3, జులై 2026, శుక్రవారం

నేను చూసిన భగవానుడు

 నేను చూసిన భగవానుడు


 నిన్న మేము మైసూరులోని శ్రీ వేణుగోపాల స్వామి వారి మందిరానికి వెళ్ళాము.


మనం నిత్యజీవితంలో ఎన్నో దేవాలయాలకు మందిరాలకి వెళుతూ ఉంటాం అయితే ఈ దేవాలయమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటో నేను మీకు కులం క్యూస్షన్ గా వివరిస్తాను.


ముందుగా ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే కావేరి నది తీరాన ఉన్నది.విశాలమైన ప్రాంగణము చుట్టూరా కాంపౌండ్ వాల్ మీద పెన్సింగ్తో ఉన్నది. దేవాలయం ముందర చాలా ఖాళీ స్థలం ఉన్నది అక్కడ మనము కార్లు వ్యానులు బస్సులు ఏవైనా కూడా చక్కగా పార్కు చేసుకోవచ్చు.


పార్కింగ్కు ఎటువంటి రుసుము లేదు.అక్కడ మైక్ లో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఏంటంటే మీ చెప్పులు చెప్పుల స్టాండులో పెట్టుకొని చెప్పులు లేకుండా దేవాలయంలోకి ప్రవేశించండి అని.


అక్కడ చెప్పుల స్టాండు చూసాము అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు చెప్పులు ఉచితంగా అక్కడ పెట్టుకోవచ్చు ఒక రూపాయి కూడా చెప్పులు స్టాండ్ లో తీసుకోలేదు.అక్కడినుంచి నడుచుకుంటూ ప్రాంగణంలో అడుగెడితే అక్కడ ఒక మండపం ఉన్నది ఆ మండపం వద్ద కొంచెంసేపు మేము విశ్రాంతి తీసుకున్నాము, ఎండ విపరీతంగా ఉన్నది.


మధ్యాహ్నం రెండు గంటల సమయం చిన్నగా నడుచుకుంటూ అక్కడ బయట ప్రాంగణం దాటి న వెంటనే చుట్టూరా అద్దాలతో ఉన్నటువంటి ఒక పెద్ద హాలు కనబడ్డది, అద్దాలు మాత్రమే ఉన్నాయి ఆ హాల్లో అది దాటి దాని లోపలికి వెళ్లి కే అక్కడ కొంత ఖాళీ స్థలం దాటి వెళితే రెండవ ప్రాకారము లోపలికి వెళ్దాము.


రెండో ప్రకారములోపడ ముందు విజ్ఞేశ్వరుడుతో మొదలుకొని చుట్టూరా పార్వతీదేవి శంకరుడు శ్రీరామచంద్రుడు మొదలగు దేవతామూర్తులు నవగ్రహాలు ఋషులు మొదలైనటువంటి మూర్తులతో చిన్న చిన్న దేవాలయాలు మనకు దర్శనం ఇస్తాయి.


అవన్నీ చూసుకొని ఒక ప్రదక్షణ లాగా తిరిగి మరల లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఒక చిన్న మండపాము లాగా ఉండి అక్కడ కూర్చోటానికి వసతి ఉన్నది.




అది దాటుకొని లోపలికి వెళితే అక్కడ స్వామి వారి కోవెల ఉన్నది కోవెలలోపడా మనకు ఎడమవైపు ఒక మూర్తి ఎదురుగా ఒక మూర్తి దర్శనమిస్తారు.




ఎదురుగా ఉన్న మూర్తి గోపాలకృష్ణమూర్తి వేణు గానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి మూర్తి చూసినా కొద్ది చూడాలనిపించేటువంటి ఆనందమయం.




ఆ మమూర్త ముందర పూజలు చేసే పూజారులు ఎవరు లేరు కానీ ఒక దీపారాధన చేసినటువంటి దీపారాధనతో కూడిన పళ్ళెం ఉన్నది అక్కడ కానుకలు వేయకూడదు అని మైక్ లో చెప్పారు కేవలం దర్శనము చేసుకొని 




 బయటకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని బయట ప్రాంగణము దాటి వస్తే అవతల ఒక రాతిరథము కనబడుతుంది.




అందరూ అక్కడ ఫోటోలు దిగారు, మేము కూడా ఫోటోలు దిగాము




 ఇక్కడ విశేషమేంటంటే ఈ దేవాలయంలో మీరు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.




కేవలము భక్తితో స్వామివారిని దర్శించుకుని రావచ్చు ఎక్కడ పార్కింగ్ ఫీజు చెప్పుల స్టాండ్ ఫీజు దైవ దర్శనం ఫీజు పూజా ఫీజు అర్చన ఫీజు టెంకాయ ఫీజు ఏవి కట్టవలసిన అవసరం లేదు.




దేవాలయములో కానుకలు నిషిద్ధం అని మైకులు లో పలుమార్లు చెబుతున్నారు.




పూలు పండ్లు ఏవి కూడా లోపలికి తీసుకొని రావలసిన పనిలేదు.




నిజమైన భక్తి అంటే భగవంతుడికి మనస్సుని అర్పించడమే కదా అంతకుమించినది ఏమీ ఉండదు అని చెప్పటానికి ఈ దేవాలయం తార్కాణము ఇటువంటి దేవాలయాలు మరిన్ని అభివృద్ధి చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉండటమే కాకుండా హిందూ ధర్మము సుస్థిరముగా ఉంటుంది అనటానికి ఎటువంటి సందేహము లేదు. తరువాత మేము కావేరీ నది తీరానికి వెళ్లి కాసేపు ఉండి వచ్చాము.




