12, ఆగస్టు 2026, బుధవారం

సూక్తి

 🌸సూక్తి


మహావీరుడైన అర్జునుడు భారత యుద్ధంలో సైంధవుణ్ణి చంపుతానని గొప్ప ప్రతిజ్ఞ చేసినాడు సైంధవుని చంపటం అంటే మామూలు మాట కాదు (ప్రొద్దుగుంకినట్టు చెయ్యాలిఆయన శిరస్సు భూమి మీద పడకూడదు ఆ శిరస్సును బాణాలతో కొట్టి వాళ్ళ తండ్రి ఒడిలో పడేటట్టు చేయాలి) అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని శిబిరమునకు వచ్చి అర్జునా ఒక్కరోజులోసైంధవుని చంపుట సాధ్యమయ్యే పనేనా గొప్ప ప్రతిజ్ఞ చేసినావుఅని సరే నీవు హాయిగా విశ్రమించు అని చెప్పి తన శిబిరమునకు పోయి ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చాలి అని ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు శ్రీకృష్ణ భక్తుడైన

అర్జునుడు హాయిగా భగవంతుని మీద భారం వేసి ఆందోళన లేకుండా ఉన్నాడు అలాగే మనం కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ప్రయత్నం చేస్తూ మనం భగవంతుని ప్రార్థిస్తూ నీవే దిక్కు స్వామి అని ఆయన మీద భారం వేస్తే ఆయనేతప్పక మనలను కాపాడుతాడు 

స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనన్యా శ్చిన్తయన్తోమాం శ్లోకంలో నా మీద భారవేస్తే వారి యోగక్షేమాలునేనే చూసుకుంటాను అని అంటాడుకదా

జయలక్ష్మి

పంచాంగం

 ఈ రోజు పంచాంగం 12.08.2026 Wednesday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాస కృష్ణ పక్ష అమావాస్య తిథి సౌమ్య వాసర పుష్యమి నక్షత్రం వ్యతిపాత యోగః చతుష్పాత్ తదుపరి నాగవం కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

యమగండం: ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

  

 


శ్రాద్ధ తిథి: అమావాస్య 



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।


ప్రతిపదార్థ:



 సర్వ-భూత-స్థం — సర్వ భూతముల యందు స్థితుడై ఉండి; ఆత్మానం — పరమాత్మ; సర్వ — సమస్త; భూతాని — ప్రాణులు; చ — మరియు; ఆత్మని — భగవంతుని యందు; ఈక్షతే — దర్శించును; యోగ-యుక్త-ఆత్మా — అంతఃకరణలో భగవంతుని తోనే ఏకమై; సర్వత్ర — అన్ని చోట్లా; సమ-దర్శనః — సమత్వ దృష్టి.



తాత్పర్యము: 



నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సమత్వ దృష్టితో సర్వ భూతములను భగవంతుని యందు మరియు భగవంతుడిని సర్వ భూతములయందు దర్శిస్తారు.



వివరణ:


భారతదేశంలో, దీపావళి పండుగ సమయంలో, పంచదార బిళ్ళలను వేర్వేరు రూపాల్లో తయారుచేసి దుకాణాల్లో అమ్ముతారు - కార్లు, విమానాలు, అబ్బాయిలు, అమ్మాయిలు, జంతువులు, బంతులు, మరియు టోపీలు - మొదలైన ఆకృతులలో. పిల్లలు తమ తల్లిదండ్రులతో కారు కావాలని, ఏనుగు కావాలని, మారాము చేస్తారు. తల్లిదండ్రులు పిల్లల అమాయకత్వానికి నవ్వుకుంటారు, వారికి తెలుసు, అవన్నీ ఒకే పంచదార నుండి తయారయ్యాయని, అవన్నీ ఒకే రకం తీపిగా ఉంటాయని.


అదే రీతిగా, సృష్టిలో ఉన్న ప్రతి వస్తువులో, తన వేర్వేరు శక్తుల రూపంలో ఉన్నది స్వయంగా భగవంతుడే.


ఏక దేశస్థితస్యాగ్నిర్జ్యోత్స్నా విస్తారిణీ యథా

పరస్య బ్రహ్మణః శక్తిస్తథేదమఖిలం జగత్ (నారద పంచరాత్రం)


‘ఎలాగైతే సూర్యుడు ఒకేచోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల ద్వారా సృష్టిలో అన్నిటియందు నిండి నిబిడీకృతమై వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు.’ పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదాన్నీ భగవత్ సంబంధముగా చూస్తారు.

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 45*


*అవిశ్రాంతం పంకం యదపి కలయన్యావకమయం*

*నిరస్యన్కామాక్షి ప్రణమనజుషాం పంకమఖిలమ్ ।*

*తులాకోటిద్వందం దధదపి చ గచ్ఛన్నతులతాం*

*గిరాం మార్గం పాదో గిరివరసుతే లంఘయతి తే ॥*


*భావము :*


*మాతా! నీ పాదములపై నిత్యము అలంకరింపబడే లత్తుక నిన్ను శరణన్న మా పాప పంకిలమును తొలగిస్తుంది. అందియములను ధరించిన సాటిలేని నీ పదములు ఈ జగత్తులో ఎవరికీ లొంగక అన్నిటికీ అతీతముగా ఉంటాయి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః*🙏🙏🙏

11, ఆగస్టు 2026, మంగళవారం

12ఆగష్టు2026🪷* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🌷 *బుధవారం*🌷 

 *🪷12ఆగష్టు2026🪷*     

  *దృగ్గణిత పంచాంగం* 

                 

          *ఈనాటి పర్వం*

      *గురుమౌఢ్యత్యాగః*    

             *దర్శశ్రాద్ధ*

         *పితృతర్పణం*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం*

*దక్షిణాయనం - గ్రీష్మ ఋతువు*

*ఆషాఢ మాసం -  బహుళ పక్షం* 


*తిథి       : అమావాస్య* రా 11.06 ఉపరి *శ్రావణమాసారంభః*

*వారం : బుధవారం* (సౌమ్యవాసరే)

