12, మార్చి 2026, గురువారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 12 మార్చి 2026*

``

              *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣6️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*  

         

                    *162 వ రోజు*                    

*విరాట పర్వము ప్రథమాశ్వాసము*


*ప్రధమాశ్వాసం*```


పాండవుల అరణ్యవాసం ముగిసిందని వైశంపాయనుడు చెప్పగా విన్న జనమేజయుడు “మహర్షీ! మా తాతలు పాండవులు వనవాసానంతరం అజ్ఞాత వాసమును అతి రహస్యంగా, చాతుర్యంగా, కౌరవులకు తెలియకుండా ఎలా గడిపారు వివరంగా చెప్తారా?” అని అడిగాడు. 


వైశంపాయనుడు “జనమేజయా ! పాండవులు తమ వనవాస కాలాన్ని పూర్తి చేసారు. ధర్మరాజు తమతో వచ్చిన బ్రాహ్మణులను చూసి.. 

“అయ్యా! ఇన్నాళ్ళు మాతో పాటు మీరూ అడవులలో ఎన్నో కష్టాలు అనుభవించారు. ఇక మేము అజ్ఞాతవాసం గడపవలసి ఉంది. మా అజ్ఞాతవాసం మేము నిర్విఘ్నముగా గడపాలని మమ్మల్ని ఆశీర్వదించండి” అని నమస్కరించాడు. 


ధౌమ్యుడు “ధర్మరాజా! నీవు ధర్మ స్వరూపుడవు నీ వలెనే పూర్వము ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకము పోగొట్టుకొనుటకు నిషాధాచలము మీద, హరి అధితి గర్భములో వామన మూర్తిగానూ, ఔర్యుడు తన తల్లి తొడలోనూ అజ్ఞాతవాసం చేసారు. కాలం కలసి వచ్చిన తరువాత పూర్వ వైభవం పొందారు. నీవు కూడా అలాగే నీ అజ్ఞాత వాసానంతరం పూర్వ వైభవం పొందగలవు” అన్నాడు. 


బ్రాహ్మణులందరూ పాండవులను దీవించి తమతమ ప్రదేశాలకు వెళ్ళారు.```


*పాoడవులు ద్రౌపది వారివారి పనులను నిర్ణయించు కొనుట*```


ధర్మరాజు తమ్ములను చూసి “మనం అయిదుగురం,ద్రౌపది అజ్ఞాతవాసం గడిపే ఉపాయం చెప్పండి” అన్నాడు. 


అర్జునుడు “అన్నయ్యా! మనకు యమ ధర్మరాజు ఇచ్చిన వరం ఉన్నది కదా! మనం ఎక్కడకు వెళ్ళినా ఎవరూ గుర్తుపట్టలేరు. కుఱుదేశం చుట్టూ పాంచాల, చేధి, మత్స్య, సాళ్వ, విదేహ, బాహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశములు సుభిక్షంగా మనకు నివాస యోగ్యంగా ఉన్నాయి. ఈ దేశాలలో మనకు అనుకూలంగా ఉన్న దేశంలో మనం అజ్ఞాతవాసం గడుపుదాం” అన్నాడు. 


ధర్మరాజు “నాకు తెలిసి విరాటరాజు సద్ధర్మవర్తి,మంచివాడు, బలవంతుడు అతని పాలనలో మనం అజ్ఞాత వాసం గడపటం ఉచితమని నాకు అనిపిస్తుంది. విరాట రాజు కొలువులో ఎవరెవరు ఏమి పనులు చేయగలరో నాకు వివరంగా చెప్పండి” అన్నాడు. 


అర్జునుడు “అన్నయ్యా ! నీవు మహనీయ మూర్తివి. సుకుమారుడవు, ఎంతో ప్రాభవం అనుభవించిన వాడివి. అటువంటి వాడవు ఎలా ఇతరులను సేవించ గలవు?” అన్నాడు. 


అర్జునా “నాకు శ్రౌతము, స్మార్తము, శకునము, జ్యోతిషము మొదలగునవి తెలియును. ఈ విద్యలు ప్రదర్శిస్తూ నేను కాలం గడపగలను. నేను జ్యూద ప్రియుడనని నీకు తెలుసు కదా. విరాటరాజును జ్యూదముతో అలరిస్తాను. ఆయన నా గురించి అడిగితే నేను పూర్వం ధర్మరాజు వద్ద స్నేహంగా ఉండేవాడినని చెప్తాను” అన్నాడు. ```


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

13మార్చి2026🪷* *దృగ్గణిత పంచాంగం*

   *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌹 _*శుక్రవారం*_ 🌹

 *🪷13మార్చి2026🪷*  

  *దృగ్గణిత పంచాంగం*  

                    

           *స్వస్తి శ్రీ విశ్వావసు* 

           *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : నవమి* ‌ఉ 06.28 వరకు ఉపరి *దశమి* 

*వారం    : శుక్రవారం* (భృగువాసరే)

