27, ఫిబ్రవరి 2026, శుక్రవారం

పంచాంగం

 


శుక్రవారం*_ 🌹 *🪷27ఫిబ్రవరి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

*🪷27ఫిబ్రవరి2026🪷*      

  *దృగ్గణిత పంచాంగం* 

                       

          *ఈనాటి పర్వం*  

 *సర్వేషాం అమలకైకాదశి*

 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - శుక్ల పక్షం*


*తిథి  : ఏకాదశి* ‌రా 10.32 వరకు ఉపరి *ద్వాదశి*

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : ఆరుద్ర* ఉ 10.48 వరకు ఉపరి *పునర్వసు*

*యోగం : ఆయుష్మాన్* రా 07.44 వరకు ఉపరి *సౌభాగ్య*

*కరణం  : వణజి* ఉ 11.31 *భద్ర* రా 10.32 ఉపరి *బవ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 10.00 - 11.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *ఈరోజు లేదు*

అభిజిత్ కాలం  : *ప 11.57 - 12.44*

*వర్జ్యం    : రా 10.12 - 11.43*

*దుర్ముహూర్తం  : ఉ 08.45 - 09.38 మ 12.44 - 01.31*

*రాహు కాలం : ఉ 10.52 - 12.20*

గుళికకాళం      : *ఉ 07.55 - 09.23*

యమగండం    :*మ 03.17 - 04.45*

సూర్యరాశి : *కుంభం*                  

చంద్రరాశి : *మిధునం/కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 06.36* 

సూర్యాస్తమయం :*సా 06.22*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     :*ఉ 06.27 - 08.48*

సంగవ కాలం      :*08.48 - 11.10*

మధ్యాహ్న కాలం    :*11.10 - 01.31*

అపరాహ్న కాలం :*మ 01.31- 03.52*

*ఆబ్ధికం తిధి         : ఫాల్గుణ శుద్ధ ఏకాదశి*

సాయంకాలం   :*సా 03.52 - 06.14*

ప్రదోష కాలం    :*సా 06.14 - 08.40*

రాత్రి కాలం         :*రా08.40 - 11.55*

నిశీధి కాలం        :*రా11.55 -12.44*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.48- 05.37*

<><><><><><><><><><><><><><><>

        *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


       *ఉమా భగవతీ దుర్గా*

     *చాంద్రీ దాక్షాయణీ శివా*

           

           *🪷ఓం శ్రీ🪷* 

*🌷మహాలక్ష్మీ దేవ్యై నమః*🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

సరస్వతీ స్తుతి

  🌸సరస్వతీ స్తుతి🙏🙏

            

  సీ౹౹వాణిపుస్తకపాణి వాగ్దేవి శారద

    నీకువందనములు నీలవేణి!   

   ఆశ్రిత సురభూజ! హంసవాహిని! దేవి!

             నిలచి నా రసనపై పలుకునిమ్ము!

   నలువరాణివి తల్లి!నాదస్వరూపిణి!

             సకలశాస్త్రవినుత!శరణు శరణు!

   విశ్వసంరక్షణి!వేదస్వరూపిణి!

                     సత్కళాశోభిత సంప్రతీత!

తే౹౹భారతి!మహాసరస్వతి! భవ్యనేత్ర 

     నాద బిందు కళాధరి! నాదరూప!

     భగవతీ! సత్య రూపిణి! నిగమవేద్య!

  శాబ్ది పావకి శ్రుతదేవి జయము జయము🙏🙏


సాహితీ శ్రీ జయలక్ష్మి

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 26 ఫిబ్రవరి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                   1️⃣4️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*       

     

                    *147 వ రోజు*                    

*వన పర్వము సప్తమాశ్వాసము*


       *లంకపై దండెత్తుట*```


రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా! ఇక ఆలస్యం ఎందుకు లంకపై దండెత్తుటకు తగు సన్నాహాలు చెయ్యి” అని చెప్పాడు. 


సుగ్రీవుడు వానరులందరికీ వర్తమానం పంపాడు. నలు దిక్కుల నుండి వానరాలు కోట్ల సంఖ్యలో తరలి వచ్చారు. గవయుడు, గజుడు, కుముదుడు, సుషేషణుడు కోట్ల కొలది వానరాలతో తరలి వచ్చారు. జాంబ వంతుడు భల్లూక సేనతో తరలి వచ్చాడు. శుభ ముహూర్తం చూసి రాముడు రావణుని పై దండయాత్రకు బయలు దేరాడు. హనుమంతుడు సేనా నాయకత్వం వహించాడు. అంగదుడు, నీలుడు, నలుడు అతనికి సాయం నిలిచారు. కపి సైన్యం దక్షిణ తీరానికి చేరింది. 


రాముడు సుగ్రీవునితో “సుగ్రీవా ఈ సముద్రాన్ని దాటే ఉపాయం నువ్వే చెప్పాలి” అన్నాడు. 


కొంత మంది వానరులు తెప్పలు కట్టుకుని దాటుదాం అన్నారు. 


రాముడు “ఇన్ని కోట్ల సైన్యం మన సైన్యం లెక్కకు మించి ఉంది. వీరికి సరిపోవు తెప్పలు పడవలు తయారు చేయడం అసాధ్యం. మనం దాటే సమయంలో శత్రు సైన్యం మన సైన్యాలను సముద్రంలో ముంచి వేయడానికి ప్రయత్నిస్తాయి. నేను ఉపవాస దీక్ష వహించి సముద్రుని పూజిస్తాను. అతని సహాయం లేక ఏమీ చేయలేము. సముద్రుడు లొంగక పోతే నా బాణాలతో సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు. 


ఉపవాస దీక్షతో ఆరాధిస్తున్న రామునికి సముద్రుడు ప్రత్యక్షమైయ్యాడు. రాముడు “మాకు ససైన్యంగా దారి ఇవ్వు. లేకున్న సముద్రాన్ని ఇంకిస్తాను” అన్నాడు. 


సముద్రుడు “రామా! నేను నీకు ఎటువంటి ఆటంకం కలిగించను. నీవు ఈ రోజు ఇంకిస్తే ఇతరులు ఆ మార్గాన్ని అనుసరిస్తారు. నన్ను వశపరచుటకు ప్రయత్నిస్తారు. అది మంచిది కాదు. కపి వీరులలో నలుడు అనే శిల్పకర్మ ఉన్నాడు. వాని సాయంతో సేతువు నిర్మించండి. నేను దానిని సాగర జలాల్లో మునగ కుండా కాపాడతాను. మీరు ఆ సేతువు మీద ప్రయాణించి సముద్రం దాటవచ్చు” అన్నాడు. 


నలుడు వంద యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పున్న ఒక వారధి నిర్మించాడు.```


*విభీషణుడు రాముని చేరుట*```


విభీషణునికి రావణుడితో పొసగ లేదు. అతడు లంక నుండి బయటకు వచ్చి శ్రీరాముని శరణు జొచ్చాడు. శ్రీరాముడు విభీషణునికి అభయం ఇచ్చాడు. శ్రీరాముడు వానర సేనలతో విభీషణునితో వారధి దాటి లంకను చేరుకున్నాడు. శ్రీరాముడు త్రికూట పర్వతంపై ఎక్కి లంకకు నాలుగు వైపులా సైనిక శిబిరాలు ఏర్పాటు చేయించాడు. రావణుని గూఢచారులైన సారణుడు, శకుడు అనే వారు వానర రూపాలు ధరించి వానరులలో కలిసి పోయారు. 

విభీషణుడు వారిని రామునికి పట్టి ఇచ్చాడు. 

రాముడు వారికి సైన్యమంతా చూపించి రావణుని వద్దకు పంపాడు. 


వారు రావణుని వద్దకు పోయి రాముడి సేన అజేయమని గెలువ సాధ్యం కానిదని చెప్పారు. 


రావణుడు లంకకు తగిన రక్షణ కల్పించాడు. 


శ్రీరాముడు అంగదుని పిలిచి..  “అంగదా! నీవు రావణుని వద్దకు వెళ్ళి సీతను విడువమని చెప్పు. తగిన విధముగా బుద్ధి మతి చెప్పుము” అన్నాడు. 


అంగదుడు రావణుని కొలువు కూటమిలో ప్రవేశించి “రావణా! సూర్య వంశ సంభూతుడు రాముడు నీతో ఇలా చెప్పమన్నాడు. ‘అడవులలో తపస్సు చేసుకుంటున్న మునులను చంపావు, దేవతాస్త్రీలను బంధించి మహాపరాధం చేసావు ఇవన్నీ ఒక ఎత్తు! నీవు నాపట్ల చేసిన అపరాధం ఒక ఎత్తు. నా భార్య సీతను అపహరించి మహాపరాధం చేసావు. ఆమెను నాకు అప్పగించు లేకున్న నాతో యుద్ధం చెయ్యి. నీకు మరొక మార్గం లేదు. నీకు మానవులంటే చులకన భావం ఉంది. రాక్షసకులం అన్నది లేకుండా చేస్తాను జాగ్రత్త” అని అంగదుడు రాముడు చెప్పమన్నది చెప్పాడు. 


రావణుడు కను సైగ చేయగానే కొంతమంది రాక్షసులు అంగదుని పట్టు కోవడానికి వచ్చారు. అంగదుడు పైకి ఎగిరి వారిని కిందకు తోసాడు. 

ఆ తోపిడికి వారు మరణించారు. తరువాత అంగదుడు రాముని వద్దకు పోయి జరిగినది చెప్పాడు. ```

            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

యశోదా దేవి శ్రీకృష్ణ పరమాత్మకు

  అందరికీ శుభోదయం. 

🌸 యశోదా దేవి శ్రీకృష్ణ పరమాత్మకు రాముల వారి కథ చెబుచున్న సందర్భం🙏🙏



శ్లో. *రామో నామ బభూవ హుం, తదబలా సీతేతి హుం, తౌ పితు ర్వాచా పంచవటీతటే విహరతస్తామా హరద్రావణః ।*

*నిద్రార్థం జననీ కథామితి హరే ర్హుంకారతశ్శృణ్వతః 'సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధను' రీతి వ్యగ్రా గిరః పాంతు వః ॥*


(రామావతారము తరువాత కృష్ణావతారము- యశోద కృష్ణుని నిద్ర పుచ్చుటకు కథ చెప్పుచున్నది! కృష్ణుడు ఊఁ కొట్టుచున్నాడు)


తా॥ *"అనగా అనగా రాముడనే వాడున్నాడు!" - "ఊ!" - "అతని భార్య సీత!'” "ఊ!” వారిద్దరును తండ్రి మాటను అనుసరించి గోదావరీతీరంలో పంచవటిలో విహరించు చుండగా సీతను రావణుడెత్తుకొని పోయినాడు!" - అని చెప్పగానే నిద్రలోనికి వెళ్ళుచున్న కృష్ణుడు ఉలికిపడి "లక్ష్మణా! నా ధనుస్సు! నా ధనుస్సు ధనుస్సు!” అనుచు కలవరించిన కలవరింతలు మిమ్ము రక్షించుగాక! (కృష్ణుడు ఆవేశములో వెనుకకు రామావతారము లోనికి వెళ్ళి, ఇప్పటి తన అవతారమును మరచినాడు! రాముడే కృష్ణుడు కదా!)*

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

సాహిత్య కల్పవృక్షం విశ్వనాథ:

  సాహిత్య కల్పవృక్షం విశ్వనాథ:


"కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సాహితీ జగత్తులో ఒక యుగకర్త. ఆలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి. నవ్య సంప్రదాయోద్యమ నాయకుడు. 

నాలుగు దశాబ్దాల పాటు యుగకర్తగా తెలుగు సాహిత్యాన్నంతా ప్రభావితం చేసిన ప్రతిభాశాలి. ప్రజ్ఞామూర్తి. 

రామాయణ కల్ప వృక్షం ఆధ్యాత్మిక అన్వేషణకు అద్దంపట్టే ఒక ఇతిహాస కావ్య కల్పన. 

ఆయన పలుకే ఒక ప్రమాణం. విశ్వనాథ ఒక కల్ప వృక్షంలా భాసించారు.

 వెయ్యేళ్ల తెలుగు సాహిత్యంలో కవి సార్వభౌముడు అంటే శ్రీనాధుడు.

కవిసమ్రాట్ అంటే విశ్వనాథ సత్యనారాయణ. 

వీరిద్దరూ బిరుదులకే

బిరుదాలైనవారు. 

విశ్వనాథ ఈ శతాబ్ది తెలుగు కవులందరిలో జీనియస్. ఆయన ఏ బాటలో నడిచినా సమ్రాట్టు. 

రచయితగా విశ్వనాథ ఒక సమగ్ర వ్యక్తి..కళాప్రపూర్ణుడు. ఆధునిక రస దర్శనాన్ని వివిధ ప్రక్రియల ద్వారా , ప్రయోగాల ద్వారా ప్రదర్శించి చూపించి నవ్య సంప్రదాయ యుగకర్తగా ప్రశంసింపబడుతున్నాడు కవి సమ్రాట్ విశ్వనాథ." 

సుప్రసిద్ధ సాహిత్య విమర్శకులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం గారు 

నుడివిన ఈ నాలుగు మాటలు చాలు "కవిసమ్రాట్" శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి మహత్తు తెలుగు సాహిత్య జగత్తులో ఎంత గొప్పదో గ్రహించేందుకు.

" జయంతి తే సుకృతినో రస సిద్దాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం" అంటారు భర్తృహరి. రససిద్ధి కలిగిన సత్కవులకు జయమగుగాక. 

రససిద్ధిని పొందిన సత్కవీశ్వరుల కీర్తి శరీరాలకు ఎలాంటి మరణంగాని..వార్ధక్యం గానీ ఉండవు.

 వారు కీర్తి కాయంతో సదా వర్ధిల్లుతూనే ఉంటారు.

భర్తృహరి పేర్కొన్నట్లు విశ్వనాథ సత్యనారాయణ గారు రస సిద్ధిని పొందిన సత్కవీశ్వరులు. 

కవిత్వ దీక్షా విధిని చేపట్టిన ఒక మహాయోగి. కవితా ఋషి.

