25, ఏప్రిల్ 2024, గురువారం

గురువు అష్టకం

 *🙏💐 గురువు అష్టకం💐🙏*

తెలియనంతవరకు దూరమే! తెలిస్తే దగ్గరే!

🪴🍀🪴🍀🪴🍀🪴🍀

భగవంతుడు దూరంగా ఉన్నాడనుకొంటే దూరంగానే ఉంటాడని, దగ్గర వున్నాడు అనుకొంటే దగ్గరే అని చెప్తారు కదా! 


"దూరాత్‌ దూరే అంతికే చ!'' అంటుంది వేదం. అవగాహన కానంతసేపూ దూరంగా ఉంటుంది. అర్థమయితే దగ్గరే (లోపలే) ఉంటుందని అర్థం. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది.


పెళ్లీడుకొచ్చిన పిల్లకి తల్లిదండ్రులు సంప్రదాయాననుసరించి సన్నిహిత బంధువుల పిల్లవాడిని పెళ్ళికి ఎంపిక చేస్తారు. కాని ఆ పిల్ల ఒప్పుకోక అందరి కన్నా శ్రేష్ఠుడినే వరిస్తానంటుంది. తల్లిదండ్రులు ప్రక్కకి తప్పుకొంటారు.


అందరి కన్నా ఉన్నతుడు రాజే కాబట్టి తాను రాజుని తప్ప ఇంకెవరినీ పెళ్లాడనంది ఆ పిల్ల. అప్పట్నుంచి రాజుని వెంబడింపసాగింది. ఒకనాడు పల్లకిలో పోతున్న రాజుకి దారిలో సన్న్యాసి కనబడితే, దిగి ఆయనకి ప్రణామాలు చెప్పి తన ప్రయాణం కొనసాగించాడు. దీనినంతా గమనించిన ఆ పిల్ల ''అందరి కంటే రాజే గొప్పవాడను కొన్నాను, పొరబడ్డాను. ఆయన కంటే సన్న్యాసి ఎంతో గొప్పవాడు. కాబట్టి నేను సన్న్యాసినే పెళ్లాడుతాను'' అనుకొని సన్న్యాసి వెంటపడింది.


ఒకనాడు సన్న్యాసి ఒక రావిచెట్టు క్రింద ఉన్న వినాయకుని విగ్రహానికి నమస్కారం పెట్టటం చూచింది. ఆ పిల్ల, తన అభిప్రాయాన్ని మళ్లీ మార్చుకొంది. సన్న్యాసి కంటె ఉత్తముడు వినాయకుడని ఆయననే వివాహమాడటానికి నిశ్చయించుకొంది. సన్న్యాసిని విడిచి, వినాయకుని ఎదుట కూర్చొంది.


చెట్టుక్రింద ఉన్న విగ్రహం కావటం వల్ల అక్కడ గుడి లేదు. ఎవ్వరూ వచ్చేవారు కారు. ఒకనాడు అటుపోతున్న ఒక కుక్క ఆ విగ్రహం పై కాలెత్తి అది చేసే పని అది చేసింది. ఆ విగ్రహం కంటె గొప్పదనుకొని ఆ పిల్ల కుక్క వెంటబడింది. ఆదారిన పోతున్న ఒక పిల్లవాడు ఆ కుక్కపై రాయిని విసిరి గాయపరచాడు. ఆ బాధకి అది ఇంకా వేగంగా పరుగెత్తటం మొదలు పెట్టింది. దీనినంతా గమనిస్తున్న ఒక యువకుడు ఆ మూగజీవిని ఊరికే కొట్టిన పిల్లవాడిని చివాట్లు వేశాడు. ఆ పిల్లవాడిని మందలించిన యువకుడే అందరికంటె గొప్పవాడనుకొంది ఆ పిల్ల. అతనినే వివాహమాడుతానంది. ఇంతకూ, ఆ యువకుడు ఎవరో కాదు - తల్లిదండ్రులు ఎంపిక చేసిన వాడే! ఎక్కడో ఉన్నాడనుకొన్నవాడు సమీపానే ఉన్నాడు. అదీ కథ.


''ఈశ్వరుడెక్కడో ఉన్నాడని దేశమంతా వెతుకుతున్నావు. ఎరుగనంత వరకు నీకు ఆయన దూరస్థుడే. ఎంత వెతికినా కనబడడు. నీకు దగ్గరే ఉంటాడు. అన్నిటి కంటే దూరంగా, అన్నిటి కంటే దగ్గరగా ఉంటాడు'' అంటుంది వేదం.🙏


🙏💐🌹🌴🌹💐🙏

ఒకప్పుడు

 ❤️*మన బాల్యం*❤️


ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!

ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు. 

నిద్రలోనూ భగవంతునికి మొక్కులే! 


ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.


ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు 

అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే.. వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.


ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!


రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు. వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు. 

ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ.. మొదట అపనమ్మకంతో థర్డ్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!


నెంబర్ లేకపోయే సరికి , సెకండ్ క్లాస్ ఆపై మనకు అంత సీను లేదులే అనుకుని ఫస్ట్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..


హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.


ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..


ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం.


ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.


ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..


ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..


స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల పంపకం..

ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!


కట్ చేస్తే..!


ఇప్పుడు..! ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..?? 


ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!


అంతా నిర్లిప్తత..పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న


ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?


ప్చ్..!


చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.


చదివే యంత్రాలవుతున్నారు..ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..


విద్యార్థులు మాయం అవుతున్నారు..


మిషన్లులా మిగులుతున్నారు..  


ఈనాటి పరిస్థితులు తప్పక మారాలి..!


ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ 😍😍😍

నలుగురు పతివ్రతా మూర్తుల గురించి

 అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరి తథా

పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌.


అహల్య, ద్రౌపదీ, సీత, తార, మండోదరి ఈ ఐదుగురు పుణ్య మాత మూర్తులను రోజూ స్మరించినట్లయితే మహాపాతకాలు కూడా నాశనమవుతాయని ఈ శ్లోక భావం.


. ఈ నలుగురు పతివ్రతా మూర్తుల గురించి తెలుసుకుందాం.


అహల్య గౌతమ మహర్షి భార్య..!

ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. 

ద్రౌపదీ..పూర్వ జన్మలలో ఆమె వేదవతి, ఆ తరువాత మౌద్గల్య

 ముని భార్య ఇంద్రసేన. ఆ తరువాతి జన్మలో ఆమె కాశీరాజు కుమార్తె అనామికగా జన్మించింది. పతికోసం ఘోరమైన తపస్సు చేసింది. పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగాడు. పతి అన్న పదాన్ని ఐదుసార్లు పలికింది ఆమె. ఐదుగురు పతులను అనుగ్రహించాడు శివుడు. నీకు ఐదుగురు పతులున్నా అది ధర్మవిరుద్ధమని ఎవరూ భావించరు అని, ఆమె కోరుకొన్న విధంగా ఐదుగురితో సుఖించటానికి తగ్గ యవ్వనం, కామభోగేఛ్ఛ, వారిని సేవించేందుకు అవసరమైన శుశ్రూషాభావం, కన్యాత్వం, సౌభాగ్యం అనుగ్రహించాడు.


 మరుజన్మలో ఆమె యజ్ఞం చేస్తున్న ద్రుపదుడికి అగ్నిగుండంలో లభించింది. 


సీతాదేవి!


వాల్మీకి మహర్షే శ్రీ రామాయణాన్ని ''సీతాయాశ్చరితం మహత్‌''

అని వెల్లడిచేశారు.

క్షమ..దయ...ధైర్యం...వివేకం...ఆత్మాభిమానం కలబోసిన ఉదాత్తమైన స్త్రీ పాత్ర 'సీత'. ఆమె లేనిదే రామాయణం లేదు.

ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గ హిణిగా మెలిగిన మహాసాధ్వి 'సీతాదేవీ'. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పడు భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది. రావణ చరలో బందీ అయినప్పటికీ కూడా తన భర్తపై కల వాత్సల్యాన్ని ప్రేమను వదులుకోలేదు. రావణ వినాశనానికి, ధర్మ స్థాపనకు కారణం అయింది. దయాశాలి, అభిమానవతి, క్షమాగుణి, ధైర్యశాలి అయిన సీతామాత గుణగణాలను రామాయణంలో అడుగడుగునా వాల్మీకి మహర్షి ఎన్నో సందరాÄలేలో చెప్పారు.


తారాదేవి!


వాలి భార్య తారాదేవి. సుగ్రీవుడి భార్యను వాలి చెరబట్టి, అతన్ని రాజ్యబహిష్క్రుతున్ని చేసినప్పుడు అది తప్పని వాలికి చెప్పింది. అన్నదమ్ములు కలహించుకుంటే రాజ్యానికి చేటని హితవు చెప్పింది. కానీ వాలి వినలేదు. దాంతో రామబాణానికి నేలకొరిగాడు. మరణించిన పతిదేవుని చూసి తాను కూడా చనిపోతానని తన పతిభక్తిని చాటుకుంది. ధర్మం ప్రకారం సుగ్రీవున్ని రాజ్యానికి రాజును చేసింది. కిష్కింధ రాజ్య పాలనకు మహారాణిగా తన సలహాలను చెప్పింది. రామకార్యానికి సుగ్రీవున్ని సమాయిత్తం చేసింది. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపించక మానదు. ముఖ్యం గా సుందరకాండలో హను మంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు చదివితే తెలుస్తుంది. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే వాలిని వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే సుగ్రీవుడు తిరిగి వచ్చాడని నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చ రిస్తుంది. వాలి వినడు చని పోతాడు. ఆతర్వాత కూడా రామకార్యం మరిచి పోయాడని సుగ్రీవుడిపై కోపగించిన లక్ష్మణుడిని తన సంభాషణా చాతు ర్యంతో చల్లపరుస్తుంది. ఆమె ఆ సమ యంలో చెప్పిన మాటలు చూడండి. చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా, నేనూ దక్కాము. భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా' అంటూ మాటాడగల్గిన చతుర తార . ఇలా తారాదేవి ప్రస్తావన రామాయణంలోని సుందరకాండలో అదుÄతేంగా వివరించబడి ఉంది.


మండోదరి దేవి!!


