16, జూన్ 2026, మంగళవారం

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                       పంచమోధ్యాయః

                కర్మ సన్యాస యోగము

 

 సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ।

ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ ।। 4 ।।



ప్రతిపదార్థ:



సాంఖ్య — కర్మ సన్యాసము; యోగౌ — కర్మ యోగము; పృథక్ — వేరువేరు; బాలాః — అజ్ఞానులు; ప్రవదంతి — అంటారు; న — కాదు; పండితాః — పండితులు; ఏకం — ఒక్క దానిలో; అపి — అయినా; ఆస్థితః — స్థితులై ఉండి; సమ్యక్ — సంపూర్ణముగా; ఉభయోః — రెంటి యొక్క; విందతే — పొందుతారు; ఫలం — ఫలమును.


 

 తాత్పర్యము : 



అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము (కర్మలను త్యజించుట లేదా కర్మ సన్యాసము) మరియు కర్మ యోగము (భక్తితో పని చేయటము) భిన్నమైనవి అని చెప్తారు. ఈ రెంటిలో ఏ ఒక్క మార్గమును అవలంబించినా ఈ రెండింటి ఫలమునూ పొందవచ్చు అని యదార్థముగా తెలిసినవారు చెప్తారు.



వివరణ:


ఇక్కడ, శ్రీ కృష్ణుడు, 'సాంఖ్య' అన్న పదాన్ని కర్మ సన్యాసమును సూచించటానికి వాడుతున్నాడు, అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించటం అన్నమాట. సన్యాసము అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం, అవి: ఫాల్గు వైరాగ్యము, యుక్త వైరాగ్యము. ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి, జనులు, కష్టాలను, బాధ్యతలను వదిలిచ్చుకోవటం కోసము దానిని త్యజించటాన్ని ఫాల్గు వైరాగ్యం అంటారు. ఇటువంటి ఫాల్గు వైరాగ్యం, పలాయనవాద దృక్పథంలో ఉన్నది మరియు అస్థిరమైనది. ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది. ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు, దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు. యుక్త వైరాగ్యంలో, జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు. వారికి ఉన్న దానిని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించరు. బదులుగా, దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయటానికే ప్రయత్నిస్తారు. యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చలించనిది.


కర్మ యోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే, యుక్త వైరాగ్య భావాలు (స్థిరమైన వైరాగ్యం) పెంపొందించుకుంటారు. తమని తాము సేవకులగా మరియు భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు; అందుకే ప్రతీదీ భగవత్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులౌతారు. ఈ విధంగా, వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవత్ ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది. బాహ్యంగా వారు ప్రాపంచిక మనుష్యుల లాగ కనిపించినా అంతర్గతంగా సన్యాసుల కు ఏమాత్రం తీసిపోరు.


పురాణములు మరియు ఇతిహాసములు భారత చరిత్రలలో మహోన్నతమైన రాజుల గురించి చెపుతూ, బాహ్యంగా వారు రాజ ధర్మాలను నిక్ఖచ్చిగా నిర్వర్తిస్తూనే రాజ విలాసాలలో నివసిస్తున్నా, వారు మానసికంగా పూర్తిగా భగవత్ భావన లోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి. ప్రహ్లాదుడు, ధ్రువుడు, అంబరీషుడు, పృథువు, విభీషణుడు, యుధిష్ఠిరుడు మొదలగువారంతా అత్యుత్తమ కర్మ యోగులే. శ్రీమద్ భాగవతం ఇలా పేర్కొంటున్నది:


గృహీత్వాపీంద్రియైరర్థాన్ యో న ద్వేష్టి న హృష్యతి

విష్ణోర్మాయామిదం పశ్యన్ స వై భాగవతోత్తమః (11.2.48)


‘ఇంద్రియ వస్తు విషయములను, వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా, భగవత్ దృక్పథంతో, సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే, అన్ని ఆయన సేవకే, అన్న దృక్పథంలో స్వీకరించే వాడు అత్యున్నత భక్తుడు.’ ఈ విధంగా, కర్మ యోగికి, కర్మ సన్యాసికి మధ్య, నిజమైన జ్ఞానికి, తేడా ఏమీ కనపడదు. వీటిలో ఏ ఒక్కటి పాటించినా, ఈ రెంటి యొక్క ఫలితములు లభించును.

శ్రీల ప్రభుపాద ఉవాచ!

 శ్రీల ప్రభుపాద ఉవాచ! 

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

ఈ భౌతిక జగత్తులో ప్రతి జీవి ఎన్నో కష్టాలు, దుఃఖాలు మరియు బాధలతో సతమతమవుతోంది. అయితే శ్రీల ప్రభోధానంద సరస్వతి ఠాకూర్ ఈ ప్రపంచం ఆనందంతో నిండి ఉందని చెబుతున్నారు. అది ఎలా సాధ్యం?


