*శనివారం 5 సెప్టెంబర్ 2026*
*శ్రీమద్భాగవతం - 40/42*
*రుక్మి వధ, బాణాసుర యుద్ధం, నృగ మోక్షం & బలరాముని గోకుల యాత్ర*
*మన భాగవత అధ్యయనం లో చిన్న మార్పు జరిగింది ..*
మొదట అనుకున్న ప్రకారం అయితే కృష్ణ అష్టమి తో మన అధ్యయనం పూర్తి అవుతుంది. కానీ కృష్ణ అష్టమి రోజు అందరి ఇంట స్వామి చిన్ని అడుగులు పడే శుభ సమయంలో మనం శ్రీ కృష్ణ అవతారము పరిసమాప్తి అయిన ఘట్టం అధ్యయనం చేసుకోవడం అంత సబబుగా అనిపించలేదు.(పాత షెడ్యూలు ప్రకారం అదే ఉంది అదే చివరి ఘట్టం కూడా)
దానికి తోడు ఈ మూడు రోజుల లో దాదాపు 80 అధ్యాయాలు పూర్తి చేయటం కూడా అసాధ్యం, ఇన్ని రోజులు సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని చివర్లో ఇన్ని అధ్యాయాలు వదిలేసి ఏదో పూర్తయింది అనిపించుకుని మనం సాధించేది ఏమిటి ఏమీ లేదు కదా అనిపించింది, బహుశా స్వామి ఇచ్చిన సంకల్పం అనుకుంట..
*అందుకే మరో వారం రోజుల పాటు అధ్యయనం పొడిగించి 48 వ రోజు సంపూర్ణం చేసుకుందాం,* ఇలా అయితే అన్ని విషయాలు కనీసం తెలుసుకోగలుగుతాం.అందుకే నిన్న వదిలేసి ముందుకు పోయిన ఆ అధ్యాయాల లను ఈరోజు చదువుకుందాం,మిగతా లీలలు ఈ ఏడు రోజులు చదువుకుందాం, మరో ఏడు రోజులు స్వామీ తనతో గడిపే భాగ్యం ఇచ్చాడు అదృష్టవంతులం,ఇక కథలోకి వెళ్దాం.....
1.అనిరుద్ధుని వివాహము & బలరాముని చేతిలో రుక్మి వధ
శ్రీకృష్ణునికి అష్టమహిషుల ద్వారా ఒక్కొక్కరికి పదేసి మంది కుమారులు,ఒక కుమార్తె జన్మించారు.వారు రూపము, బలము, మొదలయిన లక్షణములలో తమ తండ్రియైన శ్రీకృష్ణభగవానునకు ఏమాత్రమూ తీసిపోరు.ముమ్మూర్తులా వారు తండ్రిని పోలియుండిరి.
రాజకుమార్తెలు(భార్యలు)అందఱు శ్రీకృష్ణప్రభువు తమ ఇంటినుండి బయటికి వెళ్లక తమ దగ్గరే ఉండటం గమనించి, 'నేను మాత్రమే ఆ స్వామికి ప్రియపత్నిని' అని ఎవరికివారు అనుకునే వారు.ఎందుకంటే వారు వాస్తవముగా పురుషోత్తమునియొక్కమహత్త్వమును ఎఱుగరు కదా(నిన్ననే చెప్పుకున్నాం కదా స్వామి ఒకే సమయంలో ఒకే రూపంలో అన్ని గృహాలలో ఉన్నాడు అని అందుకే అందరూ నేనే ఇష్టం నా స్వామికి అని అనుకుంటూ ఉండేవారు).
ఇక శ్రీకృష్ణ పరమాత్మ కు రుక్మిణీదేవి యందు పుట్టిన ప్రథమ ప్రథమ పుత్రుడైన ప్రద్యుమ్నుడు (మన్మథుని అవతారం).(మిగిలిన వారి పేర్లు ఇక్కడ చెప్పడం లేదు దాదాపు 80 పేర్లు ఉంటాయి)
ఈ ప్రద్యుమ్నుడు తనను సంహరించే వాడు అని తెలుసుకున్న శంబరాసురుడు, పుట్టిన పదవ రోజునే అతన్ని అపహరించి, సముద్రంలో పడవేశాడు,ఆ బాలున్ని చేప మింగితే జాలరులు ఆ చేపను వాడి అంతఃపురం లో ఉన్న రతి దేవి కి ఇస్తారు(మాయవతిగా జన్మిస్తుంది) ఆమె ఇతడే తన భర్త అని తెల్సుకుని సకల విద్యలు నేర్పుతుంది అతడే శంబరాసురునీ సంహరించి, ద్వారక లో రతి సహితంగా అడుగు పెడతాడు. ఆ తదుపరి
పూర్వం శ్రీకృష్ణుని చేతిలో పరాభవం పొందిన రుక్మి, తన చెల్లెలైన రుక్మిణిని సంతోషపెట్టడానికి తన కుమార్తెయైన **రుక్మవతిని** ప్రద్యుమ్నునికి ఇచ్చి వివాహం చేశాడు. వారి కుమారుడే **అనిరుద్ధుడు**.
