1, మార్చి 2026, ఆదివారం

విద్యను ప్రతి మనిషి నేర్చుకోవాలి.

 |ఉ| విద్య నిగూఢగుప్తమగు విత్తము, రూపము పురుషాళికిన్
విద్య యశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశబంధుడున్,
విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్,
విద్య నృపాలపూజితము, విద్య నెఱుంగనివాడు మర్త్యుడే? 

విద్య యొక్క గొప్పతనాన్ని తెలుపుతున్నారు ఏనుగు లక్ష్మణ కవి విద్య నిగూఢమైనట్టి ధనము అట అంటే విద్యావంతుడు తన చెంత ఎప్పుడు దానం కలిగి ఉంటాడని అంటున్నాడు.  అంటే కాదు విద్య యశస్సు అనగా కీరిని, భోగాలను ఇవాటమే కాకుండా అది గురువుగా, విదేశములలో బంధువుగా దైవముగా విద్యావంతునికి తోడుగా ఉంటుందని అంటున్నాడు. ఇంకా విద్యకు సరిఅయిన ధనము లేదట.  ఇంకా ఏమంటున్నాడంటే విద్య వలన రాజులు కూడా పూజిస్తారట.  అందుకే ప్రతివారు విద్యావంతుడు కావాలని భావము.  అంతటితో ఆగలేదు.  విద్యనేర్వని వాడు మనిషే కాదు అని అంటున్నాడు.  కాబట్టి ప్రతి వారు విద్యావంతులు కావలి.  తమ తమ విద్యతో ప్రకాశించాలి అని అర్ధం.  అన్ని విధాలుగా ఉపయోగకరమైన విద్యను ప్రతి మనిషి నేర్చుకోవాలి. 



వాసనలు

వాసనలు 

పూర్వం ఒక గ్రామంలో చేపలు అమ్మే ఒక వనిత ఉండేదట ఆమెపేరు సీతమ్మ. రోజు ఆమె ప్రక్కన వున్న పట్టణానికి వెళ్లి చేపలు అమ్ముకొని సాయంత్రానికల్లా నడుచుకుంటూ తన గ్రామాన్ని చేరెదట.  ఈ విధంగా ఆమె దిన చర్య ఉండేది. తొందరగా చేపలు అమ్ముడు పొతే తొందరగా తన వూరు చేరేది అదే ఆలస్యం గా అమ్ముడు పొతే ఆలస్యంగా ఇల్లు చేరేది. ఇలా రోజులు వెళ్లదీస్తూ ఉండేది. ఒకరోజు వర్షాకాలం కావటంతో పట్టణం అంతటా బురజతో నిండి ఉండి  అమ్మకం చేయటానికి ఆమెకు చాలా కష్టం అయింది.  వాన వెలిసినప్పుడు చిన్నగా వీధి వీధి తిరిగి అతి కష్టం మీద ఎట్లాగో చీకటి పడే వేళకు తెచ్చినఁ అన్ని చేపలు అమ్ముడు పోయాయి.  బ్రతుకు జీవుడా అని చిన్నగ ఒక చెట్టు క్రింద తాను కూడా తెచ్చుకున్న చద్ది మూట విప్పి భోజనం చేశాననిపించుకుంది.  ఇక ఇంటికి చేరాలి చుట్టూ చీకటి తన ఊరుకు ఆ చీకటి రాత్రిలో ప్రయాణం చేయటం యెట్లా అని ఆలోచిస్తూ ధైర్యం చేసి  ఊరు బయటకు వెళ్ళింది.  అక్కడి పరిస్థితి భయానకంగా వున్నది కీచురాళ్ళ అరుస్తున్నాయి.  దారి మొత్తం బురజగా వుంది అడుగు తీసి అడుగు పెడితే ఎక్కడ జారీ పెడతామో అన్నట్లు వున్నది.  ఈ చీకట్లో తాను ఊరుబయట జారీ పడితే,  లేక ఏ పామో తేలో కాటు వేస్తె ఆమ్మో ఆ ఆలోచన రాగానే ఆమె శరీరం ఒక్కసారిగా వణుకు పుట్టింది.  ఇప్పుడు ఏమిటి చేయటం అని ఆలోచనలో పడ్డది తాను  వున్న చోటికి కొంచం దూరంలో ఒక గుడిసె నుంచి చిన్నగా దీపం వెలుతురు వస్తున్నది.  ఒక ఆశ కిరణము మదిలో మెదిలింది.  ఈ రాత్రికి ఆ గుడిసె వారిని అడిగి అక్కడ బసచేసి రేపు ఉదయమే ఇంటికి పోదాము అని అనుకోని ఆ గుడిశ ముందుకి వెళ్లి తలుపు కొట్టింది.  ఒక నడి వయసు ఆమె తలుపు తీసి ఎవరు అని అన్నది.  ఆ మసక వెలుతురులో ఆమెను గుర్తుపట్టింది ఆమె ఎవరో కాదు మల్లెపూలు అమ్మే లచ్చవ్వ..  లచ్చవ్వను చూడగానే మన సీతమ్మకు ప్రాణం లేచి వచ్చినట్లయినది.  అవ్వ నాకు ఈ రోజు గిరాకీ కాలేదు. నేను తెచ్చిన మాలు పూర్తిగా అమ్మేసరికి చీకటిపడింది ఈ వానలో తడుసుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను, మా ఊరుకు వెళ్ళటానికి భయంగా వుంది ఈ రాత్రి ఇక్కడే వుందామనుకుంటే ఇంతలో నీ ఇల్లు కనిపించింది.  ఈ రోజు నీ గుడిసెలో పడుకోవచ్చా అని అడిగింది. 

నీతమ్మకు పడుకోటానికి ఒక చేప ఇచ్చి అక్కడ పరుచుకొని పడుకో అని గుడిశలో ఒక స్థలాన్ని చూపెట్టింది. గుడిశ నిండా మల్లెపూల దండాలు, ఒక బుట్ట నిండా  మల్లెపూలు గుడిసె మొత్తం మెల్లెల గుబాళింపు తో నిండి వున్నది. ఆ గుడిశ క్రొత్తగా పెళ్ళైన దంపతులకు శోభనంకోసం ఏర్పాటు చేసిన గదిలాగా వున్నది. మల్లెల వాసనతో అక్కడి వారికి మత్తెక్కుతున్నది. 

