అందుకని మనకు ఈ పద్యమును అనుగ్రహించినారు.....


                 || ఓం శ్రీ మాత్రే నమః |

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

పంచాంగము

 



24, మే 2026, ఆదివారం

యోగ వాశిష్ఠ హృదయం-2

 యోగ వాశిష్ఠ హృదయం-2


2. గ్రంథపఠనార్హత


గ్రంథావిర్భావ క్రమాన్ని ఈ ప్రకారంగా వర్ణించటంవల్ల మనబోటివాళ్ళకి ఏమనిపిస్తుందంటే “ఆనాటి భరద్వాజ మునికుమారుడి లాగా అనేక దివ్య శక్తులు సాధించి, సాక్షాత్తుగా బ్రహ్మగారితో మాట్లాడగలిగేటంత శక్తి సంపాదించిన వారికోసం మాత్రమే ఈ గ్రంథం వ్రాయబడిందన్న మాట. అయితే ఈ గ్రంథాన్ని ముట్టుకొనేందుకు మనకు అర్హత ఎక్కడ వుంటుంది?" అని. ఈ సందేహంతో మనం ఆ పుస్తకాన్ని ముట్టుకొనే ముట్టుకోం. కానీ, వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం అది కాదు.


ఈ గ్రంథ రచనలో తనయొక్క కర్తృత్వం నామమాత్రమేనని, సాక్షాత్తు బ్రహ్మగారియొక్క సంకల్పబలంవల్లనే ఈ గ్రంథం ఆవిర్భవించిందని, సవినయంగా చెప్పుకోవాలన్నదే వాల్మీకి మహర్షి ఉద్దేశ్యం. అందుకే ఆ ఘట్టాన్ని ఆయన మనకు చెప్పాడు. ఉద్దేశ్యం బాగానే వుంది కానీ, "ఈఘట్టంవల్ల ఈ గ్రంథానికి మనం పనికిరాం బాబూ" అనే అపార్థం కలిగే సావకాశం వచ్చింది. దాన్ని పోగొట్టటం కోసం మరొక సన్నివేశాన్ని ఈ గ్రంథారంభంలోనే వాల్మీకి మహర్షి వర్ణించాడు.


3. అరిష్టనేమి కథ


పై సంఘటనకు కొద్ది కాలం తరువాత. అరిష్టనేమి అనే మహారాజు పెద్దవాడై రాజ్యం కొడుకులకు అప్పచెప్పి, తాను తపోవనాలకు వెళ్ళాడు. అక్కడ ఆయన మంచి తీవ్ర తపోనిష్ఠలో కాలం గడపసాగాడు. దేవేంద్రుడికి ఈ వ్యవహారం తెలిసింది. ఎవరైనా తీవ్ర తపస్సులు చేస్తూ వుంటే, వారిని పరీక్షించవలసిన బాధ్యత దేవరాజుగా ఇంద్రుడికి వుంది. ఈ విషయం తెలియక, ఈ కాలంలో కొందరు, దేవేంద్రుడు అసూయాగ్రస్తుడని చులకన చేసి మాట్లాడుతూ వుంటారు. ఇప్పుడు చెప్పబోయే కథలో ఇంద్రుడియొక్క పరీక్షాతత్త్వం కూడా మనకు అవగతం అవుతుంది.


అరిష్టనేమి మహారాజుయొక్క తపస్సు ఒక స్థాయికి వచ్చేసరికి, దేవేంద్రుడు ఒక దేవదూతతో ఒక విమానాన్ని పంపి, “హే రాజర్షీ! నీకు సశరీరంగా స్వర్గంలో నివసించే యోగ్యత వచ్చింది. కనుక ఈ దేవ విమానం మీద సరాసరి స్వర్గానికి విచ్చేయ వలసింది" అని కబురు చేశాడు. ఆ దేవదూత వచ్చి ఎంతో వినయంగానూ, ఆదరంగానూ, ఈ వార్త ఆ మహారాజుకు చెప్పాడు. అయితే ముసలి మహారాజు చాలా గట్టివాడు. ఆయన దేవదూతకి, దేవేంద్రుడికి, కూడా చాలా వినయంగా కృతజ్ఞతలు చెప్పి, మెల్లిగా ఇలా అన్నాడు. "అయ్యా! దేవదూతా! మీ స్వర్గంలోవుండే విశేషాలేమిటి? ఈ భూమికంటే స్వర్గంలో వున్న గొప్పతన మేమిటి? ఆ స్వర్గంలో నన్ను శాశ్వతంగా వుండనిస్తారా? మధ్యలో పంపేటట్లయితే ఆ పంపే విధానమేమిటి?”