ఆయన సమాధానం ఇలా ఇస్తారు:

"యత్-కారుణ్య-కటాక్ష-వైభవవతాం తం గౌరమేవ స్తుమః"

అనగా, శ్రీ చైతన్య మహాప్రభువు యొక్క అహేతుక కృప వల్లే ఒక భక్తుడు ఈ భౌతిక ప్రపంచంలోని కష్టాలను కూడా ఆనందంగా స్వీకరించగలుగుతాడు.


శ్రీ చైతన్య మహాప్రభువు తన స్వీయ ఆచరణ ద్వారా, తాను ఎప్పుడూ దుఃఖానికి లోనుకాకుండా, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడంలో నిరంతరం ఆనందంగా ఉండేవారని చూపించారు.


అందువల్ల మనం కూడా శ్రీ చైతన్య మహాప్రభువు అడుగుజాడల్లో నడుస్తూ, నిరంతరం ఈ మహామంత్రాన్ని జపించాలి:


హరే కృష్ణ హరే కృష్ణ

కృష్ణ కృష్ణ హరే హరే ।

హరే రామ హరే రామ

రామ రామ హరే హరే ॥


అప్పుడు ఈ ద్వంద్వమయ భౌతిక ప్రపంచంలోని సుఖదుఃఖాలు మనలను బాధించలేవు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా, భగవంతుని పవిత్ర నామాన్ని జపించే వ్యక్తి నిజమైన ఆనందాన్ని అనుభవిస్తాడు.


(శ్రీమద్భాగవతం, షష్ఠ స్కంధం, 17వ అధ్యాయం, 30వ శ్లోకం వ్యాఖ్యానం)


హరే కృష్ణ 🙏

సదా మీ శ్రేయోభిలాషి 🌺

భాగవతం వింటే బాగవుతాం*

 *భాగవతం వింటే బాగవుతాం*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(8-223-క.)

నీ యంద సంభవించును

నీ యంద వసించి యుండు నిఖిల జగములున్

నీ యంద లయముఁ బొందును

నీ యుదరము సర్వభూత నిలయము. రుద్రా!


*భావము:-* రుద్రదేవా! అన్నిలోకాలు నీలోనే పుడతాయి; నీలోనే నివసిస్తాయి; ప్రాణులు అన్ని నీలోనే లయమవుతాయి; నీ ఉదరం ప్రాణులు అన్నిటికి అలవాలం.


శ్రీ త్యాగరాజ స్వామి వారి కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

తెల్లవారుజామున 4 గంటలు

  *తెల్లవారుజామున 4 గంటలు. 65 ఏళ్ల మహిళ నిద్దుర లేచింది*.

*మొదటి ఆసనం - మాలాసనం*: *వంగి ముగ్గు వేస్తుంది. 21 చుక్కలు. ఒక్కో గీతకు వెన్నెముక వంగుతుంది, కాళ్ల నరాలు సాగుతాయి. డాక్టర్ చెప్పిన "Squat Exercise" బామ్మకు 60 ఏళ్లుగా తెలుసు. "ముగ్గు వేస్తే మోకాళ్ల నొప్పులు రావు" అనేది*.


*రెండో ఆసనం - ఉత్కటాసనం*: బట్టలు ఉతకడం. రెండు కాళ్లూ కొంచెం వంచి, నడుము నిటారుగా పెట్టి, చేతులతో బట్టను రాయికి బాదడం. 20 నిమిషాలు. భుజాలు, చేతులు, నడుము అన్నీ ఒకేసారి వ్యాయామం. జిమ్‌లో "Chair Pose + Arm Workout" కి అవ్వ పెట్టిన పేరు - 'చీర ఉతకడం'.


*మూడో ఆసనం - త్రికోణాసనం*: తడి బట్టలు పిండి, దండెం మీద ఆరేయడం. కాలు ఒకవైపు, చేయి పైకి, నడుము వంచడం. శరీరం పక్కకి సాగుతుంది. లివర్, కిడ్నీలు శుభ్రపడతాయి.


*నాలుగో ఆసనం - అధోముఖ శ్వానాసనం*: వంగి ఇల్లు కసువు ఊడవడం. రక్తప్రసరణ తలకు ఎక్కుతుంది. మెదడు చురుకవుతుంది.

*ఐదో ఆసనం - మార్జరాసనం*: కూర్చుని బూడిదతో గిన్నెలు తోమడం. మణికట్టు, వేళ్లు తిరుగుతాయి. ఆర్థరైటిస్ రాదు. బూడిదలో ఉన్న పొటాష్ సహజమైన క్రిమిసంహారిణి.


మనవడు రవి అడిగాడు: బామ్మ, నువ్వు పని మనిషిలా ఇన్ని పనులు ఎందుకు చేస్తావ్? ఒకరిని పెట్టుకోవచ్చుగా?"


