8, సెప్టెంబర్ 2026, మంగళవారం

కేశవ నామాల విశిష్టత-అర్ధం*

  


*🙏🌹కేశవ నామాల విశిష్టత-అర్ధం* 🙏🌹


మనము ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ వ్రతము, ఏ నోము నోయాలన్నా, ఏ యజ్ఞము చేయాలన్నా సంకల్పానికి ముంచుగా ఆచమనము చేస్తూ


కేశవాయనమః

నారాయణాయనమః

మాధవాయనమః


అని ఉద్ధరిణితో నీళ్ళు తీసుకుని 3సార్లు తీర్థము తీసుకుని,తరువాత గోవిందాయనమః అని నీరు వదలుతాము.ఈ 24 కేశవ నామాలు చెప్పడంలో విశిష్టత ఏమి? దాని విషయము, అర్థము తెలుసుకొని ఆచరిస్తే కార్యము అర్థవంతము అవుతుంది.ఏదైనా దాని విశిష్టత తెలుసుకొని చేస్తే ఆ కార్యము పైన ఎక్కువ భక్తి శ్రద్ధలు ఏర్పడి మనస్సులో చానిపైన పరిపూర్ణమైన విశ్వాసము కలుగుతుంది.ప్రీతితో కార్యము చేస్తాము.


01. ఓం కేశవాయనమః(శంఖం _చక్రం_గద_పద్మం)


బ్రహ్మ రుద్రు (ఈశుడు,శివుడు ) లను పుట్టించినవాడు, బ్రహ్మ రుద్రులకు ప్రవర్తకుడూ,నియామకుడూ అయినందువల్ల శ్రీహరి ‘కేశవుడు’అనబడుతున్నాడు.ఈ కేశవుడు గాయత్రిలోని ‘తత్’ అన్న మొదటి అక్షరానికీ,‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అన్న మహామంత్రం లోని ‘ఓం ’అన్న అక్షరానికీ,ఇరవై నాలుగు తత్వాలలో మొదటిదైన అవ్యక్త తత్వానికీ,మార్గశీర్షమాసానికీ,శుక్లపక్షంలో లలాటంమీద ధరించే ద్వాదశ ఊర్ధ్వపుండ్రాలలో ఒకటైన నామానికీ,మేషరాశికీ,ఆహారపదార్థాలలో ఒకటైన అన్నానికీ నియామకుడు.


02. ఓం నారాయణాయనమః (పద్మం_గద_చక్రం_శంఖం)


నాశరహితుడైనందువల్ల విష్ణువు ‘నరుడు’ ఆయన చేత, సృష్టించబడిన జలం ‘నార’అనబడుతోంది.ప్రళయోదకం మీద శయనించిన విష్ణువు ‘నారాయణుడు’ అయ్యాడు.

ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘న’అక్షరానికీ,గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ, మహత్తత్వానికీ,పౌష్యమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం మీద ధరించే నామానికీ,వృషభరాశికీ, పరమాన్నానికీ, ప్రాతఃకాలానికీ నియామకుడు.


03. ఓం మాధవాయ నమః(చక్రం_శంఖం_పద్మం_గద)


‘మధు’నామక యదువంశ శాఖలో జన్మించడంవల్లా,రమాదేవికీ పతి అయినందువల్లా,సర్వోత్తముడు అయినందువల్లా,శ్రీహరి ‘మాధవుడు’ అయ్యాడు.

ఈ మాధవుడు వాసుదేవ మహామంత్రంలోని‘మో’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వి’అన్న అక్షరానికీ,అహంకారతత్వానికీ,మాఘమాసానికీ,శుక్లపక్షంలో హృదయంమీద ధరించే నామానికీ,మిథునరాశికీ,భక్ష్యాలకూ నియామకుడు.


04. ఓం గోవిందాయ నమః(గద_పద్మం_శంఖం_చక్రం)


వేదాల మూలంగా పొందబడేవాడూ,భూమినీ,గోవులనూ రక్షించేవాడూ,మోక్షప్రదుడూ అయినందువల్ల శ్రీహరి ‘గోవిందుడు’ అనబడుతాడు.ఈ గోవిందుడు వాసుదేవ మంత్రంలోని‘భ’అన్న అక్షరానికీ’గాయత్రిలోని“తుః”అన్న అక్షరానికీ,మనస్తత్త్వానికీ,పాల్గుణ మాసానికీ,శుక్లపక్షంలో కంఠ మధ్యలో ధరించే నామానికీ, కర్కాటక రాశికీ,నేయికీ నియామకుడు.


05. ఓం విష్ణవే నమః(పద్మం_శంఖం_చక్రం_గద)


జ్ఞానానందాది సమస్త గుణాలతో,దేశతఃకాలతః వ్యాప్తుడైనందువల్లా సర్వోత్తముడై ఉన్నందువల్లా శ్రీహరి “విష్ణువు” అనబడుతున్నాడు.

ఈ విష్ణువు వాసుదేవ మహా మంత్రంలోని‘గ’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ కర్ణతత్త్వానికీ, చైత్రమాసానికీ, శుక్లపక్షంలో ఉదరం యొక్క దక్షిణ పార్శ్వంలో ధరించే నామానికీ, సింహరాశికీ,పాలకూ నియామకుడు.


06. ఓం మధుసూదనాయ నమః (శంఖం_పద్మం_గద_చక్రం)


“మధు”నామక దైత్యుడిని సంహరించినందువల్లా,సాత్త్విక లోకానికి సుఖాన్ని ప్రసాదించేవాడైనందువల్లా శ్రీహరి‘మధుసూదనుడు’ అనబడుతున్నాడు. ఈ మధుసూదనుడు వాసుదేవ మహామంత్రంలోని‘వ’అన్న అక్షరానికీ,గాయత్రిలోని

‘రే’అన్న అక్షరానికీ,త్వక్ తత్త్వానికీ,వైశాఖమాసానికీ,శుక్లపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,కన్యారాశికీ,మధుర భక్ష్య విశేషానికీ నియామకుడు.ఈ మధుసూదనుడు‘హస్తిని’నాడిలో ఉంటాడు


07. ఓం త్రివిక్రమాయ నమః (గద_చక్రం_శంఖం_పద్మం)


మూడు వేదాలనూ,మూడు కాలాలనూ,సత్త్వాది మూడు గుణాలనూ,భూరాది మూడు లోకాలనూ,త్రివిధ జీవులనూ,చేతన అచేతన మిశ్రములన్న త్రివిధ ద్రవ్యాలనూ తన స్వరూపంతో వ్యాపించి నెలకొన్న కారణంగా శ్రీహరి ‘త్రివిక్రముడు’ అనబడుతాడు.వాసుదేవ మహామంత్రంలోని “తే”అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘ణి’ అన్న అక్షరానికీ, నేత్ర తత్త్వానికీ, జ్యేష్ఠమాసానికీ, శుక్లపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,తులా రాశికీ,వెన్నకూ నియామకుడు.


