10, మార్చి 2026, మంగళవారం

శుభోదయం

  శ్రీరామ (107)


                             శుభోదయం.


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


జీవన్ముక్తులైన మహాత్ముల దృష్టి మనమీద పడినంత మాత్రాన మన పాపాలన్నీ నశిస్తాయి అని శాస్త్రం తెలియజేస్తోంది.

అటువంటి మహాత్ములు మన మధ్యనే నడయాడుతుంటారు.

పైకి చూడటానికి వారుగూడా మనలాగానే ఉంటారు గనుక పరిశీలించి వారిని మనం గుర్తించగలగాలి.

వారి దృష్టి మనమీద పడటం, అంటే అటువంటి మహాత్ములను సేవించి మనం వారి దృష్టిలో ఉండేటట్లు చేసుకోవడం.


శ్లో // యస్యానుభవ పర్యన్తా తత్త్వే బుద్ధిః ప్రవర్తతే /

తద్ దృష్టి గోచరాః సర్వే ముచ్యన్తే సర్వ పాతకైః //


(ఏ మహానుభావుని బుద్ధి అనుభవపర్యంతము తత్త్వమునందు ప్రవర్తించునో, ఆ మహాత్ముని దృష్టికి గోచరులగు జనులు సర్వ పాపములనుండి విముక్తులగుదురు)

( సూతసంహిత - 2 - 20 - 44 )


అనగా భగవంతుని దర్శనం అయే పర్యంతం,అన్య చింతనలు మాని, భగవంతుడినే ఎవరు నిరంతరం ధ్యానిస్తూ ఉంటారో, అటువంటి మహాత్ముల దృష్టి మనమీద పడినంత మాత్రాన మన పాపములన్నియు నశించును.


శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

10-3-'26.

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 48*


*శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితాః పురుషాః।*

*విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్॥*


*భావము :*


*తల్లీ! నీ క్రీగంటి చూపులు ప్రసరించినవారు, జ్ఞానులు, సమదృష్టి కలవారు, స్థితప్రజ్ఞులుగా ఉంటారు. అటువంటివారు, భవనమైనా, అరణ్యమైనా, మిత్రుడైన, శత్రువైనా, మట్టిబెడ్డనైనా, సుందరమైన స్త్రీ ఎర్రని పెదవినైనా సమదృష్టితో వీక్షించ గలుగుతారు.*


🙏🙏🙏 *శ్రీమాత్రే*శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 48*


*శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితాః పురుషాః।*

*విపినం భవన మమిత్రం మిత్రం లోష్టం చ యువతిబింబోష్ఠమ్॥*


*భావము :*


*తల్లీ! నీ క్రీగంటి చూపులు ప్రసరించినవారు, జ్ఞానులు, సమదృష్టి కలవారు, స్థితప్రజ్ఞులుగా ఉంటారు. అటువంటివారు, భవనమైనా, అరణ్యమైనా, మిత్రుడైన, శత్రువైనా, మట్టిబెడ్డనైనా, సుందరమైన స్త్రీ ఎర్రని పెదవినైనా సమదృష్టితో వీక్షించ గలుగుతారు.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏 నమః* 🙏🙏🙏

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।



ప్రతిపదార్థ:


 అన్నాత్ — అన్నము నుండి; భవంతి — జీవించి ఉండుట; భూతాని — ప్రాణులు; పర్జన్యాత్ — వర్షముల వలన; అన్న — ధాన్యము/అన్నము; సంభవః — ఉత్పత్తి; యజ్ఞాత్ — యజ్ఞములు చేయటం నుండి; భవతి — కలుగును; పర్జన్యః — వాన; యజ్ఞ — యజ్ఞము; కర్మ — నిర్దేశింపబడిన కర్తవ్యములు (విహిత కర్మలు); సముద్భవః — జనించును.


 తాత్పర్యము :   


సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.

 


 వివరణ:


ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును. ధాన్యం భుజించబడి రక్తముగా రూపాంతరం చెందుతుంది. రక్తము నుండి, వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతినొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొన-------------------- భగవద్గీత. -------------------

తృతీయోధ్యాయ: కర్మ యోగము.


అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః ।

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మసముద్భవః ।। 14 ।।



ప్రతిపదార్థ:


 అన్నాత్ — అన్నము నుండి; భవంతి — జీవించి ఉండుట; భూతాని — ప్రాణులు; పర్జన్యాత్ — వర్షముల వలన; అన్న — ధాన్యము/అన్నము; సంభవః — ఉత్పత్తి; యజ్ఞాత్ — యజ్ఞములు చేయటం నుండి; భవతి — కలుగును; పర్జన్యః — వాన; యజ్ఞ — యజ్ఞము; కర్మ — నిర్దేశింపబడిన కర్తవ్యములు (విహిత కర్మలు); సముద్భవః — జనించును.


 తాత్పర్యము :   


సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి, మరియు వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి, మరియు నిర్దేశింపబడిన కర్తవ్యముల (విహిత కర్మలు) ఆచరణచే యజ్ఞము జనిస్తుంది.

 


 వివరణ:


ఇక్కడ శ్రీ కృష్ణుడు ప్రకృతి చక్రాన్ని వివరిస్తున్నాడు. వర్షం వలన ధాన్యం ఉత్పన్నమగును. ధాన్యం భుజించబడి రక్తముగా రూపాంతరం చెందుతుంది. రక్తము నుండి, వీర్యము జనించును. వీర్యమే మానవ శరీర సృష్టికి బీజం. మానవులు యజ్ఞములు చేస్తారు, వీటిచే ప్రీతినొందిన దేవతలు వర్షాలు కురిపిస్తారు. అలా ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది.సాగుతూనే ఉంటుంది.

మంగళవారం రాశి ఫలితాలు

  శ్రీ గురుభ్యోనమః 🙏

10-03-2026 మంగళవారం రాశి ఫలితాలు


మేషం


చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.

---------------------------------------


వృషభం


ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ లబ్ది పొందుతారు. 

---------------------------------------


మిధునం


బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------


కర్కాటకం


దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.

---------------------------------------


సింహం


పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.

---------------------------------------


కన్య


చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది.

---------------------------------------


తుల


చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------


వృశ్చికం


దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి.

---------------------------------------


ధనస్సు


ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

---------------------------------------


మకరం


సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. చాలకాలంగా పూర్తి కానీ పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. 

---------------------------------------


కుంభం


నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు.

---------------------------------------


మీనం


కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.

---------------------------------------

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*సోమవారం 9 మార్చి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


  *సంపూర్ణ మహాభారతము*

            

              *159 వ రోజు*                     

*వనపర్వము సప్తమాశ్వాసము*


*ధర్మరాజుని కొలను వద్దకు చేరుట*```


వెళ్ళిన తమ్ములెవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. 


పరిసరాలను పరిశీలించగానే స్పృహతప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. 


అతని హృదయం తల్లడిల్లింది. కొంచం సేపటికి తేరుకుని చుట్టూ కలయ చూసాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించ లేదు. “వారికై వారు అలా కూలి పోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనడానికి వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించ లేదు. ఒక వేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేసారా కుంతీ దేవికి ఏమి చెప్పాలి?” అనుకుంటూ కొలనులో దిగాడు. 


అప్పుడు ఆకాశవాణి “ధర్మరాజా! నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహతప్పి పడి పోయారు. నీవూ నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకూ పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్ళుత్రాగు!” అని పలికింది. 


ధర్మరాజు “అయ్యా! కొంగ రూపం ధరించిన రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడివో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి, చెప్పు” అని అడిగాడు.

```

      *యక్షడు ప్రశ్నించుట*```


ఆ కొంగ ధర్మరాజుతో "వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు” అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. 

“నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు” అన్నాడు. 


ధర్మరాజు “అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను” అన్నాడు.