ఇది విని దేవదూత కొద్దిగా ఆలోచించి ఇలా చెప్పాడు. “రాజేంద్రా! నువ్వుతపస్సులో వున్నావు. కనుక, నీ దగ్గర అబద్ధం చెప్పకూడదు. స్వర్గం సుఖాల మయం. భూలోకంలో చేసుకొన్న పుణ్యాన్నిబట్టి, స్వర్గలోకంలో సుఖాల స్థాయి పెరిగిపోతూ వుంటుంది. అయితే, స్వర్గంలో అసూయల బాధ ఒకటి కనిపిస్తూ వుంటుంది. దానివల్ల ఒకోసారి పోట్లాటలు, కొట్లాటలు కూడా వుంటూ వుంటాయి. ఎక్కువవాళ్ళకు తక్కువ వాళ్ళను చూస్తే సంతోషం. తక్కువవాళ్ళకు ఎక్కువవాళ్ళను చూస్తే కడుపు మంట. తమకు ఎంత పుణ్యం మిగిలివుందో ఎవరికీ తెలియదు. పుణ్యం అయిపోయిన రోజున, వున్నట్టుండి స్వర్గం నుంచి గెంటిపారేస్తూ వుంటారు. ఆ సమయం వచ్చేసరికి వెళ్ళం అని మొండికెత్తి, మెడబట్టి గెంటించుకొని, ఏడుస్తూ అవతలికి పోతూ వుంటారు. కనుక, మహారాజా! శాశ్వతంగా స్వర్గంలో స్థానం నీకే కాదు. ఎవరికీ వుండదు. వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏడుస్తూ పోవలసిందే. నువ్వైనా అంతే. నేనైనా అంతే. స్వర్గంలోకి వచ్చాక మాత్రం సుఖాల్లోపడి కొట్టుకుపోవడమే తప్ప, ఇక వేరే తపస్సులు, ఏమీ కుదరవు. సంగ్రహంగా ఇవీ విషయాలు. ఇక విమానం ఎక్కండి."


దేవదూత చెప్పిన అంశాలన్నీ విని, అరిష్టనేమి మహారాజు పెద్ద నమస్కారం పెట్టి, ఇలా అన్నాడు. "దేవదూతా! మీ స్వర్గానికో దండం. నీకో దండం. మీ దేవేంద్రుడికో దండం. అలాంటి స్వర్గం నాకు వద్దే వద్దు. శరీరం వున్నంత కాలం ఇక్కడే తపస్సు చేసుకొంటూ పడుంటాను. చేతనైతే ఈ జన్మలోనే పరమాత్మలో ఐక్యం పొందుతాను. చేతకాకపోతే మళ్ళీ జన్మ ఎత్తి, మళ్ళీ తపస్సే చేస్తాను. నాకు భూలోక రాజ్యాలూ వద్దు, స్వర్గలోక రాజ్యాలూ వద్దు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నన్ను ఆశీర్వదించు. దేవేంద్రులవారి ఆశీస్సులు ప్రార్థిస్తున్నానని మనవి చేయి.”


ఇది విని, “ఇదెక్కడి వెఱి మారాజు రా! బాబూ!" అనుకొంటూ, దేవదూత వెనక్కి వెళ్ళి, జరిగిందంతా దేవేంద్రుడికి చెప్పాడు. దేవేంద్రుడికి చాలా ఆనందమయింది.