నిన్న మా ట్రిప్పు చాలా ఆనందంగా గడిచింది




ఓం శాంతి శాంతి శాంతిః 


మీ


 చేరువేల భార్గవ శర్మ

వాలి ఆక్షేపణలకు

 ....☘️1 వాలి రాములు వారితో నన్ను చెట్టు చాటు నుండి చంపినావుఅది అధర్మం కదా అని అన్నప్పుడు రాములు వారి సమాధానం చూడండి🙏




 *వాలి ఆక్షేపణలకు రాముని సమాధానం*


"వానరరాజా! ధర్మం గురించి సంశయం వస్తే పెద్దలను అడిగి తెలుసుకుని ఆపైన మాట్లాడాలి. ఇలా పరుషంగా మాట్లాడకూడదు.


 సత్పురుషులు ఆచరించే ధర్మం చాలా సూక్ష్మమైనది. విశేషించి నేర్చుకుంటే తప్ప తెలుసుకోవడం చాలా కష్టమైనది.


చపలశ్చపలైః సార్ధం వానరైరకృతాత్మభిః, జాత్యస్ధ ఇవ జాత్యక్షైర్మన్తయన్ ప్రేక్షసే ను కిమ్.


పుట్టుగుడ్డివాడు మరికొందరు పుట్టుగుడ్డివాళ్ళతో ఆలోచించి ఏం చూడగలడు? అలాగే చపలుడివైన నువ్వు మరి కొందరు చపలురితో ఆలోచించి ధర్మం గురించి ఏం తెలుసుకోగలవు?


ధర్మార్ధకామాల గురించి, లోకమర్యాదను గురించి తెలుసుకోకుండా నీ యిష్టం వచ్చినట్లు ప్రవర్తించావు. ఫలితం అనుభవించ వలసివస్తే నన్ను నిందిస్తున్నావు. నిన్ను చంపడం అధర్మమని వాపోతున్నావు. ఎందుకు చంపానో చెప్పమంటున్నావు..


 *నిన్ను చంపడం ధర్మమే.* అది ఎలాగో విను.


నీ దేశం వేరు, నాదేశం వేరు అన్నావు. నా దేశంలో ఏ అపరాధమూ చెయ్య లేదన్నావు. కొండలతోనూ, మహాపర్వతాలతోనూ, మైదానాలతోనూ, చిట్టడవులతోను, ఘోరారణ్యాలతోనూ; జనపదాలతోనూ, నగరాలతోనూ కూడిన చతుస్సముద్ర పరివేష్టితమైన యీ భూమండలమంతా మహాపరాక్రమవంతులైన మా ఇక్ష్వాకువంశీయులదే. ఇదంతా మా రాజ్యమే. *మనుష్యులను, మృగాలను, పక్షులను నిగ్రహించడం, అనుగ్రహించడం మా అధికారంలో ఉన్నాయి.* నువ్వు మా రాజ్యంలోని అరణ్యంలో నివసిస్తున్నావు. మారాజ్యంలో అమలులో ఉన్న ధర్మాన్ని పాటించాలి.


ఈ రాజ్యంలో ధర్మం అవిచ్ఛిన్నంగా ఉండేలా పితృపితామహుల నుంచీ మేము కాపాడుతున్నాం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని ధర్మాత్ముడైన భరతుడు పరిపాలిస్తున్నాడు. తన రాజ్యంలో అధర్మం ఎక్కడా తలెత్తకూడదని భరతుడు ఆదేశించాడు. మేమే కాదు. అనేకమంది రాజులు భరతుడి ఆదేశానుసారం ధర్మపరిరక్షణ చేస్తున్నారు. మేమిద్దరమూ రాజాజ్ఞను పాటిస్తూ అరణ్యాలలో తిరుగుతున్నాము.


 *శ్రేష్ఠమైన మాధర్మాన్ని మేము పాటిస్తూ భరతుడి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా ధర్మాతిక్రమణం చేసారా అని పరిశీలిస్తాం.* అదీ మాకు తోచినట్లు కాదు. శాస్త్రానుసారంగా ధర్మవిచారణ చేస్తాం. ధర్మాన్ని అతిక్రమిస్తే శిక్షిస్తాం. *నువ్వు ధర్మాతిక్రమణం చేసావు. రాజదండనకు గురయ్యావు.* 


ధర్మమార్గంలో ఉన్న ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, అన్నగారు ఈ ముగ్గురూ తండ్రులే అని తెలుసుకోవాలి.


అలాగే కన్నకొడుకు, గుణవంతుడైన శిష్యుడు, తమ్ముడు ఈ ముగ్గురూ తనకుమారులే అని భావించాలి.


కామంతో కళ్ళు మూసుకుపోయి వరుసకు కూతరైనతమ్ముడి భార్యనుగాని పొందేవాడిని శిక్షించాలని శాస్త్రం చెప్తోంది. నువ్వు తమ్ముడు భార్యని తీసుకొని వెళ్ళావునువ్వు ధర్మమార్గం తప్పావు. మేము రాజాజ్ఞప్రకారం ధర్మాన్ని నిలబెట్టాలి. అందువలన నీకు ఈ శిక్ష విధించక తప్పదు. ఇది మా కర్తవ్యం.


ఇక సుగ్రీవుడితో మైత్రి విషయానికి వస్తే, అతడు నువ్వు చేస్తున్న పాపకార్యం గురించి నలుగురిమధ్య చెప్పాడు. అది విని నీకు మరణదండన అమలు చేస్తానని ప్రతిజ్ఞ చేసాను. ఆ ప్రకారమే నిన్ను వధించాను.


ఒక సంన్యాసి నువ్వు చేసిన పాపం వంటిదే చేస్తే, సంన్యాసి కదా అని మా పూర్వుడైన మాంధాత చక్రవర్తి అతణ్ణి శిక్షించకుండా వదిలేసాడు. అతణ్ణి వదలినందుకు ఆ పాపం మాంధాతకు చుట్టుకుంది.


