13, మే 2026, బుధవారం

గురువారం🌷* *🌹14, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

      *🌷గురువారం🌷*

    *🌹14, మే, 2026🌹*  

    *దృగ్గణిత పంచాంగం* 

               

           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : ద్వాదశి* మ 11.20 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం    : గురువారం* (బృహస్పతివాసరే)

*నక్షత్రం  : రేవతి* రా 10.34 వరకు ఉపరి *అశ్విని*

*యోగం : ప్రీతి* రా 05.53 వరకు ఉపరి *ఆయుష్మాన్*

*కరణం  : తైతుల* మ 11.20 *గరజి* రా 10.00 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 01.00 - 02.00 సా 04.00 - 06.00*       

అమృత కాలం  : *రా 08.20- 09.49*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ప 11.25 - 12.54*

*దుర్ముహూర్తం  : ఉ 09.55 - 10.47 మ 03.04 - 03.56* 

*రాహు కాలం   :మ01.41- 03.17*

గుళికకాళం      : *ఉ 08.51 - 10.27*

యమగండం    : *ఉ 05.37 - 07.14*

సూర్యరాశి : *మేషం*                   

చంద్రరాశి : *మీనం/మేషం*

సూర్యోదయం :*ఉ 05.45* 

సూర్యాస్తమయం :*సా 06.41*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.37 - 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం   :*మ 01.21- 03.56*

*ఆబ్ధికం తిధి        : వైశాఖ బహుళ త్రయోదశి*

సాయంకాలం    :*సా 03.56- 06.31*

ప్రదోష కాలం      :*సా 06.31- 08.44*

రాత్రి కాలం        :*రా 08.44 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.08 - 04.52*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🌹🕉️ఓం శ్రీ సద్గురుబ్యోనమః.🕉️🌹*


      *శత్రునాశకరం స్తోత్రం* 

     *జ్ఞానవిజ్ఞానదాయకమ్*

           

  *ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*



       *శ్రీ మహావిష్ణు పురాణం*                                  

               *87వ భాగం*


      *శ్రీరామావతారం-8*


       *రావణ సంహారం*```


లంకకు సీతాదేవిని రావణుడు తీసుకువెళ్లి ఆశోకవనంలో 

బందీగా రాక్షస స్త్రీల మధ్య ఉంచాడు. సీత మనస్సు మార్చి తనను భర్తగా అంగీకరించేట్టు చేయడానికి రావణుడు అనేక విఫల ప్రయత్నాలు చేసాడు. సీతాదేవి రావణుని గడ్డిపోచగా తృణీకరించి “తనభర్తరాముడేనని, త్వరలో అన్వేషించి రావణుని సంహరించి తీసుకువెళ్ళతాడని, ప్రాణాలు కావాలంటే తనను మర్యాదగా రామునికి అప్పగించ మని" హెచ్చరించింది.


రావణుడు ఆగ్రహంతో సీతకు మనస్సు మార్చుకోవడానికి పన్నెండు మాసాలు గడువు ఇచ్చాడు. మనస్సు మార్చుకోక పోతే ఆమెను చంపి కాపలా ఉన్న రాక్షస స్త్రీలకు ఆహారంగా వేస్తానని హెచ్చరించి వెళ్లి పోయాడు.


సీతాన్వేషణ చేస్తున్న రామలక్ష్మణులు శబరిమాతసూచించినట్లు ఋష్యమూక పర్వతం వైపు బయలుదేరి వెళ్లారు. 


పర్వతంపైనుండి ధనుర్బాణములు ధరించివస్తున్న రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు "అన్న వాలి తనను చంపడానికి పంపించిన వీరులని" ఆందోళన చెందాడు. 


సుగ్రీవుని మంత్రి అయిన హను మంతుడు "నేనువిషయంతెలుసుకు వస్తానని" భరోసాఇచ్చి బ్రాహ్మణుని వేషంలో రామలక్ష్మణుల వద్దకు వెళ్లి వివరాలు అడిగాడు.


లక్ష్మణుడు "తాము అయోధ్య రాజకుమారులైన రామలక్ష్మణులమని, వనవాసంలోఉన్న తమను మోసం చేసి వదినగారైన శ్రీరాముని పత్ని సీతాదేవిని రావణుడు అపహరించాడని, సీతాన్వేషణలో శబరి మాత సూచన ప్రకారం సుగ్రీవుని సహాయం కోరుతూ వచ్చామని" చెప్పాడు.


ఆరాధ్యునిగా చిన్నతనం నుండి మనస్సులో కొలుస్తున్న శ్రీరాముడు ఎదురుగా కనపించేసరికి హనుమంతుడు మహదానంద భరితుడు అయ్యాడు. నిజరూపం దాల్చి "తనను సుగ్రీవుని మంత్రి హనుమంతుడిగా" పరిచయం చేసుకున్నాడు. 


కలలో కనిపించిన శ్రీరాముని బాల్యం నుండి ప్రభువుగా ఆరాధిస్తున్న సేవకుడనని, దర్శన భాగ్యం ఇన్నాళ్లకు కలిగిందని శ్రీరాముని పాదాలకు భక్తితో నమస్కరించాడు. 


రాముడు ఆంజనేయుని లేపి ఆలింగనం చేసుకున్నాడు.


హనుమంతుడు తన ఆకారం పెంచి రామలక్ష్మణులను భుజాల పై ఎక్కించుకుని ఋష్యమూక పర్వతం పైన గల సుగ్రీవుని వద్దకు తీసుకువెళ్లాడు. సుగ్రీవునితో మైత్రి కోసం వచ్చారని అయోధ్య రాజకుమారులు శ్రీరామలక్ష్మణులను పరిచయం చేసాడు. 


