12, మే 2026, మంగళవారం

హనుమజ్జయంతి

 హనుమజ్జయంతి జీవితంలో ఒక్కమారు చేసినట్లైతే వంశమంతా తరించిపోతుందన్నారు. జయంతి చేసేరోజు గృహస్థు భోజనం చేయకుండా ఉండకూడదు. ఒకపూట భోజనం చేసి తీరాలి. యతి పురుషులు ఈరోజు భోజనం చేయకూడదు. పూర్ణ ఉపవాసం చేయాలి. హనుమజ్జయంతి చేసే గృహస్థు యొక్క భార్య జీవితంలో ఒక్కహనుమజ్జయంతినాడైనా సరే గురువింద పూసలతో ఉపాసన అని ఒకటున్నది.భర్త పూజ అంతా అయిన పిదప భార్య స్వచ్ఛమైన ఆవునేతిని తీసుకువచ్చి అప్పాలను సాయంకాలం వరకు వేయించాలి. అనగా సాయంకాలం వరకు ఎన్ని చేయగలిగితే అన్ని అని..మాడ్చమని కాదు. ఒకేగోత్రంతో ఉన్న కుటుంబాలలో ఉన్న తోడికోడళ్ళు అందరూ కలిసి హనుమజ్జయంతి చేస్తారు. హనుమ అంత త్వరగా ప్రీతిచెందే మహాపురుషుడు మరొకరుండరు. ఈ అప్పాలను సాయంకాలం సీతారామచంద్రులకు, హనుమకు, పరివారమునకు మంత్రంతో స్వాగతం పలికి నివేదన చేసి సీతారామచంద్రులయందు అపారభక్తికలిగిన వాడు, హనుమను ఉపాసన చేస్తున్నటువంటి వ్యక్తి హనుమజ్జయంతినాడు మీకు తారసపడితే వారి ఇంటికి వెళ్ళేటటువంటి చనువు మీకున్నా వారు మీఇంటికి వచ్చేటటువంటి అనుగ్రహం వారికున్నా ఒక విషయం చేత మీ జన్మ పండుతుంది అన్నారు. అటువంటి పరమభక్తుడైన వ్యక్తితో పరిచయం ఉంటే సూర్యాస్తమయం అయ్యే లోపల ఐదు ఆకులు కానీ, పండ్లు కానీ, అప్పములు కానీ తీసుకెళ్ళి వారికిస్తే వారు ఆ రోజు తీసుకొని ఒక్కపండుముక్క ఆయన నోటిలో వేసుకున్నా మీజన్మ తరించిపోయినట్లే.


హనుమజ్జయంతికి అయిదు అంకెతో అంత అనుబంధం. ఒకేజాతికి చెందిన అయిదు ఫలాలను ఇవాళ్టి రోజున సీతారామచంద్ర ప్రభువుయొక్క పాదములయందు అపారమైన భక్తి కలిగినటువంటి వారు, హనుమను సేవించేటటువంటి వాడు, అటువంటి వారి ఇళ్ళకు వెళ్ళగలిగిన చనువు మీకుంటే (నిత్యము,

నైమిత్తికము అని రెండు రకాల తిథులుంటాయి. 


సంధ్యావందనాదులు రోజూ చేస్తూ ఉంటారు.నైమిక్తికము అంటే ప్రత్యేక తిథులు వీటియందు కొన్ని ప్రత్యేకమైన పనులుంటాయి. అవి చేస్తే జన్మ తరిస్తుంది. అవి సులభ మార్గములు.)వారు పుచ్చుకుంటే మీజన్మ తరించిపోయినట్లే. 


ఎందుకంటే అది సాక్షాత్ హనుమయొక్క స్వీకారమే. ఇలా చెప్పింది పరాశర సంహిత. అయిదంకె మీద పండు, అయిదంకె మీద ఆకు, అయిదంకె మీద నేతి అప్పములు, ఆలయంలో అర్చన చేసేవాళ్ళు, సీతారామచంద్రులను నమ్ముకున్నభక్తులకు ఇవ్వండి. అలా ఇస్తే మీరు తరిస్తారు. హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందంటే అరటి చెట్లు బాగా కట్టి అరటి గెలలు బాగా వంగి ఉండేటట్లుగా అలంకారం చేసి అప్పుడు హనుమజ్జయంతి చేయాలి. హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే అరటితోటలోకి వెళ్ళి హనుమయంత్రం కానీ హనుమ బొమ్మ కానీ హనుమ అని వ్రాసి కానీ అక్కడ పెట్టి మీరు కానీ ఉపాసన చేశారా ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకొని తీరుతారు అని అభయమిచ్చింది పరాశర సంహిత. అన్నింటికన్నా ఆయన తొందరగా ప్రీతి చెందేది అరటిపండు వల్ల. కదళి పూజ అని ప్రత్యేకమైన పూజ ఆయనకి. అలా చేస్తే ఏదో ఒక రూపంతో మీకు కంటికి కనపడే రూపంతో రాకపోవచ్చు. కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకొని వెళ్ళి తీరుతారు. తొందరగా ప్రసన్నుడై వస్తే వానరరూపంలో వస్తారు. తప్పకుండా అరటిపండ్లు నివేదన చేయాలి. పరమ ప్రసన్నుడౌతాడు స్వామి. ఈ రోజు తప్పకుండా దేవాలయంలో హనుమ దర్శనం చేసుకోవాలి. హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి. ఎవరికి హనుమ అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు.

సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*

 *మే 12 న హనుమజ్జయంతి*


*సకలాభీష్టాలూ సిద్ధింపజేసే సంజీవరాయుడు*


శ్రీరామభక్త హనుమది ఒక విశిష్ట మైన అవతారం.

ఆయనకు సంబంధించిన వేర్వేరు పురాణగాథలను ఈ సందర్భంగా తెలుసుకుందాం.


