31, ఆగస్టు 2026, సోమవారం

31ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹31ఆగష్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                       

         *ఈనాటి పర్వం*    

              *ప్రధాన* 

     *సంకష్టహర చతుర్థి*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : తదియ* ఉ 08.50 వరకు ఉపరి *చవితి*

*వారం   :సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : రేవతి* రా 03.23 వరకు ఉపరి *అశ్విని*

*యోగం  : గండ* రా 01.51 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం   : భద్ర* ఉ 08.50 *బవ* రా 08.19 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-07.00&11.00- 12.00*

అమృత కాలం  : *రా 01.01 - 02.36*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం       : మ 03.34 - 05.08*

*దుర్ముహూర్తం  : మ 12.33 - 01.22 & 03.02 - 03.52*

*రాహు కాలం: ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.41 - 03.14*

యమగండం    : *ఉ 10.34 - 12.08*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మీనం* 

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 05.5 -08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.22*

అపరాహ్న కాలం : *మ 01.22- 03.52*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ చవితి*

సాయంకాలం   : *సా 03.52 - 06.21*

ప్రదోష కాలం     : *సా 06.21 - 08.40*

రాత్రి కాలం       : *రా 08.40 - 11.45*

నిశీధి కాలం      :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

భగవద్గీత

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।

అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।



ప్రతిపదార్థ:


 

ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.



తాత్పర్యము: 



అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.



వివరణ:


ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది.


ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.

పంచాంగం 31.08.2026 Monday,

 ఈ రోజు పంచాంగం 31.08.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష తృతీయ తిథి ఇందు వాసర రేవతి నక్షత్రం గండ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: చతుర్థి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత-

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।



ప్రతిపదార్థ:



తపస్విభ్యః — తపస్విల కన్నా; అధికః — ఉన్నతమైన వాడు; యోగీ — ఒక యోగి; జ్ఞానిభ్యః — జ్ఞానవంతుల కన్నా; అపి — కూడా; మతః — పరిగణించబడును; అధికః — ఉన్నతమైనది; కర్మిభ్యః — కర్మ కాండలు చేసే వారి కన్నా; చ — మరియు; అధికః — ఉన్నతమైనది; యోగీ — ఒక యోగి; తస్మాత్ — కాబట్టి; యోగీ — ఒక యోగి; భవ — అయిపో; అర్జున — అర్జునా.



తాత్పర్యము: 


ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.



వివరణ:


 తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరిక నిష్ఠలు విధించుకొని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని, అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మీ అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్విల యొక్క లక్ష్యం భౌతిక వస్తువిషయ ప్రాప్తి; వారు ఇప్పటికీ శారీరిక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి, భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు, భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది మరియు యోగి వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.

30, ఆగస్టు 2026, ఆదివారం

మహాభారతంలోనిశల్య వృత్తాంతం

 *🌸మహాభారతంలోనిశల్య వృత్తాంతం

శల్యుడు


 మద్రదేశానికి రాజు.ఇతడు నకులుడు మరియు సహదేవునికి మేనమామ.పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరినప్పుడు,దుర్యోధనుడు మార్గమధ్యంలో అతిథి సత్కారాలు చేయించి,అవి తానే చేయించినవని తెలియకుండా శల్యుని మెప్పించాడు.సంతోషించిన శల్యుడు కోరిన వరం ఇస్తానని మాట ఇచ్చాడు.అప్పుడు దుర్యోధనుడు తన పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలని కోరాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు కౌరవుల పక్షాన చేరాడు.

కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడు ఎంతో పరాక్రమంతో పోరాడాడు.ముఖ్యంగా కర్ణునికి సారథిగా వ్యవహరించాడు.అయితే శల్యుడు పాండవుల పట్ల అంతరంగంలో సానుభూతి కలిగి ఉండేవాడు.అందువల్ల కర్ణుని ఉత్సాహాన్ని తగ్గించే విధంగా మాటలు చెప్పేవాడు.కర్ణుడు,అర్జునుడు తలపడిన సమయంలో కూడా శల్యుడు కర్ణునికి పూర్తిగా సహకరించలేదు.చివరకు కర్ణుడు మరణించిన తరువాత,దుర్యోధనుడు శల్యునిని కౌరవ సేనకు సేనాధిపతిగా నియమించాడు.

యుద్ధం చివరి దశలో ధర్మరాజు శల్యునితో భీకరంగా యుద్ధం చేశాడు.ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరిగింది.చివరకు ధర్మరాజు తన శక్తివంతమైన ఆయుధంతో శల్యుని సంహరించాడు.ఈ విధంగా మహాభారత యుద్ధంలో శల్యుడు ఒకవైపు గొప్ప వీరుడిగా,మరోవైపు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.కర్ణునికి సారథిగా అతని పాత్ర,ధర్మరాజుగారి చేతిలో అతని మరణం శల్య వృత్తాంతంలో ముఖ్యమైన ఘట్టాలు.