శ్రీరాముడు "రావణుడు తన భార్య సీతను మోసంతో అపహరించాడని, సీతాన్వేషణలో సహాయం చేయమని" సుగ్రీవుని అడగగా సుగ్రీవుడు "అన్నగారైన వాలి తనను అనుమానించి రాజ్య బహిష్కరణ చేసి, తన భార్య రుమను బలవంతంగా చెఱపట్టడమే కాకుండా తనను చంపడానికి ప్రయత్నం 

చేస్తున్నాడని" తన గురించి చెప్పాడు. 


అగ్నిసాక్షిగా రామ సుగ్రీవులు మైత్రీబంధం ఏర్పరచుకుని ఒకరికొకరు సహాయం చేసుకుంటామని ప్రమాణం చేసారు.


రావణుడు సీతాదేవిని పుష్పక విమానంలో తీసుకువెళుతున్నప్పుడు రామునికి తన జాడతెలియజేయాలని జారవిడిచిన ఆభరణాల మూట ఋష్యమూక పర్వతం పైన పడ్డాయి. సుగ్రీవుడు ఆ మూట తెచ్చి ఆ ఆభరణాలను "ఒక స్త్రీని రాక్షసుడు బంధించి ఆకాశమార్గాన దక్షిణ దిశ వైపు తీసుకు వెళ్లుతునప్పుడు రక్షించ మని వేడుకుంటూ కిందకి పడ వేసింది" అని రాముడికి చూపించాడు.


రాముడు ఆ ఆభరణాలు సీతవేనని గుర్తు పట్టి బాధపడ్డాడు. సీతను ఎక్కడ దాచినా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ముందుగా సుగ్రీవుని సమస్య పరిష్కరిస్తానని వాలిని ద్వంద్వ యుద్దానికి పిలవమని చెప్పి పంపాడు. వాలి సుగ్రీవులు యుద్దం చేస్తుండగా సమయం చూసి చెట్టు చాటు నుండి బాణం వేసి వాలిని సంహరించాడు. లక్ష్మణుని సుగ్రీవుని వెంట కిష్కింధకు పంపి వానర రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు. వానకాలం ముగిసిన పిమ్మట సీతాదేవి అన్వేషణ ప్రారంభించుదామని, అందుకు వానరులను సమీకరించి సిద్దం చేయమని చెప్పాడు.


వానకాలం తరువాత సుగ్రీవుడు సమీకరించిన వానర సేనలను నాలుగు భాగాలుగా చేసి నాలుగు దిక్కులకు సీతాన్వేషణ నెలలోపు చేసి రమ్మని పంపారు. దక్షిణదిశ వైపు వెళుతున్న హనుమంతునికి రాముడు తన అంగుళీయకము గుర్తుగా సీతాదేవికి చూపించమని ఇచ్చి పంపాడు. 


సీతాదేవిని వెతుకుతూ దక్షిణ సముద్ర తీరం చేరిన హనుమంతుడి బృందానికి జటాయువు అన్న శంపాతి అక్కడకు సముద్రంలో వందయోజనాల దూరంలో ఉన్న లంకలో రావణుడు సీతను బంధించి ఉంచాడన్న సంగతి తెలిపాడు.


హనుమంతుడు గాలిలో ఎగిరి దక్షిణ సముద్రాన్నిఆకాశమార్గాన దాటి లంక చేరి సీతాదేవి జాడ కనుగొని ఆమెకు రాముడు ఇచ్చిన ఉంగరం ఇచ్చి త్వరలో రాముడు వానర సేనలతో వచ్చి రావణుని సంహరించి ఆమెను తీసుకు వెళతాడని భరోసా ఇచ్చాడు. రామునికి గుర్తుగా చూపించడానికి సీతాదేవి నుంచి చూడామణి ని తీసుకున్న హనుమంతుడు లంకలో విధ్వంసం సృష్టించి బందీగా రావణుని కలిసి బతికి ఉండాలంటే సగౌరవంగా సీతను రామునికి అప్పగించమని సలహా ఇచ్చాడు.


తిరస్కరించిన రావణుడు విభీషణుని సూచనపై చంపకుండా తోకకు నిప్పు పెట్టి హనుమంతుని వదిలి వేశాడు. హనుమంతుడు ఆ నిప్పుతో సగం లంకను ఆయుధాగారాలతో సహా కాల్చి వేసాడు. కిష్కింధకు తిరిగి వచ్చి రామునికి సీతజాడగురించి చెప్పి చూడామణి ఇచ్చాడు. రాముడు హనుమంతుని కౌగిలించుకుని భరతునితో సమానంగా సోదరుడిని చేసుకున్నాడు.


రామలక్ష్మణులు సుగ్రీవుడి వానర సేనలతో కలసి దక్షిణ సముద్ర తీరం చేరి సముద్రం పై వారధి నిర్మించి లంక చేరారు. సీతను అప్పగించి యుద్దం నివారించమన్న తమ్ముడు విభీషణుని రావణుడు ఆగ్రహంతో రాజ్యం నుండి బహిష్కరించాడు. విభీషణుడు రాముని వద్దకు వెళ్లి శరణు కోరాడు. విభీషణుని రాముడు ఆదరించి రావణ సంహారం తరువాత లంకకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాడు.