*నక్షత్రం  : పూర్వాషాఢ* రా 03.03 వరకు ఉపరి *ఉత్తరాషాఢ*

*యోగం : వ్యతీపాత* ఉ 10.32 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం  : గరజి* ఉ 06.28 *వణజి* రా 07.23 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:* 

 *ఉ 06.30 - 08.30 సా 05.00 - 06.00*               

అమృత కాలం  : *రా 09.47 - 11.32*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*

*వర్జ్యం    : ఉ 11.15 - 01.00*

*దుర్ముహూర్తం  : ఉ 08.41 - 09.29 మ 12.41 - 01.29*

*రాహు కాలం  : ఉ 10.47 - 12.17*

గుళికకాళం      : *ఉ 07.47 - 09.17*

యమగండం   : *మ 03.17 - 04.47*

సూర్యరాశి : *కుంభం*        

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.26* 

సూర్యాస్తమయం :*సా 06.26*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.17 - 08.41*

సంగవ కాలం     :*08.41 - 11.05*

మధ్యాహ్న కాలం    :*11.05 - 01.29*

అపరాహ్న కాలం  :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి :ఫాల్గుణ బహుళ దశమి*

సాయంకాలం     :*సా 03.53- 06.17*

ప్రదోష కాలం     :*సా 06.17 - 08.41*

రాత్రి కాలం        :*రా 08.41 - 11.53*

నిశీధి కాలం       :*రా 11.53 - 12.41*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.40 - 05.28*

౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾౾

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*🪷శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం🪷*


     *పార్వతీ పరమా దేవీ* 

    *బ్రహ్మవిద్యాప్రదాయినీ*


             *🪷ఓం శ్రీ🪷*

 *🌷మహాలక్ష్మీ దేవ్యై నమః🌷*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం* *23వ భాగం*

 

🌹🌹🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 12 మార్చి 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*               

                *23వ భాగం* 


*నారాయణుని కపిల మహర్షి అవతారం*```


స్వాయంభువ మనువు రెండవ పుత్రిక దేవహూతి వివాహం కర్దమ మహర్షితో జరిగింది. దేవహూతి కర్దమ దంపతులు  కర్దమ ఆశ్రమంలో సంసార జీవితం సుఖసంతోషాలతో గడుపుతున్నారు. దేవహూతి చేసే పతి సేవలకు ప్రసన్నుడై కర్దముడు ఆమెతో  “దేవహూతీ! వివాహం జరిగిన రోజు నుండి భక్తి శ్రద్థలతో నాకు సేవలు చేసి నన్ను సంతోషపరిచావు. నీ పతిభక్తికి మెచ్చి సమస్త జీవుల భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుసుకోగల దివ్యదృష్టి నీకు అనుగ్రహిస్తున్నాను. మనస్సులో వేరే కోరిక ఉంటే అడుగుము. తీరుస్తాను" అన్నాడు.


భర్త పాదాలకు నమస్కరించి దేవహూతి “స్వామీ! మీవంటి బ్రహ్మ మానస పుత్రుని భర్తగా పొందటం నా అదృష్టం. మీ  సేవాభాగ్యాన్ని పొందటం మించిన కోరికలు నా మనస్సులో లేవు" అని పలికింది.  కానీ ఆమె మనస్సులో సంతానం పొంది సంతానవతి కావాలి అనే కోరిక ఉంది. కానీ సంతానం కలిగిన వెంటనే సన్యాసాశ్రమం తీసుకుంటాను అని కర్దమ మహర్షి వివాహానికి పెట్టిన నియమం గుర్తుకు వచ్చి తన కోరికను మనస్సులో దాచుకుంది.


కర్దమ మహర్షి దేవహూతి మనస్సులో గల కోరికను గ్రహించాడు. ఆయనకు కూడా తొందరగా బ్రహ్మదేవుని ఆదేశం పాటించి సంతానం పొంది సన్యాసాశ్రమం తీసుకోవాలి అని ఉంది. అందుకని తనే ఆమె మనస్సులోని కోరిక తీర్చాలి అని నిశ్చయించుకున్నాడు.


దేవహూతిని బిందు సరోవరానికి తీసుకెళ్లి  "దేవహూతీ!  ఈ బిందు సరోవరం శ్రీమహావిష్ణువు కరుణారస బిందువులతో ఏర్పడింది. ఇందులో స్నానం చేసినవారికి శుభ ఫలితాలు లభిస్తాయి. నీవు ఈ సరోవరంలో స్నానం చేసి శుచివై రమ్ము" అని ప్రేమగా చెప్పాడు.  


భర్త మాట పాటించి దేవహూతి బిందు సరోవరంలో స్నానం చేసి వచ్చింది.