*నక్షత్రం   : పుష్యమి* ఉ 07.59 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం  : వ్యతీపాత* మ 03.26 వరకు ఉపరి *వరీయాన్*

*కరణం   : చతుష్పాద* మ 12.27 *నాగ* రా 11.06 ఉపరి *కింస్తుఘ్న*

*సాధారణ శుభ సమయాలు*

             *-ఈరోజు లేవు-*

అమృత కాలం :*రా 04.38-06.06తె*

అభిజిత్ కాలం  : *ఈరోజు లేదు*

*వర్జ్యం   :రా 07.47 - 09.15*

*దుర్ముహూర్తం  :ప11.47- 12.38*

*రాహు కాలం   :మ 12.12- 01.48*

గుళికకాళం      : *మ 10.37 - 12.12*

యమగండం    : *ఉ 07.26 - 09.02*

సూర్యరాశి : *కర్కాటకం*                      

చంద్రరాశి : *కర్కాటకం*

సూర్యోదయం :*ఉ 05.58*

సూర్యాస్తమయం :*సా 06.44*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       :*ఉ 05.51- 08.23*

సంగవ కాలం        : *08.23 - 10.56*

మధ్యాహ్న కాలం    : *10.56 - 01.29*

అపరాహ్న కాలం  :*మ 01.29-04.01*

*ఆబ్ధికం తిధి :ఆషాఢ అమావాస్య*

సాయంకాలం     :*సా 04.01- 06.34*

ప్రదోష కాలం       :*సా 06.34-08.49*

రాత్రి కాలం         :*రా 08.49- 11.50*

నిశీధి కాలం        :*రా 11.50- 12.35*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.21 - 05.06*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

       *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


 *🌷ఓం సరస్వత్యై  నమః🌷* 


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీమద్భాగవతం - 18/42*


*శ్రీమద్భాగవతం - 18/42*


*శ్రీ నరసింహ ఆవిర్భావం, హిరణ్యకశిప వధ & నరసింహ స్తుతి*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


మన భాగవత యాత్రలో 

నిన్నటి రోజున మహాభక్తుడైన ప్రహ్లాదుని జననం, నవవిధ భక్తి మార్గాలు మరియు హిరణ్యకశిపుడు చేసిన ఘోర రాక్షసృత్యాల గురించి తెలుసుకున్నాం. ఈరోజు **సప్తమ స్కంధం – అధ్యాయాలు 8 నుండి 10** ఆధారంగా శ్రీమద్భాగవతంలోని పరమ పవిత్రమైన ఘట్టం — **శ్రీ నరసింహావిర్భావం, రౌద్ర రూపంతో హిరణ్యకశిపుని వధ, ప్రహ్లాదుని నరసింహ స్తుతి మరియు స్వామి ప్రశాంతత** గురించిన  వివరాలుతెలుసుకుందాం.


1. "ఎక్కడున్నాడు నీ హరి?" – హిరణ్యకశిపుని గర్వాంధకారం (7వ స్కంధం – 8వ అధ్యాయం)


ప్రహ్లాదుడిని చంపడానికి తాను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవ్వడంతో హిరణ్యకశిపుడు తీవ్రమైన క్రోధంతో రగిలిపోయాడు. 


గురువులు మరొక్కసారి ప్రయత్నం చేస్తాం అని గురుకులానికి తీసుకుపోతే అక్కడ ఉన్న తోటి విద్యార్థులకు కూడా హరి భక్తి మహిమ బోధించాడు ప్రహ్లాదుడు.ఆ విషయాన్ని గురువులు చెప్పగా విన్న హిరణ్య కశిపుడి కోపం కట్టలు తెంచుకుని ఇక స్వయంగా తానే కుమారుని సంహరించాలి అని నిర్ణయం తీసుకునీ ప్రహ్లాదుడిని తన రాజసభలోని ఒక స్వర్ణ స్తంభం ముందుకు తీసుకువచ్చి, ఖడ్గాన్ని దూసి గర్జించాడు:


 "రాక్షసాధమా! నా మాట వినకుండా, నిరంతరం ఆ 'హరి' బలంతోనే నేను బతుకుతున్నానని దంబాలు పలుకుతున్నావు. సమస్త లోకాలకు నేనే ఈశ్వరుడిని! నన్ను మించిన వాడు ఎవడు లేడు, ఎడి నీ హరి ఎక్కడున్నాడు? ఈ సభలో ఉన్నాడా? **ఈ స్తంభంలో ఉన్నాడా?** చూపించు.. లేదా ఈ రోజే నీ తలను నరికి ఆ హరి వద్దకు పంపుతాను!"


ప్రహ్లాదుడు ప్రశాంతంగా, నిశ్చల భక్తితో చేతులు జోడించి ఇలా అన్నాడు:


ఇందుఁ గలఁ డందు లేఁ డని, సందేహము వలదు 

చక్రి సర్వోపగతుం డెందెందు వెదకి చూచిన, 

నందందే కలఁడు దానవాగ్రణి వింటే 


 "తండ్రీ! ఆయన ఎక్కడో లేడు. సర్వాంతర్యామి అయిన శ్రీహరి అణువణువునా ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఈ సమస్త విశ్వంలో ఉన్నాడు... **సాక్షాత్తు నీవు చూపిస్తున్న ఈ స్తంభంలో కూడా ఉన్నాడు!**"నేను అన్ని లోకాలు జయించాను అంటున్నావు కానీ పది ఇంద్రియాలు అనే బందిపోటు దొంగల చేత నీవు ఈడ్చబడుతూ అసలు సత్యాన్ని తెలుసుకోలేక పోతున్నావు. వీటిని అదుపు చేసినవారికి ఆయన లేని చోటు లేదు అన్నాడు.


