*
*శ్రీమద్భాగవతం - 22/42*
*మత్స్యావతారం, సూర్యవంశం & అంబరీషుని ఏకాదశి వ్రతం*
ఓం నమో భగవతే వాసుదేవాయ!
మన భాగవత యాత్రలో
నిన్నటి రోజున వామనావతారం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మత్స్యావతార వృత్తాంతం (సత్యవ్రతుని కథ), సూర్యవంశ ఆరంభం మరియు అంబరీష మహారాజు ఏకాదశి వ్రతం / దుర్వాస మహర్షి గర్వభంగం** గురించిన వివరాలు యథాతథంగా తెలుసుకుందాం.
#1. మత్స్యావతార ఆవిర్భావం & సత్యవ్రతుడు
చాక్షుష మన్వంతరాంతంలో 'సత్యవ్రతుడు' అనే రాజర్షి (ఈయనే తర్వాతి జన్మలో అంటే ప్రస్తుతం జరిగే మన్వంతరం లో వివస్వంతునీ పుత్రుడు గా పుట్టి వైవస్వత మనువు అయ్యాడు) కృతమాల నదిలో జల తర్పణాలు ఇస్తుండగా, ఆయన దోసిలి నీటిలోకి ఒక చిన్న చేపపిల్ల వచ్చింది.దాన్ని నీటితో సహా మళ్ళీ నదిలోకి జారవిడిచాడు సత్యవ్రతుడు.
* **రక్షణ కోరిన చేప:** ఆ చిన్న చేపమిక్కిలి దైన్య స్వరంతో"రాజా! నన్ను ఈ పెద్ద చేపల నుండి రక్షించు" అని వేడుకొనగా, సత్యవ్రతుడు దయతో దాన్ని తన కమండలంలో వేశాడు.
* **రూప పెరుగుదల:** మరుసటి రోజుకి ఆ చేప కమండలానికి పట్టనంతగా పెరిగింది. రాజా నాకు ఉండుటకు చోటు చాలడం లేదు కాస్త పెద్ద స్థానం ఏర్పాటు చేయి అని వేడుకోగా రాజు దాన్ని ఒక పాత్రలో వేశాడు, అందులో వేసిన క్షణాల్లోనే అది మూడు మూరలు పెరిగింది రాజా నాకు ఇది కూడా చాలటం లేదు అంటే సరస్సులో వేశాడు అందులో కూడా క్షణాల్లో పెరిగితే, నీరు బాగా సమృద్ధిగా ఉండే పెద్ద తటాకం లో వేసాడు,ఇక ఎక్కడ ఉంచాలో అర్దం కాలేదు సముద్రమే అనంతం కనుక అందులో వదులుతూ ఉండగా లీలా మత్స్యం ఇలా అన్నది రాజా సముద్రం లో మొసళ్ళు ఉంటాయి నన్ను తినేస్తాయి వదలకు అన్నది.
ఆ మత్స్యము యొక్క మధురమైన పలుకులు విని సత్యవ్రతుడు ఇలా అన్నాడు. నన్ను మోహం లో ముంచిన నీవు ఎవరు, ఒకేరోజు లో వందయోజనల సరస్సు ఆక్రమించావు. ఇలాంటి జలచరం ఎక్కడ కనలేదు వినలేదు. నీవు తప్పక సర్వాంతర్యామి అయిన శ్రీహరే జీవులను అనుగ్రహించుటకు ఇలా మత్స్య రూపం ధరించావు అని స్వామికి ప్రణమిల్లగా, మత్స్యరూపి అయిన స్వామి ఇలా ఆజ్ఞాపించాడు:
"సత్యవ్రతా! ఇక్కడికి ఏడో రోజున ప్రళయం వచ్చి ముల్లోకాలు నీటిలో మునిగిపోతాయి. ఆ సమయంలో ఒక పెద్ద నౌక (పడవ) నీ వద్దకు వస్తుంది. నువ్వు సకల ప్రాణుల సూక్ష్మ శరీరాలు వెంటపెట్టుకుని, సమస్త ఓషధులను, ధాన్యాలను, సప్తరుషులను ఆ నౌకలోకి ఎక్కించు. నేను ఈ సముద్రంలో కొమ్ము కలిగిన దివ్య మత్స్యరూపంలో ఈదుకుంటూ వస్తాను.వాసుకి అనే సర్పరాజును తాడుగా చేసి, ఆ పడవను నా కొమ్ముకు కట్టివేయి. ప్రళయాంతం వరకు మిమ్మల్ని రక్షిస్తాను."
ఆ సమయమున చుట్టూ మహాసాగరజలములే యుండును. ఏ మాత్రమూ వెలుతురు ఉండదు. కేవలము ఋషులయొక్క దివ్యకాంతుల సహాయమున ఎట్టి తడ బాటూ లేకుండ నీవు ఆ నావపైన ఎక్కి నలువైపుల విహరించుచుండవలెను. ప్రచండవాయువుల కారణముగా ఆనావ ఇటునటు కదలుచుండును. అప్పుడు నేను ఈ మత్స్యరూపమున నేను దాన్ని రక్షిస్తూ ఉంటాను.
