7, జూన్ 2026, ఆదివారం

అతి మూత్ర వ్యాధి - Daibetis

 అతి మూత్ర వ్యాధి - Daibetis


అతిమూత్ర వ్యాధి రావడానికి గల కారణాలు -


• అధికమైన ఆలోచనలు , ఆందోళన .


• మద్యం అధికంగా సేవించడం .


• సిఫిలిస్ , గనేరియా వంటి లైంగిక వ్యాదులు.


• శరీరంలో విషరసాయనాల ఉత్పత్తి .


వ్యాధి లక్షణాలు , దశలు -

 ఈ వ్యాధి ప్రారంభ దశలో అతిమూత్రం , అతి మూత్ర విసర్జన కలుగుతాయి . శరీరం అంతా నీరసంగా యే పని చేయడానికి ఉత్సాహం లేకుండా పోతుంది . క్రమంగా దేహం అంతా శుష్కించి పోతుంది . వ్యాధి తీవ్రదశకు చేరేకోలది మొఖం అంతా వాడిపోతుంది. నుదురు మీద ముడతలు పడతాయి. వ్యాధి ముదిరే కొద్ది రోజుకి 150 నుంచి 200 ఔన్సుల వరకు మూత్రం పోతూ ఉంటుంది. ఆకుపచ్చ , పసుపుపచ్చ కలిసి మిశ్రపు రంగుతో మూత్రం నుంచి చక్కర బయటకు వెళ్ళడమే ఈ వ్యాదికి నిదర్శనం . మూత్రం పోసినచోట ఎక్కువుగా ఈగలు మూగుతాయి. మూత్రం నేలలో ఇంకిపోయిన తరువాత తెల్లటి మరక కనిపిస్తుంది. ఈ లక్షణాలు బట్టి వ్యాధిని ఎవరికీ వారే గుర్తించ వచ్చు. డబ్బు వృధా చేసి మూత్ర పరిక్షలు చేసుకోవలసిన అవసరం లేదు . వ్యాధి తీవ్రత పెరిగే కొద్ది మూత్రం ద్వారా అల్బుమిన్ అనే శ్వేత ధాతువు ఎక్కువుగా విసర్జించ బడుతుంది. క్రమంగా చర్మం ఎండిపోయి నట్టు మారి సౌందర్యం దెబ్బ తింటుంది. ముఖం కళ తప్పుతుంది. కురుపులు , పుండ్లు, రాచ పుండ్లు పుడుతుంటాయి. నోరు బాగా ఎండిపోతుంది. దీర్గవ్యాది గ్రస్తులకు పంటి చిగుళ్లు ఉబ్బిపోతాయి. పిప్పి పళ్ళు ఏర్పడుతాయి. రోగిలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి బలహీనం అయ్యే కొద్ది కడుపులోని జట రాగ్ని మందగిస్తుంది. అజీర్ణం కలుగుతుంది. అధికంగా వొళ్ళంతా చెమటలు పడుతుంది. పాదాలు వాస్తాయి . గుండె బలహీనం అవుతుంది. కంటికి పొరలు కమ్ముతాయి. ఆడవారిలో శరీరం అంతా దురదలు కలిగి సంభోగ వాంచ పెరుగుతుంది. మగవారిలో సంభోగ వాంచ పూర్తిగా క్షీణిస్తుంది . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



పాదారవిందశతకము

 *శ్రీ మూకశంకర విరచిత* *మూక పంచశతి*


*పాదారవిందశతకము*


*7 వశ్లోకము :*


*నయంతీ సంకోచం సరసిజరుచం దిక్పరిసరే*

*సృజంతీ లౌహిత్యం నఖకిరణ చంద్రార్ధ ఖచితా*

*కవీంద్రాణాం హృత్కైరవ వికసనోద్యోగ జననీ*

*స్ఫురంతీ కామాక్ష్యాః చరణ రుచిసంధ్యావిజయతే*

 

