9, సెప్టెంబర్ 2026, బుధవారం

వచ్చెననుచు బీపి వదల కుండా మాత్ర

  వచ్చెననుచు బీపి వదల కుండా మాత్ర

వేస్తె లైఫు లాంగు వేదనొచ్చు

చక్కబరచు యోగ చక్కనౌ హోమ్యోతొ

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: బీపీ హెచ్చుతగ్గులకు గురవ్వటం అనేది అందరి జీవితం లోనూ సహజమైన విషయం. కానీ తరచుగా అధిక రక్తపోటుకు గురౌతూ ఉంటే, అధిక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం ద్వారా నిరంతర సాధన చెయ్యాలి. అలాగే టీ, కాఫీ, టిఫిన్ లు మానేసి, ఉదయపు ఆహారంగా చద్దన్నం లేదా పెరుగన్నం తీసుకోవాలి. షుగర్ ఉన్నవారు వరి అన్నం బదులు మిల్లెట్స్ (చిరుధాన్యాలు) తో చద్దన్నం, జావ చేసుకుని, పెరుగు కలిపి తీసుకోవాలి. కారాలూ, పచ్చళ్ళూ, మషాళాలూ తగ్గించుకోవాలి. కిడ్నీలో రక్తాన్ని శుద్ధి చేసే ఫిల్టర్లను 'నెఫ్రాన్లు ' అంటారు. అవి ఒక్కొక్క కిడ్నీలో దాదాపు పది లక్షల వరకూ ఉంటాయి. ఈ ఫిల్టర్ల తలలు టోపీలాగా ఉంటాయి. ఈ తలలపై ఉండే కణాలు "రెనిన్" అనే హార్మోన్ ను ఉత్పత్తి చేసి, రక్తం శుద్ధి అయ్యి, తిరిగి శరీరంలోకి వెళ్ళేటప్పుడు ఆ మంచి రక్తంలో ఆ హార్మోన్ ను కలిపి పంపుతుంది. ఈ హార్మోన్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కిడ్నీలోని ఫిల్టర్లు పాడైన వారికి ఈ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం కూడా అధిక రక్తపోటుకు కారణమౌతుంది. మానసికంగా, శారీరకంగా ఏర్పడిన సమస్యలను చక్కదిద్దడం మానేసి, రోజుకో బీపీ మాత్ర మింగేసి, బీపీ ని కంట్రోల్ లో పెట్టుకుంటూ, సమస్యలను దాచుకోవడం వలన, ఈ పనికిమాలిన టెంపరరీ మాత్రలను అదేపనిగా వాడటం వలన వాటిలోని రసాయనాల దెబ్బకు త్వరలో కిడ్నీలు పాడవ్వడం, గుండెపోటు కు గురవ్వడం, మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి, సెరిబ్రల్ హేమరేజ్ తో పక్షవాతానికి గురవ్వడం, కంటిలోని రక్తనాళాలు చిట్లి, దృష్టి దెబ్బతినడం, వెర్టిగో సమస్యతో తరచుగా తల విసిరి పడిపోవడం, ఇలా ఎన్నో సమస్యలకు గురౌతారు. బీపీ మాత్రలతో అనేక సంవత్సరాల పాటు బీపీ పేషెంట్ గా బ్రతుకుతూ సర్వ నాశనం అయ్యే బదులు హోమియో మందులు వాడుకుంటే కేవలం కొద్ది రోజులలోనే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు, మీ అవయవాలను సైతం సైడ్ ఎఫెక్ట్స్ బారినుండి కాపాడుకోవచ్చు! ఏ సమస్య వచ్చినా దానికో టాబ్లెట్ వాడుకుంటూ, జీవితకాలం పాటు ఆ పేషెంట్ గా బ్రతకటమే నిజమైన వైద్యమని, అలా చేసేదే సైన్స్ అనీ, దానినే ఫాస్ట్ వైద్యమంటారనీ, ఈ పిచ్చి మెదళ్ళకు పచ్చిగా పట్టేసింది! వీళ్ళని ఈ భ్రమ నుంచి లాగడం భగవంతుని తరం కూడా కాదు! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

వినడమూ మోక్షమార్గమే

   99ఫ4;

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀



     *వినడమూ మోక్షమార్గమే!*

              ➖➖➖✍️



```

జ్ఞానేంద్రియాల్లో 'శ్రవణం' ఒకటి. శ్రవణం అంటే వినటం. ఇదో ఆధ్యాత్మిక, నైతిక ప్రక్రియ. భక్తిసాధన, జ్ఞానార్జన, మోక్షప్రాప్తి కోసం శ్రవణం మార్గదర్శనం చేయిస్తుంది. 


బమ్మెర పోతన రాసిన భాగవతంలో ధ్రువుడు తన తల్లి సునీతి మాటలు ఆలకించి అడవులకు వెళ్తాడు. నారద మహర్షి వినిపించిన శ్రీహరి స్తోత్రం అవిరామంగా జపించి ఇష్టదైవాన్ని ప్రసన్నం చేసుకుంటాడు.