ఆఖరి ప్రయత్నంగా చేసిన అంగద రాయబారం విఫలం అవ్వడంతో రామరావణ సంగ్రామం ఆరంభమైంది. రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు మొదలైన కుమారులు, బంధువులు, సేనాధిపతులు, ఆశేష రాక్షస సైన్యం యుద్దంలో మరణించారు. చివరకు రావణుడు కూడా ఘోర యుద్దంచేసి రాముడి బాణానికి నేల కూలాడు. చని పోబోతున్న చివరి క్షణాలలో రాముని నారాయణుడుగా గుర్తించాడు. సనకసనందాది మునుల శాపానికి గురై నారాయణుని శత్రువులుగా జన్మించిన రెండవ జన్మ ముగిసినందుకు రామునికి మనస్సులో నమస్కరిస్తూ ప్రాణాలు వదిలేశాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుకుందాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁*



*🙏శ్రీ హనుమాన్ చాలీసా🍁* 

*🍁జ్ఞాన యజ్ఞం - 9వ  రోజు 9🌹*


నిన్న మనం హనుమంతుని దివ్యమైన తేజస్సును, శివాంశ సంభూతుడైన ఆయన వైభవాన్ని తెలుసుకున్నాం. ఈరోజు హనుమంతుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, ఆయన ఎంతటి బుద్ధిమంతుడో, రామకార్యం పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ ఎటువంటిదో ఈ ఏడవ చౌపాయి ద్వారా దర్శించుకుందాం.


          **ఏడవ చౌపాయి**


 **బిద్యావాన గుణీ అతి చాతుర |**

 **రామ కాజ కరిబే కో ఆతుర ||**


         **ప్రతిపదార్థం**


  * **బిద్యావాన (విద్యావాన్)** సకల విద్యలు తెలిసినవాడా (మహాపండితుడా)!

  * **గుణీ** సద్గుణములు కలవాడా!

  * **అతి చాతుర** అత్యంత సమయస్ఫూర్తి, నేర్పు (చతురత) కలవాడా!

  * **రామ కాజ** శ్రీరామచంద్రుని పనులను

  * **కరిబే కో** చేయడానికి

  * **ఆతుర** ఎల్లప్పుడూ ఉత్సాహముతో (ఆతురతతో) ఉండేవారు.


 **విస్తృత ఆధ్యాత్మిక వివరణ**


**1. బిద్యావాన & గుణీ (విద్య మరియు సంస్కారం)**


హనుమంతుడు నవవ్యాకరణ పండితుడు.సూర్యభగవానుడి వద్దే సకల శాస్త్రాలను అభ్యసించిన జ్ఞాని.*అనేన బహుధాశ్రుతం* – ఇతను చాలా విద్యలు తెలిసినవాడని రామచంద్రమూర్తి మొట్ట మొదటి సారి సాదు వేషంలో హనుమ రామ లక్షణులను కలిసిన సమయంలో అంటాడు చతుర్వేదాలు, వేదాంగాలు తెలిసినవాడు.ఎలా తెలుసు అంటే 


ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన సందర్భం లో దేవతలందరూ తమ బలాలను హనుమకు ఇచ్చినప్పుడు సూర్యభగవానుడు - "నా తేజస్సులో నూరవ భాగాన్ని ఈయనకు ఇస్తున్నానని" అన్నాడు. సూర్యతేజస్సులో నూరవభాగం హనుమంతునిలో ఎప్పుడూ ఉంటుంది.ఇతనికి చదువుకునే వయస్సు వచ్చినప్పుడు నేను విద్య నేర్పుతాను అంటాడు సూర్యభగవానుడు.సూర్యుడు సకల వేదాలు తెలిసిన వాడు, ఆయనకు నమస్కారం చేస్తే మనము కూడా సకల విద్యల్లో నిష్ణాతులు అవుతాం.


ఆంజనేయస్వామివారికి సూర్యుని వల్ల వర్చస్సు వచ్చింది ఆ విద్య కేవలం హనుమకు మాత్రమే పనికొచ్చిందా...! లోకానికి మేలు చేసిన వర్చస్సు. ఆ విద్యతో లోకానికి ఉపకారం చేశాడు ఆంజనేయస్వామి


భారతజాతికి హనుమంతుడు ఆదర్శం కావాలని స్వామి వివేకానంద చెప్పారు.


త్యాగము, శక్తి, బలము, దృఢత్వము, జ్ఞానము... ఇవన్నీ ఉండేలా మానవుడు తయారు కావాలి అంటే అవన్నీ ఉన్న హనుమనే ఉపాసన చేయాలి.


సూర్యభగవానుడు హనుమకు ఇచ్చింది విద్య. ఆ విద్యవల్ల వచ్చేది వర్చస్సు. ఆ వర్చస్సు పదిమందికి మేలు చేస్తే 'సు-వర్చస్సు'


హనుమకు 'సువర్చస్సు' సూర్యుని వల్ల వచ్చింది. సూర్యుని వల్ల వచ్చిందంటే - దేవతావ్యవస్థలో 'వారి నుండి వచ్చిన దానిని' - కూతురు/కొడుకు అంటారని చెప్పుకున్నాం. సూర్యుని నుండి వచ్చిన 'సువర్చస్సు' విద్య ద్వారా హనుమంతునకు వెళ్ళింది. హనుమ దాన్ని స్వీకరించి ధరించాడు.దీనినే సూర్యుడు తన కూతురైన సువర్చలను హనుమంతునకు ఇచ్చి పెళ్ళిచేశాడని మనకు అర్థం కావడం కోసం కథగా చెప్పారు. పురాణాలు అన్ని విశ్వ విజ్ఞాన రహస్యాలు. వాటిని సూక్ష్మ బుద్ధి తో అన్వయం చేస్తేనే అందులోని రహస్యాలు అర్దం అవుతాయి.