సీతమ్మ తనకు ఇచ్చిన చేప మీద మేను వాల్చింది. చాలా సేపు నిద్రకోసం చూసింది.  కానీ ఎంతకు తనకు నిద్రపట్టడం లేదు.  ఆ మల్లెల పరిమళం తనకు క్రొత్తగా ఉండటమే కాకుండా ఎంతో చికాకు కలిగిస్తున్నది.  యంత ప్రయత్నిస్తున్న అస్సలు నిద్రపట్టడం లేదు.  ఏమిటి ఈ రోజు నాకు నిద్ర పట్టటం లేదు అని పరి పరి విధాలుగా ఆలోచిస్తే చివరకు ఆమెకు స్పృహకు వచ్చింది ఏమిటంటే మల్లెల వాసన ఆమెకు  నిద్రాభంగం కలిగిస్తున్నట్లు పసికట్టింది.  నిజానికి మల్లెల వాసనలు అందరిని మత్తులోకి దింపి గాఢ నిద్రలోకి చేరుస్తాయి.  కానీ సీతమ్మకు అందుకు బిన్నంగా వున్నది.  వెంటనే ఆమెకు కర్తవ్యమ్ అర్ధం అయింది.  అదేమిటంటే ఈ మల్లెపూల వాసనలు నన్ను నిద్రపోనీకుండా ఆటంకపరుస్తున్నాయి కాబట్టి ఈ వాసనకు దూరంగా ఉండాలి అని ఆలోచించి ఒక మూలకు పెట్టిన తన చేపల బుట్టను తీసుకొని వచ్చి తన ముక్కు ముందర పెట్టుకుంది. చేపల వాసన ముక్కు పుటాలకు చేరిందో లేదో వెంటనే సీతమ్మ నిద్రలోకి  జారుకుంది.

ఈ కధ చదువుతుంటే విచిత్రంగాను, సత్య దూరంగాను మనకు తోస్తుంది అనటంలో . సందేహం లేదు.  కానీ మనమందరము యదార్ధానికి ఆ సీతమ్మ లాంటివారమే కానీ ఆ సత్యాన్ని మనం అంగీకరించుము.  నిత్యమూ, సత్యము, శాశ్వితము, అనంతము అయినటువంటి సచ్చిదానందస్వరూపాన్ని వదిలి ఐహికాము, బంధకారకము, బాధాకరం, దుఃఖ హేతువు అయిన కంపుకొట్టే ఇహ బంధాలకు లోనై జీవితాన్ని గడుపుతూ అదే మన జీవిత లక్ష్యమని భావిస్తూ అమూల్యమైన కాలాన్ని ఐహిక సుఖాలకు కేటాయిస్తూ శాశ్విత బ్రహ్మ పదాన్ని విస్మరిస్తున్నాము.  మనకు అప్పుడప్పుడు లచ్చవ్వ లాంటి జ్ఞానులు తారస పడి మల్లెల సుగంధాలలాంటి తమ అపూర్వ జ్ఞ్యాన సందేశాలను ఇస్తున్న మనం చేపల కంపు కొట్టే సంసారమనే గంపను వదలకుండా ఈ సంసార బంధనాలతో ఉంటున్నాము.  అందుకే యోగి వేమన 

"ఓగు నోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు
పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా
విశ్వదాభిరామ వినురవేమ"

చెడ్డవాడు చెడ్డవాడినే మెచ్చుకుంటాడు, అజ్ఞాని అజ్ఞానిని మెచ్చుకుంటాడు, పిసినారి వాడు పిసినారి వాడినే మెచ్చుకుంటాడు.  ఎందుకంటె పంది బురదను మెచ్చుకుంటుంది కానీ పన్నీరుని మెచ్చుకోదుగా అని అంటాడు. కవి.  ఇది ముమ్మాటికీ నిజం. 

ఈ రోజుల్లో దైవ భక్తి కూడా ఒక విధంగా ఆర్జనకు తావు అయ్యింది.  దీనివల్ల నిజమైన భక్తులు సరైన మార్గంలో నడవలేక పోతున్నారు.. భక్తి అనే బలహీనతను ఆసరాగా చేసుకొని అనేకులు సొమ్ము చేసుకుంటున్నారు.  మీరు ఏదైనా ప్రసిద్ధ దేవాలయానికి వెళితే ద్వారం ముందు ఒక కిలోమీటరు ముందరి నుంచి వీధి దుకాణదారులు మొదలవుతారు.  అందులో ఇతర మాతస్స్తులు కూడా వుంటున్నారు.  పూలు, పత్రీ, కొబ్బరికాయలు, అనేక రకాల  పూజా ద్రవ్యాలు అంటే ఆదేవాలయానికి సంబందించినవి. అంటే శివుని దేవాలయం అయితే శివునికి సంబందించినవి, విష్ణు దేవాలయం అయితే విష్ణువుకు సంబందించినవి. అలా అన్నమాట. అమ్మటం చేస్తూ ఉండటమే కాకుండా మీరు చెప్పులు ఇక్కడ పెట్టుకోండి, మీ సెల్ఫోనులు ఇక్కడ పెట్టుకోండి అని మనలను బలవంతం చేస్తూ వాళ్ళ వ్యాపారాన్ని కొనసాగిస్తారు.  నిజానికి ఆ దేవాలయంలోకి మనం కొబ్బరికాయలను, పూలను పత్రిని తీసుకొని స్వామిని అర్చించలేము ఎందుకంటె అక్కడ వున్న రద్దీతో మనకు క్షణ కాలం స్వామి దర్శనం అవటమే ఘనం.  ఇక అర్చన ఆరాధన ఎలా చేయగలం చెప్పండి.  కానీ ఆ అమ్మేవాళ్లు ఇక్కడ తప్పకుండా ఈ పూలు పెట్టాలి, ఈ పత్రీ పెట్టాలి ఈ వస్తువులు పెట్టాలి అని చెప్పి మనలను తప్పుడు ద్రోవ పట్టిస్తారు. 

ఇక మనకు సంఘంలో కొంతమంది నేను ఈ పూజ చేస్తాను, ఈ వ్రతం చేస్తాను మీ ఇంట్లో చేయించుకోండి నేను ఫలానా వారింట్లో ఈ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహంతో వాళ్ళ కస్టాలు తొలిగాయి.  మీరు చేయించుకోండి అని బలవంతం చేసి వారి జీవనాన్ని గడుపుకుంటున్నారు. ఎప్పుడో ఆది శంకరాభగవతపాదుల వారు వీటినన్నిటిని ముందుగానే పసి గట్టి చెప్పారు. 

 "జటిలో ముండీ లుంచితకేశః కాషాయాంబర బహుకృతవేషః | 

పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః 

కొందరు శిరోజాలను జడలుగా పెంచుకుంటారు, కొందరు ముండనం చేసుకుంటారు, కొందరు కాషాయ వస్త్రాలు ధరించి ఈ రీతిని వివిధ వేషాలు వేసి జనులను ఆకర్షించటానికి ప్రయత్నిస్తారు.  వీరంతా జ్ఞానులు కాదు.  కేవలం ఉదర నిమిత్తం అంటే కడుపు నింపుకోవటానికి చేసే పనులు కాక వేరే కావు అని స్వామి భావన.  ఇందులో పొల్లు పోకుండా మనం ఈ రోజుల్లో చూస్తున్నాము.  