కర్థమ మహర్షి తన తపశక్తితో దివ్య విమానం సృష్టించాడు. కర్దముడు దేవహూతి దివ్య సుందరాకార స్త్రీ పురుషులుగా మారి విమానం ఎక్కి విహారానికి బయలుదేరి వెళ్లారు. నూరు సంవత్సరాలు లోకాలన్ని విహరిస్తూ  దాంపత్య సుఖాలు ఆనుభవించారు. ఆశ్రమానికి వచ్చేముందు  తొమ్మిది దివ్య రూపాలు ధరించి దేవహూతిని కలిసి గర్భాధానం చేసాడు.


ఫలితంగా ఆశ్రమం తిరిగి వచ్చిన దేవహూతికి క్రమంగా తొమ్మిది మంది ఆడపిల్లలు జన్మించారు.  వారికి వరుసగా కళ, అనసూయ, శ్రద్ధ, హవిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అని నామకరణం చేసారు. దేవహుతికి పిల్లలు పుట్టిన కొంత కాలానికి కర్దమ మహర్షి దేవహూతికి తను వివాహానికి పెట్టిన నిబంధన గుర్తు చేస్తూ "నీవు అనుమతి ఇస్తే నేను సన్యాసాశ్రమం తీసుకుంటాను"  అన్నాడు.


దేవహూతి భర్తకు నమస్కరించి "స్వామీ! మీ నియమం నాకు గుర్తుంది. మీ అనుగ్రహం చేత జన్మించిన ఆడపిల్లలు రేపు వివాహాలు చేసుకుని అత్తారింటికి వెళ్లి పోతారు. మీరు సన్యాసాశ్రమం తీసుకుని వెళ్లి పోతే నేను ఒంటరిదానను అవుతాను. 


పున్నామ నరకం తప్పించడానికి పుత్రుడు కావాలి అంటారు. మీరు నన్ను వరం కోరుకోమని అడిగినప్పుడు కోరలేదు. ఇప్పుడు కోరుకుంటున్నాను. నాకు పుత్ర సంతానం అనుగ్రహించండి.  శ్రీమన్నారాయణుడు మనకు పుత్రుడిగా జన్మిస్తానని మీకు వరము ఇచ్చాడు అని చెప్పారు.

కనుక నారాయణుడు నా గర్భాన జన్మించేలా అనుగ్రహించండి. పుత్రుడు కలిగాక, తండ్రిగా ఆడపిల్లల వివాహాలు జరిపించండి. పిదప మీ అభీష్టం మేరకు సన్యాసం స్వీకరించండి" అని కోరింది. 


భార్య కోరికలో ధర్మముందని గ్రహించి కర్దమ మహర్షి అంగీకరించాడు.


"దేవీ! నీ కోరిక తప్పక తీరుస్తాను. త్వరలో శ్రీమన్నారాయణుడు నీ గర్భం నుంచి కపిలుడిగా జన్మిస్తాడు. సాంఖ్య శాస్త్రాచార్యుడిగా లోక ప్రసిద్ది చెందుతాడు. శ్రీహరి నాకిచ్చిన వరం నెరవేరడానికి నీవు ధృడచిత్తంతో, భక్తి శ్రద్థలతో అష్టాక్షరి నారాయణ మంత్రంతో శ్రీహరిని సేవించుము. శ్రీహరి నీ గర్భాన జన్మించి నీకు తత్త్వోపదేశం చేసి తరింపచేస్తాడు" అని అష్టాక్షరి మంత్రం ఉపదేశించాడు.


దేవహూతి శుభ ముహూర్తంలో అష్టాక్షరి మహామంత్ర దీక్ష తీసుకుని భక్తి శ్రద్థలతో నారాయణుని పూజించ సాగింది. 


ఆమె దీక్షకు ప్రసన్నుడైన నారాయణుడు ఒక రోజు రాత్రి కలలో కనిపించి "తల్లీ! నీ దీక్షకు ప్రసన్నుడయ్యాను. త్వరలో నీకు కుమారుడిగా జన్మిస్తాను"  అని పలికి అదృశ్యమయ్యాడు. దేవహూతి భక్తితో నమస్కరించింది. కొంతకాలానికి దేవహూతి గర్భవతి అయ్యింది. కర్దమ మహర్షి, దేవహూతిలు నారాయణ నామ స్మరణ చేస్తూ గడప సాగారు.


*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం

 


12-03-2026గురువారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

12-03-2026గురువారం రాశి ఫలితాలు


మేషం


బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. చేపట్టిన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాల వలన శారీరక శ్రమపెరుగుతుంది. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది.

---------------------------------------


వృషభం


ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగులకు నూతన బాధ్యతల వలన శిరోభాధలు అధికమౌతాయి. సంతాన విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.

---------------------------------------


మిధునం


వ్యాపారాలు విస్తరించి నూతన లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రయాణాలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. జీవిత భాగస్వామితో ఆలయాలు దర్శిస్తారు. ఆకస్మిక ధనలబ్ధి పొందుతారు. ఉద్యోగస్తులు అదనపు పనిఒత్తిడి నుండి బయటపడతారు.