 2. *స్తంభ విస్ఫోటనం & లక్ష్మీనరసింహ ఆవిర్భావం* (8వ అధ్యాయం)


ప్రహ్లాదుని మాటలు విన్న హిరణ్యకశిపుడు అహంకారంతో నవ్వి, "అయితే ఈ స్తంభంలో నీ హరిని చూపించు" అంటూ తన చేతిలోని గదతో **రాతి స్తంభాన్ని గట్టిగా చరిచాడు!**


ఆ క్షణంలోనే... సకల బ్రహ్మాండాలు పగిలిపోతున్నాయా అన్నట్లు ఘోరమైన బ్రహ్మాండ భాండ విస్ఫోటనం (భయంకర శబ్దం) సంభవించింది. దేవతలు, దిక్పాలకులు భయపడ్డారు. స్తంభం మధ్య నుండి ఫెలో ఫెల ఫట ఫట శబ్దాలు వడ్డాయి**సాక్షాత్తు శ్రీమహావిష్ణువు "శ్రీ నరసింహ" రూపాంలో ఆవిర్భవించాడు!**


భగవంతుడైన శ్రీహరి తన భక్తుడైన ప్రహ్లాదుని, బ్రహ్మదేవుని మరియు సనకాదుల మాటలను నిలబెట్టుటకును, తన సర్వవ్యాపకత్వమును నిరూపించడానికి  ఆ స్తంభమునుండియే ఒక విచిత్రరూపముతో ప్రకటితుడు అయ్యెను.  


భగవంతుడు అయిన శ్రీ నృసింహస్వామి భగవాన్ కీ జై!! 


* **రూప విశేషం:** ఆయన నరుడూ కాడు, మృగమూ కాడు! సింహం ముఖం, మానవ శరీరం; భయంకరమైన జ్వాలల వంటి కళ్లు, ఆకాశాన్ని తాకే జటాజూటం, పర్వతాల వంటి దంష్ట్రలు (కోరలు), వేల చేతులలో దివ్యా ఆయుధాలు!


 3. హిరణ్యకశిపుని విచిత్ర సంహారం (8వ అధ్యాయం)


హిరణ్యకశిపుడు ఖడ్గం ధరించి నరసింహస్వామిపైకి లంఘించాడు. స్వామి ఆయనతో కొద్దిసేపు లీలగా యుద్ధం చేసి, సూర్యాస్తమయ సమయం (సంధ్యా సమయం) ఆసన్నమవ్వగానే రాక్షసుడిని పట్టుకున్నాడు.


బ్రహ్మదేవుడు ఇచ్చిన సమస్త వరాలను ఒక్కటి కూడా ఉల్లంఘించకుండా స్వామి సంహారాన్ని పూర్తి చేశాడు:


1. **నరుడు కాడు, మృగం కాడు:** *నరసింహ రూపం (సగం నరుడు, సగం మృగం).*


2. **ఇంట కాడు, బయట కాడు:** *సింహాసన ద్వారం (గడప) మీద కూచుని*


3. **పగలు కాడు, రాత్రి కాడు:** *సంధ్యా సమయంలో.*


4. **భూమిపై కాడు, ఆకాశంలో కాడు:** *తన తొడలపై (తొడలపైన) కూర్చోబెట్టుకున్నాడు.*


5. **దేవ, దానవ, మానవ ఆయుధాలు కావు:** *తన వాడియైన గోళ్లతో (నఖములతో).*(జీవం ఉన్నవి కాదు జీవం లేనివి కాదు)


6. **బ్రహ్మ సృష్టించిన ఏ ప్రాణీ కాడు:** *స్వయంభూ అయిన పరమాత్మ.*


ఇలా నరసింహస్వామి హిరణ్యకశిపుని ఉదరాన్ని తన వాడియైన గోళ్లతో చీల్చి, రాక్షసుడి ప్రేగులను హారంగా ధరించి సంహరించాడు. అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు!


4. *రౌద్ర నరసింహుని ప్రశాంతత & ప్రహ్లాద స్తుతి* (9వ అధ్యాయం)


రాక్షస సంహారం తర్వాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శమించలేదు. ఆయన రౌద్ర జ్వాలలకు దేవతలు, బ్రహ్మదేవుడు, పరమశివుడు, లక్ష్మీదేవి సహితం దగ్గరకు వెళ్లడానికి భయపడ్డారు.సిద్ధులు, యక్షులు దేవతలు, ఋషులు అందరూ స్వామిని స్తుతించారు. అయినా శాంతించలేదు


అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుడిని చూసి "పుత్రా! స్వామి కోపాన్ని శాంతపరచగల సమర్థుడివి నువ్వే" అని చెప్పాడు.


* **ప్రహ్లాదుని శరణాగతి:** ఐదేళ్ల పసిబాలుడైన ప్రహ్లాదుడు ఏమాత్రం భయం లేకుండా ఉగ్ర నరసింహుని పాదాల చెంత సాష్టాంగ నమస్కారం చేశాడు.


* **వాత్సల్యం:** భక్తుడిని చూడగానే నరసింహస్వామి హృదయం ద్రవించింది. రౌద్రం నశించి వాత్సల్యం ఆవహించింది. స్వామి తన దివ్యమైన హస్తాన్ని ప్రహ్లాదుని శిరస్సుపై ఉంచి, అమృతతుల్యంగా నిమిరాడు.


* **దివ్య స్తుతి:** స్వామి స్పర్శతో ప్రహ్లాదుడు మైమరచి, పరమ పవిత్రమైన నరసింహ స్తుతి చేశాడు:(ప్రహ్లాదుడు చేసిన స్తుతి ఎంతో మహత్తరమైనది)


ఆ స్తుతి కి సంతసించి స్వామి అన్నాడు

ప్రహ్లాదా! నీవు పరమకల్యాణ స్వరూపుడవు. నీకు శుభమగుగాక. నీకు ప్రసన్నుడనైతిని. అసురోత్తమా! నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నేను మానవులకు కోరికలను ప్రసాదించువాడను.


ఆయుష్మంతుడా! నన్ను ప్రసన్నుని చేసికొనని వానికి నా దర్శనము దుర్లభము. నా దర్శనము ఐనంతనే ప్రాణుల హృదయముల యందు ఎట్టి పరితాపములు ఉండవు.నేను సమస్తమనోరథములను ఈడేర్చువాడను. కనుక శ్రేయస్కాములు, అదృష్టవంతులైన సత్పురుషులు జితేంద్రియులై తమ వృత్తులయన్నింటి ద్వారా నన్నుప్రసన్నుని చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు.