బామ్మ నవ్వింది: "పనిమనిషారా , నేను కాదురా. ఇది నా *ఇంటి యోగం*. ఈ పనులు మానేసిన రోజు నా ఒళ్ళు పట్టుకుపోతుంది, మనసు పాడైపోతుంది."


లచ్చమ్మ కోడలు దీప. సాఫ్ట్‌వేర్. ఉదయం లేవగానే Washing Machine ఆన్, Dishwasher ఆన్, Robot Vacuum ఆన్.


8 గంటలు ల్యాప్‌టాప్ ముందు కూర్చోవడం. మెడ నొప్పి, నడుము నొప్పి, బీపీ, షుగర్. సాయంత్రం జిమ్‌కి 2000 రూపాయలు కట్టి వెళ్తుంది. ట్రైనర్ చెప్తాడు: "మేడం, 20 స్క్వాట్స్ చేయండి, 15 నిమిషాలు Arm Rotation చేయండి, Bend అయ్యి Sweep చేయండి."


దీపకు ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన: "అరే, ఇవన్నీ మా అత్తగారు డబ్బులు తీసుకోకుండా ఇంట్లోనే చేసేవారు కదా! మేము దాన్ని 'పని' అని హేళన చేశాం. వాళ్ళు దాన్ని 'ఆరోగ్యం' అని బతికారు."


ఆ రోజు నుంచి దీప మారింది. మెషిన్ ఉన్నా, ఆదివారం పిల్లలతో కలిసి ముగ్గు వేస్తుంది, బట్టలు ఉతుకుతుంది. "అమ్మా, ఇది పని కాదు, ఫ్యామిలీ యోగా టైం" అని పిల్లలకు చెప్పింది.


### *3. అసలు తప్పు ఎక్కడ జరిగింది?*

మనం రెండు తప్పులు చేశాం:

తప్పు 1: పేరు మార్చేశాం.*


వంగి ముగ్గు వేస్తే 'మాలాసనం'. ఇంట్లో వేస్తే 'పనిమనిషి పని'.


బయట జిమ్‌లో చేస్తే 'Fitness'. ఇంట్లో చేస్తే 'Chores'.


పేరు మారగానే గౌరవం మారిపోయింది.


*తప్పు 2: ఉద్దేశం మర్చిపోయాం.*


అవ్వ ముగ్గు వేసింది 'ఇల్లు అందంగా ఉండాలి' అని కాదు.


*"నా కుటుంబం ఉదయం లేవగానే అందమైనది చూసి, మంచి మూడ్‌తో రోజు మొదలుపెట్టాలి"* అనే ప్రేమతో.


అన్నం వండింది 'ఆకలి తీర్చడానికి' కాదు.


*"నా చేత్తో తింటే నా బిడ్డకు నా ప్రేమ, నా శక్తి అందాలి"* అనే తపనతో.


ఇల్లు ఊడ్చింది 'దుమ్ము పోతుంది' అని కాదు.


*"నా ఇంట్లోకి వచ్చే వాళ్ళకి రోగాలు రాకూడదు"* అనే బాధ్యతతో.


మనం 'పని'ని మాత్రమే చూశాం. దాని వెనకాల ఉన్న *'ప్రేమ'* ని చూడలేదు. అదే మన తప్పు.


### *4. యోగం అంటే ఏంటి?*


పతంజలి అష్టాంగ యోగంలో చెప్పాడు: "యోగం అంటే మనసుని, శరీరాన్ని, శ్వాసను ఏకం చేయడం."/


మన అవ్వలు అదే చేశారు:


ఇంటి పని యోగాసనం శరీరానికి లాభం మనసుకు లాభం


**ముగ్గు వేయడం** మాలాసనం, పద్మాసనం మోకాళ్లు, వెన్నెముక బలం ఏకాగ్రత, సృజనాత్మకత


**బట్టలు ఉతకడం** ఉత్కటాసనం, భుజంగాసనం చేతులు, భుజాలు, నడుము ఓర్పు, కష్టే ఫలి అనే తృప్తి


**కసువు ఊడవడం** అధోముఖ శ్వానాసనం రక్తప్రసరణ, జీర్ణశక్తి ఇల్లు శుభ్రం అయ్యిందనే ప్రశాంతత


**రుబ్బురోలు తిప్పడం** చక్రాసనం చేతులు, ఛాతి బలం సొంతంగా చేసుకున్నాం అనే ఆత్మవిశ్వాసం


**గిన్నెలు తోమడం** వజ్రాసనం అరిగే శక్తి, మణికట్టు కుటుంబం కోసం అనే సేవాభావం


వీళ్ళకి 'Yoga Mat' అవసరం లేదు. *నేలే యోగా మ్యాట్. ఇల్లే యోగా స్టూడియో. కుటుంబమే యోగా గురువు.*


### *చివరి మాట: నీ తప్పు కాదు, మనందరి తప్పు*


"ఇది పనిమనిషి పని" అని మనం అన్నప్పుడు, మనం ఒక తల్లి ప్రేమను అవమానించాం.