08. ఓం వామనాయ నమః(చక్రం_గద_పద్మం_శంఖం)


అపేక్షిత సుఖాలనూ,అభీష్టాలనూ కరుణించేవాడూ,మోక్ష విరోధులైన దైత్యులను అంధకారంలో నెట్టివేసేవాడూ అయినందువల్ల శ్రీహరి‘వామనుడు’ అనబడుతున్నాడు.

ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘వా’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘యం’అన్న అక్షరానికీ జిహ్వాతత్త్వానికీ, ఆషాడమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ, వృశ్చికరాశికీ, పెరుగుకూ నియామకుడు.


09. ఓం శ్రీధరాయ నమః(చక్రం_గద_శంఖం_పద్మం)


శ్రీ శబ్దవాచ్య అయిన మహాలక్ష్మికి కూడా ధారణకర్తా,పోషణకర్తా అయినందువల్లా లక్ష్మిని సర్వదా తన వక్షస్థలంలో ధరించి ఉండడం చేతా శ్రీహరి‘శ్రీధరుడు’ అనబడుతున్నాడు.


ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘సు’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘భ’అన్న అక్షరానికీ,ఘ్రాణతత్త్వానికీ,శ్రావణమాసానికీ,శుక్లపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ధనూరాశికీ,ముద్దపప్పుకూ నియామకుడు.


10. ఓం హృషీకేశాయ నమః(చక్రం_పద్మం_శంఖం_గద)


ఇంద్రియ నియామకుడూ, రమ,బ్రహ్మ,రుద్రాదులకు ఆనందాన్ని ఇచ్చేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘హృషీకేశుడు’ అనబడుతున్నాడు.


ఈయన వాసుదేవ మహామంత్రంలోని ‘దే’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘ర్గో’అన్న అక్షరానికీ,వాక్‍తత్త్వానికీ,భాద్రపద మాసానికీ,శుక్లపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,మకర రాశికీ,ఆకుకూరలతో తయారుచేసిన పదార్థాలకూ నియామకుడు.


11. ఓం పద్మనాభాయ నమః(పద్మం_చక్రం_గద_శంఖం)


నాభిలో పద్మాన్ని కలిగినవాడూ, భక్తుల మనస్సులో ప్రకాశించేవాడూ, సూర్యకాంతి వంటి కాంతి కలిగినవాడూ అయినందువల్ల  శ్రీహరి‘ పద్మనాభుడు’ అనబడుతున్నాడు.


ఈయన వాసుదేవ మహామంత్రం లోని‘వా’అన్న అక్షరానికీ, గాయత్రిలోని‘దే’అన్న అక్షరానికీ,పాణితత్త్వానికీ,

ఆశ్వయుజమాసానికీ,శుక్ల పక్షంలో కంఠం ఎడమభాగంలో ధరించే నామానికీ,కుంభరాశికీ,కూరగాయలతో తయారుచేసే పదార్థాలకు నియామకుడు.


12. ఓం దామోదరాయ నమః(శంఖం_గద_చక్రం_పద్మం)


యశోదచేత పొట్టకు బిగించబడినతాడుగలవాడూ, ఇంద్రియనిగ్రహం కలిగిన ఋషులతో క్రీడించేవాడూ, దానశీలురకు ఆనందాన్ని ఇచ్చేవాడూ,దైత్యులకు దుఃఖం కలిగించేవాడూ, దయాయుక్తులైన జీవులతో క్రీడించేవాడూ అయినందువల శ్రీహరి‘దామోదరుడు’ అనబడుతున్నాడు.


ఈయన వాసుదేవ మహామంత్రంలోని‘య’అన్న అక్షరానికీ,గాయత్రిలోని‘వ’అన్న అక్షరానికీ,పాదతత్త్వానికీ,కార్తీకమాసానికీ,శుక్లపక్షంలో మెడపైన ధరించే నామానికీ,మీనరాశికీ,అన్ని రకాల పుల్లని పదార్థాలకీ నియామకుడు.


13. ఓం సంకర్షణాయ నమః(శంఖం_పద్మం_చక్రం_గద)


భక్తుల చిత్తాన్ని ప్రాపంచిక విషయాలనుండి మరలించి వైరాగ్య భావాన్ని కరుణించేవాడైనందువల్ల శ్రీహరి‘సంకర్షణుడు’ అనబడుతున్నాడు.


ఈయన గాయత్రిలోని‘స’అన్న అక్షరానికీ,పాయు తత్త్వానికీ,కృష్ణపక్షంలో నుదిటిపై ధరించే నామానికీ,ఆమ్ల మిశ్రమాలు కాని పదార్థాలకీ,

మనోమయకోశానికీ, క్షత్రియవర్ణానికీ, స్త్రీశరీరానికీ,ఋతుసామాన్యానికీ,రుద్రునికీ,మధ్యాహ్నసవనానికీ,ఆవేశరూపాలకూ,రాజసద్రవ్యాలకూ,త్రేతాయుగానికీ,శరదృతువుకూ నియామకుడు.


14. ఓం వాసుదేవాయ

నమః (శంఖం_చక్రం_పద్మం_గద)

 త్రిలోకాలకూఆవాసస్థానమైనవాడూ,సర్వాంతర్యామీ,సర్వశక్తుడూ,సర్వచేష్టకుడూ,సర్వాభీష్టప్రదుడూ,యోగ్యజీవులకు ముక్తిని అనుగ్రహించేవాడూ,వసుదేవసుతుడూ అయినందువల్ల శ్రీహరి ‘వాసుదేవుడు’అనబడుతున్నాడు.


ఈయన గాయత్రిలోని‘ధీ’అన్న అక్షరానికీ,ఉపస్థతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఉదరమధ్యంలో ధరించే నామానికీ,పంచదారకూ,బెల్లానికీ,బ్రాహ్మణవర్గానికీ,పురుషశరీరానికీ,సాయంసవనానికీ,అవతారరూపాలకూ,శుభద్రవ్యాలకూ,కృతయుగానికీ,హేమంత ఋతువుకూ నియామకుడు.