జనులు ఎక్కువగా ఆశించునట్టి | వరములద్వారా నృసింహ భగవానుడు అసురోత్తముడైన ప్రహ్లాదుని ప్రలోభపెట్టెను. ఐన, భగవంతునియందు ఏకాంతమగు భక్తి కలిగినట్టి ఆ భక్త శిరోమణి ఎట్టి వరములను కోరుకొనలేదు.


స్వామీ! నీవు వరములను అనుగ్రహించుటలో శ్రేష్ఠుడవు. నేను కోరుకొనిన వరమును ప్రసాదింపదలచినచో, నా హృదయమున ఎట్టి కోరిక అంకురింపకుండ చేయుము. ఇదియే నా కోరిక.


 హృదయమునందు ఏదేని ఒక కోరిక కలిగినచో ఇంద్రియములు, మనస్సు, ప్రాణములు, దేహము, ధర్మము, ధైర్యము, బుద్ధి, లజ్జ, సంపదలు, తేజస్సు, స్మృతి, సత్యము, మొదలగునవి అన్నియును నష్టమైపోవును.


"స్వామీ! కులం, రూపం, ధనం, తపస్సు, విద్యలు భగవంతుని ప్రసన్నం చేసుకోలేవు. కేవలం **నిష్కల్మషమైన భక్తి** మాత్రమే నిన్ను కట్టిపడేస్తుంది.


నా తండ్రి చేసిన సమస్త పాపాలను క్షమించి ఆయనకు ఉత్తమ లోకాలను ప్రసాదించు!"ఇదియే నా ప్రార్థన అన్నాడు.


5. ప్రహ్లాదుని పట్టాభిషేకం & శ్రీహరి ఆశీర్వాదం (10వ అధ్యాయం)


ప్రహ్లాదుని నిష్కామ భక్తికి, ఉదార గుణానికి ప్రసన్నుడైన నరసింహస్వామి: "ప్రహ్లాదా! నీ వంటి భక్తుడు జన్మించిన వంశంలో ఏడు తరాల పూర్వీకులు, ఏడు తరాల భావితరాలు పావనమవుతారు. నీ తండ్రి ముక్తుడయ్యాడు" అని వరమిచ్చాడు.


బ్రహ్మదేవుడు, మునుల సమక్షంలో ప్రహ్లాదునికి రాక్షస రాజ్యానికి పట్టాభిషేకం చేశారు. నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు. ప్రహ్లాదుడు సుదీర్ఘకాలం పరమ భాగవతోత్తముడిగా రాజ్యాన్ని పాలించి, చివరికి భగవత్సన్నిధిని చేరుకున్నాడు.


పరమపురుషుడైన పరమాత్మయొక్క ఈ నృసింహావతారగాథయు, హిరణ్యకశిపుని యొక్క, ఆయన సేనాపతుల యొక్క వధలును, భక్తశిరోమణియైన ప్రహ్లాదుని పావన చరితము ఏకాగ్రచిత్తముతో వినినవారు, పఠించినవారు భయరహితమైన పరంధామమును పొందుదురు.


నరసింహస్వామి ఉగ్ర రూపం శాంతించాక, ప్రహ్లాదునికి రాజ్యాభిషేకం జరుగాక. అనేక ధర్మ సంబంద విషయాలను ధర్మరాజు నారదుని అడిగాడు(ప్రహ్లాద చరిత్ర ధర్మ రాజు నారద సంవాదం ద్వారా శిశు పాలుడు మరణించిన సందర్భంగా వస్తుంది)


ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నారద మహర్షి శ్రీమద్భాగవతం సప్తమ స్కంధం (10-15 అధ్యాయాలు) లో మానవ జీవన మార్గాన్ని స్పష్టం చేశారు. అందులో **5 ముఖ్యమైన సందేశాలు**:


1️⃣ **పుట్టుక కాదు... గుణమే ముఖ్యం (వర్ణ ధర్మాలు):**

మనిషి ప్రాధాన్యత పుట్టుకతో కాదు, అతను పాటించే సత్యం, అహింస, శౌచం, ఇంద్రియ నిగ్రహం వంటి గుణాలతోనే నిర్ణయించబడుతుంది. ఎవరైతే స్వధర్మం ఆచరిస్తారో వారే ఈశ్వర అనుగ్రహం పొందుతారు.

(ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టినా పరమ భాగవతుడయ్యాడు.)


2️⃣ **ఎక్కడైనా భగవంతుణ్ణి చేరవచ్చు (గృహస్థ ధర్మం):**

రాజ్య పాలన చేస్తూ, గృహస్థుడిగా ఉంటూనే ప్రహ్లాదుడు మొదలైన ఎందరో రాజులు ముక్తి పొందారు. సంసారాన్ని వదిలేయాల్సిన పనిలేదు; చేసే ప్రతి పనిని భగవదర్పణంగా చేస్తే గృహస్థాశ్రమమే ముక్తి మార్గమవుతుంది.


3️⃣ **చిన్న ప్రాణి పట్ల కూడా దయ (అజగర వ్రతం):**

అడవిలో కొండచిలువలా ప్రశాంతంగా ఉండే ఒక అవధూత కథ(దత్తాత్రేయ సంవాదం)ద్వారా — "ఎంత లభించినా తృప్తిగా ఉండటం, ఇంట్లో ఉండే చిన్న క్రిమి కీటకాల పట్ల కూడా దయ కలిగి ఉండటం" నేర్పించారు.


4️⃣ **విద్య అంతరార్థం ఇంద్రియ నిగ్రహమే (బ్రహ్మచర్యం):**

నిజమైన చదువు అంటే విజ్ఞానంతో పాటు మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడమే.

(రాక్షస గురువులు ఎంత చెడు నేర్పించినా ప్రహ్లాదుడు మంచి వైపే నిలబడ్డాడు.)


5️⃣ **నీ ఇంట్లోనే భగవంతుడు ఉన్నాడు:**

ఆత్మారాముడై నిష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము, పెక్కు కోరికలతో లోభియై ధనమునకై అటునిటు పరుగులు తీయువానికి లభింపదు. నీలోనే నీతోనే ఈశ్వరుడు అనుక్షణం ఉన్నాడు.