అరిష్టనేమి రాజు నిజాయితీ, నిష్కామత, నిర్మలత, ఆయనకు బాగా నచ్చాయి. ఆ రాజుకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. ఇదే దేవేంద్ర పదవిలోని బాధ్యత. ఎవరైతే నిష్కామంగా తపస్సు చేస్తారో, వారికి ఆయన సహాయం చేస్తాడు. ఎవరైతే సకామంగా తపస్సు చేస్తారో, వారి విషయంలో ఆయన పరిశోధన చేస్తాడు. ఏమని పరిశోధన? వీడి కోరిక లోకానికి మేలు చేస్తుందా? కీడు చేస్తుందా? అని. కీడు చేస్తుంద తపస్సును చెడగొట్టేందుకు ప్రయత్నం చేస్తాడు.


అలా కాక, ఆ తపస్సు లోకానికి మేలు చేస్తుంది అనుకొంటే, ఆ వరాన్ని పొందే యోగ్యత ఈ వ్యక్తికి వుందా, లేదా అని, బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లు, ఆ తపస్విని పరీక్షలకు గురి చేస్తాడు. ఇది దేవేంద్రుడి బాధ్యతా విధానం. ప్రస్తుత సందర్భంలో అరిష్టనేమి మహారాజు నిస్స్వార్థంగా తపస్సు చేస్తున్నాడని తేలిపోయింది. కనుక, ఆయనకు సహాయం చెయ్యవలసిన బాధ్యత దేవేంద్రుడి పైన పడ్డది.


పూర్వం మేరు శిఖరం మీద దేవసభలో భరద్వాజ మునికుమారుడు శ్రీమద్రామాయణం గానం చేసిన సందర్భం ఆయనకు గుర్తుకొచ్చింది. ఆ మహాసభలో సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు, ఇంకా పూర్తికాని యోగవాశిష్ఠ గ్రంథాన్ని గూర్చి అంత గొప్పగా మాట్లాడే సరికి, దేవేంద్రుడి దృష్టి ఆ గ్రంథం మీద పడ్డది. అందువల్ల, వాల్మీకి మహర్షి ఆ గ్రంథంలో ఏమి వ్రాశాడా అని, దేవేంద్రుడు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే వున్నాడు. పరిశీలించి, ఎప్పటికప్పుడు పరమానందపడుతూనే వున్నాడు. ఇప్పుడు అరిష్టనేమి విషయంలో దేవేంద్రుడికి ఆ గ్రంథం మాట గుర్తొచ్చింది. అందువల్ల దేవేంద్రుడు ఆ దేవదూతతో ఇలా అన్నాడు. "నువ్వు వెంటనే అదే విమానంలో ఆ రాజు దగ్గరకే వెళ్ళు. ఆయనను ఎక్కించుకొని వాల్మీకి మహర్షిగారికి ఆయనను అప్పచెప్పు. వీరికి ఆయన వ్రాసిన యోగవాశిష్ఠం ఉపదేశించమని నేను ప్రార్థిస్తున్నానని వాల్మీకి మహర్షి గారికి మనవి చెయ్యి.”


దేవదూత సరే అని, మళ్ళీ అరిష్టనేమి మహారాజు దగ్గరకు వచ్చి, ఆయనను వాల్మీకిమహర్షికి అప్పజెప్పి, తాను వెళ్ళిపోయాడు. ఆ మహారాజు కూడా దేవేంద్రుడి ఉపకారానికి చాలా సంతోషపడి, వాల్మీకి మహర్షి పాదాల మీద పడి, “ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే" అంటూ తనను శిష్యుడిగా స్వీకరించి, తత్త్వబోధ చేయవలసిందిగా ప్రార్థించాడు. వాల్మీకి మహర్షి ఆయనకు తాను రచించిన ఈ యోగవాశిష్ఠ మహాగ్రంథాన్ని అనుపూర్విగా ఉపదేశించాడు.