 *మహాభారత పాత్ర (శల్యుడు):* మద్ర దేశాధిపతి,మాద్రికి సోదరుడు (నకుల సహదేవుల మేనమామ).కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున కర్ణుడికి రథసారథిగా వ్యవహరించి,తన మాటలతో కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.దీని నుంచే *"శల్య సారథ్యం"* అనే జాతీయం వాడుకలోకి వచ్చింది


సేకరణ

శ్రీమద్భాగవతం - 35/42*

 


*శ్రీమద్భాగవతం - 35/42* 


*మధురా ప్రవేశం మరియు కంస సంహారం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరానికి బయలు దేరాడు ఈరోజు మధురా ప్రవేశం కంస సంహారం జరుగుతుంది.


1. మధురా నగర ప్రవేశం & భక్తుల అనుగ్రహం


రామకృష్ణులు నందాది గోపబాలురు మధురా నగరం దగ్గర గల ఉపవనం లో బస చేసారు, ఇష్టం లేకపోయినా అక్రూరుడు కృషుణ్ణీ వీడి ముందుగా నగరంలోకి వెళ్ళి కంసునికి విషయం తెలియచేసి తన నివాసానికి వెళ్ళాడు.


ఆ తర్వాత రోజు నగర సౌందర్యం చూడటానికి గోపాలురు, బల రామకృష్ణులు నగరంలోకి ప్రవేశించారు.ఇన్ని రోజులు 

ఆ నగర వనితలు కృష్ణభగవానుని లీలామహత్త్వములను గూర్చి పదేపదే వినుచు ఆయన దర్శనమునకై తమ మనస్సులలో ఎంతో తహతహపడుచుండిరి. ఇప్పుడు ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటతోవారిలో సంతోషము పొంగులువారింది.ఆనందంతో నగర స్త్రీలంతా మేడలపైకి ఎక్కి వారిపై పూలవాన కురిపించారు.


గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానందదాయకులైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో అని తమలో తాము అనుకున్నారు.


ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికేవాడు, వాటికి రంగులు అద్దె వాడైన ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను- “మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము”.అన్నాడు


కానీ కంసుని రాజవస్త్రాలు ఉతికే ఆ చాకలివాడు (రజకుడు) అహంకారంతో అడవులలో, గుట్టల్లో తిరిగే గోపాలులారా మీకు మేలైన వస్త్రాలు కావాలా, కళ్ళు నెత్తికి ఎక్కాయా ఇవి రాజులు ధరించే వస్త్రాలు అంటూ యుక్తాయుక్తములు మరచి ఇష్టారీతిన పలుకుతూ 

అవమానించగా కృష్ణుడు అరచేతి దెబ్బతో వాడి శిరస్సును ఖండించాడు. 


ఇతర సేవకులు ఉత్తమ వస్త్రాలను అందించగా, దర్జీవాడు (వాయకుడు) వాటిని రామకృష్ణులకు తగినట్లు కుట్టి అలంకరించి భగవదనుగ్రహం పొందాడు.


*సుదాముడనే మాలాకారుడు*

అనంతరం బలరామ కృష్ణులు పూల వ్యాపారియైన సుదాముడు ఇంటికి వెళ్ళారు.అతను రామకృష్ణులను భక్తితో తన ఇంటికి ఆహ్వానించి, దివ్యమైన పూలమాలలతో పూజించి సాష్టాంగ నమస్కారం చేసి సేవించాడు. స్వామి ఆయనకు అచంచల భక్తిని, వంశాభివృద్ధిని వరంగా ఇచ్చాడు.


*కుబ్జ (త్రివక్ర)కు సౌందర్య ప్రదానం*

శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిదప రాజమార్గం గుండా సాగిపోవుతూ ఒక యువతిని చూసాడు.


ఆమె మూడు వంకర్లు తిరిగిన శరీరంతో (కుబ్జ), కంసునికి సుగంధ లేపనాలు తీసుకువెళ్తున్న 'సైరంధ్రి' అనే యువతి. కృష్ణుడు ఆమెను ఆపి చందనం అడిగాడు. ఆమె పరవశించి తన వద్దనున్న దివ్య చందనాన్ని రామకృష్ణులకు పూసింది. కృష్ణుడు ఆమె కాలి బొటనవేలుపై తన పాదం ఉంచి, గడ్డం కింద రెండు వేళ్లు పెట్టి పైకి ఎత్తగానే... ఆమె వంకరలు అన్నీ పోయి అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది. శ్రీకృష్ణునీ ఆమె గృహానికి రమ్మనగా ఆమెను సమాధాన పరచి ముందుకు సాగుతూ ధనుర్యాగ స్థానం తెలుసుకుని అందులో ప్రవేశించాడు.


2. శివ ధనుర్భంగం


కంసుడు ఏర్పాటు చేసిన 'ధనుర్యాగ' శాలకు రామకృష్ణులు వెళ్లారు. అక్కడ పూజలందుకుంటున్న మహా భయంకరమైన, ఇంద్రధనుస్సు వంటి శివధనుస్సును చూశారు.