15. ఓం ప్రద్యుమ్నాయ నమః(శంఖం_గద_పద్మం_చక్రం)


అసదృశమైన కాంతీ,యశస్సు కలిగి ఉన్నందువల్ల శ్రీహరి ‘ప్రద్యుమ్నుడు’అనబడుతున్నాడు.


ఈయన గాయత్రిలోని‘మ’అన్న అక్షరానికీ,శబ్దతత్త్వానికీ,కృష్ణపక్షంలో హృదయభాగంలో ధరించే నామానికీ,వడపప్పు మొదలైన పదార్థాలకూ,వైశ్యవర్ణానికీ,స్త్రీ శరీరానికీ,అయనానికీ,ప్రాతఃసవనానికీ,లీలారూపాలకూ,పీతవర్ణ ద్రవ్యాలకూ,ద్వాపరయుగానికీ,వర్ష ఋతువుకూ నియామకుడు.


16. ఓం అనిరుద్ధాయ నమః(గద_శంఖం_పద్మం_చక్రం)


ఎవ్వరిచేతా నిరోధించబడనివాడూ, సర్వశక్తుడూ,గుణపూర్ణుడూ,మనస్సుతో సంపూర్ణంగా తెలియబడనివాడూ, జ్ఞానుల మనసులలో ధ్యానంతో బంధించబడేవాడూ,వేదవిరుద్ధ ఆచార నిరతులను సంహరించేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అనిరుద్ధుడు’ అనబడుతున్నాడు.


ఈయన గాయత్రిలోని ‘హి’అన్న అక్షరానికీ, స్పర్శతత్త్వానికీ, కృష్ణపక్షంలో కంఠ మధ్యభాగంలో ధరించే నామానికీ,చేదుపదార్థాలకూ,శూద్ర వర్ణానికీ,అన్నమయకోశానికీ,భోగ్యవస్తువులన్నింటికీ, అబ్దానికీ, నల్లని ద్రవ్యాలకూ, కలియుగానికీ, గ్రీష్మఋతువుకూ నియామకుడు.


17. ఓం పురుషోత్తమాయ నమః(పద్మం_శంఖం_గద_చక్రం)


దేహనాశంగల సర్వజీవులూ క్షరపురుషులు.ఏ విధమైన నాశనమూలేని అప్రాకృత శరీరంగల శ్రీమహాలక్ష్మిదేవి అక్షరపురుష.ఈ ఉభయ చేతనులకంటే సర్వోత్తముడైనందువల్ల శ్రీహరి‘పురుషోత్తముడు’అనబడుతున్నాడు


ఈయన గాయత్రిలోని ‘థి’అన్న అక్షరానికీ, రూపతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదరం కుడిభాగంమీద ధరించే నామానికీ,ఇంగువ,యాలకులు,ఆవాలు,కర్పూరాలకూ నియామకుడు.


18. ఓం అధోక్షజాయ నమః(గద_శంఖం_చక్రం_పద్మం)


ఇంద్రియ నిగ్రహం కలిగిన వసుదేవాదులవల్ల ప్రాదుర్భవించినవాడూ,నిత్యజ్ఞానస్వరూపుడూ,అక్షయకుమారుడిని సంహరించిన హనుమంతుడిచేత తెలియబడేవాడూ అయినందువల్ల శ్రీహరి ‘అధోక్షజుడు’ అనబడుతాడు.


ఈయన గాయత్రిలోని‘యో’అన్న అక్షరానికీ,రసతత్త్వానికీ,కృష్ణపక్షంలో కుడిస్తనంమీద ధరించే నామానికీ,పాలకూ,పానకమూ,మజ్జిగకూ,పచ్చిపులుసుకూ,నేతితో,నూనెతో వేయించిన పదార్థాలకూ నియామకుడు.


19. ఓం నారసింహాయ నమః(పద్మం_గద_శంఖం_చక్రం)


నరుడిలాగా,సింహంలాగా ఉభయాత్మకమైన శరీరం కలిగివున్నందువల్ల శ్రీహరి ‘నారసింహుడు’అనబడుతాడు.


ఈయన గాయత్రిలోని ‘యో’అన్న అక్షరానికీ,గంధతత్త్వానికీ, కృష్ణపక్షంలో కుడిభుజం మీద ధరించే నామానికీ,బూడిద గుమ్మడికాయ,నువ్వులు,మినుములతో తయారుచేసిన వడియాలు మొదలైన పదార్థాలకూ,ఈశాన్య దిక్కుకూ నియామకుడు.


20. ఓం అచ్యుతాయ నమః(పద్మం_చక్రం_శంఖం_గద)


శుద్ధజ్ఞానానందాలే దేహంగా కలవాడూ,సకలగుణ పరిపూర్ణుడూ,సత్య సంకల్పుడూ అయినందువల్ల సర్వదా పూర్ణకాముడూ,దోషరహితుడూ అయినందువల్లా శ్రీహరి ‘అచ్యుతుడు’అనబడుతున్నాడు.


ఈయన గాయత్రిలోని‘నః’అన్న అక్షరానికీ,ఆకాశతత్త్వానికీ,కృష్ణపక్షంలో కంఠం కుడివైపున ధరించే నామానికీ,ఉద్దిపప్పుతో తయారుచేసే వడ మొదలైన వాటికి నియామకుడు.


21. ఓం జనార్థనాయ నమః(చక్రం_శంఖం_గద_పద్మం)


సముద్రంలో ఉండి తరచుగా దేవతల్ని పీడించే మధు,కైటభ,హయగ్రీవాది దైత్యులను మర్దనం చేసినవాడూ, మోక్షప్రదుడూ, జన్మలేనివాడూ, సంసారదుఃఖాన్ని పరిహరించేవాడూ, సుజీవులచేత పొందబడేవాడూ అయినందువల్ల శ్రీహరి‘జనార్ధనుడ’య్యాడు.


ఈ జనార్ధనుడు గాయత్రిలోని ‘ప్ర’అన్న అక్షరానికీ, వాయుతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఉదరం ఎడమ భాగంలో ధరించే నామానికీ,ఉప్పుకూ,నైరుతి దిక్కుకూ నియామకుడు.


