5, ఫిబ్రవరి 2026, గురువారం

భగవంతుడు నాకేమిచ్చాడు?”

  *“భగవంతుడు నాకేమిచ్చాడు?” ఇతరులకు ఉన్నది నాకు లేదు, అని అనుకునే ప్రతి ఒక్కరూ.. ఒక్కసారి ఆలోచించాల్సిన అమూల్యమైన నిజాలు ఇవి..*


1️⃣ టైర్లు నడిపితే అరిగిపోతాయి…

కానీ మన పాదాల అరికాళ్లు జీవితాంతం నడిచినా కొత్తగానే ఉంటాయి.


2️⃣ మన శరీరం సుమారు 75% నీటితో తయారైనదే…

లక్షలాది రంధ్రాలు ఉన్నా

ఒక్క చుక్క నీరు కూడా లీక్ అవదు.


3️⃣ ఆసరా లేకుండా ఏ వస్తువూ నిలబడదు…

కానీ మన శరీరం మాత్రం తన సమతుల్యతను తానే కాపాడుకుంటుంది.


4️⃣ ఛార్జింగ్ లేకుండా బ్యాటరీ పనిచేయదు…

కానీ గుండె మాత్రం పుట్టుక నుంచి మరణం వరకు నిరంతరం కొట్టుకుంటూనే ఉంటుంది ❤️


5️⃣ ఏ పంపు శాశ్వతంగా పనిచేయదు, కానీ రక్తం మాత్రం జీవితాంతం శరీరం అంతటా

అలుపెరుగకుండా ప్రవహిస్తుంది.


6️⃣ ప్రపంచంలోని ఖరీదైన కెమెరాలకూ పరిమితులు ఉంటాయి, కానీ మన కళ్ళు

వేల మెగాపిక్సెల్‌ల నాణ్యతతో ప్రతి దృశ్యాన్ని గ్రహిస్తాయి 👀


7️⃣ ఏ ప్రయోగశాల అన్ని రుచులను పరీక్షించలేకపోయింది, కానీ నాలుక మాత్రం

ఏ పరికరాలు లేకుండానే వేలాది రుచులను గుర్తిస్తుంది 👅


8️⃣ అత్యాధునిక సెన్సార్లకూ హద్దులుంటాయి కానీ మన చర్మం ప్రతి చిన్న అనుభూతినీ స్పష్టంగా గ్రహిస్తుంది.


9️⃣ ఏ యంత్రం అన్ని భావాలతో శబ్దాలను సృష్టించలేదు కానీ మన గొంతు మాత్రం భావాలు, ఆనందం, బాధ. అన్నింటినీ వ్యక్తపరుస్తుంది 🗣️


🔟 ఏ యంత్రం శబ్దాలను సంపూర్ణంగా అర్థం చేసుకోలేదు కానీ చెవులు మాత్రం ప్రతి శబ్దాన్ని విని దాని భావాన్ని కూడా గుర్తిస్తాయి 👂


*ప్రకృతి / భగవంతుడు మనకు ఇచ్చిన ఈ అమూల్యమైన శరీరం ఒక వరం. దానిని కృతజ్ఞతతో సంరక్షించుకోవడమే మన మానవ కర్తవ్యం.* 🙏


*🌻శుభోదయం🌻*

*🌻శుభమస్తు 🌻*

చందనం

  శుభోదయమ్💐💐 


"సుభాషితమ్"


శ్లో𝕝𝕝 న వ్యాప్తిరేషా గుణినో

గుణవాన్ జాయతే ధ్రువమ్ |

చన్దనోఽనలసన్దగ్ధో

న భస్మ సురభిః క్వచిత్||


        "దృష్టాన్తకలికాశతకమ్ "


తా𝕝𝕝 "చందనం" సువాసనా భరితమైనప్పటికి, అది అగ్నిచేత కాల్చబడినప్పుడు దాని భస్మానికి ఆ సువాసన ఎట్లుండదో, అలానే గుణవంతునికి గుణవంతులైన సంతానమే కలుగుతారనే నియమమేమీ లేదు.

నిజమైన పూజ*

  *నిజమైన పూజ*

                ➖➖➖✍️


*పూజ గదిలో - 30 నిమిషాలు*


*బయట - 23 గంటల 30 నిమిషాలు*


*1) ఏది పూజ? ఎంత సేపు పూజ?*


*2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?*


*3) నిద్ర లేవగానే -* 

    *i) శ్రీహరి గుర్తుకు రావాలి*

   *ii) భూమికి నమస్కరించాలి*

   *iii) అరచేతిలో లక్ష్మీదేవిని* 

         *చూడాలి*


*4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.*


*5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.*


*6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.*


*7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.*


*8) అన్నం తింటుంటే, కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.*


*9) మంచి నీళ్ళు త్రాగేటప్పుడు, జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.*


*10) ఊపిరి తీస్తుంటే, గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.*


*11) పసి పిల్లలను, అందమైన స్త్రీలను చూసినప్పుడు ఈశ్వర మాయ గుర్తుకు రావాలి.*


*12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.*


*13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.*


*14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.*


*15) నిద్ర పోయేటప్పుడు, స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.*


*ఇలా…*

*అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.*

✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

విషం

  *శుభోదయమ్*


శ్లో𝕝𝕝 విషం కుపఠితా విద్యా 

విషం వ్యాధిరనౌషధమ్।

విషం వ్యాధిర్ద్రరిద్రస్య 

వృద్ధస్య తరుణీ విషమ్॥


తా𝕝𝕝 "సరిగా నేర్చుకొనని విద్య విషం. ఔషధం లేని వ్యాధి విషం. దరిద్రుడికి వ్యాధి విషం. వృద్ధుడికి యువతి విషం."    

🙏🙏🙏

హరివంశము జగన్నాథ శర్మ

 హరివంశము జగన్నాథ శర్మ


కృష్ణుని వీరావేశం:జరాసంధుని పలాయనం


బలరామకృష్ణులను ఎదిరించడం ఎవరితరమూ కాలేదు. వారి ధాటిని తట్టుకోలేక పారిపోతున్న తన సైన్యాన్ని చూసి, కేకేశాడిలా జరాసంధుడు.


యోధులారా! ఆయుధాలు విసర్జించి యుద్ధంలో పరుగుదీయడం భ్రూణహత్యతో సమానం. మీరు భూపాలకులు. వారు గోపాలకులు. భుజబలంలో మిమ్మల్ని మించినవారు లేరు. మీకు ఈ పలాయనం తగదు. వెనుతిరిగిరండి! పోరాటం ప్రారంభించండి. మీకు తోడుగా నేనున్నాను. నా బాణాలతో ఆ బలరామకృష్ణుల అంతు చూస్తాను. విజయం మనదే!


జరాసంధుని ధైర్యవచనాలకు మగధసైన్యం మళ్ళీ యుద్ధంలో ప్రవేశించింది. వారందరినీ తన వెనుకగా ఉంచుకుని, బలరామకృష్ణులను ఎదుర్కొన్నాడు జరాసంధుడు. భేరీ భాంకారధ్వని మిన్నందుకుంది. గజఘీంకారాలతో, రథచక్రఘోషలతో, గుర్రాల సకిలింపులతో, భటుల సింహనాదాలతో భూనభోంతరాలు ప్రతిధ్వనించాయి. జరాసంధుని అండగా అతని మంత్రి సామంతులు బలరామకృష్ణులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. పెనుకెరటాల్లా మీద పడుతున్నా, ఎదిరిస్తున్నా బలరామకృష్ణులు వెనుతిరగలేదు. అస్త్ర శస్త్రాలను ఒకేక్షణం జరాసంధసైనికులపై ప్రయోగించి, మహెూత్సాహంతో గొంతెత్తి గర్జించారు.


ఏనుగుల కుంభస్థలాలను పగులగొట్టారిద్దరూ. చచ్చిన ఏనుగులు కుప్పలుకుప్పలుగా నేలకూలాయి. చక్రప్రయోగంతో సైనికులశిరస్సులు ఖండించాడు కృష్ణుడు. యుద్ధరంగం అంతటా ఖండితశిరస్సులే! భూమి అన్నది కనిపించకుండాపోయింది. బలరాముడు నాగేలు గుండెలు చీల్చడంతో రక్తం కాలువలుకట్టి ప్రవహించసాగింది. ఆయుధాలెత్తి యుద్ధం చేయనేలేదు కొందరు. బలరామకృష్ణుల కేకలకే గుండెలదిరి, ఎక్కడ ఉన్నదీ, ఏమి చేస్తున్నదీ తెలియక మతిచెడి కుప్పకూలిపోయారు. చెప్పాలంటే... రక్తతటాకాలతో, మాంసరాసులతో, పేగుల పెనుపోగులతో, కపాలాలతో ఆ ప్రాంతం అంతా భూత, భేతాళ, డాకినీగణాలకు విహారస్థలి అయింది. రాబందులూ, గెద్దలూ నలువైపులా తిరుగుతూ కలకలం సృష్టించ సాగాయి.


చూశారది జరాసంధుని సామంతులు. బెదిరిపోయారు. పరుగుదీశారు. పరుగుదీస్తున్న శత్రురాజులను ఉద్దేశించి హెచ్చరించాడిలా కృష్ణుడు.