భక్తి సాధనలో శ్రవణం పోషించే ముఖ్య పాత్రను తెలియచెప్పే పురాణ గాథలు చాలా ఉన్నాయి. 


విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారదుడి ఉప దేశాలను ఆసక్తిగా ఆలకించాడు. కన్నతండ్రి దాష్టీకాలకు ఎదురొడ్డి భగవంతుడి సన్ని ధానం సాధించాడు. శ్రవణ జ్ఞానమే బాలభక్తుడికి ఆ శక్తిని ప్రసాదించింది. 


పరీక్షిత్తు మహారాజు మృత్యువును ఎదుర్కొనే సందర్భంలో శుకమహర్షి చెప్పిన భాగవత కథలను అమిత శ్రద్ధగా విన్నాడు. ఆ శ్రవణభక్తి ఆ చక్రవర్తికి మోక్షప్రాప్తిని సులభతరం చేసింది. 


'విన్నవారికి మోక్షము విందుగాదా?' అని రామదాసు అన్నది ఈ తరహా కథలు విన్నందు వల్లే.


యోగశాస్త్రం జ్ఞానసాధనకు మూడు ప్రధాన మార్గాలను సూచించింది. అందులో జ్ఞానుల ఉపదేశాలను వినే శ్రవణ మార్గం మొదటిది. 


వినడం అంటే కేవలం శబ్దాలను గ్రహించడం కాదు, అది అర్థవంతమైన చర్యకు పురిగొల్పే ప్రక్రియ. 


అన్నమయ్య వినటాన్ని ఆధ్యాత్మిక సాధ నగా అభివర్ణించాడు. 


ఒకరు చెప్పింది విని వేరొకరు వినేందుకు తిరిగి చెప్పినవి వేదాలు. అందుకే అవి 'శ్రుతులు' అయ్యాయి. 


నారదుడి సంక్షేప రామాయణం విన్న తరవాత వాల్మీకి విస్తృత రామాయణ రచనకు పూనుకున్నాడు. 


'బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక అన్నాడు త్యాగ రచనకు రాజు. 


మంచి మాటలు వినక చెడినవారు చరిత్రలో చాలా మందే ఉన్నారు. సత్పురు షుల, మహర్షుల హితబోధలను పెడచెవిని పెట్టరాదు. దుర్మార్గుల, దుష్ట బుద్ధుల మాటలకు చెవినొగ్గరాదు. 


విదురుడి సద్బోధలు వినక, కురుక్షేత్ర యుద్ధానికి, కౌరవ వంశ వినాశనానికి కారకుడయ్యాడు ధృతరాష్ట్రుడు. 


మంధర దుర్బోధలు విని రాముడి అరణ్యవాసానికి, దశరథుడి మరణానికి కారణమైంది కైకేయి.


వినడం ఒక కళ. ఎవరు చెప్పినా వినాలి. విన్నది విన్నట్లుగా గాక వివరంగా విచారించాలి. మంచి చెడ్డలు గ్రహించి, ఆనక చిత్తశుద్దితో ఆచరించాలి. ఇదే నీతి మంతుల లక్షణం అని సుమతీ శతకం బోధించింది. 


మేధస్సుకు అందే సమాచారం మూడొంతులు శ్రవణం ద్వారా లభించేదే. నిమిషానికి వెయ్యి మాటల వరకు ఆలోచిస్తే, కేవలం నూట పాతిక మాటలు మాత్రమే ఆలకించగలం. 


బ్రహ్మ సృష్టి ఒక నాలుక, రెండు చెవులు. 

తక్కువ మాట్లాడి ఎక్కువ వినాలని విధాత ఆదేశం. 

చెవుల కన్నా నాలుకకు ఎక్కువ పని పెట్టడం మూర్ఖత్వం. 


వినే ఓర్పు కలవాడే అంతిమంగా విజయం సాధిస్తాడు.✍️

-కర్లపాలెం హనుమంతరావు.```

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     🌷🙏🌷

 `🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

`*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.*`

                     ➖▪️➖

⚜ శ్రీ పల్లవనేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 1597


⚜  తమిళనాడు : పూంపుహార్ - నాగపట్నం


⚜  శ్రీ పల్లవనేశ్వర ఆలయం



💠 పల్లవనేశ్వరర్ ఆలయం అనేది భారతదేశంలోని తమిళనాడులో ఉన్న ఒక పురావస్తు ప్రదేశమైన మైలాడుతురై జిల్లాలోని పూంబుహార్ పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం . 

ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది . ఇది శైవ సాధువు పట్టినాథర్ జన్మస్థలంలో ఉంది . ఇక్కడి ప్రధాన దైవం శివుడు . ఆయనను పల్లవనేశ్వరర్ అని పిలుస్తారు. ఆయన భార్యను సౌందర్యనాయకి అని పిలుస్తారు .