* ఆ తర్వాత అనిరుద్ధునికి రుక్మి మనవరాలైన **రోచనతో** వివాహం నిశ్చయమై భోజకట నగరంలో వైభవంగా వివాహం జరిగింది.
* **ద్యూత క్రీడ & రుక్మి మరణం:**
వివాహానంతరం రుక్మి బలరాముడిని జూదానికి (పాచికలాటకు) ఆహ్వానించాడు. కళింగరాజు మొదలైన దుష్ట రాజుల ప్రోత్సాహంతో రుక్మి కపటంగా ఆడుతూ, బలరాముడు గెలిచినా "నేనే గెలిచాను" అని ఎగతాళి చేశాడు. కళింగరాజు పళ్లు చూపి నవ్వాడు. చివరకు పది కోట్ల వరాహాలు పందెం గా పెట్టీ ఆడారు, అందులో కూడా బలరాముడే గెలిచాడు కానీ రుక్మి నేనే గెలిచాను నేనే గెలిచాను అన్నాడు, ఆకాశవాణి కూడా బలరాముడే గెలిచాడు, రుక్మి వాక్యాలు అసత్యం అని చెప్పింది.
అయినా దుష్టులైన రాజకుమారుల ప్రేరణతో రుక్మి ఆయువు మూడినవాడై బలరాముని పరిహసించుచు ఇలా అన్నాడు '‘బలరామా! పశువులకాపరులై వనములలో తిరుగే మీవంటి యాదవులకు 'అక్షవిద్య' ఏమి తెలియును,బాణం వేయాలన్న, పందెం గెలవాలన్న మా వంటి రాజకుమారులకే చెల్లు అన్నాడు.(రుక్మికి బలరామ కృష్ణుల మీద ద్వేషం తొలగలేదు) దాంతో తీవ్రాగ్రహం చెందిన బలరాముడు అష్టపదమనే బంగారు స్తంభంతో రుక్మి తలపై కొట్టి సంహరించాడు; కళింగరాజు పళ్లు రాలగొట్టాడు. బలరాముని ధర్మవర్తనకు భయపడి మిగిలిన రాజులు పారిపోయారు.ఆ తర్వాత నవ దంపతులను తీసుకొని ద్వారకకు వచ్చాడు కృష్ణుడు.
(రుక్మిణి దేవి బాధపడుతుంది అని ఇక్కడ కృష్ణుడు తటస్థముగా ఉండి పోయాడు)
2. ఉషా-అనిరుద్ధుల ప్రణయం & చిత్రలేఖ మాయ
బలిచక్రవర్తి వందమంది కుమారులలో పెద్ద కుమారుడైన **బాణాసురుడు** శోణితపురాన్ని పాలించేవాడు. పరమశివుని భక్తుడైన బాణునికి వేయి చేతులు (సహస్ర బాహువులు) ఉండేవి. ఇంద్రాది దేవతలు కూడా ఆయనకు సేవలల లాగ ఉండేవారూ.ఒకానొకప్పుడు పరమశివుడు తాండవనృత్యము చేయుచుండగా తన వాద్యనైపుణ్యముతో ఆ కైలాసపతిని ప్రసన్నునిగా చేసికొనెను.అప్పుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా శోణితపురం లోనే ఉండి నన్ను రక్షించాలి అని కోరుకున్నాడు.
ఒకనాడు బలగర్వం తో శంకరునే యుద్ధానికి పిలిచాడు, నాతో సమాన యోధుడు ఎవరు లేరు నీవొక్కడివే అని,దానికి శంకరుడు నీ రథం ధ్వజము తనకై తాని కూలిన రోజు నీకు యుద్ధం జరుగును నీ బాహుబల దర్పం అణచే వాడే ఆరోజు వస్తాడు అన్నాడు,అది శాపం లాంటిదే కానీ వాడు వరం అనుకుని ఆహా ధన్యుణ్ణి అనుకున్నాడు.