"Time Waste" అన్నప్పుడు, 5000 ఏళ్ల సైన్స్‌ను చెత్తబుట్టలో వేశాం.


*గుర్తుంచుకో:*


ఇంటి పని అనేది 'పని' కాదు. అది *'ప్రేమను పంచే పద్ధతి'*.


వంట చేయడం అంటే *'రుచిని కాదు, ఆయుష్షుని వడ్డించడం'*.


ఇల్లు శుభ్రం చేయడం అంటే *'చెత్తను కాదు, చెడు ఆలోచనల్ని బయటకు ఊడవడం'*.


ఇకనుంచి ఎవరైనా "అమ్మా, నువ్వెందుకు ఇన్ని పనులు చేస్తావ్?" అని అడిగితే ఇలా చెప్పు:


*"నేను పనులు చేయడం లేదు నాన్నా. నేను నా ఇంటికి, నా ఒంటికి, నా వాళ్లకి యోగం చేస్తున్నాను. ఇది నా పూజ."*


ఎందుకంటే *భారతీయ సంస్కృతిలో 'పని' వేరు, 'సేవ' వేరు.*


పని చేస్తే అలసట వస్తుంది. సేవ చేస్తే ఆనందం వస్తుంది.


మన అవ్వలు 90 ఏళ్ళు బతికింది జిమ్‌కి వెళ్లి కాదు, *ఇంటినే గుడిగా, పనినే యోగంగా* మార్చుకుని.


మరి రేపటి నుంచి మీ ఇంట్లో 'పని' ఉంటుందా? లేక 'యోగం' మొదలవుతుందా? ఆలోచించండి.

శుభోదయం

పంచాంగం

 🕉️ శ్రీ గురుభ్యోనమః 🙏


☘️ రేపటి పంచాంగం ☘️


🌹 శ్రీరస్తు 卐 శుభమస్తు 🚩 అవిఘ్నమస్తు 💐


బుధవారం, జూన్ 17, 2026

శ్రీ పరాభవ నామ సంవత్సరం

ఉత్తరాయణం - గ్రీష్మ ఋతువు

నిజ జ్యేష్ఠ మాసం - శుక్ల పక్షం

తిథి:తదియ రా2.09 వరకు

వారం:బుధవారం(సౌమ్యవాసరే)

నక్షత్రం:పునర్వసు సా6.00 వరకు 

యోగం:ధృవం రా1.44 వరకు

కరణం:తైతుల మ3.16 వరకు తదుపరి గరజి రా2.09 వరకు


వర్జ్యం:ఉ6.45 - 8.15 మరల రా1.34 - 3.05

దుర్ముహూర్తము:ఉ11.34 - 12.26

అమృతకాలం:మ3.45 - 5.15

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00


సూర్యరాశి:మిథునం

చంద్రరాశి:మిథునం 


సూర్యోదయం:5.29

సూర్యాస్తమయం:6.31


సాధు దేశీ గోమాతను పూజించండి

సాధు దేశీ గోమాతను సంరక్షించండి 


శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వేద విద్యాలయము - నరసాపురం, ఆంధ్రప్రదేశ్ - 534 275



శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం శృంగేరి, చిక్‌మగళూరు జిల్లా, కర్ణాటక 577 139 ఆధ్వర్యంలో దినదినాభివృద్ధి చెందుతోంది.

కృష్ణుడు చెప్పిన “చిలుక గూడు

 🕉️ కృష్ణుడు చెప్పిన “చిలుక గూడు నీతి కథ” 🕉️


ఒకసారి సాయంత్రం సమయం. యమునా నది తీరంలో భక్తులు అందరూ కూర్చుని ఉన్నారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో కృష్ణుడు తన మధురమైన చిరునవ్వుతో భక్తులను చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక భక్తుడు వినమ్రంగా అడిగాడు:


“ప్రభూ! మనిషి జీవితంలో జ్ఞానం ఎందుకు అంత ముఖ్యము? తెలియక చేసే తప్పులు ఎలా మన జీవితాన్ని మార్చేస్తాయి?”


కృష్ణుడు చిరునవ్వు నవ్వి ఒక చిన్న కథ చెప్పడం ప్రారంభించాడు.


ఒక అడవిలో ఒక చిన్న చిలుక ఉండేది. ఆ చిలుక చాలా అమాయకం. అది ఒక పెద్ద చెట్టుపై గూడు కట్టుకుని ఆనందంగా జీవించేది. ప్రతి రోజు ఉదయం పాడుతూ ఆకాశంలో ఎగిరేది, సాయంత్రం తన గూడు దగ్గరకు వచ్చి విశ్రాంతి తీసుకునేది.


ఒక రోజు ఆ అడవిలో ఒక వేటగాడు వచ్చాడు. అతను పక్షులను పట్టుకోవడానికి ఒక వల వేసి వెళ్లిపోయాడు. ఆ వల చెట్టు క్రింద పడివుండేది.