అనేకమంది కావలిభటులు వారిస్తున్నా వినకుండా, శ్రీకృష్ణుడు ఆ భారీ ధనుస్సును సమీపించి ఒక చిన్న చెరకుగడను విరిచినట్లు అలవోకగా ఎత్తి నారి సంధించి మధ్యకు విరిచివేశాడు!


* **కంసుని భయం:** 

ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన భయంకర శబ్దానికి మధురా నగరమే కంపించింది.కంసుని గుండెలు పగిలినంత పనైంది. ధనుస్సును కాపలా కాస్తున్న సైనికులు రామకృష్ణులపై దాడి చేయగా, విరిగిన ధనుస్సు ముక్కలతోనే వారిని సంహరించి రామకృష్ణులు సాయంత్రానికి నగరం వెలుపల ఉన్న తమ శిబిరానికి చేరుకున్నారు.


3. కువలయాపీడ గజ సంహారం & రంగాగ్ర ప్రవేశం

బలరామ కృష్ణులు అవలీలగా ధనుస్సు విరిచి, బటులను సంహరించిన సంగతి విన్నది మొదలు కంసుడి భయం రెట్టింపు అయినది,ఆ రాత్రి నిద్రకూడా పట్టలేదు, కనులు మూసిన తెరచిన మృత్యువును సూచించే అపశకునాలే కనపడ్డాయి. ఎలాగో ఆ రాత్రి గడిచింది.


మరుసటి రోజు ఉదయం కంసుడు మల్లయుద్ధ రంగాన్ని సిద్ధం చేసి, సింహాసనంపై కూర్చున్నాడు. రంగద్వారం వద్ద రామకృష్ణులను తొక్కించి చంపడానికి **'కువలయాపీడము'** అనే మదపుటేనుగును మావటివానితో నిలబెట్టాడు.


శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతః కాలస్నానాది విధులను నిర్వర్తించుకొని.మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.రంగస్థల ద్వారం దగ్గరకు రాగానే అక్కడ కువలయా పీడం అనే ఏనుగును చూసాడు కృష్ణుడు 


గజ సంహారం:ఆ ఏనుగు కృష్ణునిపైకి మావటి ప్రేరణతో దూసుకురాగా, స్వామి దాని తోకను పట్టుకుని తిప్పి, దాని దంతాలను పెకిలించి ఆ దంతంతోనే ఏనుగును, మావటివాడిని సంహరించాడు.


రక్తసిక్తమైన ఏనుగు దంతాన్ని భుజాన ధరించి రామకృష్ణులు మల్లరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నవారికి రకరకాల భావాలతో దర్శనమిచ్చాడు:


మల్లురకు **వజ్రాయుధంలా**, పురుషులకు **నరశ్రేష్ఠుడిగా**, స్త్రీలకు **మన్మథునిగా**, గోపాలురకు **మిత్రుడిగా**, కంసునికి **సాక్షాత్తు మృత్యువులా**, యోగులకు **పరతత్త్వంగా** కనిపించాడు.


4. చాణూర-ముష్టిక వధ & కంస సంహారం

కంసుడు ఎంతో దైర్యం కలవాడే కానీ, అత్యంత శక్తివంతమైన కువలయా పీడం కూడా కృష్ణునీ చేతిలో మడిసిపోవడంతో అతనిలో భయం రెట్టింపు అయినది.


అప్పుడు ప్రసిద్ధ మల్ల యోధులు అయిన చానూర, ముష్టికులను బలరామకృష్ణులతో మల్ల యుద్ధానికి ఉసి గోల్పెల చేయమని ఆదేశించాడు.


ప్రసిద్ధ మల్లురైన చాణూరుడు కృష్ణునితో, ముష్టికుడు బలరామునితో మల్లయుద్ధానికి దిగారు.


* **మల్లయుద్ధం:** చిన్న బాలురతో భారీకాయులైన రాక్షసులు పోరాడటం చూసి సభలోని స్త్రీలు "ఇది అధర్మం" అని బాధపడ్డారు. కానీ శ్రీకృష్ణుడు చాణూరుని చేతులను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు. బలరాముడు ముష్టికుడిని పిడిగుద్దులతో చంపేశాడు. కూటుడు, తోశలకుడు మొదలైన ఇతర రాక్షస మల్లురంతా సంహరించబడ్డారు.ప్రాణములమీది తీపిచే, బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో మిగతా మల్లురు పిక్కబలము చూపిరి.  


ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యము లొనర్చిరి. అప్పుడు వారి కాలి అందెల రవళులు మధురముగా నినదించెను. 


* **కంస వధ:** 

ఇది చూసి భయపడిన కంసుడు పిచ్చివాడిలా లేచి: "ఈ బాలురను నగరం నుండి వెళ్ళగొట్టండి! నందుని సంపదను లాక్కోండి! అతడినిబంధించండి;వసుదేవుని, ఉగ్రసేనుడిని చంపండి!"వాధ్యములు ఆపండి అని అరిచాడు.


కంసుడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండగానే కోపంతో

కంసుని మాటలు పూర్తికాకముందే శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున ఎగిరి కంసుని ఎత్తైన సింహాసనంపైకి లంఘించాడు.కంసుడు కత్తి దూసి ఎదిరించే ప్రయత్నం చేశాడు కానీ ఒడుపుతో కంసుని కిరీటాన్ని తన్ని, ఆయన జుట్టును గట్టిగా పట్టుకుని రంగస్థలంపైకి విసిరికొట్టాడు.


* **ప్రాణాపహరణం:** అక్కడి నుండి కంసుని గుండెలపై దూకి ఒక్క గుద్దు గుద్దగానే కంసుడు రక్తాలు కక్కి ప్రాణాలు విడిచాడు. నిరంతరం భయంతోనైనా కృష్ణుడినే ధ్యానించినందువల్ల కంసునికి సారూప్య ముక్తి లభించింది.


అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమంది మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి. 


అలా దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను. 


అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.


రాజ పత్నులు అక్కడికి చేరి గుండెలు బాదుకుని ఏడ్చారు.శ్రీకృష్ణుడు దుఃఖితలైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను


5. తల్లిదండ్రుల విముక్తి & ఉగ్రసేన పట్టాభిషేకం

కంస వధ అనంతరం రామకృష్ణులు కారాగారానికి వెళ్లి, తమ తల్లిదండ్రులైన దేవకీ-వసుదేవుల కాళ్లకు ఉన్న సంకెళ్లను తొలగించి వారి పాదాలకు ప్రణమిల్లారు. దేవకీ వసుదేవులు ఆనందబాష్పాలతో బిడ్డలను గుండెలకు హత్తుకున్నారు.(దేవకి వసుదేవులు ఇంతకాలం కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఉపాసించారు, ఇప్పడు ఆ భావం ఉంటే పుత్ర వాత్సల్యం చూపలేరు అని మాయ చేత వారి నుండి ఆ భావం తొలగించి పుత్ర ప్రేమ పెట్టాడు)


* **ఉగ్రసేనునికి రాజ్యం:** కృష్ణుడు స్వయంగా రాజ్యాధికారాన్ని చేపట్టకుండా, కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజును విడుదల చేసి, యదువంశానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.


శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మధురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపచేసెను. 


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను, మనోరథములన్నియును ఈడేరెను. ఆ నందకుమారుల బాహు బలచ్చాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి. 


*నందునికి వీడ్కోలు*

పిమ్మట కృష్ణభగవానుడు, బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగిలించుకొని,తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు.  


కన్న తల్లిదండ్రులును, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించిన వారే. నిజమైన తల్లిదండ్రులు. 


నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్లిరండు. మేము మీ యెదుట లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో | సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము”. అని చెప్పి..


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈవిధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను. ఎంతో బాధతో నందుడు వారిని వీడ్కోనీ వ్రజ భూమికి చేరాడు.


* **గురుకుల ప్రవేశం:** 

ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. 


ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేశాడు . 


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


అనంతరం బలరామకృష్ణులు అవంతి నగరంలోని **సాందీపని మహర్షి** వద్దకు వెళ్లి కేవలం అరవై నాలుగు (64) రోజులలో సమస్త వేదాలు, వేదాంగాలు, 64 కళలను అభ్యసించారు. 


గురుదక్షిణ సమర్పిస్తాను అని వారు అడగగా వీరి అపార మహిమలు ఎరిగిన సాందీపని ముని ప్రభాస తీరంలో సముద్రంలో మునిగిపోయిన పుత్రుడినీ బ్రతికించి ఇవ్వండి అన్నాడు.


బలరామ కృష్ణులు ఇద్దరూ సరే అని ప్రభాస తీర్థం కి వెళ్ళి సాగరా నీ ఉత్తుంగ తరంగాల లో మా గురు పుత్రుని దాచావు మాకు ఇవ్వు అని ఆదేశిస్తే, కృష్ణ పంచజనుడు అనే రాక్షసుడు మీ గురు పుత్రుని అపహరించాడు అని చెపితే, సముద్రంలోకి ప్రవేశించి వాడిని సంహరించాడు కానీ వాడి ఉదరంలో గురు పుత్రుడు లేడు కానీ పాంచజన్యం అనే శంఖం వాడి శరీరం నుండి పుట్టింది దాన్ని తీసుకుని, యమ లోకానికి వెళ్ళి శంఖం పూరించాడు. యముడు శ్రీకృష్ణునీ గుర్తించి సేవించి గురు పుత్రుని ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాలుని తీసుకుని గురువుకు అప్పగించి గురువర్య ఇంకా ఏమి కావాలో తెలుపండి అని వినయంగా అడిగాడు.


గురువు వారిని ఆశీర్వదించి, నాయనా మీ కీర్తి అజరామరం, సమస్త లోకాల్లో మీకు తిరుగుండదు అని ఆశీర్వదించి పంపాడు.వారు రథాలపై ఎక్కి తిరిగి మధురకు చేరుకున్నారు.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భావగ్రాహీ జనార్దనః:** పత్రం, పుష్పం, ఫలం, తోయం... లేదా కుబ్జ సమర్పించిన చందనం, సుదాముడు ఇచ్చిన పూలమాల అయినా సరే నిష్కల్మష భక్తితో సమర్పిస్తే భగవంతుడు సర్వస్వాన్నీ అనుగ్రహిస్తాడు.