ఆయన మాతృమూర్తి అంజనాదేవి, పూర్వజన్మలో పుంజికస్థల అనే పేరున్న అప్సరస.‌ఆమె లావణ్యానికి మోహితు డైన వాయుదేవుడు, కేసరి అనే వానర రూపంలో హనుమంతునికి తండ్రి అయ్యాడు. అందుచేతనే హనుమంతుడు, మనోజవం, మారుతతుల్య వేగం కలవా డయ్యాడు. జితేంద్రియుడు, బుద్ధిమంతుడూ ఐన హనుమను, "రామచరితమానస్" గ్రంథకర్త ఐన గోస్వామి తులసీదాసు, తనకు బుద్ధిబలాలను, విద్యనూ ప్రసాదించ మని ప్రార్థించాడు. బుద్ధిమంతుడే కాక హనుమ, అపారపాండిత్యం ఉన్నవాడు కూడా. శ్రీరామభక్తుడు కనుక, సమస్తజీవులకూ ఐహికసుఖాలను కలిగించే వాడని చెప్తారు.‌ ఆ పైన ఆధ్యాత్మికమార్గంలో నడిపించి, ముక్తినీ ప్రసాదిస్తాడు. 


నవనిధభక్తులలో హనుమది దాసభక్తి. నిరంతరమూ స్వామి సన్నిధిలో ఉండి,  రామకథను వినటం లోనే పరమానందాన్ని పొందిన భక్తాగ్రగణ్యుడు ఆంజనేయుడు.


*యత్ర యత్ర రఘునాథ కీర్తనమ్*

*తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్ l*

*బాష్పవారి పరిపూర్ణలోచనమ్*

*మారుతిమ్ నమత రాక్షసాంతకమ్ ll*


అని మారుతిని కీర్తిస్తారు. ఎక్క డెక్కడ శ్రీరామచంద్రునికి సంబంధించిన విషయాలు విన్నా, హర్షంతో పులకించిన శరీరం కలవాడు, తలపై చేతులు జోడించి నమనం చేసేవాడు, ఆనందబాష్పాలు నిండి జాలువారే కన్నులు కలవాడూ అయిపోతాడట! అంత గొప్ప భక్తి ఆయనది! 


కర్ణుడు లేని మహాభారతకథ లేనట్లుగానే, హనుమంతుడు లేని శ్రీరామాయణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. తులసీదాసు రచించిన "హనుమాన్ చాలీసా"ను ప్రతిదినమూ పారాయణ చేస్తూ హనుమను కొలవటం మనలో ఎందరికో అలవాటు. కార్యసిద్ధికి స్వామి చాలా త్వరగా తోడ్పడుతా డని ప్రసిద్ధి.


జంటనగరాలలో తాడుబందు ఆంజనేయస్వామి ఆలయం ఉంది. బోయినపల్లి, సిఖ్ విలేజ్ లకు వెళ్లే దారిలో ఉందీ దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం, స్వామి భక్తులకు కొంగు బంగార మైన వైనాన్ని తెలియజేస్తుంది. అతి ప్రాచీన మైన ఈ క్షేత్రంలో, ఆంజనేయస్వామిని జాబాలి మహర్షి ప్రతిష్ఠించా రని స్థలపురాణం చెబుతున్నది. 


ఇక్కడ వినిపించే గాథలలో, హనుమ ఆజన్మ బ్రహ్మచారి కాడు, సూర్యపుత్రిక సువర్చలకు భర్త అని తెలిపేది ఉంది. శ్రీరామసేవకే తన జీవితాన్ని అంకితం చేసిన వాయు

పుత్రునికి, తన కుమార్తె నిచ్చి పెళ్లి చేసి, ఆయన బ్రహ్మచర్యానికి భంగం కలుగకుండా వర మిస్తాడు సూర్యభగవానుడు. సువర్చలాదేవి కూడా ఆయన బ్రహ్మచర్య వ్రతానికి  భంగం రాకుండా ప్రవర్తిస్తుంది. రాబోయే కల్పంలో హనుమ నవబ్రహ్మ లలో ఒక డవుతాడు. అంటే బ్రహ్మ పదవిని అలంకరిస్తా డన్నమాట!  ఆ కల్పంలో, అప్పుడు, తాను సువర్చల తో కూడి ఉంటా నని మాట ఇస్తాడు ఆంజనేయుడు. ఈ ఆలయం లోని హనుమ‌ వాహనం ఒంటె. కేసరీనందనుని దివ్య లీలలను ప్రదర్శించే ఇక్కడి తైలవర్ణచిత్రాలు భక్తులకు కనుల పండుగ కావిస్తాయి.


ఆంజనేయుని అవతారానికి సంబంధించిన మరొక కథ ఉంది. పరమేశ్వరుని భక్తు డైన యాగాలుడు అనే రాక్షసుడు, మానవులకు కంటకుడుగా తయారవుతాడు. శ్రీమహావిష్ణువు, అతన్ని సంహరించ మని పరమేశ్వరుణ్ని కోరుతాడు. తన భక్తుడు కనుక తానా పని చేయలే నంటాడు పార్వతీ పతి. అంతే కాక, తన భక్తు డైన అతన్ని ఎవ్వరూ చంపలే రని కూడా అంటాడు. తాను తప్పకుండా యాగాలుణ్ని వధిస్తా నని, ఆ విధంగా చేయలేకపోతే, మహాశివునికి దాసుడి నవుతాననీ మహావిష్ణువు ప్రతిజ్ఞ చేస్తాడు. అదే జరిగితే, తాను విష్ణుదాసుడి నవుతానని మహాదేవుడూ ప్రతిన పూనుతాడు. ఆ తర్వాత మోహినీరూపంతో యాగాలుణ్ని మోహింపజేసి, అతని చేత సురాపానం చేయించి, స్పృహ పోయిన అతన్ని, విష్ణువు, వృకరూపంలో - తోడేలు - వధిస్తాడు. అప్పుడు పరమేశుడు వచ్చి, తాను విష్ణుదాసుడి నవుతానంటాడు. త్రిమూర్తులలో ఎవరూ ఎవరికీ దాసులు కారని విష్ణువు ఎంత చెప్పినా శివుడు వినడు. అప్పుడు విష్ణుమూర్తి, రామావతారంలో హనుమంతుడుగా పుట్టి, తన ప్రతిజ్ఞను నెరవేర్చుకో మంటాడు. అదీ హనుమ, రామదాసుడు కావడానికి వెనుక ఉన్న రహస్యం!