 📝 నేటి ముఖ్య విషయాలు:


1. **సర్వాంతర్యామి తత్త్వం:** భగవంతుడు అణువణువునా ఉన్నాడనే ప్రహ్లాదుని విశ్వాసాన్ని నిలబెట్టడానికే స్వామి స్తంభం నుండి ఆవిర్భవించాడు.


2. **అధర్మ నాశనం - భక్త రక్షణ:** భగవంతుని ఉగ్రరూపం అధర్మాత్ములకే భయంకరం; నిశ్చల భక్తునికి ఆ రూపామే అత్యంత దయామయం, కరుణామయం!


3. **భక్తికి వయస్సు లేదు:** కులం, ధనం, వయస్సులతో సంబంధం లేదు... కేవలం శరణాగతి, నిస్వార్థ భక్తి మాత్రమే పరమాత్మ అనుగ్రహాన్ని తెచ్చిపెడతాయి.


పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ ఆశ్రమంలో ఉన్నా ధర్మం తప్పక, నిష్కామ భక్తితో జీవిస్తే భగవంతుని అనుగ్రహం మనకూ లభిస్తుంది!


.....సశేషం

🌹🙏🌹


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

భోజ కాళిదాస కథ

 భోజ కాళిదాస కథలలో ఎక్కువ కథలు భోజుడి ఔదార్యాన్నీ,కాళిదాసు కవిత్వ మహాత్యాన్నీ ప్రశంసిస్తూ చెప్పేవి.కొన్ని కథల లో కాళిదాసు యుక్తితో సమస్యల నుంచి తప్పించుకోవడం గురించి చెప్తారు.యిది అలాంటి కథ.


   దూరదేశం లో దుర్యోధను డనే కవి వుండేవాడు.ఆయన కాళిదాసు కవిత్వము గురించీ ఆయన పొందుతున్న సత్కారాలను గురించీ విన్నాడు.భోజుడి రాజ్యం లో కాళిదాసునే భోజుడికంటేఎక్కువ గౌరవిస్తారనీ విన్నాడు. దుర్యోధనుడు స్వయం గా మంచి విద్వాంసుడూ.కవీ దానికి తోడు మహా భక్తుడు,దేవీ ఉపాసకుడు కూడా.అయితేనేమి కొంచెం అసూయా పరుడు.కాళిదాసును మించిన కవిత్వం చెప్పాలనే కోరిక తో 

దేవిని గూర్చి తపస్సు చేశాడు.దేవి ప్రత్యక్ష మైంది.మాతా!నాకు కాళిదాసు ను మించిన కవితా పాటవాన్ని ప్రసాదించు.కాళిదాసును ఓడించాలని నాకోరిక. అని అడిగాడు..అప్పుడు దేవి భక్తా! నీ కోరిక లో ఈర్ష దాగి వుంది అది నీకు మంచిదికాదు.కాళిదాసు నా భక్తుడు.నా వరం తోనే మహా కవి యైన వాడు.ఆయన తో నీకు పోటీ కూడదు.అయినా తపస్సు చేసి నన్ను మెప్పించావు కాబట్టి,నీకు ఆ శక్తిని ప్రసాదిస్తున్నాను. కానీ 

రాబోయే పౌర్ణమి నాటికి భోజుడి ఆస్థానం చేరితే ఆ రోజు ఒక్కరోజు మాత్రమే ఆ శక్తి పనిచేస్తుంది. అని చెప్పి అంతర్ధాన మైంది.

సంతోషం తో తన పరివారాన్ని తీసుకొని ధారనగారానికి వెళ్లి నగర శివార్లలో విడిది చేసి పొర్ణమి నాడు తను 

రాజాస్థానానికి వస్తున్నానని కబురు పంపాడు.ఆ సాయంత్రం కాళిదాసు రోజు లాగే కాళీమాతను పూజిస్తూండగా దేవి పలుకులు వినిపించాయి కాళిదాసా! రేపు మీ ఆస్థానం చేరబోతున్న దుర్యోధన కవికి ఈ ఒక్క రోజుకూ నేను నిన్ను ఓడించగల శక్తి ప్రసాదించినాను.ఈ ఒక్కరోజూ దుర్యోధనుడిని గెలవటానికి నేను ఏమీ సహాయం చేయలేను.నీ వేమయినా జాగ్రత్త పడతావేమో నని నిన్ను హెచ్చరిస్తున్నాను.అని చెప్పి మాయమై పోయింది.కాళిదాసు ఒక యుక్తి పన్నాడు.గడ్డి మోపులు అమ్మేవాడిలాగా వేషం వేసుకొని ఊరిబయట వున్నగుడారాలలో విడిది చేసిన దుర్యోధనుడి పరివారాల దగ్గరికి వెళ్లి గుర్రాలకు కావలిసిన మేత కారు చౌకగా అమ్మాడు.రాత్రయిపోయిందని సాకు చెప్పి అక్కడే వుండి పోయాడు. 

గుడారం లో దుర్యోధనుడికి నిద్ర పట్టలేదు,కాళిదాసు కూ నిద్ర పట్టలేదు.యిద్దరికీ రేపేంజరుగుతుందో నని ఆందోళనా భయం.దుర్యోధనుడు తెల్లవారక ముందే తన గుడారం నుంచి బయటికి వచ్చిఅక్కడే తిరుగుతున్నాడు. కాళిదాసు అయన ప్రక్కన చేతులు కట్టుకొని నిలబడ్డాడు.పడమటి దిక్కున చంద్రుడు యింకా ప్రకాశిస్తున్నాడు.సూర్యోదయం యింకా కాలేదు.పక్షుల కలకలా రావాలు అప్పుడప్పుడే మొదలవుతున్నాయి.ప్రకృతి ఎంత అందం గా వున్నది.యిదంతా చూస్తుంటే నీ హృదయం స్పందించడం లేదా?అని అడిగాడు.దుర్యోధనుడు మారువేషం లో వున్న కాళిదాసును.గడ్డి అమ్ముకునే వాడిని నాకవన్నీ 

ఏమి తెలుస్తాయి?మీరే ఏదైనా మంచి వర్ణన చెప్పండి వింటాను అన్నాడు.అయితే విను.