```

               *యక్షుడు*


సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?

``

               *ధర్మరాజు*


సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.

``

                *యక్షుడు*


శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?

``      

             *ధర్మరాజు*


శ్రుతం వలన శ్రోత్రియుడు ఔతాడు. అనగా వేదము అధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం వలన బుద్ధిమంతుడు ఔతాడు.

                

             *యక్షుడు*


బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధు భావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా ఔతాడు?

``

            *ధర్మరాజు*


వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు ఔతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు ఔతాడు.``


              *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భా🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*సోమవారం 9 మార్చి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣9️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


  *సంపూర్ణ మహాభారతము*

            

              *159 వ రోజు*                     

*వనపర్వము సప్తమాశ్వాసము*


*ధర్మరాజుని కొలను వద్దకు చేరుట*```


వెళ్ళిన తమ్ములెవరూ రాకపోవడం చూసి కలత చెందిన ధర్మరాజు కలత చెంది స్వయంగా కొలను వద్దకు వెళ్ళాడు. 


పరిసరాలను పరిశీలించగానే స్పృహతప్పి పడిపోయిన తమ్ములు కనిపించారు. 


అతని హృదయం తల్లడిల్లింది. కొంచం సేపటికి తేరుకుని చుట్టూ కలయ చూసాడు. అక్కడ ఏమీ ఇతరుల అడుగుజాడలు కనిపించ లేదు. “వారికై వారు అలా కూలి పోవడానికి కారణం తెలియలేదు. ఈ కొలనులో నీరు విషపూరితం అనడానికి వారి శరీరంలో విష ప్రయోగం జరిగిన లక్షణాలు కనిపించ లేదు. ఒక వేళ సుయోధనుడు అతని మిత్రులెవరైనా ఇలా చేసారా కుంతీ దేవికి ఏమి చెప్పాలి?” అనుకుంటూ కొలనులో దిగాడు. 


అప్పుడు ఆకాశవాణి “ధర్మరాజా! నేను ఒక కొంగను. ఈ కొలను నాది. నీ తమ్ములు నా మాట వినక ఈ కొలనులో నీరు త్రాగి ఇలా స్పృహతప్పి పడి పోయారు. నీవూ నా మాట వినక కొలనులో నీరు త్రాగితే వారికి పట్టిన గతే నీకూ పడుతుంది కనుక నా ప్రశ్నలకు జవాబు చెప్పి ఈ కొలనులో నీళ్ళుత్రాగు!” అని పలికింది. 


ధర్మరాజు “అయ్యా! కొంగ రూపం ధరించిన రుద్రుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడివో నాకు తెలియదు. లేని ఎడల అత్యంత పరాక్రమవంతులైన నా తమ్ములు ఇలా పడిపోరు. నీవు ఎవరు? నీ తలపు ఏమిటి, చెప్పు” అని అడిగాడు.

```

      *యక్షడు ప్రశ్నించుట*```


ఆ కొంగ ధర్మరాజుతో "వాస్తవానికి నేను కొంగను కాను యక్షుడను. నీ తమ్ములు నన్ను అవమానించి పడి పోయారు” అంటూ ధర్మరాజు ముందు నిలబడ్డాడు. 

“నా అనుమతి లేకుండా నీరు త్రాగితే ఎవరైనా ఇలా పడిపోతారు. నీవు తెలివి కలవాడవు కనుక నీరు త్రాగలేదు. కనుక నేను వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పు” అన్నాడు. 


ధర్మరాజు “అయ్యా! నీ వంటి వారికి సమాధానం చెప్పటం నా తరమా. అయినను నాకు తెలిసిన విధంగా సమాధానాలు చెప్తాను” అన్నాడు.

```

               *యక్షుడు*


సూర్యుని ఎవరు నడుపుతున్నారు? సూర్యుని ఎవరు కొలుస్తున్నారు? సూర్యుడు అస్తమించడం అంటే ఏమిటి? సూర్యునికి ఆధారభూతం ఏమిటి?

``

               *ధర్మరాజు*


సూర్యుని బ్రహ్మం నడుపుతుంది. దేవతలు సూర్యుని కొలుస్తారు. సూర్యుడు ధర్మంచే అస్తమిస్తాడు. సూర్యునికి సత్యమే ఆధారం.

``

                *యక్షుడు*


శ్రోత్రియుడు ఎలా ఔతాడు? పురుషునికి మహిమలు ఎలా సిద్ధిస్తాయి? పురుషునికి సాయం ఎవరు? పురుషుడు బుద్ధిమంతుడు ఎలా ఔతాడు?

``      

             *ధర్మరాజు*


శ్రుతం వలన శ్రోత్రియుడు ఔతాడు. అనగా వేదము అధ్యయనం వలన. తపస్సు వలన మహిమలు సిద్ధిస్తాయి. పురుషునకు అతని ధైర్యమే అతని సాయం. గొప్పవారికి, జ్ఞానులకు సేవచేయడం వలన బుద్ధిమంతుడు ఔతాడు.

                

             *యక్షుడు*


బ్రాహ్మణుడు దైవత్వం ఎలా పొందుతాడు? అతనికి సాధు భావము ఎలా ఏర్పడుతుంది? అతడు దుష్కృతుడు ఎలా ఔతాడు? బ్రాహ్మణుడు మానవుడు ఎలా ఔతాడు?

``

            *ధర్మరాజు*


వేదపఠనం చేత దైవత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠ వలన సాధు స్వభావం ఏర్పడుతుంది. నిష్ఠను కోల్పోయినప్పుడు దుష్కృతుడు ఔతాడు. శుచిత్వం ఆచరించని బ్రాహ్మణుడు మరణ భయంతో మానవుడు ఔతాడు.``


              *(సశేషం)*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

               🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏గస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

10మార్చి2026🌹* *దృగ్గణిత పంచాంగం*

  *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*          

 🍁 *మంగళవారం*🍁

*🌹10మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*  

                 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -"శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం -"కృష్ణ పక్షం*


*తిథి  : సప్తమి* ‌రా 01.54 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : అనూరాధ* రా 07.06 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : హర్షణ* ఉ 08.21 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : భద్ర* మ 12.40 *బవ* రా 01.54 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30-11.00 & 12.00-01.00 సా 04.30-06.00*

అమృత కాలం  : *ఉ 07.26 - 09.13*

అభిజిత్ కాలం  : *ప 11.54 - 12.42*

*వర్జ్యం    : రా 01.22 - 03.09*

*దుర్ముహూర్తం  : ఉ 08.43 - 09.30 రా 11.05 - 11.53*

*రాహు కాలం   :మ 03.17-04.47*

గుళికకాళం      : *మ 12.18 - 01.47*

యమగండం    : *ఉ 09.18 - 10.48*

సూర్యరాశి : *కుంభం*                    

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.29*

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల  :ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ06.19 - 08.43*

సంగవ కాలం     :*08.43 - 11.06*

మధ్యాహ్న కాలం :*11.06 - 01.29*

అపరాహ్న కాలం   :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ బహుళ సప్తమి*

సాయంకాలం     :*సా03.53- 06.16*

ప్రదోష కాలం      :*సా 06.16- 08.41*

రాత్రి కాలం        :*రా 08.41- 11.53*

నిశీధి కాలం       :*రా 11.53- 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.42 - 05.30*