మహారాజా!అలా బ్రహ్మదేవుని యొక్క రాత్రి సమయము ముగియునంత వరకు ఋషులతోసహా నిన్ను ఆ నావను లాగుచు సముద్రమున విహరించెదను.
ప్రళయ జలధిలో మత్స్యభగవానుడు సత్యవ్రతునికి, సప్తరుషులకు పరమ ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించాడు (దీనినే **'మత్స్య పురాణం'** అంటారు). అలాగే హయగ్రీవాసురుడు అపహరించిన వేదాలను సంహరించి బ్రహ్మదేవునికి అప్పగించాడు.
#2. నవమ స్కంధ ప్రవేశం – సూర్యవంశ వర్ణన (9వ స్కంధం – 1, 2, 3, 4 అధ్యాయాలు)
సత్యవ్రతుడు ప్రళయాంతంలో 'వైవస్వత మనువు' అయ్యాడు. వైవస్వత మనువు కుమారులలో **ఇక్ష్వాకువు, శర్యాతి, నాభాగుడు** మొదలైనవారు ప్రముఖులు.
* **ఇల వృత్తాంతం:** మనువు పెద్ద కుమారుడైన 'ఇలుడు' పరమశివుని శాపం వల్ల స్త్రీగా (ఇలగా) మారి, బుధుని వివాహమాడి పురూరవునికి జన్మనిచ్చాడు.
* **శర్యాతి & సుకన్య:** శర్యాతి చక్రవర్తి కుమార్తె సుకన్య పొరపాటున చ్యవన మహర్షి కళ్లను దర్భతో పొడిచింది. తప్పు తెలుసుకుని ముసలివాడైన చ్యవనుడిని వివాహం చేసుకుని పతిసేవ చేసింది. అశ్విని దేవతలు ప్రసన్నులై చ్యవనునికి నవయౌవనాన్ని అనుగ్రహించారు.
#3. అంబరీష మహారాజు భక్తి నిష్ఠ (9వ స్కంధం – 4వ అధ్యాయం)
సూర్యవంశంలో నాభాగుని కుమారుడైన **అంబరీష మహారాజు** మహాభాగవతోత్తముడు. సకల భూమండలానికి అధిపతి అయినప్పటికీ, ఐశ్వర్యాన్ని మిథ్యగా భావించి తన సకల ఇంద్రియాలను శ్రీహరి సేవలోనే నియోగించాడు: **"స వై మనః కృష్ణపదారవిందయోర్వచాంసి వైకుంఠగుణానువర్ణనే..."** *మనస్సును కృష్ణుని పాదపద్మాలపై, వాక్కును హరి గుణగానంపై, చేతులను హరి మందిర మార్జనంపై, చెవులను హరికథా శ్రవణంపై, నేత్రాలను విష్ణు విగ్రహ దర్శనంపై నిలిపి జీవించాడు.*
అంబరీషుని నిశ్చల భక్తికి ప్రసన్నుడైన శ్రీమహావిష్ణువు, ఆయన రాజ్యానికి ఏ ఆపదా రాకుండా తన **'సుదర్శన చక్రాన్ని'** రక్షణగా ఇచ్చి వెళ్లాడు.
#4. ఏకాదశి వ్రతం & దుర్వాస మహర్షి ఆగమనం (4, 5 అధ్యాయాలు)
అంబరీష మహారాజు తన భార్యతో కలిసి సంవత్సరం పాటు **'ద్వాదశి (ఏకాదశి) వ్రతాన్ని'** నియమబద్ధంగా ఆచరించాడు. వ్రత ముగింపు రోజున దానధర్మాలు పూర్తి చేసి పారణ (భోజనం) చేయడానికి సిద్ధపడుతుండగా, **దుర్వాస మహర్షి** తన శిష్యులతో అక్కడకు వచ్చాడు.
* **కాలపరిమితి ధర్మసంకటం:** అంబరీషుడు దుర్వాసుని భోజనానికి ఆహ్వానించగా, మహర్షి యమునా నదిలో స్నానానికి వెళ్లాడు. ద్వాదశి ఘడియలు ముగిసిపోతున్నాయి. ద్వాదశి దాటితే వ్రతభంగం అవుతుంది, బ్రాహ్మణుడు రాకముందే తింటే అతిథి అవమానం అవుతుంది.
* **తీర్థ ప్రాశనం:** పండితుల సలహా మేరకు అంబరీషుడు కేవలం **తులసి తీర్థాన్ని మాత్రమే** పుచ్చుకుని ద్వాదశిని కాపాడుకున్నాడు.