ఇలా సువర్చస్సు తో ఉన్న హనుమ ఉపాసన చేస్తే పర అపర అనే రెండు విద్యలు సిద్ధిస్తాయి.


ఆంజనేయస్వామివారు సూర్యపుత్రికయైన సువర్చలతో ఇప్పటికీ గంధమాదన పర్వతము మీద కదళీవన మధ్యంలో ఉష్ణ వాహనంపై ఉంటారు. ఉష్ట్రం అనగా ఒంటె ఒంటె హనుమంతుని వాహనమని మంత్రశాస్త్రం చెప్తోంది.


ఒంటె వాహనము, కదళీవనము అనగానే సువర్చలా సమేత ఆంజనేయ స్వామివారే దీనిని శక్తి సహిత ఉపాసన అంటారు.అలా హనుమ విద్యావాన్.


హనుమ వేద విద్యలు, వ్యాకరణం మాత్రమే కాదు సంగీతం లోనూ దిట్ట, త్రిశూల రోముడు అనే రాక్షసుడు దుర్భేద్యమైన గుహలో దాక్కుంటే హనుమ సంగీతం తో ఆ రాళ్ళు కరిగించి వాడిని సంహరించాడు. స్వయంగా నారద, తుంబురులే నీ అనుగ్రహం ఉంటే మేం బాగా పాడగలము అంటారు. అందుకు విద్యావాన్ స్వామికి తెలియని విద్య లేదు...


ఇంత విద్య ఉండటం ఒక్కటే కాదు గొప్ప గుణములు కలవాడు హనుమ, రామ కథ మొట్ట మొదట చెప్పింది హనుమ సుందర కాండ లో అశోక వనం లో చెట్టు పై కూచుని కొంత భాగం, దిగిన తర్వాత సీతమ్మను ఓదారుస్తూ ముందు జరగ బోవు కథ చెప్తాడు. అందుకే సుందరకాండ చదివితే రామాయణం చదివినట్టే.


తరగని జ్ఞానం తో పాటు అపార వినయం,ఉత్సాహం,బలం,విశ్వాసం, పరాక్రమం ఇలా ఒక్కటా సకల గుణాలకు ఆలవాలం స్వామి.


మహేంద్ర పర్వతం మీద నుండి ఎగురుతూ రామ బాణం లా లక్ష్యాన్ని సాధించే వస్తాను అని తన బలంగా కాకుండా రామ అనుగ్రహం గా చెప్తాడు. సీతమ్మ దొరక్క దిగులు చెంది నీరసించి పోతాడు మళ్ళీ తనను తానే ఉత్తేజ పరచుకుని వెతకి విజయం సాధిస్తాడు. లంకలో సీతమ్మ ను వెతికే ప్రయత్నం లో చూడకూడనీవి కొన్ని కనపడతాయి వీటి యందు నా మనస్సు లగ్నం కాలేదు కనుక దోషం లేదు అంటాడు.అంటే దేని మీద మనసు పెట్టాలో, ఎక్కడ ఎలా తనను తాను నిగ్రహించు కోవాలో తెలిసిన వాడు హనుమ.

అన్ని తెలిసినా సీతమ్మ దగ్గర నేను వానరులు అందరిలో అల్పుడిని అంటారు.అదీ గొప్ప గుణం.


చిన్న చిన్న పనులు చేసి అంతా నేనే చేశాము అనే మనం హనుమ నుండి ఈ గుణం నేర్చుకోవాలి అంతా రాముని అనుగ్రహం అంటాడు తప్ప తాను చేశాను అనడు,అదే గొప్ప గుణం.ఈ గుణం ఉన్నవాడికి లోకంలో తిరుగులేదు..


ఎంతటి జ్ఞానమున్నా అది సత్ప్రవర్తనతో తోడైనప్పుడే దానికి విలువ అని ఇది మనకు నేర్పుతుంది.


**2. అతి చాతుర (అసాధారణ చతురత)**


చాతుర్యం అంటే నేర్పరితనం. స్వామివారి నేర్పరితనాన్ని అనేక సందర్భాలలో జరిగిన ఘట్టాలలో పరిశీలించవచ్చు. తెలివితేటలు ఉండడమే కాదు, వాటిని ఎలా వినియోగించుకుంటున్నామనేది నేర్పరితనం. విద్య, జ్ఞానం గొప్పతనం వాటి వినియోగదశలో తెలుస్తుంది. దానినే వ్యవహారంలో చురుకుతనం, చలాకీతనమని

అంటారు, సురస ను ఓడించిన సందర్భంలో మనం ఇది చూడవచ్చు.క్లిష్ట పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ఆయనను చూసి నేర్చుకోవాలి.


**3. రామ కాజ కరిబే కో ఆతుర (సేవా తత్పరత)**


రామకార్యం చేయడంలో ఆత్రుత కలవాడు ఆతురత అంటే ఎలాగైనా సాధించాలి. సాధించేవరకూ నిద్రపోకూడదనుకోవడం అది హనుమ వద్ద రామ కార్యంలో కనబడుతుంది. మైనాకుడు కాసేపు ఆగి వెళ్ళవయ్య అంటే నాకు సమయం లేదు అని ముట్టుకుని ఆగకుండా ముందుకు వెళ్తాడు.