💠 తమిళ శైవ నాయనార్ తిరుజ్ఞానసంబందర్ రచించిన తొలి మధ్యయుగ తేవారం పద్యాలలో కీర్తించబడిన 275 పాడల్ పెట్ర స్థలాలలో - శివ స్థలాలలో ఇది ఒకటి .



🔆 స్థల పురాణం


💠 శివనేసర్ మరియు జ్ఞానకామలాంబికై కావేరిపూంపట్టినం (పూంపుహార్)లో నివసించేవారు. వారికి తిరువెంకడర్ అనే కుమారుడు జన్మించాడు, అతను శివకళిని వివాహం చేసుకున్నాడు. 

వారికి చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. 


💠 శివశర్మ మరియు సుశీలై ఒక పేద దంపతులు, మరియు శివుడు వారి కుమారుడైన మరుదవానర్‌గా జన్మించాడు. 

ఆయన వారి కలలో కూడా కనిపించి, మరుదవానర్‌ను తిరువెంకడర్ మరియు శివకళికి దత్తతకు ఇవ్వమని కోరాడు. 

పెరిగి పెద్దవాడయ్యాక, ఈ బాలుడైన మరుదవానర్ తిరువెంకడర్ వృత్తిని చేపట్టాడు – అదే సముద్ర వ్యాపారం. 


💠 తన ప్రయాణాలలో  తిరిగి వస్తూ, అతను తిరువెంకడర్‌కు ఒక బహుమతి ఇచ్చాడు. 

డబ్బు, ఆభరణాలు ఉంటాయని ఆశించిన తిరువెంకడర్ దానిని తెరిచి చూడగా, అందులో ఒక ఆవు పేడ పిడక ఉంది. 

తీవ్ర ఆగ్రహానికి గురై, అతను దానిని గోడకు విసిరి, ఆపై దాని లోపల తమిళంలో వ్రాసి ఉన్నదాన్ని చదివాడు – చివరి ప్రయాణంలో విరిగిన సూది కూడా తోడుగా రాదని. 


💠 వెంటనే తన తప్పును గ్రహించిన తిరువెంకడర్, అన్ని లౌకిక బంధాలను త్యజించి, కుటుంబ జీవితాన్ని త్యజించాడు. 

అప్పుడు ఆయన ఈ ఆలయంలో మోక్షం కోసం శివుడిని ప్రార్థించగా, సరైన సమయంలో మోక్షం లభిస్తుందని శివుడు ఆయనకు వాగ్దానం చేశాడు.


💠 ఈ తిరువెంకాడర్ అప్పుడు పట్టినాథర్ అనే పేరును స్వీకరించి , తమిళకంలోని వివిధ ఆలయాలకు ప్రయాణించి, చివరకు తన చివరి రోజులలో తిరువొట్రియూర్‌లో ముక్తిని పొందే ముందు చెన్నైకి వచ్చారు .


💠 ఈ ఆలయాన్ని స్థానికంగా పట్టినాథర్ ఆలయం అని కూడా పిలుస్తారు. 

ఈ ఆలయంలో పట్టినాథర్‌కు ప్రత్యేక మందిరం ఉంది. 

ఈ ఆలయంలో కుబేరుడు పూజలు చేశాడని నమ్ముతారు, మరియు పట్టినాథర్‌ను ఆయన పునరావతారంగా భావిస్తారు. 


💠 ఈ ఆలయ బ్రహ్మోత్సవం, అడియార్ ఉత్సవం , శివునికి కాకుండా పట్టినాథర్‌కు ( పట్టినాథర్ తిరువిళా ) జరుపుకుంటారు.


💠 ఈ ఆలయంలో ఒక ప్రత్యేకమైన నవగ్రహ అమరిక ఉంది , దీనిలో నవగ్రహాలన్నీ పడమర వైపు, అంటే శివుని వైపు తిరిగి ఉంటాయి. కోష్టంలో రెండు దుర్గా విగ్రహాలు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి మాత్రమే మహిషాసురునిపై నిలబడి కనిపిస్తుంది. చండికేశ్వరుని ప్రత్యేక మందిరంలో ఆయనతో పాటు చండికేశ్వరి కూడా కొలువై ఉన్నారు.


💠 ఈ ఆలయంలో ఉన్న మురుగన్ విగ్రహం మొదట తిరుచెందూరులో ఉండేదని , 1648లో డచ్ నావికులు దానిని దొంగిలించారని, ఆ తర్వాత ఇక్కడికి సమీపంలో సముద్రంలో తిరిగి లభించిందని చెబుతారు. ఆసక్తికరంగా, మురుగన్ వాహనమైన నెమలి ఈ ఆలయం వెలుపల లేదు.