తెలుగువారి పూర్వ పుణ్య తపః ఫలంగా తెలుగునాట కృష్ణా తీరంలోని నందమూరు 

గ్రామంలో 1895 సెప్టెంబర్ 10 మన్మథ నామ సంవత్సరం భాద్రపద బహుళ షష్ఠి మంగళ వారం ఉదయం శోభనాద్రి.. పార్వతమ్మ దంపతుల పుణ్య గర్భాన ప్రభవించి వెయ్యేళ్ల తెలుగు సాహిత్య చరిత్రలో తనంతటి విలక్షణ కవి మరొకరు లేరని నిరూపించి విభిన్న ప్రక్రియా రచనలతో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులను పరిపుష్టం చేసి తెలుగు జాతి యశశ్చంద్రికలను దశదిశలా వ్యాప్తి చేసి  

"కవిసమ్రాట్" గా నేటికీ విరాజిల్లుతున్న ఘనత విశ్వనాథ సత్యనారాయణ గారికి దక్కుతుంది. రామాయణ కల్పవృక్షం కావ్య రచనతో 

తెలుగు జాతికి మొట్టమొదటిసారిగా "జ్ఞానపీఠ" పురస్కారాన్ని సాధించిపెట్టి జాతీయ స్థాయిలో తెలుగు జాతి కీర్తి పతాక రెపరెపలాడేలా చేసిన ఘనత కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికే చెల్లుతుంది. 

1976 అక్టోబర్ 18 న పరమపదించేటంత వరకు విశ్వనాథ సాహిత్య ప్రస్థానం సాగుతూనే ఉంది. 

శ్రీశ్రీ అభివర్ణించినట్లు విశ్వనాథ నిజంగానే తెలుగువారి 'గోల్డు నిబ్'.తెలుగు జాతి మలి నన్నయ్య కూడా! 

 విశ్వనాథ సత్యనారాయణ గారిని ' కవిసమ్రాట్ ' గా తొలుత అభివర్ణించింది భావరాజు నరసింహారావు గారు. 

ఆ బిరుదం విశ్వనాథ వారి ఇంటి పేరుకు ముందు చేరి ఆయనకు సామాజికంగా.. సాహిత్యపరంగా ఎంతో గౌరవాన్ని సంతరించి పెట్టింది. విశ్వనాథ వారికి

 జాలి గుణంతోపాటు కోప స్వభావం కూడా కొంచెం ఎక్కువే. 

ఆయన మాట తీరు క్రొత్త వారికి ఆయనను అహంకారిగా పొరబడేలా చేస్తుంది. ఆయనతో కొంత చనువు పెరిగాక ఆయన హృదయ మార్దవం ఎంత గొప్పదో తెలిసివస్తుంది.

ప్రతిభ కలిగిన కవికి తాను నిజంగా గొప్ప వాడిననే భావన కొంత అహంకారాన్ని కలుగ చేస్తుంది.

అది వారికి 

శోభస్కరమే అవుతుంది తప్ప నింద్యంకాదు.

ఎవరైనా వితండ వాదం చేస్తున్నా..అడ్డదిడ్డమైన ప్రశ్నలు వేసినా..సనాతన ధర్మాన్ని కించపరచేందుకు యత్నించినా విశ్వనాథ సత్యనారాయణ గారికి కోపం కలిగేది.

ఒకసారి ఒక వ్యక్తి విశ్వనాథ గారిని అదేపనిగా విసిగిస్తుంటే విశ్వనాథ గారు కొంచెం కోపగించుకున్నారు.

అందుకు ఆ వ్యక్తి మీరు వికారంగా మాట్లాడతారు. "వికారి" నామ సంవత్సరంలో పుట్టి ఉంటారు అంటూ చమత్కరించాడు. 

అందుకు విశ్వనాథ సత్యనారాయణ గారు నేను "మన్మథ" నామ సంవత్సరంలో పుట్టాను. 

నీవు మాత్రం కచ్చితంగా "ఖర" నామ సంవత్సరంలోనే పుట్టి ఉంటావు అనేసరికి ఆ వ్యక్తి ముఖంలో కత్తివేటుకు నెత్తురు చుక్క కూడా లేకుండా పోయింది.

ఈ విపరీత కోప గుణమే కొన్నిసార్లు విశ్వనాథ వారిని కొందరికి దూరం చేసింది. విశ్వనాథ గారి వాక్కు దారుణాఖండల శస్త్ర తుల్యం.

అయితే ఆయన హృదయం మాత్రం నవనీత కోమలం. "విశ్వనాథ వారి మాట కరుకు కావచ్చు. కాని వారి మనసు వెన్న " అని మండలి వెంకట కృష్ణారావు గారు పేర్కొనడం ఇందుకు నిదర్శనం.

ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిస్తే విశ్వనాథ సత్యనారాయణ గారు చేతనైనంత సహాయం చేసేవారు.

ఎంతోమంది బీదసాదలను విశ్వనాథ వారు ఆదుకున్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారిని బాగా ఎరిగిన ఒక వృద్ధుడు తాను అన్నం తిని రెండు రోజులు అయిందని రెండు రూపాయలు ఉంటే సహాయం చేయమని ప్రాధేయపడ్డాడు. 

వెంటనే విశ్వనాథ వారు ఆ వృద్ధుడిని సమీపంలోని హోటల్ కు తీసుకువెళ్లి ఒక నెలకు సరిపడే భోజన టిక్కెట్లను ఇప్పించారు. 

ఆ వృద్ధుడు ఎప్పుడు వచ్చినా ఆతడికి భోజనం పెట్ట వలసినదని డబ్బులు తాను ఇస్తానని చెప్పారు.

విశ్వనాథ వారిని అడిగేందుకు ముందు ఆ వృద్ధుడు మరికొంత మందిని చేయి చాచి అడిగినా వారు రిక్త హస్తం చూపారు. ఎవరు ఇబ్బందులలో ఉన్నా వారిని ఆదుకునే దయా సముద్రుడు విశ్వనాథ అనేందుకు ఆయన ఆ వృద్ధుని ఆదుకున్న తీరే ఉదాహరణ.

విశ్వనాథవారి కవిత్వంలో పాషాణ పాకాన్ని చూసిన వారికి ఆయన హృదయంలోని కారుణ్య గుణం అర్థం కాకపోవడం ఎంత విచిత్రం!! విశ్వనాథ వారిది పాషాణ పాకమైతే ఆయనను అర్థం చేసుకోలేని వారిది పాషాణ హృదయమని చెప్పాలి.

 విశ్వనాథ సత్యనారాయణ గారి ఇంటిలో ఒక కుటుంబం అద్దెకుండేది. 

వారి అమ్మాయి వివాహం కోసం కొంత డబ్బు అవసరమై ఆ కుటుంబ యజమాని విశ్వనాథ గారిని ఆశ్రయించారు. 

విశ్వనాథ వారు డబ్బు సహాయం చేసి ఆ వివాహం నిర్విఘ్నంగా జరిగేలా చూసారు. 

కొంతకాలానికి ఆ కుటుంబ యజమాని విశ్వనాథ గారికి తిరిగి డబ్బులు ఇవ్వబోతే విశ్వనాథ వారు తీసుకోలేదు. పైగా మీరు ప్రతినెలా నాకు చెల్లించే ఇంటి బాడుగ డబ్బులను దాచిపెడుతూ వచ్చాను. 

మీ డబ్బులే నేను మీకు ఇచ్చాను అంటూ విశ్వనాథ ఆ డబ్బులు తీసుకోవడానికి సున్నితంగా నిరాకరించారు. విశ్వనాథ వారి సమున్నత వ్యక్తిత్వానికి ఆ కుటుంబం వేనవేల కృతజ్ఞతలు తెలుపుకుంది. 

ఎందరో పేద విద్యార్థులకు విశ్వనాథ గారు ఫీజులు చెల్లించి వారి చదువులు నిర్విఘ్నంగా సాగేలా సహాయపడ్డారు. అయితే తాను చేసే దానధర్మాల గురించి విశ్వనాథ ఎప్పుడూ ప్రచారం చేసుకునేవారు కాదు.

ఒకసారి విశ్వనాథ గారిని ఒక సమాజంవారు మంచి శాలువా తో ఘనంగా సన్మానించారు. విశ్వనాథ గారు రిక్షాలో ఇంటికి వెళుతూ ఒక వ్యక్తి చలికి వణుకుతుండడం గమనించి రిక్షా ఆపించి తన ఒంటిపైని శాలువాను చలితో బాధపడుతున్న వ్యక్తికి కప్పి వెళ్లారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి తండ్రి శోభనాద్రిగారు మహాదాత.

తండ్రంటే విశ్వనాథ వారికి అమిత భక్తి..గౌరవం.

"నా తండ్రి యనన్ దధీచి శిబి కర్ణాదుల్ పునారూప సంస్థానం బందిన కర్మయోగి " . "అట్టి తండ్రికి పరమ భక్తాగ్రగణ్యు డైన పుత్రుడను" అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు తమ తండ్రి శోభనాద్రి గారి గురించి బహుధా శ్లాఘించారు.

అడిగినవారికి లేదనకుండా దానధర్మాలు చేసి శోభనాద్రి నిరుపేదగా మారారు.

ఒకసారి శోభనాద్రిగారు బజారులో నడిచివస్తుంటే గోచి ధరించిన ఒక పేదవాడు ఎదురుపడి అయ్యా!! కట్టుకునేందుకు ఏదైనా వస్త్రం ఉంటే ఇమ్మని అర్ధించాడు . 

శోభనాద్రిగారు వెంటనే తన పై వస్త్రాన్ని నడుముకు కట్టుకుని తన పంచెను ఆ వ్యక్తికి ఇచ్చివేసారు. 

శోభనాద్రిగారి వద్ద ఇచ్చేందుకు ఆ సమయంలో ఆ పంచె తప్పితే మరేమిలేదు.

 అంతటి మహాదాత..కారుణ్యహృదయులు శోభనాద్రిగారు. 

తండ్రి దాన గుణం..కారుణ్య హృదయం విశ్వనాథ వారికి కూడా వారసత్వంగా సంక్రమించింది.

జ్ఞానపీఠ పురస్కారం కింద ఆయనకు లభించిన సొమ్ము తొందరగానే ఖర్చయిపోయింది.

డబ్బులకు ఆయన ఇబ్బంది పడుతుండడం గమనించిన కొందరు శ్రేయోభిలాషులు విశ్వనాథ గారిని ఆ విషయమై ప్రశ్నించడంతో విశ్వనాథ వారు నా జేబుకు కనిపించని రంధ్రాలు చాలానే ఉన్నాయి అంటూ ఆ డబ్బులో ఎక్కువ భాగం దానధర్మాలకు, దేవాలయ అభివృద్ధికి ఖర్చై పోయిన వైనాన్ని పరోక్షంగా వెల్లడించారు.

 ప్రతిభ ఎవరిలో ఉన్నా కులమతాలకు అతీతంగా విశ్వనాథ వారిని మెచ్చుకుని గౌరవించే వారు. 

ఒక సందర్భంలో జ్ఞానానంద కవి కవిత్వాన్ని విశ్వనాథ వారు మెచ్చుకుని ఆయనకు రెండు వందల రూపాయలు ఇచ్చి సత్కరించారు. 

మరుసటి రోజు ఒక రూపాయి అవసరమై విశ్వనాథ వారు ఆ రూపాయి కూడా తన వద్ద లేకపోవడంతో తెలిసిన మిత్రుని వద్ద ఆ రూపాయిని అప్పుగా తీసుకున్నారట. విశ్వనాథ గారి హృదయం ఎటువంటిదో గ్రహించేందుకు ఈ సంఘటన ఒక మచ్చుతునక. 

నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారితో విశ్వనాథ వారికి ఆత్మీయపూర్వక మైత్రి. వారిరువురి నడుమ చోటుచేసుకున్న చెణుకులను వారిరువురి నడుమ స్పర్ధగా చిత్రించిన మేధావులు కూడా ఉన్నారు. 

అయితే విశ్వనాథ..జాషువా పరస్పర గౌరవ భావంతో మెలిగారు. 

తనకు కుల మత శాఖా భేదాల పట్టింపులు లేవని విశ్వనాథ ఒక సందర్భంలో స్పష్టం చేశారు. 

విశ్వనాథ సత్యనారాయణ కవిత్వం తమ కవిత్వం కంటే తక్కువేమీ కాదని చెళ్లపిళ్ల 

వేంకటశాస్త్రి గారు అనడం తమ శిష్యునిపట్ల ఆయనకు గల వాత్సల్య భావాన్ని..విశ్వనాథ వారి కవన ప్రతిభను

చాటి చెబుతుంది. 

శిష్యుడైన విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షం కావ్యాన్ని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు ఎంతగానో మెచ్చుకున్నారు.

తన ఎదుగుదలకు సహాయపడిన వారిని..తనను అవసరంలో ఆదుకున్న వారిని విశ్వనాథ సత్యనారాయణ గారు ఎన్నడూ మరచి పోలేదు. తనకు సహాయం చేసిన వారికి ప్రత్యుపకారం చేసారు. ఇబ్బందులలో ఉన్నప్పుడు తనను ఆర్ధికంగా ఆదుకున్న వారిని విశ్వనాథ వారు జీవితంలో ఎన్నడూ మరువలేదు.  

తనకు ఆర్ధిక పరిపుష్టి చేకూరిన తరువాత విశ్వనాథ గారు వారి ధనాన్ని వారికి తిరిగి ఇచ్చివేసారు. 

తీసుకునేందుకు నిరాకరించిన వారిని సున్నితంగా ఒప్పించారు. 

తనకు ఉద్యోగం లేని కాలంలో విశ్వనాథ సత్యనారాయణ గారు కుటుంబ జరుగుబాటు కోసం తన పుస్తకాలను చేతిసంచిలో పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాలకు కాలి నడకన వెళ్లి విక్రయించి ఆ వచ్చే ధనంతో కుటుంబాన్ని కొన్నాళ్లు పోషించారు. 

ఉన్నత పదవులు లభించి కారులో తిరిగే స్థాయి కలిగినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు గర్వించలేదు.