నేను బాబా భాక్తుడిని నాకు రోజు బాబా దర్శన మిస్తాడు.  మీరు చెప్పేవన్నీ నేను బాబాకు చెపుతాను ఆయన మీ కోరికలన్నీ తీరుస్తాడు అని ఒకడు.  ఇంకొకడు నాకు అన్నే తెలుసు నేనే దేముడిని అని నాకు పూజ చేయటానికి ఇంత ఫీజు, పాద ప్రక్షణం చేయటానికి ఇంత ఫీజు అని. ఇంకొకాయన నేను  భగవంతుని అవతారమని, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కోరీతిని సామాన్యులను భక్తి పేరుతొ వంచన చేస్తూ అనేక విధాలుగా ధనాగార్జన చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.  ఇలా చేసే వారికి పెద్దపెద్ద ఆశ్రమాలు, విడిది  గృహాలు,ఖరీదైన వాహనాలు మంది మార్బలం.  ఒక్కొక్కటి చూస్తుంటే ఈ ప్రపంచం ఎటువైపు ప్రయాణిస్తున్నదా అని అనిపిస్తుంది. వేద వ్యాస మహర్షి  భవిష్యపురాణంలో చెప్పినవి ఒక్కొక్కటి మనకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనపడుతున్నాయి. 

నిజమైన సద్గురువు యొక్క మొట్టమొదటి లక్షణం ఆ మహానుభావుడు సర్వసంగ పరిత్యాగి అయి ఉంటాడు.  అంటే ఆయన అరిషట్వర్గానికి  దూరంగా ఉంటాడు.  వస్త్రాలు ధరించడు కేవలం ఈ సంఘంకోరకు మాత్రం కౌపీనాన్ని ధరిస్తాడు.  చేతిలో ఎటువంటి వస్తువులు వుండవు కేవలం దోసిలి పట్టి మాత్రమే బిక్షం తీసుకుంటాడు.  నిరంతరం బ్రహ్మైక్యం చెంది ఉంటాడు.  అంటే నిరంతరం బ్రహ్మమంలోనే చరిస్తూ ఉంటాడు.  ఆయనకు బాహ్య స్మ్రుతి ఉండదు.  మీరు పొగిడినా లేక అవమానించిన ఏమాత్రం పట్టదు.  రాగ ద్వేషాలు అస్సలు వుండవు.  ఈ రకంగా వున్న వారు ఎవరైనా ఉన్నారా అని మనం ప్రశ్నించుకుంటే వెంటనే మనం మనకు తెలిసిన ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే లేరు అని అంటాము.  కానీ అది నిజం కాదు.  ఈ రోజుకి అటువంటి సత్పురుషులు ఈ భారతావనిలో  వున్నారు.  ఒక్క సారి కాశీ క్షేత్రానికి వెళ్లి చుడండి.  హిమాలయాలకు వెళ్లి చుడండి.  మనకు అనేకమంది సాధుపురుషులు గోచరిస్తారు.  నిరంతరం.  పరమేశ్వరునికై పరితపిస్తూ తపిస్తూ ఉండేవారు అనేకులు వున్నారు.  మానవ జన్మ ఎత్తినందుకు మనం కూడా వారిలో ఒకరం అవ్వాలని కోరుకోవాలి.  అప్పుడే ఈ వాసనలను వదిలి  ముక్తి పదం చేరుకోగలం.


ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిహి 

మీ 

చేరువేల భార్గవ శర్మ


01మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

 *🌹01మార్చి2026🌹*  

  *దృగ్గణిత పంచాంగం*  

    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం*

 *శిశిర ఋతౌః* 

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : త్రయోదశి* ‌రా 07.09 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : పుష్యమి* ఉ 08.34 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : శోభన* మ 02.33 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* ఉ 07.54 *తైతుల* రా 07.09 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

  *ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00-04.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.56* 

*వర్జ్యం    : రా 08.59 - 10.32*

*దుర్ముహూర్తం  : సా 04.40 - 05.27*

*రాహు కాలం   : సా 04.46 - 06.14*

గుళికకాళం      : *మ 03.17 - 04.46*

యమగండం    : *మ 12.20 - 01.48*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.35*

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.25 - 08.47*

సంగవ కాలం         :     *08.47 - 11.09*

మధ్యాహ్న కాలం    :    *11.09 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.14*

ప్రదోష కాలం         :  *సా 06.14 - 08.40*

రాత్రి కాలం           :*రా 08.40 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.36*

<><><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


     *పాశాయుధాయ నమః* 

  *అంకుశాయుధాయ నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసిం*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

 *🌹01మార్చి2026🌹*  

  *దృగ్గణిత పంచాంగం*  

    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం*

 *శిశిర ఋతౌః* 

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : త్రయోదశి* ‌రా 07.09 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : పుష్యమి* ఉ 08.34 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : శోభన* మ 02.33 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* ఉ 07.54 *తైతుల* రా 07.09 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

  *ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00-04.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.56* 

*వర్జ్యం    : రా 08.59 - 10.32*

*దుర్ముహూర్తం  : సా 04.40 - 05.27*

*రాహు కాలం   : సా 04.46 - 06.14*

గుళికకాళం      : *మ 03.17 - 04.46*

యమగండం    : *మ 12.20 - 01.48*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.35*

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.25 - 08.47*

సంగవ కాలం         :     *08.47 - 11.09*

మధ్యాహ్న కాలం    :    *11.09 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.14*

ప్రదోష కాలం         :  *సా 06.14 - 08.40*

రాత్రి కాలం           :*రా 08.40 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.36*

<><><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


     *పాశాయుధాయ నమః* 

  *అంకుశాయుధాయ నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞

 *🌹01మార్చి2026🌹*  

  *దృగ్గణిత పంచాంగం*  

    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం*

 *శిశిర ఋతౌః* 

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : త్రయోదశి* ‌రా 07.09 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : ఆదివారం* ( భానువాసరే )

*నక్షత్రం  : పుష్యమి* ఉ 08.34 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : శోభన* మ 02.33 వరకు ఉపరి *అతిగండ*

*కరణం  : కౌలువ* ఉ 07.54 *తైతుల* రా 07.09 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు* 

  *ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00-04.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.56* 