మరొక గాథ ఇట్లా ఉంది -


పార్వతీపరమేశ్వరులు ఒకనాడు ఆకాశమార్గాన సంచరిస్తున్నారు. వేంకటాచలం వద్ద ఒక వానర మిథునాన్ని చూస్తుంది దేవి. ఆమె ఇంగితం గ్రహించిన పార్వతీపతి, ఆ విధంగానే ఆమె కోరిక తీరుస్తాడు. అతిశక్తిమంత మైన ఆ తేజస్సును భరించలేని దేవి, దాన్ని అగ్నిలో పడేస్తుంది. అగ్నిదేవుడు, వాయుదేవునికి ఇస్తే, వాయుదేవుడు అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి చేతికి ఇస్తాడు. అదేదో ఫలం అనుకుని, ఆమె స్వీకరిస్తే, ఆమెకు పుత్రుడు పుడతాడు. అంజనాదేవి సుతుడు కనుక, ఆంజనేయు డయ్యాడు.


ఈ తాడుబందు క్షేత్రంలో హనుమను ప్రతిష్ఠించిన జాబాలి మహర్షిని, శ్రీరాముడు శపిస్తాడు. హనుమద్విగ్రహ ప్రతిష్ఠ చేసి, ఆ శాపం నుండి విముక్తి పొందుతారు జాబాలి మహర్షి. అందుచేత ఈ క్షేత్రాన్ని "పాశబంధహర పురం" అనీ వ్యవహరిస్తారు. అదే క్రమంగా "తాడుబొందు"గా మారింది. హనుమ జన్మ శనివారం నాడు జరిగింది కనుక, ఆ నాడు స్వామికి విశేషార్చనలు జరుగుతాయి. మంగళవారం కూడా ప్రత్యేకపూజలు చేస్తారు.‌ఈ రెండు దినాలూ ఈ క్షేత్రం, భక్తులతో కిట

కిటలాడుతూ ఉంటుంది.


కడప జిల్లాలో వెల్లాల అనే చోట మారుతిని "సంజీవరాయుడు"గా కొలుస్తారు. ప్రాణం పోసే ఓషధులను తెమ్మంటే, సంజీవని పర్వతాన్నే మోసుకు వచ్చి, లక్ష్మణస్వామికి ప్రాణదాత అయినవాడు ఆంజనేయుడు.‌ ఇక్కడి ఆలయాలకు చెందిన స్థల పురాణాలలో, ఈ కథకే అధిక ప్రాముఖ్యం. దర్శన మాత్రం చేతనే, సమస్తపాపాలనూ హరించి, కోరిందే తడవుగా కోరికలు తీర్చే దైవంగా పేరు పొందిన పావని, ఈ వెల్లాల సంజీవరాయ స్వామి!


ఈ స్థలమే త్రేతాయుగం నాటి దండకారణ్యం. సంజీవని కొరకు బయలుదేరిన ఆంజనేయుడు, సంధ్యాసమయానికి కుముద్వతీ నదీతీరానికి చేరుతాడు. స్నానం చేసి సంధ్యావందనం చేసుకున్నాడు. హనుమను గమనించిన అక్కడి ఋషులు, అక్కడే ఉండి తమకు ఆయన సేవాభాగ్యం కలిగించ మని ప్రార్థించారు. స్వామి కార్యం మీద వెళుతున్నాడు కనుక ఉండే వీలు లేదని చెప్పి, వారికి తన రూపం లోని ఒక ప్రతిమను అనుగ్రహించాడు, ఆ కపీశుడు. ఆ ప్రతిమే సంజీవరాయస్వామి.ఆయన అక్కడ స్నానం మాచరించిన గుండానికి "హనుమంత గుండం" అనే పేరు వచ్చింది. 


ఆలయం లోని ఆంజనేయుని ప్రతిమకు వెండి తొడుగు ఉంటుంది. ఈ విగ్రహం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉండేదట. స్వామి తల మీద రాగికలశాన్ని ఉంచిన పిదప, అట్లా పెరగడం ఆగిపోయిందట. ఈ సంజీవరాయుణ్ని సేవించు కునేందుకు, మన రాష్ట్రాల నుండే కాక, మొత్తం దక్షిణాది నుండి కూడా‌ భక్తులు వస్తుంటారు. నిత్య పూజలతో పాటుగా శ్రావణమాసంలో విశేషంగా పూజలు, ఉత్సవాలూ జరుగుతాయి. శ్రీరామనవమి, హనుమజ్జయంతి పండుగల దినాలలో గ్రామోత్సవాలూ చేస్తారు.


హనుమంతుడు మహావీరుడు, మహాభక్తుడు.‌ గొప్ప జ్ఞాని. మహా పండితుడు. వజ్రాంగబలుడు. అంటే ఆయన శరీరం వజ్ర మంత దృఢంగా, ఎంతో బలిష్ఠంగా ఉంటుంది. ఈ "వజ్రాంగబలి" పదమే ఉత్తరాది జనంలో "బజరంగబలి"గా మారింది. బజరంగబలిని ఉపాసించడం అంటే జ్ఞానోపాసన చేయడమే!


ఆంజనేయస్వామి పూజ శనిదేవునికి విరుగుడుగా భావిస్తారు. శనిగ్రహపు దుష్ప్రభావాల నుండి విముక్తి కలుగడానికి, సిందూరం, జిల్లెడు పూలు, తమలపాకులతో హనుమను పూజిస్తారు. ఆంజనేయుడు, తన భక్తులను శనిగ్రహం దుష్టవీక్షణం తగులకుండా రక్షిస్తా డని విశ్వసిస్తారు. రావణాసురుడు, నవగ్రహాలనూ తన అధీనం లోనికి తెచ్చుకుని, తన పాదాల కింద శనైశ్చరుణ్ని ఉంచి నలిపి వేస్తుంటాడు. రావణసభ లోనికి బంధితుడై వెళ్లిన హనుమంతుడు, రెప్పపాటు కాలంలో, శనిదేవుణ్ని తన వాలం - తోక - తో రావణుని పదఘట్టన నుండి చెప్పిస్తాడు. తనను విముక్తుణ్ని చేసినందుకు, శని, కృతజ్ఞతగా హనుమదుపాసకుల జోలికి వెళ్లడు అని చెబుతారు.