*భావము :*

*కామాక్షీదేవి చరణకాంతి అనే సంధ్య, కమలాలకాంతిని సంకోచింపచేయునదియై, నలుదిశలయందు అర్ధచంద్రునిలాంటి గోళ్ళ కాంతులతో అరుణకాంతిని పుట్టించినదియై, కవీంద్రుల హృదయములనే కలువపూలను వికసింపచేయునదియై ప్రకాశిస్తూ విజయాన్ని పొందినది.*

*అంటే అమ్మవారి చరణములందలి కాంతి అనే సంధ్య సర్వోత్కర్షముగా వర్ధిల్లుతున్నది.*


*వివరణ :*

*అమ్మవారి పాదముల మరియు గోళ్ళ ఔన్నత్యాన్ని శ్రీ శంకరభగవత్పాదులవారు తమ సౌందర్యలహరి ( 89 వ శ్లోకం ) లో ఈవిధంగా వర్ణించారు :* 

 

*నఖై ర్నాకస్త్రీణాం - కరకమలసంకోచశశిభిః*

*తరూణాం దివ్యానాం - హసత ఇవ తే చండి ! చరణౌ*

*ఫలాని స్వస్థ్సేభ్యః - కిసలయకరాగ్రేణ దదతాం*

*దరిద్రేభ్యో భద్రాం - శ్రియ మనిశ మహ్నాయ దదతౌ*


*భావము :*

*అమ్మా ! చండీమాతా !దేవలోకంలో ఇంద్రుని నందనవనంలో కోరికలు తీర్చే కల్పవృక్షం ఉన్నది. అది తన చిగురుటాకుల చేత కోరిన కోరికలు తీరుస్తుంది. కాని ఆ కల్పవృక్షం దేవలోకవాసులైన దేవతల కోరికలు మాత్రమే తీరుస్తుంది. .మరి నీ దివ్య చరణములో ! ఆలోకం, ఈ లోకం అనే భేదం లేక, నిన్ను నమ్మిన సర్వలోకములలో ఉండే వారందరికీ, ఎల్లవేళలా, తరుగులేనన్ని సంపదలను శీఘ్రముగా అనుగ్రహిస్తూ ఉంటాయి. అంతే కాదు, ఇంద్రుని భార్యయైన శచీదేవి మొదలుగా గల స్త్రీలు నిన్ను సేవించటానికి, అర్చించటానికి నీ పాదముల వద్దకు రాగానే పద్మములవంటి వారి చేతులు, చంద్రోదయం వంటి నీ నఖ (గోటి) కాంతులవలన ముకుళింపబడి (రెండుచేతులు దగ్గరకు ముడవబడి) నీకు నమస్కరిస్తున్నాయి. అటువంటి శోభతో నీ పాదాలు, నీ కాలిగోళ్ళు అలరారుతున్నాయి.*

 

*{ పద్మాలు చంద్రోదయం కాగానే ముడుచుకుపోతాయి. అమ్మ దగ్గరకు రాగానే ముడుచుకుపోయే ఆ దేవతా స్త్రీల చేతులను కరపద్మాలుగా పోల్చి, అమ్మ కాలిగోళ్లను చంద్రునితో పోల్చి శ్రీ శంకరులు చక్కటి వర్ణణ గావించారు. అంటే అమ్మ పాదాలు దేవతల చేత, దేవతా స్త్రీలచేత కూడా నమస్కరింపబడతాయని అర్ధం. అందుకే కదా ! పోతనగారు 'అమ్మలగన్నయమ్మ' అనే భాగవత పద్యంలో *'వేల్పుటమ్మల మనమ్ములనుండెడియమ్మ'* *అని వర్ణించారు.* *మనమందరమూ ఇష్టదైవాలుగా కొలిచే ఈ దేవతలంతా, వారు తమ ఆరాధ్య దేవతగా అమ్మనే పూజిస్తున్నారని పోతనగారి పద్య భావము.}*

 