*వర్జ్యం    : రా 08.59 - 10.32*

*దుర్ముహూర్తం  : సా 04.40 - 05.27*

*రాహు కాలం   : సా 04.46 - 06.14*

గుళికకాళం      : *మ 03.17 - 04.46*

యమగండం    : *మ 12.20 - 01.48*

సూర్యరాశి : *కుంభం*

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.35*

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు*

ప్రాతః కాలం          :  *ఉ 06.25 - 08.47*

సంగవ కాలం         :     *08.47 - 11.09*

మధ్యాహ్న కాలం    :    *11.09 - 01.31*

అపరాహ్న కాలం    : *మ 01.31 - 03.53*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి*

సాయంకాలం        :  *సా 03.53 - 06.14*

ప్రదోష కాలం         :  *సా 06.14 - 08.40*

రాత్రి కాలం           :*రా 08.40 - 11.55*

నిశీధి కాలం          :*రా 11.55 - 12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.47 - 05.36*

<><><><><><><><><><><><><><><>

        🌷 *ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌞శ్రీ సూర్య పంజర స్తోత్రం🌞*


     *పాశాయుధాయ నమః* 

  *అంకుశాయుధాయ నమః*


🙏 *ఓం నమో సూర్యాదేవాయ నమః* 

          

🌞🪷🌹🛕🌹🌷🪷🌷🌞

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹<><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹హా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం* *11వ భాగం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 28 ఫిబ్రవరి 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*            

          *11వ భాగం*


*ఊర్థ్వలోకాలు,అధోలోకాలు- అనంతుడు*```


పద్నాలుగు లోకాల నిర్మాణం తరువాత ఏయే లోకాలలో ఎవరుండాలో బ్రహ్మ నిర్ణయించాడు.```


           *ఊర్థ్వలోకాలు*


#భూలోకం : ```

భూలోకంలో నాలుగు రకాల జీవాలు ఉంటాయి.```


*అండజాలు : ```

గ్రుడ్డు (అండము) ద్వారా జననం పొందేవి :```


*జరాయుజాలు : ```

గర్భం ద్వారా జన్మించేవి. పశువులు, జంతువులు,మానవులు.```


*స్వేదజాలు : ```

చెమట నుండి జన్మించే జీవులు.

```

*ఉద్భిజాలు : ```

భూమి నుండి ఉద్భవించేవి.  

```


#భువర్లోకం : ```

భూమి పైన గల ఈ లోకంలో సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు, సూక్ష్మ రూపులైన కిన్నెర కింపురుష విద్యాధరులు ఉంటారు.```



#సువర్లోకం (స్వర్గ లోకము): ```

ఇంద్రాది అధిష్ఠాన దేవతలు, దిక్పాలకులు, సాధ్యులు, దేవర్షులు, గంధర్వులు, అప్సరసలు నివసిస్తారు. పుణ్యఫలం అనుభవించడానికి మానవులు మరణానంతరం స్వర్గలోకానికి వస్తారు. పుణ్యఫలం తీరిపోగానే తిరిగి భూమిపై జన్మించడానికి వెళతారు. ఇక్కడ ఆకలిదప్పులు ఉండవు. స్వర్గంఅంటేసుఖాలకు, ఆనందాలకు నిలయం.```



#మహర్లోకం : ```

స్వర్గలోకం పైన గల మహర్లోకంలో దేవతలు తపస్సు చేస్తుంటారు. స్వర్గలోక సుఖాల నుంచి పరమాత్మునిలో లయం చెంది మోక్షము పొందాలి అని తపస్సు చేసే వారు ఇక్కడ ఉంటారు.```



#జనోలోకము : ```

ధర్మాత్ములు అయిన పతులు, పతివ్రతలైన సతులు అనగా ధర్మం తప్ప కుండా ఆచరించే భార్యాభర్తలు ఇరువురు ఈ లోకంలో నివాసం పొందుతారు.```



#తపోలోకము : ```

భూలోకంలో ఏయే దేవతా మూర్తులను ఆరాధిస్తారో, ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలు పొంది ఇక్కడ పరబ్రహ్మ అనుగ్రహంకోసం తపస్సు చేస్తారు. కల్పాంత కాలం వరకు ఉండి కర్మానుసారం భూలోకంలో జన్మించి తపస్సు చేస్తారు. మహాప్రళయంలో సర్వం లయమైనప్పుడు వీరు జన్మ రాహిత్య మోక్షం పొందుతారు.

```


#సత్యలోకం : ```

సృష్టికర్త బ్రహ్మదేవుడు ఉండే లోకం సత్యలోకము. బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మజ్ఞానం పొందిన భూలోకవాసులు మరణానంతరం బ్రహ్మలోకం పొందుతారు. బ్రహ్మర్షులు, దేవతాది గణాలుతో బ్రహ్మ సభలో నిరంతరం వేద వేదాంత చర్చలు జరుగుతుంటాయి.


బ్రహ్మలోకం వరకు గల సప్త లోకాలు మహాప్రళయంలో పరబ్రహ్మలో లీనమవుతాయి. బ్రహ్మకు పగలు కాగానే తిరిగి సృష్టి ఆరంభిస్తాడు. బ్రహ్మకు రాత్రి కాగానే సృష్టి ఆగి లయం జరుగుతుంది.

```


*అధోలోకాలు:*```

*అతలము : 

మయాసురుడి పుత్రుడు బలుడు ఈ లోకానికి అధిపతి. అసురుల నివాసము. ఇక్కడి వారు స్వేచ్ఛస్వాతంత్ర్యం కలిగి ఆకర్షించే రూపము కలిగి ఉంటారు 


*వితలము: 

శివుడు హటకేశ్వరుడు అనే నామంతో భవాని, ప్రథమ గణాలతో పరివేష్టితుడై నివసిస్తూ బ్రహ్మ సృష్టికి సహాయం చేస్తుంటాడు. క్రోధ రూపుడవైన హటకేశ్వరుడి రజస్సు ఇక్కడ హాటకి అనే అగ్ని జ్వాలలనదిగా ప్రవహిస్తుంటుంది. ఈ నది నుండి లభించే హాటకం అనే బంగారంతో దైత్య స్త్రీలు ఆభరణాలు చేయించుకుని ధరిస్తారు.


*సుతలము : 

ప్రహ్లాదుడి మనవడు, విరోచనుడి కుమారుడు బలి చక్రవర్తి ఈ లోకానికి అధిపతి. వామనుడిగా బలి చక్రవర్తికి ఇచ్చిన మాట ప్రకారం మహావిష్ణువు సుతలాన్ని స్వర్గం కన్నా సుందర ప్రదేశం చేసి తానే స్వయముగా కావలి కాస్తూ రక్షణ గా ఉన్నాడు.


*తలాతలము :  

మాయావిద్యా ప్రవీణుడు మయుడు దీనికి అధిపతి. దానవులు, రాక్షసులు నివసిస్తారు. మయుడు మాయావిద్యల సంపన్నులైన దానవ రాక్షసులకు గురువు, ప్రభువు.