2. **అధర్మ నాశనం:** బలవంతుడైన కంసుడు ఎంతటి భద్రతలను ఏర్పాటు చేసుకున్నా, అధర్మ మార్గంలో నడిచినందువల్ల భగవత్ సంకల్పం ముందు క్షణంలో నేలకూలాడు.


3. **నిస్వార్థ ధర్మం:** కంసుడిని చంపినప్పటికీ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని ఆశించక, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా నిస్వార్థ ప్రజాపాలనా ధర్మాన్ని చాటాడు.


రేపు ఉద్ధవ గీత వస్తుంది వేచి ఉండండి శ్రీకృష్ణ శరణం మమ 


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

29, ఆగస్టు 2026, శనివారం

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

30ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌞 *ఆదివారం*🌞       

 *🌹30ఆగష్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం -  బహుళ పక్షం* 


*తిథి      : విదియ* ఉ 09.36 వరకు ఉపరి *తదియ*

*వారం   :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం   : ఉత్తరాభాద్ర* రా 03.44 వరకు ఉపరి *రేవతి*

*యోగం  : శూల* రా 03.46 వరకు ఉపరి *గండ*

*కరణం   : గరజి* ఉ 09.36 *వణజి* రా 09.17 ఉపరి *భద్ర*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00 - 09.00 మ 03.30 - 04.30*

అమృత కాలం  : *రా 10.56 - 12.32*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం         : మ 01.19 - 02.55*

*దుర్ముహూర్తం : సా 04.42-05.32*

*రాహు కాలం  : సా 04.49-06.22*

గుళికకాళం    : *మ 03.15- 04.49*

యమగండం    : *మ 12.08 - 01.41*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మీనం*

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం      :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.23*

అపరాహ్న కాలం  : *మ 01.23- 03.52*

*ఆబ్ధికం తిధి      : శ్రావణ బహుళ తదియ*

సాయంకాలం   : *సా 03.52 - 06.22*

ప్రదోష కాలం      : *సా 06.22- 08.40*

రాత్రి కాలం         : *రా 08.40- 11.45*

నిశీధి కాలం       : *రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


     🌞 *సూర్య నమస్కారం*🌞    


             *చేసేటప్పుడు* 

   🙏 *పఠించవలసిన శ్లోకం*🙏 


బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నే మహేశ్వరమ్ సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్ 

ప్రాతర్భజామి సవితార మనంత శక్తిమ్ 

పాపౌఘశత్రు భయరోగ హరం పరంచ 

తం సర్వలోక కలనాత్మక కాలమూర్తిమ్ 

సంసార బంధన విమోచన మాది దేవమ్


*🙏 ఓం నమో సూర్యదేవాయ నమః* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

29ఆగష్టు2026

*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

     🍁 *శనివారం*🍁

 *🌹29ఆగష్టు2026🌹*    

  *దృగ్గణిత పంచాంగం*               


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : పాడ్యమి* ఉ 09.56 వరకు ఉపరి *విదియ*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పూర్వాభాద్ర* రా 03.42 వరకు ఉపరి *ఉత్తరాభాద్ర*

*యోగం : సుకర్మ* ఉ 06.36 ఉపరి *ధృతి* పూర్తిగా *రోజంతా*

*కరణం  : కౌలువ* ఉ 09.56 *తైతుల* రా 09.50 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ 12.00 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  : *రా 07.32 - 09.10*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం    :ఉ 09.45 - 11.22*

*దుర్ముహూర్తం  :ఉ05.54-07.34*

*రాహు కాలం   :ఉ09.01 - 10.35*

గుళికకాళం      : *ఉ 05.54 - 07.27*

యమగండం    : *మ 01.42 - 03.16*

సూర్యరాశి : *సింహం*            

చంద్రరాశి : *కుంభం/మీనం*

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.32*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.54 -08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53- 01.23*

అపరాహ్న కాలం : *మ 01.23- 03.53*

*ఆబ్ధికం తిధి      : శ్రావణ బహుళ విదియ*

సాయంకాలం    : *సా 03.53- 06.23*

ప్రదోష కాలం    : *సా 06.23 - 08.42*

రాత్రి కాలం        : *రా 08.41 - 11.45*

నిశీధి కాలం       : *రా 11.45- 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


*🙏ఓం నమో వేంకటేశాయ నమః🙏*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 34/42*

 *శనివారం 29 ఆగస్టు 2026*


*శ్రీమద్భాగవతం - 34/42* 


*అరిష్ట, కేశి వధ & అక్రూరుని గోకుల ప్రయాణం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత అధ్యయనం లో భాగంగా ఈరోజు 

 శంఖచూడ వధ, అరిష్టాసుర (వృషభం) వధ, కేశి-వ్యోమాసుర సంహారం లాంటి అనేక లీలలు రాబోతున్నాయి బాల్య లీలలు ఈరోజుతో ముగించి ఇక మధుర కు వెళతాం రేపటినుండి..... 