దేహికి సుఖదుఃఖాలు రెండూ సమానమేనని భావించిన గొప్ప స్థితప్రజ్ఞులు విశ్వనాథ. 

భార్య వరలక్ష్మి అంటే విశ్వనాథ సత్యనారాయణ గారికి అమితమైన ప్రేమ..గౌరవం..ప్రాణం.. అభిమానం. 

భార్య గతించిన సందర్భంలో విశ్వనాథ సత్యనారాయణ గారు అనుభవించిన దుఃఖం సామాన్యమైనదికాదు.

 సీతా వియోగ సమయంలో శ్రీరాముడు అనుభవించిన పరివేదనతో సమానమైన దుఃఖమది.

తన అభ్యుదయానికి..ఉన్నతికి..

తాను మహాకవిగా ఎదగడానికి తన భార్య వరలక్ష్మి కారణమని విశ్వనాథ చాటారు. భార్యాభర్తల నడుమ ఉండవలసిన అన్యోన్యతకు విశ్వనాథ సత్యనారాయణ.. వరలక్ష్మి దంపతులు ప్రతీక. 

కష్ట సుఖాలలో..కలిమి లేములలో ఆ దంపతులు కలిసే జీవించారు.

 వరలక్ష్మీ త్రిశతి కావ్యం విశ్వనాథ వారికి భార్యపట్ల గల అపార ప్రేమను వెల్లడి చేస్తుంది.

శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్యం విశ్వనాథ సత్యనారాయణ గారిని జ్ఞానపీఠ శిఖరాగ్రాన 

సు ప్రతిష్ఠితుని చేసింది. 

జీవుని వేదన..తండ్రి శోభనాద్రి ఆదేశం రామాయణ కల్పవృక్షం కావ్యరచనకు ప్రేరేపణ అయ్యాయి.

 తెలుగులో రామాయణాలు చాలా ఉన్నాయి కదా! 

మరలా మీరు రామాయణం వ్రాయడమెందుకు!  

అంటూ ఆక్షేపించిన వారికి విశ్వనాథ వారు 

" మరలనిదేల రామాయణంబన్నచో నీ ప్రపంచకమెల్ల నెల్ల వేళ తినుచున్న యన్నమే తినుచున్న దిన్నాళ్ళు తన రుచి బ్రదుకులు తనవి గాన , 

చేసిన సంసారమే సేయుచున్నది తనదైన యనుభూతి తనదిగాన , తలచిన రామునే తలచెద నేనును..నా భక్తి రచనలు నావిగాన" 

అంటూ సొగసుగా..గడుసుగా సమాధానమిచ్చారు. శ్రీమద్రామాయణ కల్పవృక్షం కావ్య రచన పూర్తి అయ్యేటంత వరకు శ్రీరామ భక్తిసామ్రాజ్య అధిష్ఠితుడైన ఆంజనేయ స్వామి విశ్వనాథ సత్యనారాయణ గారికి రక్షగా నిలిచాడు. 

"రామాయణ కల్పవృక్షం" కావ్య రచనకు గాను భారత ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని "జ్ఞాన పీఠ" పురస్కారంతో ఘనంగా సత్కరించింది.

ఇక్కడ మరో విశేషం ముచ్చటించాలి. 

విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ రచనకు పూనుకున్నా రోజులు లేదా వారాలు లేదా కొన్ని నెలల్లో పూర్తి అయ్యేది. రామాయణ కల్పవృక్షం కావ్య రచనకు మాత్రం మూడు దశాబ్దాల సమయం పట్టింది. ఇదే విషయాన్ని కొందరు ప్రశ్నించగా విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ రామాయణం నేను రాయలేదు..ఆ శ్రీరాముడే రచించాడు. 

ఆ కావ్యం రచించేందుకు ఆయనకు ముప్పై ఏళ్లు పట్టింది అంటూ సమాధానమిచ్చారు. దీనినిబట్టి రామాయణ కల్పవృక్షం కావ్య రచన 

శ్రీరామానుగ్రహ ఫలమని భావించాలి. 

పోతన మహాకవి కూడా " పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుం డుట , నే పలికిన భవ హర మగునట, పలికెద, వేరొండు గాథ పలుకగనేలా " అంటూ ఆ శ్రీరామ చంద్రుడే తన చేత భాగవత కావ్య రచన చేయించుకున్నాడని వినయంతో పలికారు. 

అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా రామాయణ కల్పవృక్షం ఆ శ్రీరాముని దివ్య అనుగ్రహ ఫలమేనని..తన చేత ఆ శ్రీరామ చంద్రుడే రామాయణ కల్పవృక్షం రచింప చేసుకున్నాడని విశ్వసించారు.

శ్రీరామ నామ మంత్రంతో పాటు హనుమ మంత్రాన్ని కోట్ల పర్యాయాలు జపించి మంత్రసిద్ధి పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆ రఘుకుల తిలకుడైన శ్రీరాముడు, శ్రీరామ బంటైన ఆంజనేయ స్వామి, శారదా స్వరూపమైన ఆ జగన్మాత ఎల్లప్పుడూ వెంటనంటి రక్షిస్తూ ఉండేవారనేందుకు పలు తార్కాణాలు కూడా ఉన్నాయి.

ఇంతకీ విశ్వనాథ సత్యనారాయణ గారి ఆశయం ఏమిటి? మందిలో ఒకనిగా మిగలడమా!! కాదు.. పూర్వ కవీంద్రులు వేసిన బాటకు మరిన్ని మెరుగులు దిద్దడం.. మహాకవుల శ్రేణిలో తానూ ఒక ప్రత్యేకత కలిగిన మహాకవిగా తన స్థానాన్ని సుస్థిరపరచుకోడం విశ్వనాథ గారి ఆశయం.

" నన్నయ్యయు దిక్కన్నయు నన్నావేశించిరి 

పరిణాహ మనస్సంచ్చన్నత వారలు పోయిన తెన్నున మెరుగులను దిద్దుచు బోదున్" అంటూ విశ్వనాథ స్పష్టం 

చేసారు.

పూర్వ తెలుగు కవులలో ఎవరి శైలి ఎటువంటిదో విశ్వనాథ సత్యనారాయణ చక్కగా విశ్లేషించి చెప్పారు. 

"ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి, తిక్కన్న శిల్పపు దెనుగు తోట,

యెర్రన్న సర్వ మార్గేచ్చా విధాత్రుండు, పోతన్న తెలుగుల పుణ్యపేటి, శ్రీనాధుడు రసప్రసిద్ధ ధారాధుని, కృష్ణ రాయడనన్య కృతి ప్రబంధ, పెద్దన్న వడపోత పెట్టినిక్షు రసంబు, రామకృష్ణుడు సురారామ గజము, ఒకడు నాచన సోమన్న యుక్కివుండు చెరిపి పదిసార్లు దిరుగ వ్రాసినను మొక్కవోని యీ యాంధ్ర కవిలోక మార్ధమణుల మద్గురు స్థానములుగ నమస్కరించి

భాస కాళిదాస భవభూతి దిజ్ఞాగులకు, బ్రశస్త వాగ్వి లక్షణుడు మురారిభట్టునకును, రామకథా భాష్యకారులకును మోడ్పు కై ఘటించి " అంటూ సంస్కృతాంధ్ర మహా కవులలో ఎవరు తనకు గురు సదృ శులో..ఆదర్శమో పేర్కొంటూ విశ్వనాథ సత్యనారాయణ వారికి వినయంతో అంజలించారు. 

ఆ మహానుభావుల సమిష్టి సారస్వత అంశను విశ్వనాథ సత్యనారాయణ గారిలో మనం దర్శిస్తాము.

అందుకే విశ్వనాథ సత్యనారాయణ తెలుగు జాతికి..కవులకు ప్రాతః స్మరణీయులై వెలుగొందు తున్నారు.

కిన్నెర నడకలు కవితలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకచోట ' బంగారు తీగలో పానకమ్మై పోయే ' అని వర్ణిస్తారు.

నిజమే! విశ్వనాథ వారి కవిత్వం కూడా బంగారు తీగలో ప్రవహించే పానకమే!! వెయ్యి కాగితాలు చెడగొట్టి ఒక కవిత రాసే అల్ప కవి కాదుగదా!!  

విశ్వనాథ. 

విశ్వనాథ 

ప్రవహించే పద్య ధార.

ఆ రుచిని..మాధుర్యాన్ని ఆస్వాదిస్తేనే ఆ ఆనంద సిద్ధి..రస సిద్ధి అనుభవమయ్యేది. 

రసము వేయి రెట్లు గొప్పది నవ కథా ధృతిని మించి అని విశ్వనాథ వారు అనడంలో ఆంతర్యం ఇది. 

లోకం పట్టనంత

సంఖ్యలో కవుల సంఖ్య పెరిగిపోతున్న నేటి రోజుల్లో అసలు ' సుకవి ' అని ఎవరిని ప్రస్తావించాలి!! 

దీనికి కూడా విశ్వనాథ వారే సమాధానం చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారి దృష్టిలో సుకవి అనే దానికి ఒక్క వాల్మీకి తప్ప వేరెవరూ ఆ పిలుపునకు అర్హులుకారు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు కవుల గురించి వెలిబుచ్చిన అభిప్రాయం కూడా విశ్వనాథ వారి అభిప్రాయాన్ని సమర్ధించేదిగా ఉండడం గమనార్హం.

 "వేయి పడగలు" విశ్వనాథ సత్యనారాయణ గారి కీర్తిని శాశ్వతం చేసిన గొప్ప నవల. 

తన రచనలలో విశ్వనాథ సత్యనారాయణ గారు తన సమకాలీన సమాజాన్ని.. వ్యక్తుల పోకడలను..భిన్న మనస్తత్వాలను పాత్రల రూపంలో తెలియ చెప్పారనేది విశ్లేషకుల అభిప్రాయం.

ఒక్క రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు ఈ రెండు రచనలు చాలు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు సాహిత్య ప్రపంచంలో శాశ్వతంగా నిలిచేందుకు.

 ప్రకృతి వర్ణనలు విశ్వనాథ వారి కవిత్వంలో పాఠకులను ఆకర్షిస్తాయి. 

ఏ మాసంలో ఏ పక్షంలో రాత్రి సమయంలో చంద్రుని కాంతి భూమి పై ఎలా ప్రసరిస్తుందో గమనించేందుకు తాను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా గడిపానని విశ్వనాథ వారు ఒక సందర్భంలో పేర్కొన్నారు. కిన్నెరసాని పాటలు.. ఆంధ్ర ప్రశస్తి వంటి వాటితో పాటు విశ్వనాథ వారు వివిధ ప్రక్రియలలో శతాధిక రచనలు చేసి మహాకవి పదవికి..కవిసమ్రాట్ బిరుదానికి తాను నూటికి నూరుపాళ్లూ అర్హుడినేనని నిరూపించుకున్నారు. 

దేనికీ.. ఎవరికీ భయపడని..ఎవరికీ తలవంచని మేరు నగ ధైర్య ధీరుడు విశ్వనాథ. 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని ఆస్థాన కవిగా, శాసన మండలి సభ్యునిగా నియమించి తనను తాను గౌరవించుకుంది.

1935 లో విశ్వనాథ సత్యనారాయణ గారికి కవి సమ్రాట్ బిరుదు ప్రదానం జరిగింది.

1963 లో విశ్వనాథ మధ్యాక్కరలు రచనకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.

1964 డిసెంబర్ 12 న ఆంధ్ర విశ్వ విద్యాలయం కళా ప్రపూర్ణ బిరుదంతో గౌరవించింది. 1970 లో పద్మభూషణ్ లభించింది. 

1971 ఫిబ్రవరిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం డాక్టరేట్ ను ప్రదానం చేసింది. 1971 అక్టోబర్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవిగా విశ్వనాథ

నియమితులయ్యారు.

 1971 నవంబర్ 16 న సర్వోన్నత మైన జ్ఞానపీఠ్ పురస్కారంతో భారత ప్రభుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారిని గొప్పగా గౌరవించింది.

జాతీయదృష్టితో భారతీయత పరిరక్షింపబడాలనే తపన.. స్వస్థాన వేష భాషలు పరిరక్షింపబడాలనే ఆరాటం విశ్వనాథ వారిలో చూస్తాము.

సమాజంలో ధర్మం కనుమరుగు కాకుండా రక్షింప బడాలనేది విశ్వనాథ వారి ఆశయం. పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుకరించడం అనర్ధ దాయకమని విశ్వనాథ హెచ్చరించారు.

 నైతిక విలువలు మంచులా కరిగి ధన ప్రభావం పెరిగి మనిషితనం మృగ్య మవుతున్నదని విశ్వనాథ ఆవేదన చెందారు.

" ధనమనగ నెట్టులుండునొ జన మెరుగరు మున్ను బ్రదుకు సారము కలిమిన్, ధనమే జీవిత లక్ష్యం బనగా రసహీనమయ్యె నందరి బ్రదుకుల్ " అంటూ విశ్వనాథ విశ్లేషించారు. 

పద్యంలో అభ్యుదయ కవిత్వాన్ని పండించిన ఘనత కూడా విశ్వనాథ వారికి చెల్లుతుంది. 

"వందమంది పేదవారి నెత్తురు గడ్డకట్టి నీవు మేడ కట్టినావు, వారి యుసురు తీవ్ర వాయువు వీవగా తూలి మేడ నేల గూలి పోవు" అంటూ విశ్వనాథ పెత్తందారులను.. దోపిడీ శక్తులను హెచ్చరించారు. 