హనుమంతుడు స్వరూపంలో వానరుడే అయినా, జ్ఞానానికి మాత్రం  నిధి. ఖగోళం, వ్యాకరణం, సంగీతం మొద లైన వాటిలోనే కాక, వేద పురాణాలలోను, విజ్ఞానశాస్త్రాల లోను ఆయనకు తిరుగు లేదు! తొలి కలయిక లోనే శ్రీరామచంద్రుడు, హనుమ సంభాషణ చాతుర్యానికి పరవశించా డంటే, ఆయన ఎంతటి పండితుడో తెలుస్తూంది కదా! 


ఆధ్యాత్మ రామాయణంలో మారుతి, యోగాంజనేయుని రూపంలో దర్శనం అనుగ్రహిస్తాడు. అంటే ఒక గురువు స్థానం. ఆయన మరొక రూపం పంచముఖ ఆంజనేయుడు. ఈ రూపంలో ఐదు ముఖాలు, పది చేతులతో సాక్షాత్కరిస్తాడు. వానరరూపం, నారసింహం, గరుత్మంతరూపం, వారాహం, హయగ్రీవం - ఈ రూపాలను క్రమంగా ధైర్యబలాలకు; భయవిముక్తికి; మంత్రి తంత్ర సిద్ధి, సర్పదోష నివారణకు;  ఆరోగ్యం, భూతప్రేతాల నుండి రక్షణకు; శత్రువిజయం, జ్ఞానాలకు సేవించు కుంటారు. ఏకాదశరుద్రులలో ఒకడుగానూ కీర్తి పొందాడు వాయుపుత్రుడు.

పంచ ముఖ ఆంజనేయుణ్ని ఆశ్రయిస్తే, అన్ని కోరికలూ సిద్ధించినట్లే! సిందూరం జ్ఞానానికి చిహ్నం కనుకనే హనుమను సిందూరలేపనంతో అర్చిస్తారు.


వారణాసి లోని హనుమదాలయాన్ని తులసీదాసు నిర్మించాడు. శ్రీరామ భక్తుడుగా మన మనోమందిరాలలో స్థిరపడిన రూపాన్ని తీర్చిదిద్దిన వాడు తులసీదాసే! మరో విశేషం ఏమిటంటే, మన దేశంలో రామాలయాల కన్నా ఆంజనేయుని ఆలయాలే అధికంగా ఉండడం! 


"సుందరుడు" అనే పేరు హనుమకు ఉండడం చేతనే, ఆయన దివ్య, అద్భుత లీలలను వివరించిన శ్రీరామాయణంలో ఒక కాండకు "సుందరకాండ" అని పేరు పెట్టారు వాల్మీకి మహర్షి. 


*"సుందరే సుందరో రామః*

*సుందరే సుందరీ కథా l*

*సుందరే సుందరీ సీతా*

*సుందరే సుందరమ్ వనమ్ ll*


*సుందరే సుందరం కావ్యమ్*

*సుందరే సుందరః కపిః l*

*సుందరే సుందరమ్ మంత్రమ్*

*సుందరే కిం న సుందరమ్? ll*


ఈ శ్లోకాలు చెప్పుకోకపోతే, హనుమను గురించి పూర్తిగా చెప్పుకున్నట్లు కాదు.


శ్రీరామాయణం నాయకుడు రామచంద్ర ప్రభువు సుందరాతి సుందరుడు. సీతమ్మ‌తల్లి సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ స్వరూపం. స్వామి మారుతి ఆత్మయోగి అయిన సౌందర్యరాశి. లంకలోని అశోకవనం ఎంతో అందంగా ఉంటుంది. ఇక లంకా పట్టణమూ బహుసుందరమే. మంత్రం సుందరం. ఇక వీటిలో సుందరం కాని దేమిటి? అన్నీ సౌందర్యభరితాలే! ఈ కారణం చేత మిగిలిన అన్ని కాండలకూ కథోచితంగా, యథోచితంగా పేర్లు పెట్టిన వాల్మీకుల వారు, ఈ కాండకు మాత్రం "సుందరకాండ" అని పేరు పెట్టారు.


మనమూ ఆ దివ్యశక్తిమంతు డైన హనుమను,

*"ఆంజనేయం అతిపాటలాననమ్*

*కాంచనాద్రి కమనీయవిగ్రహమ్ l*

*పారిజాత తరుమూల వాసినమ్*

*భావయామి పవమాన నందనమ్ ll"*


అని ప్రార్థించుకుందాం.


*జై హనుమాన్!*

పంచాంగం 12.05.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 12.05.2026 Tuesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస కృష్ణ పక్ష దశమి తిథి భౌమ వాసర పూర్వాభాద్ర నక్షత్రం వైధృతి యోగః భద్ర తదువరి బవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.


ఈ రోజు హనుమజ్జయంతి 

  


శ్రాద్ధ తిథి: దశమి మరియు ఏకాదశి 


 

నమస్కారః , శుభోదయం

12-05-2026 మంగళవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

12-05-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సన్నిహితుల సహాయంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలకు సంబంధించినవి కొలిక్కి వస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  

---------------------------------------


వృషభం


వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన వ్యవహారాలు శ్రమ అనంతరం పూర్తవుతాయి. వ్యాపారాలలో సొంత నిర్ణయాలు అంతగా కలిసిరావు. నిరుద్యోగయత్నాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధికమవుతుంది.

---------------------------------------


మిధునం


దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. వ్యాపార వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కర్కాటకం


ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగుల కలలు సహకారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. 

---------------------------------------


సింహం


ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ వాతావరణం చికాకుగా ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించిన అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది.

---------------------------------------


కన్య


దూరప్రయాణ సూచనలున్నవి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారపరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు ఉంటాయి.

---------------------------------------


తుల


పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.  

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగమున బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. 

---------------------------------------


ధనస్సు


ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యటం మంచిది. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. ఉద్యోగమున అధికారులతో ఓర్పుగా వ్యవహరించడం మంచిది.

---------------------------------------


మకరం


ఇంటాబయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------


కుంభం


కొన్ని పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఇతరులతో మాట పట్టింపులు తప్పవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి.

---------------------------------------


మీనం

 

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.

---------------------------------------

_*🚩 శ్రీ హనుమాన్ జయంతి🚩*_

 _*🚩 శ్రీ హనుమాన్ జయంతి🚩*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు , ఉపనిషత్తులు , సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు , కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ , వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది.