ఈ ఘట్టాన్ని చెప్పడంవల్ల నిష్కామ ప్రవృత్తి గల మానవులందరికీ ఈ యోగవాశిష్ఠ గ్రంథం పఠనార్హమే అనే విషయం చెప్పినట్లయింది. కాగా, నిష్కామత్వాన్ని అభ్యసించకపోతే వేదాంతవిద్య మనస్సుకు ఎక్కదనే విషయం కూడా చెప్పినట్లయింది. అంత వరకూ బాగానే వుంది కానీ, ఈ కథవల్ల కూడా మనకు ఒక చిక్కు వచ్చి పడుతోంది. అరిష్టనేమి మహారాజు లాగా సశరీర స్వర్గం వచ్చేటంత తపస్సు చేసినాకనే ఈ గ్రంథం పఠించడానికి యోగ్యత వస్తుందని, ఈ కథ సూచిస్తోంది. అప్పుడు కూడా, దేవ విమానం ఎదురుగుండా వచ్చినా సరే, వద్దు పొమ్మని తిరస్కరించేటంత వైరాగ్యం వుంటేనే, ఈ గ్రంథం ముట్టుకోవాలి- అని కూడా ఈ కథ సూచన చేస్తోంది.


మరి మనం ఎక్కడున్నాం? ఈ షరతులకు మనం సరిపోతామా? ఈ గ్రంథానికో దండం- అనుకొనే ప్రమాదం ఈ అరిష్టనేమి కథవల్ల మనకు కలుగుతోంది. దీనిని నివారించేందుకోసం వాల్మీకి మహర్షి మరో చిన్న సన్నివేశాన్ని కూడా గ్రంథారంభంలో చేర్చాడు.


4. అగ్నివేశ్యుడు- కారుణ్య కుమారుడు


“అగ్నివేశ్యుడు” అని ఒక సత్పురుషుడు వుండేవాడు. ఆయన గృహస్థుడు. కానీ, నిరంతరం తపస్సీలి గా వుండేవాడు. ఆయనకు "కారుణ్యుడు" అని ఒక కొడుకు వుండేవాడు. వాడు తెలివైన వాడు. చిన్న వయస్సులోనే విద్యలన్నీ పూర్తి చేసి, గురుకులంనుంచి ఇంటికి వచ్చాడు. ఇంకా వివాహం కాలేదు. ఈ పిల్లవాడు చదువు పూర్తి చేసుకొని ఇంటి దగ్గరకు వచ్చినప్పటి నుంచీ విచిత్రంగా వుంటున్నాడు. కనీసం నిత్యపూజలు కూడా చేయడం లేదు. ఎప్పుడూ బద్దకంగా పడుకొంటున్నాడు. మనిషిలో ఉల్లాసమే కనిపించటం లేదు. చూసి చూసి, ఒకరోజు తండ్రి అతనిని నిగ్గదీశాడు. అతడు మెల్లిగా తన మనస్సులో వున్న కల్లోలాన్ని వివరించసాగాడు-


“కుర్వన్నేవేహ కర్మాణి

జిజీవిషే చ్ఛతగ్ం సమాః - అని వేదంలో ఒకచోట వుంది.

ఇలా శాస్త్రాలలోనూ, వేదాలలోనూ, కొన్ని చోట్ల మనిషి మరణించే దాకా సత్కర్మలు చేస్తూనే వుండాలి అని వుంది. వాటిల్లోనే మరికొన్ని చోట్ల -

న కర్మణా న ప్రజయా ధనేన

త్యాగేనైకే అమృతత్వమానశుః” అని వుంది.


అంటే చిట్టచివరి ఫలితమైన మోక్షం ఎన్ని కర్మలు చేసినా రాదని ఈ వాక్యం చెబుతోంది. నేను అన్ని వేదాలూ చదివాను. అన్ని శాస్త్రాలూ చదివాను. ప్రతిచోటా ఈ విషయంలో సందేహమే వస్తోంది. అందువల్ల ఏ కర్మలూ లేకుండా, ఏ వేదాంతాలూ లేకుండా, మౌనంగా వుంటున్నాను" అన్నాడు కుర్రవాడు.


అతని మాటలు విని తండ్రి బాగా ఆలోచించి, ఇలా అన్నాడు. “నాయనా! ఈ విషయంలో నీకు సంపూర్ణమైన సమన్వయాన్ని ప్రదర్శించ గల ప్రామాణిక గ్రంథం వాల్మీకి రచించిన యోగవాశిష్ఠం మాత్రమే.


నీకు నేను ఆ గ్రంథాన్ని ఉపదేశిస్తాను. అది విన్నాక నీకు ఎలా తోస్తే అలా చేయి.”