సమ సమాజాన్ని.. సామాజిక కల్యాణాన్ని విశ్వనాథ తన రచనల ద్వారా కాంక్షించారని చెప్పవచ్చు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలు వేటికవే ప్రత్యేకం. ఆంధ్రుల పౌరుష ప్రతాపాలను.. ఆంధ్ర జాతి ఘనతను ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి వంటి రచనల ద్వారా చాటి చెప్పారు. ఋతు సంహారం, శ్రీకృష్ణ సంగీతం, ఝాన్సీ రాణి, రురు చరిత్రము, శివార్పణము, కిన్నెరసాని పాటలు, మా స్వామి, శశి దూతము, భ్రష్ట యోగి, భ్రమర గీతలు, గోపాలోదాహరణం, పాముపాట, అనార్కలి, అవతార పరివర్తనము, అమృత శర్మిష్ఠం, నన్నయ గారి ప్రసన్న కథా కవితార్ధ యుక్తి, అల్లసాని వారి అల్లిక జిగిబిగి, ఒకడు నాచన సోమన్న,గురు ప్రసాదం, వేయి పడగలు,హాహా హూ హూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు,

మా బాబు, చెలియలి కట్ట, 

చందవోలు రాణి,కడిమి చెట్టు, బద్దన్న సేనాని , ఏకవీర, దంతపు దువ్వెన, దమయంతీ స్వయంవరం వంటి శతాధిక రచనలు వివిధ ప్రక్రియలలో విశ్వనాథ సత్యనారాయణ గారి లేఖిని నుండి వెలువడ్డాయి. 

దుర్యోధనుడు, వేన రాజు,నర్తన శాల వంటి రూపకాలను విశ్వనాథ రచించారు. 

ఎమెస్కో వారు ప్రచురించిన పలు కావ్యాలకు విశ్వనాథ వారు విలువైన పీఠికలు రచించారు. 

సంస్కృతంతో పాటు ఆంగ్లంలో కూడా విశ్వనాథ పలు రచనలు చేశారు. 

ఆంగ్ల భాషలో విశ్వనాథవారి ప్రావీణ్యం అపారం.

పురాణ వైర గ్రంథమాల, కాశ్మీరు రాజవంశ చరిత్ర, నేపాలు రాజవంశ చరిత్ర పేరిట విశ్వనాథ సత్యనారాయణ గారు చరిత్రను లోతుగా అధ్యయనం చేసి విశిష్ట రచనలను జాతికి కానుకగా అందించారు.

తెలుగులో ఇంతటి విస్తృతి కలిగిన సాహిత్యాన్ని సృష్టించిన కవి, రచయిత ఒక్క విశ్వనాథ సత్యనారాయణ తప్ప 

మరొకరులేరని చెప్పడం అతిశయోక్తి కాదు.

 శ్రీశ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారిని శ్రీనాథ కవిసార్వభౌముడు అంతటి మహాకవిగా ప్రస్తుతించారు.

గురువుల పట్ల.. పెద్దల పట్ల విశ్వనాథ వారికి గౌరవం మెండు.

 " అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుండ 

లఘు స్వాదు రసావతార 

ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినాడన్నట్టి , దా వ్యోమపేశల చాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళ వంశ స్వామికున్నట్లుగన్" అంటూ విశ్వనాథ సత్యనారాయణ గారు తనంతటి గొప్ప శిష్యుని కలిగిన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారు మరింకెంతటి గొప్పవారో గ్రహించండంటూ లోకానికి ప్రబోధించారు.

 రామాయణ కల్పవృక్షం కావ్య రచన ద్వారా 

 తన గురువైన చెళ్లపిళ్ల వేంకట శాస్త్రి గారి ప్రత్యక్ష ప్రశంసకు పాత్రులైన ప్రతిభామూర్తి కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. 

విశ్వనాథ సాహిత్యం పై తన ప్రభావం గానీ..వేరెవరి ప్రభావంగానీ లేదని..విశ్వనాథది సర్వ స్వతంత్ర ధోరణి అని చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారు ప్రశంసించారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితం గురించి వ్రాయాలంటే అది మరో "విశ్వనాథ కల్పవృక్షం" అవుతుంది.

చలం అంచనాలో విశ్వనాథ సత్యనారాయణ గత జన్మలో కవిబ్రహ్మ తిక్కన.

పూర్వ కవులతోపాటు వర్తమాన కవులలో కనిపించని రచనా విలక్షణత..శైలీ విన్యాసం విశ్వనాథ సత్యనారాయణ రచనలలో గమనించవచ్చు 

 కావ్య సముద్రాన్ని మధించి సాహిత్య అమృతాన్ని రసజ్ఞులైన పాఠకులకు విశ్వనాథ పంచిపెట్టారు. విశ్వనాథ సత్యనారాయణ గారి పేరిట ఆధునిక సాహిత్య చరిత్రలో ప్రత్యేకంగా విశ్వనాథ యుగాన్ని ఏర్పరచడం సముచితం.

విశ్వనాథను తెలుగువారి మలి నన్నయ్యగా సంభావించ వచ్చు .

తెలుగు సాహిత్య చరిత్రలో పూర్వ కావ్య సంప్రదాయ ధోరణిలో వెలువడిన చిట్టచివరి కావ్యం..తెలుగు వారి రామాయణం విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యమని ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు ప్రశంసించారు. 

విశ్వనాథ సత్యనారాయణ గారి కొన్ని కవితల్లో సామాజిక స్పృహ ప్రస్ఫుటమవుతుంది. సమాజాన్ని వీడి కవిత్వం లేదుకదా!! 

విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వాన్ని ఓపికగా అర్ధం చేసుకునే తీరిక లేని..కొందరు "పెద్దమనుషులు"! విశ్వనాథ వారి కవిత్వ శైలిని పాషాణ పాకమని ఈసడించారు. ఎవరు ఎంతగా ఆక్షేపించినా విశ్వనాథ వారి వ్యక్తిత్వ స్థాయి.. రచనల స్థాయి తగ్గేది కాదని గుర్తించాలి. మాత్సర్యంతో విశ్వనాథ సత్యనారాయణ గారి ఎదుగుదలను అడ్డుకోవాలని చూసిన వారెందరో!!  

అయితే విశ్వనాథ మాత్రం తన వ్యతిరేకులపట్ల కూడా గౌరవ భావం ప్రదర్శించేవారు. 

విశ్వనాథ వారి పేరు..రచనలు.. కవిత్వం నేటికీ నిలిచే ఉన్నాయి.

ప్రౌఢంగా..సరసంగా..సరళంగా... తేట తెలుగులో.. సంస్కృత సమాస పద భూయిష్ఠంగా రచన చేసి వివిధ స్థాయి పాఠకులను..కవి పండితులను..పామరులను రంజింప చేయగలిగే సామర్థ్యం విశ్వనాథ వారిలో పుష్కలంగా ఉందని గుర్తించాలి. 

విశ్వనాథ వారు ఒక సభలో కొన్ని పద్యాలను చదివి ఆ తరువాత వేరే అంశంలోకి వెళ్లేందుకు ఉపక్రమించగా సభకు హాజరైన వారిలో ఒక సామాన్య వ్యక్తి లేచి నోటి కాడ విస్తరిని లాగేసారు అని పెద్దగా అనడంతో విశ్వనాథ వారు ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి నా పద్యాలు పాషాణపాకమని ఎవరికీ అర్థం కావని అంటారే! అనడంతో ఆ వ్యక్తి నాకు మాత్రం మీ పద్యాలు వింటుంటే అపూర్వమైన ఆనందం కలుగుతున్నది. 

మరికొన్ని పద్యాలను ఆలపించండి అని అభ్యర్థించడంతో విశ్వనాథ వారు మరికొంత సేపు పద్యాలను ఆలపించి ఆతనికి సంతోషం కలుగ చేసారు. 

అక్షర జ్ఞానంలేని పామరుడికి విశ్వనాథ వారి పద్య గానం అంతగా ఆనందం కలిగిస్తే విద్యావంతులైనవారు..పండితులైనవారు ఇంకెంతగా ఆస్వాదించాలో దీనినిబట్టి అర్థమవుతుంది. 

పైగా విశ్వనాథ సత్యనారాయణ గారికి సంగీత జ్ఞానం పుష్కలం.

 ఆయన గొంతెత్తి కమ్మగా పద్యాలు.. శ్లోకాలను ఆలపిస్తుంటే శ్రోతలు మంత్రబద్ధ భుజంగాల మాదిరి తన్మయత్వంతో వినేవారు. విశ్వనాథ వారి ఉపన్యాసం కూడా చమత్కారాలతో సాగేది. ఆయన దృష్టి ఎప్పుడు ఎవరిపై ప్రసరిస్తుందో..వేటగాని బాణంలా ఎవరిని గాయపరుస్తుందో తెలియదు. ఒక సభలో విశ్వనాథ సత్యనారాయణ గారు ప్రసంగిస్తుంటే సూటు

బూటుతో సభకు హాజరైన ఒక ఉపాధ్యాయుుడు కాళ్లు అదేపనిగా కదిలిస్తుండడం విశ్వనాథ వారు గమనించారు. రామాయణ కథలో తన బల పరాక్రమాలను అతిగా 

ఊహించుకుని వాలిపై కాలు దువ్వి వాలి చేతిలో నిహతుడైన దుందుభి గురించి ప్రస్తావిస్తూ దుందుభిలాంటి విపరీత మనస్కులు ఈ కాలంలో కూడా ఉంటారు. మండు వేసవిలో ఫుల్ వూలు సూటు వేసుకున్న పండితుల లాగా అనడంతో పాపం! సదరు ఉపాధ్యాయుడు బిక్కచచ్చిపోయాడు. 

తరగతి గదిలో విశ్వనాథ వారు పాఠం చెబుతుండగా ఎవరైనా విద్యార్థులు గోల చేస్తే వారిని మందలించేవారు. 

అయితే ఆయన తిట్లకు విద్యార్ధులు కోపగించుకోకుండా హాయిగా నవ్వుకునేవారు.

పైగా విశ్వనాథ వారి చేత తిట్లు తినడాన్ని కూడా గొప్పగా 

చెప్పుకునేవారు.

 విద్యార్థులను తొలుత మందలించినా తరువాత ఆయన వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. 

విశ్వనాథ వారి జాలి హృదయం ఎందరి ఆకలినో తీర్చింది.ఎందరి జీవితాలనో నిలబెట్టింది. 

ఎందరో విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా కాపాడింది. 

విశ్వనాథ వారు కవిత్వపరంగానేకాదు.. వ్యక్తిత్వపరంగా కూడా అత్యున్నతులని గుర్తించాలి.

ఒక సందర్భంలో ఒక వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారిని మీ రచనలు అర్ధం చేసుకోవడం కష్టం.

అందరికీ అర్ధమయ్యేలా వ్రాయవచ్చు కదా అని ప్రశ్నించారు. 

అందుకు విశ్వనాథ సత్యనారాయణ గారు "ముందు నా రచనలను చదివి అర్ధం చేసుకోగలిగేటంత భాషా పరిజ్ఞానాన్ని సంపాదించుకుని ఆ తరువాత ఎక్కడ దోషమున్నదో విమర్శించమనండి" అంటూ సమాధానమిచ్చారు. 

నిజమే!

విశ్వనాథ సత్యనారాయణ వంటి మహాకవుల రచనలను చదివి గుణ దోష విచారణ చేయగలిగేటంత భాషా సమర్ధత..వివిధ పురాణ..కావ్య ..నాటక..శాస్త్ర ..ప్రాచ్య పాశ్చాత్య సంస్కృతుల పరిజ్ఞానం..సంస్కృతాంధ్ర ఆంగ్ల భాషా పాటవం.. నిఘంటు జ్ఞానం..లోతైన మనస్తత్వ చిత్రణ..ప్రకృతి పరిశీలన.. మానవీయ దృష్టి కోణం..సామాజిక స్పృహ..జీవితం పట్ల పరిపూర్ణ అవగాహన వంటి సమర్ధతలు మనకు ఉన్నప్పుడు మాత్రమే విశ్వనాథ సత్యనారాయణ వంటి బహుముఖ ప్రజ్ఞావంతులను కొంతైనా విమర్శించగలిగే నైతిక అర్హత మనకు సిద్ధిస్తుంది.

శ్రీ శ్రీ మహాప్రస్థానం కావ్యానికి యోగ్యతా పత్రం వ్రాస్తూ చలం శ్రీశ్రీ కవిత్వాన్ని తూచగలిగే రాళ్లు తనవద్దలేవని పేర్కొన్నారు. 

అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వ గొప్పదనాన్ని తూచగలిగే పడికట్టు రాళ్లు మనవద్ద లేవని చెప్పడం అతిశయోక్తి కాదు.

"మన తెలుగు కవులలో అనన్య ప్రతిభాశాలురు ముగ్గురున్నారు.

నాచన సోమన, కృష్ణ దేవ రాయలు, తెనాలి రామకృష్ణుడు.

ఈ మువ్వురినీ కాచివడగడితే అయినవాడు విశ్వనాథ సత్యనారాయణ" అని కాటూరి వెంకటేశ్వరరావు గారు విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్పదనాన్ని అక్షరీ కరించారు. 

" ఆధునిక సాహిత్యంలో 20 వ శతాబ్దంలో మహామహితుడైన విశ్వనాథ కుండలీంద్రుండు తన్మహనీయస్థితి మూలమై నిలువ అన్నట్లు మొత్తం సాహిత్యానికి ఆధారమై 

నిలిచినాడు.

ఈనాటి భారతీయ సాహిత్యానికే కాదు సార్వకాలీన భారతీయ సాహిత్యంలోనే ఒక ఉజ్జ్వల శిఖరం. సమకాలీనమైన అంశాలు పొగమంచులై ఆ శిఖరాన్ని కప్పినట్లు భాసించినా , పునరుజ్జ్వలిత మైన ఆ వ్యక్తిత్వం శతాబ్దపు అంచులను దాటి ప్రకాశిస్తూనే ఉన్నది" అంటూ కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గూర్చి కోవెల సుప్రసన్నాచార్య విలువైన అభిప్రాయాన్ని సంతరించారు.

విశ్వనాథ సత్యనారాయణ గారితో పోల్చదగిన.. ఆయనతో సాటి రాగలగిన మహాకవి మరో వెయ్యేళ్లకైనా పుడతాడా అనేది సందేహమే!! 