రామాయణం జరగడానికి కీలకమైన వ్యక్తులలో ఒకరు రావణాసురుడు. అతడు ఎంతటి శివభక్తుడైనా సరే పరస్త్రీని వాంఛించడం అనే ఒకే ఒక్క దుర్గుణం వల్ల నాశనమైనాడు. అతడి భార్యే మండోదరి దేవి. రావణాసురుడు ఎంతటి అసురుడో ఈమె అంతటి మహాపతివ్రత. మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఈమెకు పుట్టిన కొడుకు పేరు ఇంద్రజిత్తు. మండోదరి దేవి మిక్కిలి సౌందర్య రాశి. కేవలం బాహ్య సౌందర్యరాశి మాత్రమేగాదు అంతస్సౌందర్యం కూడా కలిగింది. అందుకే సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వచ్చిన హనుమంతుడు రావణుడితో కూడి ఉన్న ఈ స్త్రీరత్నాన్ని చూసి ఆమే సీతాదేవి అనుకున్నాడు కూడా. రావణాసురుడు సీతమ్మని అపహరించి తెచ్చినప్పుడు పరస్త్రీ వ్యామోహం వద్దని, నీతిని, ధర్మాన్ని కర్తవ్యాన్ని రావణాసురునికి బోధించింది. రావణాసుర వధానంతరం భర్తతో పాటు ప్రాణత్యాగం చేయ డానికి సాహసించింది

సంకల్పము

 *శుభోదయం*

*********

సంధ్యా వందన మరియు 

ఇతర పూజాకార్యక్రమాల

సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.25.04.2024

బృహస్పతివాసరే( గురువారము)

 *********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ చైత్ర మాసే కృష్ణ పక్షే 

ద్వితీయాయాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

బృహస్పతివాసరే( గురువారము)

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

ఇతర పూజలకు శ్రీ క్రోధి నామ సంవత్సరే ఉత్తరాయణే

వసంత ఋతౌ 

చైత్ర మాసే కృష్ణ పక్షే ద్వితీయాయాం

గురు వాసరే అని చెప్పుకోవాలి.

ఇతర ఉపయుక్త విషయాలు

సూ.ఉ.5.42

సూ.అ.6.13

శాలివాహనశకం 1946 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2081 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5125 వ సంవత్సరం. 

శ్రీ క్రోధి నామ సంవత్సరం 

ఉత్తరాయణ పుణ్యకాలం

వసంత ఋతువు

చైత్ర మాసం 

కృష్ణ (బహుళ)పక్షం విదియ పూర్తి. 

 బృహస్పతివాసరే( గురువారము)

నక్షత్రం విశాఖ

రా.1.22 వరకు. 

అమృతం సా.4.03 ల 5.45 వరకు. 

దుర్ముహూర్తం ఉ. 9.52 ల 10.42 వరకు.

దుర్ముహూర్తం మ. 2.53 ల 3.43 వరకు. 

వర్జ్యం ఉ. 5.49 ల 7.31 వరకు. 

వర్జ్యం రా. తె. 5.33 ల మరునాడు ఉ. 7.12 వరకు. 

యోగం వ్యతీపాత రా.తె.4.06 వరకు. 

కరణం తైతుల మ. 6.02 వరకు.   

కరణం గరజి మరునాడు ఉ. 6.22 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం మ. 1.30 ల 3.00 వరకు. 

గుళిక కాలం ఉ. 9.00 ల 10.30 వరకు. 

యమగండ కాలం ఉ.6.00 ల 7.30 వరకు.  

*********** 

పుణ్యతిధి క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ విదియ. 

 **************

Note:-

శ్రీ పద్మావతి శ్రీనివాస వివాహ సమాచార సంస్థ

*(రి.జి.నెం.556/2013) *

వనస్థలిపురం,హైదరాబాద్* - 500070

*వారి* 

బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదిక

*పరిచయం - పరిణయం*

26/05/2024(ఆదివారం) రోజు వనస్థలిపురం లో

ఏర్పాటు చేయటం జరిగినది. రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయి ఇతర వివరాలకై సంప్రదించండి.

98487 51577 / 80195 66579.

****************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

మలబద్ధకం

 మలబద్ధకం గురించి వివరణ  - నివారణా యోగాలు . 


   మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి            "ఆనాహము" అని పిలుస్తారు . 


           మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి. 


         ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను . 


  నివారణాయోగాలు  - 


 * రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును. 


 *  కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


 *  ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను . 


 *  చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును . 


 *  బాగా పండిన అరటిపండు తినుచుండవలెను . 


 *  నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను . 


 *  విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను . 


 *  రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది. 


 *  సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. 


       మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది.  ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది. 


           చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను .  మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది.  ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ  , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .  


        శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.  


        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

లక్షణాలని బట్టి మన శరీరతత్వం

 లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం -


 * శరీరపు లక్షణం -


      వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.


 * శబ్ద లక్షణం - (నాడి లక్షణం ).


       వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ 

తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును . 


 * నేత్ర లక్షణం -


        వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.


 * మల లక్షణం - 


       వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.


 * ముత్ర లక్షణం -


         వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి 

మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.


                  ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .


                నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.


 * నాలిక యొక్క లక్షణం -


          నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .


             పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.


  

        ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు . 


  

 గమనిక -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 


                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


     కాళహస్తి వేంకటేశ్వరరావు  


 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


         9885030034

కర్మఫలం

 శ్లోకం:☝️

*అవశ్యమనుభోక్తవ్యం*

  *కృతం కర్మ శుభాశుభమ్ ।*

*నాభుక్తం క్షీయతే కర్మ*

  *కల్పకోటిశతైరపి ॥*


భావం: చేసిన మంచి చెడు కర్మల యొక్క ఫలితాలను అనుభవించి తీరాలి. కోట్లాది యుగాలు గడిచినా కర్మఫలం అనుభవించక తప్పదు.

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 25.04.2024 Thursday 


స్వస్తి శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం వసంత ఋతు చైత్ర మాస కృష్ణ పక్ష: ప్రతిపత్తి తిధి బృహస్పతి వాసర: విశాఖ నక్షత్రం వ్యతీపాత యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం. ఇది ఈరోజు పంచాంగం.


పాడ్యమి ఉదయం 06:45 వరకు .

విశాఖ రాత్రి 02:21 వరకు. 

సూర్యోదయం : 05:57

సూర్యాస్తమయం : 06:31


వర్జ్యం : ఉదయం 06:38 నుండి ఉదయం 08:21 వరకు.


దుర్ముహూర్తం : పగలు 10:08 నుండి 10:59 వరకు తిరిగి మధ్యాహ్నం 03:10 నుండి 04:00 వరకు



అమృతఘడియలు : సాయంత్రం 04:56 నుండి 06:38 వరకు.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.


యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.



శుభోదయ:, నమస్కార:

24, ఏప్రిల్ 2024, బుధవారం

లోకోక్తి

 *లోకోక్తి*...


1) *పది,పన్నెండేళ్ళ వయస్సు లో*......

...ఏం చదువు తున్నావ్?


2) *ఇరవై,ఇరవై రెండేళ్ల వయసొచ్చాక* .......ఏం ఉద్యోగం చేస్తున్నావ్?


3) *ముప్పయి,ముప్పయి రెండేళ్ల ప్రాయం లో*.........పెళ్లి అయిందా, పిల్ల లెంత మంది?


4) *నలభై, నలభై రెండేళ్ల ఏళ్ళు వచ్చాక.*........ పిల్లలేం చదువుతున్నారు?


5) *యాభై, యాభై రెండేళ్ల వయస్సు లో*.........పిల్లలు ఏం ఉద్యోగం చేస్తున్నారు,సంభంధాలు చూస్తున్నారా,పెళ్లి చేశారా?


6) *అరవై,అరవై రెండేళ్ల సంవత్సరాల్లో*......... మనవలు ఎంతమంది?


7) *డెబ్బయి,డెబ్బయి రెండేళ్ల వయస్సు లో*...........(నువ్వు ఇంకా తిరుగుతూ వుంటే)....ఆరోగ్యం బాగుంటోందా?


8) *ఎనభై, ఎనభై రెండేళ్ల కు*..... నడవలేవు...మంచాన్ని అంటిపెట్టుకుంటావు....నిన్ను ఎవరు ఏమి అడగరు...అడిగిన వినపడదు...వినపడిన చెప్పలేవు...చెప్పిన వినరు....మొహమాటం కొద్ది పలకరిస్తారు....నీ నుంచి జవాబు ఆశించరు....నీతో మాట్లాడే వాళ్ళే వుండరు...


9) *తొంభై,తొంభై రెండేళ్ల సంవత్సరాలకు*........నువ్వు నివాసం వుంటున్న గదిలోకి,మంచం దగ్గరికి కూడా ఎవ్వరూ రారు.

వచ్చిన చూపులు,సంజ్ఞలు తప్ప ఇంకా ఏమి వుండవు.


10) *వంద సంవత్సరాలకు*........వంద (100%) శాతం నువ్వు వుండవు. నీ ఫోటో గోడ కు మేకు సహాయం తో వేలాడుతూ వుంటుంది.ఫోటో క్రింద ...నీ పేరు, జనన,మరణ వివరాలు ముద్రిస్తారు.


సత్యనారాయణ మూర్తి కొడవంటి,

ఫిజిక్స్ లెక్చరర్,కాలమిస్ట్,

9985617100

బలవంతుడ నాకేమని

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

       🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 బలవంతుడ నాకేమని

       పలువురతో నిగ్రహించి పలుకుట మేలా

       బలవంతమైన సర్పము

       చలిచీమల చేతచిక్కి చావదె సుమతీ!


తమకు చాలా బలం ఉంది అని గర్వంతో విర్రవీగేవారి గురించి వర్ణిస్తూ బద్దెన ఈ పద్యాన్ని చెప్పాడు....


భావం: *మంచిబుద్ధికలవాడా! తనకు శక్తి ఉంది కనుక, తనను ఎవ్వరూ ఏమీ చేయలేరనుకునేవారు కొందరు ఉంటారు.... వారు ఇతరులందరినీ తీసిపారేసినట్లు మాట్లాడతారు.... అందువల్ల వారికి మంచి కలుగదు*.... ఎంతోబలం ఉన్న పాము అన్నిటికంటె చిన్నప్రాణులైనచీమలకు దొరికిపోయి, ప్రాణాలు పోగొట్టుకుంటుంది....