రాజులారా! మీకు వాహనాలు ఉన్నాయి. మీరు వీరాధివీరులు. అనేకయుద్ధాలు చేసి, ఆరితేరారు. మా అన్నదమ్ములిద్దరికీ పెద్దగా యుద్ధం తెలియదు. పైగా మాకు వాహనాలు లేవు. నేలమీద నిల్చునే యుద్ధం చేస్తున్నాం. అయినా మేమంటే భయపడి మీరు పరుగుదీసి, చెట్లంటా, పుట్టలంటా దాగుంటున్నారు, ఇది మీకు తగదు. రాజధర్మంకాదు. మీరు అసలు సంగతి గ్రహించడంలేదు. ఆ జరాసంధుడు, మిమ్మల్ని ముందుంచుకుని, తాను వెనక్కి నక్కి యుద్ధతంత్రం చేస్తున్నాడు. మీరు పరుగెత్తి లాభం లేదు, జరాసంధుణ్ణి ముందుకు నెట్టండి, అతనితో చావోరేవో మేము తేల్చుకుంటాం.


కృష్ణునిమాటలకు కోపగించుకున్నాడు జరాసంధుడు. భగ్గున మండిపడ్డాడు. కవచాన్ని ధరించాడు. విల్లమ్ములు చేపట్టాడు. రథాన్ని అధిరోహించి, తానొక్కడే కృష్ణునితో తలపడేందుకు ముందుకురికాడు. ధనుష్టంకారం చేశాడు. అన్నాడిలా.


కృష్ణా! నేనిక్కడ ఉంటూండగానే మా సామంతులను నువ్వు అదిరించి, బెదిరిస్తున్నావంటే నిన్నేమనుకోవాలి? అడవుల్లో ఆలమందలను అదిలించడం కాదు. ఇది యుద్ధరంగం, గుర్తు పెట్టుకో! నువ్వు ధైర్యసాహసాలుగలవాడవనీ, మహాశూరుడువనీ లోకం చెప్పుకుంటోంది. అదెంత నిజమో ఇప్పుడు తేలిపోవాలి. తేల్చేస్తాను. యుద్ధం అంటే గొప్పలు చెప్పుకోవడం కాదు. నిలిచి ధైర్యంగా పోరాడడం. నిలు! నువ్వో నేనో తేలిపోతుంది. నరకం ఎలా ఉంటుందో చూసి ఎరుగవు. ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు!


వినరాని మాటలవి. విని ప్రజ్వలించాడు కృష్ణుడు. కన్నెర్రచేశాడు. అన్నాడిలా.

అవును! నువ్వో నేనో తేలిపోవాలి, తేల్చుకుందాం, రా! నీ ముందే నిల్చున్నాను, నీకోసమే నిల్చున్నాను, రా! సోల్లుమాటలొద్దు, కార్యశూరులు మాటలాడరు. ప్రయోగించు నీ శస్త్రాస్త్రాలు. తట్టుకోగలనో లేదో నీకే కాదు, నాకూ తెలుస్తుంది.


మాట పూర్తి చెయ్యకుండానే ఎనిమిది బాణాలు ప్రయోగించి, జరాసంధుని గుండెను దెబ్బతీశాడు కృష్ణుడు. అయిదుబాణాలు ప్రయోగించి, సారథిని స్పృహతప్పేలా చేశాడు. అశ్వాలపై అనేక బాణాలు ప్రయోగించాడు. వాటి ధాటికి తట్టుకోలేక అశ్వాలు అటూ ఇటూ పరుగుదీయసాగాయి. అదే అదనుగా సరైన బాణప్రయోగంతో జరాసంధుని విల్లును రెండుముక్కలు చేశాడు బలరాముడు.


తమ రాజు విల్లు విరిగిపోయింది. రాజు నిశ్చేష్టుడయ్యాడు. అది చూసి, కౌశిక చిత్రసేనులు ముందుకురికారు. ఆకాశం అదిరిపోయినట్టుగా గర్జనలు చేశారు. బలరామునిపై మూడు బాణాలూ, కృష్ణునిపై అయిదుబాణాలూ ప్రయోగించారు. మహెూత్సాహంతో పెనుకేకలు వేశారు. ఆ కేకల్ని తట్టుకోలేకపోయాడు బలరాముడు. కోపంతో రగలిపోయాడు. అర్థచంద్ర బాణాన్ని ప్రయోగించాడు. కౌశికుని విల్లు విరిచాడు. తర్వాత మరో విల్లు అందుకునే అవకాశం ఈయకుండా పుంఖానుపుంఖాలుగా బాణాలు ప్రయోగించి, అతన్ని అచేతనుణ్ణి చేశాడు. అదే అవకాశంగా నాలుగుబాణాలు ఒక్కసారిగా ప్రయోగించి, కౌశికుని గుర్రాలను కూల్చాడు కృష్ణుడు. గుర్రాలు కూలిపోవడంతో రథం విరిగింది. నిలువునా కూలిపోయింది. కిందపడ్డాడు కౌశికుడు. శత్రువుని ఎదుర్కోవాలి. గదను అందుకున్నాడు. ఆ గదతో బలరాముని ఎదుర్కొనేందుకు అటుగా పరుగుదీశాడు. అతన్ని అడ్డుకున్నాడు కృష్ణుడు. అసంఖ్యాకబాణాలు ప్రయోగించి, కౌశికుణ్ణి కదిలేందుకు వీలులేకుండా చేశాడు.


చిత్రసేనుణ్ణి సంహరించేందుకు బలరాముడు శరవర్షం ప్రారంభించాడు. చిత్రసేనునికి ఊపిరి ఆడడంలేదు. అది గమనించాడు జరాసంధుడు. పరుగున అటుగా వచ్చాడు. బాణవర్షం కురిపించి, బలరాముని విల్లు విరిచాడు. ఇంకో విల్లును అందుకునే అవకాశాన్ని ఇవ్వలేదు. బాణాలు ఒక్కుమ్మడిగా ప్రయోగించి, గర్జించాడు. వీలు చూసుకుని బాణాన్ని అందుకున్నాడు బలరాముడు. శౌర్యావేశంతో సాయక ప్రయోగం చేశాడు. జరాసంధుని ఎదుర్కొన్నాడు. అతడటు జరాసంధుని ఎదుర్కొనడాన్ని గమనించిన చిత్రసేనుడు, సరైన సమయం ఇదేనన్నట్టుగా గదనొకదాన్ని తీసుకుని గురిచూసి బలరామునిమీదికి విసిరాడు.


కౌశికుణ్ణి కదలకుండా నిలబెట్టిన కృష్ణునివైపు పరుగుదీశాడు జరాసంధుడు. అయిదు, ఏడు, ఎనభై, తొంభైబాణాలను ప్రయోగించి, కృష్ణుణ్ణి తీవ్రంగా గాయపరిచాడు. రక్తధారలతో కృష్ణుడు కుప్పకూలిపోయేలా చేశాడు. ఆనందంతో పెద్దగా కేకేశాడు. కుప్పకూలిన కృష్ణుడు తేరుకున్నాడు. లేచి నిల్చున్నాడు. శరీరాన్ని బాధిస్తున్న గాయాలను లెక్కచేయలేదతను. గురి చూసి బల్లెం విసిరి, జరాసంధుని విల్లును రెండుముక్కలు చేశాడు. విరిగిన విల్లుని అవతల పడేసి, గదను అందుకున్నాడు జరాసంధుడు. కిందికి దూకాడు. పరుగున కృష్ణుణ్ణి సమీపించాడు. గదతో అతని గుండెమీద మోదాడు. అడ్డగించినా గద ఆగలేదు. విసురుగావచ్చి గుండెమీద కొండలా పడింది. దాంతో కృష్ణుడు, స్పృహతప్పి నేలకి ఒరిగిపోయాడు. చూశాడది బలరాముడు. ఆందోళనచెందాడు. బలరాముని ఆందోళనా, నేలకు ఒరిగిన కృష్ణుని చూసి, అయిపోయాడు కృష్ణుడు, ప్రాణాలుకోల్పోయాడు అనుకున్నాడు జరాసంధుడు. ఆనందంగా పెద్దగా కేకలువేసి, అటూ ఇటూ తిరగసాగాడు. బలరాముడు అది గమనించి, సహించలేకపోయాడు. ఒకచేత్తో గదనీ, మరోచేత్తో ముసలాయుధాన్నీ పట్టుకుని జరాసంధుణ్ణి ఎదుర్కొన్నాడు. అతని గుండెమీదా, నుదుటిమీదా గాయాలు చేశాడు. దాంతో తల తిరిగినట్టయింది జరాసంధునికి. కూలబడ్డాడు. మోకాళ్ళమీద ఆనుకున్నాడు. అయినా నిలువలేకపోయాడు. స్పృహతప్పి కిందపడ్డాడు. కిందపడుతున్న జరాసంధుణ్ణి చూసి, జబ్బలు చరచిమరీ గర్జించాడు బలరాముడు. అతని గర్జన నలుదెసలా ప్రతిధ్వనించింది.


కాసేపటికి జరాసంధుడు తేరుకున్నాడు. పక్కనున్న గదను అందుకున్నాడు. ఆ గదను చక్రంలా తిప్పుతూ బలరామునిపైకి లంఘించాడు. బలరాముడు అందుకు సిద్ధంగానే ఉన్నాడు. తనగదతో అతన్ని ఎదుర్కొన్నాడు. అతని గదను ముక్కలుముక్కలు చేశాడు. తునాతునకలైన గదను చూసి, చలించలేదు జరాసంధుడు. వెంటనే శక్తి అనే ఆయుధాన్ని అందుకున్నాడు. దానిని బలరామునిపై ప్రయోగించాడు. వెంటనే గదను ఒకటి విసిరాడు అతనిపైకి. ఆపై మరో శక్తిని ప్రయోగించాడు. మూడు ఆయుధాలను వెంటవెంటనే ప్రయోగించి, చాలదన్నట్టు కుడిచేతిని పిడికిలిచేసి, బలరామునిపొట్టలో ఒక్కపోటు పొడిచాడు జరాసంధుడు. ఆ దెబ్బకు బలరాముడు స్పృహకోల్పోయాడు. నేలమీద పడిపోయాడు. ఆకాశంలోని దేవతలు అది చూసి ఆశ్చర్యపోయారు. అయ్యయ్యో అని బాధపడ్డారు.