💠 కావేరీ నది ఈ ప్రదేశానికి సమీపంలోనే సముద్రంలో కలుస్తుంది, అందుకే ఈ ప్రదేశానికి కావేరి పుహుం పట్టినం అని పేరు వచ్చింది. 

ఈ ప్రదేశం యొక్క ప్రస్తుత పేరు పూంపుహార్.


💠 ఈ ఆలయానికి ప్రధాన వినాయకుడు అనుగ్నై వినాయకుడు. 

గర్భగుడిలోని శివలింగం పెద్దదిగా ఉంటుంది.

గాలవ మహర్షి ఇక్కడ పూజలు చేశారు. పట్టినాథర్ మహర్షి ఉత్తరం వైపు ముఖం చేసి ఒక ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు. 


💠 ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాన్ని శివునికి కాకుండా కేవలం పట్టినాథర్కు మాత్రమే జరుపుకుంటారు, దీనిని భక్తుని పండుగ అని అర్థం వచ్చే 'అడియార్ ఉత్సవ్' అని పిలుస్తారు. 

అలాగే, ఈ ఆలయంలో ధ్వజస్తంభం- కొడిమరం లేదు.


💠 పట్టినాథర్ ఉత్సవాన్ని ఆషాఢ మాసంలో (జూలై-ఆగస్టు) 12 రోజుల పాటు జరుపుకుంటారు. 

ఈ ఉత్సవంలో 10 రోజున, శివుడు పట్టినాథర్ మహర్షికి మోక్షం ప్రసాదించిన సంఘటనను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.


💠 మే-జూన్ లో వైకాసి విశాఖం మరియు జూలై-ఆగస్టులో ఆది పట్టినాథర్ విజా ఈ ఆలయంలో జరుపుకునే పండుగలు.


💠 ప్రజలు వివేకవంతులైన పిల్లలు కలగాలని, వైరాగ్య గుణం పెంపొందించుకోవాలని పల్లవనాథ స్వామిని ప్రార్థిస్తారు.


💠 ఈ ఆలయం సిర్కాళి నుండి సుమారు 19 కి.మీ. దూరంలో ఉంది.


రచన


©️ Santosh Kumar

కలియుగంలో

 *కలియుగంలో ఎలా ఉండాలి?*  


 

*​మంచితనం - అమాయకత్వం కాకూడదు*: కలియుగంలో కేవలం మంచి మనసు ఉంటే సరిపోదు, దానితో పాటు పదునైన బుద్ధి కూడా ఉండాలి. దయ చూపాలి కానీ అది మనల్ని బలహీనులను చేసేంతగా ఉండకూడదు.

​ప్రతి ఒక్కరినీ অন্ধంగా నమ్మకూడదు: అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. కొందరు స్నేహం కోసం కాకుండా స్వార్థం, సమాచారం లేదా మన బలహీనతలను తెలుసుకోవడానికి వస్తారు 


*​బలహీనతలను అందరితో పంచుకోకూడదు*: మన బాధలు, భయాలు మరియు రహస్యాలను ప్రతి ఒక్కరితో పంచుకుంటే, అవి ఇతరుల చేతిలో ఆయుధాలుగా మారే ప్రమాదం ఉంది.


*​పరీక్షా సమయంలోనే నిజమైన బంధాలు తెలుస్తాయి:* సుఖంలో మన చుట్టూ తిరిగేవాళ్ళు కాకుండా, కష్ట సమయంలో నిలబడేవారే నిజమైన మిత్రులు మరియు బంధువులు.


*​చెడ్డవాడిగా మారడం కాదు, జాగ్రత్తగా ఉండడం ముఖ్యం:* ఇతరులను చూసి మనం చెడ్డవారిగా మారాల్సిన అవసరం లేదు, కానీ ఇతరుల మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా, బలంగా మరియు వివేகంగా మారడమే .

కళ్లు చెదిరే నిజం

   *మనసుని కదిలించే కళ్లు చెదిరే నిజం, చదివిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు... నీ డబ్బు ఎక్కడకు పోతుంది?!*

భారతదేశంలో మొత్తం 4120 మంది ఎమ్మెల్యేలు మరియు 462 ఎమ్మెల్సీలు అంటే మొత్తం 4,582 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఒక్కో ఎమ్మెల్యే జీతభత్యంతో కలిపి నెలకు 2 లక్షలు ఖర్చు చేస్తారు.వేరే పదాల్లో నెలకు 91 కోట్ల 64 లక్షల రూపాయలు. 


దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 1100 కోట్ల రూపాయలు.


భారతదేశంలో లోక్‌సభ మరియు రాజ్యసభతో కలిపి మొత్తం 776 మంది ఎంపీలు ఉన్నారు.


ఈ ఎంపీలకు జీతం భత్యంతో కలిపి నెలకు 5 లక్షలు ఇస్తారు.అంటే మొత్తం ఎంపీల జీతం నెలకు 38 కోట్ల 80 లక్షలు. 