* **దుర్వాసుని ఆగ్రహం & కృత్యోత్పత్తి:** తిరిగి వచ్చిన దుర్వాసుడు తన దివ్యదృష్టితో విషయగ్రహణం చేసి: "నన్ను కాదని భోజనం చేస్తావా!" అని తీవ్ర ఆగ్రహంతో తన జటను పీకి భూమిపై కొట్టాడు. దాని నుండి అంబరీషుడిని దహించడానికి భయంకరమైన **'కృత్య' (రాక్షసి)** ఆవిర్భవించింది.
#5. సుదర్శన చక్ర విక్రమం & దుర్వాసుని శరణాగతి (5వ అధ్యాయం)
అంబరీషుడు భయపడకుండా శ్రీహరిని ధ్యానిస్తూ నిలబడ్డాడు. మరుక్షణమే అంబరీషునికి రక్షణగా ఉన్న **సుదర్శన చక్రం** జ్వాలలను చిమ్ముతూ వచ్చి ఆ కృత్యను క్షణంలో బూడిద చేసింది. ఆ తర్వాత దుర్వాసుడిని సంహరించడానికి ఆయన వెంట పడింది.
* **ముల్లోకాల ప్రయాణం:** దుర్వాసుడు భయంతో దిక్కులు పిక్కటిల్లేలా పరిగెత్తాడు.
#1. బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ: "విష్ణుచక్రాన్ని ఆపే శక్తి నాకు లేదు" అన్నాడు.
#2. కైలాసానికి వెళ్లి పరమశివుడిని వేడుకున్నాడు. శివుడు: "నేను కూడా శ్రీహరి ఆజ్ఞకు బద్ధుడనే, నన్ను రక్షించలేను" అన్నాడు.
#3. వైకుంఠానికి వెళ్లి శ్రీమహావిష్ణువు పాదాలపై పడ్డాడు. **శ్రీహరి జవాబు (భక్త పరాధీనత):** **"అహం భక్తపరాధీనో హ్యస్వతంత్ర ఇవ ద్విజ |**
**సాధుభిర్గ్రసితహృదయో భక్తైర్భక్తజనప్రియః ||"** "మునిశ్రేష్ఠా! నేను భక్తులకు పరాధీనుడను (దాసుడను). నా హృదయం సాధువుల యందు నిలిచి ఉంది. నా భక్తులు నా కోసం సమస్తాన్ని త్యజించారు. వారిని సాధించే వారిని నేను రక్షించలేను. నువ్వు వెంటనే వెళ్లి **ఆ అంబరీషుని పాదాలు పట్టుకో!** ఆయన క్షమిస్తేనే సుదర్శనం శాంతిస్తుంది."
దుర్వాసుడు తిరిగి వచ్చి అంబరీషుని పాదాలపై పడ్డాడు. పరమ భాగవతుడైన అంబరీషుడు సంకోచించి, సుదర్శన చక్రాన్ని స్తుతించి మహర్షికి ఏ ఆపదా రాకుండా శాంతింపజేశాడు. దుర్వాసుడు అంబరీషుని భక్తిని, ఉదారత్వాన్ని కొనియాడి ఆశీర్వదించాడు.
📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:
1. **ఏకాదశి వ్రత మహత్యం:** ద్వాదశి పారణ సమయం ఎంత పవిత్రమైనదో, అంబరీషుని వ్రతనిష్ఠ మనకు తెలియజేస్తుంది.
2. **భక్త పరాధీనత:** పరమాత్మ తన భక్తుల పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉంటాడో భాగవతంలో అత్యంత స్పష్టంగా చాటే శ్లోకం "అహం భక్తపరాధీనః".
3. **వైష్ణవ క్షమాగుణం:** తనను చంపడానికి రాక్షసిని సృష్టించిన దుర్వాసుడిని కూడా అంబరీషుడు క్షమించి, ఆపద నుండి రక్షించాడు.
*(రేపటి **రోజు 23** లో: నవమ స్కంధ మధ్య భాగం – సూర్యవంశంలో పవిత్ర రఘువంశ చరిత్ర (శ్రీరామావతార సంగ్రహం) & చంద్రవంశ వర్ణన (యయాతి, పురూరవుల వైరాగ్య కథలు) యథాతథంగా తెలుసుకుందాం!)*
రేపు భాగవతంలో రామాయణం రాబోతుంది తెలుసుకుని, ఏమి అదృష్టం అండి చాతుర్మాస్య కాలంలో శ్రావణ మాసంలో భాగవతం చదివే భాగం ఇచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇది మనం అనుకుంటే అయ్యేది కాదు,ఆయన అనుగ్రహిస్తే జరిగేది ఎన్ని జన్మల సుకృతమో చదువుకుని తరిద్దాం, మనమేన నలుగురికి షేర్ చేసి వారు కూడా చదివేలా చేసి వారిని కూడా తరింపచేద్దాం
....సశేషం
🙏🌹🙏
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*