 *ఆ తల్లి* 

*పాదపద్మములకు నమస్కరిస్తూ* 🙏🙏🙏

వివేకచూడామణి

 *వివేకచూడామణి*


*శ్రీఆదిశంకరాచార్య విరచితము*


*స్థూలశరీరవర్ణనము*


*73. అహం మమేతి ప్రథితం శరీరం*

*మోహాస్పదం స్థూలమితీర్యతే బుధైః*

*నభోనభస్వద్దహనాంబు భూమయః*

*సూక్ష్మాణి భూతాని భవంతి తాని*


*పదవిభజన :*

*అహం - మమ + ఇతి - ప్రథితం - శరీరం - మోహ + ఆస్పదం - స్థూలమ్ + ఇతీర్యతే - బుధైః - నభః + నభస్వత్ + దహన + అంబు - భూమయః - సూక్ష్మాణి - భూతాని - భవంతి - తాని*


*భావము :*

*నేను, నాది అని ప్రసిద్ధి చెందిన ఈ మాయాకల్పిత దేహాన్ని 'స్థూలశరీరమ'ని పండితులంటారు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే సూక్ష్మ ( పంచ ) భూతాలచే ఇది ఏర్పడింది.*


*వివరణ :*

*అహం = నేను ; మమేతి = నాది ; ప్రథితం = ప్రసిద్ధమైనది. నేను, నాది అని మమకారాస్పదమై ప్రసిద్ధమైన శరీరము అనేక విధములైన దోషాలకు ఆశ్రయమైనది. ఇది స్థూలమని ( స్థూలశరీరమని ) పండితులచేత చెప్పబడుతున్నది. శరీరము ఆత్మకంటే భిన్నమనే విషయం చెప్పినట్లే, ఆత్మ అంటే స్వామి , శరీరము ఆ ఆత్మ యొక్క భోగమునకై ఉన్నదని తెలుసుకోవాలి. ఈ శరీరము అనిత్యము. అందువలన కూడా ఇది నిత్యాత్మరూపము కాజాలదు.*

*నభః = ఆకాశము ; నభస్వత్ = వాయువు ; దహన = అగ్ని ; అంబు = జలము ; భూమయః = భూమి అనేవి ; సూక్ష్మాణి భూతాని భవంతి = సూక్ష్మ భూతములుగా అవుతున్నవి.*

🙏🙏🙏

శ్రీమన్నారాయణీయము

 *శ్రీమన్నారాయణీయము*


*88వ దశకము - అర్జున గర్వభంగము - రెండవ శ్లోకము*


*322. శ్రుతదేవ ఇతి శ్రుతం* *ద్విజేంద్రం బహులాశ్వం నృపతిం చ భక్తిపూర్ణమ్*


*యుగపత్ త్వమనుగ్రహీతుకామో మిథిలాం ప్రాపిథ తాపసైస్సమేతః*


*భావము :*

*ప్రభూ ! కంసుని చేతిలో చనిపోయిన తన ఆరుగురు పుత్రులను చూడాలనే కోరిక నీ తల్లియైన దేవకీదేవికి తీవ్రంగా ఉన్నది. మీ గురువైన సాందీపని పుత్రుడు చనిపోగా, అతనిని నీవు వరుణలోకము నుండి తీసుకొని వచ్చి మీ గురువుకు అప్పగించిన వృత్తాంతాన్ని ఆమె వినివున్నది. అందువలన తన పుత్రులను కూడా తీసుకొనిరమ్మని దేవకీదేవి నిన్ను కోరింది. అప్పుడు నీవు సుతలానికి వెళ్లావు. అక్కడ బలిచక్రవర్తి నిన్ను భక్తిశ్రద్ధలతో పూజించాడు. తరువాత అతడు సంతోషంగా వారిని అప్పగించగా, ఆ ఆరుగురిని ( దేవకీదేవి కుమారులను ) నీవు తీసుకొనివచ్చావు. వారందరూ పూర్వజన్మలో మరీచి మహర్షి యొక్క పుత్రులు. బ్రహ్మదేవుని శాపం వలన హిరణ్యకశిపుని యొక్క పుత్రులుగా, తరువాతి జన్మలో వసుదేవుని యొక్క పుత్రులుగా జన్మించి కంసుని వల్ల చనిపోయినారు. వారినందరినీ దేవకీదేవికి చూపించి వారిని వారి స్వస్థానానికి పంపావు.*