ఇక ప్రతి సంవత్సరం ఈ ఎంపీలకు జీత భత్యం కింద రూ.465 కోట్ల 60 లక్షలు ఇస్తారు.


అంటే,భారతదేశంలోని ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి సంవత్సరం 15 వేలకోట్ల 65 కోట్ల 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


ఇది వారి ప్రాథమిక వేతనం మరియు భత్యానికి సంబంధించిన విషయం.వారి నివాసం, జీవనం,ఆహారం,ప్రయాణ భత్యం,చికిత్స,విదేశీ విహారయాత్రలు మొదలైన వాటి ఖర్చు కూడా దాదాపు అదే.


అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల కోసం దాదాపు 30 వేలకోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.


ఇప్పుడు వారి భద్రతలో మోహరించిన భద్రతా సిబ్బంది జీతాన్ని పరిగణించండి.


ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు అంగరక్షకులు మరియు ఒక సెక్షన్ హౌస్ గార్డు అంటే కనీసం 5 మంది పోలీసులు, అంటే మొత్తం 7 మంది పోలీసులు భద్రత కల్పిస్తారు.


7 పోలీసుల జీతం సుమారుగా (నెలకు రూ. 35,000 చొప్పున) రూ. 2 లక్షా 45 వేలు.


దీని ప్రకారం 4582 మంది ఎమ్మెల్యేల భద్రతకు వార్షిక వ్యయం ఏడాదికి 9 వేలకోట్ల 62 కోట్ల 22 లక్షలు.


అదే విధంగా ఎంపీల భద్రత కోసం ఏటా 164 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.


జెడ్ కేటగిరీ భద్రతా నాయకులు,మంత్రులు, ముఖ్యమంత్రులు,ప్రధాన మంత్రుల భద్రత కోసం దాదాపు 16000 మంది సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించారు.


దీని కోసం మొత్తం వార్షిక వ్యయం రూ.776 కోట్లు.


ఇలా ప్రతి ఏటా దాదాపు 20 వేలకోట్ల రూపాయలు పాలక నేతల భద్రతకు వెచ్చిస్తున్నారు.


*అంటే ఏటా కనీసం 50 వేలకోట్ల రూపాయలు రాజకీయ నాయకుల కోసం ఖర్చు చేస్తున్నారు.*


ఈ ఖర్చులలో గవర్నర్ ఖర్చులు,మాజీ నాయకులు,పార్టీ నాయకులు,పార్టీ అధ్యక్షుల పెన్షన్,వారి భద్రత మొదలైనవి ఉండవు.


అది కూడా కలుపుకుంటే మొత్తం ఖర్చు దాదాపు 100 బిలియన్ రూపాయలు అవుతుంది.


ఇప్పుడు ఆలోచించండి. మనం ప్రతి సంవత్సరం రాజకీయ నాయకుల కోసం 100 బిలియన్ రూపాయల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నాము, పేద ప్రజలకు ప్రతిఫలంగా ఏమి లభిస్తుంది?


ఇది ప్రజాస్వామ్యమా?


(ఈ 100 బిలియన్ రూపాయలు మన భారతీయుల నుండి మాత్రమే పన్నుగా వసూలు చేయబడి ఉండేది.)


ఇక్కడ కూడా సర్జికల్ స్ట్రైక్ జరిగింది.భారతదేశంలో రెండు చట్టాలు చేయాలి.


→మొదటిది - ఎన్నికల ప్రచారంపై నిషేధం

నాయకులు టెలివిజన్ (టీవీ) ద్వారా మాత్రమే ప్రచారం చేయాలి.


→ రెండవది - నాయకుల జీతాలు మరియు అలవెన్సులపై నిషేధం

అప్పుడు దేశభక్తి చూపండి.


ప్రతి భారతీయుడు ఈ వ్యర్థ వ్యయానికి వ్యతిరేకంగా మాట్లాడాలి.


*ఈ సందేశాన్ని వీలైనన్ని ఎక్కువ Facebook మరియు WhatsApp సమూహాలకు ఫార్వార్డ్ చేయడం ద్వారా మీ దేశభక్తిని పరిచయం చేసుకోండి.*


దయతో

గౌరవనీయులైన ప్రధానమంత్రి మరియు ముఖ్యమంత్రి,

దయచేసి అన్ని *ప్లానింగ్* ఆపండి.


*ప్రతి పది కిలోమీటర్లకు పార్లమెంట్ హౌస్ లాంటి క్యాంటీన్ తెరవండి.*


తగాదాలన్నీ అయిపోయాయి.


*మీకు రూ.29కే ఫుల్ మీల్ లభిస్తుంది..*


80% ప్రజల కోసం,ఇంటిని నడిపే పోరాటం ముగిసింది.