ఇక నిన్ను చాటుగా ఉండి చంపానన్నావు. వానరరాజ్యానికి రాజువైనా *నువ్వు వానరుడివే. మానవులు జంతువులను వలలతోను, ఉచ్చులతోను, చిత్రమైన శబ్దాలు చేసి, ఇంకా అనేక కపట ఉపాయాలతోను బంధిస్తారు. ఇది తప్పు కాదు.* *రాజులైతే ఏకంగా మాటువేసి వేటాడుతారు. నువ్వు నాతో ఎదురుగా నిలిచి యుద్ధం చేసినా, మరొకడితో యుద్ధం చేస్తున్నా నువ్వు వానరుడివే. నిన్ను చాటుగా ఉండి చంపవచ్చు.*


జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు. . జీవులు తమంత తాముగా సంపాదించలేని ధర్మాన్నీ, పవిత్రమైన జీవితాన్నీ రాజులే ఇస్తారు.. *అనేక తరాలుగా అనుసరిస్తున్న ధర్మమార్గంలో నియమంగా నడిచే నన్ను దూషించడం నీకు తగదు.”*


రాముడి మాటతో వాలికి కనువిప్పు కలిగింది.


“ *రామా! నువ్వు చెప్పినదే సత్యం, ధర్మస్వరూపాన్ని ఇంత స్పష్టంగా నువ్వు తప్ప ఇంకొకరు తెలుసుకోలేరు. కార్యాకార్యాలను విశ్లేషించడంలో నీకు ఎవరూ సాటిరారు. కార్యం చేసినవారిని రక్షిస్తావు. అకార్యం చేసిన వారిని శిక్షిస్తావు."* అతడి గొంతు క్షీణించడం మొదలు పెట్టింది. వణుకుతున్న గొంతుకతో మెల్లగా రాముణ్ణి ప్రార్ధించాడు.🙏....



సేకరణ.

పునర్జన్మ

  సనాతన ధర్మం - పునర్జన్మ

                 

ఒకసారి మన సనాతన ధర్మంపై, వేదాంత శాస్త్రంపై మక్కువ ఉన్న ఒక విదేశీయుడు పరమాచార్య స్వామివారిని దర్శించాలని కంచి మఠానికి వచ్చాడు.


అతను కొన్ని సందేహాలను అడగాలని అనుకున్నాడు. వెంటనే అతనికి స్వామివారి నుండి పిలుపు వచ్చింది. సమయం వృధా చెయ్యకుండా తన సందేహాలను స్వామివారి ముందుంచాడు…


”స్వామిజి, నేను మీ సనాతన ధర్మం యొక్క అన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకున్నాను, వాటిని గౌరవిస్తాను కూడా. కాని ఈ ‘ఒకే ఆత్మ పాప పుణ్యాల ఫలం వల్ల మళ్ళీ జన్మించడం క్రిందటి జన్మ కర్మఫలం ఈ జన్మకు రావడం’ అనే ఈ పునర్జన్మ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మీరు ఈ విషయంలో నాకు కొంచం చెప్పగలరా?” అని అడిగాడు.


”ఎందుకంటే మా ధర్మం ప్రకారం. ఈ జన్మలో చేసిన పాపపుణ్యాల ఫలితం ఈ జన్మలోనే అనుభవిస్తాము. అంటే మేము నిజాయితీగా ఉంటే దేవుడు మాకు మంచి చేస్తాడు.   కపటంతో ప్రవర్తిస్తే మాకు చెడు ఫలితాలను ఇస్తాడు” అని చెప్పాడు.


అప్పుడు మహాస్వామి వారు అతని దగ్గర ‘కారు ఉన్నదా అని అడిగి ఈ కాంచీపురంలోకి వెళ్ళి కొంచం సమాచార గణాంకాలను సేకరించుకు రాగలవా?’ అని అడిగారు.


అతను వెంటనే ఒప్పుకున్నాడు. కాని తన ప్రశ్నకు ఎందుకు వెంటనే సమాధానం చెప్పలేదు, అని అనుకున్నాడు.


”సరే స్వామిజి, ఏమి చెయ్యమంటారో సెలవివ్వండి” అని అడిగాడు.


అందుకు మహాస్వామి వారు, “కాంచీపురంలోని ఒక పది ప్రసూతి వైద్యశాలలకు వెళ్ళు. అక్కడ గత రెండు రోజులలో పుట్టిన పిల్లల వివరాలు, వారి ఆరోగ్యం, తల్లితండ్రుల పేర్లు, వారి స్థితి, వారి విద్యార్హతలు, పుట్టిన సమయం వంటివి తెలుసుకుని రా” అని చెప్పారు.


ఆ విదేశీయుడు, “సరే ఇదేమి పెద్ద పని కాదు,” అని తన కారులో వెళ్ళిపోయాడు. 


సాయత్రం లోపల కావల్సిన వివరాలతో మహాస్వామి వారి ముందుకు వచ్చాడు. ఆ వివరాలను స్వామి వారికి చెప్పాడు.


“ఈ రెండు రోజులలో పది ఆస్పత్రులలో 15 మంది పిల్లలు పుట్టారు. 7గురు మగపిల్లలు, 8మంది ఆడపిల్లలు. వారిలో ముగ్గురికి పోషకాహార లోపం ఉంది. ఇద్దరు ధనికులైన తల్లితండ్రులకు ప్రథమ సంతానం. వారు అత్యంత ఖరీదైన ఆస్పత్రులలో పుట్టారు. నలుగురు పిల్లలు రోజుకూలి చేసుకునే వారికి పుట్టారు. వారికి అప్పటికే పిల్లలు ఉన్నారు” అని చెప్పుకొచ్చాడు.


