1, సెప్టెంబర్ 2026, మంగళవారం

పంచాంగము 🌓 01.09.2026

  🕉️


పంచాంగము 🌓 01.09.2026


🪔 శ్రీ వృద్దాహృషీకేశాయనమః‌ 🪔


అష్టావింశతి మహాయుగే 


కలియుగం: 5128


విక్రమ సంవత్సరం 2083 సిధ్ధార్ధ


శక సంవత్సరం: 1948 పరాభవ


ఆయనం: దక్షిణాయణం 


ఋతువు: వర్ష


మాసం: శ్రావణ 


పక్షం: కృష్ణ - బహుళ 


తిథి చవితి ఉ‌.07:44 వరకు

తదుపరి పంచమి

 

వారం: మంగళవారం - భౌమవాసరే

 

నక్షత్రం: అశ్విని రా.03:47 వరకు 

తదుపరి భరణి


యోగం: వృధ్ధి రా.11:03 వరకు

తదుపరి ధృవ

 

కరణం: బాలవ ఉ‌.07:44 వరకు

తదుపరి కౌలువ‌ రా.06:49 వరకు

తదుపరి తైతుల


వర్జ్యం: రా.11:55 - 01:27 వరకు


దుర్ముహూర్తం: ఉ‌.08:31 - 09:21

మరియు రా.11:06 - 11:52 


రాహు కాలం: ప‌.03:22 - 04:56


గుళిక కాలం: ప‌.12:16 - 01:49


యమ గండం: ఉ‌.09:09 - 10:42

 

అభిజిత్: 11:51 - 12:39


సూర్యోదయం: 06:02


సూర్యాస్తమయం: 06:29


చంద్రోదయం: రా.09:12


చంద్రాస్తమయం: ఉ‌.09:29


సూర్య సంచార రాశి: సింహం


చంద్ర సంచార రాశి: మేషం


దిశ శూల: ఉత్తరం


🌹 భౌమ‌ చతుర్థి 🌹


🐍 నాగ పంచమి 🐍

( గుజరాత్)


💫 భౌమాశ్విని‌ అమృతసిద్ధి

 యోగం 💫


🚩 శ్రీ సుజ్ఞానేంద్రతీర్థ‌ 

పుణ్యతిథి‌ 🚩


🌹 మంగళగౌరీ వ్రతం 🌹


🏳️ శ్రీ ఫలసిద్థినాథ్‌

స్వామి పుణ్యతిథి 🏳️


🚩టెంబ్యేస్వామి జయంతి 🚩


🪄 గురుగ్రంథ్ సాహిబ్

 ప్రకాశోత్సవం 🪄


🛕 శ్రీ వైకుంఠం శ్రీ వైకుంఠపతి

పెరుమాళ్ రథోత్సవం 🛕


🎉 తిరుచెందూరు కేదాయ

శ్రీ సుబ్రహ్మణ్య రథోత్సవం 🎉


🔯

పంచాంగం 01.09.2026 Tuesday,

  ఈ రోజు పంచాంగం 01.09.2026 Tuesday,


స్వస్తి  శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష చతుర్థి తిథి భౌమ వాసర అశ్విని నక్షత్రం వృద్ధి యోగః బాలవ తదుపరి కౌలవ కరణం.


రాహుకాలం : మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 

యమగండం: పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: పంచమి 



 

నమస్కారః , శుభోదయం

31, ఆగస్టు 2026, సోమవారం

పవిత్రమైన_బృందావనం_మంత్రాలయం

  🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️


పవిత్రమైన_బృందావనం_మంత్రాలయం...

(రాఘవేంద్ర స్వామి ఆరాధన దినోత్సవ సందర్భంగా)

అదొక ఆధ్యాత్మిక బృందావనం. రాఘవేంద్రస్వామి ప్రత్యక్షంగా అవతరించి, వేంచేసిన దివ్య స్థలం మంత్రాలయం. ఈ క్షేత్రం ఎన్నో విశేషాలకు ప్రసిద్ధి, ప్రతీతి. అవేమిటంటే..