" కవితామ్నాయ రహస్యముల్ తెలియగా గాంక్షించి నావేవి పొమ్మవనిన్ నీవేవనిం దలంపక తదేకాసక్తితో జేరు మా కవి సామ్రాట్టగు విశ్వనాథ ప్రతిభా గంభీర వారాన్నిధిన్ శివ కోటీర ఝురీతురీయ వచనశ్రీ సన్నిధిన్ బెన్నిధిన్ ,

ఎవని యాకృతి మించు హిమశైల శిఖరమై, కవులలో పుడమి మానవులలోన ఎవని భారతి వెల్గు నేకైక దీపమై, జగములందాగామి యుగములందు ఎవని మన్గడ యొప్పు శ్రవణపీయూషమై , కథలలో ( సూరి) వాక్సుధలలోన ఎవని స్థానము గ్రాలు నవనవోన్మేషమై, ఋషులలో నిఖిలా నిమిషులలోన అతడు కవియును ఋషియు దేవతయుగాడు, కవులు ఋషులును దివిజులుం గలసి మెలసి మ్రొక్కు సాక్షాత్తు పరబ్రహ్మ మూర్తిగాక, విశ్వనా ధుండు కేవలావిర్భవుండె" అంటూ డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి గొప్పగా ప్రస్తుతించారు. నిజమే! ఆలోచించి చూస్తే విశ్వనాథ సత్యనారాయణ సాధారణ మానవుడు కాదని.. దివ్యత్వం నిండిన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని పాఠకులకు అనిపించడంలో వింతలేదు. 

కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి 120 వ జయంతి వేడుకలను అక్షర సాహితీ సమితి ఆధ్వర్యంలో 2014 సెప్టెంబర్ 14 న ఒంగోలు సి వి ఎన్ రీడింగ్ రూం లో ఘనంగా నిర్వహించాము, మహా సహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు గారు ప్రధాన వక్తగా విచ్చేసి విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వ వైభవం పై చక్కటి ప్రసంగాన్ని అందించారు.

విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీశ్రీ అర్పించిన కవితాంజలి చాలా ప్రత్యేక మైనది.

ఉపద:

" మాటలాడే వెన్నెముక

పాట పాడే సుషుమ్న

నిన్నటి నన్నయ భట్టు

ఈనాటి కవిసమ్రాట్టు

గోదావరి పలకరింత

కృష్ణానది పులకరింత

కొండవీటి పొగమబ్బు

తెలుగువాళ్ల గోల్డు నిబ్బు

అకారాది క్షకారాంతం

ఆసేతు మిహికావంతం

అతగాడు తెలుగువాడి ఆస్తి

అనవరతం తెలుగునాటి ప్రకాస్తి

ఛందస్సు లేని ఈ ద్విపద

సత్యానికి నా ఉపద "

అంటూ విశ్వనాథ స్మృతికి కవితాంజలులు ఘటించారు

శ్రీశ్రీ.

"కవిసమ్రాట్" శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు జాతిలో జన్మించడం తెలుగువారి అదృష్టం.

తెలుగు భాషా లలామకు లభించిన దివ్య వరం.

" లక్షన్నర పుటలకు పైగా వ్రాసిన విశ్వనాథ సత్యనారాయణ గారు ఏ సిద్ధాంతం చెప్పినా ఏమి వ్రాసినా వారి రచనలకు

న్న ప్రాచుర్యం ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశంలోనే మరే కవి రచనలకు లేదు. వారితో పోల్చదగిన వారు అలనాటి క్షేమేంద్రుడు, పడమటి సీమ బాల్టాక్ , రాహుల్ సాంకృత్యాయను లూను, 

వేయి పడగల పాపరేడూ, చెలియలి కట్టలేని ఫసిఫిక్ పాథోనిధీ, మూడడుగులతో నేల కొలిచిన త్రివిక్రముడూ ఒక్క రూపంలో తెనుగు సాహిత్య లోకంలో అవతరించినట్లు నాకు పొడగట్టుతారు విశ్వనాథ వారు" అనిన తిరుమల రామ చంద్ర గారి మాటలుఅందరికీ శుభోదయం. 

🌸 యశోదా దేవి శ్రీకృష్ణ పరమాత్మకు రాముల వారి కథ చెబుచున్న సందర్భం🙏🙏



శ్లో. *రామో నామ బభూవ హుం, తదబలా సీతేతి హుం, తౌ పితు ర్వాచా పంచవటీతటే విహరతస్తామా హరద్రావణః ।*

*నిద్రార్థం జననీ కథామితి హరే ర్హుంకారతశ్శృణ్వతః 'సౌమిత్రే! క్వ ధనుర్ధనుర్ధను' రీతి వ్యగ్రా గిరః పాంతు వః ॥*


(రామావతారము తరువాత కృష్ణావతారము- యశోద కృష్ణుని నిద్ర పుచ్చుటకు కథ చెప్పుచున్నది! కృష్ణుడు ఊఁ కొట్టుచున్నాడు)


తా॥ *"అనగా అనగా రాముడనే వాడున్నాడు!" - "ఊ!" - "అతని భార్య సీత!'” "ఊ!” వారిద్దరును తండ్రి మాటను అనుసరించి గోదావరీతీరంలో పంచవటిలో విహరించు చుండగా సీతను రావణుడెత్తుకొని పోయినాడు!" - అని చెప్పగానే నిద్రలోనికి వెళ్ళుచున్న కృష్ణుడు ఉలికిపడి "లక్ష్మణా! నా ధనుస్సు! నా ధనుస్సు ధనుస్సు!” అనుచు కలవరించిన కలవరింతలు మిమ్ము రక్షించుగాక! (కృష్ణుడు ఆవేశములో వెనుకకు రామావతారము లోనికి వెళ్ళి, ఇప్పటి తన అవతారమును మరచినాడు! రాముడే కృష్ణుడు కదా!)*

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️ ప్రత్యక్షర సత్యం,

ఆధారం:

(మరుపురాని మనీషులు,రచన: తిరుమల రామచంద్ర, పుట 110)

వ్యాస రచయిత:

(ఎం.వి.ఎస్ శాస్త్రి , ఒంగోలు 

సెల్ 9948409528)

మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి ?

 శ్రీరామ (99)


       ( మనస్సును ఎలా స్వాధీనం చేసుకోవాలి ? )



శ్లో//ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్/

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్// 

(సమస్తమైన ఆపదలూ పోగొట్టేవాడు, సమస్త సంపదలూ ఇచ్చేవాడు, సమస్త జీవులను ఆనందపెట్టేవాడు,అయిన శ్రీరామచంద్ర ప్రభువునకు నమస్కరిస్తున్నాను, మరల మరల నమస్కరిస్తున్నాను).


                           ------------





ఆధ్యాత్మిక ప్రవచనాలు ఎన్ని విన్నా, భగవద్గీత, రామాయణ,భారత, భాగవతాది  గ్రంథాలు ఎన్ని చదివినా, ఆ విషయాలు అనుభవంలోకి తెచ్చుకోటానికి సాధన చేయాలి.


ఆ సాధనలో ప్రధానమైనది మనస్సును స్వాధీనం చేసుకోవడం.


మనస్సు అతివేగంగా సంచరిస్తుంది కాబట్టి దానిని స్వాధీనం చేసుకోవాలంటే  ముందు మనస్సుయొక్క వేగాన్ని తగ్గించాలి.

మనస్సుయొక్క వ్యక్తరూపం వాక్కు కాబట్టి,

 ఆ వాక్కును ఒక మంత్రంమీదో, ఏదైనా భగవన్నామము మీదో పెట్టటంవల్ల మనస్సుయొక్క  వేగం క్రమంగా తగ్గుతుంది.

అంతేకాదు క్రమంగా భగవంతుని దర్శనం కూడా అవుతుంది.

అయితే దీనికి ప్రధానమైన అడ్డంకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గం.

వీటికి సంబంధించిన ఆలోచనలు మనస్సుయొక్క వేగాన్ని మామూలు ఆలోచనలవల్ల సంభవించే వేగం కంటే నూరింతలు ఎక్కువ చేస్తాయి.

అందువల్ల ముందు ఈ అరిషడ్వర్గమును జయించాలి.

అది ఎంతో కష్టసాధ్యం కాబట్టి,

" స్వామీ !  వీటిని జయించడం నావల్ల కాదు, నీవే అనుగ్రహించాలి " 

అంటున్నారు శ్రీ ధూర్జటిమహాకవి.


శా//నీ నా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబు నే/

గానిం బట్టక సంతతంబు మది వేడ్కన్ గొల్తు,నన్తస్సప/

త్నానీకంబున కొప్పగింపకుము, నన్నాపాటియే జాలు దే/

జీ నొల్లం గరి నొల్ల నొల్ల సిరులన్, శ్రీకాళహస్తీశ్వరా//


(ఓ శ్రీకాళహస్తీశ్వరస్వామీ!మనమిద్దరము ఒక ఒప్పందం చేసుకుందాము.

నేను నీకు మనస్ఫూర్తిగా సేవ చేస్తాను. 

ఒక్క ఏగానీ(తొంభై ఆరు ఏగానీలు ఒక రూపాయి) కూడా జీతంగా పుచ్చుకోను.

కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యము లనే అంతశ్శత్రువు లకు నన్ను అప్పగించవద్దు.

 జీతం బదులు సేవాఫలంగా ఇది ఒక్కటీ అనుగ్రహిస్తే చాలు. 

గుర్రాలు, ఏనుగులు (ఆ కాలంలో వాహనాలు), మరి ఏ సంపదలూ,నాకు వద్దు.

ఈర్ష్యా,ద్వేషాలవంటి ఆలోచనలు నా మనస్సులోకి రాకుండా నన్ను కాపాడితే చాలు స్వామీ, శ్రీకాళహస్తీశ్వరా! ).


శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు.

27-2-'26.

మౌనం వహించింది చాలు, ఇకనైనా మేలుకోండి.

 *సనాతన ధర్మానికి పొంచి ఉన్న అంతర్గత శత్రువులు*


వందేమాతరం 


లౌకిక హిందువుల రూపంలో కొందరు ఆడుతున్న ప్రమాదకర ఆటల పట్ల సమాజం అప్రమత్తతగా ఉండాలి.


సనాతన ధర్మాన్ని గౌరవించే హిందువులందరికీ ఒక విజ్ఞప్తి. నిర్మలమైన మనసుతో ఒక్కసారి ఆలోచించండి. 


మన దేశంలో కొందరికి తమకు తాము హిందువులమని చెప్పుకుంటూ, మన సనాతన హిందుత్వాన్ని అవహేళన చేయడం, వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటైపోయింది.


ఈమధ్య టాలీవుడ్ రచయిత విజయేంద్రప్రసాద్ మాట్లాడిన విషయాలు వింటుంటే హృదయం రగిలిపోతుంది. నేను ఇస్లామును పూజిస్తాను, బైబిల్ చదువుతాను, యేసుని నమ్ముతాను, అల్లాని గౌరవిస్తాను అన్నారు. మంచిదే, ఎవరు ఎవరినైనా పూజించవచ్చు, గౌరవించవచ్చు. అది సనాతన ధర్మం నేర్పిన సంస్కారం. కానీ అలా అంటూనే, ముస్లింలు, క్రిస్టియన్ల పడుతున్న బాధలు చూడలేకపోతున్నానని కన్నీళ్లతో మాట్లాడారు. ఏసుక్రీస్తు పడ్డ బాధలు కన్నీళ్లు పెట్టిచ్చాయి అన్నారు. ఆయనను బాధ పెట్టింది ఎవరు? హిందువులా?, ఆయన బాధపడింది ఎక్కడ? సనాతన భారతదేశంలోనా?, కాదే, మరి ఆ విషయాలు ఎందుకు ప్రస్తావించలేదు. ఆయన తన ఆక్రోశం ఎక్కడ బాధపడ్డాడో అక్కడి చూపించాలి, ఎవరు బాధపెట్టారో వాళ్ల మీద చూపించాలి. అలాకాక, ఆయన వారసులమని చెప్పుకుంటూ మనదేశంలో అకృత్యాలు చేస్తూ, మత విద్వేషాలు సృష్టిస్తూ, అమాయక హిందువులను రెచ్చగొట్టి, ప్రలోభపెట్టి మతం మారుస్తున్న నికృష్టులకు ఊతం కలిగించే విధంగా ఇక్కడ మాట్లాడటం నిజంగా ధర్మద్రోహమే.


శతాబ్దాలుగా మన దేశంపై దాడిచేసి ప్రజల ధన,మాన,ప్రాణాలను దోచుకుంటున్న ఎడారి మతాల విద్వేషాలు, వికృతి చేష్టలు ఇటువంటి వారికి కనిపించవు. అటువంటి రాక్షసులను ఎదిరించి చివరి రక్తపుబొట్టు వరకు, చివరి శ్వాస వరకు సనాతన హిందూ ధర్మ రక్షణకే పోరాడిన పృథ్వీరాజ్ చౌహాన్, చత్రపతి శివాజీ, శంభాజీ మహారాజ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు ఇటువంటి వారు వీళ్ళ కంటికి కనిపించరు. ఈ సందర్భంగా తన తాత ముత్తాతలు చాలా ఘోరాలు చేశారని ఆయన ఒప్పుకున్నారు. ఇదేదో సానుభూతి కోసం చెప్పినట్లుగా ఉంది. నిజంగా అటువంటి వీరి తాత ముత్తాతల లాంటి నికృష్టుల వల్లనే హిందూ సమాజంపై చెరపరాని చెడు ముద్ర పడింది. అలాంటి చీడపురుగుల పేర్లు ప్రస్తావించి క్షమాపణలు కోరుకోవాల్సింది, ఆ వంశంలో పుట్టినందుకు సిగ్గుతో తలవంచుకోవాల్సింది.‌ కానీ, ఆ పాపం అనుభవిస్తున్నది ఎవరు?. యావత్ హిందూ సమాజం. 