స్వామివారు అతన్ని చూసి, కొన్ని ప్రశ్నలు వెయ్యడం మొదలుపెట్టారు…

”వీరు పుట్టిన ఈ రెండు రోజులలో వారు నిజాయితీగా ఉందడమో లేదా కపట బుద్ధితో ప్రవర్తించడమో చేసారని నువ్వు అనుకుంటున్నావా?”


“లేదు వారు కనీసం తమ తల్లిని కూడా గుర్తించలేని చంటిపిల్లలు. కాబట్టి ఈ జన్మలో వాడికి పాపము పుణ్యము అనేది ఏమి లేదు.” అని చెప్పాడు.


మహాస్వామి వారు ”మీ సిద్ధాంతము ప్రకారం ఈ పిల్లలందరూ ఏ పాపము పుణ్యము చెయ్యలేదు కాబట్టి అందరూ ఒకేలాగా ఉండాలి. కాని లేరు. కొంత మంది అరోగ్యం బాగులేదు. కొంత మంది ధనవంతుల పిల్లలు, కొంతమంది కూలివాని పిల్లలు. ఒకేరోజు, ఒకే అక్షాంశం, రేఖాంశం ఒకే ఊరిలో పుట్టిన పిల్లలైనా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారు. ఇదే పునర్జన్మ సిధ్ధాంతం” అని చెప్పారు.


ఆ విదేశీయుడు ఈ మాటలను విని స్థాణువైపోయాడు. ఇక్కడే పునర్జన్మ సిద్ధాంతం నిజం అనేది తేటతెల్లమవుతోంది. ఈ పిల్లలందరూ వారి వారి పూర్వజన్మ పాపపుణ్యాల ఫలితంగానే ఈ జన్మలో ఇలా పుట్టారు.


ఆ విదేశీయుడిని చూసి సనాతనధర్మ సాకారరూపం చిరునవ్వు నవ్వుతోంది.


సనాతన ధర్మానికి పుర్జన్మ సిద్ధాంతం ప్రాణం. దాన్ని నమ్ముతాను అని చెప్పడానికే నుదుట బొట్టు పెట్టుకోవడం.


పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం.

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః ।

నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః ।। 19 ।।



ప్రతిపదార్థ:


ఇహ-ఏవ — ఈ జన్మ లోనే; తైః — వారిచే; జితః — జయింపబడును; సర్గః — సృష్టి (జగత్తు); యేషాం — ఎవరైతే; సామ్యే — సమభావము నందు; స్థితం — ఉందురో; మనః — మనస్సు; నిర్దోషం — దోషరహితమై; హి — నిజముగా; సమం — సమ దృష్టి యందు; బ్రహ్మ — భగవంతుడు; తస్మాత్ — కాబట్టి ; బ్రహ్మణి — పరమ సత్యము నందు; తే — వారు; స్థితాః — స్థితులై ఉందురు.


 

తాత్పర్యము : 



సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైనవారు, ఈ జన్మలోనే జనన-మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగిఉంటారు కాబట్టి పరమ సత్యము నందే స్థితులై ఉంటారు.



వివరణ:


శ్రీ కృష్ణుడు 'సామ్యే' అన్న పదం వాడాడు, అంటే, ఇంతకు క్రితం శ్లోకం లో చెప్పినట్టు, అన్ని ప్రాణుల యందు సమ భావమును కలిగినవాడు, అని. అంతేకాక, సమ-దృష్టి అంటే, ఇష్టాయిష్టాలకు, సుఖ-దుఃఖాలకు, కీర్తి-అపకీర్తిలకు అతీతంగా ఉండటం కూడా. ఈ విధంగా ఉండగలిగిన వారు, పదేపదే వచ్చే జనన-మరణ సంసారాన్ని దాటేస్తారు.


మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంతవరకు, ఈ సమత్వ దృష్టి అనేదాన్ని పొందలేము, ఎందుకంటే, శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు, ద్వేషాలు అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి. యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి, ప్రాపంచిక బంధాలని త్యజించి, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేస్తారు. రామాయణం (రామచరితమానస్) ఇలా పేర్కొంటున్నది:


 


సేవహిఁ లఖను సీయ రఘుబీరహి, జిమి అబిబెకీ పురుష సరీరహి


‘ఒక అజ్ఞాని తన శరీరానికి సేవ చేసినట్టుగా, లక్ష్మణుడు సీతారాములకు సేవ చేసాడు.’


 


ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనస్సు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో, శారీరక సుఖ-దుఃఖాలపై మమకారాసక్తులకు అతీతుడై, సమత్వ బుద్ధి స్థితిని చేరుకుంటాడు. స్వార్థ పూరిత శారీరక కోరికలని త్యజించటం ద్వారా వచ్చే ఈ నిశ్చలతత్త్వం, వ్యక్తిని ప్రవర్తనలో భగవంతునిలా చేస్తుంది. మహాభారతం ఇలా పేర్కొంటున్నది: యో న కామయతే కించిత్ బ్రహ్మ భూయాయ కల్పతే, ‘కోరికలను త్యజించిన వాడు ఈశ్వరుడిలా అవుతాడు.

2, జులై 2026, గురువారం

శాంతగుణముతో

 శ్లో𝕝𝕝 శాంతితుల్యం తపో నాస్తి

న సంతోషాత్పరం సుఖమ్l

న తృష్ణాయ పరో వ్యాధిః

న చ ధర్మో దయాసమఃll


తా𝕝𝕝 శాంతగుణముతో సమానమైన తపస్సు లేదు. సంతోషముకంటే మించిన సుఖము లేదు. కోరికతో సమానమైన వ్యాధి లేదు. దయాగుణముతో సమానమైన ధర్మము లేదు.