సిలిండర్,రేషన్ తీసుకురావడం లేదు


మరియు ఇంటి ఆడపడుచు కూడా సంతోషంగా ఉంది.చుట్టూ ఆనందం ఉంటుంది. అప్పుడు అందరి మద్దతు, అందరి అభివృద్ధి అంటాం.


*అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే మీరు 1 కిలోల గోధుమలు చెల్లించాల్సిన అవసరం లేదు.*


*మధ్యతరగతి ప్రజలు తమ సొంత మార్గంలో తమ ఇంటిని నడపాలని ప్రధాన మంత్రి గారు చెప్పనవసరం లేదు.*


దీనిని పరిశీలించండి.


దయచేసి కష్టపడి సంపాదించిన ఈ సమాచారాన్ని దేశంలోని ప్రతి పౌరునికి అందించడానికి ప్రయత్నించండి.


అది అహంకారమా లేక మోసమా....


భారతదేశంలో ఆహార పదార్థాలు అతి తక్కువ ధరకు లభించే ప్రదేశం ఒక్కటే.

టీ = 1.00

sup = 5.50

పప్పు = 1.50

ఆహారం = 2.00

చపాతీ = 1.00

చికెన్ = 24.50

దోస = 4.00

బిర్యానీ=8.00

చేప = 13.00

ఈ వస్తువులన్నీ పేదలకు మాత్రమే మరియు ఇవన్నీ భారత పార్లమెంటు క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్నాయి.


మరియు ఆ *పేద ప్రజల జీతం నెలకు 1 లక్ష 80,000 రూపాయలు మరియు అది కూడా ఆదాయపు పన్ను లేకుండా.*


మీ మొబైల్‌లో సేవ్ చేయబడిన అన్ని నంబర్‌లను ఫార్వార్డ్ చేయండి,తద్వారా అందరికీ తెలుసు…

రోజుకు 30 లేదా 32 రూపాయలు సంపాదించేవాడు పేదవాడు కాదని వారు భావించడానికి కారణం అదే.


*జోక్స్ ప్రతిరోజూ ఫార్వార్డ్ చేయ బడతాయి,ఈ రోజు కూడా ఫార్వార్డ్ చేయబడతాయి మరియు భారతదేశ ప్రజలకు అవగాహన కల్పించండి.*


 *సేకరణ.పవర్ ఆఫ్ ఆర్టీఐ... నిర్మలా రవీంద్రారెడ్డి..Advovate,High Court.*

బుధవారం రాశి ఫలితాలు

  శ్రీ మాత్రేనమః 🙏

శ్రీ గురుభ్యోనమః 🙏

09-09-2026 బుధవారం రాశి ఫలితాలు


మేషం


వ్యాపారమున సొంత నిర్ణయాలతో లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగమున అధికారుల అనుగ్రహం పొందుతారు.చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి.     

---------------------------------------


వృషభం


ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో వివాదాలు మానసికంగా చికాకుగా కలిగిస్తాయి. దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపార, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి తప్పదు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టించినా ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.  

---------------------------------------


మిధునం


వృత్తి వ్యాపారాలలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగమున పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభించదు. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు పడకూడదు.  

---------------------------------------


కర్కాటకం


స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  

---------------------------------------


సింహం


ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. భాగస్వామితో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. 

---------------------------------------


కన్య


ఉద్యోగమున ఉన్నతాధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. విద్యార్థుల శ్రమ ఫలించదు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో వివాదాలు తప్పవు.

---------------------------------------


తుల


ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. బంధువులతో అకారణ వివాదాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు.

---------------------------------------


వృశ్చికం


పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

---------------------------------------


ధనస్సు


సోదరులతో స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.  

---------------------------------------


మకరం


విలువైన వస్తు వాహన లాభాలు పొందుతారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలను అందుకుంటారు.     

---------------------------------------


కుంభం


వ్యాపార ఉద్యోగాలలో ఊహించని సమస్యలు తప్పవు. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులతో విభేదాలు తప్పవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.   

---------------------------------------


మీనం

 

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. బంధు మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.   