 ఎడారి మతాల దురాక్రమదారులు కోట్లాది హిందువులను చంపి, మాంసపిండాలు చేసిన చరిత్ర చరిత్ర వీరికి గుర్తుకు రాదు, టిప్పూ సుల్తాన్ రక్తపు ఆటలు వీరికి కనిపించవు, వారి ఆక్రమణలతో భూగర్భంలో కలిసిపోయిన వేలాది దేవాలయాలు, లక్షలాది ధర్మ గ్రంథాలు, తక్షశిల లాంటి అపూర్వమైన జ్ఞాన విద్యాలయాలు, తమ మానప్రాణాల కోసం పోరాడి, ఆ పాపాత్ముల స్పర్శ కూడా తగలకూడదని సజీవ దహనం చేసుకొన్న భారతీయ స్త్రీలు వీరికి కనిపించరు. సమాజాన్ని ప్రభావితం చేసే ఇటువంటి కుహనా మేధావులే అసలైన ధర్మ ద్రోహులు.


అలాగే, అంబేద్కర్ గురించి కూడా కట్టుకథలు చెప్పుకొచ్చారు. దళితుడిగా ఆయన పడ్డ బాధలు అంటూ అత్యంత జుగుప్సాకరంగా కథలు అల్లి ప్రచారం చేస్తున్నారు. హిందుత్వాన్ని కించపరచడం వీరికి అలవాటైపోయింది. అసలు సత్యం ఏమిటి? అంబేద్కర్ గారిని ఆదరించి, ఆశ్రయమిచ్చి, ‌చదివించి, గౌరవించింది సనాతన ధర్మన్ని ఆచరించే హిందువులే. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే దానికి వీరే ఒప్పుకున్నట్టే వీరి పూర్వికులు లాంటి దుర్మార్గులే దానికి కారణం. కానీ ఇటువంటి కుహనా లౌకిక హిందువులు దాన్ని విషపు బాణాలుగా మలిచి, సమాజాన్ని మరింత విడదీస్తున్నారు.


 నిజమైన ప్రమాదకారులు ఎవరు? "నేను టెర్రరిస్టుని, నేను ముస్లిమును, నేను క్రిస్టియన్ని, నేను హిందువులను ద్వేషిస్తాను అంటూ బాహుటంగా మాట్లాడేవారు కాదు, వారి కన్నా మరింత ప్రమాదకరులు మనతోనే ఉండి హిందువులమని చెప్పుకుంటూ, హిందుత్వాన్ని ద్వేషించే ఇటువంటి దుర్మార్గులే. వీళ్లు మన ధర్మాన్ని అంతర్గతంగా ద్వేషిస్తూ, సమాజాన్ని విచ్చిన్నం చేస్తున్నారు. 


మన తక్షణ కర్తవ్యం ఇతర మతాల ఆగడాలను ఎదుర్కొనే ముందు మనలోనే ఉన్న ఇటువంటి చెత్తను ఏరిపారేయడం. గుర్తుంచుకోండి, సనాతన ధర్మం ఎప్పుడూ ఎవరినీ ద్వేషించలేదు. "సర్వే భవంతు సుఖినః" అనే మహా మంత్రం మన జీవనాడి. కానీ ఇటువంటి కలుపు మొక్కలు సృష్టించిన కట్టుకథలు, కట్టుబాటులతోనే మన సమాజం విడిపోయింది, ఇంకా విడిపోతోంది.


మంచివారి మౌనాన్ని బలహీనంగా చూసే శత్రువు, బలవంతుడి మౌనానికి భయపడతాడు. అర్జునుడు తపస్సు చేసేటప్పుడు కూడా తన గాండీవని విడిచిపెట్టలేదు. అదే అతని బలం. ప్రస్తుతం హిందూ సమాజపు మౌనాన్ని చేతకానితనంగా భావిస్తున్న ఈ ఎడారి మతాలకి కారణం హిందువుల మధ్య సంఘటితమనే బలం లేకపోవడమే.  


మౌనం వహించింది చాలు, ఇకనైనా మేలుకోండి. సంఘటితంగా మన ధర్మాన్ని కాపాడుకుందాం. ఈ అంతర్గత శత్రువులపై దృష్టి పెడదాం‌. అందరం ఒక్కటై, బలంగా నిలబడదాం.


జై శ్రీరామ్! జై భారత్!


మృశి

(దశిక ప్రభాకరశాస్త్రి)

9849794167

వాడుకతెలుగులో

 

వాడుకతెలుగులో అపప్రయోగాలు - డా. రవ్వా శ్రీహరి 


అంతర్బహిర్పోరాటం - పోరాటం తెలుగు పదం, ఇది వైరి సమాసం, సాధుప్రయోగం కాదు.

అంతర్కళాశాల, అంతర్జాతీయ, అంతర్దేశీయ, అంతర్రాష్ట్రీయ (అంతారాష్ట్రీయ అనాలట) మొదలైన వాటిలో అంతర్ అంటే లోపలి (అంతరాత్మ వలె) అనే అర్థమై కానీ “మధ్యన” అన్న అర్థం రాదట.

“అక్షతలు” సరి, అక్షింతలు, అక్షంతలు కాదు.

“అగణిత”ప్రతిభాశాలి (గణింపబడని) కాదు, “అగణ్య”ప్రతిభాశాలి (గణింపశక్యం కాని) అనాలి.

“అగ్నిమాపకదళం” అంటే అగ్నిని కొలిచేది అని అర్థం, తెలుగు “మాపు” ధాతువు, “అక”ప్రత్యయాన్ని చేర్చుకుని సంస్కృతంలో లేని “మాపకం” అనే పదంగా మారడమే వింత. 

అధిగమించడమంటే పొందడం అనే అర్థం, అతిక్రమించడం, అతిగమించడం అనే అర్థాలు రావు.

అధీనం (ధర్మి వాచకం) కు ముందు షష్ఠీవిభక్తి పొసగదు, అధీనత (ధర్మ వాచకం) సరైన అర్థాన్నిచ్చే ప్రయోగం. 

అధ్వర్యం, ఆధ్వర్యం కాదు - “ఆధ్వర్యవం” సరైన ప్రయోగం. యజ్ఞంలో ఆధ్వర్యుడు ప్రధానుడు.

అనుకూలవతి అంటే అనుకూలుడు(రు) కలిగిన స్త్రీ, “అనుకూ అంటే చాలు, కోరుకున్న అర్థం వస్తుంది.

అనుయాయుడు అనే తత్సమం చేయడానికి అనుయాయ అనే రూపం లేదు, “అనుయాయి” సరైనది.

అపరిచయత్వీకరణ అనడం సరి కాదు, అపరిచయీకరణ అనో అపరిచతత్వీకరణ అనో అంటే సరిపోతుంది.

అపురూపం అనేది అపూర్వం అన్నమాటకు వాడుకలో జరిగిన మార్పేమో. “అప”రూపం (దుష్టరూపం) తప్ప అపురూపానికి సంస్కృతంలో ఆధారం లేదు.

అభ్యంగన కాదు “అభ్యంజన”మే సరి. “అభ్యంగం” కూడా తలంటు అనే అర్థంలో యుక్తమే.

అయిష్టం వ్యాకరణ సమ్మతం కాదు, (న+ఇష్టం) “అనిష్టం” అని వాడాలి, “అనితర” లాగా.

“అర్ధరాత్రం” అనేది ఆర్థరాత్రకు తత్సమం, అర్ధరాత్రి సరికాదు.

అసభ్యకరంగా అంటే అసభ్యాన్ని కలిగించే విధంగా, ఈ ప్రయోగం సరి కాదు. “అసభ్యం”గా లేదా “అసభ్యతాకరం”గా అనవచ్చును.

అహోరాత్రం సరైన రూపం, అహోరాత్రులు, అహోరాత్రాలు, అహోరాత్రుళ్లు కాదు.

ఆదర్శవంతం అంటే ఆదర్శాలు కలది అని అర్థం, ఆదర్శమైనది అన్న అర్థం రాదు.

సంస్కృత అపేక్షా తెలుగులో “అపేక్ష” అవుతుంది కానీ, అక్కరలేని దీర్ఘంతో ఆ-పేక్ష కాదు.

ఆధునీకరణం కాదు, ఆధునికీకరణం.

“ఆశిస్సు” సాధురూపం, శీ-కి దీర్ఘం లేదు.

“సాంతం” అంటే సరిపోతుంది, ఆ-సాంతం అంటే అనటంతో కూడిన దానివరకు అనే విపరీతార్థం.

ఆసురీ లేదా అసురీ (స్త్రీలింగం) గుణాలు (పుంలింగం) సరి కాదు, అసురగుణాలు సరి.

ఆహ్వానితులు (ఆహ్వానం కలవాళ్ళు) సరి కాదు, “ఆహూతులు” (ఆహ్వానింపబడిన వారు) సరి.


వరరుచి పబ్లికేషన్సు (1995), హైదరాబాద్ వారికి, శ్రీమతి ఆర్. అనంతలక్ష్మి గారికి ధన్యవాదములతో.

పట్టుదల, ఓర్పు, ఉండాలి.

 శ్రీరామ (96)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


ఏ కార్యం సాధించాలన్నా పట్టుదల, ఓర్పు, ఉండాలి.

రాముడు 14 ఏళ్ళు వనవాసం చేశాడని, పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసము చేశారని చదువుతాము.

ఆ వనవాసం ఎంత కష్టమైనదో, అప్పుడు వారు ఎన్ని కష్టాలు పడ్డారో క్షణం కూడా ఆలోచించము.

అలాగే మహర్షులు నిరాహారులై, ఎండా వానా లెక్క చేయకుండా తపస్సు చెయ్యటం గురించి కూడా.

ఈ కథలన్నీ కేవలం పారాయణ చేసి పుణ్యం సంపాదించుకోవాలని కాకుండా,

మనం కూడా ఓర్పు, సహనశక్తి అలవర్చుకొని కార్యసాధకులమవాలని ఋషుల ఆశయం.


పూర్తిగా అందుకు భిన్నంగా మన ప్రవర్తన ఎలా ఉంటున్నదో శ్రీ ధూర్జటిమహాకవి 

ఇలా చెబుతున్నారు.


 మ// ఒకపూటించుక కూడు తక్కువగునే నోర్వంగలే డెండకో /

పక నీడన్వెదకుం జలింజడిసి కుంపట్లెత్తుకో 

జూచు వా /

నకు నిండిండ్లును దూఱు నీ తనువు, దీనన్వచ్చు సౌఖ్యంబు రో /

సి కడాసింపరుగాక మర్త్యులకటా శ్రీకాళహస్తీశ్వరా !


(ఓ శ్రీకాళహస్తీశ్వరా! ఈ మానవుడు తనకు ఆహారం తక్కువయితే ఒక్క పూటకూడా ఓర్చుకోలేడు.

ఎండను భరించలేక నీడకోసం వెతుకుతాడు. 

చలికి ఓర్చుకోలేక కుంపట్ల దగ్గరకో,చలి మంటల దగ్గరకో వెళ్లి కాచుకుంటాడు.

దారిలో వర్షం వస్తే తడవకుండా ఉండటానికి ఇళ్లల్లో దూరుతాడు.

ఇదంతా తన శరీరం కష్టపడకూడదనేగా !

ఈ శరీరం వల్ల వచ్చే సుఖం అశాశ్వతమని గ్రహించి పరమార్థం కోసం ఈ మానవుడు శ్రద్ధతో ఏ ప్రయత్నమూ చేయడం లేదు. అకటా!ఎంత శోచనీయమైన విషయము!)


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

27-2-'26.

సుభాషితమ్

శ్రీమాత్రేనమః 


✡️*"శుభోదయ సుభాషితమ్"*✡️


శ్లో𝕝𝕝

*సాధన్యా జననీ లోకే సా ధన్యో జనకః పితా౹*

*ధన్యస్స పతిర్యస్య గృహే దేవి పతివ్రతాః౹*

*పితృవంశ్యా మాతృ వంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః౹*

*పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే॥*

ॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐॐ


`నా అనువాదపద్యము`


చం॥

గృహమున సాధ్వి యున్న నట కిల్బిషమంతయు నష్టమైసనున్ 

సహచరబంధులెల్ల గను సద్గతులన్ నిజభర్తృవంశమున్ 

ఇహపరధన్యతం బడయు నెంతయు తల్లియు తండ్రివంశముల్ 

మహకపతివ్రతామణులు మత్సరహీనులు మాతృతుల్యలున్ 

=====================

మహకులు=పూజింపబడువారు

=====================

*~శ్రీశర్మద*

26, ఫిబ్రవరి 2026, గురువారం

*శ్రీ మహావిష్ణు పురాణం* ➖➖➖✍️ ఏడవ భాగం

  

        *శ్రీ మహావిష్ణు పురాణం*

                ➖➖➖✍️

                  ఏడవ భాగం


*మధుకైటభ సంహారం:```

విష్ణమాయను ఆవాహింప చేసుకున్న శ్రీమహావిష్ణువు అనేక వేల సంవత్సరాలు యోగ నిద్రలోకి వెళ్లి పోయాడు. కొన్ని వేల సంవత్సరాల నిద్ర తరువాత శ్రీమహావిష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసల నుండి ఒక శబ్దం ఉత్పన్నమైంది. ఆ శబ్దం క్రమక్రమంగా ఓంకారంగా మారి ప్రణవ నాదమయ్యింది. ప్రణవనాద శబ్దానికి సృష్టికర్త, అయ్యాడు కనుక విష్ణువు "శబ్దబ్రహ్మ". అయ్యాడు. ఈ ఓంకార శబ్దం నుండి శబ్దరూప మైన వేదము ఆవిర్భవించింది. కనుక మహావిష్ణువు వేదమూల మైన "వేద బ్రహ్మ" గా ప్రసిద్ది పొందాడు.


వేదము ఉచ్ఛ్వాస నిశ్వాసగా చేసుకుని నిద్రిస్తున్న విష్ణువు నాభి నుంచి ఒక పుష్పకాండము జనించి పెరగసాగింది. ఆ కాండము పైన ఒక మొగ్గ ఏర్పడి పుష్పించి మహా పద్మము అయ్యింది. పదహారు రేకులు గల ఆ మహా పద్మము ప్రకృతికి ప్రతిరూపమైనది. యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు మాయా మోహితుడై ఉండడం వలన అతని శరీరం నుండి ఒక భ్రమరం జనించింది. తుమ్మెద రూపం దాల్చిన మహావిష్ణువు మహా పద్మము వాలి ప్రణవనాదము చేస్తూ పద్మముతో సంపర్కమయాడు. పురుషుడు ప్రకృతి సంపర్కం వలన పద్మము నుండి విష్ణు తేజస్సుతో చతుర్ముఖుడు, చతుర్భుజుడు బంగారు ఛాయ శరీరంతో పద్మసంభవుడు జన్మించాడు. ఉదరములో పుట్టుకతోనే హిరణ్యము కలిగి ఉండటం వలన హిరణ్యగర్భుడు అయ్యాడు. పరబ్రహ్మము తేజస్సు నుండి పుట్టిన పరబ్రహ్మ పుత్రుడు "బ్రహ్మ" అయ్యాడు.