---------------------------------------


కర్కాటకం


ఒక వ్యవహారంలో బంధువులతో విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరిగి నూతన ఋణాలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం మందకొడిగా సాగుతుంది. దూరప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. 

---------------------------------------


సింహం


సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


కన్య


చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలుగుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

---------------------------------------


తుల


దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. వ్యాపారపరంగా నూతన లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కలలు సాకారమౌతాయి.

---------------------------------------


వృశ్చికం


బంధు మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది ధన వ్యవహారాలు కలిసివస్తాయి.

---------------------------------------


ధనస్సు


చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ పెద్దల అనారోగ్య సమస్యలు మానసికంగా భాదిస్తాయి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలను ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు కలసిరావు.

---------------------------------------


మకరం


ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఋణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది.

---------------------------------------


కుంభం


విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------


మీనం


సోదరుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

---------------------------------------

చాటుపద్యం

 〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

(ఒక చాటుపద్యం: సంగనభట్ల నరసయ్య గారి చాటుపద్య కవిత్వం.. పుస్తకము నుండి సేకరణ)


*రాజును రాజు గాడతడు రాహు ముఖంబున జిక్కె వాహినీ* 

*రాజును రాజు గాడతడు రామ శరాహతి దూలె, దేవతా*

*రాజును రాజు గాడతడు రావణ సూతికి నోడె, నాజిలో* 

*రాజన రాజు, మల్కియిభ రాముడె రాజు ధరాతలంబునన్!*


ఈ పద్యంలో “రాజు” అనే పదాన్ని వివిధ సందర్భాలలో ఉపయోగిస్తూ, చివరికి భూలోకంలో నిజమైన రాజు ఎవరో చెప్పే విధంగా కవి అద్భుతమైన భావాన్ని వ్యక్తం చేశారు.


*ఈ పద్యంలో ప్రస్తావించిన రాజులు:*


*మొదటి రాజు చంద్రుడు:–* చంద్రుని రాజు అని పిలుస్తారు. గ్రహణ సమయంలో సూర్య చంద్రులను మింగే శక్తి ఉన్నవాడిగా రాహువును భావిస్తారు. రాహువు చేత మింగబడినవాడు కావడం వల్ల చంద్రుడు నిజమైన రాజు కాడు.


*రెండవ రాజు సముద్రుడు:–* తన బాణంతో శత్రువులను సంహరించిన వీరుడు.. శ్రీరామ చంద్రుడు. నదులకు అధిపతి అయిన సముద్రుడు, శ్రీరామ చంద్రుని బాణ హతికి లొంగిపోయిన వాడు. కాబట్టి ఇతడు కూడా నిజమైన రాజు కాదు.. కాలేడు. 


*మూడవ రాజు ఇంద్రుడు:-* ఇంద్రుడు కూడా లంకాధిపతి కుమారుడైన ఇంద్రజిత్తు చేతిలో ఓడి పోయినాడు. కావున అతడిని కూడా నిజమైన రాజుగా పేర్కొనలేరు.


ఈ విధంగా దేవలోకం, రాక్షసలోకం, భూలోకంలో.. మొదలైన విభిన్న స్థాయిలలో రాజులున్నారు. కానీ వారెవరు నిజమైన రాజులు కారని తెలుపుతూ, కవి చివరగా చెప్పేది ఏమిటంటే: — ఈ భూమిపై నిజమైన రాజు *“మల్కిభ రాముడు(ఇబ్రహీం కులీ కుతుబ్షా)”* మాత్రమే.


*భావం (వివరణాత్మకంగా):*


కవి ఈ పద్యంలో రాజుల గురించి పోలిక చూపిస్తున్నారు. రాహువు తన శక్తివల్ల రాజు, రాముడు తన పరాక్రమంతో రాజు, మేఘనాథుడు ఇంద్రుని జయించుట వల్ల వల్ల రాజు. కానీ వీరందరూ తమ తమ లోకాలలో రాజులు మాత్రమే. అయితే భూమిపై ప్రజల హృదయాలను గెలుచుకున్న, ధర్మంతో పాలించే, శౌర్య శాలిగా ఉన్న రాజు — మల్కిభరాముడు అని కవి ప్రశంసిస్తున్నారు.


*సారాంశం:*


ఈ పద్యం ద్వారా కవి చెప్పదలచింది ఏమిటంటే —లోకాలలో అనేక మంది రాజులుండవచ్చు, కానీ భూలోకంలో గొప్ప రాజు, మహారాజు, రాజాధిరాజు మల్కిభరాముడే అని స్తుతిస్తున్నారు.


ఇది ఒక ప్రశంసా పద్యం (స్తుతి కవిత్వం). ఇందులో అతిశయోక్తి అలంకారం కూడా కనిపిస్తుంది.