కృష్ణుడు అప్పటికి తేరుకున్నాడు. అన్న బలరామునికోసం చూశాడు. అతడు స్పృహతప్పి పడి ఉండడాన్ని గమనించాడు. కోపంతో అనేకబాణాలు ప్రయోగించాడు. జరాసంధుణ్ణి గాయపరిచాడు. గాయాలకు బెదరలేదు జరాసంధుడు. కృష్ణునిపై శక్తిని ప్రయోగించి, ఎలుగెత్తి గర్జించాడు. వస్తున్న శక్తిని మార్గమధ్యంలోనే అందుకున్నాడు కృష్ణుడు. అందుకుని, దానినే జరాసంధునిపైకి ప్రయోగించాడు. అతన్ని స్పృహతప్పేలా చేశాడు. స్పృహతప్పేవాడే జరా సంధుడు. అయితే తల విదిల్చి తేరుకున్నాడు. తేరుకుని పరిఘాయుధాన్ని కృష్ణునిపైకి ప్రయో గించాడు. ఆ పరిఘాయుధాన్ని కృష్ణుడు శార్థం ప్రయోగించి, తునాతునకలు చేశాడు. ఇకప్పుడు చేసేదిలేక నిశ్చేష్టుడయ్యాడు జరాసంధుడు.


ఆసరికి బలరాముడు తేరుకున్నాడు. లేచి జరాసంధునికోసం చూశాడు. కనిపించాడతను. కోపంగా అన్నాడిలా.


ఇక నీ చావు తప్పదు! జరాసంధా కాచుకో!


పరుగుదీశాడటువైపు. వస్తున్న బలరాముణ్ణి అడ్డుకున్నాడు దరదుడు. అన్నాడిలా.


బలరామా! జరాసంధుని సంహరించడం నీవల్లకాదు. అతడు మహాశౌర్యశాలి. మేరు ధీరుడు. ముందు నన్ను ఎదిరించు! తర్వాత మారాజు సంగతి చూద్దూగాని,


రా అయితే! అన్నాడు బలరాముడు. నాగలితో ఎదుర్కొన్నాడతన్ని. దరదుడు పరిఘా యుధంతో విరుచుకుపడ్డాడు. ఇద్దరిమధ్యా భీకరయుద్ధం జరిగింది. రెండు ఏనుగులు కోట్లాడుకున్నట్టుగానే కోట్లాడుకున్నారిద్దరూ. ఆఖరికి నాగలిని దరదుని వీపునకు గుచ్చి, అతన్ని కిందకి పడవేశాడు బలరాముడు. కిందపడ్డ దరదుని పైకెక్కి కాళ్ళతో కుమ్మికుమ్మివేశాడు. రక్తంకక్కుకుని దరదుడు మరణించాడప్పుడు. జరిగినదంతా జరాసంధునిసహా మిగిలిన సామంతులంతా చూశారు. భయపడ్డారు. పారిపోయారక్కణ్ణుంచి. పారిపోతున్న సామంతులను చూస్తూ, ఏం చెయ్యాలో పాలుపోక నిల్చున్న జరాసంధుని పైకి కౌమోదకితో దాడిచేశాడు కృష్ణుడు. అతని ఎముకలన్నీ పగిలేట్టుగా దెబ్బతీశాడు. ఊహించని మెరుపుదాడి. తిరిగి ఎదుర్కొనే సత్తాలేకపోయింది. జరాసంధుడు కిందపడ్డాడు. కిందపడ్డ జరాసంధుని మీదికి ఉరికి, పిడికిటిపోట్లతోనూ, కాళ్ళతోనూ మర్దించాడు కృష్ణుడు. బలరాముడు అది చూసి ఆనందించసాగాడు. ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. వీలుచిక్కట్లేదు. దెబ్బలుతింటూ స్పృహ కోల్పోయాడు జరాసంధుడు. అంతలోనే తేరుకున్నాడు. ఆసరికి వీలుచిక్కింది. లేచి, రథాన్నీ, ఆయుధాల్ని కూడా పట్టించుకోకుండా పరుగుదీశాడు జరాసంధుడు. రణాంగణం నుండి దూరంగా పారిపోయాడు. ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎప్పుడైతే జరాసంధుడు యుద్ధరంగంనుండి పారిపోయాడో అప్పుడు సామంతరాజులు కూడా పరుగుదీసి అరణ్య మధ్యానికి చేరుకున్నారు. అక్కడా ఇక్కడా దాగుని ప్రాణాలు దక్కించుకున్నారు. రాజులు పారిపోతే సైన్యం ఉంటుందా? వారూ పలాయనం చేశారు. నలువైపులా చెదరిపోయారు.


తరువాయి భాగం

సృగాలవాసుదేవుని సంహారం: మధురప్రవేశం


ప్లీజ్ లైక్ అండ్ షేర్ 🙏 🙏 🙏 🙏 🙏 


🙏 నమస్కారం మిత్రులారా…

నేను మీకోసం హరివంశము కథలను

శ్రద్ధగా, భక్తితో అందిస్తున్నాను.

ఈ ప్రయత్నం మీకు నచ్చితే,

ఈ కథలు కొనసాగాలి అనుకుంటే,

👉 దయచేసి ఈ పోస్ట్‌కి Facebook Stars పంపించి

మీ ప్రోత్సాహం తెలియజేయండి.

మీ ప్రతి స్టార్‌ నాకు ఒక ఆశీర్వాదం లాంటిది.

🙏 ధన్యవాదాలు…

ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది*

 *భారతదేశ ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది*


చాలా తీవ్రమైన విషయం

భారతదేశ ఆరోగ్యరంగం కుప్పకూలే అంచున ఉంది — ఈ విషయం భారత పార్లమెంటరీ కమిటీ కూడా అంగీకరించింది.


Zee న్యూస్ తాజాగా విడుదల చేసిన ఒక పరిశోధన నివేదిక ప్రకారం, భారతదేశంలో జరిగే మానవ శస్త్రచికిత్సల్లో సుమారు 44% నకిలీ, మోసపూరితమైనవి లేదా అవసరం లేనివి.

అంటే దేశంలో జరిగే ఆపరేషన్లలో దాదాపు సగం రోగులను లేదా ప్రభుత్వాన్ని దోచుకోవడానికే చేస్తున్నారన్న మాట.


నివేదిక ప్రకారం:


గుండె శస్త్రచికిత్సల్లో – 55%


గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) – 48%


క్యాన్సర్ ఆపరేషన్లు – 47%


మోకాళ్ల మార్పిడి – 48%


సిజేరియన్ డెలివరీలు – 45%


భుజం, వెన్నెముక మొదలైన మరెన్నో ఆపరేషన్లు – నకిలీ లేదా అవసరం లేనివి.


మహారాష్ట్రలోని పలు ప్రసిద్ధ ఆసుపత్రులపై జరిగిన సర్వే ప్రకారం, పెద్ద ఆసుపత్రుల్లో ఉన్న సీనియర్ వైద్యులకు నెలకు ₹1 కోటి వరకు జీతం ఇస్తున్నారు.

కారణం: ఎక్కువ టెస్టులు, చికిత్సలు, ఆసుపత్రి చేరికలు లేదా ఆపరేషన్లు సూచించే వైద్యులకే ఎక్కువ జీతం ఇస్తారు — అవి అవసరం ఉన్నా లేకపోయినా.

(మూలం: BMJ Global Health)


The Times of India నివేదిక ప్రకారం, కొన్ని ఆసుపత్రుల్లో మరణించిన రోగులను సజీవులుగా చూపించి చికిత్స పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు — ఇది అత్యంత దారుణమైన చర్య.


ఒక ఘటనలో, ఒక ప్రముఖ ఆసుపత్రి 14 ఏళ్ల బాలుడిని మరణించినప్పటికీ ఒక నెలపాటు వెంటిలేటర్‌పై ఉంచి “చికిత్స” కొనసాగించింది.

తరువాత అతను మృతుడని ప్రకటించగా, ఆసుపత్రిని దోషిగా తేల్చి కుటుంబానికి ₹5 లక్షల పరిహారం ఇచ్చారు — కానీ వారి మానసిక వేదనకు ఎవరూ పరిహారం ఇవ్వగలరా?


కొన్ని ఆసుపత్రులు మరణించిన రోగులపై తక్షణ శస్త్రచికిత్స అవసరమని చెప్పి, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకుని, తర్వాత “ఆపరేషన్ సమయంలో మరణించాడు” అని ప్రకటిస్తారు.

ఇలా భారీ మొత్తాలు దోచుకుంటారు.

(మూలం: Dissenting Diagnosis – డాక్టర్ గద్రే & డాక్టర్ శుక్లా)


హెల్త్ ఇన్సూరెన్స్ (మెడిక్లెయిమ్) మోసం


ఇది కూడా అంతే భయంకరమైన విషయం.