*దేవా ! మిథిలా నగరంలో 'శ్రుతదేవుడు' అనే ఒక బ్రాహ్మణోత్తముడున్నాడు. నిన్ను ఎల్లప్పుడూ పరిపూర్ణమైన భక్తితో అర్చించే 'బహుళాశ్వుడు' అనే రాజు కూడా ఆ నగరమందే ఉన్నాడు. నీవు ఆ ఇరువురినీ ఒకే పర్యాయం అనుగ్రహించదలచావు. అందులకై నీవు మహర్షులతో కూడి మిథిలా నగరానికి వెళ్లావు.*

🙏🙏🙏

భారతీయ జీవితం

 🇮🇳 "భారతీయ విలాసవంతమైన జీవితం" (The Indian Luxury) - ప్రపంచమే కుళ్ళుకునే నిజం! 🌍

=========


🌹మనం తరచుగా "మంచి జీవితం" కోసం విదేశాల వైపు చూస్తుంటాం. కానీ కాస్త ఆలోచిస్తే... లండన్ లేదా న్యూయార్క్‌లో ఉన్న ఒక బిలియనీర్‌కు కూడా దొరకని కొన్ని రోజువారీ సౌకర్యాలు, మన భారతదేశంలో మధ్యతరగతి వారికి కూడా చాలా సులువుగా దొరుకుతున్నాయి.


మన దేశంలో సామాన్యుడి జీవితం కూడా ఒక **VIP లైఫ్‌స్టైల్** అని చెప్పడానికి 8 నిదర్శనాలు:


**1. ఉదయం 7 గంటల రొటీన్: 🗞️*

కేవలం కొన్ని రూపాయలకే ప్రతిరోజూ ఉదయాన్నే ఫ్రెష్ పేపర్ మన గుమ్మం ముందుకు వస్తుంది. అదే వెస్ట్రన్ దేశాల్లో అయితే ఇదొక ఖరీదైన సేవ, పైగా అక్కడ ప్రింట్ మీడియా దాదాపు అంతరించిపోతోంది.


**2. డేటా ప్రజాస్వామ్యం: 📶**

ప్రపంచ దేశాలు బేసిక్ ఇంటర్నెట్ కోసం నెలకి $50 (సుమారు ₹4000) కంటే ఎక్కువ ఖర్చు చేస్తుంటే, మన దేశంలో కేవలం ₹300లకే హై-స్పీడ్ 5G డేటాను ఎంజాయ్ చేస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత చౌకైన డేటా మనదే! ఇదే మన ఆర్థిక వ్యవస్థను డిజిటల్‌గా మార్చేసింది.


**3. "10 నిమిషాల" అద్భుతం: ⚡**

టీలో వేయడానికి అల్లం ముక్క లేదా పాలు అయిపోయాయా? Blinkit, Zepto, లేదా Swiggy Instamart లో ఆర్డర్ చేస్తే... నీళ్లు మరిగేలోపే వస్తువు మీ చేతుల్లో ఉంటుంది. అదే యూరప్‌లో అయితే, ఒక కోటు వేసుకుని, చలిలో 15 నిమిషాలు నడిచి స్టోర్‌కి వెళ్లాలి... అప్పటికే అది మూసేసి ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.


**4. క్షణాల్లో వైద్యం: 🩺**

ఒక స్పెషలిస్ట్ డాక్టర్‌ని కలవాలా? నేరుగా హాస్పిటల్‌కి వెళ్లొచ్చు. బ్లడ్ టెస్ట్ చేయించాలా? ఉదయం 6 గంటలకే ల్యాబ్ టెక్నీషియన్ ఇంటికి వచ్చి శాంపిల్ తీసుకుంటారు, మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వాట్సాప్‌లోకి వచ్చేస్తుంది. అక్కడ ఉన్నట్టు 3 నెలల వెయిటింగ్ లిస్ట్‌లు, "ఇన్సూరెన్స్ అప్రూవల్" నరకాలు మనకు లేవు.