*జననం*


పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో , కాళ్ళు ముడుచుకుని ధ్యానంచేసుకుంటున్న వానరాన్నిని చూసి , ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా , చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. 


హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది , కోపంతో అంజనను , ఆమె ఎవరితోనైన ప్రేమలో పడిన్నప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా , ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. 


అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒక రోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి , వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం *'కేసరి'* అని , వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. 


అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన , ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు.


ఇంకో వైపు దశరధుడు , అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తిచెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశసంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు , అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. 


ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని(తీపి ఆహారము) అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు , అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు , గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది.


ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని , కేసరినందనుడని , వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను , తన తండ్రిఅయిన కేసరి , తల్లి , అప్సర అంజన యొక్క శక్తి , వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగివెళ్ళింది.


భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు , బుద్ధిశాలి , కపిశ్రేష్టుడు , సర్వశాస్త్ర పారంగతుడు , స్వామిభక్తి పరాయణుడు , రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం , రామాయణం , పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. 


హనుమాన్ , ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు , రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీ రాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ , మన జన్మ యొక్క రహస్యం , శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది.


జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకొని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ (హనుమ) పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి , వాయుదేవుడు వీచటం మానివేశాడు. అపుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింప జేశారు.    

                                     *ఆంజనేయస్వామి అవతారాలు తొమ్మిది:*


హనుమంతుడు కూడా దుష్టశిక్షణ , శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.


1. ప్రసన్నాంజనేయస్వామి.

2. వీరాంజనేయస్వామి.

3. వింశతిభుజాంజనేయ స్వామి.

4. పంచముఖాంజనేయ స్వామి.

5. అష్టాదశ భుజాంజనేయస్వామి.

6. సువర్చలాంజనేయ స్వామి.

7. చతుర్భుజాంజనేయ స్వామి.

8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.

9. వానరాకార ఆంజనేయస్వామి

తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలై పోతాయి.....!!!


దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి.


*ఆయన అష్టసిద్ధులు*


1. అణిమాసిద్ధి : శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి.


2. మహిమాసిద్ధి : శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి.


3. లఘిమాసిద్ధి : శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి.


4. గరిమ : శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి.


5. ప్రాప్తిసిద్ధి : ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి.. దేనినైనా పొందగలిగే శక్తి.


6. పరకామ్యసిద్ధి : ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగిఉండే శక్తి.


7. వశిత్వసిద్ధి : అన్ని జీవులపైనా ఆధిపత్యాన్ని కలిగిఉండే శక్తి.


8. ఈశిత్వసిద్ధి : దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి.



*శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి ?*


హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్ళినా మూడు ప్రదక్షిణాలు చెస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్లినప్పుడు ఐదు ప్రదక్షిణాలు చేయాలి. *'ప్రదక్షిణన మస్కారాన్ సాష్టాంగాన్ పంచ సంఖ్యాయా'* అని ఆర్ష వాక్యం. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువు కోవాలి. సకల రోగ , భూతప్రేత పిశాచాది భాధలు తొలగుటకు , అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్దాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54 అదీ చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు. వక్కలు , పసుపుకొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం.


*'శ్రీహనుమన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్'*


శ్లో|| ఆంజనేయం మహావీరం - బ్రహ్మవిష్ణు శివాత్మకం

తరుణార్క ప్రభంశాంతం - రామదూతం నమామ్యహం


శ్లో|| మర్కటే శ మహొ త్సాహ - సర్వశోక వినాశన

శత్రూన్సంహర మాం రక్ష - శ్రియం దాపయ మే ప్రభో||


అని చదువు కొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం , అర్ధ మండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించి


''యాకృత్తె రేభి: ప్రదక్షిణ ణై| శ్రీ సువర్చలా సమేత హనుమాన్ సుప్రిత స్సుప్రసంనో వరదో భూత్వా మామాభిష్ట సిద్దం దదాతు''


అని జలాన్ని అక్షతలతో వదలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం , శిర స్స్నానం , నేలపడక , సత్త్వికాహారం వంటి నియమాలు పాటించాలి.


*ఆచరణ:* భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామిద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్ర దక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా ఐదు ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి.


*అభిషేకం*


పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు , కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం , నిత్యమూ చేయగలగటం మరీ మంచిది.


*ఆచరణ :* మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినానా దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి


*మంగళ వార సేవ*


మంగళవారంనాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాల ఇష్టం. అంతా కుదురనివారు మూతికయినా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం , అరటి పండ్లు నివెదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాధ ఉంది.


*శనివార సేవ*


హనుమంతుడు శనివారం జన్మించాడు. కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన , సహస్రనామాదికం చేయాలి. భక్తులచే అప్పాలు , వడ మాల వంటి విప్రోత్సహించి చే యించి స్వామికి సంతృప్తి కలిగించాలి.


*పంచ సంఖ్య*


హనుమంతుడు పంచ (ఐదు) సంఖ్య ఇష్టం కాబట్టి చెసే ప్రదక్షిణాలు , నమస్కారాలు ఐదు చేయాలి. అరటి పండ్లు వంటి ఏవయినా ఐదు సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం.


*హనుమజ్జయంతి*


హనుమంతుడు వైశాఖ మాసంలో , కృష్ణ పక్షంలో , దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం , శనివారం , కర్కాటక లగ్నంలో , వైదృతి యోగంలో జన్మిచాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ , కల్పంతర గాధలను బట్టి ఎవరో చేప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా ఐదు రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు.


*విశేషార్చనలు సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి.*


*ఆచరణ :* సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడయినా భక్తులు మారేడుదళం , సింధూరం మల్లెపూలు లేదా తములపాకులు , తులసిదళం , ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి.

