27, జూన్ 2026, శనివారం

*కర్మ, పునర్జన్మ,*

 *కర్మ, పునర్జన్మ,*



దైవపూజను కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే చేయాలి అనే అపోహ మనిషి భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన ఆలోచన.


మనం ప్రస్తుతం అనుభవిస్తున్న సుఖాలు, శాంతి, ఐశ్వర్యం, గౌరవం — ఇవన్నీ పూర్వజన్మలలో చేసిన పుణ్యకర్మల ఫలితాలు.


అలాగే ఈ జన్మలో దైవం పట్ల నిర్లక్ష్యం, అవమానం, నింద, అహంకారం, అలాగే భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు చూపే అవమానకరమైన ప్రవర్తన, ద్వేషం, అహంభావం వంటి కర్మలు భవిష్యత్తులో లేదా వచ్చే జన్మలో దుఃఖానికి, దుర్బలమైన జీవితానికి కారణమవుతాయి.


కర్మ సిద్ధాంతం

మంచి–చెడు అనే భేదం లేకుండా, చేసిన ప్రతి కర్మకు తగిన ఫలితాన్ని సమదృష్టితో అందిస్తుంది.


అందువల్ల కష్టకాలంలో మాత్రమే కాదు, సుఖకాలంలో కూడా కృతజ్ఞతతో దైవస్మరణ, దైవపూజ, ధర్మాచరణను జీవితంలో భాగంగా చేసుకోవాలి.

ప్రతి క్షణం మనసును దైవానికి దగ్గర చేయండి. 


ధర్మమార్గంలో నడవండి. మీ భవిష్యత్తును మీ సత్కర్మలతో సరిదిద్దుకోండి.


"వినాశకాలే విపరీత బుద్ధిః"

 వినాశనం సమీపించినప్పుడు మనిషి సన్మార్గాన్ని విడిచి విపరీతమైన ఆలోచనలకు లోనవుతాడు. కాబట్టి వివేకంతో, ధర్మంతో, భక్తితో జీవించడం శ్రేయస్కరం.


గమనిక:

కర్మ, పునర్జన్మ, పూర్వజన్మ పుణ్యం వంటి భావనలు భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో విస్తృతంగా అంగీకరించబడిన తాత్విక సిద్ధాంతాలు.


దైవ నామస్మరణ జపం చేసే వారికి పుణ్యం తగ్గదు.

పాపం దహనం అవుతుంది. 

దీన్ని కూడా యోగాగ్ని కర్మని దహనం చేస్తుంది అంటారు. 




     శుభమస్తు

🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా..✍️

సమస్త లోకా సుఖినోభవంతు 🙏

ఆరోగ్యంగా ఉండటానికి

 శ్రీ కంచి మహాస్వామి-22

ఆరోగ్యంగా ఉండటానికి సులభమైన పరిష్కారం!

(Simple Solution for Being Fit!)

కరూర్ పండిట్ రామ శర్మ ఒక ఆయుర్వేద వైద్యుడు. ఆయన శక్తివిలాస ఆసుపత్రిని స్థాపించి తన వృత్తిని కొనసాగించారు. కేబీ సుందరాంబాల్, ధీరర్ సత్యమూర్తి సహా చాలా మంది ఆయన వద్ద వైద్య చికిత్స పొందారు. చిత్రకారుడైన నామక్కల్ కవిగ్నర్, ఆయన ఆరోగ్యం తిరిగి రావాలని కోరుతూ మురుగన్ స్వామి యొక్క అందమైన చిత్రాన్ని గీసి ఆయనకు సమర్పించారు.

రామ శర్మ మహాపెరియవ భక్తుడు. పెరియవ కరూర్ వెళ్ళినప్పుడల్లా, అతను ఆయన ఇంట్లోనే బస చేసేవాడు.


ఒకసారి పెరియవ తనకు జ్వరం లక్షణాలు ఉన్నాయని కబురు పంపి, రామ శర్మను కాంచీపురానికి రమ్మని కోరారు. రామ శర్మ కూడా కాంచీపురానికి చేరుకున్నాడు.