భగవంతుని సేవలో ఆయనకు ఉన్న ఆ ఉత్సాహం (ఆతురత) మనకు ప్రేరణ. ఏ పనినైనా వాయిదా వేయకుండా, అత్యంత ఆసక్తితో పూర్తి చేయాలనేది ఇక్కడి అంతరార్థం.


ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉన్నాయి,కానీ వివరణ మరీ పెద్దగా అవుతుంది అన్న ఉద్దేశ్యం తో ఇంతటితో ఆపుతున్నాను,మీకు ఇంత వివరణ కావాలా వద్ద కామెంట్ చేయండి👇


ఇన్ని విషయాలు చెపితే ఏదోక విషయం చాలీసా చదివే సమయంలో మనసులోకి వచ్చి నిలబడితే అదే అసలైన పారాయణ అనే ఉద్దేశ్యం తో ఇస్తున్నాను, పైగా రామాయణ స్మరణ, హనుమత్ కథల తో హనుమాన్ చాలీసా యజ్ఞం పరిపూర్ణం అవుతుంది అని. మీరెలా అంటే అలాగే ముందుకు పోదాం...


 **తులసీదాసు గారి సందేశం**


తులసీదాసు గారు ఈ చౌపాయి ద్వారా ఒక పరిపూర్ణ వ్యక్తిత్వానికి నిర్వచనం ఇచ్చారు. ఒక వ్యక్తికి **విద్య** ఉండాలి, ఆ విద్యకు **సద్గుణం** తోడవ్వాలి, లోకంలో బ్రతకడానికి **చాతుర్యం** ఉండాలి, వీటన్నింటికీ మించి భగవంతుని సేవలో **నిరంతర ఉత్సాహం** ఉండాలి. ఈ నాలుగు లక్షణాలు ఉన్నచోట విజయం తథ్యం.


*జై శ్రీరామ్!జై హనుమాన్!*

        🍁🌹🙏🌷🍁


         *🌷సేకరణ🌷*

      🌹🌷🍁🍁🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🍁🙏🍁🙏🍁🙏🍁🙏

12, మే 2026, మంగళవారం

ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

  ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

లోకంలో బంధువులు

 శ్లోకం:☝

*లోకః పృచ్ఛతి సద్వార్తాం*

  *శరీరే కుశలం తవ ।*

*కుతః కుశలమస్మాకం*

  *ఆయుర్యాతి దినేదినే ॥*

భావం: లోకంలో బంధువులు, ఆత్మీయులు, మిత్రులు ఎదురైనప్పుడు _‘క్షేమంగా ఉన్నారా?’_ అని ఆప్యాయంగా కుశల ప్రశ్నలడుగుతుంటారు. అనుదినం పగలు రాత్రి మన ఆయువు తరిగిపోతుంటే ఇంకా కుశలమేమిటి? దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ప్రాణముండగానే అపరోక్షజ్ఞానం సంపాదించుకోవాలి. లేకపోతే కనీసం మళ్ళీ మానవజన్మ వచ్చేలా పుణ్యకార్యాలు ఆచరించాలి. *ఆయుర్యాతి దినేదినే* అనే సంస్కృత నానుడి చాలా ప్రసిద్ధం.

రింగ్ రోడ్డు పై ప్రయాణం Ring Road hyderabad

  *రింగ్ రోడ్డు పై ప్రయాణం చేసే సమయం లో తికమక వద్దు గుర్తు పెట్టుకోండి*

〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️


*Total ORR Exit Numbers are 19.*


*Exit No 1 - Kokapet.*


*Exit No 2 - Edula nagulapally.*


*Exit No 3 - Patancheru.*


*Exit No 4 - Sultanpur.*


*Exit No 5 - Dindigal/ Saragudem-dsn.*


*Exit No 6 - Medchal.*


*Exit No 7 - Shamirpet.*


*Exit No 8 - Keesara.*


*Exit No 9 - Ghatkesar.*


*Exit No 10 - Taramptipet.*


*Exit No 11 - Pedda Amberpet.*


*Exit No 12 - Bonguluru.*


*Exit No 13 - Raviryal.*


*Exit No 14 - Tukkuguda.*


*Exit No 15 - Pedda Golconda.*


*Exit No 16 - Shamshabad.*


*Exit No 17 - Rajendra Nagar.*


*Exit No 18 - TSPA.*


*Exit No 19 - Nanakramguda.*


*Total length - 158 Kms*


*Design speed - 120 Kmph.*


*Right of Way (ROW) - 150 m*


*Main Carriage Way - 8 lanes.*


*Hard shoulder for emergency Parking/breakdown vehicles - 3 m wide.*


*Width of Central Median - 5 m.*


*Service Roads on either side - 2 lanes.*


*Interchanges - 19.*


*Speed limit - 100 kmph.*


*Challan for overspeeding - INR 1035=00.*

😊

🚗🚗🚗🚗🚗🚗🚗

Happy & safe Driving... 🌹🎊

పంచాంగము

 


హనుమజ్జయంతి

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే.


హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము,

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. 


సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. 


ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*

 *మే 12 న హనుమజ్జయంతి*


*సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*


శ్రీరామభక్త హనుమది ఒక విశిష్ట మైన అవతారం.

ఆయనకు సంబంధించిన వేర్వేరు పురాణగాథలను ఈ సందర్భంగా తెలుసుకుందాం.