అది చూసిన చిలుకకు ఆసక్తి కలిగింది. “ఇది ఏమిటి?” అని ఆలోచిస్తూ దగ్గరకు వెళ్లింది. అది వల అని తెలియక ఆ వలపైకి ఎగిరి కూర్చుంది. వెంటనే వల బిగుసుకుని చిలుక చిక్కుకుంది.


అప్పుడు చిలుక చాలా బాధపడింది. “అయ్యో! నేను తెలిసి ఉంటే ఈ వల దగ్గరకు రానే రాను. తెలియక చేసిన ఒక చిన్న తప్పు నా స్వేచ్ఛను తీసుకుంది!” అని విచారించింది.


కొద్దిసేపటికి వేటగాడు వచ్చి చిలుకను తీసుకుపోయాడు.


కథ ముగిసిన తరువాత కృష్ణుడు భక్తులను చూస్తూ ఇలా చెప్పాడు:


“మనుషుల జీవితమూ ఈ చిలుకలాంటిదే. తెలియక చేసిన చిన్న తప్పు కూడా పెద్ద బంధనానికి కారణం అవుతుంది.


అందుకే జ్ఞానం చాలా ముఖ్యము. జ్ఞానం ఉన్నవాడు ప్రమాదాన్ని ముందే గుర్తిస్తాడు. జ్ఞానం లేని వాడు మాత్రం ఆపదలో పడిన తరువాత మాత్రమే పశ్చాత్తాపపడతాడు.”


భక్తులు ఆ మాటలు విని లోతుగా ఆలోచించారు. వారికి ఒక గొప్ప సత్యం అర్థమైంది.


✨ నీతి (Moral):


జ్ఞానం మనిషికి రక్షణ. తెలియక చేసే పనులు జీవితంలో బంధనాలకు దారి తీస్తాయి. కాబట్టి ప్రతి పని చేసే ముందు జ్ఞానం మరియు వివేకంతో ఆలోచించాలి.

మరణం

 #మరణం : ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చింది. చుట్టూ చూశాడు. చేతిలో పెట్టెతో యమధర్మరాజు తన దగ్గరకు వచ్చాడు. చనిపోయిన మనిషికీ భగవంతుడుకి మధ్య సంభాషణ ఇలా సాగింది. 


యమధర్మరాజు : మానవా.. నీ శరీరం పడిపోయింది. ఇక ఈ జన్మ ముగిసింది. నాతో పద.


మనిషి: అయ్యో ఇంత త్వరగానా? నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను స్వామీ!


యమధర్మరాజు : తప్పదు నాయనా! నీవు నాతో రావాల్సిన సమయం వచ్చింది. నడు.


మనిషి: నాకోసం తెచ్చిన ఆ పెట్టె ఇటివ్వండి. ఏం తెచ్చారో చూస్తాను


యమధర్మరాజు : నీకు చెందినవి ఉన్నాయి.


మనిషి: నావా? అంటే నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవా?


యమధర్మరాజు : అవెప్పటికీ నీవి కావు. అవన్నీ భూమివే. అక్కడే ఉంటాయి


మనిషి: పోనీ నా జ్ఞాపకాలున్నాయా దాన్లో?


యమధర్మరాజు : కాదు. జ్ఞాపకాలనేవి కాలానికి చెందినవి. కాలగర్భంలోకి వెళ్లిపోతాయి


మనిషి: అయితే నా ప్రతిభ, ప్రజ్ఞ ఉండి ఉంటాయి!


యమధర్మరాజు : అవి పరిస్థితులవి నీవి కావు 


మనిషి: నా స్నేహితులున్నారా అందులో?


యమధర్మరాజు : వారు కేవలం నీతో కొద్ది దూరం కలిసి వచ్చే తోటి ప్రయాణికులు మాత్రమే


మనిషి: హూం..నా భార్య, బిడ్డలునా?


యమధర్మరాజు : వారు నీతో కలిసి ఒక నాటకంలో పాల్గొన్న పాత్రధారులు


మనిషి: అయితే నీవద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండుండాలి!


యమధర్మరాజు : తప్పు. నీ శరీరం థూళికి చెందినది. మట్టిలో పడుతుంది.


మనిషి: స్వామీ అయితే నా ఆత్మా?


యమధర్మరాజు : ఆత్మ నీదెలా అవుతుంది. అది నాది.


మనిషి: ఆ పెట్టె ఇటివ్వు స్వామి అని తీసుకుని తెరిచి చూశాడు. కళ్లలో నీళ్లు సుడులు తిరిగాయి. ఆపెట్టె ఖాళీగా ఉంది.