#####################

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *శ్రీ ఆంజనేయ స్తోత్రం*

 🌷🔥🌷🔥🌷🔥🌷

*శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం* 

*సర్వభయాపహమ్*

*సర్వకామప్రదం నృణాం* 

*హనూమత్స్తోత్రముత్తమo!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*          

 🍁 *మంగళవారం*🍁

*🌹10మార్చి2026🌹*  

 *దృగ్గణిత పంచాంగం*  

                 

          *స్వస్తి శ్రీ విశ్వావసు* 

          *నామ సంవత్సరం* 

*ఉత్తరాయణం -"శిశిర ఋతౌః*

*ఫాల్గుణమాసం -"కృష్ణ పక్షం*


*తిథి  : సప్తమి* ‌రా 01.54 వరకు ఉపరి *అష్టమి*

*వారం    : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : అనూరాధ* రా 07.06 వరకు ఉపరి *జ్యేష్ఠ*

*యోగం : హర్షణ* ఉ 08.21 వరకు ఉపరి *వజ్ర*

*కరణం  : భద్ర* మ 12.40 *బవ* రా 01.54 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 09.30-11.00 & 12.00-01.00 సా 04.30-06.00*

అమృత కాలం  : *ఉ 07.26 - 09.13*

అభిజిత్ కాలం  : *ప 11.54 - 12.42*

*వర్జ్యం    : రా 01.22 - 03.09*

*దుర్ముహూర్తం  : ఉ 08.43 - 09.30 రా 11.05 - 11.53*

*రాహు కాలం   :మ 03.17-04.47*

గుళికకాళం      : *మ 12.18 - 01.47*

యమగండం    : *ఉ 09.18 - 10.48*

సూర్యరాశి : *కుంభం*                    

చంద్రరాశి : *వృశ్చికం*

సూర్యోదయం :*ఉ 06.29*

సూర్యాస్తమయం :*సా 06.25*

*ప్రయాణశూల  :ఉత్తర దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం       :*ఉ06.19 - 08.43*

సంగవ కాలం     :*08.43 - 11.06*

మధ్యాహ్న కాలం :*11.06 - 01.29*

అపరాహ్న కాలం   :*మ 01.29- 03.53*

*ఆబ్ధికం తిధి  :ఫాల్గుణ బహుళ సప్తమి*

సాయంకాలం     :*సా03.53- 06.16*

ప్రదోష కాలం      :*సా 06.16- 08.41*

రాత్రి కాలం        :*రా 08.41- 11.53*

నిశీధి కాలం       :*రా 11.53- 12.42*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.42 - 05.30*

#####################

        *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


   *శ్రీ ఆంజనేయ స్తోత్రం*

 🌷🔥🌷🔥🌷🔥🌷

*శృణుదేవి ప్రవక్ష్యామి స్తోత్రం* 

*సర్వభయాపహమ్*

*సర్వకామప్రదం నృణాం* 

*హనూమత్స్తోత్రముత్తమo!!*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹 నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

*శ్రీ మహావిష్ణు పురాణం

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*సోమవారం 9 మార్చి 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*                

                *20వ భాగం*


            *కాల గణనం*```


శివుడు “భూలోకంలో నీకు విగ్రహాలు, ఆలయాలు, పూజలు ఉండవు” అని చెప్పి వెళ్లిపోయిన తరువాత బ్రహ్మ నిశ్చేష్టుడయ్యాడు. తపస్సుకని వెళ్లిన మానస పుత్రులు తిరిగి రాలేదు. సమయం గడచిపోతోంది. 

బ్రహ్మకాలమానం ప్రకారం బ్రహ్మకు పగటి కాలం గడచిపోసాగింది. రాత్రి సమీపిస్తోంది. మార్గదర్శనం కోసం శ్రీహరి ధ్యానంలో నిమగ్నుడయ్యాడు.


శౌనకాది మునులు సూత మహర్షిని కాలగణనం గురించి వివరించమని అడిగారు. బ్రహ్మదేవుని కాల గణనం గురించి కూడా చెప్పమని కోరారు.


*సూత మహర్షి ఇలా కాల గణనం వివరించి చెప్పాడు..


‘బ్రహ్మ కాలమానం ప్రకారం బ్రహ్మకు పగలు ఏడు మన్వంతరాలు, రాత్రి ఏడు మన్వంతరాలు కలిపి బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. మూడు వందల అరవై రోజులు బ్రహ్మకు ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుష్యు వంద సంవత్సరాలు.


*ఇక భూలోక కాలమానం: ఒక లఘువు పలికే కాలం లేదా కనురెప్ప మూసి తెరిచే కాలం ఒక నిమిషం అవుతుంది. పద్దెనిమిది నిమిషాలు ఒక కాష్ట అవుతుంది. ముఫై కాష్టలు ఒక కళ. ముఫై కళలు ఒక క్షణం. పన్నెండు క్షణాలు ఒకముహుర్తం. ముఫై ముహుర్తాలు ఒక పగలు, 

ఒక పగలు, ఒక రాత్రి అనగా ఒక రోజు.


పదిహేను రోజులు ఒక పక్షం. రెండు పక్షాలు ఒక నెల. రెండు నెలలు ఒక ఋతువు. మూడు ఋతువులు అనగా ఆరు నెలలు ఒక ఆయనం. రెండు ఆయనాలు అనగా ఉత్తరాయనం, దక్షిణాయనం కలిపి ఒకసంవత్సరం. దేవతలకు మానవుల ఒక సంవత్సరం ఒక రోజు ఔతుంది (పగలు, రాత్రి). దీనిని సౌరమానం అంటారు.


ఇక యుగాల గురించి చెప్పుకుంటే నాలుగు లక్షల ముఫై రెండు వేల సంవత్సరాలు(4,32,000) కలియుగం యొక్క సమయం. 

ద్వాపరం ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు (8,64,000 కలియుగానికి రెట్టింపు 4,32,000 x2). 

త్రేతాయుగం పన్నెండు లక్షల తొంభై ఆరువేల సంవత్సరాలు (12,96,000 అనగా కలియుగ కాలానికి మూడింతలు 4,32,000 x3), కృతయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు (17,28,000 అనగా కలియుగానికి నాలుగింతలు 4,32,000 x4). 


నాలుగు యుగాలు కలిపి ఒక మహాయుగం అంటారు. మహాయుగ కాలం నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు. వేయి మహాయుగాలు బ్రహ్మ ఒక దినము (పగలు+ రాత్రి) అవుతుంది.


బ్రహ్మ పగలు సృష్టి,, రాత్రి ప్రళయం. దీనిని నైమిత్తిక సృష్టి, నైమిత్తిక ప్రళయం కలిపి నైమిత్తిక కల్పము అంటారు. ఇటువంటి ముప్ఫై దినములు బ్రహ్మకి ఒక నెల. పన్నెండు నెలలు ఒక సంవత్సరం. బ్రహ్మ ఆయుఃపరిమాణం నూరు సంవత్సరాలు. దీనిని మహాకల్పం అంటారు. మహాకల్పానికి పూర్వార్థాన్ని పద్మ కల్పం, ఉత్తరార్ధానికి వరాహ కల్పము అని సంజ్ఞలు.


అధిదేవతల ననుసరించి ఏర్పడిన కల్పములు నాలుగు ఉన్నాయి:


*బ్రహ్మ కల్పము : పరబ్రహ్మ స్వయంభువుడై సృష్టి స్థితి లయములు చేసిన కాలము.


*విష్ణు కల్పము : పరబ్రహ్మము నుండి అవతరించిన మహావిష్ణువు ప్రధాన అధిదేవతగా సృష్టి స్థితి లయ కార్యాలు చేసిన కాలము.


*రుద్ర కల్పము : పరబ్రహ్మము రుద్రుడిగా ప్రధాన అధిదేవత అయి సృష్టి స్థితి లయ కార్యాలు చేసిన కాలము.