22. ఓం ఉపేంద్రాయ నమః(గద_చక్రం_పద్మం_శంఖం)


ఇంద్రుడిని అనుజుడిగా పొంది ఉన్నందువల్ల శ్రీహరి ‘ఉపేంద్రుడు’ అనబడుతున్నాడు.


ఈ ఉపేంద్రుడు గాయత్రిలోని‘చో’అన్న అక్షరానికీ,తేజోతత్త్వానికీ,కృష్ణపక్షంలో ఎడమ స్తనం మీద ధరించే నామానికీ,అరటిపండు,కొబ్బరికాయ మొదలైన ఫలాలకీ,వాటి రసాలకీ,తూర్పు దిక్కుకూ నియామకుడు.


23. ఓం హరయే నమః(చక్రం_పద్మం_గద_శంఖం)


భక్తుల పాపాలను పరిహరించేవాడు కావడంచేత నారాయణుడు‘హరి’అనబడుతున్నాడు.


ఈ హరి గాయత్రిలోని ‘ద’ అన్న అక్షరానికీ, అపోతత్త్వానికీ, కృష్ణపక్షంలో ఎడమ భుజంమీద ధరించే నామానికీ,తాంబూలానికీ నియామకుడు.


24. ఓం కృష్ణాయ నమః(గద_పద్మం_చక్రం_శంఖం)


సృష్టి,స్థితి,సంహార నియమనాదుల వల్ల సకల జగత్తునూ తనలోనికి లాగికొనువాడూ,పూర్ణానంద స్వరూపుడూ, నీలవర్ణ దేహకాంతికలవాడూ అయినందువల్ల శ్రీహరి“ కృష్ణుడు”అనబడుతున్నాడు.


ఈ కృష్ణుడు గాయత్రిలోని‘యాత్’ అన్న అక్షరానికీ, పృథ్వీతత్త్వానికీ, కృష్ణపక్షంలో మెడమీద ధరించే నామానికీ, త్రాగేనీటికీ, దైహిక కర్మకూ నియామకుడు.


🕉️ 🙏🌹🙏🌹🕉️


          *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*

దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

 🍁 *మంగళవారం*🍁

 *🌹08సెప్టెంబర్26🌹*      

   *దృగ్గణిత పంచాంగం*  

                  

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : ద్వాదశి* మ 02.42 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : పుష్యమి* సా 04.39 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : పరిఘ* రా 12.40 వరకు ఉపరి *శివ*

*కరణం  : తైతుల* మ 02.42 *గరజి* రా 01.35 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా04.30-06.00*

 అమృత కాలం  : *ఉ 10.40 - 12.10*

 అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.12 రా 10.55 - 11.42*

*రాహు కాలం :మ03.10 - 04.43*

గుళికకాళం      : *మ 12.05 - 01.38*

యమగండం    : *ఉ 09.00 - 10.32*

సూర్యరాశి : *సింహం*                

చంద్రరాశి : *కర్కాటకం*   

సూర్యోదయం :*ఉ 06.03*

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం    :  *10.51 - 01.19*

అపరాహ్న కాలం : *మ 01.19-03.47*

*ఆబ్ధికం తిధి       : ద్వయం ద్వాదశి/త్రయోదశి*

సాయంకాలం     : *సా 03.47-06.15*

ప్రదోష కాలం       : *సా 06.15-08.35*

రాత్రి కాలం         : *రా 08.35-11.42*

నిశీధి కాలం      : *రా 11.42 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


*🔱ఓం స్కందయా నమః🔱*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

 🍁 *మంగళవారం*🍁

 *🌹08సెప్టెంబర్26🌹*      

   *దృగ్గణిత పంచాంగం*  

                  

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి : ద్వాదశి* మ 02.42 వరకు ఉపరి *త్రయోదశి*

*వారం :మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం  : పుష్యమి* సా 04.39 వరకు ఉపరి *ఆశ్లేష*

*యోగం : పరిఘ* రా 12.40 వరకు ఉపరి *శివ*

*కరణం  : తైతుల* మ 02.42 *గరజి* రా 01.35 ఉపరి *వణజి*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా04.30-06.00*

 అమృత కాలం  : *ఉ 10.40 - 12.10*

 అభిజిత్ కాలం  : *ప 11.40 - 12.30*

*వర్జ్యం    : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.12 రా 10.55 - 11.42*

*రాహు కాలం :మ03.10 - 04.43*

గుళికకాళం      : *మ 12.05 - 01.38*

యమగండం    : *ఉ 09.00 - 10.32*

సూర్యరాశి : *సింహం*                

చంద్రరాశి : *కర్కాటకం*   

సూర్యోదయం :*ఉ 06.03*

సూర్యాస్తమయం :*సా 06.24*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం       : *ఉ 05.55 - 08.23*

సంగవ కాలం        :  *08.23 - 10.51*

మధ్యాహ్న కాలం    :  *10.51 - 01.19*

అపరాహ్న కాలం : *మ 01.19-03.47*

*ఆబ్ధికం తిధి       : ద్వయం ద్వాదశి/త్రయోదశి*

సాయంకాలం     : *సా 03.47-06.15*

ప్రదోష కాలం       : *సా 06.15-08.35*

రాత్రి కాలం         : *రా 08.35-11.42*

నిశీధి కాలం      : *రా 11.42 - 12.28*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


*🔱ఓం స్కందయా నమః🔱*


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శ్రీరాముని ఉంగరం

 


     🌹🌷🍁🪷🛕🪷🍁🌷🌹


*శ్రీరాముని ఉంగరం పాతాళానికి ఎలా చేరిందో మీకు తెలుసా?*


హనుమంతుడికి కాలచక్ర రహస్యం తెలియజేసిన శ్రీరాముని అద్భుత లీలా విశేషం తెలుసుకుందాం🙏


రామాయణానికి సంబంధించిన అనేక పురాణకథలు, జానపద సంప్రదాయాలు తరతరాలుగా భక్తుల మధ్య ప్రచారంలో ఉన్నాయి. అలాంటి ఆసక్తికరమైన కథల్లో శ్రీరాముని ఉంగరం పాతాళలోకానికి చేరిన కథ ఒకటి.


ఈ కథ వాల్మీకి రామాయణంలోని ప్రధాన ఘట్టంగా కాకుండా, రామాయణానికి సంబంధించిన తరువాతి సంప్రదాయాల్లో ప్రసిద్ధి చెందిన పురాణకథనంగా చెప్పబడుతుంది.