భారతదేశంలో సుమారు 68% మందికి ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ, అవసరమైనప్పుడు క్లెయిమ్ తిరస్కరించబడుతుందో లేదా కొంతమాత్రమే చెల్లిస్తారో.

మిగతా ఖర్చు కుటుంబం భరించాల్సి వస్తుంది.


సుమారు 3,000 ప్రసిద్ధ ఆసుపత్రులు నకిలీ క్లెయిమ్‌ల కారణంగా ఇన్సూరెన్స్ కంపెనీల చేత బ్లాక్‌లిస్ట్ చేయబడ్డాయి.

కోవిడ్ సమయంలో అనేక పెద్ద ఆసుపత్రులు నకిలీ కోవిడ్ కేసులు సృష్టించి బీమా కంపెనీలను మోసం చేశాయి.

మానవ అవయవాల అక్రమ రవాణా


ఇది భారీ స్థాయిలో జరుగుతోంది.

2019లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ బయటపెట్టిన సంఘటనలో — కన్పూర్‌కు చెందిన సంగీతా కశ్యప్ అనే మహిళను ఉద్యోగం పేరుతో ఢిల్లీలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఆమెను “హెల్త్ చెక్‌అప్” పేరుతో ఫోర్టిస్ ఆసుపత్రిలో చేర్చారు.

అదృష్టవశాత్తూ, వైద్యులు “డోనర్” అనే పదం వాడటం విని ఆమె తప్పించుకుంది.

ఆమె ఫిర్యాదు తరువాత డాక్టర్లు, సిబ్బంది, పోలీసు అధికారులు పాల్గొన్న అంతర్జాతీయ అవయవ రవాణా ముఠా బయటపడింది.


హాస్పిటల్ రిఫరల్ మోసం


కొంతమంది వైద్యులు రోగికి తీవ్రమైన వ్యాధి ఉందని అబద్ధం చెబుతూ పెద్ద ఆసుపత్రులకు పంపిస్తారు.

అపోలో, ఫోర్టిస్, ఏపెక్స్ వంటి ఆసుపత్రులు ఈ రిఫరల్ ప్రోగ్రాంలు నడుపుతాయి.


ఉదాహరణకు, ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్ ఇచ్చిన ఆఫర్లు:


40 రోగులను పంపితే ₹1 లక్ష,


50 రోగులకు ₹1.5 లక్షలు,


75 రోగులకు ₹2.5 లక్షలు.


రోగి పరిస్థితి ఏదైనా కావచ్చు — వైద్యుడికి రిఫరల్ ఫీజు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమవుతుంది.


డయాగ్నస్టిక్ టెస్టుల మోసం


ఇది వేల కోట్ల రూపాయల వ్యాపారం.

బెంగళూరులోని ఒక ప్రసిద్ధ ల్యాబ్‌పై ఆదాయపు పన్ను దాడిలో ₹100 కోట్లు నగదు, 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు — ఇవన్నీ వైద్యులకు లంచం ఇవ్వడానికి ఉంచినవే.


డాక్టర్లు అవసరం లేని టెస్టులు సూచించి 40–50% కమిషన్ తీసుకుంటారు.

చాలా టెస్టులు కాగితాలపై మాత్రమే ఉంటాయి.

అందుకే భారతదేశంలో 2 లక్షలకు పైగా ల్యాబ్‌లు ఉన్నప్పటికీ, కేవలం 1,000 మాత్రమే సర్టిఫైడ్.


ఔషధ కంపెనీల అవినీతి


సుమారు 20–25 పెద్ద ఔషధ కంపెనీలు ప్రతి సంవత్సరం ₹1,000 కోట్లు వైద్యులపై ఖర్చు చేస్తాయి.

కోవిడ్ సమయంలో డోలో టాబ్లెట్ తయారీ కంపెనీ కూడా ఇలాంటి మోసంలో పట్టుబడింది.


వైద్యులు తమ ఔషధాలను సూచించేందుకు క్యాష్, విదేశీ పర్యటనలు, 5 స్టార్ హోటల్‌లో లగ్జరీ స్టేలు ఇస్తారు.

ఉదాహరణకు, USV Ltd. ప్రతి వైద్యుడికి ₹3 లక్షల నగదు లేదా ఆస్ట్రేలియా/అమెరికా టూర్ ఇస్తుంది.


హాస్పిటల్ – ఔషధ కంపెనీ గూటి మోసం


చాలా కంపెనీలు ఆసుపత్రులకు మందులు, పరికరాలు తక్కువ ధరకు విక్రయిస్తాయి, కానీ ఆసుపత్రులు వాటిని రోగులకు 10 రెట్లు ఎక్కువ ధరకు అమ్ముతాయి.


ఇండియా టుడే బయటపెట్టిన ఉదాహరణ:

EMCURE కంపెనీ తయారు చేసిన క్యాన్సర్ ఔషధం Temicure ఆసుపత్రులకు ₹1,950కు విక్రయిస్తే,

రోగులకు ₹18,645 వసూలు చేశారు.

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI)


2016లో ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదికలో, MCI కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చినా, వైద్యులను మరియు ఆసుపత్రులను పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొంది.


MCI నిబంధనలలో (చాలా సార్లు ఉల్లంఘింపబడేవి):


1. వైద్యులు బ్రాండెడ్ మందులు కాకుండా జనరిక్ మందులు మాత్రమే సూచించాలి.


2. చికిత్సకు ముందు ఫీజు వివరాలు వెల్లడించాలి.


3. ప్రతి పరీక్ష లేదా చికిత్సకు ముందు రోగి అనుమతి తప్పనిసరి.


4. రోగి రికార్డులు కనీసం 3 సంవత్సరాలు నిల్వ చేయాలి.


5. అనైతికంగా లేదా అనర్హంగా వ్యవహరించే వైద్యులను నివేదించాలి.

ప్రభుత్వ పథకాలలో అవినీతి


అగ్నివీరులు, మాజీ సైనికులు వంటి వారు కూడా ప్రభుత్వ పథకాల కింద నకిలీ ఆసుపత్రి చేరికలకు గురవుతున్నారు.

లక్షల రూపాయల నకిలీ బిల్లులు రూపొందించి ప్రభుత్వం, ఆసుపత్రులు, అవినీతి అధికారులు డబ్బు పంచుకుంటున్నారు.

👉 ఈ సందేశం ప్రతి పౌరుడికి చేరాలి.

తమను మరియు తమ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఈ నిజాలు తెలుసుకోవాలి.

మూత్రములో మంటను

   మూత్రములో మంటను నివారించుటకు సులభయోగాలు  -

 *  వేపపండ్లు దొరికే కాలంలో వాటిని విరివిగా వాడుతున్న మూత్రవిసర్జనలో మంట తగ్గును.

 *  దువ్వెన ఆకుల కషాయం పూటకు పావుకప్పు మోతాదులో ప్రతిపూటా తీసుకొంటుంటే త్వరగా తగ్గును. రోజుకు రెండుసార్లు శుభ్రమైన తుమ్మజిగురు చింతగింజ అంత ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగుచున్న త్వరగా తగ్గును.

 *  ఒక కప్పు పాలలో పచ్చి గరిక ముక్కలు రెండుచెంచాలు వేసి మరిగించి తాగాలి . అలా రోజుకు రెండుసార్లు చేస్తుంటే బాధ తగ్గును.

 *  ప్రతినిత్యం రెండుపూటలా గుప్పెడు చింతచిగుళ్ళు తింటుంటే మంట త్వరగా తగ్గును. చింతాకు రసం రెండు చెంచాలు రెండుపూటలా తీసుకొనుచున్న మంట అద్భుతంగా తగ్గును.

 *  కర్బుజా పండు గింజలను నూరి చెంచాడు తినాలి. ఉదయం , సాయంత్రం అలా చేస్తుంటే బాధ సులువుగా తగ్గును.

 *  మామిడి జీడి చూర్ణాన్ని అర చెంచా అరకప్పు పెరుగుతో కలిపి తినాలి. అలా ప్రతిపూటా తింటుంటే మూత్రవిసర్జనలోని మంట త్వరగా తగ్గును.

 *  బెండకాయను చిన్న ముక్కలుగా కోసి గ్లాసుడు నీళ్లలో గుప్పెడు ముక్కలు వేసి అరగంట పాటు మరిగించాలి. తీపికోసం కొంచం పంచదార కలిపి పూటకు అరకప్పు ఆ నీరు తాగాలి. అలా ప్రతిరోజూ తయారుచేసుకొని దానిని మూడుపూటలా తాగాలి. అలా రెండురోజులు చేసేసరికి మూత్రవిసర్జనతో ఏ బాధా ఉండదు. చాలా సులువుగా మూత్రం పోతుంది . లింగ , వృషణాలు , యోని , శరీరంలో అన్ని రకాల బాధలు అతి త్వరగా తగ్గును.

   

        

   

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


గమనిక  -

      

నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  

  

                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

     

.      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

          

.         కాళహస్తి వేంకటేశ్వరరావు  

       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 5 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣2️⃣6️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*    

        

                    *126 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


*దుర్యోధనుని అవమానభారం*```


ఇంతవరకు కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుని చూసి “మహర్షీ! ఎల్లప్పుడూ పాండవులకు హాని తలపెట్టే దుర్యోధనుడు శత్రువులచే బంధింపబడి పాండవులచే రక్షింపబడిన అవమాన భారాన్ని ఎలా భరించాడు. భరించి ఎలా హస్తినకు చేరాడు?” అని అడిగాడు.```


            *హస్థినాపురం*```


హష్తినాపురవాసి అయిన బ్రాహ్మణుడు ద్వైతవనానికి వెళ్ళి పాండవులను కలుసుకుని తిరిగి హస్థినకు వెళ్ళాడు. దృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుని చూసి పాండవుల యోగక్షేమాలు విచారించాడు. ఆ బ్రాహ్మణుడు పాండవులు ద్రౌపది అడవులలో పడే కష్టాలు వివరించాడు. దృతరాష్ట్రుడు అది విని ఎంతో దుఃఖించాడు. 