*మహాతలము :  

మహా రౌద్ర క్రోధులైన క్రాదవేయ (క్రదువ కుమారులు) సర్పజాతులకు నివాసమై ఈ లోకం ఉంటుంది. తక్షక, కాళీయాది నాగ శ్రేష్ఠులు ఇక్కడ నివసిస్తారు.


*రసాతలము : 

దైత్య దానవ నాగ జాతులు నివసిస్తుంటారు. వీరు మహాబలవంతులు, ఓజస్వంతులు.


*పాతాళ లోకము:  

పాతాళ లోకాన్ని నాగలోకము అని కూడా అంటారు. వాసుకి, కులికి, శ్వేతాది నాగ ప్రముఖులు నివసిస్తారు. వీరు నిలువెల్లా విషము కలిగి పెద్ద పెద్ద పడగలు, దీర్ఘ శరీరాలు కలిగి ఉంటారు. ఐదు పడగల నుంచి వేయి పడగల నాగులు ఇక్కడ నివసిస్తారు. వీరి పడగల పై ధగధగ మెరిసే మణులు ఉంటాయి. వీటి కాంతితో పాతాళ లోకం ప్రకాశిస్తూ ఉంటుంది.


పాతాళలోకానికి ముఫై వేల యోజనాల కింద వేయి తలల ఆదిశేషుడు భూమిని శిరస్సు పై ధరించి ఉంటాడు. అనంతమైన శక్తి కలిగి అనంతుడు అనే పేరుతో ఇక్కడ ఉంటాడు. ఆదిశేషుడిగా శ్రీమహావిష్ణువుకి తల్పంగా క్షీరసాగరంలో సేవిస్తుంటాడు. అనంతుడు ఆదిశేషుడు శ్రీమహావిష్ణువు యొక్క అంశావతారము..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారిసౌజన్యంతో*


*మాఘపురాణం ఒకటవ* *అధ్యాయము సంపూర్ణము*


         *🌷సేకరణ🌷*

*న్యాయపతి నరసింహారావు*

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణము - శిశిర ఋతువు - ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం - త్రయోదశి - పుష్యమి -‌‌ భాను వాసరే* (01.03.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.






.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆదివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

01-03-2026 ఆదివారం రాశి ఫలితాలు


మేషం


స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారమున సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారుతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ద పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.

---------------------------------------


వృషభం


ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఖర్చులను అదుపు చేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


మిధునం


సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంభందిత వ్యవహారాలు కలసివస్తాయి. అన్ని రంగాలవారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు.

---------------------------------------


కర్కాటకం


బంధు మిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్ధిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి తప్పదు. 

---------------------------------------


సింహం


ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలసివస్తాయి. వస్త్ర,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలలో దీర్ఘ కాలిక సమస్యల నుండి బయటపడతారు.

---------------------------------------


కన్య


నిరుద్యోగులకు శుభవార్తలుఅందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వలన సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి.

---------------------------------------


తుల


ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఋణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువులను కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి, ఉద్యోగాలలో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నవి.

---------------------------------------


వృశ్చికం


ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు పనిచేయదు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, వ్యాపారాలలో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయమై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతోంది.

---------------------------------------


ధనస్సు


వృధా, ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడక సాగుతాయి.

---------------------------------------


మకరం


వృత్తి ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఋణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు.ధనదాయం బాగుంటుంది.

---------------------------------------


కుంభం


సంతాన పరంగా చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. పనులలో జాప్యం కలిగినా సమయానికి పూర్తిచేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం లభిస్తుంది.

---------------------------------------


మీనం


అన్నిరంగాలవారికీ సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చెయ్యడం మంచిది. బంధు వర్గం నుండి శుభవార్తలు ఊరటను ఇస్తాయి. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి , ఉద్యోగాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------

పంచాంగం

 


28, ఫిబ్రవరి 2026, శనివారం

దత్తపది

 🌸పద్య భారతి దత్తపది


కాంచన జమున అంజలి జయప్రద


స్వేచ్ఛ చందస్సులో గణపతి ప్రార్ధన

తేటగీతి పద్యము


భుజమునభుజకీర్తులతోడ భూరిగాను

కాంచనమయపీఠమునున్న గణపతికిని

భక్తితోయంజలిఘటించి పద్యములను

పాడినజయప్రదమగును పనులు మనకు




సాహితీ శ్రీ జయలక్ష్మి

అరుదైన దృశ్యం

అరుదైన దృశ్యం

 ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం దాదాపు 20నిముషాలకు పైగా బుధ, శుక్ర, గురు, శని, యురెనస్ (ఇంద్ర) నెఫ్టోన్ (వరుణ) ఫ్లూటో(యమ) గ్రహాలు ఓకెవరుసక్రమంలో కనిపిస్తాయి ఈ అరుదైన దృశ్యం కంటికి నేరుగా కనిపిస్తాయి స్పష్టంగా చూడాలి అంటే బైనాస్కోప్ లేక టెలిస్కోప్ ద్వారా చూడవచ్చు

సీతారాముల కళ్యాణం

 ☸️☸️☸️☸️☸️☸️

🌸సీతారాముల కళ్యాణం🙏🙏

కన్యాదాన సమయంలో 

జనకుడు చెప్పిన శ్లోకం…*

               ➖➖➖✍️


*శ్లోకం :

*ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవ|*

*ప్రతీచ్ఛచైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా||*

*పతివ్రతా మహాభాగా చాయేవానుగతా సదా||*


ఈమె సీత నా బిడ్డ! ఈమె ను సహధర్మచారిణి గా నీకు సమర్పిస్తున్నాను. ఎటువంటి కష్ట నష్టాలలో అయినా నీకు నీడ లా వెన్నంటి ఉండే పతివ్రత ను 

నీ చేతిలో పెడుతున్నాను.

నేటి నుండి మీరు ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒకే మాట గా నిలవాలి...” అని జనక మహరాజు గారు సీతమ్మ కి రామయ్య తో పాణిగ్రహణం జరిపించారు.