శ్రీరామావతార సమాప్తి సమయం


లంకా యుద్ధం ముగిసి, శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యపాలన చేపట్టాడు. ధర్మాన్ని స్థాపిస్తూ, ప్రజలను తన సొంత కుటుంబంలా చూసుకుంటూ అనేక సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు.


కాలం గడిచింది.


ఒక రోజు శ్రీరామునికి తన భూలోక అవతార ప్రయోజనం పూర్తయ్యే సమయం సమీపించిందనే భావన కలిగింది. తన అవతార కాలం ముగిసి, వైకుంఠానికి తిరిగి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన గ్రహించాడు.


అయితే ఒక విషయం ఆయనకు తెలుసు.


హనుమంతుడి భక్తి ఎంత అపారమో శ్రీరాముడికి తెలుసు.


తన ప్రాణానికి ప్రాణమైన రాముడు భూలోకాన్ని విడిచి వెళ్తున్నాడని హనుమంతుడికి తెలిసితే, తన భక్తి కారణంగా రాముని విడిచి ఉండటం అతనికి అత్యంత కష్టమవుతుంది.


కాలదేవుని రాక


అప్పుడు కాలదేవుడు శ్రీరాముని వద్దకు వచ్చాడని ఈ పురాణకథనం చెబుతుంది.


శ్రీరామునితో ఏకాంతంగా మాట్లాడాలని కాలదేవుడు కోరాడు. వారి సంభాషణకు ఎటువంటి ఆటంకం కలగకూడదని ఒక నియమం ఏర్పడింది.


ఆ సమయంలో ద్వారం వద్ద కాపలాగా ఉండే బాధ్యతను లక్ష్మణుడు స్వీకరించినట్లు ప్రసిద్ధ కథనం చెబుతుంది.


ఇదే సమయంలో శ్రీరాముని అంతరంగంలో ఒక ఆలోచన కలిగింది.


హనుమంతుడు అక్కడే ఉంటే, తనను విడిచి వెళ్లడానికి సిద్ధపడడు.


అందుకే హనుమంతుడిని కొంతకాలం అయోధ్యకు దూరంగా పంపడానికి శ్రీరాముడు ఒక లీల చేయాలని నిర్ణయించుకున్నాడు.


శ్రీరాముని ఉంగరం


శ్రీరాముడు తన చేతికి ఉన్న ఉంగరాన్ని నేలపై ఉన్న ఒక చిన్న రంధ్రంలోకి జారవిడిచాడు.


తర్వాత హనుమంతుడిని పిలిచి,


“హనుమా! నా ఉంగరం ఈ రంధ్రంలో పడిపోయింది. దాన్ని తీసుకురా.”


అని ఆజ్ఞాపించాడు.


రాముని మాటే తనకు శాసనం.


హనుమంతుడు వెంటనే సూక్ష్మరూపాన్ని ధరించి ఆ చిన్న రంధ్రంలోకి ప్రవేశించాడు.


కానీ ఆ రంధ్రం సాధారణ రంధ్రం కాదు.


అది అతన్ని పాతాళలోకానికి తీసుకెళ్లింది.


పాతాళలోకంలో హనుమంతుడు


హనుమంతుడు పాతాళలోకానికి చేరుకున్నాడు.


అక్కడ నాగరాజు వాసుకిని కలుసుకున్నాడని ఈ కథనం చెబుతుంది.


హనుమంతుడు తన రాకకు కారణాన్ని వివరించాడు.


“నా స్వామి శ్రీరాముని ఉంగరం ఇక్కడికి పడిపోయింది. దాన్ని తీసుకెళ్లడానికి వచ్చాను.”


అప్పుడు వాసుకి చిరునవ్వుతో హనుమంతుడిని ఒక ప్రత్యేక ప్రదేశానికి తీసుకెళ్లాడు.


అక్కడ కనిపించిన దృశ్యం చూసి హనుమంతుడు ఆశ్చర్యపోయాడు.


వేలాది రాముని ఉంగరాలు!


ఒక పెద్ద ప్రదేశంలో అనేక ఉంగరాలు కనిపించాయి.


వాటన్నింటినీ చూసిన హనుమంతుడు ఆశ్చర్యంతో నిలిచిపోయాడు.


ఎందుకంటే అవన్నీ శ్రీరాముని ఉంగరాల్లానే కనిపిస్తున్నాయి!


హనుమంతుడు అయోమయానికి గురై,


“ఇవన్నింటిలో నా స్వామి శ్రీరాముని ఉంగరం ఏది?”


అని అడిగాడు.


అప్పుడు వాసుకి కాలచక్రం యొక్క ఒక గొప్ప రహస్యాన్ని హనుమంతుడికి వివరించినట్లు ఈ పురాణకథనం చెబుతుంది.


కాలచక్ర రహస్యం


వాసుకి ఇలా చెప్పాడని కథనం:


“హనుమా! కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. యుగాలు మారుతుంటాయి. ధర్మస్థాపన కోసం భగవంతుడు వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఒక రామావతారం తన కార్యాన్ని పూర్తి చేసుకున్నప్పుడు, ఆ అవతారానికి కూడా ముగింపు వస్తుంది. అప్పుడు రాముని ఉంగరం ఇక్కడికి చేరుతుంది.”


అక్కడ ఉన్న అనేక ఉంగరాలు చూసి హనుమంతుడికి ఒక గొప్ప సత్యం అర్థమైంది.


భూలోకంలో కనిపించే ప్రతి అవతారానికి ఒక ప్రారంభం ఉంటుంది; అలాగే ఒక సమాప్తి కూడా ఉంటుంది.


రాముడు భగవంతుడే అయినప్పటికీ, ఆయన అవతారానికి నిర్ణయించబడిన కాలం పూర్తయినప్పుడు తిరిగి తన దివ్యధామానికి చేరుకోవాల్సిందే.


హనుమంతుడికి అర్థమైన సత్యం


హనుమంతుడికి అప్పటివరకు తన హృదయంలో ఒకే భావన ఉండేది—


“రాముడు ఉన్నంతకాలం నేను ఆయనతోనే ఉంటాను.”


కానీ పాతాళలోకంలో కనిపించిన ఆ ఉంగరాలు అతనికి కాలచక్రం యొక్క మహత్తును తెలియజేశాయి.


ఒక్క శ్రీరాముడి ఉంగరం కాదు…


అనేక రామావతారాలకు సంబంధించిన ఉంగరాలుగా వాటిని ఈ కథనం సూచిస్తుంది.