“అయ్యో! నా కుమారుని దుర్నీతి వలన కదా ఇంత కష్టం దాపురించింది. దీనికంతకు నాచేతకాని తనమే కారణం. ధర్మరాజును నా పెద్ద కొడుకుగా భావిస్తాను అతనికి బ్రహ్మదేవుడు ఎన్ని కష్టాలు రాసాడు. హంసతూలికా తల్పంపై నిదురించే ధర్మరాజు కటిక నేలపై నిదురిస్తున్నాడు కదా. అనిల కుమారుడు అతి బలవంతుడైన భీముడు అడవి సింహంలా వనాలలో తిరుగుతున్నాడు కదా. అన్నదమ్ములు ద్రౌపది పడుతున్న కష్టాలు చూసి అర్జునుడు మనసులో రగిలి పోతున్నాడు కదా. సుకుమారులైన కవలలు అడవులలో ఎన్ని కష్టాలు పడుతున్నారో. వాయు పుత్రుడైన భీముడు అతి బలవంతుడైనా అన్న మాటకోసం అరణ్యవాసం చేస్తున్నాడు కాని లేకున్న అతనిని ఆపడం ఎవరి తరం. శకుని వంచన, దుశ్శాసనుని దుశ్చర్యలు, కర్ణుని తులువతనం, దుర్యోధనుని అనీతి అతని మనసులో ముల్లులా గుచ్చుకుంటున్నాయి కదా. భీముని చేతిలో నా కుమారుల మరణం తప్పదేమో. కర్మఫలం అనుభవించక తప్పదు కదా. ఏమి చేయుదును విచారించిన ఏమి ఫలం నేను ఎంత వారించినా జూదం ఆపలేక పోయాను. కష్టముల వెంట సుఖాలు వస్తాయి అంటారు కదా. అర్జునుడు పరశివుని మెప్పించి పాశుపతాన్ని సాధించాడు. సశరీరంగా స్వర్గానికి పోవడమే కాక ఇంద్రుని అర్ధ సింహాసనం అధిష్టించాడు. అర్జునుడు ఏ జన్మలో చేసిన పుణ్యమో కదా” అని పరి విధాలుగా విలపించేడు. 


దుర్యోధనుడు అది చూసి “మామా! మా తండ్రిగారు ఇలా భీతిల్లుతున్నాడు. దీనిని గురించి ఆలోచించ వలెను” అన్నాడు. 


వారిరువురు కర్ణునితో చేరి ఏకాంతప్రదేశంలో మంతనాలు జరిపారు. 

కర్ణుడు “సుయోధనా పాండవుల సంపదలన్నీ నీ వశమైనాయి. వారు అడవుల పాలయ్యారు. రాజులంతా నీకే కప్పం చెల్లిస్తున్నారు. సార్వభౌముడివైన నీ పాలన ప్రజామోదాన్ని పొందింది. నీవు ద్వైత వనానికి వెళ్ళి అక్కడ ఇడుములు పడుతున్న పాండవులకు నీ భోగభాగ్యములు ప్రదర్శించి వారికి ఖేదము కలిగించ వలెను. అలాగే వారు పడుతున్న కష్టములు చూసి ఆనందించి మన జన్మ సాఫల్యం పొందవచ్చు. ద్రౌపది నీ భార్యల సౌభాగ్యం చూసి దుఃఖించ వలెను” అని దుర్యోధనునితో అన్నాడు.```


              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

నక్షత్ర స్తోత్ర మాలిక*

  🌹🌷💫⭐🛕⭐💫🌷🌹

*గురువారం 5 ఫిబ్రవరి 2026*


          *నక్షత్ర స్తోత్ర మాలిక*

              *8వ రోజు*​ *నక్షత్రం: పుష్యమి(Pushyami)*


*అధిపతి: శని (Saturn)*


*ఆరాధించాల్సిన దైవం* *శనీశ్వరుడు / దక్షిణామూర్తి.*


​పుష్యమి నక్షత్ర జాతకులు మరియు శని ప్రభావం (ఏలిననాటి శని, అర్ధాష్టమ శని) ఉన్నవారు పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.


*​🙏 శ్రీ శనైశ్చర స్తోత్రం (దశరథ కృతం) 🙏*


​*కోణస్థః పింగళో బభ్రుః కృష్ణో రౌద్రోంతకో యమః ।*

*సౌరిః శనైశ్చరో మందః పిప్పలాదేన సంస్తుతః ॥ 1 ॥*


​*ఏతాని దశ నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్ ।*

*శనైశ్చర కృతా పీడా న కదాచిద్ భవిష్యతి ॥ 2 ॥*


​*నమః కృష్ణాయ నీలాయ శితికంఠ నిభాయ చ ।*

*నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః ॥ 3 ॥*


​*నమో నిర్మాంస రూపాయ ధీర్ఘశ్మశ్రు జటాయ చ ।*

*నమో విశాల నేత్రాయ శుష్కోదర భయానక ॥ 4 ॥*

​*నమః పరుషగాత్రాయ స్థూలరోమ్ణే చ వై నమః ।*

*నమో నిత్యం క్షుధార్తాయ అతృప్తాయ చ వై నమః ॥ 5 ॥*


​*నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కపాలినే ।*

*నమస్తే సర్వభక్షాయ బలీముఖ నమోఽస్తుతే ॥ 6 ॥*


​*సూర్యపుత్ర నమస్తేఽస్తు భాస్కరో భయదాయక ।*

*అధోదృష్టే నమస్తేఽస్తు సంవర్తక నమోఽస్తుతే ॥ 7 ॥*


​*నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమోఽస్తుతే ।*

*తపసా దగ్ధదేహాయ నిత్యం యోగరతాయ చ ॥ 8 ॥*


​*జ్ఞానచక్షుర్నమస్తేఽస్తు కాశ్యపాత్మజ సూనవే ।*

*తుష్టో దదాసి వై రాజ్యం రుష్టో హరసి తత్క్షణాత్ ॥ 9 ॥*


​*దేవాసురమనుష్యాశ్చ సిద్ధవిద్యాధరోరగాః।*

*త్వయా విలోకితాః సర్వే నాశం యాంతి సమూలతః ॥ 10 ॥*


​*ప్రసాదం కురు మే సౌరే వరిష్ఠో వరదో భవ।*

*ఏవం స్తుతస్తదా సౌరిర్గ్రహరాజో మహాబలః ॥ 11 ॥*


​॥ ఇతి శ్రీ దశరథ విరచిత శనైశ్చర స్తోత్రం సంపూర్ణమ్ ॥


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతం నుంచి…*

 1412d6;42f5;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



  *మహాభారతం నుంచి…*

                     *జీవిత పాఠాలు!*

                ➖➖➖✍️

```

మహాభారతంలోని పాత్రలను అర్థం చేసుకోండి చాలు, జీవితంలో ఎలా ప్రవర్తించకూడదో తెలుస్తుంది.


మహాభారతం అంటే కేవలం అన్నదమ్ముల యుద్ధం కాదు. మహాభారతాన్ని అర్థం చేసుకుంటే ఎలాంటి వ్యక్తి అయినా జీవితాంతం కష్టసుఖాలను దాటుకుంటూ ముందుకు వెళ్లి పోగలరు.


మహాభారతం... 

హిందువులకు అద్భుతమైన ఇతిహాసం. ప్రపంచంలో ఉన్నదంతా మహాభారతంలో ఉందని, మహాభారతంలో లేనిదేది ప్రపంచంలో లేదని అంటారు. ధర్మం, న్యాయం, మోసం, స్నేహం, వెన్నుపోటు... ఇలా ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలకు తగ్గ మనుషులు మహాభారతంలో కనిపిస్తూనే ఉంటారు. 


ఒక జీవితం నేర్పే పాఠాన్ని మహాభారత గ్రంథం నేర్పిస్తుందని చెబుతారు. 


ఎవరైతే మహాభారతాన్ని ఔపోసన పడతారో, అందులోని ప్రతి పాత్రని అర్థం చేసుకుంటారో... వారు జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకునే శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటలను పొందుతారని పండితులు చెబుతారు.```


*శకుని - చెడు స్నేహం:*```

జీవితంలో చెడు స్నేహం అంతానికి దారితీస్తుందని శకుని వల్ల అర్థమవుతుంది. శకుని కౌరవులతో స్నేహం చేసి వారి నాశనానికి కారణం అయ్యాడు. శకునితో స్నేహం చేయకపోతే కౌరవులు అంత దారుణమైన స్థితిలో మరణించే వారు కాదేమో. శకునిలాంటి స్నేహితుడు ఉండడం చాలా ప్రమాదకరం.```


*కర్ణుడు - అతి మంచితనం:*```

అతి మంచితనం, జాలి, దయ వంటివి మీ జీవితాన్నే కాల్చేస్తాయని చెప్పడానికి కర్ణుడే ఉదాహరణ. 

కర్ణుడు తన అతి మంచితనంతో, దానధర్మాలతో, తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చివరికి చెడు వైపు నిలబడి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. జీవితంలో మీరు గెలిచి నిలవాలంటే మంచివారితోనే స్నేహం చేయాలి. అనవసరమైన వ్యక్తులకు, అనవసరమైన పరిస్థితుల్లో దానధర్మాలు చేయడం మంచి పద్ధతి కాదు.```


*గాంధారి - పిల్లల పెంపకం:*```

పిల్లలను క్రమశిక్షణలో పెంచకపోవడం అనేది తల్లిదండ్రుల తప్పేనని మహాభారతం చెబుతోంది. 


గాంధారి 100 మంది పిల్లలకు తల్లయింది. కానీ 100 మందిలో ఒక్కరిని కూడా సవ్యమైన మార్గంలో నడిపించలేకపోయింది. 

రాజ్యాన్ని బిడ్డలకు సమంగా పంచే విషయంలోనూ గొడవలు జరిగాయి. వారి క్రమశిక్షణ దారి తప్పింది. పిల్లలను కాచుకొని కూర్చోలేక గాంధారి వారిని పట్టించుకోవడమే మానేసింది. చివరికి దుర్యోధనుని బాటలో కౌరవులంతా నడిచి చెడు వ్యక్తులుగా మారారు. శకునిలాంటి చెడు స్నేహితులతో కలిసి నాశనమయ్యారు.