ఆ విధంగా తండ్రి అయిన అగ్నివేశ్యుడి ద్వారా ఈ గ్రంథాన్ని ఉపదేశం పొందిన కారుణ్య కుమారుడు, సమన్వయాన్ని బాగా గ్రహించి, ముందు సత్కర్మల ద్వారా చిత్తశుద్ధిని సాధించి, ఆ పైన జ్ఞానయోగం ద్వారా జీవన్ముక్తి సాధించాడు.


ఈ కథ ద్వార వాల్మీకి మహర్షి చెప్పదలచింది ఏమంటే? “ఈ యోగవాశిష్ఠం శ్రవణం చెయ్యటానికి విద్యావంతులై, ఆధ్యాత్మిక జిజ్ఞాస కలవారందరూ అర్హులే" అని ఇంతవరకు చెప్పిన కథలవల్ల ఈ గ్రంథం బ్రహ్మదేవుడికి, దేవేంద్రుడికీ, కూడా సమ్మతమైనదనీ, అరిష్టనేమి వంటి ఉత్తమస్థాయి సాధకులకు, కారుణ్య కుమారుడి వంటి సామాన్య సాధకులకు అందరికీ కూడా ఉపయోగపడే గ్రంథమే- అని తేలుతోంది.


5. గ్రంథ ప్రాశస్త్యము


అయితే, ఎక్కడో స్వర్గంలో వున్నవారి మాట మనకు సరీగా తెలియదు. వాల్మీకి నాటి సాటి మహర్షులు, పండితులు, ఈ గ్రంథాన్ని గురించి ఏమని భావించేవారో మనకు తెలిస్తే, అప్పుడు మనకు ఈ గ్రంథం మీద ప్రామాణిక బుద్ధి ఏర్పడుతుంది. అందుకోసం, వాల్మీకిమహర్షి అలాంటి ఘట్టాన్ని ఒక దానిని ఈ గ్రంథంలో మొదట చేర్చాడు.


పూర్వరామాయణంలో, అరణ్యకాండలో, వనవాస సమయంలో, శ్రీరాముడు యే యే మహాత్ములను దర్శించాడో ఆ వివరాలు కొన్ని వున్నాయి. భారతదేశ దక్షిణాపథాన ఆ నాటి సుప్రసిద్ధ మహర్షులలో అగస్త్యమహర్షి అత్యంత ప్రముఖుడని చెప్పటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. త్రేతాయుగ ప్రారంభంలోనే దండక

మహారాజుకు సంక్రమించిన గురుశాపంవల్ల ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యలో దండకారణ్యమనే భయంకర అరణ్యం ఏర్పడింది. ఈ అరణ్యంవల్ల దక్షిణ భారతదేశం ఆనాటి రాక్షసులకు స్థావరంగా మారింది. దానివల్ల దక్షిణ భారతదేశంలో వైదిక సంస్కృతి దెబ్బతింటూ వచ్చింది. ఈ పరిస్థితిని సరి చేయటం కోసం, ఆ నాటి మహర్షులెందరో రాజకీయాలకు రాజులకు, అతీతంగా కృషిచేశారు. వారిలో అగస్త్యమహర్షి చాలా ప్రముఖుడు.


ఆయన కృష్ణా, కావేరీ, గోదావరీ నదీ తీరాల వెంట పాద సంచారాలు చేసి, లెక్కకు మించిన స్థలాలలో అగస్త్యేశ్వర ఆలయాలను ప్రతిష్ఠ చేసి, ఆ యా ప్రాంతీయ భాషలకు సాంస్కృతిక జీవనం పోసి, సనాతన ధర్మోద్ధరణకై అపార కృషి చేశాడు. అది గాక కొన్ని వేలమంది సాధకులకు సాధన మార్గ నిర్దేశనం చేశాడు.


శ్రీరామచంద్రుడు తన అరణ్యవాస క్రమంలో అగస్త్య మహర్షిని ప్రత్యేకంగా దర్శించాడు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆ సందర్భంలో వాల్మీకి మహర్షి

సుతీక్షణం చాప్యగస్త్యం చ

అగస్త్య భ్రాతరం తథా|| అని ముగ్గురి పేర్లు వరుసగా చెప్పాడు.