అంటే,


కాలం ఎవరి కోసం ఆగదు.


అవతార పురుషుడైనా, సాధారణ మానవుడైనా—భూలోకంలో స్వీకరించిన దేహధర్మానికి ఒక సమయం ఉంటుంది.


అయోధ్యకు తిరిగి వచ్చిన హనుమంతుడు


ఈ సత్యాన్ని గ్రహించిన హనుమంతుడు తిరిగి అయోధ్యకు వచ్చాడు.


అప్పటికే శ్రీరాముని భూలోక లీలా సమాప్తి సమయం సమీపించింది.


తన ప్రియమైన స్వామి త్వరలో వైకుంఠానికి తిరిగి వెళ్లబోతున్నాడనే సత్యాన్ని హనుమంతుడు గ్రహించాడు.


అయితే రామునిపై అతని భక్తి ఏమాత్రం తగ్గలేదు.


ఎందుకంటే హనుమంతుడికి రాముడు కేవలం ఒక రాజు కాదు.


రాముడే అతని ప్రాణం.

రాముడే అతని శ్వాస.

రామనామమే అతని జీవితం.


శ్రీరాముని సరయూ మహాప్రస్థానం


చివరికి శ్రీరాముడు తన భూలోక అవతారాన్ని ముగించే సమయం వచ్చింది.


అయోధ్య ప్రజలకు వీడ్కోలు పలికి, తన సోదరులతో కలిసి సరయూ నది వైపు పయనించాడు.


పురాణ సంప్రదాయాల ప్రకారం, శ్రీరాముడు సరయూ నదిలో ప్రవేశించి తన భూలోక అవతారాన్ని ముగించి శ్రీమన్నారాయణుని దివ్య స్వరూపంలో వైకుంఠానికి తిరిగి చేరుకున్నాడు.


రాముని భూలోక లీలా ముగిసినా…


రామనామం మాత్రం ఎన్నటికీ ముగియలేదు.


ఈ కథ మనకు చెప్పే సందేశం


ఈ కథలోని అసలు అంతరార్థం కేవలం “ఉంగరం పాతాళానికి వెళ్లింది” అనే అద్భుతం కాదు.


ఇది మనకు కాలచక్రం, అవతార తత్త్వం, భక్తి మరియు విరక్తి గురించి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.


మనకు ఎంత ప్రియమైన వారైనా, ఈ లోకంలో ప్రతి ఒక్కరి ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది.


కానీ భగవంతునిపై ఉన్న నిజమైన భక్తి మాత్రం కాలానికి అతీతమైనది.


అందుకే హనుమంతుడి జీవితం మనకు ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తుంది—


“రాముడు భౌతికంగా కనిపించకపోయినా, రామనామం ఉన్నంతకాలం రాముడు భక్తుడి హృదయంలోనే ఉంటాడు.”


🙏 *శ్రీరామ జయరామ జయ జయ రామ* 🙏


   *🍁🌷సేకరణ🌷🍁*

     🙏*న్యాయపతి*🙏 

        *నరసింహారావు*

సమస్యాపూరణం

  సమస్యాపూరణం.

(సవరణతో)


సమస్య. "వాఙ్మయ మందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నడున్."


భయమున్ గొల్పెడు దృశ్యకావ్యములు, సంబంధాలలో హత్యలున్,

నియతిన్ దప్పిన హేయకార్యముల నన్నింటిన్ సదా చూపుచున్

లయమున్ గూర్చెడు నట్టి మాధ్యమము 

దుర్భావాల దుశ్శీల "వా

ఙ్మయమందున్నది ధర్మదూరమగు సంపాఠ్యమ్ము గాదెన్నడున్".


సురభి శంకరశర్మ.

భాగవతం

  *"భాగవతం వింటే బాగవుతాం"*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(8-583-ఆ)

సర్వమయినచోట సర్వధనంబులు

నడుగ లే దటంచు ననృతమాడు

చెనటి పందనేమి చెప్పఁ బ్రాణము తోడి

శవము వాఁడు; వాని జన్మ మేల?


భావము:- ఏ దానం దాత సంపద అంతటికి సమానమో, ఒక ప్రక్క అది అడుగుతూ; నేను అడిగేది స్వల్పమే సమస్త సంపదలూ కాదు అంటూ అబద్ధం చెప్పరాదు కదా. ఆ విధంగా చెప్పేవాడు నీచుడు, పిరికివాడు; వాడు ప్రాణమున్న పీనుగ; వాడి బ్రతుకు వ్యర్ధము.


శ్రీ అన్నమాచార్య కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

శుకదేవ గోస్వామి ఈ శ్లోకాన్ని చెప్పడం ద్వారా, అజామిళుడు ఒక ఉన్నత స్థానంలో ఉన్న బ్రాహ్మణుడైనప్పటికీ, వేశ్యతో ఏర్పడిన దుష్టసాంగత్యం కారణంగా అతని బ్రాహ్మణోచితమైన ఉన్నత స్థానం పూర్తిగా నశించిపోయిందని పాఠకుని మనస్సులో బలంగా ముద్ర వేయాలని కోరుతున్నారు. అంతటి స్థాయికి అతడు తన బ్రాహ్మణ ధర్మానికి సంబంధించిన కర్తవ్యాలన్నింటినీ మరచిపోయాడు.


అయినప్పటికీ, తన జీవితపు చివరి దశలో “నారాయణ” అనే నాలుగు అక్షరాల పవిత్ర నామాన్ని ఉచ్చరించడం ద్వారా, అత్యంత భయంకరమైన పతన ప్రమాదం నుండి అతడు రక్షించబడ్డాడు.


“స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్” — భగవద్గీతలో చెప్పబడినట్లుగా, భక్తియుతమైన సేవను కొద్దిగా ఆచరించినా, అది మనిషిని అత్యంత గొప్ప ప్రమాదం నుండి రక్షించగలదు.


భగవంతుని పవిత్ర నామాన్ని సంకీర్తనం చేయడం ద్వారా ప్రారంభమయ్యే భక్తియోగం ఎంత శక్తివంతమైనదంటే, కామాసక్తి కారణంగా ఒక వ్యక్తి బ్రాహ్మణునిగా పొందిన ఉన్నత స్థానం నుండి పతనమైనప్పటికీ, ఎలాగో ఒక విధంగా భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తే, అతడు అన్ని విపత్తుల నుండి రక్షించబడగలడు. ఇదే భగవంతుని పవిత్ర నామం యొక్క అసాధారణమైన శక్తి.