అతని మందుల పెట్టెను చూసి పెరియవా ముఖంలో చిరునవ్వు కనిపించింది. “నిన్ను మాత్రమే రమ్మని చెప్పాను, మెడికల్ కిట్ తీసుకురమ్మని అడగలేదు”. రామ శర్మ ఆశ్చర్యపోయాడు. అతను, “మీకు జ్వరం ఉందని చెప్పారు, అందుకే నా మెడికల్ కిట్ తీసుకువచ్చాను” అని బదులిచ్చాడు.

భౌతిక శరీరం ఉన్నప్పుడు, దానికి అప్పుడప్పుడు జ్వరం రావడం సహజం. జ్వరం, శరీరాన్ని స్వస్థపరచడానికే పుడుతుంది!

పర్వాలేదు. జ్వరానికి మందు అవసరం ఏముంది? దానికి వేరే రకమైన మందు ఉంది. అది వాడటానికే మిమ్మల్ని రమ్మని చెప్పాను!


రామ శర్మకు అర్థం కాలేదు. ఆయన మౌనంగా ఉండిపోయారు. పెరియవ కొనసాగించారు. “నువ్వు స్నానం చేసి వచ్చి ఉండాల్సింది. ఆగు. నేను వెళ్లి, మరోసారి స్నానం చేసి వస్తాను”.

రామ శర్మ చాలా కలత చెందాడు. స్వామికి జ్వరం వస్తున్నప్పుడు స్నానం చేస్తానని అంటున్నారు. కానీ దానికి వ్యతిరేకంగా ఏమీ అనాలని అతనికి తట్టలేదు. అతను పెరియవ తిరిగి వచ్చే వరకు ఎదురుచూశాడు.


స్నానం చేసి తిరిగి వచ్చిన తర్వాత, పెరియవా తన శరీర ఉష్ణోగ్రతను తెలుసుకోమని అడిగారు. థర్మామీటర్తో చూడగా, స్వామికి జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయింది.

"మంచిది, మనమిద్దరం ఇప్పుడు విష్ణు సహస్రనామం పఠించబోతున్నాము" అని పెరియవా పేర్కొన్నారు.

వారిద్దరూ కలిసి దానిని పఠించారు. పఠనం ముగిసిన తర్వాత, పెరియవా అతడిని ఉష్ణోగ్రత చూడమని అడిగారు.


ఏమి ఆశ్చర్యం! జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. వెంటనే పెరియవ శర్మతో, “విష్ణు సహస్రనామం సంపదనే కాక ఆరోగ్యంతో సహా మరెన్నో విషయాలను ఇస్తుందని నేను అవిశ్రాంతంగా చెబుతూనే ఉన్నాను. ప్రజలు కూడా వింటారు. అది నిజంగా నిజమని నేను నిరూపించకూడదా? అందుకే నేను ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను” అని అన్నారు.


భగవానుని నామాన్ని జపించడం వల్ల ఈ జనన మరణ వ్యాధి నయమవుతుందని తమిళంలో అంటారు. అది జనన వ్యాధినే నయం చేయగలిగితే, జీవితకాలంలో వచ్చే వ్యాధులను నయం చేయదా?

రోగులు మీ వద్దకు వచ్చినప్పుడు, ఎప్పటిలాగే మందులు ఇవ్వండి. అనారోగ్యం ఉన్నప్పుడు మందులు తీసుకోవడం ఖచ్చితంగా అవసరం. కానీ దానితో పాటు విష్ణు సహస్రనామం అనే మందును కూడా ఇవ్వవచ్చా? చికిత్స కోసం మీ వద్దకు వచ్చే వారికి మీరు ఇచ్చే మందుల చీటీలో దీనిని చేర్చలేరా? కేవలం మీకు ఆ విషయంలో నమ్మకం కలిగించడానికే మిమ్మల్ని రమ్మని అడిగాను.


ప్రకృతి వైద్యంలో ప్రార్థనకు ప్రథమ ప్రాధాన్యత ఉంది”. అలా చెబుతూ పెరియవా ఒక చిన్నపిల్లాడిలా గట్టిగా నవ్వారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

శ్రీ మహాపెరియవ శరణం శరణం పరమాచార్యా రక్ష రక్ష

జయ జయ శంకర | హర హర శంకర 

జయ జయ శంకర | హర హర శంకర  

సర్వే జనాః సుఖినోభవంతు

మన ప్రయత్నాలు..