**5. మనుషుల సాయం (Human Support System): 🏠**

ఇల్లు తుడవడానికి, వంట చేయడానికి, డ్రైవింగ్‌కి మనుషులు ఉండటం ఇక్కడ కేవలం ధనవంతులకే పరిమితం కాదు... మధ్యతరగతి జీవితాలకి ఇది వెన్నుముక. ఇది మన జీవితాల్లో అత్యంత విలువైనది... అంటే **"సమయాన్ని" (TIME)** మిగులుస్తుంది.


**6. UPI విప్లవం: 📱**

రోడ్డు పక్కన తాగే ₹5 రూపాయల చాయ్ నుండి ₹50,000 ల్యాప్‌టాప్ వరకు... అంతా ఒకే ఒక స్కాన్! వ్యాలెట్‌లతో పనిలేదు, "కార్డ్ మెషిన్ పనిచేయడం లేదు" అనే సాకులు లేవు, ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు లేవు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు మనకంటే చాలా వెనుకబడి ఉన్నాయి.


**7. "ఉచిత" చిన్న చిన్న ఆనందాలు: 💧**

ఏ హోటల్‌కి వెళ్లినా ఒక గ్లాసు మంచి నీళ్లు ఫ్రీగా ఇస్తారు (అక్కడైతే $5 బిల్లు వేస్తారు). మన బట్టలు ఇస్త్రీ చేయడానికి వీధి చివర ప్రెస్‌వాలా ఉంటారు. ఈ చిన్న చిన్న విషయాలే మన జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తాయి.


**8. సామాజిక బంధాలు (Social Safety Net): 🤝**

మనం లీగల్ నోటీసులు, కోర్టుల సంస్కృతిలో బతకడం లేదు... బంధాల సంస్కృతిలో బతుకుతున్నాం. మనకు ఏదైనా సమస్య వస్తే, పక్కింటివాడు కోర్టు నోటీసు పంపడు... ప్రేమగా "కిచిడీ" వండి పంపిస్తాడు.


---


### బాటమ్ లైన్ (The Bottom Line) 🚩


భారతదేశం అనేది కేవలం ఒక దేశం కాదు; అడుగడుగునా సౌకర్యాలు నిండిన ఒక అద్భుతమైన ప్రపంచం. పాశ్చాత్య దేశాలలో ప్రజలు తమ పనులన్నీ (గడ్డి కత్తిరించడం నుండి ప్లంబింగ్ వరకు) తామే చేసుకుంటూ (DIY Struggle) సగం జీవితాన్ని గడిపేస్తుంటే... ఇండియాలో మాత్రం మనల్ని కనిపెట్టుకుని చూసే ఒక సేవా ఆధారిత జీవనశైలి ఉంది.


> **ఇక్కడ మనం కేవలం బతకడం లేదు... మనల్ని ప్రతి క్షణం చూసుకునే ఒక వ్యవస్థ ఉంది! 🧡🤍💚**


**నిజం:** విదేశాలకు వెళ్లి మన బట్టలు మనమే ఉతుక్కుని, గిన్నెలు తోముకున్నప్పుడే... మన దేశంలో ఉన్న ఈ "రాజభోగం" (Indian Comfort) విలువ ఏంటో ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది!.