```


*ధృతరాష్ట్రుడు - పిల్లలపై అతి ప్రేమ:*```

బిడ్డల మీద ప్రేమ ఉండడం మంచిదే, కానీ అతి ప్రేమ వారి నాశనానికే దారితీస్తుంది. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడు మహాభారతంలో నిరూపించాడు. 


అతడికి ఉన్న అతి ప్రేమ బిడ్డలను చెడ్డవారిగా మార్చింది. కొడుకుల వినాశనానికి ధృతరాష్ట్రుడు పరోక్షంగా కారణమయ్యాడు. చిన్నప్పటి నుంచే వారిని ఒక క్రమశిక్షణలో పెట్టి ఉంటే వారు పెద్దయ్యేసరికి ఎన్నో కొన్ని విలువలను నేర్చుకుని ఉండేవారు. కానీ దృతరాష్ట్రుడి అతి ప్రేమ, అతి నమ్మకం కౌరవుల నాశనానికి కారణమైంది.```


*అర్జునుడు - నిత్య విద్యార్థి:*```

జీవితంలో ఎప్పుడూ నిత్య విద్యార్థిగానే ఉండాలని అర్జునుడు చెప్పాడు. 


అర్జునుడు తన జీవితాంతం ఏదో ఒక విద్యను నేర్చుకుంటూనే ఉన్నాడు. విద్యను నేర్చుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడలేదు. ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలుసుకొని, వారి దగ్గరే శిష్యరికం చేసి ఆ ఆయుధాలను పొందాడు. చివరికి మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరు తెచ్చుకున్నాడు.

```


*అభిమన్యుడు - అర్ధ జ్ఞానం:*```

ఏ విషయం గురించి అయినా పూర్తిగా తెలుసుకోవడం ముఖ్యమని అభిమన్యుడు నిరూపించాడు. పద్మవ్యూహంలోకి ప్రవేశించడమే అభిమన్యుడికి తెలుసు, కానీ ఆ పద్మ వ్యూహంలోంచి బయటికి రావడం తెలియక వీరమరణం పొందాడు. 


అర్ధ జ్ఞానంతో అతి నమ్మకంతో పద్మవ్యూహంలోకి వెళ్లడం, అభిమన్యుడు చేసిన తప్పు. 

అర్ధ జ్ఞానంతో ఏ పనీ చేయడం మంచి పద్ధతి కాదు.```


*ద్రౌపది - స్త్రీని గౌరవించడం:*```

మహిళలను ఎంతో గౌరవించాలని, వారి కోపం, అవమానం, శాపం రాజ్యాలనే నాశనం చేస్తాయని మహాభారతంలోని ద్రౌపది పాత్ర చెబుతోంది. 

ఆమెకు జరిగిన అవమానం, కౌరవ సామ్రాజ్యం మట్టిపాలయ్యేలా చేసింది. స్త్రీలు దేవతలతో సమానం. వారిని అవమానించే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. స్త్రీలను ఇతరుల ముందు అవమానించడం, వారి చేత కన్నీరు పెట్టించడం ఎదుటివారికే ప్రమాదకరం.


ఇలా చెప్పుకుంటూ పోతే మహాభారతంలో ఒక్కో పాత్ర ఒక్కో జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది. 


మహాభారతాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి జీవితంలో కచ్చితంగా విజయుడై తీరుతాడు.✍️```. -సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

05-02-2026 గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

05-02-2026 గురువారం రాశి ఫలితాలు


మేషం


ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

---------------------------------------


వృషభం


దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

---------------------------------------


మిధునం


మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఇంటాబయట చికాకులు పెరుగుతాయి. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------


కర్కాటకం


సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.  

---------------------------------------


సింహం


చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. 

---------------------------------------


కన్య


ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలుంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

---------------------------------------


వృశ్చికం


కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

---------------------------------------


ధనస్సు


మానసిక ప్రశాంతత కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

---------------------------------------


మకరం


ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. బంధువర్గం వారితో విభేదాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

---------------------------------------


కుంభం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

---------------------------------------


మీనం


పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

---------------------------------------

విష్ణుం నారాయణం

 వందేమాతరం 


*విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం!*

*హరిం నరహరిం రామం గోవిందం దధివామనమ్!!*


యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి కరాళ నృత్యంలో విలవిలలాడుతున్న ఆ కాలంలో, భక్తులను ఆ విపత్తు దాండం నుంచి కాపాడటానికి ప్రముఖ వేద పండితులు, బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీగారు పరిచయం చేసిన ఈ మహా మంత్రం భక్తుల హృదయాల్లో అమృత ధారగా ప్రవాహించింది. ఎన్నో అవాంతరాలు, వ్యయప్రయాసాలు ఎదురైనా, అకుంఠ దీక్షతో నిర్విరామంగా ఆయన చేస్తున్న ఈ భక్తయజ్ఞం అద్వితీయమైనది. ఆయన కఠోర శ్రమకు హృదయపూర్వక నమస్సుమాంజలి!


గత ఆరు సంవత్సరాలుగా లక్షలాది భక్తులను సుప్రభాత వేళ భక్తపారవశ్యంలో ముంచి తరింప చేస్తున్న ఈ అద్భుతమైన మహా మంత్రం మహాభారతంలోని అనుశాసన పర్వంలో వ్యాస మహర్షి రచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం నుండి ప్రేరణ పొందిన అమృత ధార. భీష్మాచార్యుడు యుధిష్ఠిరునికి బోధించినట్లుగా, భక్తులు హృదయాల్లో భగవద్కృపా వర్షాలు కురిపించి, సృష్టి స్థితి లయాలను కాపాడే భగవద్విష్ణువు ప్రధాన రూపాల సంగ్రహ స్వరూపం. 


దీని మూలానికి స్ఫూర్తి ఋగ్వేద మంత్రం (1.154.1) 

“విష్ణోర్ను కం వీర్యాణి ప్రవోచం

యః పార్ధివాని విమమేథ భువనాని విశ్వా ।

యో అశ్తభి: పిప్రయోనాభి: ప్రథంయాందే

యత్ర భూయః శయాయ ॥” 


లోని "విష్ణోర్ణుకం వీర్యాణి ప్రవోచం" అన్న భావమే. ఇది వీర్య, భక్తి, శాంతి త్రయాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్ర జపం భక్తి గంగలో మునిగిన ఆత్మలను మోక్ష ద్వారాలకు చేర్చి ధర్మ రక్షణకు దైవిక కవచంగా తేజస్సెలుపుతుంది.‌ ఈ మంత్రం భక్త హృదయంలో భగవదానుభూతిని, విశ్వాసాన్ని, శరణాగతిని పుష్టి చేస్తూ, విష్ణువు సృష్టి-స్థితి-లయాలలో వ్యాపించే పరబ్రహ్మ స్వరూపుడనే వేదోక్తిని ప్రభోదించుతుంది. ఈ మంత్రం జపిస్తే మనసు పవిత్రమవుతుంది, పాపాలు ధ్వంసమవుతాయి, మోక్ష మార్గాలు వెలుగొంటాయి. ఇటువంటి భగవద్విష్ణువు అనంత రూపాల సంగ్రహ స్తోత్రమైన ఈ దశనామ స్తోత్రంలో, ఒక్కొక్క నామం విశిష్టతను హృదయస్పర్శిగా స్పృశిద్దాం.


శ్రీ మహా విష్ణు దశనామ సంగ్రహంలో ఒక్కొక్క నామం హృదయకమలాలను వికసింపజేసే దైవిక తేజస్సు. 


*విష్ణుః*


"విష్ణుం" అంటే సర్వ వ్యాప్తి, సర్వాంతర్యామి. ఋగ్వేదంలో "విష్ణోర్ను కం వీర్యాణి ప్రవోచం" అని స్తోత్రించినట్లు. భగవద్గీత (10.21)లో 

ఆదిత్యానమహః విష్ణు: జ్యోతిషాం రవిరంశుమాన్....

అని ప్రకాశించినట్లు, విష్ణువు సృష్టి, స్థితి, లయాలలో వ్యాపించి ఉంటాడు. ఈ నామ జపం చేస్తే భక్త జీవితాన్ని ఆత్మ విశాలత్వాన్ని ఆందిస్తూ సమస్తలోకాల విస్తరణంలా మహోన్నతం చేస్తుంది.


*నారాయణః*


నారాయణం అంటే "నారా (జలాలు) + అయన (నివసించేవాడు).‌ తైత్తిరీయోపనిషత్ (2.1)లో "స యత్కిం చ దృశ్యతే తత్పరస్మాదాత్మన్యేవ" అని వర్ణించారు. ఈ నామం భగవంతుని యొక్క ప్రకృతి స్వరూపాన్ని తెలియజేస్తుంది. భాగవత పురాణంలో (1.2.11) "వాగీశ యశచా శ్రీవిష్ణోర్మూలనిహాస్త్వితి" అని ప్రశంసించారు. ఈ నామ ధ్యానం జీవిత సముద్రంలో డోలాయమాన పరిస్థితులను శాంతి తీరాలతో నింపి, భగవంతుని ప్రకృతి స్వరూపాన్ని హృదయంలో చిరస్థాయిగా భావింపజేస్తుంది.



*కృష్ణః*