దానగుణ విశిష్టత!

 శు  భో  ద  యం🙏



దానగుణ విశిష్టత!


ఈరోజు దానగుణం ఎంతవిశిష్టమైనదో తెలిసికుందాము. 


                      శా:- ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, నంశోత్తరీయంబుపై, 

                              పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై , నూత్నమ 

                                ర్యాదంజెందు కరంబుక్రిందగుట, మీదై  నాకరమబుంటమే          

                                 ల్గాదే? రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు వాపాయమే? 


                     

                  శ్రీమదాంధ్రమహాభాగవతము - పోతన- వామనచరిత్రము 


            వివరణ:- దేవతావిరోధియగు బలిచక్రవర్తని మూడడుగులదానమును వామనుడు అడుగుసందర్భము . 

                           వచ్చినది శ్రీహరియని శుక్రాచార్యులవారు గ్రహించి దానమువలన కలుగు పరిణామము నూహించి 

                            బలిని వలదని వారింపగా బలియన్నమాటలను కవినిపుణముగా వర్ణించినాడు అంత్యప్రాసలతో 

                             నందగించిన పోతనకవితాసౌందర్యము తోబాటుగా బలి పరమౌదార్యమును తెలిసికొనుటకు

                             ప్రయత్నంచేద్దాము. 


                                                   వచ్చినవాడు'హరి'దానమీయవలదు అనివారించు శుక్రునితో " శ్రీసతి శిరోజాలంకృతిపై, మేనుపై, భుజములపైనుడు ఉత్తరీయముపైనను ,పాదపద్మములపైనను,బుగ్గలపైనను,  పయోధరములపైనను  నూత్నమర్యాదలతో సంచరించు నాశ్రీహరి హస్తము క్రిందగుట, మీదుగా నాహస్తమగుట 

ఆహా !ఎంతటి అదృష్టము. ఈరాజ్యము శాశ్వతమా? శరీరము అపాయరహితమా? ఏదియేమైనను ఇంతటిమంచి 

అవకాశమునువిడువను దానమవస్యముగా నిత్తునని యట్లేయొనరించినాడు .ఆహా!బలియెంతటిమహనీయుడు.

                దానముమిగులగప్పది .వేదములు" నకర్మణా నప్రజయా నధనేన దానేనైకేనామృతత్వమానసుః" నీవు 

     చేయుపనులవలనగానీ, నీసంతానముచేతగానీ, నీకున్నధనముచేతగానీ అమృతత్వాన్ని (అమరత్వము)పొందలేవు. 

      దానగుణం ఒకటి ఉంటేచాలును అమృతత్వం పొందగలవు. అంటోంది. కాబట్టిఉత్తమ గుణాలలో మిన్నయైన దాన

        గుణాన్ని అందరూ అలవరచుకోవటం ఉత్తమం.అది మనకు సమాజానికీ చాలామేలు చేస్తుంది .🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🏉

కర్మబంధితులై వుంటారు.

 💐వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు.💐


*అప్సరసలు దిసమొలగా కొలనులో దిగి జలకాలాడుతున్నారు. శుకముని ఆ దిశగా రావడం అందరూ చూశారు. ఎవరూ పట్టించుకోలేదు. శుకుణ్ణి పిలుస్తూ వ్యాసమహర్షి పరుగున వస్తున్నాడు. స్త్రీలు కంగారుగా బట్టలు చుట్టబెట్టుకోబోయారు.  విస్తుపోయాడా మహర్షి. "నవ యవ్వనంతో మెరిసిపోతున్న నా కొడుకును చూసినప్పుడు లేని కలవరపాటు వయోవృద్ధుడనైన నన్ను చూస్తే ఎందుకు కలిగింది?" అని అడిగాడు. "నీ కొడుకు నిర్మలుడు, నిస్సంగుడు" అన్నారు అప్సరసలు. "అనుక్షణం పరమాత్మ స్వరూపాన్ని ఉపాసిస్తూ, దర్శిస్తూ, పరవశిస్తూ, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయినవాడు" అన్నది భాగవతం. ఆ స్థితిలో ఉన్నవాడిని 'ఆరూఢుడు' అంటారు. "ఇది నగరము, ఇది అరణ్యము, ఇది సౌఖ్యము, అది అసౌఖ్యము, ఇతడు పురుషుడు, ఆమె స్త్రీ' వంటి తేడాలేవీ అలాంటి పరిణత మనస్కులకు తోచవు.* *ఆరూఢుడికి ( బ్రహ్మజ్ఞానికి ) ఏది చూచినా బ్రహ్మమయమే. అతడు సంగములు సర్వమునూ కలిగి సంగి ( లోబడినవాడు ) కాడు.* *భోగములు సర్వమునూ చెంది భోక్త కాడు. లోకంలో సన్యాస దీక్షాపరుల పరమ గమ్యం అదే !*

 *సన్యాసం తీసుకోవడమనేది ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ! "సన్యాసం స్వీకరించార"ని మనం అంటూ ఉంటాం. కానీ అది పుచ్చుకుంటే వచ్చేది కాదు. తిరకాసంతా -  మనసుతోనే ! "బంధానికైనా, మోక్షానికైనా కారణం మనసే" అన్నది ఉపనిషత్తు. అంటే సాధ్యమూ మనసే, సాధనమూ మనసే.*

*సన్యాసాశ్రమ స్వీకరణకు వైరాగ్యం తొలిమెట్టు. సన్యాసం అంటే కాషాయం కాదు. పరిపక్వ, వైరాగ్య, జీవన ఫలసాయం. భవబంధాలను, సుఖదుఃఖాలను పరిపూర్ణంగా చక్కగా విడిచిపెట్టటం (సత్ + న్యాసం ). అదే సన్యాసం. తన భారాన్ని పరమాత్మ పాదాల చెంత సమర్పించడం భరన్యాసం. అదే అనన్య శరణాగతి. అది మానసిక పరిణయం. వైరాగ్యభావసమృద్ధి.*


*స్త్రీ, ధన, పుత్ర వ్యామోహాలనే మూడింటినీ "ఈషణత్రయం" అంటారు. ఈషణం అంటే కోరిక, వ్యామోహం. దారేషణ,  ధనేషణ, పుత్రేషణ అనే మూడు రకాలైన మోహాలతో మానవులు పీడింపబబడుతుంటారు,*

*కర్మబంధితులై వుంటారు.వాటి కోసం ఎలాంటి తప్పుడు పనులు చేయడానికయినా సాహసిస్తారు. వైరాగ్యమనేది ఈషణ త్రయానికి ఎదురు చుక్క. వాటిని త్యజించి సద్గురువునాశ్రయించి దేహంలో ఆరు పువ్వులలో పూజలను చేస్తానని దృఢ సంకల్పాన్ని స్వీకరిస్తాడు సన్యాసి. దేహంలో ఆరు పువ్వులంటే షట్చక్రాలు. వాటినే షడాధార కమలాలని అంటారు. సాధన చేయగా చేయగా, హృదయాకాశంలో ఓంకారం గంటమాదిరి మోగుతుందట. అది తుదిమెట్టు. చివరికలా జ్ఞాన, వైరాగ్య, నిశ్చల, ఆనందపూర్ణులైనవారు జీవన్ముక్తులవుతారు. ఇదంతా ఒక్క మానవజన్మ లోనే సాధ్యం. వివేక చూడామణిలో శంకర భగవత్పాదులు మనిషి జన్మను ఉత్తమం అనలేదు, దుర్లభం అన్నారు. మురిసిపోవటానికి కాదది, ముక్తి పొందటానికని చెప్పారు.*

*యోగజీవనమనేది సాధనతోనే సాకారమవుతుంది.*

పంచ పునీతాలు

 పంచ పునీతాలు

మొదటిది..వాక్ శుద్ధి:

వేలకోట్ల ప్రాణులను సృష్టించిన ఆ భగవంతుడు 

మాట్లాడే వరాన్ని ఒక్క మనిషికే ఇచ్చాడు. కాబట్టి వాక్కును దుర్వినియోగం చేయకూడదు. పగ, కసి, ద్వేషంతో సాటివారిని ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ నిందించకూడదు. మంచిగా, నెమ్మదిగా, ఆదరణతో పలకరించాలి. అమంగళాలు మాట్లాడేవారు తారసపడితే ఓ నమస్కారం పెట్టి పక్కకొచ్చేయండి. 


రెండవది..... దేహశుద్ధి:

మన శరీరం దేవుని ఆలయం వంటిది. దాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ రెండుపూటలా స్నానం చెయ్యాలి. చిరిగిన, అపరిశుభ్రమైన వస్త్రాలను ధరించరాదు.


మూడవది.....భాండ శుద్ధి:

శరీరానికి కావలసిన శక్తిని ఇచ్చేది ఆహారం. అందుకే ఆ ఆహారాన్ని అందించే పాత్ర పరిశుభ్రంగా ఉండాలి. స్నానం చేసి, పరిశుబ్రమైన పాత్రలతో వండిన ఆహారం అమృతతుల్యమైనది.


నాలుగవది.......కర్మశుద్ధి:

అనుకున్న పనిని మధ్యలో ఆపినవాడు అధముడు. అసలు పనినే ప్రారంభించనివాడు అధమాధముడు. తలపెట్టిన పనిని కర్మశుద్ధితో పూర్తిచేసినవాడు ఉన్నతుడు.