కాబట్టి - తూర్పుకైనా వెళ్ళు, పడమరకైనా వెళ్ళు.✍️🙏🚩

**భారతదేశమే నంబర్ వన్!** 🇮🇳👌

ఆసురీ సంపదలో

  ఈ ఆసురీ సంపదలో మొట్ట మొదటిది *దంభము:

అంటే కపటము, మోసము, వేషముతో మోసంచేయడం, కాషాయములు ధరించి, సన్యాసి ముసుగులో అన్ని అకృత్యాలు చేయడం. తమకు అన్నీ తెలుసు అని నమ్మించడం. తనను తాను పొగుడుకోవడం, ఇతరుల చేత పొగిడించుకోవడానికి తాపత్రయ పడటం, తనకు అన్నీ తెలుసు అని గర్వించడం. తాను చేసే ప్రతి పనీ ఆర్భాటంగా చేయడం. తనకు ఉన్న సంపదలను, విద్యలను అందరిముందు ప్రదర్శించడానికి ఆరాటపడటం.


*దర్పము:

అంటే ఒక విధమైన గర్వము. వల్లమాలిన అహంకారము. నన్ను మించిన వాడు లేడు అని గర్వించడం, విద్యాగర్వము, అధికార గర్వము, ధనవంతుడు అనే గర్వము. నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఎదుటి వారిని కించపరుస్తూ, తీసిపారేసినట్టు మాట్లాడటం వీటిలోముఖ్యమైనవి.


*అభిమానము:

సుయోధనుడు అభిమానమే ధనముగ కలవాడు అంటే అభిమానధనుడు అంటారు. ఇది కొంతవరకు మంచిదే కానీ, శ్రుతి మించితే పాతాళానికి తొక్కుతుంది. అహంకారమునకు ప్రతిబింబము అభిమానము. చాలామంది ఇదేదో గొప్పగుణంగా భావిస్తారు. కాని అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి.


*కోపము:

దీని గురించి గీతలో చాలాసార్లు మనకు వివరించారు. అభిమానము ఎక్కడ ఉంటుందో కోపం అక్కడే ఉంటుంది. తన గొప్పతనాన్ని గుర్తించని వాడి మీద కోపం రావడం సహజం. ఆ కోపం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కోపం వలన సమ్మోహము అంటే ఏం చేస్తున్నాడో ఏ మాట్లాడుతున్నాడో తెలియని స్థితి. దానివలన స్మృతి పోతుంది. బుద్ధి నశిస్తుంది, తరువాత సర్వనాశనము కలుగుతుంది. అందుకే దీనిని ఆసురీ సంపద అన్నారు.


*పరుషత్వము:

అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహం మీద కొట్టినట్టు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం. ఎదుటి వారిని గౌరవించకపోవడం. నిర్లక్ష్య భావన. దీని వలన ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చాలా మంది అటువంటి వారిని తప్పించుకు తిరుగుతారు. కొంతమంది దానిని గొప్ప సుగుణంగా భావిస్తారు. "నేను ఉన్నది ఉన్నట్టు మొహాన అడిగేస్తాను. మనసులో ఉంచుకోను" అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరి కొంత మంది పైకి తియ్యగా మాట్లాడతారు. లోపల గోతులు తీస్తుంటారు. మాట కాఠిన్యమే కాదు మనసు కాఠిన్యం కూడా ఆసురీ సంపదలో భాగమే.


*ఆఖరుది అజ్ఞానము, అవివేకము: ప్రతిదానినీ తప్పుగా అర్ధం చేసుకోవడం. తెలియకపోయినా తెలిసినట్టు నటించడం. తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించడం. ప్రాపంచిక విషయములే శాశ్వత సుఖాలు ఇస్తాయని నమ్మడం. ఆ భ్రమలో పడి ఎప్పుడూ చేయకూడని పనులు చేయడం. ఇదే అవివేకము. ఇది కూడా ఆసురీ సంపదే.


ఎవరైతే ఆసురీ సంపదతో పుడతారో వారిలో పైన చెప్పిన గుణాలు కనిపిస్తాయి. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారిలో ఆసురీ సంపద పుష్కలంగా ఉన్నట్టు అనుకోవాలి. తమలో ఉన్న గుణాలను ఎవరికి వారు బేరీజు వేసుకొని, తమలో పై చెప్పిన గుణాలు ఉంటే వాటిని వదుల్చుకొని, ఆసురీ సంపదల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.