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

అల్లసాని పెద్దన :

  అల్లసాని పెద్దన :


సాహితి సమరాంగణ చక్రవర్తి కృష్ణరాయని ఆస్థానకవియు, ఆంతరంగికుడునై మసలినవాడు. ఈతడు అష్టదిగ్గజములలో నొకడని ప్రతీతి. కృష్ణరాయని కంకితమిచ్చిన మనుచరిత్రము ఒక రసవత్తర ప్రబంధము. భువనవిజయము నందీతనికి జరిగిన మర్యాదలు, మన్ననలు ఏ కవియును నోచుకొనలేదు.


“భువనవిజయ” మందొకనాడు కృష్ణరాయడు బంగారు పళ్లెరమున గండపెండెరము ఒకటి తెప్పించి సంస్కృతాంధ్రములందు సమముగా కవిత్వము చెప్పగలవారందు కొమ్మనినాడు. సభ్యులందరు మిన్నకుండిరట. దీనికి కృష్ణరాయ లాశ్చర్యము చెంది


*ముద్దుగ గండపెండెరమున్ గొనుడంచు బహూకరింపగా* 

*నొద్దిక “నాకొసంగు'మని యొక్కరుఁ గోరగలేరు లేరొకో?*


యని సగము పద్యము చెప్పగా పెద్దనలేచి,


*పెద్దన బోలు పండితులు పృథ్విని లేరని నీవెఱుంగవే?* 

*పెద్దన కీదలంచినను, బేరిమి నాకిడు కృష్ణరాణ్ణృపా!*


యని మిగిలిన సగమును జవాబుగా పూరించినాడు. కృష్ణరాయడు పెద్దనకీయ తలంపు మనసు నందుంచుకొనినాడో యేమో ప్రాసస్థానమున పెద్దన వచ్చునట్లే ముద్దుగాయని ద్విత్వ "ద" కారముతో ప్రారంభించినాడు. 

〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️〽️

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*బుధవారం 11 మార్చి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                 1️⃣6️⃣1️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *161 వ రోజు*                    

*వన పర్వము సప్తమాశ్వాసము*


*యక్షుడు ధర్మరాజును పరీక్షించుట*```


ధర్మరాజు చెప్పిన సమాధానాలు విని యక్షుడు తృప్తి చెందాడు. 

“ధర్మరాజా! నా ప్రశ్నలకు సమయోచితంగా బదులు చెప్పి నన్ను తృప్తి పరిచావు. నీ తమ్ములలో ఒకరి ప్రాణం తిరిగి ఇచ్చెదను కోరుకొనుము” అన్నాడు. 


ధర్మరాజు “మహాత్మా! నా తమ్ముడు నకులునకు ప్రాణములు తిరిగి ఇమ్ము” అన్నాడు. 


యక్షుడు “అదేమిటి భీమార్జునులను వదిలి నకులుని కోరుకున్నావు” అని అడిగాడు. 


ధర్మరాజు “అయ్యా! నా తల్లి కుంతీదేవి కుమారులలో నేను జీవించి ఉన్నాను. మా తండ్రి రెండవ భార్య మాద్రి పుత్రులలో నకులుడు పెద్దవాడు. అందుకని అతనిని కోరుట ధర్మం కదా?” అన్నాడు. 


యక్షుడు “ధర్మరాజా నీ ధర్మ నిరతికి మెచ్చాను. నీ తమ్ములు అందరూ పునరుజ్జీవితులు కాగలరు” అని వరం ఇచ్చాడు. 


వెంటనే భీమార్జున నకుల సహదేవులు నిద్ర నుండి లేచినట్లు లేచారు. 


ధర్మరాజు “మహాత్మా! నీవు మామూలు యక్షుడవు కావు. నీ వెవరో ఎరిగింపుము” అని ప్రార్థించాడు.```


*యక్షుని నిజ రూపం*```


యక్షుడు “ధర్మరాజా! నేను యమధర్మరాజును. నిన్ను చూడవలెనని కోరిక కలిగి వచ్చాను. సత్యము, సౌచము, దానము, తపము, శమము, కీర్తి, వివేకము నా యొక్క మూర్తులు. పైగుణములను ఆశ్రయించిన వారు దుర్గతిని పొందరు. నీవు కోరిన వరాలు ఇస్తాను కోరుకో!” అన్నాడు యమధర్మరాజు. 


ధర్మరాజు “యమధర్మరాజా! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుని అరణిని ఒక లేడి అపహరించింది. దానిని తిరిగి ప్రసాదింపుము” అని అడిగాడు. 


యమధర్మరాజు “ధర్మరాజా! నేనే ఆ లేడిని, నీ మనస్సు ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి ఆ అరణిని నేనే తీసుకు వచ్చాను, ఇదిగో అరణి తీసుకో” అని అరణిని తిరిగి ఇచ్చాడు. 


యమధర్మరాజు “పాండవులారా! మీకు పన్నెండేళ్ళు అరణ్యవాసం పూర్తి అయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాత వాసం మిగిలి ఉంది. అజ్ఞాత వాస సమయంలో మీకు ఏరూపాలు కోరితే ఆరూపాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరూ గుర్తింపకుండా వరం ఇస్తాను. మరొక వరం కోరుకో!” అన్నాడు. 