11, మే 2026, సోమవారం

మంగళవారం🍁* *🌹12, మే, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

    *🍁మంగళవారం🍁*

   *🌹12, మే, 2026🌹*

   *దృగ్గణిత పంచాంగం* 

                           

    *🌷ఈనాటి పర్వం🌷* 

 *🍁హనుమజ్జయంతి🍁* 


           *స్వస్తి శ్రీ పరాభవ* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంత ఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం* 


*తిథి : దశమి* మ 02.52 వరకు ఉపరి *ఏకాదశి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 01.17 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : వైధృతి* రా 11.20 వరకు ఉపరి *విష్కుంబ*

*కరణం  : భద్ర* మ 02.52 *బవ* రా 02.17 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ 09.30-11.00 & 12.00-01.00 సా 04.30-06.00*       

 అమృత కాలం :*సా 05.21 - 06.56*

 అభిజిత్ కాలం  : *ప 11.38 - 12.30*

*వర్జ్యం    : ఉ 07.49 - 09.25*

*దుర్ముహూర్తం  : ఉ 08.12 - 09.04 రా 10.57 - 11.41* 

*రాహు కాలం  :మ03.17- 04.53*

గుళికకాళం      : *మ 12.04 - 01.40*

యమగండం    : *ఉ 08.51 - 10.27*

సూర్యరాశి : *మేషం*              

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 05.48*

సూర్యాస్తమయం :*సా 06.38*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    :*ఉ 05.39 - 08.12*

సంగవ కాలం        :*08.12 - 10.47*

మధ్యాహ్న కాలం    :*10.47 - 01.21*

అపరాహ్న కాలం  :*మ 01.21- 03.55*

*ఆబ్ధికం తిధి        : తిధి ద్వయం బహుళ దశమి/ఏకాదశి*

సాయంకాలం    :*సా 03.55- 06.29*

ప్రదోష కాలం      :*సా 06.29- 08.43*

రాత్రి కాలం        :*రా 08.43- 11.41*

నిశీధి కాలం        :*రా 11.41 - 12.26*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.09 - 04.53*

●●●●●●●●●●●●●●●●●●●●●●

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐚 సంరక్షించండి_*


     *🍁హనుమకృత🍁* 

 *🍁సీతారామ స్తోత్రమ్🍁*


*వసిష్టాను మతాచారం* 

*శతానంద మతానుగం !!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><>


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 11 మే 2026*


          *శ్రీ మహావిష్ణు పురాణం*                                      

                  *85 వ భాగం*


       *శ్రీరామావతారo-6*


           *అరణ్యవాసం*```


భరత శత్రుఘ్నలు కేకయ రాజ్యం వెళ్లిన కొంతకాలానికి అయోధ్య లో దశరథుడు ఓ రాత్రి నిద్రలో దుస్స్వప్నం కన్నాడు. తన ప్రియమైన రాముడు తనను విడిచి దూరంగా వెళ్లిపోయినట్టు వచ్చిన ఆ కల నిద్ర నుంచి దశరథుని మేలుకొల్పింది.


నాడు శ్రవణ కుమారుని శబ్దవేది బాణంతో జంతువనుకుని చంపినప్పుడు, అతని అంధ తల్లితండ్రులు తనను వారిలాగే “పుత్రవియోగంతో చనిపోతావు" అని శాపం ఇచ్చి మరణించిన విషయం జ్ఞాపకం వచ్చింది. "తన కుమారుడు తన నుంచి దూరం కాకుండా ఉండాలంటే శ్రీరాముని వెంటనే అయోధ్యకు రాజును చేయాలి. అప్పుడు తనను, రాజ్యాన్ని వదలి రాముడు వెళ్లడు" అని ఆలోచన చేసి దశరథుడు వెంటనే వసిష్ట మహర్షిని రమ్మని సందేశం పంపాడు.


వసిష్ట మహర్షి రాగానే దశరథుడు “శ్రీరామునికి వెంటనే పట్టాభిషేకం చేయాలి. తగిన ముహుర్తం చూడండి” అని కోరాడు. 


దశరథుని మనస్సు లోని ఆందోళన, భయం తెలుసుకున్న వసిష్టుడు శ్రీరామ పట్టాభిషేకానికి మరుసటి రోజు ఉదయం తెల్లవారుజామునే శుభ ముహూర్తంం పెట్టాడు.


అప్పటికప్పుడు ఏర్పాట్లు చేయించి శ్రీరాముని పిలిచి దశరథుడు పట్టాభిషేకానికి ససంసిద్థుడవి కమ్మని ఆదేశించాడు. 


తండ్రి మాట జవదాటని రాముడు వసిష్టమహర్షి చెప్పినట్లు పట్టాభిషేకానికి ముందు జరగవలసిన విధులలో పాల్గొన్నాడు.


మరుసటి రోజు ఉదయమే శ్రీరాముని పట్టాభిషేకం అని రాజ్యమంతా చాటింపు వేయించారు. అంతపురంలో దాసీజనం చర్చించుకుంటున్న ఈ సమాచారం కైకేయి దాసి మంధర విని పరుగున వెళ్లి కైకేయికి చెప్పింది. “ప్రియపత్ని కైకేయికి తెలియకుండా దశరథుడు రాముని ప్రభువుగా చేయాలని కుట్ర పన్నాడని నాడు వివాహ సమయంలో కైకేయి పుత్రునే రాజుని చేస్తానన్న వాగ్దానాన్ని మరచి పోయాడని, భరతుడికి జరిగే అన్యాయం ఆపమని" మంధర కైకేయిని రెచ్చగొట్టింది.


కైకేయి కోపగృహానికి వెళ్లి దశరథునికి రమ్మని సమాచారం పంపింది. రాముని పట్టాభిషేక వార్త చెప్పి కైకేయిని శాంతపరచాలని వచ్చిన దశరథుని కైకేయి తనకు దేవదానవ యుద్దంలో చేసిన సహాయానికి ఇచ్చిన రెండు వరాలు గుర్తు చేసింది. 

ఆ వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను అని "మొదటి వరముగా రామునికి బదులు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రెండవ వరముగా రాముని పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి పంపాలి"


కైకేయి వరాలు విన్న దశరథుడు దుఖంతో కుప్పకూలి పోయాడు. "భరతుడికి పట్టాభిషేకం చేస్తానని, రాముని మాత్రం వనవాసం పంపాలనే వరం కోరుకోవద్దని" కైకేయికి నచ్చచెప్పడానికి విఫల ప్రయత్నం చేసాడు. 