 

చరమగిరి కురంగీ శృంగ కండూయనేన 

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 


అంటే అర్థ మయిందా?నీకు కాలేదనుకుంటాను నేను చెప్తాను అన్నాడు.చిత్తం అవసరం లేదండీ.కాళిదాసు గారి గుర్రాలకు కూడా నేనే గడ్డి అమ్ముతాను అక్కడి సేవకులతో మాట్లాడుతుంటాను.కాళిదాసుగారి కవిత్వం అప్పుడప్పుడూ వింటూ వుంటాను మరీ కఠిన మైనవి అర్థం కావు కానీ ఇలాంటి చిన్న చిన్న శ్లోకాలు అర్థం చేసుకోగలను.అన్నాడు.దుర్యోధనుడు నివ్వెర పోయి ఏదీ చెప్పుచూద్దాం అన్నాడు.

చరమగిరీ అంటే పడమటి కొండ కురంగీ అంటే లేడి శృంగం అంటే క్మొమ్ము కండూయనం అంటే దురద పోయేలా హాయి కలిగించేలా మెల్లగా గీరటం.అంతరిందో:కురంగః అంటే ఆ చంద్రుని లోపల కనిపిస్తున్న లేడి.

(చంద్రుడికి హరిణాంకుడు అని పేరు.మధ్యలో హరిణం వున్నవాడు.అని అర్థం)వెరసి మీరనేది పడమటికొండ అనే లేడి తన కొమ్ములతో చంద్రుడి లో వున్న లేడికి హాయి గొలిపేలా గీరుతూ వుంటే అది నిద్రావస్థ లోకి యిప్పుడు జారుకుంటున్నది అని అంతే కదా కవిరాజా! అన్నాడు.అమాయకత్వం నటిస్తూ.ఆరి పిడుగా అని ఆశ్చర్య పోయాడు దుర్యోధనుడు.గడ్డి అమ్ముకునే వాడికే యింత పాండిత్యం వుంటే యిక ఆస్థానం లోని కవులేంతటి వారో అని అతనికి వణుకు పుట్టింది.పైకి మాత్రం డాంబికంగా చూశావాఅలంకారం యెంత బాగా 

వేశానో అన్నాడు.అలంకారానికేమి స్వామీ అద్భుతం గా వున్నది.కాకపొతే నాదొక చిన్న సందేహం

'చరమగిరి కురంగీ' అన్నారు కదా!కురంగీ అంటే ఆడలేడి.ఆడ లేడికి కొమ్ములు వుండవు కదండీ మీరు యే 

భావం తో చెప్పారో వివరం చెప్పరా?అన్నాడు కాళిదాసు.దుర్యోధనుడి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.

తను పప్పులో కాలేశాడు.వీడే తన కవిత్వం లో తప్పులు చూపిస్తున్నాడే అని కొంత ఆందోళన పెరిగింది.

పైకి మాత్రం ఆ ఏదో తెల్లవారు ఝాముననె నిద్రకళ్ళతో ఆశువుగా రెండు ముక్కలు చెప్పానులే నువ్వు కనుక్కో గలవో లేదో అని నిన్ను పరీక్షించ డానికి చెప్పాను అన్నాడు.ఇది అద్భుతమైన ఊహండీ ఏ భాసుడో

సౌమిల్లుడో చెప్పాల్సినంత గొప్ప శ్లోకం.నాకు తెలుసు మీరు కావాలనే తప్పు చెప్పారని. ఇలాంటి తప్పులు సవరించడం నేను కాళిదాసు గారి దగ్గర నేర్చుకున్నానండీ మీరు నన్నుప్రోత్సహిస్తున్నారు కాబట్టి నేను దీన్ని సవరించి చెప్తానండీ మీకు నచ్చుతుందో లేదో తెలియదు.

మీ శ్లోకం లో 'శృంగీ' అన్న దానికి బదులుగా 'తుండీ' అని మారిస్తే సరిపోతుందండీ తుండి అంటే ముట్టే అని అర్థం వస్తుంది కదండీ అందుకని సరిపోతుంది.మిగతా రెండు పాదాలూ చెప్పేయండి.అన్నాడు.దుర్యోధన కవి కంగారు పడ్డాడు. ఆ చలిలో కూడా చెమట పట్టిందిఅయినా పైకి బింకంగా, .కవిత్వం చెప్పడం, 

శ్లోకం పూర్తి చెయ్యటం అంటే గడ్డిమోపులు అమ్మినంత సులభం కాదు.అలంకారం,ధ్వనీ రసం అన్నీ సరిచూసుకోవాలి కదా!వున్న పళాన చెప్పేది కాదు అన్నాడు.నిజమే లెండి అవన్నీ ఆలోచించి మీరు శ్లోకాన్ని ఎలా పూరిస్తారో నాకు తెలియదు కానీమా కాళిదాసు గారి గొడ్ల కాపరి దగ్గర ఇలాంటి శ్లోకాలు పూరించటం నేను రెండు మూడు రోజులు నేర్చుకున్నాను.వాడి శైలి కొంచెం అనుకరించి ఈ శ్లోకం నేను పూరిస్తాను చూడండి. కాళిదాసు గారు పండితులతో ముచ్చటిస్తూ వుంటే విని నాకూ కొంచెం శ్లోకాలు యెలా పూరించాలో అబ్బింది లెండి. ఈ శ్లోకం మిగతా రెండు పాదాలూ వాడైతే బహుశా యిలా పూరిస్తాడు. 

'పరిణిత రవి గర్భ వ్యాకులా పౌరుహూతీ

దిగాపి ఘన కపోతీ హుంకృతై: క్రందతీవః అంటాడు.