ఆయన మాతృమూర్తి అంజనాదేవి, పూర్వజన్మలో పుంజికస్థల అనే పేరున్న అప్సరస.‌ఆమె లావణ్యానికి మోహితు డైన వాయుదేవుడు, కేసరి అనే వానర రూపంలో హనుమంతునికి తండ్రి అయ్యాడు. అందుచేతనే హనుమంతుడు, మనోజవం, మారుతతుల్య వేగం కలవా డయ్యాడు. జితేంద్రియుడు, బుద్ధిమంతుడూ ఐన హనుమను, "రామచరితమానస్" గ్రంథకర్త ఐన గోస్వామి తులసీదాసు, తనకు బుద్ధిబలాలను, విద్యనూ ప్రసాదించ మని ప్రార్థించాడు. బుద్ధిమంతుడే కాక హనుమ, అపారపాండిత్యం ఉన్నవాడు కూడా. శ్రీరామభక్తుడు కనుక, సమస్తజీవులకూ ఐహికసుఖాలను కలిగించే వాడని చెప్తారు.‌ ఆ పైన ఆధ్యాత్మికమార్గంలో నడిపించి, ముక్తినీ ప్రసాదిస్తాడు. 


నవనిధభక్తులలో హనుమది దాసభక్తి. నిరంతరమూ స్వామి సన్నిధిలో ఉండి,  రామకథను వినటం లోనే పరమానందాన్ని పొందిన భక్తాగ్రగణ్యుడు ఆంజనేయుడు.


*యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్*

*తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ l*

*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*

*మారుతిమ్ నమత రాక్షసాంతకమ్ ll*


అని మారుతిని కీర్తిస్తారు. ఎక్క డెక్కడ శ్రీరామచంద్రునికి సంబంధించిన విషయాలు విన్నా, హర్షంతో పులకించిన శరీరం కలవాడు, తలపై చేతులు జోడించి నమనం చేసేవాడు, ఆనందబాష్పాలు నిండి జాలువారే కన్నులు కలవాడూ అయిపోతాడట! అంత గొప్ప భక్తి ఆయనది! 


కర్ణుడు లేని మహాభారతకథ లేనట్లుగానే, హనుమంతుడు లేని శ్రీరామాయణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. తులసీదాసు రచించిన "హనుమాన్ చాలీసా"ను ప్రతిదినమూ పారాయణ చేస్తూ హనుమను కొలవటం మనలో ఎందరికో అలవాటు. కార్యసిద్ధికి స్వామి చాలా త్వరగా తోడ్పడుతా డని ప్రసిద్ధి.


జంటనగరాలలో తాడుబందు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బోయినపల్లి, సిఖ్ విలేజ్ లకు వెళ్లే దారిలో ఉందీ దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం, స్వామి భక్తులకు కొంగు బంగార మైన వైనాన్ని తెలియజేస్తుంది. అతి ప్రాచీన మైన ఈ క్షేత్రంలో, ఆంజనేయస్వామిని జాబాలి మహర్షి ప్రతిష్ఠించా రని స్థలపురాణం చెబుతున్నది. 


ఇక్కడ వినిపించే గాథలలో, హనుమ ఆజన్మ బ్రహ్మచారి కాడు, సూర్యపుత్రిక సువర్చలకు భర్త అని తెలిపేది ఉంది. శ్రీరామసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వాయు

పుత్రునికి, తన కుమార్తె నిచ్చి పెళ్లి చేసి, ఆయన బ్రహ్మచర్యానికి భంగం కలుగకుండా వర మిస్తాడు సూర్యభగవానుడు. సువర్చలాదేవి కూడా ఆయన బ్రహ్మచర్య వ్రతానికి  భంగం రాకుండా ప్రవర్తిస్తుంది. రాబోయే కల్పంలో హనుమ నవబ్రహ్మ లలో ఒక డవుతాడు. అంటే బ్రహ్మ పదవిని అలంకరిస్తా డన్నమాట!  ఆ కల్పంలో, అప్పుడు, తాను సువర్చల తో కూడి ఉంటా నని మాట ఇస్తాడు ఆంజనేయుడు. ఈ ఆలయం లోని హనుమ‌ వాహనం ఒంటె. కేసరీనందనుని దివ్య లీలలను ప్రదర్శించే ఇక్కడి తైలవర్ణచిత్రాలు భక్తులకు కనుల పండుగ కావిస్తాయి.


ఆంజనేయుని అవతారానికి సంబంధించిన మరొక కథ ఉంది. పరమేశ్వరుని భక్తు డైన యాగాలుడు అనే రాక్షసుడు, మానవులకు కంటకుడుగా తయారవుతాడు. శ్రీమహావిష్ణువు, అతన్ని సంహరించ మని పరమేశ్వరుణ్ని కోరుతాడు. తన భక్తుడు కనుక తానా పని చేయలే నంటాడు పార్వతీ పతి. అంతే కాక, తన భక్తు డైన అతన్ని ఎవ్వరూ చంపలే రని కూడా అంటాడు. తాను తప్పకుండా యాగాలుణ్ని వధిస్తా నని, ఆ విధంగా చేయలేకపోతే, మహాశివునికి దాసుడి నవుతాననీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేస్తాడు. అదే జరిగితే, తాను విష్ణుదాసుడి నవుతానని మహాదేవుడూ ప్రతిన పూనుతాడు. ఆ తర్వాత మోహినీరూపంతో యాగాలుణ్ని మోహింపజేసి, అతని చేత సురాపానం చేయించి, స్పృహ పోయిన అతన్ని, విష్ణువు, వృకరూపంలో - తోడేలు - వధిస్తాడు. అప్పుడు పరమేశుడు వచ్చి, తాను విష్ణుదాసుడి నవుతానంటాడు. త్రిమూర్తులలో ఎవరూ ఎవరికీ దాసులు కారని విష్ణువు ఎంత చెప్పినా శివుడు వినడు. అప్పుడు విష్ణుమూర్తి, రామావతారంలో హనుమంతుడుగా పుట్టి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకో మంటాడు. అదీ హనుమ, రామదాసుడు కావడానికి వెనుక ఉన్న రహస్యం!