ఐదవది..........మనశ్శుద్ధి:

మనస్సును ఎల్లప్పుడూ ధర్మ, న్యాయాలవైపు మళ్ళించాలి. మనస్సు చంచలమైనది. ఎప్పుడూ వక్రమార్గాలవైపు వెళ్ళాలని ప్రయత్నిస్తూవుంటుంది. దానివల్ల అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల దుఃఖం చేకూరుతుంది. కాబట్టి ఎవ్వరికీ హాని తలపెట్టని మనస్తత్వం కలిగివుండటమే మనఃశుద్ధి.🙏🕉️🙏

విద్యావిధానం

 నమస్తే


బ్రిటిష్ వారు, కాంగ్రెస్ వారు, నిర్మించిన విద్యావిధానం వలన


ఈ కాలం పిల్లలకు భారతీయ ప్రపంచవిజ్ఞానానికి మూలమైన సంస్కృతభాషాలో జన్మించినం జ్యోతిశ్శాస్త్రం, వ్యాకరణం, ఛందశ్శాస్త్రం, మాసాల పేర్లు, నక్షత్రాల పేర్లు, సంవత్సరాల పేర్లు తెలియవు,

ఈ కాలం పిల్లలకు పెద్దలకు రామాయణ రచయిత అయిన వాల్మికి జయంతి, వర్ధంతి తెలియదు

ఈ కాలం పిల్లలకు పెద్దలకు అష్టాదశ పురాణాల, మహాభారతం, భగవద్గీత లాంటి రచయిత అయిన వేదవ్యాస జయంతి, వర్ధంతి తెలియదు

కాలిదాసు

భవభూతి

శంకరాచార్య

రామానుజాచార్య

ఆర్యభట్ట

చాణక్య

ధణ్వంతరి

పతంజలి

పాణిని


ఇత్యాది సంస్కృతభాషా శాస్త్రావేత్తలు జన్మదినం, మరణదినం తెలియదు.


ఈ విధంగా సంస్కృతభాషా గురుశిష్యలను గురుకులాలను నాశనం చేసి 

మదర్సాలను మిషనరీ విద్యాలయాలను ఉద్ఘాటనం చేసి


హిందువులందరిని హిందువుల సాహిత్యంనుండి, విజ్ఞానం నుండి దూరం చేసినది

ఎవరు


మన హిందు పిల్లలకు సంస్కృతంలో సమ్భాషించడం రాదు, సంస్కృతభాీష శ్లోకాలు రావు, సంస్కృతభాషా స్తోత్రాలు రావు, సంస్కృతభాషా నీరాజన గీతాలు రావు


ఈ విధంగా సంస్కృతభాషను సామాన్యమానవులనుండి దూరం చేసి సంస్కృతభాషా గురుశిష్యులను సంస్కృతభాషా గురుకులాలను కాలగర్భం కలిపేసిన పాపం కుట్ర కుతంత్రం ఎవరిది


సమ్భాషణ సంస్కృతమ్ పత్రిక ఈ నాయకులను ప్రశ్నిస్తున్నది


ప్రతి సంస్కృతభాషా గురుశిష్యలు అభిమానులు పాత్రికేయులు కావాలి, సంస్కృతభాషకు జరిగిన జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి

మాగాయ"కూ, "ఆవకాయ"కూ

 "*మాగాయ"కూ, "ఆవకాయ"కూ మధ్య ఉన్న తేడా ఏమిటి అని అడిగారు.*


నాకు ఇట్లానేమో అనిపించింది.


భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ తొక్కలే అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...


పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి... 


సిద్ధిని పొందిన ఋషిలా ముక్కలు ఎండి స్థిరత్వాన్ని పొందాక...


బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం  

సాటి జనులపట్ల అమిత కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా

 బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని... 


అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా, తను విడిచి వెళ్లిన ఊట లోకి మళ్ళీ తానే దూకి,


మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు

ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...


ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి విశేషాలతో విరాజిల్లినట్లుగానే...

నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

మానవసేవే మాధవసేవ అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!


*****************************************************


సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా అనుకునే వివాహితునిలా...తొక్క టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,


సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...

ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని, 


బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా... 

తనతోపాటు నూనె, శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...


నేను నేనుగానే ఉండి, ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను. అని చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.

బుధవారం,ఏప్రిల్ 24,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


బుధవారం,ఏప్రిల్ 24,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

చైత్ర మాసం - బహుళ పక్షం

తిథి:పాడ్యమి తె5.33 వరకు

వారం:బుధవారం (సౌమ్యవాసరే )

నక్షత్రం:స్వాతి రా11.47 వరకు

యోగం:సిద్ధి తె4.23 వరకు

కరణం:బాలువ సా4.56 వరకు

తదుపరి కౌలువ తె5.33 వరకు

వర్జ్యం:లేదు

దుర్ముహూర్తము:ఉ11.32 - 12.22

అమృతకాలం:మ2.16 - 4.00

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30-9.00

సూర్యరాశి: మేషం

చంద్రరాశి: తుల 

సూర్యోదయం:5.42 

సూర్యాస్తమయం:6.13


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

ఉపనిషద్దర్శనం

 🍀🌺🍀🌺👆👆🍀🌺🍀🌺🍀


           *ఉపనిషద్దర్శనం*

                ➖➖➖✍️


108 ఉపనిషత్తులు ఒకే పుస్తకంగా.


రచన: జయంతి చక్రవర్తి గారు.


1328 పేజీలు.


వెల: రూ.1716/-

కానీ..

మన గ్రూప్ సభ్యులు కోసం 

OFFER PRICE: Rs.1500/- లకే.


 Free Postage. (Regd Book post)(పోస్టేజి ఉచితం.)


కావలసిన వారు సంప్రదించండి 

Contact number 9392737062.✍️

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

శాసనములు గా కీర్తించబడును

 *2013*

*కం*

ధనములు గలవాని పలుకు

ఘనమగు శాసనముకరణి గణుతించ బడున్.

ధనహీనుని వాక్కు విలువ

కనుగొనగలవాడె విదుడు గాబడు సుజనా.

*భావం*:-- ఓ సుజనా! ధనవంతుని మాటలు గొప్ప శాసనములు గా కీర్తించబడును. ధనహీనుని మాట విలువ కనిపెట్టగలిగేవాడె గొప్పవాడగును.

*సందేశం*:-- ధనవంతునిమాటలను అందరూ గొప్పవిగానే భావిస్తారు, కానీ ధనహీనుని మాటలోని విలువ కనిపెట్టగలిగేవాడె గొప్పవాడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*24-04-2024 / బుధవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగి విశ్రాంతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో అవరోధాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు మరింత నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది.

---------------------------------------

వృషభం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగమన వివాదాలు సర్దుమణుగుతాయి. కొన్ని ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసివస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది.

---------------------------------------

మిధునం


గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు. ఆలోచనలు ఆచరణలో పెడతారు. బంధుమిత్రులు నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

కర్కాటకం


ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో కొంత నిరుత్సాహం తప్పదు.

---------------------------------------

సింహం


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలలో మరింత ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులకు మరింత కష్టం తప్పదు.

---------------------------------------

కన్య


సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. పాత మిత్రుల నుండి శుభ కార్య ఆహ్వానాలను అందుకుంటారు. కొన్ని వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ చేస్తారు. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

---------------------------------------

తుల


 ప్రయాణాలు వాహన ఇబ్బందులుంటాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. అనుకొన్న సమయానికి పనులు పూర్తి కావు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి. ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు కలుగుతాయి.

---------------------------------------

వృశ్చికం


స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఉన్నత ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు శ్రమకు అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

ధనస్సు


దాయాదులు తో స్థిరాస్తి వివాదాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఇంటా బయట ఊహించని సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఉద్యోగ వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ పెరుగుతుంది. ధన పరంగా జాగ్రత్తగా వ్యవహరించాలి.

---------------------------------------

మకరం


బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాలలో మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

కుంభం


అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.

---------------------------------------

మీనం


కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యపరుస్తుంది. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరగటం వలన శారీరక మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు ఉంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. ఉద్యోగమున ఒడిదుడుకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ తప్పదు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

తరువాత నేమి చేయగలరు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


   శ్లో𝕝𝕝 *యావత్స్వస్థో హ్యయం దేహో*

         *యావన్మృత్యుచ్చ దూరతః* |

         *తావదాత్మహితం కుర్యాత్‌*

         *ప్రాణాన్తే కిం కరిష్యతి* || 


తా𝕝𝕝 ఈ శరీరమెంతకాలము రోగము లేనిదై సాస్థ్యము కలదై యుండునో, యంతవఱకు తనకు మేలు కలిగించు శుభకర్మలను, ధర్మాచరణము, పుణ్యకర్మలు చేయవలెను.... మరణించిన తరువాత నేమి చేయగలరు?

23, ఏప్రిల్ 2024, మంగళవారం

Panchang


 

హనుమత్ విజయోత్సవం

 *** అందరు గమనించవలసిందిగా అభ్యర్ధన, రేపు హనుమత్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవం..


మీడియాలో వచ్చే వార్తలు, తెలిసీ తెలియని వారి ప్రచారం వలన చాలా మంది రేపు హనుమత్ జయంతి అని పొరబడుతున్నారు. వాస్తవానికి రేపు శ్రీ సీతారామచంద్రుని పట్టాభిషేకము తరువాత వచ్చిన మొదటి పౌర్ణమి కావున, శ్రీరామునికు యుద్ధములో అమితంగా సహాయం చేసిన స్వామి హనుమకు అయోధ్య ప్రజలు కృతజ్ఞతాపూర్వకముగా పూజలు చేయుట సంప్రదాయంగా వచ్చింది. అది స్వామి హనుమత్ విజయోత్సవముగా జరుపుకోవాలి. స్వామి హనుమ వైశాఖమాసమున కృష్ణపక్ష దశమి పూర్వాభాద్రా నక్షత్రమందు వైధృతియోగమున, మధ్యాహ్న సమయమున కర్కాటకలగ్నమందు, జన్మించెను అని గమనించగలరు. ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నాడు హనుమత్ జయంతి.


"పరాశరసంహిత యే హనుమ చరిత్రకు ప్రమాణం

వైశాఖే మాసి కృష్ణాయామ్, దశమ్యాం మందవాసరే

పూర్వాభాద్రా ప్రభూతాయాం మంగళం శ్రీ హనూమతే!!"


జై శ్రీ హనుమాన్ 🚩

సంజాయిషీ

 *సంజాయిషీ*


చేసిన తప్పు కంటే, చెప్పుకున్న సంజాయిషీ పెద్ద తప్పు అయ్యిందట.


ఈ విచిత్రకథ విన్నారా ఎప్పుడైనా...?


మంత్రి ఓ రోజు  మసక చీకట్లో రాజును కౌగిలించుకున్నాడు.


ఇది తప్పు.


"ఎందుకు ఇలా చేసావు?" నిలదీసాడు రాజు మహోగ్రుడై...


"మహారాణి అనుకున్నాను మహారాజా..." అన్నాడు మంత్రి.


ఇది సంజాయిషీ.