1. సుదర్శన గంధర్వుని ఉద్ధరణ & శంఖచూడ వధ


ఒకనాటి శివరాత్రి పర్వదినాన నందగోపాది గోపాలురంతా అంబికావనానికి వెళ్లి సరస్వతీ నదీ తీరాన గౌరీశంకరులను పూజించి అక్కడే శివానుగ్రహం కోసం భూసురులకు అనేక పదార్దాలు సమర్పించి,బ్రహ్మచర్య దీక్ష వహించి ఉపవాసం ఉన్నారు. రాత్రివేళ కూడా సరస్వతి నదీ తీరంలోనే గడిపారు.


ఆ రాత్రి వేళ ఒక పెద్ద అజగరం (కొండచిలువ) వచ్చి నందమహారాజు కాలును మింగడం ప్రారంభించింది. నందుడు "కృష్ణా! కృష్ణా కాపాడు" అని అరవగా, గోపాలురు అంతా భయంతో కొరివి కట్టెలతో ఆ పామును బాదారు, ఎంత కొట్టిన అది నందుని వదలలేదు అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి తన పాదంతో ఆ సర్పమును తాకాడు.


 కృష్ణుని పరమ పావన పాదస్పర్శ తాకగానే దాని పాపములు అన్ని పటా పంచలు అయిపోయి దాని సర్పరూపం నశించి, 'సుదర్శనుడు' అనే విద్యాధరుడు (గంధర్వుడు) దివ్యరూపంతో వెలిగాడు. నీవు ఎవరు అని కృష్ణుడు అడగగా...


అంగీరస మునుల రూపాన్ని చూసి సౌందర్య,ధన మదంతో అవహేళన చేసినందుకు సర్పంగా మారిన విద్యాధరుడు అనే గంధర్వుణ్ణి అని, కృష్ణ మీ పాదస్పర్శతో నాకు విముక్తి కలిగింది, నిజానికి వారు శాపం ఇచ్చి ఉండకపోతే నాకు మీ పాదాలు తాకే భాగ్యం దక్కేది కాదు అని తెలిపి ప్రణమిల్లాడు. అనుగ్రహం పొంది తన లోకానికి వెళ్ళిపోయాడు.


గోపాలురు అంతా శ్రీకృష్ణునీ అనితర సాధ్యం అయిన లీలలు చూసి ఆశ్చర్య పోయి ఆ అంబికా వనంలో వ్రత దీక్ష పూర్తి చేసి వ్రజ భూమికి వచ్చారు.


 * శంఖచూడ సంహారం: ఒకానొక సమయంలో రాత్రివేళ బల రామకృష్ణులు గోపికలతో పరివృతులు అయి ఒక వనంలో విహరిస్తుండగా కుబేరుని అనుచరుడైన శంఖచూడుడు అనే యక్షుడు గోపికలను అపహరించడానికి ప్రయత్నించాడు. 


ఆ గోపికలు 'కృష్ణా! బలరామా! రక్షించు రక్షించు' అని ఎంతగానో మొఱపెట్టుకొనుచుండిరి. సోదరులు తమ ఆత్మీయులను ఎత్తుకొనిపోవుచున్న శంఖచూడుని జూచి, అతని వెంటబడి తరిమారు, శ్రీ కృష్ణుడు పిడిగుద్దుతో అతడిని సంహరించి, ఆయన శిరస్సున ఉన్న దివ్య రత్నాన్ని బలరామునికి బహూకరించాడు.


ఇక్కడ ఒక అధ్యాయంలో గోపికల యుగళ గీతం ఉంటుంది రాత్రి వేళల్లో తమతో ఉండే శ్రీకృష్ణుడు, పగటిపూట గోవులను కాసేందుకు అడవికి వెళ్ళిపోవడంతో గోపికలు తీవ్ర విరహాన్ని అనుభవిస్తూ, ఆయన వేణుగాన మాధుర్యాన్ని, ప్రకృతి లీనమైన తీరును జంటలుగా కీర్తిస్తూ కాలం గడుపుతూ ఉండేవారు.


2. అరిష్టాసుర వధ – వృషభ రాక్షస సంహారం

కంసుని ఆజ్ఞతో అరిష్టాసురుడు అనే రాక్షసుడు ఒక మహా భయంకరమైన ఎద్దు (వృషభం) రూపాన్ని ధరించి గోకులంపైకి దాడి చేశాడు. ఆయన డెక్కల తాకిడికి భూమి కంపించింది,తోకను ఆకాశానికి విసురుతూ, కళ్లతో నిప్పులు కక్కుతూ గర్భవతులైన స్త్రీలకు గర్భస్రావం కలిగించేలా భీకరంగా రంకెలేశాడు.


మొనదేలి మిగుల పదునుగానున్న దాని కొమ్ములను, దాని చేష్టలను గాంచి, గోపికలు, గోపాలురును ఎంతయు భయగ్రస్తులైరి. 


పశువులు బయపడుతూ, గోకులమును విడిచి పఱుగులు తీయసాగెను. సమస్త గోవులు, గోపికలు, గోపాలురు 'కృష్ణా! కృష్ణా!' యని మొఱపెట్టుకొనుచు గోవిందుని శరణుజొచ్చిరి. 