మరొక గాథ ఇట్లా ఉంది -


పార్వతీపరమేశ్వరులు ఒకనాడు ఆకాశమార్గాన సంచరిస్తున్నారు. వేంకటాచలం వద్ద ఒక వానర మిథునాన్ని చూస్తుంది దేవి. ఆమె ఇంగితం గ్రహించిన పార్వతీపతి, ఆ విధంగానే ఆమె కోరిక తీరుస్తాడు. అతిశక్తిమంత మైన ఆ తేజస్సును భరించలేని దేవి, దాన్ని అగ్నిలో పడేస్తుంది. అగ్నిదేవుడు, వాయుదేవునికి ఇస్తే, వాయుదేవుడు అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి చేతికి ఇస్తాడు. అదేదో ఫలం అనుకుని, ఆమె స్వీకరిస్తే, ఆమెకు పుత్రుడు పుడతాడు. అంజనాదేవి సుతుడు కనుక, ఆంజనేయు డయ్యాడు.


ఈ తాడుబందు క్షేత్రంలో హనుమను ప్రతిష్ఠించిన జాబాలి మహర్షిని, శ్రీరాముడు శపిస్తాడు. హనుమద్విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆ శాపం నుండి విముక్తి పొందుతారు జాబాలి మహర్షి. అందుచేత ఈ క్షేత్రాన్ని "పాశబంధహర పురం" అనీ వ్యవహరిస్తారు. అదే క్రమంగా "తాడుబొందు"గా మారింది. హనుమ జన్మ శనివారం నాడు జరిగింది కనుక, ఆ నాడు స్వామికి విశేషార్చనలు జరుగుతాయి. మంగళవారం కూడా ప్రత్యేకపూజలు చేస్తారు.‌ఈ రెండు దినాలూ ఈ క్షేత్రం, భక్తులతో కిట

కిటలాడుతూ ఉంటుంది.


కడప జిల్లాలో వెల్లాల అనే చోట మారుతిని "సంజీవరాయుడు"గా కొలుస్తారు. ప్రాణం పోసే ఓషధులను తెమ్మంటే, సంజీవని పర్వతాన్నే మోసుకు వచ్చి, లక్ష్మణస్వామికి ప్రాణదాత అయినవాడు ఆంజనేయుడు.‌ ఇక్కడి ఆలయాలకు చెందిన స్థల పురాణాలలో, ఈ కథకే అధిక ప్రాముఖ్యం. దర్శన మాత్రం చేతనే, సమస్తపాపాలనూ హరించి, కోరిందే తడవుగా కోరికలు తీర్చే దైవంగా పేరు పొందిన పావని, ఈ వెల్లాల సంజీవరాయ స్వామి!


ఈ స్థలమే త్రేతాయుగం నాటి దండకారణ్యం. సంజీవని కొరకు బయలుదేరిన ఆంజనేయుడు, సంధ్యాసమయానికి కుముద్వతీ నదీతీరానికి చేరుతాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. హనుమను గమనించిన అక్కడి ఋషులు, అక్కడే ఉండి తమకు ఆయన సేవాభాగ్యం కలిగించ మని ప్రార్థించారు. స్వామి కార్యం మీద వెళుతున్నాడు కనుక ఉండే వీలు లేదని చెప్పి, వారికి తన రూపం లోని ఒక ప్రతిమను అనుగ్రహించాడు, ఆ కపీశుడు. ఆ ప్రతిమే సంజీవరాయస్వామి.ఆయన అక్కడ స్నానం మాచరించిన గుండానికి "హనుమంత గుండం" అనే పేరు వచ్చింది. 


ఆలయం లోని ఆంజనేయుని ప్రతిమకు వెండి తొడుగు ఉంటుంది. ఈ విగ్రహం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేదట. స్వామి తల మీద రాగికలశాన్ని ఉంచిన పిదప, అట్లా పెరగడం ఆగిపోయిందట. ఈ సంజీవరాయుణ్ని సేవించు కునేందుకు, మన రాష్ట్రాల నుండే కాక, మొత్తం దక్షిణాది నుండి కూడా‌ భక్తులు వస్తుంటారు. నిత్య పూజలతో పాటుగా శ్రావణమాసంలో విశేషంగా పూజలు, ఉత్సవాలూ జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమజ్జయంతి పండుగల దినాలలో గ్రామోత్సవాలూ చేస్తారు.


హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు.‌ గొప్ప జ్ఞాని. మహా పండితుడు. వజ్రాంగబలుడు. అంటే ఆయన శరీరం వజ్ర మంత దృఢంగా, ఎంతో బలిష్ఠంగా ఉంటుంది. ఈ "వజ్రాంగబలి" పదమే ఉత్తరాది జనంలో "బజరంగబలి"గా మారింది. బజరంగబలిని ఉపాసించడం అంటే జ్ఞానోపాసన చేయడమే!