* * *


చేసిన తప్పు కంటే

చెప్పుకున్న సంజాయిషీ 

ఎంత పెద్ద తప్పు అయిందో చూశారా?


* * *


ఆధ్యాత్మిక విషయంగా-

ఒకడు అడగడం

ఇంకొకడు చెప్పడం అనేది కూడా ఇలాంటిదే.


ప్రశ్న, సమాధానము రెండూ తప్పే...


ఎవరు చెప్పినా సరే,

చెప్పబడిన ప్రతి సమాధానము తప్పే.


వాచా చెప్పబడిన సమాధానం ఎప్పుడూ దోష భూయిష్టంగానే ఉంటుంది.


అందుకే పరమశివుడు గురుదక్షిణామూర్తిగా మౌనస్వరూపంగా అవతరించాడు. 

మౌనమే నిజమైన సమాధానం.


ఎంత పెద్ద సత్యమైనా సరే,

ప్రస్తావిస్తున్నావంటే "అది" అది కాకుండా అయిపోతుంది


సత్యం ఎప్పుడూ ప్రస్తావనలోకి రాదు.

ప్రస్తావనలోకి వచ్చింది అంటే అది సత్యం కాదు.


ఊరికే ఉంటే అది అదిగానే ఉంటుంది.


"ఒకటి" అంటే రెండు అయిపోతుంది.

రెండు అంటే మూడు అయిపోతుంది.

ఊరికే ఉంటే "ఒకటి"గా ఉంటుంది.


* * *


వేదాలు... ఉపనిషత్తులు...

రమణ భాషణములు...

సద్గురు భాషణములు...

ప్రవచనకర్తల ప్రవచనాలు...

కొన్ని లక్షల ఆధ్యాత్మిక గ్రంథాలు...


అయినా సరే సమాధానం దొరకలేదు...

"నష్టోమోహః" అని ఎవడూ అనడం లేదు...


జ్ఞాని పుట్టుక  మాత్రం వీటితో సంబధం లేకుండా జరుగుతూనే ఉన్నది ప్రతి దశాబ్దంలోనూ.


అది ఈశ్వరనియతి.


అతనికి అక్కడ నించి వచ్చిన దారి మాత్రమే తెలుసుగాని, ఇక్కడనుండి అక్కడకు వెళ్లే మార్గం తెలియదు.


మధురైలో రమణుణ్ణి ఆత్మ ఆవహించింది...


అరయనినల్లూరులో రమణుణ్ణి జ్యోతి ఆవరించింది...


రెంటిలోనూ తన ప్రమేయం ఏమీ లేదు.


ఈశ్వర నియతి ప్రకారమే అలా జరిగింది.


ఇక ప్రతి ఒక్కడూ "ఆ స్థితిని పొందాలంటే ఏం చేయాలి?" అని అడుగుతూనే ఉన్నారు. వారు జీవితాంతం చెబుతూనే ఉన్నారు.

కానీ మరో రమణుడు రానేలేదు, రాడు.


నిజానికి ఇక్కడ నుంచి అక్కడకు వెళ్లే మార్గం అస్సలు లేనేలేదు.


ఈ ధ్యానాలు, ఈ జపాలు, ఈ యోగాలు.... ఇవేవీ మార్గాలు కావు.


నిజం.


అక్కడ నుంచి ఇక్కడకు ఎలా వచ్చామో.... ఇక్కడ నుంచి అక్కడకు కూడా అలానే వెళతాము.


ఇది తప్పదు.


కాబట్టి ప్రత్యేకించి దానికై వెతకనవసరం లేదు.... అనేదే నా ఈ వ్యాస ఉద్దేశం.


మరేం చేయమంటారు? అంటారా?


శిల్పం ఉంది అంటే, శిల్పి ఉన్నట్టే.

జగత్తు ఉంది అంటే జగదీశ్వరుడు ఉన్నట్టే.


వాడొకడు ఉన్నాడని తెలిస్తే చాలు...

తనకు గొప్ప జ్ఞానం ఉన్నట్టే.


ఈశ్వరుడు నియంత...


నియంత అంటే దాని అర్థం హిట్లర్ లాంటి దుర్మార్గుడు అనికాదు.


కర్త-కర్మ-క్రియ మూడూ తానైనవాడు అని అర్థం.


నియంత అంటే సర్వశక్తిమంతుడు అని అర్థం.


తిరుగలి తిప్పేది తానే.

తిరుగలిలో నలిగేదీ తానే.

తిరుగలీ తానే.


ఆయన్ను పొందటానికి రెండవ వస్తువు లేదు.


బాబు చిటికెనవ్రేలు,

బాబును పొందండానికి

సాధన చేయడం లాంటిదే.


ఈశ్వర శరీరంలో నేనొక చిటికెనవ్రేలు అని ఉండడమే అద్వైతం.


"ఆయన కంటే వేరుగా నేను లేను"

అన్న జ్ఞప్తికి మించిన సాధన లేదు. సిద్ధి కూడా అదే.


"పొందటం" అనే క్రియ అస్సలు లేనే లేదు.


నక్షత్రాలను చూస్తాం. అంతే.

పొందటం అంటూ ఏమీలేదు కదా!


ఈశ్వరుడు జగద్రూపంగా ఉన్నాడు. అంతే. పొందటం అంటూ ఏమీలేదు.


ఈ చూడటమే ఈశ్వర సాక్షాత్కారం.

ఈ అవగాహనే ఈశ్వరానుభవం.


"దేవుడు ప్రత్యక్షం కాడు.

ప్రత్యక్షమే దేవుడు."


* * *


ఎవడి సమాధానమూ నాకొద్దు.

నేనే సమాధానం అని ఉండు.


ఏ దైవమూ నాకొద్దు.

నేనే దైవం అని ఉండు.


ఏ క్షేత్రమూ నాకొద్దు.

నేనున్న చోటే క్షేత్రం అని ఉండు.


మాటలు వొదిలి "మౌనంగా" ఉండు.

పరిధిని వొదిలి "కేంద్రంగా" ఉండు.

తెలుసుకోవడం వొదిలి "తెలివి"గా ఉండు.

దర్శనం వొదిలి "ద్రష్ట"గా ఉండు. 

కర్తవ్యం వొదిలి "సాక్షి"గా ఉండు.


* * *


ఇలా స్థిర నిశ్చయంతో ఉన్నట్లయితే

నిశ్చయంగా దేవుడే నీ దర్శనానికి వస్తాడు.

22, ఏప్రిల్ 2024, సోమవారం

Panchang


 

మానవ జన్మ-దాని విశిష్టత

 మానవ జన్మ-దాని విశిష్టత


మనం పుట్టినప్పటి నుంచీ చూస్తున్నామీ ప్రపంచాన్ని. ఇది ఎంత విచిత్రమైనదో అంత విశాలమైనది. అచేతనాలని పరగణించబడే రాళ్ళురప్పలు మొదలుకొని చేతనాలన్నింటిలో గొప్పవాడని పట్టం కట్టుకొన్న మానవుడి దాకా అంతా ప్రపంచమే. రాళ్ళురప్పలు మొదలైన అచేతన పదార్ధాలకు అసలు ప్రాణమే లేదు. చెట్లకు, చేమలకు ప్రాణముంది గాని జ్ఞానం లేదు. పశుపక్ష్యాదులైన తిర్యక్కులకు ప్రాణము, జ్ఞానమూ రెండూ ఉన్నాయి. కాని ఆ జ్ఞానం వాసనా జ్ఞానమే. వివేక జ్ఞానం కాదు. వివేక జ్ఞానమున్నది మానవుడొక్కడికే. ఇంతే కాదు. కాష్ఠ లోష్టాదుల మాదిరి మానవుడికి జడమైన శరీరమూ ఉంది. ఓషధి వనస్పతుల మాదిరి ప్రాణమూ ఉంది. పశు పక్ష్యాదుల మాదిరి వాసనా జ్ఞానమూ ఉంది. అన్నిటికన్నా అదనంగా వివేక జ్ఞానమూ ఉంది.


ఈ విధంగా అన్ని లక్ష్ణణాలు ఒక్క మానవుడిలో ఒనగూడి ఉందంటం మూలాన్నే అతడికి పురుషుడనే పేరు సార్ధకమైంది. పురుషుడంటే పూర్ణుడని అర్ధం. పూర్ణత్వం మానవుడొక్కడిలోనే ఉంది. మిగతా సృష్టిలో ఎందులోనూ లేదు. ఎందుచేతనంటే మిగతా సృష్టిలో ఒక్కొక్క దానిలో ఒకటి రెండు లక్షణాలు మాత్రమే అయితే, మానవ సృష్టిలో ఉండవలసిన అన్ని లక్షణాలు మనకు ప్రత్యక్షమౌతున్నాయి. ఇదే పూర్ణత్వమనే మాటకు అర్ధం.


పూర్ణత్వాని కపూర్ణత్వ మెప్పుడూ తక్కువే. అపూర్ణములైన వస్తువులన్నీ పూర్ణత్వాన్ని అందుకునే మార్గంలో ఏర్పడ్డ అనేకములైన మజిలీలు. అందులో మొదటి మజిలీ మృత్తికా పాషాణాదులు. రెండవ మజిలీ వృక్షలతాగుల్మాదులు. మూడవది పశుపక్షిసరీసృపాదులు. మొత్తంమీద అన్నీ కలిసి మానవుణ్ణే తమలో అధికుడిగా భావించి అతనికే ఈ సృష్టి సామ్రాజ్యాన్ని కట్టబెట్టాయా అనిపిస్తుంది. చేతనాచేతనాలన్నిటి మీద చాలా వరకు మానవుడు తన అధికారం చెలాయించటంలోనే ఈ అంశం మనకు దాఖలా అవుతుంది. ఆంతేకాదు. ఒక సార్వభౌముడికి సామంత రాజులందరూ కప్పాలు చెల్లించినట్లు, చరాచర సృష్టి అంతా మానవుడికే తన సర్వస్వాన్ని ధారపోస్తున్నట్టు కూడా కనిపిస్తుంది.