సుతీక్ష్ణుడు, అగస్త్యుడు, అగస్త్యభ్రాత, అని. వీరిలో అగస్త్య భ్రాత పేరేమో ఇంతవరు మనకు తెలియదు. అందుకనే విద్యావంతులై కూడా పేరు ప్రతిష్ఠలు లేకుండా వున్నవారిని "అగస్త్యభ్రాతలు" అనటం పండితులలో సామెతగా మారిపోయింది. అగస్త్యుడు సుప్రసిద్ధుడే.(సశేషము)

24-05-2026 ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

24-05-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపారులకు చిక్కులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.  

---------------------------------------


వృషభం


ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారమున ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో కీలక సమాచారం అందుతుంది.

---------------------------------------


మిధునం


ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు సాగవు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు.

---------------------------------------


కర్కాటకం


గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. వ్యాపారులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. అవసరానికి సన్నిహితుల సహాయం పొందుతారు. స్థిరాస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. 

---------------------------------------


సింహం


ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


కన్య


వృత్తి వ్యాపారాలలో అనుకున్నది సాధిస్తారు. దైవచింతన పెరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు.

---------------------------------------


తుల


వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనం చేసుకుంటారు. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలతో నూతన అవకాశములు లభిస్తాయి.

---------------------------------------


వృశ్చికం


ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. బంధు మిత్రులు మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక వాతావరణం చికాకుగా ఉంటుంది. 

---------------------------------------


ధనస్సు


దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. అవరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------


మకరం


విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేపట్టిన పనుల్లో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది.

---------------------------------------


కుంభం


మిత్రుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. భూ వివాదాలు పరిష్కారమౌతాయి. వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా సాగుతారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల ఊహలు నిజమవుతాయి. ఉద్యోగుల ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.

---------------------------------------


మీనం


వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులుంటాయి. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున పరిస్థితులు అంతగా అనుకూలించవు.

---------------------------------------

23, మే 2026, శనివారం

సంపూర్ణ మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*750 వ రోజు*

అశ్వమేధ పర్వము చతుర్ధాస్వాసం

యాగములో జరిగిన దానధర్మాలు

ధర్మరాజు సదస్యులకు కోటివేల నిష్కములు దానముగా ఇచ్చాడు. వ్యాసుడికి ధర్మరాజు తనరాజ్యమును దానముగా ఇచ్చాడు. వ్యాసుడు " ధర్మనందనా ! నీవు నాకు భూమిని దానంగా ఇచ్చావు. నేను ఈ భూమిని ఏమి చేసుకుంటాను. దానికి సమానమైన బంగారమును దానముగా ఇవ్వు " అని అన్నాడు. ధర్మరాజు " వ్యాసమునీంద్రా ! అశ్వమేధయాగ సమాప్తంలో భూదానము చెయ్యాలని ఆర్యులు అంటారు. అందు వలన అర్జునుడి వలన జయింపబడిన భూమిని నీకు దానము ఇచ్చాను. నాకు ఇక రాజ్యము లేదు. కనుక వనవాసముకు వెడతాను. అంతేకాని ఇచ్చిన రాజ్యము తిరిగి తీసుకోను " అన్నడు. వ్యాసుడు " ధర్మతనయా ! నీ చేత దానముగా స్వీకరించబడిన ఈ భూమి నాకే స్వంతము అనుటలో ఎటువంటి సందేహము లేదు. అందుకని మేము తిరిగి ఈ భూమిని నీకు అమ్ముతున్నాము నువ్వు తగిన వెల ఇచ్చి దానిని తిరిగి నీవే తీసుకో. ఇది రాజధర్మము ఇందులో ఎమీ తప్పులేదు " అని వ్యాసుడు చెప్పాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణుడు కూడా వ్యాసుడు చెప్పినట్లే చెయ్యమన్నాడు. అప్పుడు ధర్మరాజు కోటికోట్లమాడలు కుప్పగా పోసి " నేను దానముగా ఇచ్చిన భూమి వెల ఇంత " అన్నాడు. వ్యాసుడు ఆ బంగారమును తీసుకుని రాజ్యాన్ని ధర్మరాజుకు తిరిగి ఇచ్చాడు. ఆ బంగారమును వ్యాసుడు యాగముకు వచ్చిన బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. ధర్మరాజు యాగము కొరకు తయారుచేసిన బంగారు పళ్ళెములు, బిందెలు, ఇతర వస్తువులు బ్రాహ్మణులకు పంచి పెట్టాడు. బ్రాహ్మణ దానములు అయిన తరువాత క్షత్రియులకు ఆ తరువాత వైశ్యులకు, ఆ తరువాత శూద్రులకు, ఆ తరువాత ఇంకా తక్కువ జాతి వారికి అపారముగా దానములు చేసాడు. యజ్ఞముకు వచ్చిన వారంతా అత్యంత సంతుష్టులై వారి వారి నివాసములకు వెళ్ళారు. వేదవ్యాసుడు తన వంతుకు వచ్చిన ధనమును కుంతీదేవికి ఇచ్చాడు. కుంతీదేవి ఆ ధనమును పేదలకు పంచి ఇచ్చింది. జనమేజయ మహారాజా ! దానములలో ధర్మరాజు రెండవ మరుత్తు అనిపించుకున్నాడు. యజ్ఞము పరిసమాప్తి అయిన తరువాత ధర్మరాజు తమ్ములతో భార్య ద్రౌపదితో యజ్ఞస్నానము చేసాడు. ఈ యజ్ఞముతో ధర్మరాజు తన మనసును శరీరాన్ని పవిత్రము చేసుకున్నాడు. ఆ యజ్ఞమును నిర్విజ్ఞముగా జరిపించిన వ్యాసుడికి ధర్మరాజు సాష్టాంగప్రమాణము చేసాడు. ధర్మరాజును దీవించి వ్యాసుడు తన శిష్యులతో అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