జన్మించిన బ్రహ్మదేవుడు నాలుగువైపుల నాలుగు ముఖాలతో చూశాడు. అన్ని వైపుల నీరే కనిపించింది. పదహారు రేకులు గలిగి మహాపద్మములో ఆసీనుడైన బ్రహ్మ పద్మము యొక్క కాండము వైపు చూశాడు. నూరుయోజనాల వరకు దూరం కాండము కింద వైపు కలిగివుంది. "చుట్టూ జలం ఉన్నప్పుడు తను ఎలాజన్మించాడు" అనే సందేహం బ్రహ్మకు కలిగింది.

సమాధానంగా ఓంకారనాదము వినిపించ సాగింది. ఈఓంకారము జపిస్తే తన జన్మరహస్యం తెలియవచ్చు అని అనిపించి ఓంకారము జపిస్తూ ధ్యాన నిష్టలో మునిగి పోయాడు.. అనేక సంవత్సరాల జపం తరువాత బ్రహ్మదేవునికి దివ్య దృష్టి లభించింది. దివ్యదృష్టితో తన జన్మకు కారకుడైన శ్రీమహావిష్ణువు అనంత జలరాశి పై యోగనిద్రలో కనపడ్డాడు.


అశరీరవాణి శయనిస్తున్న నారాయణుడే నీ తండ్రి అని పలికింది. తన తండ్రిని చూసిన ఆనందంతో బ్రహ్మదేవుడు చేతులు జోడించి భక్తి శ్రద్థలతో నమస్కరించాడు. ఆయన ముఖం వెంట "ఓం నమో నారాయణాయ" అని అష్టాక్షరి మంత్రం పుట్టుకు వచ్చింది. వెంటనే ఆ మంత్రంతో తపస్సు చేయి" అన్నట్టు "తపః తపః" అనే ఆదేశం వినిపించింది.


హిరణ్యగర్భుడు నారాయణమంత్రం జపిస్తూ వేయి సంవత్సరాలు తపస్సు చేశాడు. అయినా తన జన్మకారణం, తనకర్తవ్యం తెలియరాలేదు. చుట్టూ మహాజలథి మాత్రమే కన్పిస్తోంది. దివ్యదృష్టితో కనిపించిన తన తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను కలసే మార్గం ఏది?" అనుకుంటూ చింతాక్రాంతుడైనాడు.


అదే సమయంలో చాలా కాలము యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు చెవులలో ఏర్పడిన గుబిలి జలప్రవాహము తాకిడి వలన చెవుల నుండి బయటకు వచ్చింది. విష్ణువుని ఆవరించిన యోగమాయ స్పర్శతో ఆ గుబిలి రూపాలు పొంది మధు కైటభులు అనే కవల రాక్షస సోదరులుగా జన్మించారు. గుబిలి మాలిన్యంతో నల్లని శరీరము పొందిన వారు "మేము ఎవరం? మా నామధేయాలు ఏమిటి?" అని గట్టిగా అరవసాగారు.


అశరీరవాణి వారితో "మీరు పరబ్రహ్మ చెవి గుబిలి నుండి జన్మించారు. మీ నామధేయాలు మధు కైటభులు. మీకు స్వేచ్ఛా మరణం వరంగా లభించింది" అని పలికింది. 

వారు అహంకారం పొంది "మమ్మలి ఎదిరించే వారు ఎవరైనా ఉన్నారా!" అంటూ సవాలు చేస్తూ నీటిలో ఈదుతూ ముందుకెళ్ళారు. వంద యోజనాల దూరం వెళ్లగా ఒక మహాపద్మం కనిపించింది. ఆ పద్మము నుండి "ఓం నమో నారాయణాయ" అని జపము చేస్తున్న శబ్దం వినిపించ సాగింది.


మధు కైటభులు కాండము పట్టుకుని పైకెక్కి బ్రహ్మ ఎదుట నిలుచున్నారు. ధ్యానభంగం కలిగిన బ్రహ్మ కన్నులు తెరచి మధుకైటభులను చూసి ఆశ్చర్యపడ్డాడు. జన్మించిన పిమ్మట తండ్రి మహావిష్ణువు తరువాత చూసినది ఈ ఇరువురు దేహధారులనే. బ్రహ్మ సంశయం తీరుస్తూ "మేము మధుకైటభులము. స్వేచ్ఛామరణం వరంగా పొందాము. నీతో యుద్దం చేసి మా బలం నిరూపించుకుంటాము. ఇంతకీ నీవెవరు?" అని అడిగారు.


బ్రహ్మ "నేను చతుర్ముఖ బ్రహ్మను. పరబ్రహ్మమైన నారాయణుడు నా తండ్రి. నా జన్మకి కారణం, నా కర్తవ్యం తెలుసుకోవాలని తపస్సు చేస్తున్నాను. కనుక మీతో యుద్దం చేయలేను" అనడంతో మధుకైటభులు "అయితే మీ తండ్రి ఎక్కడో చెప్పు! ఆయనతోనే యుద్దం చేస్తాం" అన్నారు. 


బ్రహ్మ నిట్టూర్చి "నా తండ్రి నారాయణుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. నారాయణ మంత్రం జపించడం వలన లభించిన దివ్యదృష్టితో ఒక్కసారి మాత్రమే చూడగలిగాను" అని సమాధాన మిచ్చాడు.


"అయితే మంత్రం మాకు ఉపదేశించు! మేము ఆయన దర్శనం పొంది యుద్దం చేస్తాము" అని మధుకైటభులు అనడంతో బ్రహ్మ "తాను సృష్టించిన నారాయణ మంత్రం మరొకరికి ఉపదేశం చేసి గురు స్థానం పొందుతున్నాడు" అని సంతోషపడ్డాడు.  


అష్టాక్షరి మంత్రాన్ని మధుకైటభులకు ఉపదేశించాడు. నారాయణ మంత్రం జపం చేస్తూ వేల సంవత్సరాలు గడిపారు. తాము జపించేది ముక్తి ప్రసాదించే దివ్య మంత్రం అని వారికి తెలియదు.


మంత్రసిద్ధి లభించడంతో వారు బ్రహ్మను వదలి నారాయణుడు ఉండే ప్రదేశానికి వెళ్ళారు. నారాయణుడు నిద్ర లేచి వీరిని చూశాడు. "మేము నీతో యుద్దం చేయాలని మంత్రం జపం చేసాము. మాతో యుద్దం చేయి" అని మధుకైటభులు కోరిన కోరికకు అంగీకరించి విష్ణువు యుద్దానికే సిద్దమయ్యాడు. 


యుద్ధం ప్రారంభమై ఐదువేల సంవత్సరాలు గడిచాయి. ఎవరికీ విజయం లభించలేదు.


మహావిష్ణువు "నారాయణ మంత్రం జపంతో అజేయులైన వీరిని జయించడం సాధ్యం కాదు. ఉపాయంతోనే వీరి సంహారం చేయాలి" అని తలచి వారితో "నాతో ఇంతకాలం పోరాడిన మీ శౌర్యం నాకు నచ్చింది. మీ వీరత్వానికి మెచ్చి వరం ఇస్తాను. కోరుకోండి" అన్నాడు. మధుకైటభులకు విష్ణువు తమ శౌర్యాన్ని పొగిడేసరికే గర్వం కలిగి "మమ్మల్ని జయించ లేని నీవు వరము ఇవ్వటం మేమిటి? మేమే నీకు వరం ఇస్తాము. కోరుకో" అని అహంకారంతో పలికారు.


వెంటనే విష్ణువు "మీరు వరం ఇచ్చేది నిజమైతే, మీరిరువురు నాచేతిలో మరణించేట్టు వరము ఇవ్వండి" అని వరం కోరాడు. 


మధుకైటభులు ఉలిక్కిపడ్డారు. తమ అహంకారమే తమ చావు తెచ్చింది అని గ్రహించారు. తప్పించుకునే ఉపాయం ఆలోచించి "నారాయణా! నీవు కోరిన వరం ఇస్తున్నాము. ఆడిన మాట తప్పం. కానీ ఒక నియమము పాటించాలి. నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని నీవు సంహరించ గలవు" అన్నారు.  


సమస్తం నీటితో నిండి ఉంది కనుక విష్ణువు తమని చంపలేడు అని ధైర్యం వారిది.


విష్ణువు దుర్గాదేవిని మనస్సులో తలచుకుని "దేవీ! మధుకైటభులను సంహరించే శక్తి నాకు ప్రసాదించు!" అని అడిగాడు.  


దుర్గాదేవి వెంటనే ఆ మాయాశక్తి ప్రసాదించింది.  


విష్ణువు వెంటనే తన ఊరువులను (తొడలను) పెంచి వాటితో మొత్తం నీరు కనపడకుండా ఆక్రమించాడు. మధుకైటభులకు విష్ణువు చేతిలో తమ మరణం తప్పదని అర్థమైంది.


చక్రం ధరించిన విష్ణువు "మీరు కోరుకున్నట్లే నీటిచుక్క లేని నా ఊరువుల పై మిమ్మల్ని చక్రాయుధంతో సంహరిస్తాను" అన్నాడు. 


మధుకైటభులని అహంకార మద గర్వాలు వదలి పోయాయి. భక్తితో చేతులు జోడించి "నారాయణా! నీ అష్టాక్షరి మంత్ర జపంతో మేము ధన్యులమయ్యాము. మాకు ఇస్తామన్న వరం ఇచ్చి మమ్మల్ని చరితార్థులని చేయుము" అని కోరారు. 


తథాస్తు అని శ్రీమహావిష్ణువు వారిని తన ఊరువులపై తీసుకుని చక్రంతో సంహరించాడు.✍️

*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం..

శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో..

-సేకరణ:పెండ్యాల ఉపేంద్రరావు```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                    🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.

          ➖▪️➖

ఆనందం అయినవాళ్ళతో పంచుకో

 *🙏🙏 సర్వేజనా: సుఖినోభవన్తు🙏🙏*


*శుభోదయం*

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

"ఆనందం అయినవాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

"గతంలో నిన్ను బాధ పెట్టిన ఏదైనా విషయాన్ని మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మరచిపోకు."


🌻🌻🌻🌻🌻🌻🕉️ 

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి*


*🙏🙏🙏భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష*


భగవంతునిపై మనకు పరిపూర్ణమైన, అచంచలమైన విశ్వాసముంటేనే ఆయన దర్శనం,రక్షణ లభిస్తాయి.అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి.దీనికి ఉదాహరణగా ఓ కథ.


ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతలవైపు ఉన్న ఓ బ్రాహ్మణుని యింటికి రోజూ పాలు తీసుకుని వెళ్లి అమ్ముతుండేది. రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ “ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ నేను ఇంటిదగ్గరనుండి పెందలకడనే బయలుదేరుతున్నాను.కాని ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది.ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటేవాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది.” అని చెప్పింది. “ భగవన్నామస్మరణ చేస్తూ సంసారసాగరాన్నే ఈదవచ్చు కదా! అలాంటిది ఈ ఏటిని దాటలేవా?” అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా .అలా అనగానే ఆ గొల్లవనిత ‘ఇదేదో బాగుందే’ అనుకుంటూ వెళ్ళిపోయింది.


మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు “ ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చేవ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటి వచ్చేసేను.నాకింక ఆ తెప్పవాడితో పనిలేదు.” అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది.”అయితే నువ్వు ఏరు ఎలా దాటేవో నాకు చూపిస్తావా?” అని అడిగేడు.” ఓ దానికేం భాగ్యం? నాతో రండి.” అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్లి “ మీరూ రండి.” అంటూ తాను ఏటి మీద నడచుకుంటూ వెళ్లిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకుని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు. వెంటనే గొల్లవనిత “ అదేంటి స్వామీ? దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పేరు కదా! మరి మీరు అంత భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట.” అంది.


నిజమేకదా! భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది.


భగవంతునిపై విశ్వాసంతో, తీవ్రపరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది.రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ.


జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవిగుండా ఒంటరిగా పోవలసివచ్చేది. అలా వెళ్ళడానికి భయపడుతుండేవాడు. ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పేడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి “ నీకు భయం వేసినప్పుడల్లా ‘కృష్ణా’ అని పిలువు.” అని చెప్పింది. “కృష్ణుడెవరమ్మా?” అని అడిగేడు ఆ అమాయకుడు. “కృష్ణుడు నీ అన్న” అని చెప్పింది తల్లి. “ అయితే సరేనమ్మా” అన్నాడు ఆనందంగా ఆ అర్భకుడు


మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి ‘కృష్ణా’ అని పిలిచేడు. ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా “ అన్నా! కృష్ణా! ఎక్కడున్నావు? తొందరగా రా.నాకు భయమేస్తుంది. నాకు తోడుగా రా.” అని ఎలుగెత్తి పిలిచేడు. అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రాణ పరాయణుడు. వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి “ రా తమ్ముడూ! ఇంక నీకేం భయం ఉండదు. నీకు నేను తోడుగా ఉండి పాఠశాలవరకూ వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టేడు.పైగా “ ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు.లేదా రోజూ పిలిచినా వస్తాను” అని చెప్పి అంతర్దానమైపోయేడు ఆ భక్తవత్సలుడు. అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు.


ఇతర చింతనలన్నిటినీ మాని నన్నే స్మరించుచూ యే జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారో ఆ జనులయొక్క యోగ క్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను.” అని భగవద్గీతలో *🙏🙏 సర్వేజనా: సుఖినోభవన్తు🙏🙏*


*శుభోదయం*

 -------------------

🌻 *మహనీయుని మాట*🍁

        -------------------------

"ఆనందం అయినవాళ్ళతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో."