అప్పుడు కృష్ణభగవానుడు భయవిహ్వలస్థితులకు లోనైన  గోకులవాసుల దైన్యమును గమనించి, 'భయపడకుడు,

భయపడకుడు' అని అభయవచనములతో వారిని ఊఱడించి

తాను ఏమాత్రం చలించక ఆ ఎద్దు ముందు నిలబడి చప్పట్లు చేస్తూ ఆ రాక్షసునీ మరింత రెచ్చగొట్టాడు. రెచ్చిపోయి ఆగ్రహంతో దూసుకువచ్చిన అరిష్టాసురుని రెండు కొమ్ములను తన చేతులతో పట్టుకుని వెనక్కి నెట్టాడు. అనంతరం ఒక కొమ్మును పెకిలించి, ఆ కొమ్ముతోనే రాక్షసుడిని కొట్టి నేలకూల్చాడు.


శ్రీకృష్ణుడు దురాత్ముడైన అరిష్టాసురుని వధించి, వ్రజవాసులను ఆనందింపజేసెను. అంతట భవిష్యత్తును దర్శింపగల దివ్యర్షియగు నారదుడు కంసుని దగ్గరకు వెళ్ళి అతనితో  "కంసమహారాజా! నీ చేతులనుండి తప్పించుకొని, ఆకాశమునకు ఎగిరిన కన్యక నిజముగ యశోదకుమార్తె వ్రజభూమియందు వర్ధిల్లుచున్న శ్రీకృష్ణుడు

దేవకీపుత్రుడు. అచటనే పెఱుగుచున్న బలరాముడు రోహిణీదేవి కుమారుడు. 


వసుదేవుడు నీకు భయపడి శ్రీకృష్ణుని, బలరాముని తన మిత్రుడైన నందునికడ న్యాసముగా ఉంచెను. నీ ప్రేరణతో వెళ్లిన రాక్షసులను అందరిని నిహతులను గావించినది ఆ సోదరులు ఇద్దరే”.అన్నాడు.


నారదుని వలన బలరామకృష్ణుల ఈ సమాచారములను విన్నంతనే కంసుడు మిగుల క్రోధముతో ఊగిపోయెను.అతని ఇంద్రియము లన్నియు పట్టుదప్పెను, వసుదేవుని సంహరిస్తాను అని కత్తి దూసాడు కానీ వారి ఇద్దరిని బందించి చెరసాల లో వేసి కేశి అనే రాక్షసుణ్ణి బలరామ కృష్ణులను చంపడానికి వ్రజ భూమికి పంపాడు.


3. కేశి & వ్యోమాసుర సంహారం

 * కేశి వధ (గుర్రపు రాక్షసుడు): కంసుడు పంపిన కేశి అనే రాక్షసుడు మహా వేగవంతమైన గుర్రం రూపాన్ని ధరించి, నోటి నుండి నురుగులు కక్కుతూ కృష్ణునిపైకి లంఘించాడు. శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లోకి చొప్పించి, తన బాహువును అగ్నిగుండంలా పెంచాడు. కేశి పళ్లు ఊడిపోయి, ఊపిరాడక కడుపు బద్దలై రక్తాలు కక్కుకుని ప్రాణాలు విడిచాడు. (కేశిని సంహరించినందువల్ల భగవంతునికి 'కేశవుడు' అనే ప్రసిద్ధ నామం స్థిరపడింది).


 *అప్పుడు భాగవతోత్తముడు అయిన నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమై: "కృష్ణా! నీవు త్వరలోనే కంసుడిని చంపి, భూభారాన్ని తొలగించి, కురుక్షేత్రంలో ధర్మాన్ని నిలబెట్టబోతున్నావు" అని కీర్తించాడు.(ఇక్కడ నారదుడు జరగబోవు సంఘటనలు అన్ని చెబుతాడు)


 * వ్యోమాసుర వధ:పిమ్మట ఒకనాడు గోపాలురు శ్రీకృష్ణునితోగూడి అడవికి వెళ్లిరి. అక్కడ వారు గోవులను మేపుచు ఒక పర్వతసమీపమున నిలాయనక్రీడలను (మేకల ఆటలను లేదా  దాగుడుమూతలాటలను) ఆడిరి. ఆ ఆటలలో కొందరు గొర్రెల కాపరులుగను, మఱికొందఱు ఆఱితేణిన దొంగలుగాను నటించుచు ఆ గోపాలురు తమలో తాము నిర్భయముగా క్రీడలు సలుపుచుండిరి


అప్పుడు మయాసురుని కుమారుడైన వ్యోమాసురుడు వారిలో గోపాలుడిగా కలసి దొంగల వేషంలో బాలురను గుహలలో దాచిపెట్టాడు. అలా చివరకు నలుగురు అయిదుగురు మాత్రమే మిగిలారు.శ్రీకృష్ణుడు అతని దొంగతనం గుర్తించి , కొండగుహలో వేసి అదిమి సంహరించి గుహలలో దాచిన స్నేహితులను కాపాడి గోకులానికి చేరాడు.