  ఒక యువకుడు గురువు దగ్గరకి వెళ్లి "ఒకడు నా జీవితాన్ని నరకం చేస్తున్నాడు గురూజీ” అన్నాడు.


“ఏం చేస్తున్నాడు? రోజూ వచ్చి డబ్బులు అడుగుతున్నాడా? బెదిరిస్తున్నాడా?” అడిగాడు గురువు.


“వాడు ఇక్కడ ఉండడు. కానీ కనపడిన ప్రతివాడితో నా గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడు. దీంతో నాకు రాత్రిళ్ళు నిద్ర పట్టటం లేదు. రక్తం మరుగుతోంది. ఆ చిరాకంతా నా భార్యా పిల్లల మీద పడుతోంది”.


“వాడిని ఏమి చెయ్యాలనుకు౦టున్నావు?”


“చంపేయాలనుకుంటున్నాను."


“చంపితే జైలుకు వెళ్తావు. వాడికి కావలసింది అదే కదా” అన్నాడు గురువు.


యువకుడు దెబ్బ తిన్నట్టూ చూసి, “మరి నా సమస్యకి ఏమిటి పరిష్కారం గురూజీ?” అని అడిగాడు.


గురువు అతన్ని ఒక గదిలోకి తీసుకెళ్ళి తాళం వేసి, కిటికీలోంచి చెవి లోపలికి విసిరేసి “…సమాధానం కావాలనుకున్నప్పుడు బయటకు రా” అని వెళ్ళి పోయాడు.


యువకుడికి అర్థం కాలేదు. “పరిష్కారం కోసం వస్తే గదిలో తాళం వేసి చెవి నాకు ఇచ్చాడేమిటి? ఈ గురువు పిచ్చివాడిలా ఉన్నాడు” అని నవ్వుకున్నాడు. కాస్సేపు ఏమీ తోచలేదు. నేల మీద చిన్న చాక్‌పీస్ ముక్క కనపడింది. దాంతో గోడ మీద బొమ్మలు గీయసాగాడు. అంతలో ఆకలేసింది. ఆశ్రమం కిటికీ లోంచి కనపడుతోన్న అరటి గెలలు చూస్తో౦టే అది మరింత ఎక్కువైంది.


మరో రెండు గంటలు గడిచే సరికి మొహం మీద నవ్వు మాయమైంది. కడుపులో ప్రేవులు భయంకరంగా అరవసాగాయి. ఇక భరించలేక... అసహనం కోపంగా మారి... తలుపులు బద్దలు కొట్టయినా సరే స్వామిని నిలదీద్దామని వెళ్లి... ... నిశ్చేష్టుడయ్యాడు. బయట తాళం వేసి లేదు. తలుపులు దగ్గరకి వేసి ఉన్నాయంతే.


“నన్ను తిట్టాలనీ, వీలయితే కొట్టాలనీ అనుకుంటున్నావు కదూ” అన్నాడు గది బయటే నిలబడి ఉన్న గురువు ప్రశాంతంగా.


యువకుడు అపరాధ భావనతో తల దించుకుని, “క్షమించండి. తప్పే. కానీ మీరు ఇదంతా ఎందుకు చేశారో, గదిలో పెట్టి ఎందుకు తాళం వేశారో అర్థం కావటం లేదు” అన్నాడు.


గురువు అతన్ని ఆశ్రమం పక్కనే ఉన్న తోటకి తీసుకు వెళ్లాడు. అక్కడ చెట్టు క్రింద ఎండిన ఆకులు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. “చూడు… ఆకుల్ని ఈ చెట్టు ఎలా వదిలేసిందో” అన్నాడు.


“ఇందులో విశేషం ఏముంది స్వామీ? రాత్రి గాలికి పడిపోయాయి” అన్నాడు యువకుడు తేలిగ్గా.


“కాదు. చెట్టు నిర్దాక్షిణ్యంగా వదిలేసింది కాబట్టే పడిపోయాయి” అన్నాడు గురువు.