#పాదోదకం... #పావనం

రోజూ రాఘవేంద్ర స్వామి మూల బృందావ నానికి అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేక జలాలను మరుసటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మఠంలో భక్తులకు తీర్థంగా ఇస్తారు. బృందావనాన్ని హరి మందిరంగా భక్తులు భావిస్తారు. ఇక్కడ ఏడు వందల సాల గ్రామాలను ప్రతిష్ఠించారు. ఎందరో మహానుభావులూ ఇక్కడే కొలువై ఉన్నారని భక్తులు నమ్ముతారు. ఒకసారి రాఘవేంద్ర స్వామి బృందావనానికి అభిషేకం చేస్తే ఎందరో గురువులకు, సాల గ్రామాలకు అభి షేకాలు చేసినట్టు అవుతుంది. అలాంటి జలం అత్యంత పవిత్రమైనది. చాలా వ్యాధులను ఈ మంత్ర జలం నివారిస్తుందని చెబుతారు. ఈ పాదోదకాన్ని తాగడానికి మాత్రమే కాకుండా భక్తులపై ప్రోక్షణం కూడా చేస్తారు. దీనివల్ల పిశాచ బాధలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.


#మంత్రాక్షితల

రాఘవేంద్రస్వామి దర్శనం అనంతరం భక్తులు పీఠాధిపతి ఇచ్చే మంత్రాక్షితల కోసం బారులు తీరుతారు. ఈ అక్షింతల్లో పసుపు, సున్నం కలుపు తారు. అందుకే ఇవి ఎర్రగా ఉంటాయి. రాఘ వేంద్ర స్వామి మఠం పీఠాధిపతిగా ఎవరున్నా భక్తులకు అక్షింతలను ఇచ్చే సంప్రదాయం రాఘ వేంద్ర స్వామి కాలం నుంచి కొనసాగుతోంది. ఆనాడు ఆ యతీంద్రులు వాడిన పాత్రల్లోనే నేటికీ వాటిని తయారు చేసి భక్తులకు ఇస్తుండటం విశేషం. మఠంలో అంత పవిత్రతను కాపాడు కుంటూ వస్తున్నారు.


#మృత్తిక_మహిమ

రాఘవేంద్రస్వామి బృందావనంపై ఉంచే మృత్తిక చాలా విశిష్టమైనదని నమ్మకం. దీని విష యంలో ఒక కథ ఉంది. గురు రాఘవేంద్రులు బృందావన ప్రవేశానికి ముందు మంత్రాలయంలో ఉన్నప్పుడు, ఓ బ్రాహ్మణ భక్తుడు స్వామి వద్దకు వెళ్లి, ‘స్వామీ! నా కుమారుడి ఉపనయనానికి ధనం కావాలి’ అని అడిగాడు. ఆ సమయంలో స్వామి తుంగభద్ర నడి ఒడ్డున స్నానం కోసం ఉన్నారు. రోజూ మృత్తికతో స్నానం చేసే స్వామి తుంగభద్ర తీరంలోని ఆ మట్టినే భక్తుడికి ఇచ్చారు. దానిని ఆ భక్తుడు తీసుకుని వెళ్తూ దారి తప్పి మరో గ్రామానికి చేరుకున్నాడు. అక్కడు గురు రాఘ వేంద్రుడు ఇచ్చిన మృత్తిక సాయంతో ఓ ధన వంతుడి సంతానాన్ని హరిస్తున్న పిశాచిని ఆ భక్తుడు హరిస్తాడు. అప్పుడా ధనవంతుడు సంతో షంతో ఆ పేద భక్తుడి ఇంట్లో ఉపనయన కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించాడు. అంతటి మహిమ ఉన్న ఆ మృత్తికను నేటికీ మంత్రా లయంలో పూజిస్తున్నారు. రాఘవేంద్ర స్వామి తాకిన ఆ ప్రదేశంలో ఇప్పుడు తులసి వనం ఏర్పాటు చేశారు. ఏటా ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి రోజున స్వామి ఉత్సవమూర్తిని తీసుకెళ్లి అక్కడి మృత్తికకు ప్రత్యేక పూజలు చేసి ఊరే గింపుతో తెచ్చి స్వామి మూల బృందావనంపై ఉంచుతారు. ఇతర ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామి ఆలయాల స్థాపనకు ఈ మృత్తికను వినియోగి స్తారు. అలాగే ఈ మృత్తికను భక్తులు తీసుకెళ్లి ఇళ్లలో ఉంచుకుంటారు. 