---------------------------------------

కాలం - అనుకూలం*

 *కాలం - అనుకూలం*

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)

卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐

🌟 సెప్టెంబరు 09 2026 🌟

శ్రీ పరాభవ నామ సంవత్సరం

దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము కృష్ణ పక్షం



తిథి: *త్రయోదశి  ప.11.55 కు* తదుపరి *చతుర్దశి 9 ప.11.55 కు*

వారం: *సౌమ్యవారము (బుధవారం)*

నక్షత్రం: *ఆశ్లేష ప.3.49 కు* తదుపరి *మఖ మ. 2.52 కు*

యోగం: *శివ రా.9:51 కు* తదుపరి *సిద్ధ 10 రా.7:17 కు*

కరణం: *వణిజ మ.12:31 కు, విష్టి రా. 11.30 కు* తదుపరి *శకుని 10 ఉ.10:33 కు*

రాహుకాలం: *మ. 12.00 - 01.30 కు*

దుర్ముహూర్తం: *ఉ. 11.49 - 12.37 కు*

వర్జ్యం: *తె.5.13 -6.43 కు*

అమృతకాలం: *మ. 1.42 - 3.12 కు*

సూర్యోదయం: *ఉ. 6.07 కు*

సూర్యాస్తమయం: *సా. 6.20 కు*


🕉️ *మాసశివరాత్రి* 🕉️


*గురుబోధ:*

🕉️శివపత్రి లేదా శివ నిర్మాల్యం ఏమి చేయాలి?

శివుని ఆలయలంలో ఇచ్చిన పత్రి నందీశ్వరుని మీద పెట్టాలి. ఎందుకంటే అది మహా శక్తిమంతమైనది, దానిని మోసే శక్తి మనకి లేదు. అందుకే ఈశ్వరుని మీద పెట్టిన బిల్వపత్రమో, దళమో, పుష్పమో మనకిస్తే అవి కళ్ళకద్దుకుని వినయముగా నందీశ్వరుని మీద పెట్టాలి. శివ ప్రసాదాన్ని పొరపాటున కూడా తిరస్కరించకూడదు. కనీసం ఒక్క మెతుకైనా తీసుకోమన్నారు. పండు ఇస్తే, తీర్థమిస్తే కొంచమైనా దానిని స్వీకరించమన్నారు. కొబ్బరికాయ విషయంలో మాత్రం పూర్తిగా అర్చకస్వామిదే బాధ్యత. శివాలయంలో కొట్టిన కొబ్బరికాయ రెండు చిప్పలు అర్చకస్వామివే. ఆయన తనంత తాను ఇస్తేనే మనం పుచ్చుకోవాలి. ఒకవేళ ఇవ్వకుంటే మనం అడిగి తీసుకోకూడదు. తక్కిన ఆలయములలో ఒక చిప్ప మనం అడిగి పుచ్చుకోవచ్చు.  - శ్రీ శివమహాపురాణం


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

🌷 *బుధవారం*🌷 *🪷09సెప్టెంబర్26🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

  *🪷09సెప్టెంబర్26🪷*  

   *దృగ్గణిత పంచాంగం*    

                 

        *ఈనాటి పర్వం* 

  *🕉️మాస శివరాత్రి🕉️* 


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : త్రయోదశి* మ 12.30 వరకు ఉపరి *చతుర్దశి*

*వారం    : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : ఆశ్లేష* మ 03.14 వరకు ఉపరి *మఖ*

*యోగం  : శివ* రా 09.52 వరకు ఉపరి *సిద్ధ*

*కరణం   : వణజి* మ 12.30 *భద్ర* రా 11.29 ఉపరి *శకుని*

*సాధారణ శుభ సమయాలు:*

 *ఉ09.00-10.00 సా04.00-05.00*

అమృత కాలం  : *మ 01.43 - 03.13*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం          : శేషం ఉ 06.12 & రా 02.39 - 04.10 తె*

*దుర్ముహూర్తం : ప 11.40-12.29*

*రాహు కాలం  :మ12.05 - 01.37*

గుళికకాళం      : *ఉ 10.32 - 12.05*

యమగండం    : *ఉ 07.27 - 09.00*

సూర్యరాశి : *సింహం*                 

చంద్రరాశి : *కర్కాటకం/సింహం*  

సూర్యోదయం :*ఉ 06.03*  

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం     : *ఉ 05.55 -08.23*

సంగవ కాలం      :*08.23 - 10.51*

మధ్యాహ్న కాలం    : *10.51 - 01.19*

అపరాహ్న కాలం  : *మ 01.19- 03.46*

*ఆబ్ధికం తిధి     : శ్రావణ బహుళ చతుర్దశి*

సాయంకాలం    :*సా 03.46- 06.14*

ప్రదోష కాలం    :*సా 06.14 - 08.34*

రాత్రి కాలం        :*రా 08.34 - 11.41*

నిశీధి కాలం       :*రా 11.41 - 12.29*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌷 *ఓం సరస్వత్యై  నమః* 🌷


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🪷🪷🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌷🌷🍃🌷

🌹🌷🪷🪷🪷🪷🌷🌹

పంచాంగం 09.09.2026 Wednesday,

  ఈ రోజు పంచాంగం 09.09.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష త్రయోదశి తిథి సౌమ్య వాసర ఆశ్రేష నక్షత్రం శివ యోగః వణిజ తదుపరి భద్ర కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి : చతుర్దశి 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ ।

జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ।। 5 ।।



ప్రతిపదార్థ:



అపరా — నిమ్నమైన; ఇయం — ఈ యొక్క; ఇతః — దీనికంటే; తు — కానీ; అన్యాం — వేరైన; ప్రకృతిం — శక్తి; విద్ధి — తెలుసుకొనుము; మే — నా యొక్క; పరామ్ — ఉన్నతమైనది; జీవ-భూతాం — ప్రాణులు; మహా-బాహో — గొప్ప బాహువులు కలవాడా; యయా — ఎవరిచే; ఇదం — ఈ యొక్క; ధార్యతే — ఆధారము; జగత్ — భౌతిక జగత్తు.