చూడండి! నిర్జీవమైన భూమి అమూల్యమైన తన ఖనిజ సంపదనంతా బయటపెడుతూ ఉందంటే తన కోసమా? కాదు మానవుడి కోసమే. అట్లాగే చెట్లు కాయలు కాస్తున్నాయి, పండ్లు పండుతున్నాయి అంటే అదంతా మానవుడి భుక్తి కోసమే. ఇక జంతుజాలము మాట చెప్పనే అక్కర లేదు. పాడి ఆవు మొదలు పట్టపుటేనుగు వరకు ఏదో విధంగా మానవుడి కుపయోగపడని జంతువంటూ లేదు. ఇలా ప్రతి ఒక్కటి సృష్టిలో ఈ మానవుడికి దాసోహ మంటున్నదంటే అతడిలో ఏదో ఒక విశిష్టత ఉండితీరాలి. ఏమిటా విశిష్టత. మిగతా గుణాలన్నీ పశుపక్ష్యాదులకు అతనికి సాధారణమే. పోతే వాటికంటే అధికంగా కనిపించే జ్ఞానమనే దొక్కటే అతనికుండే విశిష్టత.ఆదిత్యయోగీ..


ఈ జ్ఞానం కూడా వాసనా రూపమైతే మరలా ప్రయోజనం లేదు. అది జంతువులకూ ఉంది. వివేచనాత్మకమైన జ్ఞానం కావాలి. వాసనా జ్ఞానమని, వివేచనా జ్ఞానమని అప్పటికి జ్ఞానం రెండు విధాలు. కేవలం ఆకలిదప్పులు రాగద్వేషాల దాకా పరిమితమైన జ్ఞానమే అయితే అది వాసనా జ్ఞానం. అంతకు మించి పూర్వాపరాలను కలియబోసుకొని ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం అనే విమర్శనాత్మకమైన జ్ఞానమైతే అది వివేక జ్ఞానం. దీనినే ఆలోచన, మననమని గూడా పేర్కొంటారు.


ఈ మననమనే శక్తి కలవాడే మనువు. ఆ మను సంతతిలో జన్మించిన వాళ్ళం గనుక మనమంతా మనజులమని, మనుష్యులమని, మానవులమని అనిపించు కుంటున్నాము. మననం చేయటాని కొక ప్రత్యేకమైన ఉపకరణం కూడా ఉంది మనకు. అదే మనస్సు. మనస్సు, మానవుడు, మనువు అనే మూడు మాటలు గమనించండి. అన్నింటిలోనూ ’మన’ అనే అక్షరాలు రెండు అనుగతంగా వస్తాయి. ’మన’ అనే ధాతువుకు సంస్కృతంలో ఆలోచన చేయటమనే అర్ధం. మొత్తం మీద ఆలోచనాశక్తియే మానవుడి కున్న విశిష్టతకు ఏకైక కారణమని భావించవచ్చు.


ఐతే ఈ ఆలోచనా శక్తి యుక్తాయుక్త వివేచనాత్మక మని చెప్పాము. వాసనాత్మకమైన జ్ఞానంలో ఈ వివేచనకు చోటు లేదు. కనుకనే పశుపక్ష్యాదులైన ప్రాణులూ జీవిస్తున్నాయి. మనమూ జీవిస్తున్నాము. కాని అవి జీవించటానికి మనం జీవించటానికి ఎంతో తేడా ఉంది. వాటి జీవితం వాసనా ప్రేరితమైనది. మనదలా కాదు. ఒక పెద్దపులి కేదైనా ఒక జంతువు కనిపిస్తే చాలు. మీద పడి కరిచి చంపుతుంది. ఒక కుక్క మరి ఒక కుక్కను చూస్తే చాలు వెంటబడి తరుముతుంది. ఒక యెనుబోతు రొడ్డు మధ్య నిలుచొని మనుషులు పోతున్నా బండ్లు పోతున్నా కొంచమైనా ప్రక్కకు తొలగదు. ఒక గబ్బిలం మూసివేసిన అద్దాల తలుపులు తెరచిఉన్నాయని భావించి, మయ సభలో దుర్యోధనుడి లాగా, మాటిమాటికి తల పగుల గొట్టు కుంటుంది. ఇలాంటి వ్యవహారం మానవుడిలో కనపడదు. కనపడకూడదు. ఎందుకంటే మానవుడీ వాసనా భూమికను దాటి వివేక భూమికలో అడుగు పెట్టిన వాడు. అతడికి మంచి ఏమిటో చెడ్డ ఏమిటో విభజించి చూచే జ్ఞానముంది. దానితో ఇది కర్తవ్యమని ఇది అకర్తవ్యమని స్పష్టంగా గ్రహించగలడు. కర్తవ్య జ్ఞాన మెప్పుడున్నదో అప్పుడా కర్తవ్యాన్ని జీవితాంతమూ పాటించవలసిన బాధ్యత గూడా ఏర్పడింది మానవుడికి...

.

*శాంతి లోపల నుండి ఉద్భవిస్తుంది. అది మొలకెత్తడానికి మరియు ఎదగడానికి మరియు వృద్ధి చెందడానికి వేచి ఉన్న ఒక చిన్న విత్తనం వలె ప్రతి ఆత్మలో ఉంటుంది. ఇది మొలకెత్తడానికి ముందు సరైన పరిస్థితులు, సరైన వాతావరణం మరియు సరైన చికిత్స అవసరం.ఆదిత్యయోగీ.నిశ్చలంగా ఉండండి మరియు సరైన పరిస్థితులను సృష్టించండి. నిశ్చలంగా ఉండండి మరియు విత్తనం పాతుకోవడానికి అవకాశం ఇవ్వండి. మట్టిలో బాగా పాతుకు పోయిన తర్వాత, అది పెరుగుతూనే ఉంటుంది; అయినప్పటికీ, దాని లేత ప్రారంభంలో పోషణ మరియు సంరక్షణ అవసరం. కనుక నిశ్చలతని, ధ్యానం ద్వారా అభ్యాసం చేయండి*


*ప్రపంచ శాంతికి తాళంచెవి మీలోనే ఉంది. ప్రపంచంలోని గందరగోళం మరియు అశాంతి గురించి చింతిస్తూ సమయాన్ని వృథా చేయవద్దు, కానీ మీలో విషయాలను సరిగ్గా ఉంచడం ప్రారంభించండి. సంకల్పం చేయడంలో నిశ్శబ్దంగా ఉంటూ, దానితోనే ఉండండి. మీరు దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు, జీవించండి. మీ స్వంత జీవితంలో అశాంతిని మరియు గందరగోళాన్ని -  శాంతి, ప్రశాంతత మరియు దివ్యతగా మార్చుకోండి. మీరు నివసించే సమాజంలో మరియు ప్రపంచంలో ఉపయోగకరమైన సభ్యుడిగా అవ్వండి. మీరు ఏదైనా చేయగలరని మీకు తెలిసిన చోట మీలో, మీతోనే ప్రారంభించండి, ఆపై బాహ్యంగా పని చేయండి. దివ్యతకి బాటలు వేయండి...


ఈ జాగ్రదవస్థ 'ఓ పెద్ద కల' అని తెలుసుకున్నాక ఇందులోని ప్రతి ఘట్టము నవ్వులాటగా ఉంటుందే తప్ప దేనికి సీరియస్ గా స్పందించడం అనేది ఉండదు...

.

స్వీయ-సాక్షాత్కారానికి అన్ని సహాయాలలో గొప్పది గ్రహించిన వ్యక్తి యొక్క ఉనికి. దీన్నే సత్ సాంగ్ అంటారు, అంటే అక్షరార్థంగా జీవితో సహవాసం. ఇక్కడ కూడా భగవాన్ కొన్నిసార్లు నిజమైన 'ఉండడం' నేనే అని మరియు అందువల్ల సత్ సాంగ్ కోసం భౌతిక రూపం అవసరం లేదని వివరిస్తాడు. అయినప్పటికీ, అతను దాని ప్రయోజనాలపై తరచుగా నివసించాడు.

సత్యాన్ని గ్రహించిన ఋషులతో సహవాసం భౌతిక అనుబంధాలను తొలగిస్తుంది; ఈ అనుబంధాలు తొలగిపోతే, మనసులోని అనుబంధాలు కూడా నాశనం అవుతాయి. అలా ఎవరి మనసులోని అనుబంధాలు నశించిపోతాయో వారు చలనం లేని దానితో ఏకమవుతారు. వారు జీవించి ఉండగానే విముక్తిని పొందుతారు. అటువంటి ఋషులతో సహవాసాన్ని గౌరవించండి. ఋషుల సాంగత్యం ఫలితంగా ఇక్కడ మరియు ఇప్పుడు లభించిన ఆ పరమ స్థితిని, హృదయంతో సంపర్కంలో ఉన్న ఆత్మవిచారణ యొక్క లోతైన ధ్యానం ద్వారా సాక్షాత్కరింపబడిన ఆ సర్వోన్నత స్థితిని గురువు సహాయంతో లేదా గ్రంధాల జ్ఞానం ద్వారా పొందలేము. లేదా ఆధ్యాత్మిక యోగ్యత ద్వారా లేదా మరే ఇతర మార్గాల ద్వారా.......*

నైవేద్యం

 *నైవేద్యం* 


ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు...


ఆరోజు పాఠం


 “ *ఓం పూర్ణమద: పూర్ణమిదం* 

 *పూర్ణాత్ పూర్ణముదచ్యతే* 

 *పూర్ణస్య పూర్ణమాదాయ* 

 *పూర్ణమేవావశిష్యతే”....* అనే శ్లోకం . 


పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్ది సేపటి తరువాత నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు... నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు.. 


శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు.. దానికి ప్రతిగా శిష్యుడు., కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు... శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు...


గురువు గారే మళ్ళీ అన్నారు... పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది... ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు.


అదే విధంగా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మ స్థితి లో గ్రహించి, స్థూల రూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు.. దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం... అని వివరణ చేశారు గురువు గారు....


“పేరు దేవుడిది - పొట్ట మనది” అని హేళన చేసే వారికి ఇదే హిందూ ధర్మ సమాధానం.... గోవిందా🙏

శ్రీ మౌలి దేవి ఆలయం

 🕉 *మన గుడి : నెం 295*


⚜ *కర్నాటక  : కంకుంబి, బెల్గాం*


⚜ *శ్రీ మౌలి దేవి ఆలయం*



💠 శ్రీ మౌలి దేవి ఆలయం భారతదేశంలోని

బెల్గాం  జిల్లా కర్ణాటక రాష్ట్రం కంకుంబి వద్ద ఉంది


💠 స్థానికంగా  మహాలక్ష్మి లేదా మౌలి ఆలయం, రెండు అంచెల నిర్మాణంతో కొంకణ్-శైలిలో ఒక విలక్షణమైన మందిరం. ఏటవాలు పైకప్పులు చుట్టూ వరుస స్తంభాల ద్వారా మద్దతునిస్తాయి. 