#మంచాలమ్మ_దర్శనం

రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులు ముందుగా మఠం ముందు ఉండే గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయక ముందు అమ్మవారిని దర్శించి ‘నేను ఇక్కడే కొలువై ఉంటాను. ముందుగా నీకు నైవేద్యం, దర్శనం అయిన తరువాతే నా బృందావనాన్ని భక్తులు దర్శించుకుంటారు’ అని చెప్పినట్టు మఠం పండితులు చెబుతారు


✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️

మంగళవారం*🍁 *🌹01సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*      

🍁 *మంగళవారం*🍁

*🌹01సెప్టెంబర్26🌹*  

 *దృగ్గణిత పంచాంగం*       

           

        *స్వస్తి శ్రీ పరాభవ* 

       *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : చవితి* ఉ 07.41 వరకు ఉపరి *పంచమి*

*వారం   : మంగళవారం* (భౌమవాసరే)

*నక్షత్రం   : అశ్విని* రా 02.42 వరకు ఉపరి *భరణి* 

*యోగం  : వృద్ధి* రా 11.39 వరకు ఉపరి *ధ్రువ*

*కరణం   : బాలువ* ఉ 07.41 *కౌలువ* సా 06.59 ఉపరి *తైతుల*

*సాధారణ శుభ సమయాలు:*

*మ12.00-01.00 సా05.00-06.00*

అమృత కాలం  : *రా 07.42 - 09.15*

అభిజిత్ కాలం  : *ప 11.42 - 12.32*

*వర్జ్యం          : రా 10.49 - 12.22*

*దుర్ముహూర్తం  : ఉ 08.23 - 09.13 రా 10.58 - 11.44*

*రాహు కాలం :మ03.14 - 04.47*

గుళికకాళం      : *మ 12.07 - 01.41*

యమగండం    : *ఉ 09.01 - 10.34*

సూర్యరాశి : *సింహం*                

చంద్రరాశి : *మేషం*   

సూర్యోదయం :*ఉ 06.02*  

సూర్యాస్తమయం :*సా 06.39*

*ప్రయాణశూల   : ఉత్తర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం      : *ఉ 05.54-08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.22*

అపరాహ్న కాలం  : *మ 01.22-03.51*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ పంచమి*

సాయంకాలం    : *సా 03.51 - 06.21*

ప్రదోష కాలం     : *సా 06.21 - 08.39*

రాత్రి కాలం       : *రా 08.39 - 11.44*

నిశీధి కాలం       : *రా 11.44 - 12.30*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

31ఆగష్టు2026🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*   

   🕉️ *సోమవారం*🕉️

 *🌹31ఆగష్టు2026🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                       

         *ఈనాటి పర్వం*    

              *ప్రధాన* 

     *సంకష్టహర చతుర్థి*


         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు* *శ్రావణమాసం - బహుళ పక్షం* 


*తిథి      : తదియ* ఉ 08.50 వరకు ఉపరి *చవితి*

*వారం   :సోమవారం* (ఇందువాసరే)

*నక్షత్రం   : రేవతి* రా 03.23 వరకు ఉపరి *అశ్విని*

*యోగం  : గండ* రా 01.51 వరకు ఉపరి *వృద్ధి*

*కరణం   : భద్ర* ఉ 08.50 *బవ* రా 08.19 ఉపరి *బాలువ*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ06.00-07.00&11.00- 12.00*