అంగదుడు

 వాలి వలెనే మహాబలవంతుడుఈ *అంగదుడు*

సీతాన్వేషణకయి సుగ్రీవునిచే దక్షిణ దిశకు పంపబడిన ఆంజనేయ జాంబవదాది ప్రముఖులకు నాయకత్వము వహించినవాడు ఈ *అంగదుడు*

సీత జాడ తెలుసుకొని తిరిగి వచ్చిన హనుమను నిర్మల హృదయముతో మెచ్చుకొని ప్రోత్సహించిన ఉత్తమ గుణములు కలిగినవాడు ఈ *అంగదుడు*

రావణుని చెంతకు రాయబారిగా వెళ్ళిన సమయమున తనను వధింప వచ్చిన నలుగురు భయంకర రాక్షసులను చంకలలో యిరికించుకొని నింగికెగసి అక్కడనుండి బలముగా విసరివేయగా వారు రావణుడు చూచుచుండగనే నేలపై పడి చావగా తాను నిలబడిన రావణప్రాసాదము బ్రద్దలయి పోగా మీసము దువ్వుచూ తన బలపౌరుషములను ప్రకటించి సింహనాదము చేసి ఆకాశమున కెగిరి వానరులమధ్య ఆసీనుడైయున్న మా శ్రీరామచంద్రమూర్తి చెంతకు చేరి వినమ్రతతో నిలబడిన శత్రుభయంకరుడు ఈ *అంగదుడు*

వజ్రదంష్ట్ర నరాంతక ప్రజంఘ మహాపార్శ్వాది రాక్షస వీరులను వధించినవాడు ఈ *అంగదుడు* 

గ్రహణ ధారణాదులగు అష్టాంగములు గల బుద్ధితో కూడినవాడని... 

బాహుబల మనోబల ఉపాయబల బంధుబలము లనెడు చతుర్బలములు కలిగినవాడని... 

దేశ కాలజ్ఞత మొదలగు చతుర్దశ గుణములతో ఒప్పుచున్న వాడని...

తేజస్సు బలము పరాక్రమము కలిగిన వాడని...

బుద్ధి యందు బృహస్పతి వంటి వాడని...

పరాక్రమముతో తండ్రికి సమానుడని...

సుగ్రీవుని కార్యమునందే దృష్టి పెట్టి శ్రమ పడుచున్నవాడనియూ... సాక్షాత్తుగా ఆంజనేయ స్వామివారిచేత కీర్తింపబడినవాడు ఈ *అంగదుడు*

వానరరాజగు సుగ్రీవునిచే కిష్కింధకు యువరాజుగా 

నియమింపబడినవాడు ఈ *అంగదుడు*

సుషేణుని పుత్రికయునూ... సూక్ష్మ బుద్ధి కలదియునూ... అర్థమును విశ్లేషించుటలో నేర్పరియునూ...రాబోవు ఆపదలను పసిగట్ట గలదియునూ... సమర్థురాలునూ అయిన తారకు జన్మించిన పుత్రరత్నము ఈ *అంగదుడు*

🙏🙏🙏🙏🙏

అయినవల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి స్థల పురాణం

  అయినవల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి స్థల పురాణం 🐘

1. క్షేత్రం ఎక్కడ ఉంది

తూర్పుగోదావరి జిల్లా, కోనసీమలో అమలాపురానికి 12 కి.మీ, రాజమహేంద్రవరానికి 60 కి.మీ దూరంలో, గోదావరి నది ఒడ్డున అయినవల్లి గ్రామంలో ఈ ఆలయం ఉంది. కాణిపాకం తర్వాత అంతటి ప్రసిద్ధి గల గణపతి క్షేత్రం ఇది.  

2. స్థల పురాణం - కృతయుగం కథ • దక్ష ప్రజాపతి: కృతయుగంలో దక్షప్రజాపతి ద్రాక్షారామంలో దక్షయజ్ఞం చేయడానికి ముందు అయినవల్లి వినాయకుడిని పూజించి పునీతుడయ్యాడు. అందుకే ఇది స్వయంభూ క్షేత్రం. • వ్యాస మహర్షి: వ్యాసుడు దక్షిణ యాత్ర ప్రారంభించే ముందు ఇక్కడ గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించగా, దేవతలే ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. • గౌతమ మహర్షి: గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం ఇదే. శివుడి ఆజ్ఞతో వినాయకుడు ఇక్కడ ప్రత్యక్షమై శక్తిని ప్రసరించాడని నమ్మకం. 3. చారిత్రక ఆధారం - శ్రీపాదవల్లభ చరిత్ర

14వ శతాబ్దంలో శంకరభట్టు రాసిన *శ్రీపాదవల్లభ చరిత్ర*లో ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. క్రీ.శ. 1320లో శ్రీపాదవల్లభుల మాతామహులు మల్లాది బాపన్నావధానులు ఇక్కడ స్వర్ణ గణపతి మహాయజ్ఞం చేశారు. యజ్ఞం చివరిలో గణనాథుడు స్వర్ణకాంతులతో దర్శనమిచ్చి, పూర్ణాహుతిని తన తొండంతో స్వయంగా అందుకున్నాడు. అప్పుడే భాద్రపద శుద్ధ చవితినాడు శ్రీపాదవల్లభుడిగా అవతరిస్తానని వరం ఇచ్చాడు.  

4. కాణిపాకం కంటే ప్రాచీనం

ఇదే గ్రంథంలో ముగ్గురు నాస్తికులు గణపతిని అవహేళన చేయగా, తర్వాత జన్మలో గుడ్డి, చెవిటి, మూగవాళ్లుగా పుట్టారు. వాళ్లు పొలం దున్నుతుండగా బావిలో దొరికిన గణపతే కాణిపాక వినాయకుడు. దీన్నిబట్టి అయినవల్లి గణపతి కాణిపాకం కంటే ప్రాచీనుడని తెలుస్తోంది.  