మీరు పడమటి దిక్కు గురించి రెండు పాదాలు చెప్పారు.తూర్పుదిక్కు గురించి మిగతా రెండు పాదాలూ 

చెప్తే సరిపోతుంది కదా! అని చెప్పాను .పౌరుహూతి అంటే తూర్పు దిక్కు కదండీ 'పరిణత రవి గర్భ వ్యాకుల'

అంటే సూర్యుడిని గర్భం లో వుంచుకొని నెలలు నిండిన వనితలా ప్రసవ వేదన తో కేకలు పెడుతున్నది కదండీ అదిగో 'ఘన కపోతీ హుంకృ తై క్రందతీవ' అంటే పక్షుల పెద్ద పెద్ద అరుపుల రూపం లో ఆమె ప్రసవ వేదన పడుతున్నట్లు అనిపించడం లేదూ?అంటూ అప్పుడే లేచి కలకలా రావాలు చేస్తున్న పక్షులను చూపించాడు.కాళిదాసు.శ్లోకం పూర్తయింది.

చరమగిరి కురంగీ తుండ కండూయ నేన

స్వపితి పునరిదానీం అంతరిందో:కురంగః 

పరిణిత రవి గర్భ వ్యాకులా పౌర హూతీ 

దిగపి ఘన కపోతీ హుంకృతై :క్రందతీవః

పడమటి కొండ అనే ఆడ లేడి చంద్రుడిలో వుండే హరిణాన్ని తనముట్టెతో దానికి హాయి గోలిపేలా గీరుతున్నది.యిక తూర్పుదిక్కు సూర్యుడిని తన గర్భం లో దాచుకొని నెలలు నిండిన వనిత ప్రసవ వేదన పడుతున్నప్పుడు చేసే ఆక్రందనల్లాగా పక్షుల కిలకిలా రావాలు అనిపిస్తున్నాయి. 

దుర్యోధనుడికి ఆ కవిత్వ సౌందర్యానికి ఒళ్ళు పులకరించింది.తనకు రాజాస్థానం లోపరాభవం తప్పదని 

భయం వేసి దేవీ కటాక్షం మీద కూడా నమ్మకం పోయి ఈ కవుల ముందు తాను నిలువ లేనని పించి 

అప్పటికపుడే తన సేవకులందరినీ లేపేసి తెల్లవారక ముందే సపరివారం గా వూరు విడిచి వెళ్లి పోయాడు.

కాళిదాసు

 ' మాణిక్యవీణా ముపలాలయంతీం'

మదాలసాం మంజుల వాగ్విలాసాం 

మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం 

మాతంగ కన్యాం మనసా స్మరామి' 

అంటూ మునుపెన్న డో తనే రచించిన శ్లోకాలతో కాళీ మాతను స్తుతించు కుంటూ ఇల్లు చేరాడు.

                                                       స్వస్తి

భగవద్గీత

  --------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।

సుఖేన బ్రహ్మసంస్పర్శమత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।



ప్రతిపదార్థ:



యుంజన్ — ఏకమై (ఆత్మ భగవంతునితో); ఏవం — ఈ విధంగా; సదా — ఎల్లప్పుడూ; ఆత్మానాం — ఆత్మ; యోగీ — ఓ యోగి; విగత — మిముక్తి నొంది; కల్మషః — పాపములు; సుఖేన — సునాయాసముగా; బ్రహ్మ-సంస్పర్శమ్ — నిత్యము పరమాత్మతో ఉండి; అత్యంతం — అత్యున్నతమైన; సుఖమ్ — ఆనందము; అశ్నుతే — పొందును.

 


తాత్పర్యము: 


స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛ పొందుతాడు, మరియు ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచే, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.



వివరణ:


ఆనందము అనేదాన్ని నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:


సాత్త్వికం సుఖమాత్మోత్థం విషయోత్థం తు రాజసం

తామసం మోహదైన్యోత్థం నిర్గుణం మదపాశ్రయాం


(భాగవతం 11.25.29)


తామసిక ఆనందం : మాదకద్రవ్యాలు, మద్యము, ధూమపానము, మాంసాహారము, హింస, నిద్ర, మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం, ఇది.


రాజసిక ఆనందం : మనస్సు మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం, ఇది.


సాత్త్విక ఆనందం : కరుణ, క్షమ, ఇతరులకు సేవ, జ్ఞాన సముపార్జన, మరియు మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందం, ఇది. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం ఈ కోవకు చెందినదే.


నిర్గుణ ఆనందం : ఇది భగవంతుని దివ్య ఆనందము, ఇది పరిమాణంలో అనంతమైనది. ప్రాపంచిక భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛ పొంది మరియు భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క ఈ అత్యున్నత స్థాయిని పొందుతాడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనినే ఆయన అనంతమైన ఆనందము అని 5.21వ శ్లోకంలో మరియు సర్వోత్కృష్ట ఆనందము అని 6.21వ శ్లోకంలో అన్నాడు.

పాదారవింద శతకం - 2*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 44*


*గిరాం దూరౌ చోరౌ జడిమతిమిరాణాం కృతజగ-*

*త్పరిత్రాణౌ శోణౌ మునిహృదయలీలైకనిపుణౌ ।*

*నఖైః స్మేరౌ సారౌ నిగమవచసాం ఖండితభవ-*

*గ్రహోన్మాదౌ పాదౌ తవ జనని కామాక్షి కలయే ॥*


*భావము :*


*అమ్మా! నీ పాదములను వర్ణించడం ఆదిశేషునకైనా తరమా! అజ్ఞానమును పారద్రోలేవీ, జగద్రక్షణములు, యోగుల హృదయములలో నివసించేవి, సమస్త వేదసారములైనవి, సాంసారిక బాధలను తొలగించేవి అయిన నీ దివ్య పాదములను నిరంతరము ధ్యానిస్తున్నాను.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

10, ఆగస్టు 2026, సోమవారం

వేపచెట్టులోని ఔషధ గుణాలు - imp

 వేపచెట్టులోని గొప్ప ఔషధ గుణాలు -

   

. మనకి వేపచెట్టు ఔషధ గుణాలు ఉన్న చెట్టుగా మాత్రమే తెలుసు. కాని ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. అందుకోసమే నేను చాలా పురాతన గ్రంథాలు పరిశోధించి మరియు నాయొక్క సొంత అనుభవాలు కలిపి మీకు ఇక్కడ తెలియచేస్తున్నాను. ఇప్పుడు నేను తెలియచేయబోయే విషయాలను జాగ్రత్తగా దాచుకోగలరు.