అందువల్ల, భగవద్గీతలో భగవంతుని పవిత్ర నామాన్ని ఒక్క క్షణం కూడా మరచిపోకుండా కీర్తించాలని ఉపదేశించబడింది:

“సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః”

(భగవద్గీత 9.14)


అంటే — “ఎల్లప్పుడూ నా నామాన్ని కీర్తిస్తూ, దృఢమైన వ్రతంతో నన్ను పొందడానికి నిరంతరం ప్రయత్నించేవారు అని అర్థం."


ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయి. ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా ఏ క్షణంలోనైనా పతనం చెందే అవకాశం ఉంది. అయితే, ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని నిరంతరం జపిస్తూ, తమను తాము పవిత్రంగా, స్థిరంగా ఉంచుకుంటారో, వారు ఎటువంటి సందేహం లేకుండా సురక్షితంగా ఉంటారు.


(శ్రీమద్భాగవతం — షష్ఠ స్కంధం

అధ్యాయం 1 — శ్లోకం 63)


హరే కృష్ణ! 🙏🌷

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

కాశీలో మరణిస్తే

  🔔 *శివోహం* 🔔


🔥 కాశీలో మరణిస్తే ముక్తి అంటారు… ఎందుకు? 🔥


కాశీకి వెళ్లాలని చాలామంది కోరుకుంటారు…


కానీ కొందరు జీవితపు చివరి రోజులను కాశీలోనే గడపాలని ఎందుకు కోరుకుంటారో తెలుసా?


దాని వెనుక మన సనాతన సంప్రదాయంలో ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విశ్వాసం ఉంది. 🙏🏻


🔱 “కాశ్యాం మరణాన్ ముక్తిః”


అంటే — కాశీలో దేహాన్ని విడిచినవారికి ముక్తి లభిస్తుందని ప్రాచీనంగా విశ్వసిస్తారు.


దీనికి కేంద్రబిందువు స్వయంగా కాశీ విశ్వనాథుడు.


పురాణ సంప్రదాయం ప్రకారం…


కాశీలో ప్రాణం విడిచే జీవునికి పరమశివుడు తారక మంత్రాన్ని ఉపదేశించి, సంసార బంధం నుంచి తరింపజేస్తాడనే విశ్వాసం ఉంది.


అందుకే కాశీని కేవలం ఒక నగరంగా చూడరు…


శివుడు కొలువై ఉన్న ముక్తిక్షేత్రంగా భావిస్తారు. 🕉️


🌺 కాశీ అంటే ఏమిటి?


“కాశ్” అనే ధాతువుకు ప్రకాశించడం అనే భావం ఉంది.


అందుకే కాశీని ఆధ్యాత్మికంగా ప్రకాశ క్షేత్రంగా వర్ణిస్తారు.


ఇక్కడ జీవితం ఎంత సహజమో… మరణం కూడా అంతే సహజంగా మన కళ్లముందు కనిపిస్తుంది.


🔥 అందుకే కాశీకి మరో పేరు — మహాశ్మశానం.


మణికర్ణికా ఘాట్‌లో చితిమంటలు నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి.


అక్కడ నిలబడితే మనిషికి ఒక గొప్ప సత్యం అర్థమవుతుంది…


పదవి ఇక్కడితో ఆగిపోతుంది…

డబ్బు ఇక్కడితో ఆగిపోతుంది…

అహంకారం ఇక్కడితో ఆగిపోతుంది…

దేహం కూడా చివరకు భస్మమే…


అప్పుడు మనతో వచ్చేది ఏమిటి?


ఈ ప్రశ్ననే కాశీ మన మనసులో మేల్కొలుపుతుంది. 🙏🏻


🔱 కాలభైరవుడు — కాశీ క్షేత్రపాలకుడు


కాశీ సంప్రదాయంలో శ్రీ కాలభైరవుడిని కాశీ క్షేత్రపాలకుడిగా ఆరాధిస్తారు.


కాలాన్ని కూడా శాసించే శివస్వరూపంగా భైరవుడిని భావిస్తారు.


అందుకే విశ్వనాథ దర్శనంతో పాటు కాలభైరవ దర్శనానికీ కాశీయాత్రలో విశేష ప్రాధాన్యం ఉంది.


🌊 గంగ… విశ్వనాథుడు… మహాశ్మశానం…


ఒకవైపు గంగలో పవిత్ర స్నానం…


మరోవైపు “హర హర మహాదేవ” అంటూ విశ్వనాథుని దర్శనం…


ఇంకోవైపు నిరంతరం మండుతున్న చితిమంటలు…


జీవితం–మరణం రెండింటినీ ఒకే చోట ఎదురుగా నిలబెట్టి చూపించే క్షేత్రం కాశీ.


అందుకే కాశీయాత్ర అంటే కేవలం దేవాలయ దర్శనం కాదు…


“నేను ఎవరు?

ఈ జీవితం ఎందుకు?

చివరకు నేను తీసుకెళ్లేది ఏమిటి?”


అని మనల్ని మనమే ప్రశ్నించుకునే అంతర్యాత్ర కూడా.


🙏🏻 కాశీలోనే మరణించాలి అనుకోవడం కన్నా… కాశీ నేర్పే సత్యాన్ని జీవించి ఉండగానే తెలుసుకోవడం మరింత గొప్ప సాధన.


ఒకరోజు ఈ శరీరం విడిచిపెట్టాల్సిందే…


అందుకే ఉన్నంతకాలం

ద్వేషాన్ని తగ్గిద్దాం…

అహంకారాన్ని విడిచిపెడదాం…

ధర్మంగా జీవిద్దాం…

భగవంతుణ్ణి స్మరిద్దాం. 🙏🏻


🔥 కాశీ మనకు మరణాన్ని నేర్పదు…

మరణం గుర్తుండేలా చేసి — ఎలా జీవించాలో నేర్పుతుంది.