ఈ కొత్త థియరీకి యువకుడు అయోమయంగా చూశాడు. “చెట్టు ఆకుల్ని ఎందుకు వదిలేసింది? ఆలోచించు. వదలక పోతే ఆ చెట్టు పచ్చదనం లేక చచ్చిపోయి ఉండేది. అవునా?”.


ఈ కొత్త సిద్ధాంతానికి యువకుడు అవాక్కయ్యాడు.


“వసంతంలో చిగుర్లు వెయ్యటం కోసం శిశిర౦లో శేషపత్రాల్ని వదిలేయటమే చెట్టు మనకి చెప్పే జీవిత సత్యం..! నీ శత్రువు నిన్ను నీ నిద్రకూ, భార్యా పిల్లలకూ దూరం చేస్తున్నాడు. చెట్టు ఎండుటాకుని వదిలేసినట్టూ వదిలెయ్యకుండా ఎందుకు గుండెల్లో పెట్టుకుని పోషిస్తున్నావు?”


అతడితో కలిసి ఆశ్రమం వైపు నడుస్తూ చెప్పాడు. “భయం, కోపం, దుఃఖం- ఎండిపోయిన ఆకుల్లాటివి. అవి సమస్యలు కావు. వాటిని వదల్లేని మన మనసే మన సమస్య. అనుమానం ఇంకా పెద్ద సమస్య. నేను నీ గదికి తాళం వెయ్యలేదు. ఒకవేళ వేసినా, నీకిచ్చిన చెవితో లోపల్నుంచి కూడా తెరవవచ్చు. కనీస౦ నువ్వా ప్రయత్నం కూడా చెయ్యలేదు..! నీ కిటికీ పక్కనే ఓ కర్ర ఉంది. దాంతో అరటి పళ్ళు తె౦పుకోవచ్చు. నీ దృష్టి అసలు అటు పోనేలేదు..! గోడలపై పిచ్చి పిచ్చి బొమ్మలు వేసుకుంటూ నన్ను తిట్టుకోవటం తోనే నీకు సరిపోయింది. సిగ్గు పడకు. అందరూ చేసేది అదే..! సమస్యకి ‘పరిష్కారాలు’ ఆలోచించకుండా, ‘పరిణామాలు’ ఆలోచిస్తూ, అందమైన జీవితం గది గోడల్ని నిరర్థక వ్యధల చాక్-పీస్‌తో పాడు చేస్తారు. ప్రస్తుతం నీ ప్రత్యర్థి పట్ల నువ్వు చేస్తున్నది కూడా అదే”.


ఒక వెలుగు కిరణం మేఘాల్ని చీల్చుకుని వచ్చినట్టు అయింది. ఒక సత్యం అర్థం అయినట్టు యువకుడు నమస్కరించాడు. “వెళ్లిరా. ఒక విషయం గుర్తు పెట్టుకో..! మనల్ని బంధించి ఉంచేవి తాళాలు కావు. తెరవటానికి చెయ్యని మన ప్రయత్నాలు...!” అన్నాడు గురువు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 21*


*నమస్యాసంసజ్జన్నముచిపరిపంథిప్రణయినీ-*

*నిసర్గప్రేంఖోలత్కురలకులకాలాహిశబలే ।*

*నఖచ్ఛాయాదుగ్ధోదధిపయసి తే వైద్రుమరుచాం*

*ప్రచారం కామాక్షి ప్రచురయతి పాదాబ్జసుషమా ॥*


*భావము :*


*అమ్మా! ఇంద్రపత్ని శచీదేవి, నీ పాదములకు ప్రణమిల్లినపుడు, ఆమె ముంగురులు, పాలసముద్రమువంటి నీ పాదములపై తేలియాడుచున్న నాగులవలే కనిపించు చున్నవి. ఇక నీ ఎర్రని పాదముల కాంతి క్షీరసముద్రముపై అనేకమైన పగడములవలే ప్రతిబింబించు చున్నది.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

23, జూన్ 2026, మంగళవారం

ఉదర నిమిత్తం బహుకృత వేషః

 