కైకేయి తను కోరిన వరాలు ఇవ్వవలిసిందే అని పట్టుబట్టేసరికి మాట తప్పలేని దశరథుడు రాముని వీడలేక దుఖంతో సృహ కోల్పోయాడు.


కైకేయి రాముని పిలిపించి దశరథుడు తనకు ఇచ్చిన వరాల గురించి చెప్పి శ్రీరాముని వనవాసానికి వెళ్లమంది. 

తండ్రి మాట శిరసావహించిన రాముడు, సృహ వచ్చిన దశరథుడు వద్దని కోరుతున్నా వినకుండా నారవస్త్రాలు ధరించి పద్నాలుగు ఏళ్ల వనవాసానికి సిద్దమైయ్యాడు. వనవాసం సంగతి తెలిసిన సీతాదేవి, లక్ష్మణుడు శ్రీరాముడు వారించినా పట్టుబట్టి రాముని వెంట వనవాసానికి పయనమయ్యారు.


అయోధ్య ప్రజానీకం కూడా సీతారామ లక్ష్మణుల వెంట అయోధ్య వీడి వనవాసానికి బయలుదేరింది. 


సరయూ నదీ తీరాన నిద్రిస్తున్న అయోధ్య ప్రజలను అర్ధరాత్రి వేళ వదిలి రాముడు సీతాలక్ష్మణులతో నది దాటి అవతల తీరం వైపు వెళ్లాడు.


అయోధ్యలో దశరథుడు రాముని వియోగం భరించలేక మరణించాడు. మంత్రి సుమంతుడు, వసిష్ట మహర్షి కేకయ రాజ్యంలో ఉన్న భరత శత్రుఘ్నలను అయోధ్యకు వెంటనే రప్పించారు. తండ్రి మరణానికి, శ్రీరాముని వనవాసానికి తన తల్లి కైకేయి కోరిన వరములే కారణమని తెలిసిన భరతుడు తల్లి కైకేయిని నిందించి పరిత్యజించాడు. 

వసిష్ట మహర్షి ఉపదేశానుసారం తండ్రి దశరథునికిఅంత్యక్రియలు నిర్వహించాడు.


"తనకు రాజ్యాధికారం పై కోరిక లేదని, అన్న శ్రీరాముడే అయోధ్యకు రాజు" అని ప్రకటించిన భరతుడు శ్రీరాముని అయోధ్యకు తీసుకురావడానికి వసిష్టుడు, తల్లులు, మంత్రులను తీసుకుని సైన్యం వెంట రాగా బయలుదేరి వెళ్లాడు. సరయూ నది అవతల తీరాన గల చిత్రకూటం చేరాడు. 

శ్రీరాముని వద్దకు వెళ్లి రామలక్ష్మణులకు తండ్రి దశరథుని మరణవార్త వినిపించి దుఃఖించాడు.


రామలక్ష్మణులు నదీతీరాన తండ్రికి తర్పణాలు వదిలారు. భరతుడు శ్రీరాముని పాదములకు నమస్కరించి "తల్లి చేసిన తప్పులకు తనకు సంబంధం లేదని, రాజ్యం అగ్రజుడైన శ్రీరామచంద్రునిదేనని, అయోధ్య వచ్చి రాజ్య పాలన చేపట్టమని" ప్రార్ధించాడు.


"తండ్రికి యిచ్చిన మాట తప్పనని, పద్నాలుగు ఏళ్ల వనవాసం తరువాత అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యం స్వీకరిస్తానని" శ్రీరాముడు భరతునికి నచ్చచెప్పాడు. అంతవరకు తన తరపున ప్రతినిధిగా రాజ్యపాలన నిర్వహించమని భరతునికి చెప్పగా- 


భరతుడు "రాముని పాదుకలు సింహాసనం పై ఉంచి పరిపాలన చూస్తానని, పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఒక్క నిమిషం రావడం ఆలస్యమైనా ప్రాణ త్యాగం చేస్తానని" ప్రతిజ్ఞ చేసి అయోధ్యకు వెళ్ళాడు.


అయోధ్య సమీపంలో నందిగ్రామం వద్ద పర్ణశాల నిర్మించుకుని భరతుడు రాజసింహాసనం తెప్పించి రామ పాదుకలు ఉంచి పాలన చేయసాగాడు. తానూ రాముని వలె నారవస్త్రాలు ధరించి వనవాస జీవితం గడుపుతూ ఉండసాగాడు. అయోధ్యకు, అయోధ్య ప్రజలకు దూరంగా ఉండి వనవాసం గడపాలని శ్రీరాముడు తలచాడు. చిత్రకూటం వదలి దండకారణ్యం వైపు బయలుదేరి వెళ్లారు. 


దండకారణ్యం రావణుని అధీనంలో రాక్షసుల నివాసమై ఉంది. తాటకి మారీచ సుబాహువులు తరువాత ఖర దూషణ శూర్పణఖలు దండకారణ్య మధ్యప్రాంతానికి ఆధిపత్యం వహించి మునుల ఆశ్రమాలను ధ్వంసం చేసేవారు. యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డం పడేవారు. మునుల అభ్యర్ధన పై శ్రీరాముడు దండకారణ్యంలో ప్రయాణిస్తూ రాక్షసులను సంహరిస్తూ, మునులకు ప్రశాంత జీవనం కల్పిస్తూ అగస్త్యాశ్రమం చేరాడు.


అగస్త్య మహర్షి మార్గదర్శనం పై దండకారణ్యంలో గోదావరి తీరాన పంచవటిలో ఆశ్రమం నిర్మించుకుని వనవాసం గడపసాగాడు. దండకారణ్యంలో ధర్మాన్ని స్థాపించి మునులకు సహాయంగా ఉంటూ శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కలసి పదమూడేళ్ళు వనవాస జీవితo గడిపాడు.


               *(సశేషం)*

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

రత్నధారణ వలన కలుగు ఫలితాలు

 రత్నధారణ వలన కలుగు ఫలితాలు -


• వజ్రము -


     ఐశ్వర్యా బివ్రుద్ది , నూతన వికాసం , వియోగం అందిన దంపతులను కలుపును. వజ్రమాల ధరించిన సుఖప్రసవం అగును. కలరా, ప్లేగు వ్యాధుల నుంచి రక్షించును.