ధర్మరాజు “దేవతలలో ఆది దేవుడవైన నీ దర్శనం కంటే నాకు కావలసినది ఏముంది. నా మనస్సు ఎల్లప్పుడూ ధర్మమార్గాన చరించేలా, క్రోధము, మోహం వంటి దుర్గుణాలు నా దరి చేరకుండా వరం ప్రసాదించు!” అన్నాడు. 


యమధర్మరాజు అలాగే వరం ఇచ్చి అంతర్ధానం అయ్యాడు. 


ధర్మరాజు అరణిని బ్రాహ్మణునికి ఇచ్చి అతని ఆశీర్వాదం పొందారు. 

ఆ ప్రకారం పాండవులు తమ అరణ్యవాసం పూర్తి చేసారు.```


*వన పర్వము సమాప్తం*

*వన పర్వము సప్తమాశ్వాసము సమాప్తం*


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

12మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

     *🌷గురువారం🌷*

 *🌹12మార్చి2026🌹*    

  *దృగ్గణిత పంచాంగం*  

                    

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం - కృష్ణ పక్షం*


*తిథి  : నవమి* ‌పూర్తిగా రోజంతా రాత్రితో సహా 

*వారం    : గురువారం* ( బృహస్పతివాసరే )

*నక్షత్రం  : మూల* రా 12.43 వరకు ఉపరి *పూర్వాషాఢ*

*యోగం : సిద్ధి* ఉ 09.59 వరకు ఉపరి *వ్యతీపాత*

*కరణం  : తైతుల* సా 05.27 *గరజి పూర్తి రాత్రి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 11.00 - 12.00 సా 04.00 - 06.00*               

అమృత కాలం : *సా 05.36 - 07.23*

అభిజిత్ కాలం  : *ప 11.53 - 12.41*

*వర్జ్యం    : ఉ 06.54 - 08.41 & రా 10.56 - 12.43*

*దుర్ముహూర్తం  : ఉ 10.17 - 11.05 మ 03.05 - 03.53*

*రాహు కాలం   :మ01.47- 03.17*

గుళికకాళం      : *ఉ 09.17 - 10.47*

యమగండం    : *ఉ 06.18 - 07.48*

సూర్యరాశి : *కుంభం*         

చంద్రరాశి : *ధనస్సు*

సూర్యోదయం :*ఉ 06.27*  

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల   : దక్షిణ దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 06.18- 08.42*

సంగవ కాలం      :*08.42 - 11.06*

మధ్యాహ్న కాలం   :*11.05 - 01.29*

అపరాహ్న కాలం   :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి        : ఫాల్గుణ బహుళ నవమి*

సాయంకాలం       :*సా03.53- 06.17*

ప్రదోష కాలం        :*సా 06.17- 08.41*

రాత్రి కాలం          :*రా 08.41- 11.53*

నిశీధి కాలం         :*రా 11.53 - 12.41*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.41 - 05.29*

<><><><><><><><><><><><><><><>

         *🌷ప్రతినిత్యం*🌷

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


*!!.ఓం శ్రీ గురు దత్తాయ నమః.!!*


*క్షరాక్షరస్వరూపాయ* 

*పరాత్పరతరాయ చ*

*దత్తముక్తిపరస్తోత్ర*

*దత్తాత్రేయ నమోఽస్తుతే*

           

*ఓం శ్రీ దత్తాత్రేయ నమః*


🌷🪷🌹🛕🌹🌷🪷🌷

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🌹🌹🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌹🌹🍃🌷

🌹🌷🌹🌷🌹🌷🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*బుధవారం 11 మార్చి 2026*


         *శ్రీ మహావిష్ణు పురాణం*                   

                 *22వ భాగం*


*స్వాయంభువ మనువు తన పుత్రికలు ఆకూతి దేవహూతి ప్రసూతిలను రుచి మహర్షి, కర్దమ మహర్షి, దక్ష ప్రజాపతిలకు ఇచ్చి వివాహం చేయుట*```


చతుర్ముఖ బ్రహ్మ ఆదేశానుసారం స్వాయంభువ మనువు భూమండలానికి రాజై పరిపాలన చేయసాగాడు. కాలక్రమంలో స్వాయంభువ మనువుకి, శతరూపకి ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు జన్మించారు.


శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేసిన కర్దముని కరుణించి విష్ణువు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.  


కర్దముడు అనేక విధాల స్తుతించి నమస్కరించి “శ్రీహరీ! నా తండ్రి బ్రహ్మదేవుడు నన్ను జగత్ సృష్టికి సహకరించమని ఆదేశించాడు. ఇందుకోసం నాకు తగిన ఉత్తమురాలైన భార్యను, సత్సంతానాన్ని అనుగ్రహించండి”అని వరం కోరాడు.