యాగానంతరం రాజులను సత్కరించుట

అశ్వం తిరిగివచ్చిన తరువాత జరిగిన విందులో యుధిష్టురినితో మాట్లాడుతున్న కృష్ణుడు - రాజ్మానామా నుండి ఒక దృశ్యం

వ్యాసుడు తన శిష్యులతో వెళ్ళిన తరువాత ధర్మరాజు " యాగముకు వచ్చిన రాజులకు సముచిత సత్కారాలు చేసాడు. బంగారమును, మణులను, నగలను, మాణిక్యాలను, నగలను, ఏనుగులను, అశ్వములను, వేశ్యలను కానుకగా ఇచ్చాడు. బభ్రువాహనుడికి సముచుత సత్కారము చేసి తన దేశముకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చాడు. ఎన్ని రోజులుగానో అర్జునుడికి దూరముగా ఉన్న ఉలూపి, చిత్రాంగదలు తమ భర్త అర్జునుడి వద్ద ఉండి పోయారు. బభ్రువాహనుడు మాత్రము తన దేశానికి తిరిగి వెళ్ళాడు. అందరికంటే ముందుగా యాగము చూడడానికి వచ్చిన శిశుపాలుని భార్యను ధర్మరాజు సముచితంగా సత్కరించాడు. ఆమె మనుమడిని సింధుదేశానికి అధిపతిగా పట్టాభిషిక్తుడిగా చేసాడు. తరువాత భారత యుద్ధములో ఓడిపోయి చనిపోయిన రాజుల రాజ్యాలను వారి వారసులకు ఇచ్చివేసాడు. అందరూ వెళ్ళిన తరువాత కూడా శ్రీకృష్ణుడు, బలరాముడు, యాదవ ప్రముఖులు ఉండిపోయారు. శ్రీకృష్ణుడికి, బలరాముడికి, సాత్యకికి, మిగిలిన యాదవ ప్రముఖులకు ధర్మరాజు అనేక రత్నాభరణాలు, విలువైన కానుకలు ఇచ్చి సత్కరించాడు. ధర్మరాజు చేసిన సత్కారాలకు తృప్తిచెందిన యాదవప్రముఖులు ద్వారకకు తిరిగి వెళ్ళారు " అని వైశంపాయనుడు జనమేజయునికి అశ్వమేధయాగ విశేషములు తెలిపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*