*దేవి కల్పము లేదా పద్మ కల్పము : పరబ్రహ్మమునకు అర్థశరీరమైన నారి శక్తిరూపిణిగా అనగా పరాశక్తి అధిదేవతగా సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వర్తించిన కాలము.


పరబ్రహ్మము సంకల్పించిన సృష్టి సంపూర్ణంగా మహాశూన్యంలో లీనమవ్వడాన్ని మహాలయం అంటారు. మహాలయము జరిగినప్పుడు సృష్టి అనేది ఉండదు. సమస్తము పరబ్రహ్మంలో లయమై మహాశూన్యం ఏర్పడుతుంది. నిరాకారుడైన పరబ్రహ్మము ఒక్కడే ఉంటాడు. మహాలయ కాలము పరబ్రహ్మానికి ఒక రాత్రి. పరబ్రహ్మము తిరిగి సృష్టికి సంకల్పం చేసినపుడు పగలు ఆరంభమవుతుంది. పరబ్రహ్మ తత్త్వమునకు కాలగణనము వర్తించదు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పార్వతి పరమేశ

  🌹పార్వతి పరమేశ

తనయాయ ధీమహి

 తన్నోసుబ్రహ్మణ్య ప్రచోద యాత్.

🌷తత్పురుషాయ విద్మహే వాయు పుత్రాయా ధిమహి 

తన్నో ఆంజనేయ ప్రచోదయాత్ 

🙏శుభ భౌమ్య వారం,,🕉️HappyTuesday🙏🏻శుభమస్తు🌷విజయోస్తు🌹ఆవిఘ్నమస్తు

మంగళవారం, మార్చి.10.2026

 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻

మంగళవారం, మార్చి.10.2026

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయనం - శిశిర ఋతువు

ఫాల్గుణ మాసం - బహుళ పక్షం

తిథి:సప్తమి రా12.19 వరకు

వారం:మంగళవారం(భౌమవాసరే)

నక్షత్రం:అనూరాధ సా5.55 వరకు

యోగం:హర్షణం ఉ7.35 వరకు

కరణం:భద్ర ఉ11.16 వరకు తదుపరి బవ రా12.19 వరకు

వర్జ్యం:రా12.07 - 1.54

దుర్ముహూర్తము:ఉ8.38 - 9.25 మరల రా10.57 - 11.46

అమృతకాలం:ఉ6.24 - 8.10

రాహుకాలం:మ3.00 - 4.30

యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30

సూర్యరాశి:కుంభం

చంద్రరాశి:వృశ్చికం

సూర్యోదయం:6.17

సూర్యాస్తమయం:6.04

ప్రదోష కాలం : 4.49-6.04pm

సర్వేజనా సుఖినోభవంతు

గోమాతను పూజించండి

గోమాతను సంరక్షించండి

********************************************************************************************

🙏ఓం శ్రీ రామభక్త హనుమాన్🙏

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

పంచాంగం


 

9, మార్చి 2026, సోమవారం

మూడు గుణాల గురించి

  మానవశరీరం నందలి మూడు గుణాల గురించి సంపూర్ణ వివరణ -

మానిషి యొక్క శరీరం నందు ప్రధాన పాత్ర వహించునవి మూడు ధాతువులు అవి .


1 . వాతం 2 .పిత్తం. 3 . శ్లేష్మం .


మనుష్యుని యొక్క తల భాగం నుంచి రొమ్ము భాగం వరకు శ్లేష్మ సంబంధ శరీరం ఉండును. రొమ్ము క్రింద నుంచి నడుము పైభాగం వరకు ఉండునది పిత్త శరీరం . నడుము క్రింద భాగం నుంచి పాదాల వరకు ఉండునది వాత శరీరం. ప్రతి ఒక్కరిలోనూ ఇదే విధముగా ఉండును. అవి తమయొక్క స్థానాన్ని దాటి ప్రకోపించినప్పుడు మనుష్యునికి ఆయా సంబంధ వ్యాధులు కలుగును. అనుభవం గల వైద్యుడు సరిగ్గా సమస్యని గుర్తెరిగి వైద్యం చేయవలెను . ఇప్పుడు ఈ మూడు ధాతువులు గురించి సంపూర్ణంగా వివరిస్తాను.


• వాతము -


    కన్ను మూసి తెరవాలి అన్నను , ముక్కుతో శ్వాస పీల్చి వదలాలి అన్నను, కాళ్ళు చేతులు కదల్చాలన్న , రక్తం శరీరం అంతా ప్రవహించాలన్న , జీర్ణక్రియ సంపూర్ణంగా జరగాలన్నా వాయువు సహాయం కావలెను. ఇక్కడ వాతమునకు మరొక పేరే వాయవు. శరీరంలో నాడుల ద్వారా ఈ క్రియలు అన్నియు జరుగును. ఎప్పుడైనా ఈ క్రియలలో ఆటంకం కలిగి నొప్పులు వచ్చాయి అంటే అది పూర్తిగా వాతసంబంధమైన సమస్యగా పరిగణించాలి. ఈ వాతం శారీరక క్రియలనే కాకుండా మానసిక క్రియలను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మనిషి అతిగా ఆలోచించడం మరియు పిచ్చిపట్టడానికి కూడా ఈ వాతమే కారణం. శరీరంలోని వాతం విపరీతంగా ప్రకోపించి తలకు ఎక్కినప్పుడు మనుష్యునికి పిచ్చిపట్టును. తీవ్రమైన భాధ, విచారం కలిగి ఉండును. ఆయుర్వేద గ్రంధాలలో వాతం యొక్క హెచ్చుతగ్గులు వలన కలిగే రోగాలను 80 రకాలుగా వివరించారు. వాటిని అశీతివాతాలు అంటారు. ఈ వాత వ్యాధులను నయం చేయాలి అంటే నాడుల్లో ఉండే మాలిన్యాలను తొలగించే ఔషధ సేవన అత్యుత్తమం .


• పైత్యం - 


   పిత్తమునే పైత్యంగా వ్యవహరిస్తారు . మనము తీసుకున్న ఆహార పదార్ధాలు అన్ని జీర్ణం కావాలంటే వేడి అవసరం . దేహము నందు ఉండే మాలిన్యాలు అన్నింటిని బయటకు వెడలించుటకు కూడా వేడి అవసరం . శరీరం నందు ఉండు మాలిన్యాలను దహించుటకు కూడా పిత్తం ఎంతో అవసరం . ఈ పిత్తం దేహాన్ని చురుకుగా , చలాకీగా ఉంచుటకు కూడా అవసరం. దేహము యెక్క వేడి నందు హెచ్చుతగ్గులు కలిగినను , భాధలు కలిగినను పైత్యం యొక్క పరిమితిలో సమస్యలు మొదలు అయినవని గ్రహించాలి. ఆకలి లేకున్నను , మితము తప్పిన ఆకలి ఉన్నను , మలమూత్రాదులు ఎక్కువ ఉన్నను, లేకున్నను , చెమట ఎక్కువ పోసినా , పొయ్యకున్నను అది పైత్య సంబంధ సమస్యగా గుర్తించాలి. పైత్యం అనగా అగ్నిసంభంధమైనది. దేహములో ఎక్కడైనను మంటలు పుట్టినాయి అంటే అది ఖచ్చితంగా పైత్య ప్రభావంగా గుర్తుంచుకోవాలి. దేహంలో యే భాగమైనా కాంతి

తగ్గినను, దేహంలో ఎక్కడైనా గడ్డకట్టినను జరిగింది అంటే అది పైత్యం తక్కువ కావడం వలన సంభవించిందిగా భావించాలి. దేహం పైన ఎక్కడైనా కురుపు లేచింది అంటే శరీరంలో పైత్యం పెరిగింది అని తెలుసుకోవలెను. ఈ పైత్య వ్యాధుల నివారణ కొరకు శరీరంలో ఉండు వేడిలో హెచ్చుతగ్గులు లేకుండా సమస్థితిలో ఉండేలా చూసుకోవాలి.