*శ్రీరామచంద్ర స్వామి ప్రవర :*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినే| వాశిష్ఠ – మైత్రావరుణ – కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత


వశిష్ఠ గోత్రోద్భవస్య రఘు మహారాజ వర్మణో నప్త్రే|

 అజ మహారాజ వర్మణః పౌత్రాయ|

 దశరథ మహారాజ వర్మణః పుత్రాయ|

  ..... గోత్రోద్భవాయ| త్రిభువనాధీశాయ| 

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ| తత్వాతీతాయ| సచ్చిదానంద మూర్తయే| సూర్యవంశ పావనాయ| శ్రీమత్ ఇక్ష్వాకు వంశోద్భవాయ|    

శ్రీరామచంద్ర వర్మణే సాక్షాత్ నారాయణ స్వరూపాయ వరాయ||



*శ్రీ సీతాదేవి ప్రవర:*


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యస్సుభంభవతు| యజుశ్శాఖాధ్యాయినీం| ఆంగీరస – అయాస్య- గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత|


గౌతమస గోత్రోద్భవస్య స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం|

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం|

 జనక మహారాజ వర్మణః పుత్రీం|

    .......గోత్రోద్భవాం| చతుర్దశ భువనాధీశ్వరీం| అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయికాం| తత్వస్వరూపిణీం| చంద్రవంశ ప్రదీపికాం| నిమివంశోద్భవాం|


శ్రీ సీతా నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణీం కన్యాం ||


. శ్రీరామ జయరామ జయ జయ రామ  

                       🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!



సేకరణ

ఖాద్రి ( కదిరి) బ్రహ్మోత్సవాల

 🕉 [ బ్రహ్మోత్సవాల సందర్భంగా]


🔅 అనంతపురం జిల్లా : ఖాద్రి ( కదిరి) 


🔅శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం : కదిరి :

🔅 దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలశాయని పురాణాల్లో తెలిపారు. 

ఈ స్వయంభువ విగ్రహాల రహస్యాలను వేలాది ఏళ్లుగా తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. వీటిని వెనుక దైవం ఉన్నాడని భావించిన భక్తులు పూజిస్తూ, తమ కోరికలను తీర్చమని వేడుకుంటున్నారు. 


👉మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆలయాలు మనకు దర్శనం కల్పిస్తాయి.

ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో స్వామివారికి ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి.

ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే కదిరి నరసింహ స్వామి ఆలయం


👉అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉంది మహిమాన్వితుడిగా పేరుమోసిన నరసింహస్వామి కొలువైన ఆలయం. 


👉ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురం వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దీన్ని భ్రుగుతీర్థమని పిలుస్తారు.


🌀 పౌరాణిక ప్రాశస్త్యం 🌀


👉అటు మనిషితోగానీ, జంతువు, ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా వరం పొందిన హిరణ్యకసిపుడు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. విష్ణు భక్తులను హింసిస్తూ, చివరికి తనయుడు ప్రహ్లదుడిని కూడా విడిచిపెట్టలేదు.

నరసింహుడి రూపంలో  వచ్చిన శ్రీమహావిష్ణువు  హిరణ్యకసిపుని  సంహరించారు. ఇది జరిగిన ప్రదేశం అహోబిలం . 


👉హిరణ్యకశిప సంహారం తర్వాత కూడా స్వామి ఆగ్రహం చల్లారకపోవడంతో ఘీంకారం చేస్తూ కదిరికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతానికి చేరుకున్నాడు. దీన్ని గమనించి దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతం పైకి వచ్చి స్వామిని శాంతిపజేయడానికి అనేక స్త్రోత్రాలను పఠించారు. దీంతో నరసింహుడు శాంతించాడు, దేవతలు స్త్రోత్రాలను పఠించడం వల్లే ఈ పర్వతానికి స్త్రోత్రాద్రి అని పేరు వచ్చింది.


🔅 ఈ కదిరి ఆలయంలో కొలువై ఉన్న స్వామివారి పేరే కాటమరాయుడు.

అసలు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి

కాటమరాయుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? 


👉కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం శిరస్సు ఉన్నందునే ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అని పేరు వచ్చింది. 

' బేట్రాయి సామిదేవుడా! నన్నే లినోడు! బేట్రాయి సామి దేవుడా! కదిరి నరసింహుడా! కాటీమరాయడా!' అనే జానపదులు,చెలగి కదిరిలో శ్రీ వేంకటాద్రిమీద యెలగేటి చక్కటి రమణశ్రీ అన్న కీర్తనల్లోని నృసింహస్వామి ప్రాశస్తాన్ని కళ్ళారా చూడాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.

    

👉ఇక్కడి ఆలయంలోని నృసింహస్వామి, అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. 


👉 'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి ' ఖద్రి' అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఇప్పటికీ కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో 'ఖదిర (సంద్ర) వృక్షాలు అధికంగా ఉండడంతో ఈ పట్టణానికి కదిరి అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది.


👉చారిత్రిక, పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. 


👉ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఇక్కడ జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.

రథోత్సవం సమయంలో స్వామివారి రథంపై దవనం, మిరియాలు, పండ్లు చల్లుతుంటారు. కిందపడిన వీటిని ఏరుకొని తింటే సర్వరోగాలూ నయమవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మెత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఆ రోజు భక్తులు ఉపవాసముంటారు. 

ఈ పున్నమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దవనము సమర్పించడం ద్వారా స్వామివారు ప్రీతి చెందుతారని భావిస్తారు.


👉వసంతఋతువులో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారికి వసంత వల్లభుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.


👉వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామి వారికి పూజలు నివేదన,  సర్వదర్శనం, సాయంకాల నివేదన, తర్వాత మళ్ళీ సర్వదర్శనం ... ఈ క్రమంలో ఆలయల్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి.


👉అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం ఈ ఆలయం వైశిష్ట్యం హిందూ, ముస్లీం, క్రైస్తవులందరూ మతాలకతీకంగా ఇక్కడ జరిగే బ్రహెర్మాత్సవాల్లో పాల్గొని, పూజలు నిర్వహించడం విశేషం.

శ్రీహరిని నమ్ముకుంటే

 శ్రీరామ (100)


      (భక్తి ఒక్కటే ముక్తికి మార్గం - ప్రహ్లాదుడు)


శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).

                                ---------


మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.

అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి,

 అని ప్రహ్లాదుడు తన తోటి విద్యార్థులకు ఇలా బోధ చేస్తున్నాడు.

ఓ బాలకులారా! 

"మానవ జన్మ లభించడం చాలా కష్టం.

అదృష్టవశాత్తు లభించిన ఈ జన్మను వ్యర్థం చేసుకోకూడదు.

మానవుని  ఆయుర్దాయం నూరు సంవత్సరములే.

అందులో సగము నిద్రకే పోతుంది.

మిగిలిన యాభై సంవత్సరాలలో, పసివాడుగా, బాలుడుగా, ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి.

మిగిలిన ముప్ఫై సంవత్సరాలు మానవుడు ఇంద్రియ సుఖాలకు వశుడై, కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అనే బంధాలలో చిక్కుకుంటాడు.

వాటినుండి బయట పడలేక జీవితం అంతా వ్యర్థంగా గడుపుతాడు.

ప్రాణం కంటే ప్రియమైన " కామము (కోరిక)" నకు దాసుడవుతాడు.