ప్రవేశద్వారం ముఖమంటపానికి దారి తీస్తుంది, తరువాత ఒక చిన్న ప్రాంగణం ఉంటుంది. 

కొన్ని మెట్లు మహాలక్ష్మి దేవిని కలిగి ఉన్న ఎత్తైన వేదికపై గర్భాలయానికి దారి తీస్తుంది. 

ఈ ఆలయం చాలా పురాతనమైనది మరియు స్థానిక ప్రజలచే అత్యంత పూజ్యమైనదిగా చెప్పబడుతుంది. 


 

💠 ఆలయానికి ఆనుకుని ఒక పాత బావి ఉంది, ఇది మలప్రభ యొక్క అసలు జన్మస్థలం. మౌళి దేవాలయం వద్ద ఉన్న చెరువుకు ఇక్కడి నుంచి భూగర్భంలో నీరు ప్రవహిస్తుందని చెబుతారు.

పురాతన కాలంలో, అనేక మంది ఋషులు మరియు సాధువులు ఇక్కడ నివసించారు మరియు వారిలో కులకముని ఋషి కఠోరమైన తపస్సు చేసినట్లు చెబుతారు. 

అతని తీవ్రమైన భక్తి ఫలితంగా, శివుడు ఆ ప్రదేశంలో ప్రతిష్టించటానికి ఒక శివలింగాన్ని సమర్పించాడు మరియు ఆచారాల కోసం పవిత్ర జలాన్ని అందించడానికి మలప్రభ నదిని సృష్టించాడు. 


💠 రామలింగేశ్వర ఆలయంలో ఈరోజు పూజలందుకుంటున్న లింగం అదే.

ఈ సాధువు పేరు మీదుగా ఈ పట్టణానికి కులకంబి అని పేరు వచ్చింది మరియు తరువాత కంకుంబిగా మారింది. 


💠 ఆలయానికి ప్రక్కనే ఉన్న చిన్న మందిరం వెండితో చేసిన వింత చేతి విగ్రహం మరియు దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. మహర్షి ఆశ్రమంలో మల్లి అనే అమ్మాయి నివసిస్తుందని, పరమ భక్తురాలు అని చెబుతారు. 

ఒకసారి, ఆమె అడవిలోకి వెళ్ళినప్పుడు, ఒక దయ్యం ఆమెపై దాడి చేసింది. తప్పించుకోవడానికి చివరి చర్యగా, ఆమె నదిలోకి దూకింది. సహాయం కోసం ఆమె కేకలు విన్న కులకముని, రాక్షసుడిని సంహరించమని శక్తి దేవిని ప్రార్థించాడు.

ఋషి ఆమె కోసం వెతుకుతున్నప్పుడు, మల్లి తన చేతిని నీటిపైకి ఎత్తి, ఆమె సజీవంగా ఉందని సూచిస్తుంది.


💠 దేవత రాత్రి సమయంలో చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేదని మరియు తెల్లవారుజామున తిరిగి వస్తుందని నమ్ముతారు.  

ఆమె విడిది సమయంలో, ఆమె తిరిగి రాలేకపోయింది, కానీ కంకుంబిలో ఉండిపోయింది, ఇది గ్రామస్తులను వారి గ్రామంలో ఆమె ఆలయాన్ని స్థాపించడానికి దారితీసింది.  


💠 ఆలయం ప్రాథమికంగా లేటరైట్ రాళ్లతో నిర్మించబడింది.  గర్భగుడి  మొత్తం నిర్మాణం కొల్హాపూర్‌లో గమనించినట్లుగా రాష్ట్రకూట రీతిని పోలి ఉంటుంది.


💠 కంకుంబి కేవలం దేవాలయాలకు మాత్రమే ప్రసిద్ధి చెందలేదు. గ్రామం నుండి దాదాపు నాలుగు కి.మీ.ల దూరంలో గోవా వెళ్లే దారిలో సురల్ గ్రామం ఉంది, అదే పేరుతో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి.


💠 కంకుంబి పశ్చిమ కనుమల శిఖరం వద్ద ఉంది, ఇక్కడ గోవా, a మహారాష్ట్ర మరియు కర్ణాటక సరిహద్దులు కలుస్తాయి. 

ఈ ప్రాంతం కొంకణి మాట్లాడే వారి జనాభా. ఈ చిన్న గ్రామం శ్రీ మౌలి దేవి ఆలయానికి ప్రసిద్ధి.

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి మకరరాశిలో ఉన్నప్పుడు కంకుంబి శ్రీ మౌళి జాతరను జరుపుకుంటారు. 

ఈ రోజున, కంకుంబి మరియు చిగుల్లెలోని మౌళి దేవాలయాల వద్ద ఉన్న పవిత్ర తీర్థంలో నీరు సుమారు రెండు అడుగుల మేర పెరిగి స్వచ్ఛమైన తెల్లగా మారుతుంది. 

ఈ రోజున, కోడల్లి, గుల్లంబ్, కల్లస్కడే, కేంద్రే (చంద్‌గాడ్), మరియు చిగుల్లేఅల్‌ లోని ఏడుగురు మౌళిలు కంకుంబి మౌళిని కలవడానికి వస్తారు; వారందరినీ సోదరీమణులుగా పరిగణిస్తారు.

మలప్రభ నది ఒడ్డున పవిత్ర స్నానం జరుగుతుంది. 


💠 మహదీ నది అదే ప్రాంతంలో పుడుతుంది, 

కానీ గోవాలోకి ప్రవేశించడానికి నైరుతి వైపు ప్రవహిస్తుంది. 

పైన వివరించిన నదుల వలె కాకుండా,  సహ్యాద్రి యొక్క పశ్చిమ వాలులో ప్రవహిస్తుంది. 

ఇది దూద్‌సాగర్ జలపాతం నుండి దూసుకుపోవడాన్ని మీరు చూడవచ్చు. 


💠 హైవేకి కొద్ది దూరంలోనే, తెల్లవారుజాము నుండి శ్రీ మౌళి దేవి (పార్వతి- ​​అంబాదేవి అని కూడా పిలుస్తారు) ఆలయ ఆవరణ వెలుపల భక్తులు పెద్ద క్యూలో వేచి, ఎండ వేడిగా ఉన్నప్పటికీ ప్రార్థనలు చేస్తారు.


💠 దాదాపు 5000 మందికి పైగా కొంకణి మరియు మరాఠీ మాట్లాడే నివాసితులు నివసిస్తున్నారు, గోవా మరియు మహారాష్ట్ర సరిహద్దులకు సమీపంలో ఉన్న ఈ గ్రామం 12 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్థులు ప్రధాన దేవత శ్రీ మౌలి దేవి యొక్క గొప్పజాతరను జరుపుకోవడంతో కార్యకలాపంతో నిండి కోలాహలంగా ఉంటుంది


💠 12 సంవత్సరాల తరువాత జరుపుకునే జాత్ర సందర్భంగా గోవా, మహారాష్ట్ర మరియు కర్ణాటక నుండి భక్తులు కంకుంబిలోని మౌళి దేవి మందిరానికి తరలివస్తారు.

కాశీలో జీవనం

 

కాశీలో జీవనం

 

వివిధ ప్రాంతాలనుంచి అనేదానికన్నా వివిధ దేశాలనుంచి ఎంతోమంది కాశీకి వచ్చి రోజులకొద్దీ, నెలల కొద్దీ, సంవత్సరాలకొద్దీ నివసిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాకు లభించిన సమాధానం నేను ఏప్రిల్ 5 తారీకు ఉదయం 8-30 నుండి 9 గంటలవరకు పొందిన అనుభవం, అనుభూతే సమాధానంగా లభించింది. కాశీవిశ్వేశ్వరుని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలో కూర్చుంటే అనన్య సామాన్యమైన ఆధ్యాత్మిక అనుభూతి,. అక్కడి భక్తులందరూ నాకు ఈశ్వరుని ప్రమద గణాలుగా అనిపించారు. ఆలయ ప్రాంగణం సాక్షాతు కైలాసంగా అనిపించింది. సాధకుడు పొందిన దివ్యానుభూతిని వర్ణించ మాటలు లేవు. అటువంటప్పుడు ప్రతివారు ఈశ్వరుని సన్నిధిలో ఉండాలని అనుకోటంలో ఆశ్చర్యం ఏముంది. కాశీ పట్టణం ఎంతో పురాతనమైనది. సాక్షాత్తు పరమేశ్వరుడు నడచిన ప్రదేశం. అమ్మవారు తిరిగిన స్థలం. ఇప్పటికి అక్కడికి దేవతలు వస్తారని ప్రతితీ.

 

సాధకుల జీవనం:

 

అరిషడ్వార్గాలను వదిలి దేహాభిమానాన్ని త్యజించిన సాధకులు అనేకులు మనకు కాశీలో  తారసపడతారు. బిక్షాటన చేస్తూ పరమేశ్వరుని కొలిచేవారు కొందరు ఆంధ్రశ్రమంలో రోజు 20,30 మంది సాధువులు వచ్చి కూర్చోవటం    వారికి అక్కడ రోజు భోజనం పెట్టటం నేను చూసాను. . ఆలా కాశీలో ఎన్నిచోట్ల అన్నదానం జరుగుతుందో  ఏమో మరి. ఇక కొందరు సాధువులు చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం చేస్తూ జీవిస్తున్నారు.  కొందరు. సాధువులే కాదు సామాన్యుజనం కూడా సాదారణ జీవనం పెట్టుబడి  లేకుండా,లేక కొద్దీ పెట్టుబడితో జీవిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరంగా వివరిస్తాను.