ఇది దివ్య మోహన రూపుడైన భగవంతుని వర్ణన. "కృష్ణం" అంటే కాళీయ మర్దనుడు, గోపాలుడు. భగవద్గీత (4.7)లో "యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత" అని ధర్మ రక్షణను ప్రకటించాడు. ఈ నామ జపం భక్తుల హృదయాల్లో శరణాగతి రసాన్ని పెంపొందించి, ఆత్మను ప్రేమ పరవశం చేస్తుంది.


*మాధవః*


"మాధవం" అంటే మాధవీ (పృథ్వీ) అనగా దేవకీ పుత్రుడు. ఈ నామ ప్రస్తావన విష్ణు పురాణంలో(5.1) కనిపిస్తుంది. మాధవుడు సృష్టి రక్షణకు గోవర్ధనాన్ని ఉన్నతం చేశాడు. ఈ నామ ధ్యానం భక్తి గంగను, సంపద సముద్రాన్ని, శాంతి సారస్సును హృదయంలో నింపుతుంది.


*మధుసూదనః*


ఇది మధు అనే రాక్షస వధకారుడైన ఆ స్వామి నామం. భాగవత పురాణం (1.3.6)లో వర్ణించినట్లు, ఇది అధర్మాన్ని నాశనం చేయడానికి వచ్చిన స్వామి అవతారం. ఈ నామం భక్తి హృదయాల్లో అధర్మ దాండీలను తొలగించే తేజస్సును రగిలిస్తుంది.


*హరిః*

"హరిం" అంటే పాపాలను హరించేవాడు (పాపహర్తా). శ్వేతాశ్వతరోపనిషత్ (3.11)లో "హరిస్సర్వం" అని ఉద్ఘాటించారు.‌ హరి నామ జపం భక్తులను మోక్ష పదాలకు చేర్చి, ఆత్మను పవిత్ర దీప్తిలో ముంచుతుంది.


*నరహరిః*

ఇది ఆ స్వామి అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిస్తుంది. "నరహరిం" నరసింహ అవతార రూపం. ఈ నామం యొక్క విశిష్టత భాగవతంలో హిరణ్యకశిపుని వధ వర్ణనలో . "ఉగ్రం వీరం మహావిష్ణు" అనే ద్వాదశాక్షర మంత్రంతో ముడిపడి ఉంది. ఈ నామం భక్తి రక్తంలో తేజస్సును ప్రవేశపెడుతుంది.


*రామః*

ధర్మ రక్షణార్థం అవతరించిన మర్యాద పురుషోతముడైన శ్రీరామచంద్రుడుని దివ్య మంగళ నామం హృదయాల్లో మర్యాద రాజ్యాన్ని స్థాపించే ప్రకాశకిరణం.


*గోవిందః*

నామస్మరణతోనే ‌మనసును భక్తి పరవశ్యంలో ప్రసన్నం చేసే గోవులను, ఈ జగత్తును రక్షించడానికి అవతరించిన ఆ లోక రక్షకుని అద్భుత నామం "గోవింద". ఇది హృదయాల్లో గోపాల రసాన్ని పెంపొందిస్తుంది.


*దధివామనం*


 ఈ నామం బలిచక్రవర్తి నుంచి ఈ జగత్తును కాపాడిన వావనాతార విశే‌షాన్ని సూచిస్తుంది.‌ ఈ నామం భక్తి హృదయాల్లో విష్ణు క్రీడలను స్మరింపజేస్తూ, దైవిక విజయాన్ని అందిస్తుంది.


చివరిగా, జయదేవుడు విరచిత గీత గోవిందంలోని 12 శ్లోకాల దశావతార స్తోత్రానికి సమానమైన ఈ దశనామ స్తోత్ర పారాయణం మనస్సును ప్రశాంతి సముద్రంలో ముంచి, పాప నాశనం, ఆరోగ్యం, ధర్మ రక్షణను కలిగిస్తుంది. విష్ణు సహస్రనామ స్తోత్రం సారాంశంగా పనిచేసి, అశ్వమేధ యాగ సమాన పుణ్యఫలితాన్ని ఇస్తుంది. మానసిక బలం పెరిగి ఆందోళనలు, మరణ భయం తొలగి ధ్యాన స్థితి వస్తుంది. భక్తులను చెడు శక్తులు, శత్రువుల నుండి కాపాడే దైవిక కవచంలా పనిచేస్తూ, ఆధ్యాత్మిక వృద్ధి, మోక్ష ప్రాప్తి కలిగి కోటి జన్మల పుణ్యఫలం అందిస్తుంది.


భక్తులందరికీ వినమ్ర పూర్వక నమస్సులతో


మృశి

దశిక ప్రభాకరశాస్త్రి

36 recommendations

 


This is a list of 36 recommendations for a happy and healthy post-retirement life. This is a circulation by the HR department of a reputed company.


1. Avoid travelling alone.


2. Travel with your spouse.


3. Avoid going out during peak hours.


4. Avoid excessive exercise or walking.


5. Avoid excessive reading, mobile use or watching TV.


6. Avoid overmedication.


7. Visit doctors on time and take medications regularly.


8. Avoid property dealings after retirement.


9. Always carry your ID and important phone numbers.


10. Forget the past and don't worry too much about the future.


11. Eat what suits you, and chew slowly.


12. Be cautious in the bathroom and toilet.


13. Avoid smoking and drinking, they're harmful.


14. Don't boast about your achievements.


15. Travel extensively for a few years after retirement, then avoid crowded places.


16. Don't discuss your property and assets with others.


17. Exercise according to your capacity and health.


18. Avoid headstands and kapalabhati if you have high BP or heart issues.


19. Stay positive and avoid excessive emotions.


20. Don't sleep immediately after eating

.

21. Don't lend money to others.


22. Avoid giving unsolicited advice to the next generation.


23. Respect others' time.


24. Don't try to earn more if you don't need to


25. Avoid daytime naps to sleep well at night.


26. Have your own space and respect others' privacy.


27. Make a will and consult your spouse.


28. Avoid giving your retirement savings to the next generation.


29. Join a senior citizens' group, but avoid conflicts.


30. Don't disturb others if you can't sleep.


31. Don't pluck flowers from trees.


32. Avoid discussing politics, or accept differing opinions.


33. Don't constantly complain about your health.


34. Avoid quarreling with your spouse, they're your primary support.


35. Attend spiritual events, but don't become a blind follower.


36. Live a stress-free life with a smile.


This post is shared by the National Senior Citizens' Welfare Association of India is very useful for everyone. Please go through and try to understand and follow.


*🥰🌹😂 for retired people*

celebrating of ages 60, 70, 80, 90 and 100 :

 In the southern part of India the practice of celebrating of ages 60, 70, 80, 90 and 100 :


Someone once asked me the Reason....

“Why do we celebrate ages like 60, 70, 80, 90, and 100 so grandly?

Are these numbers spiritual, or are they just cultural traditions?”


The answer lies in a powerful story from the Mahabharata—the story of King Yayati....


King Yayati lived life to the fullest—power, pleasures, success, everything. But when old age suddenly arrived, it shook him deeply. After deep reflection, he realized a profound truth:

“Pleasure has limits, but desire never ends.”

This single realization transformed his life. He accepted old age and explained that life has five inner turning points—not based on age, but on understanding.


Remarkably, these five turning points align with the traditional Indian milestones of 60, 70, 80, 90, and 100 years. Let us understand them in simple terms.


*60 – Shashti*


The mind shifts from accumulation to understanding


Around 60, something changes—not in the body, but in priorities.

The question “How much more can I get?” slowly fades, and

“What truly matters now?” takes its place.


Introspection begins.

Noise, applause, and external validation are no longer needed.

Clarity is what one seeks.


This is not decline—it is maturity catching up with ambition.


*70 – Bheemaratha Shanthi*


Peace feels more powerful than proving a point


In the 40s and 50s, we explain ourselves to the world.

At 70, a quiet shift occurs.


You no longer react instantly.

Arguments lose their attraction.

Preserving relationships matters more than winning debates.


One realizes:

Being peaceful is more valuable than being right.

That is why the 70th year is celebrated.


*80 – Sathabhishekam*


Your presence itself becomes healing