 ఉదర నిమిత్తం బహుకృత వేషః

ఆది శంకరాచార్యులవారు  దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ళ క్రితం చెప్పిన శ్లోకం ఇప్పటి మన సమాజంలో మనం చూస్తున్న విషయాలకు అద్దంపట్టినట్లు ఉన్నదంటే అతిశయోక్తిలేదు. రోజులల్లో మనకు చాలామంది సత్గురువులు తారసపడుతున్నారువారి ఆకారాలు, వస్త్రధారణలు మనలను వారు సాక్షాతూ భగవానుని అవతారం అనేవిధంగా మభ్యపెడుతున్నారు. పెద్ద పెద్ద ఆశ్రమాలు నిర్మించుకొని, ఖరీదయిన భావంతులలో సకల భోగాలను అనుభవిస్తూ, మనలకు వేదాన్తభోదనలను చేస్తున్నారువారి శిష్యగణం అంతా అత్యంత ధనవంతులు, పెద్ద పెద్ద రాజకీయనాయకులు, ఇంకా ఇతర ధనికవర్గానికి చెందిన గొప్పవారు. వారి దర్శనానికి టికెట్, వారి పాద ప్రక్షాళణానికి టికెట్, మనఇంట్లో వారి పాదాలనుమోపితే టికెట్ ఇలా ప్రతి దానికి ఎంతో ఖరీదైన టికెట్లను వసూలు చేస్తూ వారి పబ్బాలను గడుపుకొని మనలను ఉద్ధరిస్తున్నామని చెప్పుతున్నారు. వారిని చుస్తే  "పైన పటారం లోన లొటారం" అన్న సామెతకు సారూప్యంగా వుంటున్నారు. ఒక స్వామిజి విభూతి ఇస్తారు, ఒక స్వామిజి కుంకుమ ఇస్తారు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇస్తూ దీవెనలు ఇస్తూ సామాన్యుల ధనాన్ని దోచుకుంటున్నారు. కొందరు గుండు చేసుకొని దర్శనమిస్తే కొందరు మీసాలకుగడ్డాలకు  కూడా రంగు వేసుకొని దర్శనమిస్తున్నారు, మరికొందరు జడలు పెంచుకొని వుంటున్నారుకొందరు ఖరీదైన కాషాయ వస్త్రాలు ధరిస్తే, కొందరు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారుఏదో ఒక ప్రేత్యేక గుర్తింపు కలిగి వారే పరమేశ్వరుని అవతారాలని లేక ఈశ్వరుని దూతలమని చెప్పుకొంటూ అనేక విధాలుగా మన మనస్సులను వారి వశం చేసుకొని మననుంచి ద్రవ్యాన్ని కాజేస్తున్నారువారి శిష్యులకు పని జరిగింది పని జరిగింది అని ప్రచారాలు చేస్తూ అమాయక సామాన్య ప్రజలను వారి శిష్యగణంలో చేర్చుకొని వలసినంత దండుకుంటున్నారుసమశ్యలలో మునిగి తేలే సగటు మధ్యతరగతి మానవులు వారి ప్రసంగాలకు, వారిగూర్చి ఇతరులు చేసే ప్రచారాలకు లొంగి వారికేదో మేలు జరుగుతుందని భ్రమపడి అప్పులు చేసి మరి వారి దర్శనానికి వెళ్లి వారి వలలో పడుతూ తమ  జీవితాలను ఇక్కట్ల పాలు చేసుకుంటున్నారు