5. క్షేత్ర ప్రత్యేకతలు 1. వరసిద్ధి వినాయకుడు: ఇక్కడి స్వామిని 'వరసిద్ధి వినాయకుడు' అంటారు. భక్తుల కోరికలు తీర్చి, అన్ని అడ్డంకులు తొలగించే స్వామిగా ప్రసిద్ధి. 2. దక్షిణాముఖుడు: గర్భగుడిలో వినాయకుడు దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు. ఈ నిర్మాణం శక్తిని ఆకర్షించేలా ఉంటుంది. 3. గరిక ప్రసాదం: ఇక్కడ పూజలో వాడిన గరికను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇది చాలా ప్రత్యేకం. 4. నారికేళ ప్రియుడు: కొబ్బరికాయలు సమర్పిస్తే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. 5. ఆది గణపతి: ఈయన్ను 'ఆది గణపతి' అని కూడా పిలుస్తారు. ఏ పని మొదలుపెట్టాలన్నా ముందుగా అయినవల్లి గణపతిని దర్శించుకోవడం ఆనవాయితీ. 6. అయినవల్లి పేరు ఎలా వచ్చింది?

పూర్వం ఈ ప్రాంతాన్ని "అనల విల్లి" అనేవారు. అనల విల్లి → అయినవిల్లి → అయినవల్లిగా మారింది. అర్థం: శ్రద్ధగా కోరితే అడ్డంకులన్నీ దూరమయ్యే స్థలం.  

7. ముఖ్యమైన పూజలు

సంకష్టహర చతుర్థి, గణపతి హోమం, వినాయక చవితి, నవరాత్రులకు వేలాది మంది భక్తులు వస్తారు. కొత్త వ్యాపారం, గృహప్రవేశం, వాహనం కొనకముందు ఇక్కడ పూజ చేయించుకుంటారు.  


ఒక్కమాటలో: కృతయుగం నుంచి దక్షుడు, వ్యాసుడు, గౌతముడు పూజించిన స్వయంభూ క్షేత్రం ఇది. కోరిన కోర్కెలు తీర్చి సకల విఘ్నాలు తొలగించే వరసిద్ధి వినాయకుడు అయినవల్లిలో కొలువై ఉన్నాడు.  


🔴🟢🔵🟡🙏🟡🔵🟢🔴

భగవద్గీత

 🕉️ "శ్రీకృష్ణ పరమాత్మనే నమః" 🕉️


🌺 ప్రతిరోజు ఒక్క "భగవద్గీత" శ్లోకం పారాయణ చేస్తూ, చేయిస్తూ అక్షయ పుణ్యఫలితాలను, అనంతమైన జ్ఞానాన్ని, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను, శ్రీకృష్ణ పరమాత్మ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి.🌺


🕉️ (భగవద్గీత, 3వ అధ్యాయం"కర్మయోగం" ) 🕉️


📜 అందరూ భక్తితో ఈ 5వ శ్లోకం మరియు అర్థం {క్రింద జైశ్రీకృష్ణ} వరకు పారాయణ చేయండి – అన్ని దోషాలు, పాపాలు, గ్రహ బాధలు, కష్టాలు, సమస్యలు, మానసిక చింతలు భస్మం అవుతాయి. సుఖ జీవన ప్రాప్తి తప్పక కలుగుతుంది.


📜 5వ శ్లోకం

న హి కశ్చిత్ క్షణమపి ।

జాతు తిష్ఠత్యకర్మకృత్ ।

కార్యతే హ్యవశః కర్మ ।

సర్వః ప్రకృతిజైర్గుణైః ॥



---


✅ సరళమైన అర్థం


శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు:


"ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా పని చేయకుండా ఉండలేడు. ప్రకృతి యొక్క స్వభావం వల్ల ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు."


మనిషి శరీరంతో పని చేయకపోయినా, మనస్సుతో ఆలోచిస్తాడు. అందువల్ల కర్మను పూర్తిగా విడిచిపెట్టడం అసాధ్యం.


👉 ప్రతి మనిషి ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు

👉 కర్మను పూర్తిగా వదిలేయడం సాధ్యం కాదు

👉 పని చేయడం మనిషి సహజ స్వభావం

👉 కర్తవ్యాన్ని సక్రమంగా చేయాలి

👉 కర్మను భగవంతునికి అర్పిస్తే అది యోగం అవుతుంది



---


🕉️ ఈ శ్లోకానికి మనందరికి ఉపయోగపడే – 5 లోతైన విషయాలు 🕉️


1️⃣ మనం నిద్రపోకపోతే ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మాట్లాడటం, ఆలోచించడం, నడవడం, చదవడం—ఇవన్నీ కర్మలే.


2️⃣ పని చేయకుండా కూర్చోవడం వల్ల సుఖం రాదు. మంచి పనుల్లో నిమగ్నమైతేనే మనస్సుకు శాంతి లభిస్తుంది.


3️⃣ ప్రతి మనిషికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాటిని వదిలిపెట్టకుండా నిజాయితీగా చేయడం జీవితం యొక్క ధర్మం.


4️⃣ ఖాళీగా ఉండే మనస్సులో ఎక్కువగా భయం, ఆందోళన, చెడు ఆలోచనలు వస్తాయి. మంచి పనులు మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి.


5️⃣ పని చేయడం సమస్య కాదు. కోపం, అహంకారం, అధిక ఆశతో పని చేయడమే సమస్య. ప్రేమతో, కర్తవ్య భావంతో పని చేస్తే జీవితం ఆనందంగా ఉంటుంది.