 

కొద్దిపెట్టుబడితో అంటే : ఒక రూ 100-500 పెట్టుబడితో జీవనం. కొందరు సాధువులు ఒక చిన్న పళ్ళెరం పట్టుకొని అందులో భస్మం యెర్రని చెందనం, ఒక త్రీసులపు లేక మూడుగీతాల ముద్రలు కలిగిన ముద్రలు వెంట పెట్టుకొని భక్తులకు బొట్లు పెట్టి డబ్బులు వసులు చేసుకుంటున్నారు. హీనపక్షం వారు రోజుకు 1000 నుండి 1500 వరకు సంపాయించవచ్చు. మేము బోటులో గంగ హారతి చూస్తూవుంటే ఒక సాధువు ఒక పళ్ళెరంలో చిన్న దీపారాధన కుంది పెట్టుకొని చిన్న సీసాలో నూనె పెట్టుకొని అందరికి హారతి చూపిస్తున్నాడు.  ఒక్కొక్కరు 10,20 ఇంకా కొంతమంది అంతకన్నా ఎక్కువ డబ్బులు వేయటం నేను చూసాను. చాలా తక్కువ పెట్టుబడితో రకంగా కూడా జీవించవచ్చు. అన్నీ  పడవలు తిరిగితే అతనికి రూ 2000 వరకు కూడా రోజుకు రావచ్చు. కేవలం గంట నుండి 2 గంటల వరకు బొట్లు తిరిగితే సరి రోజంతా విశ్రాంతి తీసుకోవచ్చు చక్కగా జీవనం సాగించవచ్చు. దేవాలయూయానికి వెళ్లే మార్గంలో ఉమ్మెత్తకాయలు, జిల్లేడు పూవులు, జిల్లేడు పులా మాలలు, మారేడు దళాలు అమ్మే వాళ్ళు కొంతమంది ఎటువంటి పెట్టుబడి లేకుండా కేవలం బయలు ప్రదేశాలకు వెళ్లి ఆకులు, అలమలు  ఏరుకోరావటం చేసి సంపాదిస్తున్నారు.  పెట్టుబడి ఏమిలేదు కేవలం తిరిగి ఏరుకొని రావటమే.  చాలా తక్కువ ఖర్చుతో అంటే జిల్లేడు, ఉమ్మెత్త చెట్లు ఉండే ప్రదేశానికి వెళ్ళటమే. ఆలా ఏమాత్రం ఖర్చు లేకుండా సంపాదన. నాకు అనిపించింది పుణ్యక్షేత్రాలలో ఏదో ఒక పని చేసి పొట్టపోసుకోవచ్చు అని.

 

ఇక కొంచం పెట్టుబడితో జీవనం:

 

కొంతమంది పిల్లలు 15 నుంచి 20 సం మధ్యవాళ్ళు  ఒక కిరోసిన్ స్టవ్వును ఒక డబ్బాలో పెట్టి పైన ఒక రాతివెండి కెట్లి పెట్టి లెమెన్ టీ అమ్ముతూ సంపాదిస్తున్నారు. ఒక్కో టీకి రూ 20 తీసుకుంటున్నారు.  వీళ్ళు రాత్రి గంగ హారతి సమయంలో బోట్లమీద తిరుగుతూ, పగటి పుట గల్లీలలో తిరుగుతూ అమ్ముతున్నారు. రోజుకు కనీసం రెండు, మూడు ట్రిప్పులు తిరిగితే 60 నుంచి 80 టీలు సునాయాసంగా అమ్మవచ్చు. వాళ్లకు వేయి రూపాయుయాలకన్నా ఎక్కువ గిట్టుబాటు కాగలవు.

 

చిన్న దుకాణాలు. రోడ్డు ప్రక్కన ప్లాస్టిక్ డబ్బాలు, ఇతర ప్లాస్టిక్ సామానుల దుకాణాలు వీటికి 2000 నుండి 5000 వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది.

 

చొక్కాల వ్యాపారం. మహాదేవ అని ఇంకా ఇతర శివనామాలు హిందీలో వ్రాసినవి  అచ్చువేసిన చొక్కాలు 150 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక్కొక్క చొక్కాకు రూపాయలు 50 లాభం రావచ్చు. అంతే  కాక ఆడవారి డ్రస్సులు, చీరలు కూడా ఫూటుపాత్ మీద అమ్ముతున్నారు. వ్యాపారానికి కొంత ఎక్కువ పెట్టుబడి కావాలి. లాభం మంచిగా ఉంటుంది.

 

రాగి ఇత్తడి సామానులవ్యాపారం. రాగి చెంబులు,  కంకణాలు,చిన్న పాత్రలు (గంగ నీరు పట్టుకోవటానికి) ఇవి ఇనుపవే కానీ రాగివాటిలాగా కనపడతాయి. ఇత్తడి కుందులు, చిన్నచిన్న వస్తువులు, శివలింగాలు, జంధ్యాలు, విబూది, రుద్రాక్షమాలలు, స్పటిక మాలల దుకాణాలు మనకు అడుగడుగునా కనపడతాయి. వస్తువుల ధరలు మనకు ఇక్కడికన్నా  పెద్దగా తేడా నాకు కనిపించలేదు. రెండు ఇత్తడి కుందులు 150 చెప్పి రూ 120 కి ఇచ్చాడు.

చిన్న టీ స్టాళ్ళు , చిన్న ఇడ్లీ, వడ, దోశ హోటళ్లు అంటే రోడ్డు ప్రక్క బండ్లు అరుగు మీద పెట్టి అమ్మే చిన్న షాపులు మనకు కాశీలో కో కొల్లలు గా కనపడతాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అక్కడ దాదాపు అందరు తెలుగులో మాట్లాడటమే కాదు ప్రతి సందులో మనకు తెలుగు బోర్డులు ఉండటం విశేషం. చిన్న వ్యాపారస్తులు అక్కడి ట్రావెల్స్ తో సంబంధం పెట్టుకొని తెలుగులో కరపత్రాలు ముద్రించి మేము గయకు, ప్రయాగకు, అయోధ్యకు కార్లు, చిన్న బస్సులు సప్లై చేస్తామని వ్యాపారం చేస్తున్నారు. వారికి ఒక్కొక్క త్రిప్పకు 500 పైన కమిషన్ లభిస్తుంది. వీరు వారి వ్యాపారానికి అనుబంధంగా కమీషను  కూర్చొని సంపాదిస్తున్నారు.

ఇక తొక్కే రిక్షాలు రిక్షావాళ్లు 1-2 కిలోమీటర్ల దూరం వరకు వెళతారు 70 రూపాయలకన్నా ఎక్కువ తీసుకుంటున్నారు.

బ్యాటరీతో నడిచే రిక్షాలు వీరి సంపాదన చాలా బాగుంది. వీరు ఒక ట్రిప్పుకు 300 నుంచి 400 వందల వరకు అడుగుతున్నారు. వీరు రోజులో 20 ట్రిప్పుల కన్నా ఎక్కువ వేయగలరు అంటే వారి సంపాదన ఎలా ఉందో ఊహించండి. బ్యాటరీ రిక్షా ఖరీదు లక్షా యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఉంటుందని అన్నారు. రిక్షాలు మెయింటెనెన్స్ ఫ్రీ కేవలం రెండు మూడు ఏళ్లకు ఒకసారి బ్యాటరీలు మార్చాలి. ఒక ఊడదీసిన రిక్షాను చూసాను అందులో లేడ్  యాసిడ్(Led Acid ) బ్యాటరీలు ఉన్నట్లు కనిపించింది. వారణాశిలో, గయలో, నాకు చాలా బ్యాటరీ రిక్షాలు కనిపించాయి. వీటిలో 8 మంది దాకా ప్రయాణించవచ్చు. వెడల్పు తక్కువగా వుంది ఎదురెదురుగా కుర్చునేటట్లు రెండు సీట్లు ఇంకా డ్రైవర్ పక్కన కూడా కూర్చుని ప్రయాణిస్తున్నారు. రిక్షా వాళ్ళ సంపాదన చాలా బాగుంది.

ఆటోలు కూడా చాలా కనపడుతున్నాయి కానీ ఆటోలు బ్యాటరీ రిక్షాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్నాయి. . ఇవి కాక టాక్సీ కారులు, మినీ బస్సులు  అంటే ట్రావెలర్ వాళ్ళవి అన్నమాట, రకంగా రవాణా వాహనాల వాళ్ళు కూడా చాలా సంపాదిస్తున్నారు.

నేను ఒక గల్లీ లోంచి వెళ్తుంటే ఒక యువతితో పరిచయం అయ్యింది.  ఆమె రెండు నెలల క్రితం ఆంధ్ర నుంచి వచ్చిందట, తెలుగు తప్ప ఏమీ రాదు.  అక్కడ ఒక ఆశ్రమంలో ఆమె వుంటున్నది. ఆశ్రమ అరుగు మీద ఒక చిన్న దుకాణం పెట్టుకున్నది.  అది ఆశ్రమం స్వామీజీ ఏర్పాటు చేశారని అన్నది.  ఆమె రుద్రాక్ష మాలలు,  తెలుగు పుస్తాకాలు, కొన్ని హిమాలయ డ్రగ్స్ వారి ఆయుర్వేద మందులు విక్రయిస్తున్నది. నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఒక సాధువు వచ్చి రుద్రాక్షమాలలు 10 కొన్నాడు. వాటికి 600 రూపాయలు ఇచ్చాడు. నేను ఆమెతో హిమాలయ ఆయుర్వేదం కాక పతంజలి మందులు విక్రయించమని సూచించాను. రెండు మూడు సాదారణ వ్యాధులకు పనికి వచ్చే  మందుల పేర్లు కూడా చెపితే ఆమె పుస్తకంలో వ్రాసుకుంది.

ఇన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించడానికి కారణం నేను మన తెలుగువారు అనేకమంది వారణాసి వెళ్లి ఉండాలని కోరుకుంటున్నట్లు నాకు అర్ధమైనది. అలాంటి వారికి ఉపయోగపడాలని ఉద్దేశ్యంతో నేను కాశీలో వివిధ రకాల ప్రజల జీవన సరళి గురించి నేను చూసి గమనించి అర్ధంచేసుకున్నది వివరించాను నాకు తెలిసినంతవరకూ కాశీలో మధ్యతరగతి వారే ఎక్కువగా వున్నారు. కేవలం తెలుగు వస్తే చాలు కాశీలో బ్రతకవచ్చు.  నా వ్యాసం తెలుగు వారికైనా పనికి వస్తే నా ప్రయత్నం సఫలీకృతం అయినట్లే.