• శ్లేష్మము - 


   మనము తినిన ఆహారం అంతయు జీర్ణావయవముల యందు వచనమై రసముగా మారును. ఈ రసముకే ఆంగ్లము నందు "లింఫ్ " అందురు. జీర్ణశయం నందలి కోట్లాదిగా వ్యాపించి ఉన్న శోషరసకేశ నాళికలు ద్వారా ఈ రసం స్వీకరించబడి శోషరస వాహికలలో చేరుచున్నది.దేహము నందు రక్తనాళాలు ఎట్లు వ్యాపించి ఉండునో ఈ శోషరస వాహికలు దేహమంతా వ్యాపించి ఉండును. ఈ రస వాహికలకు శ్లేష్మరస వాహికలు అని పేరు . మన శరీర కదిలికల వలన శరీరం నందలి అతిగా వేడి పుట్టకుండా కాపాడునది ఈ శ్లేష్మము యంత్రం పనిచేయునప్పుడు యంత్రభాగాల యందు వేడి జనించకుండా కందెన ఎలా ఉపయోగపడునో అదేవిధంగా శ్లేష్మం పనిచేయును. శరీరం నందు శ్లేష్మం తక్కువైనచో శరీరభాగాలు తీవ్రవేడికి గురి అగును. హెచ్చుతగ్గులు లేని శ్లేష్మం వలన శ్వాసనాళాలు సాఫీగా పనిచేయును . శ్లేషం దేహమునకు సరిపోనంత ఉండిన నిరుత్సాహము , అలసట , నిస్తేజము వంటి మానసిక ఆందోళనలు యే కాక దేహము నందు వేడి , దేహము యొక్క చివరలు , పాదములు , చేతులు మంటలుగా ఉండటం, కండ్లు తిరుగుట, శోష, దప్పిక , గాబరా , దాహాము మొదలయిన దుర్గుణాలు కనిపించును. ఈ శ్లేష్మము దేహావసరాలకు మిగిలియున్నప్పుడు తరువాత వాడుకొనుటకు కొంతభాగం మేధముగా మారును . దీనినే కొవ్వు అనుదురు. ఈ మేధము ఉదరము నందు , రొమ్ముల యందు , పిరుదల యందు చేరి నిలువ ఉండును. సరైన ఆహారం దొరకనప్పుడు , ఉపవాస సమయాల్లో ఈ కొవ్వుని శరీరం తన క్రియలకు ఉపయోగించుకొనును. ఈ శ్లేష్మం అధికమైనప్పుడు ముక్కునుంచి చీమిడి కారడం, కురుపు నుంచి వెలువడే చీము, పురుషుల్లో కలిగే శుక్లనష్టం, స్త్రీలలో వచ్చు తెల్లబట్ట, గడ్డలలో గట్టిగా ఉండు పదార్థం , మోకాలి సంధి యందు నొప్పి కలుగును. కావున పైన చెప్పిన మూడు ధాతువులలో హెచ్చుతగ్గులు జరగకుండా మంచి ఆహారపు అలవాట్లు ఏర్పరుచుకోవాలి.

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

గమనిక -

 నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

 ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం . ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు . 


         కాళహస్తి వేంకటేశ్వరరావు

      అనువంశిక ఆయుర్వేద వైద్యులు

                  9885030034

ఆవుతో అధ్బుత వైద్యం -

 ఆవుతో అధ్బుత వైద్యం -


రక్తపైత్య రోగానికి -


• రక్తపైత్య రోగం అనగా నోటివెంట దగ్గినప్పుడు రక్తం పడటం .నాటు ఆవుపాలు పావు లీటరు తీసుకుని గిన్నెలో పోసి దానిలో మంచినీరు 1 1/4 లీటరు కలిపి చిన్న మంట పైన నీరంతా ఇగిరిపోయి పాలు మిగిలే వరకు మరగబెట్టి దించి చల్లారిన తరువాత ఆ పాలను ప్రతిరోజూ తాగుతూ ఉంటే దగ్గులో రక్తం పడే రక్త పిత్త వ్యాధి కొద్దిరోజులలోనే తగ్గిపోవును .ఇంత సులువైన మందు యే వైద్య విధానంలో లేదు .


• విరిగిన ఎముకలు తొందరగా అతుక్కోవడానికి -కాచిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 30 గ్రా , ఆవునెయ్యి 20 గ్రా , లక్కపొడి 2 గ్రా కలిపి ఒక మోతాదుగా రోజు రెండుపూటలా తాగిస్తూ ఉంటే ఒకటి లేక రెండు వారాలలో విరిగిపోయిన ఎముకలు తప్పకుండా అతుక్కుంటాయి.


• అతి కఫం హరించుట కొరకు -రోజు రెండు పూటలా పావు లీటరు ఆవుపాలలో ఒక గ్రాము మిరియాల పొడి , పటికబెల్లం పొడి 20 గ్రాములు కలిపి తాగుతూ ఉంటే ప్రకోపించిన అతి కఫం అదృశ్యం అవుతుంది.


• పాండు రోగం , క్షయ హరించుట కొరకు -ఇనుప పాత్రలో కాచబడిన ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో తగినంత కండ చక్కర పొడి కలిపి రోజు పరగడపున సేవిస్తూ ఉంటే క్రమంగా పాండురోగం పారిపోయి రక్త వృద్ది కలుగుతుంది. క్షయవ్యాధి బహు త్వరగా పారిపోతుంది.


• ఎక్కిళ్లు వెంటనే తగ్గుట కొరకు -కాచిన ఆవుపాలు పావు లీటరు మోతాదుగా పటికబెల్లం పొడి కలిపి గోరువెచ్చగా కొంచంకొంచం తాగుతూ ఉంటే అప్పటికప్పుడే ఎక్కిళ్లు తగ్గుతాయి


• పిల్లల ఆరోగ్యానికి -అప్పటికప్పుడు చిలికిన మజ్జిగ నుంచి తీసిన ఆవువెన్న ని పసిపిల్లల అన్నప్రాసన రోజు నుంచి ఉదయం, మద్యాహ్నం, సాయంత్రం వేళ్ళల్లో వయసుని బట్టి పూటకు ఒక గ్రాము నుంచి పెంచుకుంటూ 10 గ్రాముల వరకు తినిపిస్తుంటే ఆ పిల్లల శరీరం ఉక్కులా బలంగా తయారు అయ్యి అవయవాలు అందంగా ఉంటాయి. తెలివి పెరుగును.


• సంభోగ సుఖం కొరకు -గోరువెచ్చని ఆవుపాలు పావు లీటరు తీసుకుని దానిలో పటికబెల్లం పొడి 25 గ్రా కలిపి మొదటిసారి సంభోగం అయ్యాక వెంటనే సేవిస్తే ఆ సంభోగం తాలుకు నీరసం తగ్గిపోవడమే కాక తిరిగి త్వరగా మరలా సంభోగం చేయగల శక్తి లభించును. 


  అత్యంత సులభమైన ఆయుర్వేద చిట్కాలు మరియు సులభ ఔషధాల సంపూర్ణ వివరణ కోసం నేను రచించిన గ్రంథములు చదవగలరు .

 

 గమనిక -

      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 

            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును . 

   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు . 

                ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .

     కాళహస్తి వేంకటేశ్వరరావు  

 అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

         9885030034

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*ఆదివారం 8 మార్చి 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

1️⃣5️⃣7️⃣&1️⃣5️⃣8️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*

            

          *157,158 వ రోజు*                   

*వన పర్వము సప్తమాశ్వాసము*


*యక్షప్రశ్నలు*```


అరణ్యవాసంలో ఆఖరి సంవత్సరం ఉన్న పాండవుల వద్దకు ఒక రోజు ఒక బ్రాహ్మణుడు వచ్చి “అయ్యా! నేను నా అరణిని చెట్టుకు వేలాడగట్టాను. ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని కొమ్ములకు నా అరణి తగులుకుంది. ఆ లేడి నా అరణితో పారి పోయింది. దయచేసి నా అరణిని నాకు తెచ్చి ఇవ్వండి” అని ధర్మరాజును అడిగాడు. 


ధర్మరాజు విల్లంబులు పట్టుకుని తమ్ములతో ఆ లేడిని వెంబడించాడు. కాని అతను వేసిన బాణములు ఒక్కటి కూడా ఆ లేడికి తగలలేదు. అలా కొంత దూరం ఆ లేడి పరిగెత్తి మాయం అయింది. పాండవులు అలసిపోయి ఒక చెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజును చూసి 

“అన్నయ్యా! మనం ఉన్నత వంశంలో పుట్టాము. ధర్మశాస్త్రాలు చదువుకున్నాము. అందరి ఎడల కరుణ కలిగి ఉన్నాము. కాని ఇంతటి దుర్గతి రావడానికి కారణం ఏమిటి? " అని అడిగాడు. 


ధర్మరాజు నవ్వి "నకులా! సుఖం కాని దుఃఖం కాని మనకు కలగడానికి కారణం మన చేసుకున్న కర్మే. వేరే ఏమి కాదు" అన్నాడు. 


భీముడు నకులుని చూసి “తమ్ముడూ! ఆ రోజు పాత్రిగామి ద్రౌపదిని కొలువు కూటమికి తీసుకు వచ్చినప్పుడే ఆ కౌరవులను నరికి ఉంటే ఈ కష్టాలు తప్పేవి" అన్నాడు. 


నకులుడు "అన్నయ్యా భీమా! అదియును కాక ఆ రోజు కర్ణుడు కొలువులో పలికిన మాటలకు మనం ఆగ్రహించక ఇలా పిరికి వారి వలె అడవులకు వచ్చామే. అదే అసలు కారణం. అన్నయ్యలూ! ఆ రోజే మాయజూదం ఆడిన శకునిని అడ్డంగా నరికి ఉంటే ఈ దుర్దశ తప్పేది కదా” అన్నాడు సహదేవుడు. 


ఆ మాటలు వింటున్న ధర్మరాజు 

“తమ్ముడూ! ప్రస్తుతం నీ అన్నయ్యలు అందరూ చాలా దాహంతో ఉన్నారు. నీళ్ళు ఎక్కడైనా ఉన్నాయేమో చూడు” అన్నాడు.```


*దాహార్తులై పాండవులు కొలను చేరుట*```


నకులుడు చెట్టు ఎక్కి నలుపక్కలా చూసి కొంచం దూరంలో కనిపిస్తున్న కొలను చూసి అన్నలతో చెప్పాడు. 


ధర్మరాజు "అయితే నీవు పోయి నీరు త్రాగి మాకు కొంత నీరు తీసుకురా" అన్నాడు. 


నకులుడు కొలను వద్దకు వెళ్ళాడు. నీళ్ళు త్రాగబోయే సమయంలో ఒక శబ్దం వినిపించింది. “అన్నా! ఈ తటాకము నాది. నీవు ఈ తటాకములో నీరు త్రాగాలంటే నా ప్రశ్నలకు ప్రత్యుత్తరం ఇవ్వాలి” అన్న మాటలు వినిపించాయి. 


నకులుడు దానిని పట్టించుకోకుండా నీరు త్రాగాడు. కొలను బయటకు వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. 


నీళ్ళకు వెళ్ళిన నకులుడు ఎంతకీ రాకపోయే సరికి ధర్మరాజు సహదేవుని చూసి "సహదేవా! నీ అన్నయ్య నకులుడు నీళ్ళు తీసుకు రావటముకు వెళ్ళి ఎంతకూ రాలేదు. నీవు పోయి చూసి రా” అని చెప్పి పంపించాడు. 


సహదేవుడు నకులుడు వెళ్ళిన దిశగా వెళ్ళి నీళ్ళు త్రాగటానికి కొలనులో దిగపోయే సమయంలో 

“మహానుభావా! ఈ కొలను నాది. సాహసంతో ఇందులో దిగవద్దు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆ తరువాత నీరు త్రాగు” అన్న మాటలు వినిపించాయి. 


సహదేవుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. నకులుని లాగానే స్పృహతప్పి పడి పోయాడు. పోయిన ఇద్దరూ ఎంతకీ రాక పోయే సరికి ధర్మరాజు అర్జునిని చూసి “అర్జునా! నీ తమ్ములు నీళ్ళకు వెళ్ళి ఎంతకూ రాలేదు. ఏం జరిగిందో చూసి రా” అని చెప్పి పంపించాడు. 


అర్జునుడు కొలను సమీపించగానే అశరీరవాణి "ఎవరన్నా ఈ కొలనులో నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగితే స్పృహతప్పి పడిపోతారు” అన్నాడు. 



అర్జునుడు “ఎవడురా నువ్వు? చాటుగా మాట్లాడు తున్నావు. ఉండు నిన్ను సంహరిస్తాను" అంటూ శబ్ధవేది బాణాన్ని ప్రయోగించాడు. 


మరలా అవే మాటలు వినిపించాయి. అర్జునుడు ఆ మాటలు లక్ష్యపెట్టక కొలనులో దిగి నీరు త్రాగాడు. 


అర్జునుడు కూడా స్పృహతప్పి పడి పోయాడు. 


వెళ్ళిన ముగ్గురూ రాకపోయే సరికి ధర్మరాజు ఆందోళన చెంది భీముని చూసి “భీమా వెళ్ళిన ముగ్గురూ తిరిగి రాలేదు. ఏమి జరిగిందో చూసిరా" అని పంపాడు. 


భీముడు కొలను సమీపించగానే మరలా అదే అశరీరవాణి 

“ఎందుకయ్యా ఇంత సాహసానికి పూనుకుంటావు నీకు శక్తి ఉంటే నాప్రశ్నలకు సమాధానం చెప్పి నీళ్ళు త్రాగు" అన్నది. 


భీముడు ఆ మాటలు వినిపించుకోకుండా కొలనులో నీళ్ళు త్రాగి స్పృహతప్పి పడి పోయాడు.```


               *సశేషం*

 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

              🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

  🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 8 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*                        

                 *19వ భాగం*


*ఏకాదశ రుద్రులు - దశ బ్రహ్మ మానస పుత్రుల జననం - శివుడి ఆవిర్భావం:*```

   

ముల్లోకాలలో నివసించే వారిని సృష్టించిన బ్రహ్మకు తృప్తి కలుగ లేదు. వారికి ధర్మము బోధించి ధర్మమార్గంలో నడిపించే వారు ఎవరు అని ఆలోచించాడు. బ్రహ్మ నుంచి ఒకనిట్టూర్పువెలువడింది. ఆ నిట్టూర్పు నుండి ఒక దివ్య పురుషుడు అవతరించాడు.


అతడే కర్దమ ప్రజాపతి. 


బ్రహ్మ కర్దముని చూసి “పుత్రా! కర్దమా! తగిన కన్యను వివాహమాడి మానవ సంతతిని వృద్ధిచేయము" అని ఆదేశించాడు. 