---


🕉️ భక్తి భావంతో – 5 లోతైన విషయాలు 🕉️


1️⃣ భగవంతుని స్మరిస్తూ చేసే ప్రతి పని పూజతో సమానం. వంట చేయడం, ఉద్యోగం చేయడం, సేవ చేయడం అన్నీ భక్తిగా మారుతాయి.


2️⃣ "నేను చేసే ప్రతి పని భగవంతునికే అర్పణ" అనే భావన మనస్సుకు శాంతిని ఇస్తుంది.


3️⃣ భక్తుడు పనిని భారంగా భావించడు. దాన్ని భగవంతుడు ఇచ్చిన సేవగా భావిస్తాడు.


4️⃣ దైవస్మరణతో చేసే కర్మ వల్ల మనస్సు పవిత్రమవుతుంది. పవిత్రమైన మనస్సులో భగవంతుని అనుభూతి పెరుగుతుంది.


5️⃣ భగవంతునిపై విశ్వాసంతో పని చేసినవాడు ఫలితాల గురించి ఎక్కువగా బాధపడడు.



---


🕉️ అద్వైత భావంతో – 5 లోతైన విషయాలు 🕉️


1️⃣ కర్మలు శరీరం, మనస్సు ద్వారా జరుగుతాయి. ఆత్మ మాత్రం వాటికి సాక్షిగా ఉంటుంది.


2️⃣ "నేనే చేస్తున్నాను" అనే భావన బంధనానికి కారణం. ఈ భావం తగ్గినప్పుడు మనస్సు ప్రశాంతమవుతుంది.


3️⃣ ప్రకృతి తన స్వభావం ప్రకారం పనిచేస్తుంది. జ్ఞాని దీనిని అర్థం చేసుకొని శాంతిగా ఉంటాడు.


4️⃣ శరీరం పని చేస్తున్నా, అంతరంగంలో ప్రశాంతంగా ఉండడం నిజమైన యోగం.


5️⃣ ఆత్మ ఎప్పుడూ స్వతంత్రంగా ఉంటుంది. ఈ సత్యాన్ని గ్రహించినవాడు కర్మల వల్ల బంధించబడడు.



---


🕉️ ఆధునిక జీవితానికి వర్తించే – 5 లోతైన విషయాలు 🕉️


1️⃣ ఉద్యోగం, కుటుంబం, సమాజం—ప్రతి చోటా బాధ్యతలు ఉంటాయి. వాటిని తప్పించుకోవడం కంటే సంతోషంగా చేయడం నేర్చుకోవాలి.


2️⃣ రోజంతా ఖాళీగా ఉండడం కంటే ఉపయోగకరమైన పనులు చేయడం మానసిక ఆరోగ్యానికి మంచిది.


3️⃣ ప్రతి రోజు కొంత సమయం మంచి పనులకు, సేవకు కేటాయిస్తే జీవితం అర్థవంతంగా మారుతుంది.


4️⃣ పనిని ఒత్తిడిగా కాకుండా అవకాశంగా చూస్తే ఆనందం పెరుగుతుంది.


5️⃣ విజయానికి రహస్యం పని చేయడంలో కాదు; పనిని సరైన మనస్సుతో చేయడంలో ఉంది.



---


🕉️ అందరూ మనసులో అనుకోవలసిన 10 ధ్యాన వాక్యాలు 🕉️


1️⃣ నేను నా కర్తవ్యాన్ని ఆనందంగా చేస్తున్నాను.

2️⃣ నా ప్రతి పని దైవార్పణంగా మారుతోంది.

3️⃣ నేను బాధ్యతలను ప్రేమతో నిర్వర్తిస్తున్నాను.

4️⃣ నా మనస్సు ప్రశాంతంగా ఉంది.

5️⃣ నేను మంచి పనులను ఎంచుకుంటున్నాను.

6️⃣ భగవంతుడు నన్ను నడిపిస్తున్నాడు.

7️⃣ నేను అహంకారాన్ని విడిచిపెడుతున్నాను.

8️⃣ నా జీవితం అర్థవంతంగా మారుతోంది.

9️⃣ నేను నిష్కామ కర్మను ఆచరిస్తున్నాను.

🔟 నేను అంతరంగ శాంతిని పొందుతున్నాను.



---


🕉️ సారాంశం


ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని చెబుతున్నాడు: ఏ మనిషి కూడా కర్మ లేకుండా ఉండలేడు. అందువల్ల కర్మలను వదిలేయడం కాదు, వాటిని సరైన భావంతో, నిష్కామంగా, దైవార్పణంగా చేయడం నేర్చుకోవాలి.



---


🌿 జీవిత సూత్రం


"పని చేయకుండా ఉండడం కాదు గొప్పది; పని చేస్తూనే మనశ్శాంతిని కాపాడుకోవడం గొప్పది."



---


🌺 అద్భుత వాక్యం 🌺


"మనిషి పని చేయకుండా ఉండలేడు; పనిని భారంగా కాకుండా భగవంతునికి అర్పణగా మార్చుకోవాలి." 🕉️🙏🌿🌺


🌺 జై శ్రీకృష్ణ 🌺


🌹 భగవద్గీత, 3వ అధ్యాయం, కర్మయోగం 5వ శ్లోకం అర్థాన్ని రెండు మూడు సార్లు పారాయణ చేసి బుద్ధిలో స్థిరపరచుకొండి. నెలకు ఒకసారి పారాయణ చేయటానికి ప్రయత్నించండి.మీ పిల్లలకు కూడా చెప్పండి. ప్రతి రోజు ఒక భగవద్గీత శ్లోకం పారాయణ మీద {శ్రద్ధ పెంచుకోండి} పెంపొందించండి.రేపు 6వ శ్లోకం పంపిస్తాము.🌹


🌹 జీవితంలో ఒక్క సార్తెనా భగవద్గీత 700 శ్లోకాలు భక్తి, శ్రద్ధలతో పారాయణ చేయాలి {స్త్రీ, పురుషులందరూ చేయవచ్చు}.🌹