సముద్రంలో కొట్టుకొని వెళ్లే వాడికి చిన్న గడ్డిపరక దొరికినా ఎంతో ఊరట కలిగిస్తుంది అన్నట్లు నిత్యం సమశ్యలలో చిక్కుకొని అనేక కస్టాలు పడే సగటు మానవులకు దొంగ స్వాములు, గురువులు, దేవతా అవతారమూర్తులు చేసే ప్రసంగాలు, మాటలు వారికి ఎంతో ఆశను కలిగిస్తాయి. అందుకే వారికి ఏదో ఉపశమనం కలుగుతుందనే ఆశతో వారు ఏమిచేస్తున్నారో కూడా తెలియకుండా వారి వశమవుతున్నారు. భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో భగవంతుని అవతారం ఎత్తే సమయం ఇంకా రాలేదని తత్వవిదులు చెపుతున్నారు. నిజానికి భగవంతుడు భూమి మీద అవతారం ఎత్తితే సమాజాన్ని ఒక శ్రీ రాముడి లాగ లేక ఒక శ్రీకృష్ణుని లాగా ఉద్ధరిస్తారే కానీ వారి వారి స్వార్ధానికి మనలను దోచుకోరనే చిన్న నిజం తెలిస్తే ఎవ్వరు మోసపోరు. శ్రీ రామచంద్రులవారు ఒక సార్వభౌమ కుటుంబంలో జన్మించి కూడా అతి సామాన్యుని వలె నారవస్త్రాలను (చౌకబారు బట్టలు) ధరించి తన భార్య తమ్మునితో అడవిలో గుడిసెలలో (పర్ణశాలలో) నివసించి ఆకులు, అలమలు తిని మనకు తండ్రి మాటను నిలపెట్టుకోవటమే కుమారుని ధర్మం అని బోధించారు. ఇక శ్రీకృష్ణ పరమాత్మగారు ఇప్పటికి నిత్యనూతనము సదా ఆచరణీయం అయిన శ్రీమత్ భగవత్గీతను మనకు ప్రసాదించారుఒక్కసారి ఆలోచించండి రోజుల్లో మనకు కనబడే బాబాలు, స్వామీజీలు వారి ముందు ఏపాటివారో

నిజానికి భగవంతుని ఆరాధించటానికి, భగవంతుని చేరటానికి కావలసింది నిష్కల్మషమైన మనస్సు, అకుంఠితమైన దీక్ష, శ్రర్ధ  మాత్రమే. అవిలేకుండా ఎవ్వరు భగవంతుని కృప కటాక్షాలను పొందలేరుధనంతో కొనలేనిది కేవలం భగవంతుడు మాత్రమేఇక శ్రీ శంకరాచార్యుల వారు నుడివిన శ్లోకాన్ని పరికిద్దాం

జటిలో ముండి లుంఛిత కేశః కాషాయాంబర బహుకృత వేషః| 

పశ్యన్నపి పశ్యతి మూఢః ఉదర నిమిత్తం బహుకృత వేషః||”

ఒకానొకడు జడలు ధరించీ, మరొకడు ముండనం చేయించుకునీ, ఇంకొకడు వెంట్రుకలు పెరికేసుకునీ, మరొకడు కాషాయ వస్త్రాలను ధరించీ ఉంటారు. చూస్తూ కూడా వాస్తవాన్ని చూడలేని మూర్ఖులు పొట్టనింపు కోవటానికే అనేకానేక వేషాలు వేస్తూంటారు.”

జడలు పెంచుకోవడం, బోడిగుండు చేయించుకోవడం, జుట్టును దారుణంగా పెరికివేయడం, ఆర్భాటమైన వస్త్రాలు ధరించడంఇవన్నీ కూడా మూర్ఖమతులు పొట్టనింపుకోవడానికి చేసే ఆడంబరమైన, అర్థరహిత చర్యలు మాత్రమే.

జ్ఞాని అయినవాడు జడలు పెంచుకోడు, ప్రత్యేకమైన వస్త్రధారణ హాస్యస్పదమని తలుస్తాడు. ఉదర పోషణార్థం కష్టపడి పని చేస్తాడే కానీ కాషాయ వేషధారణల్లాంటివి చేయడు. ‘మూడవకన్నుఅంటేదివ్యచక్షువుఉండి కూడా దానిని వినియోగించని వాడు మూర్ఖ మానవుడు. సత్యం కళ్ళెదుట నిత్యమాడుతూన్నాఅంధులుగా ఉండ నిశ్చయించుకుంటారు మూఢులు.

కాబట్టి ప్రతి సాధకుడు తాను తన సాధన వలన మాత్రమే భగవంతుని కృపకు పాత్రుడు కావలి కానీ ఇతరత్రా ఎంతమాత్రం కాదు అనే యదార్ధాన్ని తెలుసుకోవాలి

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