కోరికల కారణంగా ఇతరుల ధనం అపహరించాలని చూస్తాడు.

ధనం కోసం ప్రాణాలను కూడా లెఖ్ఖచెయ్యడు.

రహస్యంగా " స్త్రీ సౌఖ్యం" కోరుకుంటాడు.

కాళ్ళకు బంధాలు వేసే భార్యలు ఏర్పడుతారు.

తియ్య తియ్యని,జిలిబిలి పలుకులతో,  ఆనందింపజేసే శిశువులు పుడతారు.

అందమైన కూతుళ్ళూ, వినయ విధేయతలతో కూడిన కొడుకులూ,

అన్నివిధాలా సహకరించే సోదరులు,

ప్రేమతోను,మమకారంతోను, కూడిన తల్లిదండ్రులు,

సహృదయంతో కూడిన బంధువులు,

ఈ విధంగా రక రకాలుగా ఆకర్షణీయంగా ఉన్న బంధాలలో కట్టుబడి పోతాడు.

డబ్బు,బంగారం, ఆభరణాలు, భవనాలు, వాహనాలు, పాడిపంటలు, సేవకులు, మొదలైన సంపదలను వదిలిపెట్టలేక, 

మానవుడు సంసారంలో పూర్తిగా మునిగి పోతాడు.

సాలీడు గూటిలో చిక్కుకొని బయటపడలేక పోతున్న కీటకం లాగా, మానవుడు ఈ సంసారమనే సంకెళ్ళ నుండి బయట పడలేడు.

కుటుంబ పోషణలో పడి, ముక్తిని పొందే మార్గం కనుగొన లేక,తర,తమ భేదాలు పాటిస్తూ అజ్ఞానం అనే చీకటిలో ఉండిపోతాడు.

కాబట్టి దుర్లభమైన మానవ జన్మ లభించినప్పుడు, చిన్నప్పటినుండే భగవంతునియందు అనురక్తుడయే "భాగవత ధర్మాన్ని" అనుష్ఠించాలి.


మనకు ఇష్టం లేకపోయినా "కష్టాలు, దుఃఖాలు" వస్తున్నాయి.

అదేవిధంగా "సుఖాలు" కూడా మనం కోరకుండానే, పూర్వజన్మ కర్మననుసరించి, కాలానుగుణంగా వస్తాయి.


 వాటి కోసం విలువైన  జీవిత కాలాన్ని వృథా చేసుకో కూడదు.

ఆ శ్రీహరిని నమ్ముకుంటే ముక్తి వస్తుంది.

ఆయనే ప్రాణులందరికీ అధిపతి.

ఆ పరమ పురుషుని పాదపద్మములను భావించి,సేవించటం ఒక్కటే ముక్తికి మార్గం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

28-2-'26.

లోక నీతి

 లోక నీతి 👌

*ఎలుక రాతిది అయితే* *పూజిస్తాం... ప్రాణాలతో* *వుంటే తరిమేస్తాం.* *పాము రాతిది అయితే* *పాలు పోస్తాం...* *ప్రాణాలతో వుంటే* *కొట్టి చంపేస్తాం.* *తల్లిదండ్రులు* *ఫోటోలో ఉంటే* *దండ వేసి* *దండం పెడతాం...* *ప్రాణాలతో వుంటే* *వృద్ధాశ్రమంలో* *వదిలేస్తాం.* *చనిపోయిన వాడికి* *భుజాన్ని అందిస్తాం ...* *బతికి ఉన్న వాడికి* *చేయూతను ఇవ్వలేం.* *రాయిలో దైవత్వం* *వుందని తెలుసుకున్నాం...* *మనిషిలో మానవత్వాన్ని* *గుర్తించలేక పోతున్నాం.* *జీవం లేని వాటిపై ఉన్న* *భక్తి, ప్రేమ... ప్రాణంతో* *ఉన్నవాటిఫై ఎందుకు* *లేదో... మనిషిగా* *ఆలోచిద్దాం కొద్దిగా..!*

మీ

శ్రేయోభిలాషి

-ఎస్.వి.రమణా చార్య(సేకరణ)