మనిషి కాలం చెస్తే తనతో తీసుకువచ్చేది ఏదీ ఉండదు అని చెప్పేందుకే దేవుడు ఈ ఖాళీ పెట్టె తెచ్చాడని అర్థం అయింది. బతికున్నంత కాలం నా వాళ్లు, అవన్నీ నావే, ఇవన్నీ నాకే అని ఆశతో, ఆరాటంతో పరుగుతు పెడుతూ పరమాత్మ స్మరణ మరిచాను అని దుఖిఃతుడయ్యాడు.


మనిషి: స్వామీ చివరగా అడుగుతున్నాను. నాది అనేది ఏమైనా ఉందా అసలు?


యమధర్మరాజు : ఉంది. నీవు జీవించినంతకాలం ప్రతి క్షణం నీదే.


 ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి, చెడు యొక్క పర్యవసానాలు నీకే చెందుతాయి. అందుకే ప్రతిక్షణం మంచిని పంచాలి, పెంచాలి, భగవన్మామం స్మరించాలి. పశ్చాతాపులను క్షమించాలి. 


 తోటివారి నుంచి మనకి సంక్రమించే చెడును విసర్జించాలి, మానవసేవ-మాధవసేవలను గుర్తించి జీవించాలి.

మందు షాపు లిచ్చు మాత్రలే

 మందు షాపు లిచ్చు మాత్రలే మింగేసి

పోయె జబ్బు లనుచు పొంగిపోకు

తెలియకెదిగి జబ్బు తిక్కనే దీర్చురా

సకురు అప్ప రావు సత్య మిదిర! 


భావం: ఏ బాధ వచ్చినా, ఇంగ్లీష్ మందుల షాపు నుంచి ఏదో ఒక టెంపరరీ మాత్ర ఒకటి తెచ్చుకొని వేసేసుకుని, ఆహా! భలే తగ్గిపోయిందనుకుని, సంతోషపడిపోవద్దు! అది తగ్గిస్తున్నది నిజంగా జబ్బుని కాదు! ఆ జబ్బు ఒక బాధ ద్వారా తనకేమి కావాలో, తను భవిష్యత్తులో ఎటువంటి విపత్తులోకి వెళుతుందో, తనదైన భాషలో చెబుతూ, పన కేమి కావాలో అడుగుతుంది! అది ఒక మూగవాడి సైగల భాషలాగా రకరకాల లక్షణాలతో తెలియజేస్తూ ఉంటుంది! అటువంటి ఆ భాషలో ఉండే లక్షణాలను అర్ధం చేసుకుని, ఆ రాబోయే ఉపద్రవాన్ని నివారించగలిగే శక్తి హోమియో వైద్యానికి ఉంది! మెషీన్లు కనిపెట్టలేని క్లిష్టమైన సమస్యలను సైతం హోమియోలో అవలీలగా గుర్తించి, నయం చేయవచ్చు! శరీర భాషను తెలిసిన ఏకైక వైద్యం హోమియో మాత్రమే! కాబట్టి టెంపరరీ ఇంగ్లీషు మాత్రలతో సమస్యలు ముదరబెట్టుకుని ఆపదలపాలవ్వకుండా, మంచి హోమియో వైద్యుల సహాయంతో ప్రతీ బాధనూ సవ్యంగా నయం చేయించుకోండి! టెస్ట్ లూ, స్కానింగ్ ల చుట్టూ తిరిగి టైమ్, డబ్బులూ వేస్ట్ చేసుకోకుండా, సింపుల్ గా శరీర లక్షణాలను బట్టి వ్యాధులను నయం చేయగలిగే మంచి హోమియో వైద్యుల దగ్గరకు వెళ్ళండి! 

సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

అష్టాదశ పురాణాలు

 అష్టాదశ పురాణాలు - శ్రీ మత్స్య మహాపురాణం - కౌశిక పుత్రుల కథ - బ్రహ్మదత్తుడి చరిత్ర - ముప్పై రెండవ భాగం

__________________________________________________

తీవ్రమైన అనావృష్టిలో ఆకలితో అలమిటిస్తున్న కౌశికుని పుత్రులు ఏడుగురు "మేపడానికి తీసుకువచ్చిన గురువు గర్గ మహర్షి ఆవు దూడలలో ఆవుని చంపి ఆకలి తీర్చుకుందామని, గురువు గారికి ఆవును అడవిలో పులి చంపి తినేసిందని చెప్పి దూడను ఇచ్చేదామని" నిర్ణయించుకున్నారు.


కడపటి వాడైన పితృవర్తి "గోహత్య మహాపాతకం, వద్దని చెప్పినా అన్నలు ఆరుగురు వినకపోవడంతో అలోచించి "అన్నల్లారా! గోవుని చంపక తప్పని పరిస్థితిలో పితృశ్రాద్ధము చేద్దాం. పితరుల శ్రాద్ధంలో గోవధ పాపం మనకంటదు" అని చెప్పడంతో సరేనని అన్నలు ఆరుగురుఅంగీకరించారు.