🌹 భగవద్గీత చదవటం అంటే కాశీలో గంగాస్నానం చేసి విశ్వనాథుడిని అభిషేకించటమే అలాగే తిరుమల కొండమీద ఉన్నటువంటి పుష్కరిణిలో స్నానంచేసి వరాహస్వామిని, శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించటమే. అంతటి విశేష ఫలితం ప్రతిరోజు ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణ చేయుట వల్ల లభిస్తుంది 🌹


🌹 కొన్ని కోట్ల మంది ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేస్తూ, చేయిస్తూ ప్రపంచంలో శాంతి నెలకొనాలి అనేది "శ్రీకృష్ణుడి" సంకల్పం కావున {మీ బంధు మిత్రులందరికీ షేర్‌ చేయండి}.ఆ పుణ్య ఫలితం మిమ్మల్ని సదా రక్షిస్తుంది.🌹


🌹 మీగురువుగారు తోటపల్లి చక్రవర్తి అవధాని. శ్రీశైలం.🌹

🌺 ఏ తత్ఫలం శ్రీకృష్ణ పరమాత్మ చరణారవిందార్పణమస్తు.🌺

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 


విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని ।

శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః ।। 18 ।।




ప్రతిపదార్థ:


విద్యా — దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము; వినయ — వినయము; సంపన్నే — కలిగి ఉన్నవారు; బ్రాహ్మణే — ఓ బ్రాహ్మణుడు; గవి — ఓ ఆవు; హస్తిని — ఓ ఏనుగు; శుని — ఓ కుక్క; చ — మరియు; ఏవ — ఖచ్చితంగా; శ్వ-పాకే — ఓ చండాలుడు; చ — మరియు; పండితాః — పండితులు; సమ-దర్శినః — ఒకే దృష్టితో చూస్తారు.   


 

తాత్పర్యము : 


నిజమైన పండితులు, దివ్య జ్ఞాన చక్షువులతో - ఓ బ్రాహ్మణుడిని, ఓ ఆవుని, ఓ ఏనుగుని, ఓ కుక్కని, ఓ చండాలుడిని సమ-దృష్టితో చూస్తారు. 



వివరణ:


మనం జ్ఞాన దృక్పథంతో చూసినప్పుడు దానిని 'ప్రజ్ఞా చక్షు' అంటారు, అంటే, 'జ్ఞానమనే కళ్ళతో చూడటం' అని. శ్రీ కృష్ణుడు 'విద్యా సంపన్నే' అన్న పదాలని ఇదే అర్థంలో వాడుతున్నాడు, అంతే కాక 'వినయ' అన్న పదం కూడా వాడుతున్నాడు, అంటే, 'అణకువ/నమ్రత'. దివ్య ఆధ్యాత్మిక జ్ఞానము యొక్క సంకేతం ఏమిటంటే, అది వినయ విధేయతలతో కూడి ఉంటుంది, కానీ, పైపైని పుస్తక జ్ఞానం అనేది, చదువుకున్నామనే గర్వంతో కూడిఉంటుంది.


భౌతిక దృష్టి కన్నా, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించే దృష్టి ఎంత విభిన్నమైనదో శ్రీ కృష్ణుడు ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. జ్ఞాన సంపన్నులైన భక్తులు అన్ని ప్రాణులను భగవత్ అంశము అయిన ఆత్మలుగా, దివ్యమైనవిగా చూస్తారు. శ్రీ కృష్ణుడు చూపించిన ఉదాహరణలు పూర్తి విభిన్నమైన జీవ జాతులు. పూజాది కార్యక్రమాలు చేసే వేద బ్రాహ్మణుడు గౌరవింపబడుతాడు, అదే సమయంలో, ఒక ఛండాలుడు అందరిచే సాధారణంగా వెలివేయబడి చిన్న చూపు చూడబడుతాడు; ఆవు మానవ ఉపయోగార్థం పాలు పితకబడుతుంది; కాని కుక్క కాదు; ఏనుగు శుభ-కార్యాల ఊరేగింపులో వాడబడుతుంది, కానీ ఆవుని, కుక్కని వాడరు. భౌతిక దృక్పథంలో ఈ జీవ జాతులు, భూమిపై ఉన్న వైవిధ్య జీవ రాశులలో, పూర్తి విభిన్నమైనవి. కానీ, నిజమైన జ్ఞానం కలిగి, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నుడైనవాడు, వీటన్నిటినీ నిత్యమైన ఆత్మలుగా దర్శిస్తాడు, కాబట్టి సమ దృష్టి తో చూస్తాడు.


బ్రాహ్మణులు ఉన్నత జాతి వారు, శూద్రులు నిమ్న శ్రేణి వారు అన్న దృక్పథాన్ని వేదములు అంగీకరించవు. జ్ఞాన దృక్పథం ఏమిటంటే, బ్రాహ్మణులు పూజలు చేసినా, క్షత్రియులు పరిపాలన చేసినా, వైశ్యులు వ్యాపారాది పనులు చేసినా, శూద్రులు శ్రమ చేసినా, వీరంతా, భగవంతుని అణు అంశములైన నిత్య జీవాత్మలే, అందుకే అందరూ సమానమే.

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 02.07.2026  Thursday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం  గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస క్రిష్ణ పక్ష ద్వితీయ తిథి బృహస్పతి వాసర ఉత్తరాషాఢ నక్షత్రం వైదృతి యోగః గరజి తదుపరి వణిజ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

 

యమగండం: ఉదయం 06:00 నుండి 07:30 వరకు.

  


శ్రాద్ధ తిథి: తదియ 


 

నమస్కారః , శుభోదయం