ఆ బాణాసురుడికి కుమార్తె ఉంది ఆమె పేరు ఉష ఆమెకు ఒకనాడు కలలో ఒక సుందర పురుషుడు కనిపించి ఆమె హృదయాన్ని దోచుకున్నాడు. నిద్రలేచి విరహంతో బాధపడుతుండగా, ఆమె ప్రియసఖి, మంత్రి బాణపుత్రుడైన కుంభాండుని కుమార్తె చిత్రలేఖ విషయం తెలుసుకుని,నేను నీ వేదన తీరుస్తాను అని సమస్త దేవ, గంధర్వ, యక్ష, నర వీరుల చిత్రపటాలను గీసి చూపించింది.
అవన్ని చూస్తూ అనిరుద్ధుని చిత్రాన్ని చూడగానే ఉష సిగ్గుపడి, చిరు నవ్వుతో,ఇతడే,ఇతడే నా మనోహరుడు" అని తెలిపింది.చిత్రలేఖ యోగశక్తితో ఆకాశమార్గాన ద్వారకకు వెళ్లి, శయనమందిరంలో నిద్రిస్తున్న అనిరుద్ధుడిని మంచంతో సహా ఎత్తుకొచ్చి ఉష అంతఃపురంలో ఉంచింది.
#3. బాణాసుర యుద్ధం – హరి-హర సమరం
ఉషా దేవి ముఖం ఆ అనిరుద్ధుని చూడగానే సంతోషంతో కోటికాంతులతో వెలిగిపోయింది,ఆమె అనేక సేవలతో తన ప్రియునీ ఆరాధించి,సేవించింది అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. వారిద్దరు ప్రేమ పారవశ్యం లో మునిగి ఉండగా. రాజభటులు రాకుమారి లో కలిగిన మార్పులు పసిగట్టి రాజుకు తెలియచేశారు.
అంతఃపురంలో అనిరుద్ధుడు ఉన్న విషయం తెలిసి బాణాసురుడు నాగపాశాలతో అనిరుద్ధుడిని బంధించాడు. అది చూసి ఉషా దేవి కన్నీరు మున్నీరుగా ఏడ్చింది.
అటు నాలుగు నెలల పాటు అనిరుద్ధుని జాడలేక ద్వారకలో అంతా దిగులు చెందారు,ఒకనాడు నారదుని ద్వారా అనిరుద్ధుడు బంధింపబడ్డాడు అన్న విషయం తెలుసుకున్న శ్రీకృష్ణ, బలరామ, ప్రద్యుమ్నాది యాదవ వీరులు గరుడారూఢులై శోణితపురాన్ని ముట్టడించారు.
* **శివుని రక్షణ:** తన భక్తుడైన బాణాసురుని రక్షించడానికి సాక్షాత్తు పరమశివుడు, కుమారస్వామి, ప్రమథగణాలతో కలిసి శ్రీకృష్ణునికి ఎదురుగా నిలిచాడు. లోకాలే భయపడేలా **హరి-హర యుద్ధం** జరిగింది.అది చూడటానికి దేవతలే దిగి వచ్చారు.
శ్రీకృష్ణుడు శివునిపై 'జృంభణాస్త్రం' ప్రయోగించి పరమశివునికి ఆవలింతలు తెప్పించి నిశ్చేష్టుడిని చేశాడు. ప్రద్యుమ్నుడు కార్తికేయుడిని, బలరాముడు కుంభాండుడిని ఓడించారు.
* **శివజ్వరం vs వైష్ణవజ్వరం:
శివుడు మూడు తలలు, మూడు కాళ్లు ఉన్న 'శివజ్వరాన్ని' ప్రయోగించగా, శ్రీకృష్ణుడు 'వైష్ణవజ్వరాన్ని' ప్రయోగించాడు. వైష్ణవజ్వరం ధాటికి తాళలేక శివజ్వరం శ్రీకృష్ణుని స్తుతించి శాంతించింది.
* **సహస్ర బాహు ఖండన:**
శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో బాణాసురుని వేయి చేతులలో నాలుగు చేతులు మిగిల్చి మిగిలిన 996 చేతులనుఖండించాడు. పరమశివుడు ప్రత్యక్షమై స్తుతించగా, కృష్ణుడు: "శివా! బాణుడు ప్రహ్లాదుని వంశీయుడు, నా భక్తుడైన బలి పుత్రుడు. కాబట్టి ఇతన్ని చంపను. చిరంజీవిగా ఉంటాడు" అని అభయమిచ్చి, అనిరుద్ధ-ఉషలను ద్వారకకు తోడ్కొని వచ్చాడు.