హిమాలయాలలో అనేక మంది యోగులు

 ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం


కథలు అనే విషయాన్ని నేను అసలు అంగీకరించను ఇప్పటికి కూడా హిమాలయాలలో అనేక మంది యోగులు కఠిన తపస్సు చేస్తున్నారన్నది వాస్తవం గడ్డగట్టిన నీటిని చదువుకొని ఆ చల్లటి నీటితో స్నానాలు చేస్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం ఏమాత్రం నరసంచారం లేని అతి శీతలమైన హిమాలయాలలో నిరంతరం తపస్సులో నిమగ్నమైన మహానుభావులు ఎందరో ఈరోజు కూడా ఉన్నారు. నేను అనుకుంటాను సమాజంలో ఎన్నో పాపాలు నిత్యం జరుగుతున్న ఇంకా సమాజంలో ధర్మం ఉందంటే అటువంటి మహానుభావుల నిరంతర తప శక్తి కారణం  అయి ఉండవచ్చు ఈ రోజుల్లో చాలా మటుకు భక్తి అనేది ఒక ప్రదర్శనగా మారుతున్నది అని చెప్పటానికి నేను సిగ్గుపడుతున్నాను నిజానికి త్రీకరణ శుద్ధిగా పరమేశ్వరుని ఆరాధిస్తే తప్పకుండా ప్రతివారు శిద్దులే అవుతారు నిత్యం భౌతిక ప్రపంచంలో జీవిస్తూ అరిసెట్ వర్గానికి బానిసలై బ్రతుకుతూ ఉంటే వారికి దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు కనబడదు అనేటువంటి మూర్ఖపు సందేహాలు వస్తూ ఉంటాయి కృషితో నాస్తి దుర్భిక్షం కష్టపడితే మాత్రమే ఫలితం వస్తుంది నిత్యం మన జీవనం గడవడానికి అనేక విధాలుగా కష్టపడుతున్నామే మరి ఈ జగత్తుకు మూలకారకుడైన ఆ పరమేశ్వరుని చేరటానికి ఇంకా ఎంత కష్టపడాలి అనేటువంటి భావన ఉన్నవాళ్లు తప్పకుండా సాధన మొదలు పెడతారు సాధనాత్ సాధ్యతే సర్వం ముక్తి కూడా తప్పకుండా సిద్ధిస్తుంది మనకు హృదయమే పరిశుద్ధంగా లేనప్పుడు ఇక తపస్సు ఎలా చేయ గలుగుతాం నిరంతరం ఈ సమాజం చుట్టూ ఒక మంచి పేరు ఒక గొప్పతనం చాటి చంపాలనే తపనతోటే అనేక పనులు చేస్తూ సాటివారి మెప్పును అభిలాషీస్తూ ఉంటే వారికి ఈ జన్మలోనే కాదు ఏ జన్మలో కూడా మనసు భగవంతుని మీదికి పోదు మన దౌర్భాగ్యం ఏమిటంటే ఏ కొద్దో శక్తి సంపాదించిన ప్రతి వాళ్లు నేనే దేవున్ని అని చాటుకుంటూ వాళ్ల చుట్టూ అనేకమంది శిష్యబృందాలను ఏర్పాటు చేసుకుంటూ నిరంతరం భోగా లాలసులై జీవిస్తూ ఉండటమే కాకుండా ఆ పరమేశ్వరుని కూడా విమర్శిస్తూ నిందిస్తూ ఉన్నారంటే ఇక వారి గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మన హిందుత్వంలో శివ కేశవ బేధం లేదు అని ఆదిశంకర భగవత్పాదుల వారు ఎప్పుడో సెలవిచ్చారు ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి శ్రీ ఆది శంకర చార్యుల వారి బోధనలు మాత్రమే శరణ్యం శంకరుల వారు అనుచరులమై వారు స్థాపించిన అద్వైత మతాన్ని ఆచరిస్తూ ఉంటే తప్పకుండా సమాజం సుభిక్షంగా ఆనందకరంగా సంతోషమయంగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు మనకు మొట్టమొదటగా ఉద్భవించిన శుక్ల యజుర్వేద దానికి సంబంధించిన ఉపనిషత్తు ఈసా వాసు ఉపనిషత్తు ఈ ఉపనిషత్తు జగత్తు మొత్తం ఈశ్వరునిదే అయినది అనే మంత్రంతో మొదలవుతుంది అక్కడ నేను నీవు లేనే లేవు కేవలం జగత్తులో జీవులు నిర్జీవులు అన్ని ఈశ్వరుడే ఈ భావం అందరికీ కలిగితే ముందుగా తాను ఈశ్వరుడు అని తలుస్తాడు అప్పుడు భగవంతుడు తప్పులు చేయడు అని తెలుసుకొని తాను  సత్ ప్రవర్తన పరుడవుతాడు అంతేకాకుండా తాను చూసే జగత్తు పూర్తిగా ఈశ్వరుడి మయంగా తలంచి ప్రతి వారిలో ఈశ్వరుని దర్శించి తాను ఈశ్వరునితో అంటే భగవంతునితో ఎలా ప్రవర్తిస్తాడో అలానే అందరితో ప్రవర్తించగలుగుతాడు కాబట్టి ప్రతివారికి ఈ ఒక్క ఉపనిషత్తు పూర్తిగా కూడా అవసరం లేదు కేవలం మొట్టమొదటి మంత్రం తెలుసుకుంటే చాలు ప్రతివారు తముతాను ఉద్ధరించుకుంటాడు సమాజాన్ని ఉద్ధరించుకోవటానికి తోడ్పడుతాడు కోపము ద్వేషము అసహనము స్వార్థం మొదలైన భావాలు నశించి మనస్సు స్వచ్ఛత చేకొరితే మన భార తావనే స్వర్గసీమగా వెలుగొందుతుంది అనటానికి సందేహం లేదు అటువంటి జగత్తు కావాలని ఆ జగదీశ్వరుని నిత్యం మనం ప్రార్థించాలని నేను కోరుకుంటున్నాను

ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం

  శ్రీరామ (97)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఎండా, వానా లెక్కచేయకుండా తపస్సు చేసి ఋషులు సిద్ధులు సంపాదించారని ఎన్నో కథలు చదువుకున్నాం.

కానీ, ఆ! అవన్నీ కథలండీ, ఈ కాలానికి వర్తించేవి కావు అంటాం.

అంటే మనం చదివే పురాణాలు, వినే ప్రవచనాల మీద మనకు నమ్మకం లేదన్నమాట !

అవన్నీ కాలక్షేపానికే గాని, ఆచరణలో పెట్టేందుకు కాదు.


అంతేకాదు,

మనం చేసే కొద్దో గొప్పో పూజాదికమైనా,

 ఆ పూజకు, లేదా వ్రతానికి చెప్పబడిన నియమ, నిష్ఠలతో కూడి వుండదు. 

పైపెచ్చు,

ఇతరుల చేత గొప్ప అనిపించుకోడానికి చేసే

భారీ పిండి వంటలు మొదలైన ఆడంబరాలతో కూడి ఉంటుంది.

కానీ, ఎన్ని పూజలు చేసినా మాకు ఫలితం రావడంలేదని మాత్రం అంటాము.


ఇది దృష్టిలో పెట్టుకొని శ్రీ ధూర్జటి మహాకవి ఇలా అంటున్నారు : 


మ// దయ జూడుండని కొందరాడుదురు నిత్యంబున్ నినుంగొల్చుచున్/

నియమంబెంతొ ఫలంబు నంతియె కదా నీవీయ, పిండెంతో అం/

తియకా నిప్పటియుం దలంపనను బుద్ధింజూడ,నేలబ్బు ని/

ష్క్రియతన్ నిన్ను భజింప కిష్ట సుఖముల్ శ్రీకాళహస్తీశ్వర!//


(చాలామంది, ప్రతిరోజు నిన్ను పూజిస్తూ,"స్వామీ ! నీకు ఇంకా మామీద దయరాలేదు" అంటారు.

నిజానికి మన పూజలు ఫలితమివ్వడం అనేది చిత్తశుద్ధితో మనం పాటించే నియమాలపై ఆధారపడి ఉంటుంది.

పిండి ఎంతో రొట్టె (ఇప్పటి అనే పిండి వంట) కూడా అంతే ప్రమాణంలో వస్తుంది కాని అధికంగా రాదుగదా!

అలాగే మనం ఎంత శ్రద్ధతో నియమ నిష్ఠలు పాటిస్తామో అంత త్వరగా భగవదనుగ్రహం లభిస్తుంది.

 ఆ నియమ, నిష్ఠలు పాటించకుండా, ఆశించిన ఇష్ట సుఖములు ఎలా వస్తాయి? )


మనస్సు శుచిగా ఉంటే ఈ నియమ నిష్ఠలు అనవసరం అంటారు మేధావులమనుకొనే కొందరు అజ్ఞులు.

మనస్సు శుచి అవడానికే నియమ నిష్ఠలు అని ముందు తెలుసుకోవాలి.

శుచి అయిన మనస్సులోనే శ్రద్ధ, అనగా భగవంతుని మీద విశ్వాసం ఉదయిస్తుంది.

 శ్రద్ధతో చేసే భగవదారాధన మాత్రమే మనకు సత్వర ఫలితాలనిస్తుందని ధూర్జటిగారి భావం.


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

28-2-'26.