_సాద్యమయ్యే పనిని చేసేందుకు

 *_సాద్యమయ్యే పనిని చేసేందుకు తగిన శక్తి అవసరం. కానీ అసాధ్యం అన్పించే పనిని చేసేటపుడు విశ్వాసం అవసరం. విశ్వాసం లేకుండా చేసే ఏదైవకార్యమైనా సరైన ఫలితాన్నివ్వలేదు.  విశ్వాసము అనేది కొండను కూడా గాలిలో తేలేలా చేయగలదు. రాములువారిపై విశ్వాసముచేతనే హనుమంతుడు పెద్ద కొండను చిన్న కుండవలే మోసినాడు. దేవునిపై అచంచల విశ్వాసము ఉండాలే గానీ నిత్యమూ అద్భుతాలను చూస్తాము.._*

ఆదివారం,జూన్.7,2026

  🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

ఆదివారం,జూన్.7,2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి రా10.11 వరకు

వారం:ఆదివారం(భానువాసరే)

నక్షత్రం:శతభిషం తె4.42 వరకు 

యోగం:వైధృతి ఉ6.50 వరకు

కరణం:భద్ర ఉ10.07 వరకు తదుపరి బవ రా10.11 వరకు

వర్జ్యం:ఉ11.23 - 1.02

దుర్ముహూర్తము:సా4.44 - 5.36

అమృతకాలం:రా9.17 - 10.56

రాహుకాలం:సా4.30 - 6.00

యమగండ/కేతుకాలం:మ12.00 - 1.30

సూర్యరాశి:వృషభం

చంద్రరాశి:కుంభం   

సూర్యోదయం:5.28

సూర్యాస్తమయం:6.28

సర్వేజనా సుఖినోభవంతు

శుభమస్తు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

ఆస్తి

  మనిషన్నాక ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత ఆస్తి కచ్చితంగా ఉంటుంది. ధనవంతుడికైతే ఏడుతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి. ఆ ధీమాతో అతడు ఏ చీకూచింతా లేకుండా జీవితాన్ని గడిపేస్తూంటాడు. పేదవాడికి తాను ఉండే పూరి గుడిసే ఆస్తి! అందుకనే దాన్ని అతడు అపురూపంగా చూసుకుంటాడు. ఆస్తికి అనేక రూపాలు. ధనం, ధాన్యం, కీర్తి, పదవి, చదువు, నైపుణ్యాలు... కొన్ని సంపాదించుకునేవి, కొన్ని వారసత్వంగా వచ్చేవి, మరికొన్ని అయాచితంగా లభించేవి. మరి జ్ఞానం మాటేమిటి?


పుట్టినప్పటినుంచీ మనిషి తల్లిదండ్రుల నుంచి, చుట్టూ ఉన్న పెద్దల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, సమాజం నుంచి... ఎన్నో నేర్చుకుంటాడు. అదంతా కూడా ఆస్తే. తమవైన ఆస్తుల్ని ఎవరూ ఎడాపెడా ఖర్చు చేయరు. అయాచితంగా పంచిపెట్టరు. విలువైనదీ, కష్టపడి సంపాదించుకున్నదీ కాబట్టి భద్రంగా దాచుకుంటారు. అవసరాలకైనా, దానధర్మాలకైనా ఆచితూచి వినియోగిస్తారు. అయితే ఆస్తులన్నీ ఒకే రకం కాదు. కొన్ని వాడినకొద్దీ తరుగుతాయి. కొన్ని మాత్రం పెరుగుతాయి. అది తెలియక కొందరు లౌకిక సంపదల్లాగే అలౌకికమైన జ్ఞానాన్ని కూడా భద్రంగా దాచుకోవడం చూస్తుంటాం. వారు తాము తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి ఇష్టపడరు. దాన్ని అడగడానికి కూడా చాలామంది సంశయిస్తారు. జ్ఞానం అంటే- తెలిసిన విషయం. దాన్ని ఇతరులకు చెప్పడానికి ముందుకు రానివారూ, అడగడానికి నోరు తెరవనివారూ ఇద్దరూ ఒకే భావనతో ఉన్నట్లే. ఎలా అంటే, జ్ఞానాన్ని ఇస్తూ పోతే అవతలివారూ తమతో సమానం అయిపోతారనీ, తమ విలువ తగ్గిపోతుందేమోననీ అనుకునేవారు ఒకరైతే; అడగడం వల్ల తమను తాము తక్కువ చేసుకున్నట్లు భావించేవారు మరొకరు. ఇద్దరిదీ అహంభావమే. కొంతమందికి తమకు తెలిసిన విషయాన్ని నలుగురికీ చెప్పాలని మనసులో ఉన్నా అడిగేవారు లేక ఊరుకుంటారు. లేదా అడిగే వారికే అంత ఉంటే నాకెంత  ఉండాలి... అనుకుని జ్ఞానాన్ని గుట్టుగా దాచుకునేవారూ ఉంటారు.