#4. నృగ మహారాజు వృత్తాంతం – తొండ రూప విమోచనం
ఒకరోజు సాంబాది యాదవ కుమారులు విహారానికి ఉపవానానికి వెళ్లి ఆడుకుంటూ దాహంతో ఒక పాడుబడ్డ బావి వద్దకు వెళ్లారు. అక్కడ నీరు లేదు కానీ పర్వతమంత పెద్దదైన ఒక ఊసరవెల్లి/తొండ (కృకలాసం) కనిపించింది. దాన్ని బయటకు తీయాలని ప్రయత్నం చేశారు కానీ తీయలేక కృష్ణునికి చెప్పారు.
* శ్రీకృష్ణుడు తన ఎడమ చేత్తో ఆ తొండను బయటకు లాగగానే, అది దివ్య దేవుని రూపంగా మారింది.
* ఆయన ఇక్ష్వాకు వంశపు రాజైన **'నృగ మహారాజు'**. కోట్లాది గోవులను బ్రాహ్మణులకు దానం చేసిన పరమ దాత. ఒకసారి ఒక బ్రాహ్మణునికి ఇచ్చిన ఆవు పొరపాటున మరొక బ్రాహ్మణునికి దానం చేసిన గోవుల మందలో కలిసిపోయింది. ఆ వివాదంలో సమయానికి న్యాయం చేయలేకపోయినందుకు, "తొండవై పడివున్నాను .
కృష్ణుని పాదస్పర్శతో పాపవిముక్తుడై దివ్యలోకాలకు వెళ్లాడు. అనంతరం శ్రీకృష్ణుడు తన పుత్రులకు: **"బ్రాహ్మణ ద్రవ్యాన్ని, పరుల సొమ్మును హరించడం హాలాహల విషం కంటే ప్రమాదకరం"** అని ఉపదేశించాడు.
#5. బలరాముని గోకుల యాత్ర & యమునా కర్షణ
శ్రీకృష్ణుని అనుమతితో బలరాముడు తన బాల్య మిత్రులను, గోపగోపికలను, నందయశోదలను చూడటానికి రథంపై గోకులానికి వెళ్లాడు.
* **గోపికల ఆదరణ:** నందయశోదలు, గోపికలు బలరాముడిని ఆలింగనం చేసుకుని కృష్ణుని జ్ఞాపకాలతో కన్నీరుమున్నీరయ్యారు. బలరాముడు రెండు నెలల పాటు గోకులంలోనే ఉండి వారిని ఓదార్చాడు.
* **యమునా కర్షణ:** ఒక పౌర్ణమి రాత్రి వనవిహారం చేస్తూ వరుణుడు పంపిన 'వారుణీ' మధువును సేవించి, జలక్రీడలాడటానికి యమునా నదిని తన వద్దకు రమ్మని పిలిచాడు. యమున రాకపోవడంతో కోపించిన బలరాముడు తన **నాగలితో (హలాయుధంతో)** యమునా నదిని లాగాడు. యమునా దేవి భయపడి ప్రత్యక్షమై క్షమాపణలు వేడుకోగా శాంతించి నదిలో స్నానం చేశాడు. నాటి నుండి యమునా నది బలరాముడు లాగిన మార్గంలో కూడా ప్రవహిస్తోంది.
📝 నేటి ముఖ్య విషయాలు:
1. **హరి-హర అభేదం:** బాణాసుర యుద్ధంలో హరిహరులు తలపడినా, చివరికి ఇద్దరి తత్త్వం ఒకటేనని భాగవతం నిరూపించింది.
2. **దాన ధర్మ నిష్ఠ:** నృగ మహారాజు కథ ద్వారా తెలియజేసే సత్యం — ఎన్ని పుణ్యాలు చేసినా ఇతరుల ధర్మానికి భంగం కలిగించకూడదు; బ్రాహ్మణ/దేవాలయ ద్రవ్యాన్ని అపహరించరాదు.అది మహా దోషం.
3. **బలరామ భక్తవాత్సల్యం:** బలరాముడు స్వయంగా గోకులానికి వెళ్లి భక్తుల విరహతాపాన్ని పోగొట్టడం ఆయన భక్తసులభ తత్త్వానికి నిదర్శనం.
రేపు మరికొన్ని లీలలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు🙏
.....సశేషం
🙏🌹🙏
*సేకరణ*
🙏*న్యాయపతి*🙏
*నరసింహారావు*