కర్దముడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ముందుగా విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. ఆయన ప్రత్యక్షం కాగానే తగిన కన్యను వివాహానికి చూపించమని అడిగి, 

ఆ కన్యను వివాహమాడ తాను" అని తపస్సుకి వెళ్లి పోయాడు.


బ్రహ్మ కర్దముని నిర్ణయంలో గల ధర్మబద్దతను గమనించి మౌనంగా ఉండిపోయాడు. సృష్టి తను అను కున్నట్టు సాగకపోవడంతో బ్రహ్మకు తనమీద తనకే ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో రుద్రుడైనబ్రహ్మ లలాటంనుంచి మధ్యాహ్నసూర్య తేజంతో ప్రజ్వరిల్లే రుద్రుడు ఉద్భ వించాడు. రుద్రుడి కాలాగ్ని ఉచ్ఛ్వా సల నుండి రుద్రునితో సమానులైన మహాత్ముడు, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్థ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి, కాలాగ్ని అనే రుద్రాంశ సంభూతులు జన్మించారు. పదిమందిని తీసుకుని లయకారుడైన రుద్రుడు కైలాసానికి వెళ్లి పోయాడు.


ఏకాదశ రుద్రులు అలా వెళ్లి పోయేసరికి బ్రహ్మ మరింత చింతనలో పడ్డాడు. అప్పుడు బ్రహ్మ మానసము నుండి మరీచి, కుడి చెవి నుండి పులస్త్యుడు, ఎడమ చెవి నుండి పులహుడు, కుడి కన్ను నుండి అత్రి, ఎడమ కన్ను నుండి క్రతువు, నాసిక నుండి వసిష్టుడు, నోటి నుండి అంగీరసుడు, కుడి పార్శ్వము నుండి భృగువు, ఎడమ పార్శ్వము నుండి దక్షుడు, కంఠం నుండి నారదుడు అవతరించారు. 


బ్రహ్మ వారిని చూసి "పుత్రులారా! నా మానసములో ఏర్పడిన చింతన నుండి మీరు జన్మించి నా మానస పుత్రులు అయ్యారు. మిమ్మల్ని నేను ప్రజాపతులుగా నియమిస్తున్నాను. మీరు తగిన కన్యలను వివాహమాడి సంతానం పొంది సృష్టిని వృద్ధిచేయండి" అని ఆదేశించాడు.


నారదుడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మనసా వాచా కర్మణా నేను నారాయణుని సేవకు అంకితమవుతాను. నారాయణ నామస్మరణం, గానం, తపస్సు, దర్శనం, స్పర్శనం, సేవాభాగ్యం తప్ప వేరే కార్యం చేయలేను. నన్నుమన్నించండి. నాకు సంసార సంతాన ఇచ్ఛలేదు. స్థిరంగా ఒక

చోట ఉండి నారాయణ సేవ చేసు కునే వరం ప్రసాదించండి" అని ప్రార్ధించాడు.


నారదుడి మాటలు బ్రహ్మకు ఆగ్రహం కలిగించాయి. "నారదాజన్మ నిచ్చిన తండ్రి ఆజ్ఞనే ధిక్కరించావా? సృష్టికర్తనైన నామాట కాదన్నందుకు నిన్ను శపిస్తున్నాను. "ఒక చోట స్థిరంగా నిలువకుండా ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ తిరుగుతూ "త్రిలోక సంచారి" వై జీవించుము" అని శపించాడు.


నారదుడు మరింత ఆనందం పొంది "తండ్రీ! ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ సంచరించేభాగ్యం ను కలిగించారు. నా జన్మ చరితార్థమైంది" అని నమస్కరించి నారాయణ నామ గానం చేసుకుంటూ వెళ్లి పోయాడు. మిగిలిన తొమ్మిది మంది మానస పుత్రులను చూసి బ్రహ్మ అసహనంగా "మీ సంగతి ఏమిటి? నారదునిలా శాపం పొందుతారా! లేక నా ఆదేశం పాటిస్తారా!" అని అడిగాడు.


మరీచి మొదలైనవారు భయభక్తులతో బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆదేశం ప్రకారమే సృష్టిని వృద్ధి చేస్తాము. మాకు తగిన కన్యలు లభించే వరకు మమ్మల్ని తపస్సు చేసుకోవడానికి అనుమతించండి" అని బ్రహ్మదేవుడు అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయారు.


బ్రహ్మ తను అనుకున్నట్టుగా సృష్టి జరగక పోవడంతో అసహనం చెంది "సృష్టిలో తనకు సహకరించేవారు ఒక్కరు లేరు" అనుకుంటూ గట్టిగా తొడపై చేతితో చరిచాడు (కొట్టుకున్నాడు). మరుక్షణం ఆయన తొడ5 నుండి అఖండ తేజస్సుతో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే "నాకు నామకరణం చెయ్యి" అంటూ ఏడవ సాగాడు.


బ్రహ్మ ఆ శిశువుని ఊరడిస్తూ "శిశువుగా జన్మించిన నీకు శివుడు అని నామకరణం చేస్తున్నాను. నిన్ను భక్తితో కొలిచినవారికి, ఆశ్ర యించినవారికి దుఖములు తొలగించి సకల సుఖములు ఇస్తాను. చివరలో కైవల్యం ప్రసాదిస్తావు" అని వరమిచ్చాడు. 


శిశువు సంతోషపడకుండా ఏడుసార్లు బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన ప్రతిసారి ఒక్కొక్క నామంతో నామకరణం చేస్తూ బ్రహ్మ సముదాయించాడు.


భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, మహాదేవుడు, ఉగ్రుడు అనే ఏడు పేర్లు ఆ శిశువుకి వచ్చాయి. తరువాత బ్రహ్మ శిశువుకి శరీరాలుగా సూర్యుడు, చంద్రుడు, పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, యజమాని అనే అష్టభూతములను నియ మించి శివుని అష్టమూర్తిగా చేశాడు.


అష్టమూర్తి అయిన శివుని చూసి "భూలోకానికి గల అష్ట దిక్కులు నీకు ఆధీనం చేస్తున్నాను. అష్ట దిక్కుల మధ్య నున్న భూమండ లానికి ఆయురారోగ్య ప్రదాతవై విరాజిల్లుము" అని దీవించాడు. వెంటనే శివుడు శిశురూపంవదలి పూర్ణ రూపం దాల్చి "బ్రహ్మదేవా! భూలోకంలోని అష్ట దిక్కులకు నన్ను అధిపతిని చేసి నీకు ఏ దిక్కు లేకుండా చేసుకున్నావు. ఫలితంగా నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు. నీ విగ్రహ మూర్తికి ప్రతిష్టాపనలు, పూజలు ఉండవు" అని అదృశ్యమయ్యాడు. శివుడి మాటలకు బ్రహ్మ నిశ్చేష్టు డయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

*శ్రీ మహావిష్ణు పురాణం*

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 8 మార్చి 2026*


        *శ్రీ మహావిష్ణు పురాణం*                        

                 *19వ భాగం*


*ఏకాదశ రుద్రులు - దశ బ్రహ్మ మానస పుత్రుల జననం - శివుడి ఆవిర్భావం:*```

   

ముల్లోకాలలో నివసించే వారిని సృష్టించిన బ్రహ్మకు తృప్తి కలుగ లేదు. వారికి ధర్మము బోధించి ధర్మమార్గంలో నడిపించే వారు ఎవరు అని ఆలోచించాడు. బ్రహ్మ నుంచి ఒకనిట్టూర్పువెలువడింది. ఆ నిట్టూర్పు నుండి ఒక దివ్య పురుషుడు అవతరించాడు.


అతడే కర్దమ ప్రజాపతి. 