ఇలా ఎందుకు జరుగుతుందంటే... ప్రాపంచిక జ్ఞానమంతా సేకరించుకున్నదే కాబట్టి. అలాంటి జ్ఞానం తరిగిపోయే ఆస్తిలాంటిదని వారు భావిస్తూ ఉండటం వల్లే! కానీ, ఆత్మజ్ఞానం ఆస్తి కాదు. అది ఇతరుల నుంచి సేకరించుకునేది కానే కాదు. ఎవరికి వారే పండించుకునే ఒక అద్భుతమైన పంట అది. బయటికి చల్లిన కొద్దీ మళ్లీ మళ్లీ ఊరే ఒక చల్లని నీటిచెలమ. తెంపిన కొద్దీ ఎన్నెన్నో పుష్పాలనిచ్చే ఒక పూలచెట్టు. విస్తర్లకోసం ఆకులెన్నో తెంపినా మళ్లీ మళ్లీ చిగురించే చెట్టు కొమ్మ.


ఇవ్వడమంటే మనసును విశాలంగా చేసుకోవడం. సంకుచిత బంధనాలను తెంపుకొని విశ్వనరుడిగా ఎదగడంలో అది మొదటి మెట్టు. ఏనాడూ ఎవరికీ ఏమీ ఇవ్వనివాడు చివరికి తనకోసం తాను ఇంత పుణ్యాన్ని కూడా మిగుల్చుకోలేడు. దాన్ని గుర్తించి నలుగురి మేలు కోరి స్వచ్ఛందంగా జ్ఞానవితరణ చేసేవారే మహాత్ములు. విరగకాసిన చెట్టు, పండ్లను పంచుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది.

బార్లలో ఎందుకు

  బ్రహ్మానందం భార్య కనకం "మీరు గుంటూరు వెళ్ళినప్పుడల్లా బార్లలో ఎందుకు గడుపుతున్నారు?" భర్తని నిలదీసింది. 


"అరండల్ పేటలో అడ్డరోడ్ల నెంబర్లు కన్ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి"చెప్పాడు బ్రహ్మానందం. 


"దానికీ దీనికీ ఏమిటి సంబంధం?"


"పిచ్చిమొహమా...కూర్చో చెపుతాను.

ఏలూరులో దారి అడిగితే ' నేరుగా పొండి' అంటారు.

చిత్తూరులో ' సీదా పొండి' అంటారు. 

అనంతపురంలో 'ముందుకు పొండి' అంటారు.

కొవ్వూరులో ' ఎదరకి వెళ్ళండి' అంటారు. 

గుడ్లవల్లేరులో ' ఈ దారంబడి వెళ్ళండి' అంటారు. 

నెల్లూర్లో ' స్ట్రెయిట్ గా వెళ్ళండి' అంటారు. 

కర్నూల్లో ' సక్కగా పొండి' అంటారు 

గుంటూరులో మాత్రం అదేమిటో 'బారుకి వెళ్ళండి' అంటుంటారు, అందుకే .😀😀😀😀