శ్రీమహావిష్ణువు ప్రసన్నుడై “కర్దమా! నీ కోరిక తీరుతుంది. మనువంశ మూలపురుషుడు స్వాయంభువ మనువు నిన్ను అన్వేషిస్తూ వచ్చి తన కుమార్తె దేవహూతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాడు. నీకు, ఆమెకు తొమ్మిది మంది పుత్రికలు జన్మించి బ్రహ్మ మానస పుత్రులైన తొమ్మిది మంది ప్రజాపతులకు భార్యలు అవుతారు. వీరి వలన ప్రజా సృష్టి జరుగుతుంది. తరువాత నేనే మీకు పుత్రుడై జన్మించి తరింప చేస్తాను” అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు.


కొంతకాలం తరువాత శ్రీమహావిష్ణువు స్వాయంభువ మనువుకి కలలో కనపడి “బ్రహ్మావర్త అధిపతీ! స్వాయంభువ మను చక్రవర్తీ! నీ పుత్రిక, నా భక్తురాలు దేవహూతికి కర్దమ ముని తగిన వరుడు. కర్దముడు బిందు సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పరచుకుని నివసిస్తున్నాడు. నీవే భార్యాపుత్రికలతో వెళ్లి నీ కుమార్తెను కన్యాదానం చేసి వివాహం చేయుము. నేను త్వరలో వారికి కుమారుడనై జన్మించి మీ రెండు వంశాలను తరింప చేస్తాను" అని ఆశీర్వదించాడు.


తెల్లవారిన వెంటనే స్వాయంభువ మనువు భార్యా పుత్రికలతో కలిసి కర్దమ ముని ఆశ్రమానికి వెళ్లాడు. కర్దముడు స్వాగతం పలికి అతిథి సత్కరాలు చేశాడు. స్వాయంభువ మనువు కర్దమ మునికి నమస్కరించి "మునీంద్రా! శ్రీమన్నారాయణుడు నా కుమార్తె దేవహూతిని మీకు కన్యాదానం చేసి వివాహం చేయమని ఆదేశించాడు.


ఈమె నా కుమార్తె దేవహూతి. సౌందర్యంతో పాటు సకల సద్గుణ సంపన్నురాలు. భూదేవి అంత వినయ విధేయతులు కలిగి ఉన్నది. మహావిష్ణువుకి పరమ భక్తురాలు. ఈమెను అర్ధాంగిగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి” అని కోరాడు.


కర్దముడు అంగీకరిస్తూ “మను చక్రవర్తీ! విష్ణువు ఆదేశం నాకు శిరోధార్యం. తప్పక చేసుకుంటాను. కాని నాకు ఒక నియమం ఉంది. నేను తగిన కన్యను వివాహం చేసుకుని సంతానం పొంది సృష్టికి సహకరిస్తాను” అని నా తండ్రి బ్రహ్మదేవునికి మాట ఇచ్చాను. కనుక మీ అమ్మాయి దేహహూతిని వివాహం చేసుకుని సంతానం పొందుతాను. సంతానవృద్ధి జరుగగానే సన్యాసాశ్రమం స్వీకరిస్తాను. దీనికి మీ కుమార్తె అంగీకరిస్తే తప్పక వివాహం చేసుకుంటాను” అన్నాడు.


స్వాయంభువ మనువు తన భార్య, పుత్రిక దేవహుతితో మాట్లాడి ఆ నియమానికి అంగీకరించాడు. 


దేవహూతి వివాహం కర్దమునితో జరిపించడానికి నిశ్చయించి స్వాయంభువ మనువు మిగిలిన ఇద్దరు పుత్రికల వివాహం కోసం బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి “తండ్రీ! నా రెండవ కుమార్తె దేవహూతి వివాహం, శ్రీమన్నారాయణుని ఆదేశం ప్రకారం కర్దమ మునితో నిశ్చయమైంది. పెద్ద కుమార్తె ఆకూతికి, చిన్న కుమార్తె ప్రసూతికి తగిన వరులను మీరు చెబితే ముగ్గురి వివాహం ఒకేసారి చేస్తాను” అని కోరాడు.


బ్రహ్మదేవుడు ఆలోచించి మందహాసంతో “మను చక్రవర్తీ! నీ పెద్ద కుమార్తె ఆకూతిని రుచి మహర్షికి, చిన్న కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ముగ్గురి కుమార్తెల వివాహం జరిపించు” అని చెప్పాడు. 


స్వాయంభువ మనువు బ్రహ్మ చెప్పినట్టు ఆకూతిని రుచి మహర్షికి, దేవహూతిని కర్దమ మహర్షికి, మూడవ కుమార్తె ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి ఒకేసారి వివాహం చేశాడు.