బ్రహ్మ కర్దముని చూసి “పుత్రా! కర్దమా! తగిన కన్యను వివాహమాడి మానవ సంతతిని వృద్ధిచేయము" అని ఆదేశించాడు. 


కర్దముడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞను పాటిస్తాను. కానీ ముందుగా విష్ణువు అనుగ్రహం కోసం తపస్సు చేస్తాను. ఆయన ప్రత్యక్షం కాగానే తగిన కన్యను వివాహానికి చూపించమని అడిగి, 

ఆ కన్యను వివాహమాడ తాను" అని తపస్సుకి వెళ్లి పోయాడు.


బ్రహ్మ కర్దముని నిర్ణయంలో గల ధర్మబద్దతను గమనించి మౌనంగా ఉండిపోయాడు. సృష్టి తను అను కున్నట్టు సాగకపోవడంతో బ్రహ్మకు తనమీద తనకే ఆగ్రహం కలిగింది. ఆగ్రహంతో రుద్రుడైనబ్రహ్మ లలాటంనుంచి మధ్యాహ్నసూర్య తేజంతో ప్రజ్వరిల్లే రుద్రుడు ఉద్భ వించాడు. రుద్రుడి కాలాగ్ని ఉచ్ఛ్వా సల నుండి రుద్రునితో సమానులైన మహాత్ముడు, మతిమంతుడు, భీషణుడు, భయంకరుడు, ఋతధ్వజుడు, ఊర్థ్వకేశుడు, పింగళాక్షుడు, రుచి, శుచి, కాలాగ్ని అనే రుద్రాంశ సంభూతులు జన్మించారు. పదిమందిని తీసుకుని లయకారుడైన రుద్రుడు కైలాసానికి వెళ్లి పోయాడు.


ఏకాదశ రుద్రులు అలా వెళ్లి పోయేసరికి బ్రహ్మ మరింత చింతనలో పడ్డాడు. అప్పుడు బ్రహ్మ మానసము నుండి మరీచి, కుడి చెవి నుండి పులస్త్యుడు, ఎడమ చెవి నుండి పులహుడు, కుడి కన్ను నుండి అత్రి, ఎడమ కన్ను నుండి క్రతువు, నాసిక నుండి వసిష్టుడు, నోటి నుండి అంగీరసుడు, కుడి పార్శ్వము నుండి భృగువు, ఎడమ పార్శ్వము నుండి దక్షుడు, కంఠం నుండి నారదుడు అవతరించారు. 


బ్రహ్మ వారిని చూసి "పుత్రులారా! నా మానసములో ఏర్పడిన చింతన నుండి మీరు జన్మించి నా మానస పుత్రులు అయ్యారు. మిమ్మల్ని నేను ప్రజాపతులుగా నియమిస్తున్నాను. మీరు తగిన కన్యలను వివాహమాడి సంతానం పొంది సృష్టిని వృద్ధిచేయండి" అని ఆదేశించాడు.


నారదుడు బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మనసా వాచా కర్మణా నేను నారాయణుని సేవకు అంకితమవుతాను. నారాయణ నామస్మరణం, గానం, తపస్సు, దర్శనం, స్పర్శనం, సేవాభాగ్యం తప్ప వేరే కార్యం చేయలేను. నన్నుమన్నించండి. నాకు సంసార సంతాన ఇచ్ఛలేదు. స్థిరంగా ఒక

చోట ఉండి నారాయణ సేవ చేసు కునే వరం ప్రసాదించండి" అని ప్రార్ధించాడు.


నారదుడి మాటలు బ్రహ్మకు ఆగ్రహం కలిగించాయి. "నారదాజన్మ నిచ్చిన తండ్రి ఆజ్ఞనే ధిక్కరించావా? సృష్టికర్తనైన నామాట కాదన్నందుకు నిన్ను శపిస్తున్నాను. "ఒక చోట స్థిరంగా నిలువకుండా ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ తిరుగుతూ "త్రిలోక సంచారి" వై జీవించుము" అని శపించాడు.


నారదుడు మరింత ఆనందం పొంది "తండ్రీ! ముల్లోకాలు నారాయణ నామ స్మరణ చేస్తూ సంచరించేభాగ్యం ను కలిగించారు. నా జన్మ చరితార్థమైంది" అని నమస్కరించి నారాయణ నామ గానం చేసుకుంటూ వెళ్లి పోయాడు. మిగిలిన తొమ్మిది మంది మానస పుత్రులను చూసి బ్రహ్మ అసహనంగా "మీ సంగతి ఏమిటి? నారదునిలా శాపం పొందుతారా! లేక నా ఆదేశం పాటిస్తారా!" అని అడిగాడు.


మరీచి మొదలైనవారు భయభక్తులతో బ్రహ్మకు నమస్కరించి "తండ్రీ! మీ ఆదేశం ప్రకారమే సృష్టిని వృద్ధి చేస్తాము. మాకు తగిన కన్యలు లభించే వరకు మమ్మల్ని తపస్సు చేసుకోవడానికి అనుమతించండి" అని బ్రహ్మదేవుడు అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయారు.


బ్రహ్మ తను అనుకున్నట్టుగా సృష్టి జరగక పోవడంతో అసహనం చెంది "సృష్టిలో తనకు సహకరించేవారు ఒక్కరు లేరు" అనుకుంటూ గట్టిగా తొడపై చేతితో చరిచాడు (కొట్టుకున్నాడు). మరుక్షణం ఆయన తొడ5 నుండి అఖండ తేజస్సుతో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే "నాకు నామకరణం చెయ్యి" అంటూ ఏడవ సాగాడు.


బ్రహ్మ ఆ శిశువుని ఊరడిస్తూ "శిశువుగా జన్మించిన నీకు శివుడు అని నామకరణం చేస్తున్నాను. నిన్ను భక్తితో కొలిచినవారికి, ఆశ్ర యించినవారికి దుఖములు తొలగించి సకల సుఖములు ఇస్తాను. చివరలో కైవల్యం ప్రసాదిస్తావు" అని వరమిచ్చాడు. 


శిశువు సంతోషపడకుండా ఏడుసార్లు బిగ్గరగా ఏడ్చాడు. ఏడ్చిన ప్రతిసారి ఒక్కొక్క నామంతో నామకరణం చేస్తూ బ్రహ్మ సముదాయించాడు.


భవుడు, శర్వుడు, మహేశ్వరుడు, పశుపతి, భీముడు, మహాదేవుడు, ఉగ్రుడు అనే ఏడు పేర్లు ఆ శిశువుకి వచ్చాయి. తరువాత బ్రహ్మ శిశువుకి శరీరాలుగా సూర్యుడు, చంద్రుడు, పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, యజమాని అనే అష్టభూతములను నియ మించి శివుని అష్టమూర్తిగా చేశాడు.


అష్టమూర్తి అయిన శివుని చూసి "భూలోకానికి గల అష్ట దిక్కులు నీకు ఆధీనం చేస్తున్నాను. అష్ట దిక్కుల మధ్య నున్న భూమండ లానికి ఆయురారోగ్య ప్రదాతవై విరాజిల్లుము" అని దీవించాడు. వెంటనే శివుడు శిశురూపంవదలి పూర్ణ రూపం దాల్చి "బ్రహ్మదేవా! భూలోకంలోని అష్ట దిక్కులకు నన్ను అధిపతిని చేసి నీకు ఏ దిక్కు లేకుండా చేసుకున్నావు. ఫలితంగా నీకు భూలోకంలో ఆలయాలు ఉండవు. నీ విగ్రహ మూర్తికి ప్రతిష్టాపనలు, పూజలు ఉండవు" అని అదృశ్యమయ్యాడు. శివుడి మాటలకు బ్రహ్మ నిశ్చేష్టు డయ్యాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