• వైడుర్యము -


    ఉత్సాహము , శత్రునాశనం , భూతపిశాచ భాద నివృత్తి , ఆపదలు, అపాయములు పోగొట్టును. గర్భిణి స్త్రీలు ధరించినచో సుఖప్రసవం అగును.


• గోమేధికము -


    నష్ట ధనలాభం , ఉద్రేక శాంతి , ఇతరులను ఆకర్షించును.


• పుష్యరాగము -


     వంశాబివ్రుద్ది , భోగబాగ్యములుని ఇచ్చును.


• మరకతము -


   బుద్ధిబలం , జ్ఞాపకశక్తి , వ్రుద్ధినిచ్చి , పిచ్చి , ఉన్మాదం , నరాల బలహీనత , విషదోష దృష్టి దోషములు పోగొట్టును .


• మాణిక్యము -


    ఆయుష్ వృద్ది , ధనం , ఉన్నతస్థితి , మనోవిచార నివారణ , అంటువ్యాధులు అంటకుండా చేయును.


• నీలం -


     అపమృత్యుదోష నివారణ , కీర్తి , ధనము , అదృష్టం కలిగించును. శనిబాధలు ఉండవు.


• పగడము -


     శత్రుజయం , ఉద్రేకశాంతి , రుణ బాధా నివారణ చేయును .


• ముత్యము - 


   కార్యవిఘ్న వినాశనం , ఉష్ణం తగ్గించుట , ఐశ్వర్యం నిచ్చుట , శీఘ్రంగా వివాహం చేయును . 


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .


గమనిక -


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


. కాళహస్తి వేంకటేశ్వరరావు


. అనువంశిక ఆయుర్వేద వైద్యులు


. 9885030034

వైశాఖ పురాణం

 *🐚సోమవారం 11 మే 2026🐚*


 _*🚩వైశాఖ పురాణం🚩*_          

      *24వ అధ్యాయము*


           *వాయుశాపము*


అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.```


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు , ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి ? వానిని చెప్పు ప్రమాణమేది ? వానిని తెలిసికొనుటయెట్లు ? వానికి చెందిన ధర్మములేవి ? వీనిచేనతడు సంతోషించును ? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా ! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు , అనంతుడు , సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి , సంహారము , వీని ఆవృత్తి , ప్రకాశము , బంధమోక్షములు , వీని ప్రవృత్తులన్నియు , నివృత్తులును , పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు ? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు , వేదములు , స్మృతులు , పురాణములు , ఇతిహాసములు , పంచపాత్రాది ఆగమములు , భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని ఇంద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు , ఋషులు , పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము , జ్ఞానము , సుఖము మున్నగునవి యుండుటచే , ప్రత్యక్ష , ఆగమ , అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్టి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు , సప్తర్షులకంటె అగ్ని , అగ్నికంటె సూర్యుడు , సూర్యునికంటె గురువు , గురువుకంటె ప్రాణము , ప్రాణము కంటె ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి , ఆమెకంటె జగద్గురువగు శివుడు , శివునికంటె మహాదేవియగు బుద్ది , బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో , ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా ! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ / రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము , శౌర్యము , ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ ఇంద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి , ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుఅనక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు *"విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరమునుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట , చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు , చూచుచు , పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము , వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము , కన్నులు , చెవులు , మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము , జ్ఞానము , ధైర్యము , వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు , చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము , సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు , ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ ! బ్రహ్మజ్ఞానీ ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు ? దేవతలు , మునులు , మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వమునీ ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా ! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నడుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.```


_*వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_ 


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

జబ్బును కూడా

  ఒక్క జబ్బు కెళితె నొక్కటే వందయ్యి

ఆంగ్ల మందు జనుల యంతు జూచు

కాన రారు నిజము కష్టాల పాలైన

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఒక చిన్న జబ్బును కూడా సక్రమంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేకపోవడం చేత తాత్కాలికంగా ఉపశమనాన్నిచ్చే పెయిన్ కిల్లర్లూ, విటమిన్లూ, ఏంటీ బయోటిక్, ఏస్ప్రిన్లూ, ఆయింట్ మెంట్లూ,నిద్ర మాత్రలూ, ఏంటీ ఎలర్జెటిక్ లూ లాంటి మందులతో కాలం గడుపుతూ క్రమంగా వ్యాధిని అంతర్గతంగా ముదరబెట్టి, నివారణ చేయలేనంత తరువాతి దశకు దానిని తీసుకు వెళ్తారు! ఈలోపు ఆ ఏంటీ బయోటిక్ లేదా పెయిన్ కిల్లర్ లోని కెమికల్ రియాక్షన్ కు లివర్, కిడ్నీ పాడయ్యి, షుగర్, బి. పి, కిడ్నీ డయాలసిస్ బాధితులు గానూ, రక్త కణాలూ, జీర్ణాశయం, రక్త నాళాలు పాడయ్యి, కేన్సర్ రోగులు గానూ మారుతారు! ఆ తర్వాత వాటికి చేసే విచ్చలవిడి పిచ్చి వైద్యంతో అవయవాలూ, ఆస్తులూ పూర్తిగా నాశనమై, అద్దాల మేడల్లోని యంత్రాల సాక్షిగా వాటి మధ్యే ఆవిరైపోతాడు! ఈ టెక్నాలజీ పిచ్చిలో చచ్చి కాటికెళ్తున్నా ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడరు! రసాయనాలూ, యంత్రాలూ వైద్యానికి ఉపయోగిస్తే "అమృతం పుట్టదు, హాలాహలమే పుడుతుంది"! ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఈ అతితెలివి టెక్నాలజీని వదిలించుకొని, శరీరం లోని ఆటో ఇమ్యూన్ మెకానిజంను ప్రేరేపించి, వ్యాధి నివారణ సహజంగా, సంపూర్ణంగా చేయగలిగే హోమియో, యోగా, ధ్యానం, ఆయుర్వేదం, గృహవైద్యం లాంటి విధానాలకు వెళ్ళటం శ్రేయస్కరం! 

సకురు అప్పారావు చెప్పేది నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)