At 80, people don’t come seeking advice.

They come seeking something deeper—

the reassurance that life can be lived, processed, and understood.


At this age, your presence becomes a blessing.

Words are no longer necessary.

Your very being says:

“Everything was okay. Life finds its way.”


That is why 80 is considered sacred.


*90 – Navathi*


The ego quietly retires


At 90, something rare happens.


You no longer feel the urge to correct people.

You don’t cling to opinions.

Things are not taken personally.

You are not easily hurt.


Not because of weakness—

but because life has already shown you enough.

Petty matters no longer deserve your energy.


A gentle stillness settles in.

This humility is true spirituality.


*100 – Shatamanam*


Life moves beyond personal stories


Reaching 100 is not just about the number of years.

It is a state where the larger picture becomes visible.


You realize that many of the worries you carried were unnecessary.

The love you gave was what truly mattered.

And life was always being held by a mysterious, compassionate force.


At 100, a person becomes less of an individual

and more of a presence.


Essence


Our sages did not celebrate age.

They celebrated the inner transformation that comes with age.


•⁠ ⁠60 – Priorities shift

•⁠ ⁠70 – Peace becomes strength

•⁠ ⁠80 – Presence becomes healing

•⁠ ⁠90 – Ego dissolves quietly

•⁠ ⁠100 – Life reaches completion


Age is not deterioration.

Age is a filtration process—

through which wisdom, gentleness, and grace remain.


Thought for the Day


*Growing older means life is becoming purer, wiser, and gentler.* 🌹🙏🌹

మహాభారతము

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసిం🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 4 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                     1️⃣2️⃣5️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*   

         

                    *125 వ రోజు*                    

*వన పర్వము పంచమాశ్వాసము*


      *ద్రౌపది సత్యభామలు*```


ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద అనేక విషయాలు తెలుసుకుంటున్న సమయంలో ద్రౌపది సత్యభామలు ఇష్టాగోష్టి సలుపుతున్నారు. సత్యభామ ద్రౌపదిని “ద్రౌపదీ ! నీకు ఐదుగురు భర్తలు. వారియందు నీవు భక్తి కలిగి ఉన్నావు. వారు నీయందు అనురాగం కలిగి ఉన్నావు. ఇదెలా సాధ్యం? 

నీ వద్ద ఏదైనా మంత్రమూ ఔషధమో ఉన్నదా? ఈ మహిమ నీకు ఎలా చేకూరింది. నీ అలంకరణా సామర్ధ్యమా లేక సంభాషణా చాతుర్యమా నాకు ఎరిగింపుము. ఆ నేర్పరితనంతో నేను నా భర్త అయిన శ్రీకృష్ణుని వశం చేసుకుంటాను” అని అడిగింది. 


ఆ మాటలకు ద్రౌపదికి కించిత్ కోపం వచ్చింది. ఆమె సత్యభామతో..

“సత్యా! నీవు నన్ను దుష్ట స్త్రీగా జమకట్టడం తగదు. ఆ పురుషోత్తమునకు నీవు భార్యగా తగవు అని నా భావన. మంత్ర తంత్రములతో భర్తను వశం చేసుకోవాలి అనుకోవడం నీ భ్రమ. అలాంటి పనులు చేస్తే భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ కూడా పోతుంది. అలాంటి భార్యతో చెలిమి పాముతో చెలగాటం అని భావిస్తాడు. అలాంటి మందులకు భర్తకు రోగం, భార్యకు అపకీర్తి వస్తుంది. భర్తల పట్ల భార్యలు ఇలాంటి కపటాలతో మోసగించిన నరకం తప్పదు. భర్తకు అనుకూలవతిగా చరించడమే భార్యకు ఉత్తమ ధర్మం. నేను పాండవుల పట్ల ఎలా ప్రవర్తిస్తానో నీకు వివరిస్తాను. నా భర్తలు పరస్త్రీలతో చరించినా నేను అసూయ చెందను. వారి పట్ల అహంకరించక పూజ్యభావంతో ఉంటాను. నా భర్తలు తప్ప మిగిలిన వారు దేవతలైనా, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషులైనా నాకు తృణప్రాయం. స్నానం భోజనం శయనం ఏదైనా భర్తలకు సమకూర్చి నేను అనుభవిస్తాను. భర్తల మనసెరిగి వారికి కావలసినవి సమకూరుస్తాను. భర్తల యొక్క బంధు మిత్రుల ఎడ ఆదరం చూపిస్తాను. గృనిర్వహణలో పరిశుభ్రత పాటిస్తాను. ఏదీ వ్యర్ధం చేయను. అనవసర ఖర్చులు చేయను. భర్తలు ఇంట లేనప్పుడు పువ్వులు ధరించను. అలంకారం చేసుకోను భర్తలయందు మనసు నిలిపి వారి కోసం నిరీక్షిస్తుంటాను. ఎక్కువ సేపు వాకిట నిలబడటం, అతిగా నవ్వడం, దుష్టులతో స్నేహం చెయ్యడం చేయను. నా భర్తలు ఎంతటి సున్నిత మనస్కులో అంతటి కోపాన్ని ప్రదర్శిస్తారు. వారి పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తాను. మా అత్త కుంతికి స్నాపానాదులు నేనే సమకూరుస్తాను. నా భర్త ధర్మరాజు ప్రతి రోజు పదివేల బ్రాహ్మణులకు పదివేల యతీశ్వరులకు అన్న సంతర్పణ చేస్తాడు. ఆ ఏర్పాట్లు నేను స్వయంగా చేసి వారికి ఆనందం సమకూరుస్తాను. అంతఃపురంలో పనిచేసే వేలకొలది సేవకుల బాగోగులు నేనే స్వయంగా చూస్తాను. వారు వారి విధులను క్రమశిక్షణలో నిర్వర్తించేలా చూస్తాను. భండాగారంలో ఉన్న రత్నాలు, మణులు, ఆభరణాలు, ధనం మొదలైన లెక్కలు నాకు తెలియును. పని వారికి ఇవ్వవలసిన జీతభత్యములు నేనే ఇస్తాను. అందు వలన పాండవులు సంసార భారం నా మీద మోపి నిశ్చింతగా ఉంటారు. నాకు రాత్రి ఒక ఝాము మాత్రమే నిద్రపోవడానికి సమయం ఉంటుంది. భోజనం చేయటానికి సరిగా సమయముండదు. ఇలా ప్రవర్తించి నేను భర్తల ఆదరణ పొందుతున్నాను కాని మందులు ఔషధాలు ఉపయోగించి కాదు. ఇంద్రజాలం అసలే కాదు " అని అన్నది.


ద్రౌపది సత్యభామకు హితవు చెప్పుట

సత్యభామ సిగ్గుపడి " ద్రౌపదీ! నాకు నీ సంగతి తెలియక ఏదో పరిహాసంగా అన్నాను. నన్ను మన్నింపుము " అన్నది. ద్రౌపది " సత్యా! దానిదేముంది అలాగే పరిహాసంగా తీసుకుంటాను. భర్త మనసు చూరగొనే ధర్మమైన ఉపాయం చెప్తాను విను. పతిని మించిన దైవం భార్యకు లేదు. భర్త దయ వలన భార్యకు కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయి. సమస్త సంపదలు సమకూడుతాయి. భర్తకు సేవలు చేస్తే భార్యకు సులువుగా పుణ్యం లభిస్తుంది. కనుక భర్తకు ప్రతి రోజు ప్రేమతో ఆరాధనతో సేవలు చెయ్యి. నీకు భర్త అనురాగం లభిస్తుంది. భర్త రాగానే చిరునవ్వుతో ఎదురేగి స్వాగతం పలుకు. భర్త సేవలకు సేవకులను నియోగించక స్వయంగా నువ్వే చెయ్యి. నీ భర్త మాటల సందర్భంలో చెప్పిన రహస్యం బట్టబయలు చేసి సపత్నుల ముందు అవమానపడకు. అందు వలన భర్త అనురాగం సన్నగిల్లుతుంది. నీ భర్తకు అపకారం చేసే వారు నీకు మిత్రులైనా వారిని ఆదరింపకుము. భర్త బంధుమిత్రులను ఆదరించు. నీ పుత్ర సమానులైన ప్రద్యుమ్నాదులతో కూడా ఒక శయ్యపై కూర్చుండ రాదు. కుల స్త్రీలతో మాత్రం స్నేహసంబంధాలు పెట్టుకో. విలాసజీవితంపై ఆసక్తి కలవారు అహంభావులైన స్త్రీలతో స్నేహం వద్దు. ఇలా ప్రవర్తిస్తే నీకు పరమ సౌభాగ్యం కలుగగలదు " అన్నది. సత్యభామ ద్రౌపదితో " నీ భర్తలు దైవసమానులు. నీవు ధర్మం తెలిసిన దానివి. నీ కుమారులు పరాక్రమవంతులు, నీవు వీరమాతవు. వారిని ద్వారకలో రుక్మిణీ సుభద్రలు తమ కుమారుల కంటే ప్రేమగా చూసుకుంటున్నారు కలత చెంద వద్దు. వారు ద్వారకలో క్షేమంగా ఉన్నారు. త్వరలోనే మీకు మీ రాజ్యం లభిస్తుంది. దుర్యోధనాదులు కష్టాలు అనుభవించగలరు " అన్నది. శ్రీకృష్ణుడు ధర్మరాజు మార్కండేయ మహర్షి వద్ద సెలవు తీసుకుని ద్వారకకు పయనమైయ్యాడు. మార్కండేయ మహర్షి ధర్మరాజుతో అనునయ వాక్యాలు పలికి తన ఆశ్రమానికి వెళ్ళాడు. పాండవులు కామ్యక వనం వదిలి ద్వైత వనానికి వెళ్ళారు.```


               *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏హారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