నేను చూసిన భగవానుడు
నిన్న మేము మైసూరులోని శ్రీ వేణుగోపాల స్వామి వారి మందిరానికి వెళ్ళాము.
మనం నిత్యజీవితంలో ఎన్నో దేవాలయాలకు మందిరాలకి వెళుతూ ఉంటాం అయితే ఈ దేవాలయమునకు ఉన్న ప్రత్యేకత ఏమిటో నేను మీకు కులం క్యూస్షన్ గా వివరిస్తాను.
ముందుగా ఈ దేవాలయం ఎక్కడ ఉందంటే కావేరి నది తీరాన ఉన్నది.విశాలమైన ప్రాంగణము చుట్టూరా కాంపౌండ్ వాల్ మీద పెన్సింగ్తో ఉన్నది. దేవాలయం ముందర చాలా ఖాళీ స్థలం ఉన్నది అక్కడ మనము కార్లు వ్యానులు బస్సులు ఏవైనా కూడా చక్కగా పార్కు చేసుకోవచ్చు.
పార్కింగ్కు ఎటువంటి రుసుము లేదు.అక్కడ మైక్ లో ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు, ఏంటంటే మీ చెప్పులు చెప్పుల స్టాండులో పెట్టుకొని చెప్పులు లేకుండా దేవాలయంలోకి ప్రవేశించండి అని.
అక్కడ చెప్పుల స్టాండు చూసాము అక్కడ ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరు లేరు చెప్పులు ఉచితంగా అక్కడ పెట్టుకోవచ్చు ఒక రూపాయి కూడా చెప్పులు స్టాండ్ లో తీసుకోలేదు.అక్కడినుంచి నడుచుకుంటూ ప్రాంగణంలో అడుగెడితే అక్కడ ఒక మండపం ఉన్నది ఆ మండపం వద్ద కొంచెంసేపు మేము విశ్రాంతి తీసుకున్నాము, ఎండ విపరీతంగా ఉన్నది.
మధ్యాహ్నం రెండు గంటల సమయం చిన్నగా నడుచుకుంటూ అక్కడ బయట ప్రాంగణం దాటి న వెంటనే చుట్టూరా అద్దాలతో ఉన్నటువంటి ఒక పెద్ద హాలు కనబడ్డది, అద్దాలు మాత్రమే ఉన్నాయి ఆ హాల్లో అది దాటి దాని లోపలికి వెళ్లి కే అక్కడ కొంత ఖాళీ స్థలం దాటి వెళితే రెండవ ప్రాకారము లోపలికి వెళ్దాము.
రెండో ప్రకారములోపడ ముందు విజ్ఞేశ్వరుడుతో మొదలుకొని చుట్టూరా పార్వతీదేవి శంకరుడు శ్రీరామచంద్రుడు మొదలగు దేవతామూర్తులు నవగ్రహాలు ఋషులు మొదలైనటువంటి మూర్తులతో చిన్న చిన్న దేవాలయాలు మనకు దర్శనం ఇస్తాయి.
అవన్నీ చూసుకొని ఒక ప్రదక్షణ లాగా తిరిగి మరల లోపలికి ప్రవేశిస్తే అక్కడ ఒక చిన్న మండపాము లాగా ఉండి అక్కడ కూర్చోటానికి వసతి ఉన్నది.
అది దాటుకొని లోపలికి వెళితే అక్కడ స్వామి వారి కోవెల ఉన్నది కోవెలలోపడా మనకు ఎడమవైపు ఒక మూర్తి ఎదురుగా ఒక మూర్తి దర్శనమిస్తారు.
ఎదురుగా ఉన్న మూర్తి గోపాలకృష్ణమూర్తి వేణు గానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి మూర్తి చూసినా కొద్ది చూడాలనిపించేటువంటి ఆనందమయం.
ఆ మమూర్త ముందర పూజలు చేసే పూజారులు ఎవరు లేరు కానీ ఒక దీపారాధన చేసినటువంటి దీపారాధనతో కూడిన పళ్ళెం ఉన్నది అక్కడ కానుకలు వేయకూడదు అని మైక్ లో చెప్పారు కేవలం దర్శనము చేసుకొని
బయటకు వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకొని బయట ప్రాంగణము దాటి వస్తే అవతల ఒక రాతిరథము కనబడుతుంది.
అందరూ అక్కడ ఫోటోలు దిగారు, మేము కూడా ఫోటోలు దిగాము
ఇక్కడ విశేషమేంటంటే ఈ దేవాలయంలో మీరు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.
కేవలము భక్తితో స్వామివారిని దర్శించుకుని రావచ్చు ఎక్కడ పార్కింగ్ ఫీజు చెప్పుల స్టాండ్ ఫీజు దైవ దర్శనం ఫీజు పూజా ఫీజు అర్చన ఫీజు టెంకాయ ఫీజు ఏవి కట్టవలసిన అవసరం లేదు.
దేవాలయములో కానుకలు నిషిద్ధం అని మైకులు లో పలుమార్లు చెబుతున్నారు.
పూలు పండ్లు ఏవి కూడా లోపలికి తీసుకొని రావలసిన పనిలేదు.
నిజమైన భక్తి అంటే భగవంతుడికి మనస్సుని అర్పించడమే కదా అంతకుమించినది ఏమీ ఉండదు అని చెప్పటానికి ఈ దేవాలయం తార్కాణము ఇటువంటి దేవాలయాలు మరిన్ని అభివృద్ధి చేస్తే భక్తులకి సౌకర్యంగా ఉండటమే కాకుండా హిందూ ధర్మము సుస్థిరముగా ఉంటుంది అనటానికి ఎటువంటి సందేహము లేదు. తరువాత మేము కావేరీ నది తీరానికి వెళ్లి కాసేపు ఉండి వచ్చాము.
నిన్న మా ట్రిప్పు చాలా ఆనందంగా గడిచింది
ఓం శాంతి శాంతి శాంతిః
మీ
చేరువేల భార్గవ శర్మ