 

* ఎంతోకాలంగా ఉండి మానని మొండి కురుపులకు వేపాకు నూరి కట్టిన అవి చాలా తొందరగా నయం అగును.

 

* వేపాకు చిగురు ప్రతిరోజు ప్రాతఃకాలం నందు సేవించుచున్న రక్తం శుద్ధి అయ్యి శరీరం పైన ఉండు నల్లటి మచ్చలు ముఖ్యంగా ముఖంపైన ఉండు మచ్చలు తొలగిపోవును .

 

* వేపచిగురు ప్రతినిత్యం పరగడుపున భుజించువారికి కొంతకాలానికి చేదుగా కాక తియ్యగా అనిపించును. వారికి పాము కరిచినను విషం ఎక్కదు.

 

* వేపచెక్క గంధంని శరీరంపై పూసుకొనిన చర్మంపై వచ్చు చర్మవ్యాధులు హరించును. శరీరం పేలినట్లు ఉండటం, దురద, శోభి , మంగు, తామర వంటి చర్మవ్యాధులు హరించును .

 

* ముదురు వేపచెట్టు యొక్క వేరు చూర్ణం కొద్దిమోతాదుగా లోపలికి పుచ్చుకొనిన రక్తంని శుభ్రపరచును. శరీరానికి పుష్టి కలిగించును. జ్వరమును పారద్రోలును , క్రిములను నాశనం చేయును .

 

* వేపచెక్క చూర్ణం పసిపిల్లలకు ఇచ్చినచో కడుపులో ఉండు ఏలికపాములు , నులిపురుగులను సమర్ధవంతంగా నాశనం చేయును .


 * వేపచెక్క చూర్ణం పెద్దవారు సేవించిన అజీర్ణం వలన కలుగు జ్వరం తగ్గును.


 * వేపచెట్టు వేరు , బెరడు, ఆకు , ఈనే, పువ్వు, పిందె , కాయ, పండు, కల్లు , జిగురు ఇవి అన్నియు పలువిధములైన రుగ్మతలను నశింపచేయగలవు .


 * వేపాకు , పువ్వు శరీరం యొక్క తత్వమును మంచిస్థితికి మార్చి జీర్ణశక్తిని వృద్ధిపరచును.


 * వేపాకు రసం సేవించటం వలన జ్వరము, అజీర్తి, బలహీనం, పాండువు, క్రిమిరోగం, గండమాల , వ్రణములు, కుష్టు మొదలైనవి నశించును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన నరముల సంబంధం వలన వచ్చు "న్యూరాల్జియా"అను తలనొప్పి తగ్గును.

 

* వేపాకు వడబెట్టి తలకు కట్టిన తలలోని పేలు , ఈపి , చుండ్రు నశించును.

 

* చీముకారు పుండ్లకు వేపాకు నూరి ముద్దచేసి కట్టిన వాటిని మిగిల్చి మానునట్లు చేయును .

 

* వేప బెరడు , వేప ఈనెల కషాయం , రోజుమార్చి రోజు వచ్చు జ్వరం నశించును.

 

* వేపాకు ఆముదంతో వెచ్చచేసి కీళ్లవాపులకు కట్టిన తగ్గును.

 

* లేతవేప చెట్టు నుంచి తీయబడిన కల్లు తియ్యగా ఉండును.దీన్ని పులియబెట్టి సేవించిన ఆమాశయ సంబంధమైన అజీర్తిని , క్రిములను పోగొట్టి మంచి ఆకలిని కలిగించును.

 

* వేప కల్లు క్షయ, కుష్టు మొదలయిన అసాధ్యరోగాలను కూడా తగ్గించును .

 

* వేప విత్తనాల నూనె చేదుగా ఉండును. ఈ నూనె లొపలికి సేవించిన వాతము హరించి ఉద్రేకమును పుట్టించును. అనగా వేడిని పెంచును.


 * ఈ వేపనూనె చర్మవ్యాధులను, క్రిమిజాడ్యములకు, మూలవ్యాధిని , మూత్రవ్యాధిని తగ్గించును .

 

* వేపనూనె , ఆవనూనె, కొబ్బరినూనె సమభాగములాగా తీసుకుని కాచి చర్మవ్యాధులకు, కీళ్ళనొప్పులకు , వాపులకు , తలనొప్పికి ఉపయోగించవచ్చు.

 

* పురిటి ఇంటి యందు వేపచమురుతో దీపం పెట్టిన శిశువులకు బాలగ్రహాది పీడలు కలగవు అని హిందువులకు గాఢమైన నమ్మకం.

 

* వేప బంక పై పూతగా ఉపయోగించుట వలన సడలిపోయిన నరములు బిగువుగా అగును.


 * వేపాకు కషాయాంతో పుండ్లు కడిగిన త్వరగా మానును.

 

* వేపచెట్టు గాలి ప్రతినిత్యం తగులుచున్న మశూచి,కలరా వంటి వ్యాధులు దరిచేరవు.

 

* నూరు సంవత్సరములు కలిగిన వేపచెట్టు కాండంలో మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు పట్టేంతగా తొర్రని తొలచి అందులో సుమారు ఒక కిలో బియ్యమును అన్నంగా వండి వేడి తగ్గక ముందే ఆ తొర్రలో వేసి ఆ వేపచెట్టు పచ్చికఱ్ఱతోనే ఆ తొర్ర మూసేవిధంగా బిరడాలా చేసి బిగించి లొపలికి గాలిపోకుండా పైన ఆవుపేడను పూసి మూసివేయవలను . ఒక సంవత్సరం పాటు అలా ఉంచి ఆఖరు దినమున ఆ అన్నమును తీసిన ఎర్రగా మారిపోయి ఉండును.దానిని బాగా ఎండించి పూటకు రెండు నుంచి 3 గ్రాముల చొప్పున రెండుపూటలా 40 దినములు పుచ్చుకొనిన కుష్టురోగం నశించును.


 * వేపాకు మోతాదు మించి ఎక్కువుగా తినినచో మత్తు, మైకం, వాంతులు , విరేచనాలు అగును . కావున 4 నుంచి 5 ఆకుల వరకు తినవచ్చు.