పితృవర్తి పితృశ్రాద్ధ కార్యం ఆరంభించి విశ్వదేవతల స్థానంలో ఇద్దరిని, పితరుల స్థానంలో ముగ్గురిని, అతిథిగా ఒకరిని చేశాడు. తను శ్రాద్ధకర్త అయ్యి మంత్రపూర్వకంగా భక్తితో శ్రాద్ధం నిర్వహించాడు. ఆవుని చంపి ఆవుమాంసం పితరులకు అర్పించి, తాము ప్రసాదంగా స్వీకరించి ఏడుగురు అన్నదమ్ములు క్షుద్బాధను తీర్చుకున్నారు.


ఆశ్రమానికి తిరిగి వెళ్లి దూడను గురువుగారికి అప్పగించి "అడవిలో పులి దాడి చేసి ఆవుని చంపివేసింది. దూడను రక్షించి తీసుకువచ్చాము" అని అసత్యం పలికారు. గురువు గారైన గర్గాచార్యుడు వారిని చెప్పినది విశ్వవించాడు.


సమయం గడచి పోయింది. ఏడుగురు కౌశికుని కుమారులు కాలధర్మం ననుసరించి మరణించారు. మరుసటి జన్మలో దాశపురంలో బోయలుగా జన్మించారు. పితృశ్రాద్ధం భక్తి శ్రద్థలతో జరపడం వలన వారికి పూర్వజన్మ జ్ఞానము మరచిపోకుండా గుర్తుంది. వారు "శ్రాద్ధకర్మ చేసినా క్రూరకర్మ కావడంతో ఈజన్మలో జంతువులను వేటాడే బోయలుగా జన్మించాము" అని తెలుసుకున్నారు.


పూర్వజన్మలో చేసిన క్రూరకర్మకు పశ్చాత్తాపం చెంది విరక్తులై నిరాహార దీక్ష చేసి బోయ శరీరాలను పరిత్యాగం చేశారు. మరుసటి జన్మలో ఏడుగురు కాలంజర పర్వత అడవులలో జాతిస్మృతి అనగా పూర్వజన్మల జ్ఞానము గల మృగాలుగా జన్మించారు. ఈ జన్మలో కూడా జ్ఞాన వైరాగ్యాలతో శివుని కొలుస్తూ ధర్మబద్దంగా జీవించి మరణించారు.


తరువాత జన్మలో యోగనిష్ట గల చక్రవాక పక్షులుగా మానస సరస్సులో జన్మించారు. వారిలో ముగ్గురు విహరిస్తూ పాంచాలదేశంలోని ఉద్యానవనం చేరారు. అదే సమయంలో పాంచాల రాజు విభ్రాజుడు తన రాణులతో విహరిస్తూ సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. చక్రవాక పక్షిగా ఉన్న పితృవర్తి ఆ రాజుని, అనుభవిస్తున్న రాజవైభోగాలను చూసి వచ్చే జన్మలో తను రాజుగా పుట్టాలని కోరుకున్నాడు.


మిగిలిన ఇద్దరు మహాబలం వాహనాదులు గల మంత్రులను చూసి మరుసటి జన్మలో మంత్రులుగా పుట్టాలి అనుకున్నారు. మానస సరోవరం వద్ద ఉన్న మిగిలిన నలుగురు ఏ కోరికలు లేకుండా భక్తితో భగవంతుని సేవించారు. కాల పరిభ్రమణంలో ఏడుగురు చక్రవాక పక్షి జన్మలు ముగించి మరణించారు.


రాజుగా జన్మించాలని కోరుకున్న పితృవర్తి పాంచాల రాజు విభ్రాజునికి కుమారుడిగా జన్మించాడు. బ్రహ్మదత్తుడు అనే నామంతో ప్రసిద్ధి చెందాడు. మంత్రులుగా పుట్టాలనుకున్న ఇద్దరు విభ్రాజుని మంత్రికి కండరీక, సుబాహులు అనే పేర్లతో పుత్రులుగా జన్మించారు. ఏ కోరికలు లేకుండా మరణించిన మిగిలిన నలుగురు బ్రాహ్మణులుగా జన్మించి ద్విజోత్తములు అయ్యారు.


విభ్రాజుని తరువాత బ్రహ్మదత్తుడు రాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు. కండరీక సుబాహులు బ్రహ్మదత్తుడికి మంత్రులు అయ్యారు. బ్రహ్మదత్తుడు సకల శాస్త్రాలలో నిష్ణాతుడు, పరాక్రమశాలి, బలవంతుడు, యోగవేత్త కావడమే కాకుండా విష్ణుమూర్తి అనుగ్రహంతో సమస్త ప్రాణుల (మృగ జంతు పశు పక్ష్యాదుల) బాషలు తెలిసిన నిపుణుడు అయ్యాడు.