       --------------------------

🌹 *నేటి మంచి మాట* 🌼

      ---------------------------

"గతంలో నిన్ను బాధ పెట్టిన ఏదైనా విషయాన్ని మర్చిపో కానీ అది నీకు నేర్పిన పాఠాన్ని మరచిపోకు."


🌻🌻🌻🌻🌻🌻🕉️ 

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి*


*🙏🙏🙏భగవంతునిపై విశ్వాసమే భక్తులకు రక్ష*


భగవంతునిపై మనకు పరిపూర్ణమైన, అచంచలమైన విశ్వాసముంటేనే ఆయన దర్శనం,రక్షణ లభిస్తాయి.అయితే ఆ విశ్వాసం ఏమాత్రం సడలనిదై ఉండాలి.దీనికి ఉదాహరణగా ఓ కథ.


ఓ ఊళ్ళో భక్తురాలైన ఓ గొల్ల వనిత ఉండేది. ఆమె ఊళ్ళోని ఏటికి అవతలవైపు ఉన్న ఓ బ్రాహ్మణుని యింటికి రోజూ పాలు తీసుకుని వెళ్లి అమ్ముతుండేది. రోజూ ఆమె ఆలస్యంగా వస్తుండడంతో ఆ బ్రాహ్మణుడు చిరాకు పడుతూ “ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ నేను ఇంటిదగ్గరనుండి పెందలకడనే బయలుదేరుతున్నాను.కాని ఏరు దాటించే తెప్పవాడు రావడం ఆలస్యమవుతుంది.ఒకవేళ వాడు వచ్చినా ఏరు దాటేవాళ్ళంతా చేరుకునేసరికి ఆలస్యమవుతుంది.” అని చెప్పింది. “ భగవన్నామస్మరణ చేస్తూ సంసారసాగరాన్నే ఈదవచ్చు కదా! అలాంటిది ఈ ఏటిని దాటలేవా?” అన్నాడు బ్రాహ్మణుడు యథాలాపంగా .అలా అనగానే ఆ గొల్లవనిత ‘ఇదేదో బాగుందే’ అనుకుంటూ వెళ్ళిపోయింది.


మర్నాడు గొల్లవనిత ఉదయాన్నే పాలు తీసుకురావడం చూసి బ్రాహ్మణుడు “ ఎప్పుడూ లేనిది ఈవేళ ఇంత ముందుగా ఎలా వచ్చేవ్?” అని అడిగేడు. దానికా గొల్లవనిత “ మీరు చెప్పినట్లే నేను దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటి వచ్చేసేను.నాకింక ఆ తెప్పవాడితో పనిలేదు.” అని చెప్పింది. అలా చెప్పగానే బ్రాహ్మణుడికి మతి పోయింది.”అయితే నువ్వు ఏరు ఎలా దాటేవో నాకు చూపిస్తావా?” అని అడిగేడు.” ఓ దానికేం భాగ్యం? నాతో రండి.” అని ఆ బ్రాహ్మణుడిని తనతో ఏటి వద్దకు తీసుకుని వెళ్లి “ మీరూ రండి.” అంటూ తాను ఏటి మీద నడచుకుంటూ వెళ్లిపోసాగింది. కొన్ని అడుగులు వేసి వెనక్కి తిరిగి చూసేసరికి బ్రాహ్మణుడు పంచె పైకెత్తుకుని ఏటిలో దిగడానికి అవస్థలు పడుతున్నాడు. వెంటనే గొల్లవనిత “ అదేంటి స్వామీ? దేవుడి పేరు తలచుకుంటూ ఏరు దాటేయవచ్చని మీరే నాకు చెప్పేరు కదా! మరి మీరు అంత భయపడుతున్నారేంటి? అంటే మీకు దేవుడి మీద పూర్తి నమ్మకం లేదన్నమాట.” అంది.


నిజమేకదా! భగవంతునిపై భక్తురాలైన ఆ గొల్లవనితకున్న విశ్వాసం ఆ బ్రాహ్మణుడికి లేదనేగా వెల్లడవుతుంది.


భగవంతునిపై విశ్వాసంతో, తీవ్రపరితాపంతో భగవంతుని శరణాగతి కోరితే తప్పకుండా ఆయన దర్శనం కలుగుతుంది.రక్షణ లభిస్తుంది అనడానికి ఉదాహరణగా మరో కథ.


జటిలుడనే ఒక బాలకుడు రోజూ పాఠశాలకు వెళ్ళడానికి ఓ చిట్టడవిగుండా ఒంటరిగా పోవలసివచ్చేది. అలా వెళ్ళడానికి భయపడుతుండేవాడు. ఆ విషయం వాళ్ళమ్మకు చెప్పేడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాని భయం పోగొట్టడానికి “ నీకు భయం వేసినప్పుడల్లా ‘కృష్ణా’ అని పిలువు.” అని చెప్పింది. “కృష్ణుడెవరమ్మా?” అని అడిగేడు ఆ అమాయకుడు. “కృష్ణుడు నీ అన్న” అని చెప్పింది తల్లి. “ అయితే సరేనమ్మా” అన్నాడు ఆనందంగా ఆ అర్భకుడు


మర్నాడు ఆ బాలకుడు పాఠశాలకు వెళ్తూ త్రోవలో భయం వేసి ‘కృష్ణా’ అని పిలిచేడు. ఎవరూ రాకపోయేసరికి ఇంకా బిగ్గరగా “ అన్నా! కృష్ణా! ఎక్కడున్నావు? తొందరగా రా.నాకు భయమేస్తుంది. నాకు తోడుగా రా.” అని ఎలుగెత్తి పిలిచేడు. అంత నిష్కపటంగా మొరపెట్టుకుంటున్న పిల్లవాడి మొరను ఆలకించకుండా ఉంటాడా ఆ ఆర్తత్రాణ పరాయణుడు. వెంటనే కృష్ణుడు ఓ బాలుడి రూపంలో వచ్చి “ రా తమ్ముడూ! ఇంక నీకేం భయం ఉండదు. నీకు నేను తోడుగా ఉండి పాఠశాలవరకూ వచ్చి దిగబెడతానని అలాగే దిగబెట్టేడు.పైగా “ ఇక నీకు ఎప్పుడు భయం వేసినా నన్ను పిలువు.లేదా రోజూ పిలిచినా వస్తాను” అని చెప్పి అంతర్దానమైపోయేడు ఆ భక్తవత్సలుడు. అలా పసిపిల్లలకుండేలాంటి నిష్కల్మషమైన విశ్వాసం ఉండాలి భగవంతుడిపై మనకు.


ఇతర చింతనలన్నిటినీ మాని నన్నే స్మరించుచూ యే జనులు నన్ను శరణు పొంది ఉపాసించుచున్నారో ఆ జనులయొక్క యోగ క్షేమ భారాన్ని నిత్యం నేను వహిస్తాను.” అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు.🙏శ్రీకృష్ణ భగవానుడే చెప్పియున్నాడు.🙏

కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు...........

 కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు............!!

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.


2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.


3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.


4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.


5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?


6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.


7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.


8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.


9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.


10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.


11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.


12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.


13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.


కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......


ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :


1) దశాశ్వమేధ ఘాట్:

బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.


2) ప్రయాగ్ ఘాట్:

ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.


3) సోమేశ్వర్ ఘాట్:

చంద్రుని చేత నిర్మితమైనది.


4) మీర్ ఘాట్:

సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.

ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.


5) నేపాలీ ఘాట్:

పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.


6) మణి కర్ణికా ఘాట్:

ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.


7) విష్వేవర్ ఘాట్:

ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.


8) పంచ గంగా ఘాట్:

ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.


9) గాయ్ ఘాట్:

గోపూజ జరుగుతున్నది.


10) తులసి ఘాట్:

తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.


11) హనుమాన్ ఘాట్:

ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది

ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.


12) అస్సి ఘాట్:

పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.


13) హరిశ్చంద్ర ఘాట్:

సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు.

పెద్దల మాట 🏵️*

 *సర్వేజనాః సుఖినోభవన్తు*


*🙏 శుభోదయమ్ 🙏*


*🏵️ నేటి పెద్దల మాట 🏵️*


తన చెంతకు ఎవరొచ్చినా తరతమ భేదం లేకుండా, హెచ్చుతగ్గుల భేదం లేకుండా వచ్చింది పశుపక్షాదులా, మానవులా అన్న తారతమ్యం లేకుండా నీడను, పండ్లను ఇవ్వడం ద్వారా, మానవుడు కూడా నిస్వార్ధ సేవాపరుడై ఎలా ఉండాలన్న సందేశం ఇస్తుంది చెట్టు.

                                                      

*🌹నేటి మంచి మాట🌹*


మొక్కపై అలరారుతూ అందంగా వికసించి, తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ పరిమళాన్ని ఇచ్చి ఆనందమును కల్గిస్తూ, వాడిపోయక హాయిగా రాలిపోతూ సరళంగా ఉండడం ద్వారా - మానవుడు కూడా అంత ఆదర్శంగానే సరళంగా జ్ఞానవంతంగా జీవించాలన్న సందేశాన్నిస్తుంది పువ్వు.          


🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

*卐ఓం శ్రీ గురుభ్యోనమః卐*


*గురువారం, ఫిబ్రవరి 26, 2026*


*శ్రీ విశ్వావసు నామ సంవత్సరం*      

*ఉత్తరాయనం - శిశిర ఋతువు*

   *ఫాల్గుణ మాసం - శుక్ల పక్షం*   

తిథి : *దశమి* రా12.43 వరకు

వారం : *గురువారం* (బృహస్పతివాసరే)

నక్షత్రం : *మృగశిర* మ12.37 వరకు

యోగం : *ప్రీతి* రా11.07 వరకు

కరణం : *తైతుల* మ1.50 వరకు

       తదుపరి *గరజి* రా12.43 వరకు

వర్జ్యం : *రా8.29 - 9.59*

దుర్ముహూర్తము : *ఉ10.16 - 11.03*

                 మరల *మ2.55 - 3.41*

అమృతకాలం : *మ1.44 - 3.14*  

రాహుకాలం : *మ12.00 - 1.30* 

యమగండ/కేతుకాలం : *ఉ6.00 - 7.30*

సూర్యరాశి: *కుంభం* || చంద్రరాశి: *మిథునం*

సూర్యోదయం : 6.25 || సూర్యాస్తమయం: 

6.01.



*సర్వేజనా: సుఖినోభవన్తు - శుభమస్తు🙏*

----------------------------------------

*_గోమాతను పూజించండి_*

*_గోమాతను సంరక్షించండి_*

.


*కష్టం-సుఖం ఈ రెండింటికీ మనం కర్తలం కాదు వచ్చిన కష్టం కానీ సుఖానికి కానీ తానే కర్త అనుకుంటాము మనం. ఇది పొరపాటు. దీని వెనకాల ఉండి నడిపే ఒక గొప్పశక్తి ఉంది. మనం కేవలం ఒక పనిముట్టు మాత్రమే ! దీన్ని ఆమోదిస్తే గొడవ లేదు. బాధ లేదు, లేకుంటే అన్నీ భాధలే.... ఎలా....?!!!_*

                   

గోపురాన్ని భుజస్కంధాలపై మోస్తున్నట్లుండే విగ్రహాన్ని చూస్తుంటాం !బరువంతా తానే భరిస్తున్నట్లు ఫోజు ఉంటుంది, కానీ ఆ బరువు గోపురం వెనకాల భూమిలోని పునాదుల మీద ఉంటుంది. తానే పనులన్నీ చక్కపెట్టేస్తున్నాను అనుకునే మనిషి కూడా అంతే...!


ఈ జగత్తులో జరిగే ఖర్మలకు కూడా మనం సాక్షిభూతులమే, వెనకాల నడిపించేది భగవత్

 శక్తి మాత్రమే, మనం చేసుకున్న పాప పుణ్యాలు మాత్రమే అనుభవించడానికి మనం జన్మ ఎత్తామ్. ఇది తథ్యం...!


మరి అన్నీ ముందే డిసైడ్ అయినప్పుడుమనంచేయాల్సింది ఏమిటి అనేది ప్రశ్న !


కొన్ని కర్మలు అనుభవించాలి, అనుభవించక తప్పదు, ఈ భాధలలో కూడా భగ్వన్నామస్మరణ విడవకుండా ఉండి, సంపూర్ణ శరణాగతి పొందితే భగవత్ అనుగ్రహముతో అనుభవించే ఖర్మను కూడా తప్పించుకోవచ్చు...!


*Ex:*

మహాభారత యుద్ధంలో అర్జునుడిపై వేసిన బాణాలు ఇంతా అంత శక్తివంతమైనవి కాదు, చాలా అఖండమైన శక్తి వంతమైనవి, కేవలం శ్రీకృష్ణుని అనుగ్రహం చేత వాటి శక్తి పని చేయలేదు...!


ఒకసారి శ్రీ కృష్ణుడు యుద్ధానంతరం అర్జునుని 

రథాన్ని దిగమని కోరతాడు. అర్జునుడు దిగిన పిమ్మటనే కృష్ణుడు దిగుతాడు, అప్పుడు రథం భయంకరమైన శబ్దాలతో, అతి భయంకరమైన మంటలతో కాలి పోవడం చూసి అర్జునునుడు భయంతో వణికిపోతాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు చెపుతాడు .... ఇంతవరకు నేను ఈ రథంలో వున్నంతకాలం ఎవరి బాణములు ఏమి చేయలేకపోయాయి... ఇప్పుడు నేను దిగాను వాటి పని అవి చేస్తున్నాయి...!


మన కర్మలు కూడా అంతే భగవంతుడు మనయందు ఉన్నత కాలం మనల్ని ఏమి చేయలేవు... ఆయనకు దూరమైన రోజు అన్ని అనుభవించాలి...! అందుకే ... దైవనామస్మరణ మరియు నిత్య భగవత్ కార్యాలలో 

పాల్గొనడం మంచిది..


🪷🙏🪷🏵️🪷🙏🪷🏵️🙏🪷🙏🏻