4. కంసుని ధనుర్యాగం & అక్రూరుని భక్తి ప్రయాణం

రాక్షసులంతా మరణించారని తెలుసుకున్న కంసుడు వణికిపోయాడు. రామకృష్ణులను మధురకు రప్పించి చంపడానికి 'ధనుర్యాగం' అనే కుతంత్ర యజ్ఞాన్ని ప్రకటించాడు.దానికోసం యదువంశ శ్రేష్ఠుడు, నిష్కల్మష భక్తుడైన అక్రూరుడిని పిలిచి: "అక్రూరా! నువ్వు రథంపై వెళ్లి నందగోకులంలో ఉన్న రామకృష్ణులను ఈ ధనుర్యాగానికి తీసుకురా" అని ఆజ్ఞాపించాడు. అది తనకు కలిగిన భాగ్యం అని భావించాడు అక్రూరుడు.


 శ్రీకృష్ణుని దర్శనం చేసుకోబోతున్నానని అక్రూరుడు మార్గమధ్యమంతా పరమానందంతో గడిపాడు:

   "నేను ఎంతటి పుణ్యం చేసుకున్నాను! మునుల ధ్యానానికి చిక్కని పరబ్రహ్మ పాదపద్మాలను ఈరోజు నేను తాకబోతున్నాను! అంటూ పొంగిపోయాడు.

   

 * గోకులంలో అడుగుజాడలు: గోకులం చేరగానే నేలపై కృష్ణుని ధ్వజ, వజ్ర, పద్మ, అంకుశ లాంఛనాలతో కూడిన పాదముద్రలను చూసి అక్రూరుడు రథం దిగి, ఆ ధూళిలో పొర్లాడుతూ కన్నీళ్లతో ప్రణమిల్లాడు.


 అలా నందభవనంలో ప్రవేశించి పీతాంబరధారులైన రామకృష్ణులను చూసి వారి పాదాలపై సాష్టాంగపడ్డాడు. రామకృష్ణులు అక్రూరుని లేవనెత్తి ఆలింగనం చేసుకుని అతిథి సత్కారాలు చేశారు.


5. మధురకు పయనం & యమునలో విరాడ్రూప దర్శనం

కంసుని దురుద్దేశాన్ని, దేవకీ-వసుదేవుల బంధనాన్ని అక్రూరుడు వివరించాడు. నందమహారాజు సమస్త గోపాలురతో పాటు మధురకు కానుకలతో బయలుదేరడానికి సిద్ధమయ్యాడు.


 * గోపికల విరహ వేదన: కృష్ణుడు మధురకు వెళ్తున్నాడని తెలిసి గోపికలు రథం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు: "కృష్ణా! నిన్ను విడిచి మేము క్షణమైనా బ్రతుకలేము" అంటూ రథ చక్రాలకు అడ్డంగా పడుకున్నారు. కృష్ణుడు వారిని ఓదారుస్తూ, "నేను త్వరలోనే తిరిగి వస్తాను" అని మనస్సులలో నిలిచి ఉండే అభయాన్ని ఇచ్చాడు.


 *యమునా నదిలో దివ్య దర్శనం* 

మార్గమధ్యంలో యమునా నదిలో అక్రూరుడు మధ్యాహ్న స్నానం చేస్తుండగా... నీటి లోపల శ్రీ బలరామకృష్ణులు దర్శనమిచ్చారు. రథంపై చూస్తే అక్కడా ఉన్నారు. మళ్లీ నీటిలో మునగగా... వేయి పడగల ఆదిశేషునిపై శంఖ-చక్ర-గదా-పద్మధారియై, లక్ష్మీ సమేతుడై వెలిగిపోతున్న శ్రీమన్నారాయణుని పరమ దివ్య వైకుంఠ రూపాన్ని దర్శించి అక్రూరుడు పరవశించి స్తుతించాడు.(అక్రూరుని గురించి దాదాపు నాలుగు అధ్యాయాలలో ఉంటుంది, అక్రూర స్తుతి కూడా ఎంతో విశేషమైంది ఇక్కడ కొద్దిగా ఇచ్చాను అంతే)


📝 నేటి ముఖ్య విషయాలు:

 * అక్రూరుని దాస్య-వందన భక్తి: భాగవతంలో నవవిధ భక్తులలో 'వందనం' (నమస్కారం/శరణాగతి) అనే భక్తికి అక్రూరుడే పరమ ఆదర్శం.


 * పాదధూళి మహత్యం: భగవంతుని పాదముద్రల స్పర్శ రాయిని సైతం పావనం చేస్తుంది; అక్రూరుని వంటి జ్ఞాని ఆ ధూళిని శిరస్సున ధరించాడు.


 * బాల్య లీలల పరిసమాప్తి: శ్రీకృష్ణుడు గోకుల బాల్య లీలలను ముగించి, దుష్టశిక్షణ-శిష్టరక్షణ అనే మహా కార్యం కోసం మధురా నగర ప్రవేశానికి సిద్ధమయ్యాడు.


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*