రుచి మహర్షికి, ఆకూతికి విష్ణువు అంశగా యజ్ఞుడు అనే దివ్య పురుషుడు జన్మించాడు. స్వాయంభువ మన్వంతరంలో యజ్ఞుడు మనువుని అనేక మంది రాక్షసుల నుంచి కాపాడి ప్రసిద్ధి చెందాడు.


కనిష్ఠ పుత్రిక ప్రసూతికి దక్ష ప్రజాపతికి అనేక మంది పుత్రికలు జన్మించారు. వారికి సంతానంగా దేవ రాక్షస పశు పక్ష్యాది జాతులు జన్మించి వృద్ధి చెందాయి.


              *(సశేషం)*

*తరువాతి కథ రేపటి భాగంలో చదువుదాం.*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


 *ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

దర్పణ దృశ్యమాన

 🙏*విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం||| పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా!!!*

*యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మాన మేవాద్వయం|||*

*తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!!!*🙏


శుభ గురువారం 🕉️Happy Thursday 

చిలక ఆ చిలకే

 సతీదేవి శివుని పెళ్లి చేసుకుని కైలాసానికి వచ్చినప్పుడు,ఆమెతో పెంపుడు చిలుక కూడా వచ్చింది.దానికి సతీదేవి అంటే ప్రేమ,ప్రాణం.సతీదేవి కనపడకపోతే తిండి తినేది కాదు,నీళ్ళు తాగేది కాదు.సతీదేవి కి శివుడంటే ప్రాణమని, ముద్దు ముద్దు మాటలతో శివ శివ అనేది.ఎన్ని సార్లు శివనామ స్మరణ చేసిందో కానీ దానికి కైలాసప్రాప్తి కలిగింది.సతీదేవి శివుల సమక్షం లో ఆనందం పొందగలిగింది.,దాని చేష్టలతో ఆనందింప చేయగలిగింది.కైలాసం లో ప్రథమ గణాల భక్తి, నంది భక్తి వలన దానికి ఇంకా శివ చింతన ఎక్కువైంది.దక్ష యజ్ఞం కు,సతీ దేవి ప్రథమ గణాలతో వెళ్ళినప్పుడు,,ఈ చిలక ఎక్కడో మూలన శివ ధ్యానం లో ఉంది.,,,,,,,వెళ్ళలేదు.తల్లికి అవమానం జరిగి,దహనం అవుతుంటే,, అంత ధ్యానం లో ఉన్న చిలక్కు,ఏదో భయం,కీడు జరిగిందన్న ఆలోచన,నిలబడనీయక,,, యజ్ఞ వాటికకు ఎగిరివెళ్తే,,,సతీదేవి దహనం చూసి,,,దుఃఖం బాధ తో ఆ మంటలోకి దూకేసింది.ఆ తరువాత అమ్మవారు కంచి కామాక్షి అయినా మధుర మీనాక్షి అయినా అమ్మవార్ల దగ్గర చిలక ఆ చిలకే.

శ్రీరామ స్తుతి🙏

 ☘️ శ్రీరామ స్తుతి🙏


 సీ.భరతాగ్రజా !  రామ ! భానువంశ ప్రదీప !

                  నిరతమ్ము నినుగొల్తు నిగమవేద్య !

     తారకమంత్రమ్ము తలచిన మాత్రాన

                 పాపముల్ నశియించి పరము గల్గు  

     కౌసల్యనందనా ! కమనీయ గుణధామ !

                 కైవల్యమిచ్చినన్ గావు మయ్య

     భూమిజపతిరామ ! భువనైక మోహనా !

                 కోసలాధిప రామ ! కూర్మి  కొలుతు

తే.నీదునామమ్ము  దలచియు న్నిచ్చ లందు     

     బడసె కైవల్య పదము నా భక్త శబరి      

     భక్తితో నిన్ను  గొల్చిన ముక్తి గల్గు

     దశరథాత్మజ ! రఘురామ ! ధర్మ తేజ !


       జయలక్ష్మి  పిరాట్ల

11, మార్చి 2026, బుధవారం

పంచాంగం

 


శుకపికాలాపరావాలసుప్రభాత

 *"


తే.గీ.

శుకపికాలాపరావాలసుప్రభాత 

స్తోత్రపాఠాల మేల్కొల్పు శుభదమౌను 

నరుణకిరణాలు తూర్పున నలదుకొనగ 

మీకిదె శుభోదయమగు మేలిసఖుడ! 

*~శ్రీశర్మద*


🌸విఘ్నేశ్వర స్తుతి🙏


గణపతి దేవా రావా

మణిమయ భూషణ గణేశ మంగళతనయా

గుణమణి మూషిక రథుడా

గుణధామా నిను కొలిచెద కుడుముల తోడన్

 

కందపద్యం

గరికను తెచ్చియు గణపతి

నిరతము నిన్నే కొలుతురు నీ భక్తు రిలన్ 

వరములు నియ్యగ దేవా

గిరిదిగి రావా బిరబిర గిరిజా తనయా


సాహితీ శ్రీజయలక్ష్మి