శ్రాద్దకార్యంలో చంపబడిన కపిల గోవు (ఆవు) దేవలుడనే రాజుకు 'సన్నతి' అని కుమార్తెగా జన్మించి బ్రహ్మదత్తునికి భార్య అయ్యింది. బ్రహ్మదత్తుడు భార్యతో చక్కని దాంపత్యం చేస్తూ ధర్మబద్దంగా రాజ్య పాలన చేస్తున్నాడు. ఒకనాడు రాజదంపతులు ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. పక్షులు క్రిమి కీటకాదుల భాష తెలిసిన బ్రహ్మదత్తునికి వనంలో పోట్లాడుకుంటున్న చీమల దంపతుల సంభాషణ వినిపించింది.


కోపంతో ఉన్న భార్య చీమను భర్త కోపం వదలమని అనేక విధాలుగా పొగడుతూ బ్రతిమాలుతున్నాడు. భార్య చీమ కోపంగా చూస్తూ "నిజంగా నామీద ప్రేమ ఉన్నవాడివే అయితే నిన్న నీవు సంపాదించిన లడ్డుపొడిని వేరే ఆడ చీమకు ఎందుకు ఇచ్చావు!" అని అడిగింది. దానికి భర్త చీమ "నన్ను క్షమించు! ఆ చీమ అచ్చం నీలాగే ఉంది. నీవే అనుకుని ఇచ్చాను. వేరే ఉద్దేశం ఏమి లేదు. ఇంకెప్పుడూ చేయను" అని కాళ్లు పట్టుకుని బ్రతిమాలాడు. భార్య చీమ కోపం వదలి ప్రసన్నురాలైంది. ఇద్దరు కలసి ఆనందంగా చీమల పుట్టలోకి వెళ్లి పోయారు.


విష్ణువు అనుగ్రహం వలన సమస్త ప్రాణుల సంభాషణలు తెలిసిన బ్రహ్మదత్తుడు ఆ చీమల సంభాషణలు విని ఆశ్చర్యం చెందాడు.


శౌనకాది మునులు సూత మహర్షి భాషణం ఆపి "మహర్షీ! సకల జీవుల సంభాషణలు వినే విద్య బ్రహ్మదత్తుడు ఎలా పొందగలిగాడు. బ్రాహ్మణులుగా పుట్టిన నలుగురు కౌశిక పుత్రులు ఏం చేశారు? ఏమయ్యారు?" అని అడిగారు.


రేపటి భాగంలో ఆ కధ చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి చరిత్ర🛕🌞🙏🏻

 అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి చరిత్ర🛕🌞🙏🏻


📍 స్థలం: అరసవల్లి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్


🛕 ఆలయ విశేషాలు:

• వయసు: 7వ శతాబ్దంలో తూర్పు చాళుక్య రాజు దేవేంద్రవర్మ నిర్మించారు. అంటే 1300+ ఏళ్ల చరిత్ర ఉన్న పురాతన ఆలయం ఇది. • విగ్రహం ప్రత్యేకత: ఇక్కడ స్వామి వారు నిలబడి ఉన్న భంగిమలో, 5 అడుగుల ఎత్తు నల్లరాతి విగ్రహం. రెండు చేతుల్లో తామర పువ్వులు, పక్కన ఉష, ఛాయ, పద్మిని దేవేరులతో దర్శనమిస్తారు. • శాస్త్ర అద్భుతం: ప్రతి సంవత్సరం మార్చి 9, 10 & అక్టోబర్ 1, 2 తేదీలలో ఉదయం సూర్య కిరణాలు నేరుగా గర్భగుడిలో స్వామి వారి పాదాలను తాకుతాయి. దీన్ని కిరణోత్సవం అంటారు. ఇది చూడటానికి లక్షల మంది వస్తారు. • స్థల పురాణం: ఇంద్రుడు శాప విమోచనం కోసం ఇక్కడ సూర్య భగవానుడిని ప్రతిష్టించాడని పురాణ కథనం. • ప్రత్యేకత: భారతదేశంలో కోణార్క్ తర్వాత అత్యంత ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం ఇదే. ఆదివారం నాడు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల నమ్మకం. 

🙏 దర్శన సమయాలు: ఉదయం 6:00 నుండి రాత్రి 8:00 వరకు  

🎉 ప్రధాన పండుగ: రథసప్తమి - సూర్య జయంతి. ఆ రోజు లక్షలాది మంది వస్తారు.


మన తెలుగు నేల మీద ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలి.  

ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః 🙏


               జై శ్రీరామ్ జై హనుమాన్

                                   

                       సదా మీ సేవలో 

         I am nothing without all of you" 

                  *_🌻శుభమస్తు🌻_*

                              ఇట్లు

                                మీ

                         భవధీయుడు

                అవధానుల శ్రీనివాస శాస్త్రి 

                  ❀┉┅━❀🕉️❀┉┅━❀

           🙏సర్వే జనాః సుఖినోభవంతు🙏

          🙏లోకాస్సమస్తా సుఖినోభవంతు🙏

           🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

             👀👀👀👀👀👀👀👀👀👀👀