తాత్పర్యము:


 

ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కల అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ శక్తి (ఆత్మ శక్తి), అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది.



వివరణ:


తన భక్తి శతకంలో, ఈ విషయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారు:


జీవు, మాయా దుఇ శక్తి హైఁ, శక్తిమాన్ భగవాన్

శక్తిహిఁ భేద్ అభేద్ భీ, శక్తిమాన్ తే జాన్


(భక్తి శతకము, 42వ శ్లోకము)


‘జీవాత్మ మరియు మాయ రెండూ కూడా భగవంతుని శక్తులే. కాబట్టి, అవి రెండూ భగవంతునికి అభేదమే మరియు భగవంతుని కంటే వేరు కూడా.’


శక్తులు మరియు శక్తిమంతుడు ఒకటే అన్న దృక్పథంతో, సమస్త జగత్తు కూడా భగవంతుని కంటే అభేదమే. ఈ విధంగా, సమస్త జగత్తు యదార్థ భగవత్ స్వరూపమే అని చెప్పబడింది.


సర్వం ఖల్విదం బ్రహ్మ (ఛాందోగ్య ఉపనిషత్తు 3.14.1)

‘సర్వం బ్రహ్మమే.’


ఈశావాస్యం ఇదం సర్వం (ఈశోపనిషత్తు 1)

‘ఈ జగత్తులో ఉన్నదంతా బ్రహ్మమే.’


పురుష ఏవేదం సర్వం (శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3.15)

‘ఉన్నదంతా ఆ సర్వోన్నతమైన దివ్య మంగళ స్వరూపమే’


ఇవన్నీ వేద మంత్రములు కూడా, ఉన్నది ఒక్కడే భగవంతుడు, మరివేరే ఇతరమైనది ఏదీ లోకంలో లేదు అని పేర్కొంటున్నాయి. అదే సమయంలో, శక్తి మరియు శక్తిమంతుడుకి ఉన్న భిన్నత్వం పరంగా, ఈ ఏకత్వం లోనే బ్రహ్మాండమైన వైవిధ్యం కూడా ఉంది, అని మనం అర్థం చేసుకోవచ్చు. జీవాత్మ వేరు; పదార్థం వేరు; భగవంతుడు వేరు. పదార్థం అచేతనమైనది (జడమైనది), అదే సమయంలో ఆత్మ చైతన్యవంతమయినది, కానీ భగవంతుడు సర్వోత్కృష్ట చైతన్యవంతమై ఉండి, ఆయనే సమస్త పదార్థద్రవ్యములకు, ఆత్మలకు రెంటికీ మూల ఉత్పత్తిస్థానము. సృష్టిలో ఉన్న మూడు అస్తిత్వాల గురించి చాలా వేద మంత్రములు చెప్తున్నాయి:


క్షరం ప్రధానమమృతాక్షరం హరః


క్షరాత్మానావీషతే దేవ ఏకః

తస్యాభిధ్యానాద్ యోజనాత్ తత్త్వభావద్


భూయశ్చాంతే విశ్వమాయానివృత్తిః


(శ్వేతాశ్వతర ఉపనిషత్తు 1.10)


 


‘మూడు అస్తిత్వాలు ఉన్నాయి: 1) పదార్థము/ద్రవ్యము, ఇది నశించేది. 2) జీవాత్మలు, ఇవి నాశము లేనివి. 3) భగవంతుడు, ఈయన పదార్థము మరియు ఆత్మ లను కూడా నియంత్రించే వాడు. భగవంతుని పై ధ్యానం చేయటం వలన, ఆయనతో ఏకమవటం వలన మరియు ఆయనలా అవటం వలన, ఆత్మ, ఈ ప్రపంచపు మాయ నుండి స్వేచ్ఛ పొందుతుంది.’


అద్వైత మరియు ద్వైత మంత్రముల రెంటినీ కూడా వేదములు అర్థవివరణచేయటం మనం గమనించవచ్చు. జగద్గురు శ్రీ క్రుపాలు జీ మహారాజ్, ఈ ఆత్మ-పరమాత్మల ఏకకాల అచింత్య భేదాభేద వాదననే బలపరిచాడు.