🕉️ హర హర మహాదేవ

🙏🏻 కాశీ విశ్వనాథ శరణం 🙏🏻


 కాశీ విశ్వనాథుని దర్శించాలని కోరుకునే ప్రతి ఆత్మీయుడికీ పంచుకోండి. 🙏🏻


https://whatsapp.com/channel/0029VaAAuIn1NCrYXdsBqn2B


🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻

కొవ్వు కాయ లొంట్లొ గోళీల వలెనొస్తె

  కొవ్వు కాయ లొంట్లొ గోళీల వలెనొస్తె

ఎన్ని కోయుచున్న నెదుగు చుండు

దాన్ని హోమియోనె తగ్గించు నిజముగా

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: కొవ్వు కాయలు (Lipomas) చర్మం క్రింద భాగంలో గట్టి ఫైబ్రాయిడ్స్ గోళీలలాగా ఉండి, వాటిపై వేలు పెట్టి నొక్కితే అటునిటు కదులుతూ, ఏ నొప్పీ లేకుండా ఉంటాయి. ఇవి చర్మం క్రింద భాగంలో ఉంటే ఏ బాధా ఉండవు గానీ, ఏదైనా అవయవాల నాళాల్లో పెరిగితే మాత్రం అక్కడి జీవకార్యాలకు అడ్డంకిగా మారుతాయి. వీటిని కరిగించే మందులు గానీ, ఈ సమస్యను సంపూర్ణంగా సరిచేయగలిగే మందులు గానీ ఇంగ్లీష్ వైద్యంలో లేవు! కేవలం సర్జరీ చేసి తొలగించే విధానం మాత్రమే ఇంగ్లీష్ లో ఉంది. కాబట్టి ఎన్ని కాయలు ఆపరేషన్ ద్వారా తొలగించినా సరే ఇంకా ఇంకా అవి పుడుతూనే ఉంటాయి. దీనికి కేవలం హోమియోలో మాత్రమే సరియైన మందులు ఉన్నాయి. వీరికి సంక్రమిస్తాయి! ఒకవేళ వారసత్వంలో లేకుండా వీరికే మొట్టమొదటి సారిగా వచ్చి ఉంటే, హోమియో మందులు వాడటం వలన వీరికి నయమవ్వడం మాత్రమే గాక, వీరి తర్వాతి తరాలకు వారసత్వంగా రాకుండా ఉంటాయి. చాలా రకాల వ్యాధులకు హోమియో మందులు వాడుకుని ఉండి ఉంటే ఆయా వ్యాదులు వారసత్వపు వ్యాధులుగా మారవు! కేవలం ఇంగ్లీష్ మందులతో సంపూర్ణంగా నయం కాకుండా సప్రెస్ చేసుకుని, తాత్కాలిక సుఖమే నిజమనుకుని బ్రతకడం వల్లనే జబ్బులన్నీ వారసత్వపు జబ్బులౌతున్నాయి. ఇందులో ఇంగ్లీష్ వైద్యం తప్పెంత ఉందో, పేషెంట్ల తప్పు కూడా అంతే ఉంది! 


సకురు అప్పారావూ ఇది అందరూ తెలుసుకోవాల్సిన నిజం! 


ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా,కరోనా లాంటి వైరస్ లు వ్యాప్తి చెందినా, రకరకాల జ్వరాలు వస్తూ, ఏడిపిస్తున్నా, ప్లేట్ లెట్స్ పడిపోవడం, ఆక్సిజన్ డౌన్ అవ్వడంతో హాస్పిటల్ ఐసీయూలో అడ్మిట్ అయ్యే పరిస్థితి తలెత్తినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ ఏ హాస్పిటల్ కీ వెళ్ళే పని లేకుండా కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

18 మహాపురాణాలను

  హిందూ సంప్రదాయంలోని 18 మహాపురాణాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఉపయోగించే ఒక ప్రసిద్ధ సంకేత శ్లోకం. 

ఈ శ్లోకం యొక్క పూర్తి పాఠం మరియు ప్రతి అక్షరం సూచించే పురాణాల వివరణ క్రింది విధంగా ఉంది: 

శ్లోకం 

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయమ్ |అనాపలింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్ || అక్షరాల విశ్లేషణ (18 పురాణాలు): 


• మద్వయం (మ - 2): 'మ' తో ప్రారంభమయ్యే పురాణాలు రెండు. 


 1. మత్స్య పురాణం 

 2. మార్కండేయ పురాణం 


• భద్వయం (భ - 2): 'భ' తో ప్రారంభమయ్యే పురాణాలు రెండు.3. భవిష్య పురాణం4. భాగవత పురాణం 

• బ్రత్రయం (బ్ర - 3): 'బ్ర' (బ్రహ్మ) తో ప్రారంభమయ్యే పురాణాలు మూడు.5. బ్రహ్మ పురాణం6. బ్రహ్మాండ పురాణం7. బ్రహ్మవైవర్త పురాణం 

• వచతుష్టయమ్ (వ - 4): 'వ' తో ప్రారంభమయ్యే పురాణాలు నాలుగు.8. విష్ణు పురాణం9. వాయు పురాణం10. వరాహ పురాణం11. వామన పురాణం 


అనాపలింగకూస్కాని (మిగిలిన 7 పురాణాల మొదటి అక్షరాలు): 


• అ: 12. అగ్ని పురాణం 

• నా: 13. నారద పురాణం 

• ప: 14. పద్మ పురాణం 

• లిం: 15. లింగ పురాణం 

• గ: 16. గరుడ పురాణం 

• కూ: 17. కూర్మ పురాణం 

• స్కా: 18. స్కాంద పురాణం 


ఈ విధంగా ఒక్క శ్లోకంతో అష్టాదశ (18) పురాణాల పేర్లను సులువుగా గుర్తుంచుకోవచ్చు.

భాగవతం

  *"భాగవతం వింటే బాగవుతాం"*

శ్రీ పోతన భాగవత మధురిమలు 


(8-585-ఆ.)

వారిజాక్షులందు వైవాహికము లందుఁ

బ్రాణవిత్తమానభంగమందుఁ

జకిత గోకులాగ్ర జన్మరక్షణ మందు

బొంకవచ్చు నఘము పొందఁ దధిప!


*భావము:-* ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు.

(ఇది *'శుక్ర నీతి'*. కేవలం రాక్షసులకు మాత్రమే వర్తిస్తుంది. సాక్షాత్తు శుక్రాచార్యులే చెప్పారు, యధేచ్ఛగా అబద్ధాలు ఆడుతూ కూడా పుణ్య లోకాలకు పోవచ్చు అనుకుంటారేమో!)


శ్రీ పురందరదాసు వారి తత్వ కీర్తనతో శుభోదయం.


*శ్రీ కృష్ణం వందే జగద్గురుం*

ధర్మో రక్షతి రక్షితః