ఆంజనేయస్వామి పూజ శనిదేవునికి విరుగుడుగా భావిస్తారు. శనిగ్రహపు దుష్ప్రభావాల నుండి విముక్తి కలుగడానికి, సిందూరం, జిల్లెడు పూలు, తమలపాకులతో హనుమను పూజిస్తారు. ఆంజనేయుడు, తన భక్తులను శనిగ్రహం దుష్టవీక్షణం తగులకుండా రక్షిస్తా డని విశ్వసిస్తారు. రావణాసురుడు, నవగ్రహాలనూ తన అధీనం లోనికి తెచ్చుకుని, తన పాదాల కింద శనైశ్చరుణ్ని ఉంచి నలిపి వేస్తుంటాడు. రావణసభ లోనికి బంధితుడై వెళ్లిన హనుమంతుడు, రెప్పపాటు కాలంలో, శనిదేవుణ్ని తన వాలం - తోక - తో రావణుని పదఘట్టన నుండి చెప్పిస్తాడు. తనను విముక్తుణ్ని చేసినందుకు, శని, కృతజ్ఞతగా హనుమదుపాసకుల జోలికి వెళ్లడు అని చెబుతారు.


హనుమంతుడు స్వరూపంలో వానరుడే అయినా, జ్ఞానానికి మాత్రం  నిధి. ఖగోళం, వ్యాకరణం, సంగీతం మొద లైన వాటిలోనే కాక, వేద పురాణాలలోను, విజ్ఞానశాస్త్రాల లోను ఆయనకు తిరుగు లేదు! తొలి కలయిక లోనే శ్రీరామచంద్రుడు, హనుమ సంభాషణ చాతుర్యానికి పరవశించా డంటే, ఆయన ఎంతటి పండితుడో తెలుస్తూంది కదా! 


ఆధ్యాత్మ రామాయణంలో మారుతి, యోగాంజనేయుని రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు. అంటే ఒక గురువు స్థానం. ఆయన మరొక రూపం పంచముఖ ఆంజనేయుడు. ఈ రూపంలో ఐదు ముఖాలు, పది చేతులతో సాక్షాత్కరిస్తాడు. వానరరూపం, నారసింహం, గరుత్మంతరూపం, వారాహం, హయగ్రీవం - ఈ రూపాలను క్రమంగా ధైర్యబలాలకు; భయవిముక్తికి; మంత్రి తంత్ర సిద్ధి, సర్పదోష నివారణకు;  ఆరోగ్యం, భూతప్రేతాల నుండి రక్షణకు; శత్రువిజయం, జ్ఞానాలకు సేవించు కుంటారు. ఏకాదశరుద్రులలో ఒకడుగానూ కీర్తి పొందాడు వాయుపుత్రుడు.

పంచ ముఖ ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తే, అన్ని కోరికలూ సిద్ధించినట్లే! సిందూరం జ్ఞానానికి చిహ్నం కనుకనే హనుమను సిందూరలేపనంతో అర్చిస్తారు.


వారణాసి లోని హనుమదాలయాన్ని తులసీదాసు నిర్మించాడు. శ్రీరామ భక్తుడుగా మన మనోమందిరాలలో స్థిరపడిన రూపాన్ని తీర్చిదిద్దిన వాడు తులసీదాసే! మరో విశేషం ఏమిటంటే, మన దేశంలో రామాలయాల కన్నా ఆంజనేయుని ఆలయాలే అధికంగా ఉండడం! 


"సుందరుడు" అనే పేరు హనుమకు ఉండడం చేతనే, ఆయన దివ్య, అద్భుత లీలలను వివరించిన శ్రీరామాయణంలో ఒక కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. 


*"సుందరే సుందరో రామః*

*సుందరే సుందరీ కథా l*

*సుందరే సుందరీ సీతా*

*సుందరే సుందరమ్ వనమ్ ll*


*సుందరే సుందరం కావ్యమ్*

*సుందరే సుందరః కపిః l*

*సుందరే సుందరమ్ మంత్రమ్*

*సుందరే కిం న సుందరమ్? ll*


ఈ శ్లోకాలు చెప్పుకోకపోతే, హనుమను గురించి పూర్తిగా చెప్పుకున్నట్లు కాదు.


శ్రీరామాయణం నాయకుడు రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు. సీతమ్మ‌తల్లి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ స్వరూపం. స్వామి మారుతి ఆత్మయోగి అయిన సౌందర్యరాశి. లంకలోని అశోకవనం ఎంతో అందంగా ఉంటుంది. ఇక లంకా పట్టణమూ బహుసుందరమే. మంత్రం సుందరం. ఇక వీటిలో సుందరం కాని దేమిటి? అన్నీ సౌందర్యభరితాలే! ఈ కారణం చేత మిగిలిన అన్ని కాండలకూ కథోచితంగా, యథోచితంగా పేర్లు పెట్టిన వాల్మీకుల వారు, ఈ కాండకు మాత్రం "సుందరకాండ" అని పేరు పెట్టారు.


మనమూ ఆ దివ్యశక్తిమంతు డైన హనుమను,

*"ఆంజనేయం అతిపాటలాననమ్*

*కాంచనాద్రి కమనీయవిగ్రహమ్ l*

*పారిజాత తరుమూల వాసినమ్*

*భావయామి పవమాన నందనమ్ ll"*


అని ప్రార్థించుకుందాం.


*జై హనుమాన్!*

పంచాంగం 12.05.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 12.05.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి తిథి భౌమ వాసర పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.


ఈ రోజు హనుమజ్జయంతి 

  


శ్రాద్ధ తిథి: దశమి మరియు ఏకాదశి 


 

నమస్కారః , శుభోదయం