అమృత కాలం  : *రా 01.01 - 02.36*

అభిజిత్ కాలం  : *ప 11.43 - 12.33*

*వర్జ్యం       : మ 03.34 - 05.08*

*దుర్ముహూర్తం  : మ 12.33 - 01.22 & 03.02 - 03.52*

*రాహు కాలం: ఉ 07.27 - 09.01*

గుళికకాళం      : *మ 01.41 - 03.14*

యమగండం    : *ఉ 10.34 - 12.08*

సూర్యరాశి : *సింహం*                     

చంద్రరాశి : *మీనం* 

సూర్యోదయం :*ఉ 06.02* 

సూర్యాస్తమయం :*సా 06.31*

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం    : *ఉ 05.5 -08.23*

సంగవ కాలం        : *08.23 - 10.53*

మధ్యాహ్న కాలం    : *10.53 - 01.22*

అపరాహ్న కాలం : *మ 01.22- 03.52*

*ఆబ్ధికం తిధి        : శ్రావణ బహుళ చవితి*

సాయంకాలం   : *సా 03.52 - 06.21*

ప్రదోష కాలం     : *సా 06.21 - 08.40*

రాత్రి కాలం       : *రా 08.40 - 11.45*

నిశీధి కాలం      :*రా 11.45 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.08*

¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤

                *🌷ప్రతినిత్యం🌷*

         *_గోమాతను 🐄 పూజించండి_* 

          *_గోమాతను 🐄 సంరక్షించండి_*


    🕉️ *ఓం నమః శివాయ*🕉️


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు...                   లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🌹🕉️🕉️🌹🌷

🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹

భగవద్గీత

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధకిల్బిషః ।

అనేకజన్మసంసిద్ధః తతో యాతి పరాం గతిమ్ ।। 45 ।।



ప్రతిపదార్థ:


 

ప్రయత్నాత్ — కఠిన కృషితో; యతమానః — పరిశ్రమిస్తూ; తు — మరియు; యోగీ — ఒక యోగి; సంశుద్ధ — పరిశుద్ధుడై; కిల్బిషః — ప్రాపంచిక కోరికల నుండి; అనేక జన్మ — చాలా చాలా జన్మల అనంతరం; సంసిద్ధః —పరిపూర్ణ సిద్ధిని సాధించును; తతః — అప్పుడు; యాతి — పొందును; పరాం — అత్యున్నత; గతిమ్ — గతి.



తాత్పర్యము: 



అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో, ఎప్పుడైతే ఈ యోగులు మనఃపూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో, అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పవిత్రమై (స్వేచ్ఛ పొంది), ఈ జన్మ లోనే సిద్ధి (పరిపూర్ణత) పొందుతారు.



వివరణ:


ఎన్నో పూర్వ జన్మలలో ఆర్జించిన అభ్యాసం, ఆధ్యాత్మిక పురోగతి కొరకు, చక్కటి వీచేగాలిలా సహకరిస్తుంది. పూర్వజన్మ నుండి కొనసాగిస్తూ, ఈ జన్మలో యోగులు, ఈ వీచేగాలిలో, తమ పరిశ్రమ రూపంలోని, తెరచాపని ఎగిరేస్తారు. శ్రీ కృష్ణుడు ‘ప్రయత్నాద్ యతమానస్తు’ అన్న పదాలు వాడుతున్నాడు, అంటే, ‘ఇంతకు పూర్వం కంటే ఎక్కువ పరిశ్రమ చేయటం.’ 'తు' అన్న పదం - వారి ప్రస్తుత పరిశ్రమ, ఇంతకు క్రితం, వారు ప్రయాణాన్ని పూర్తి చేయలేకపోయిన జన్మల పరిశ్రమ కంటే తీవ్రంగా ఉంటుంది - అని సూచిస్తుంది.


ఈ విధంగా, వారు పూర్వ జన్మల నుండీ వచ్చిన ఉరవడిని సహాయంగా తీసుకుంటూ, ఈ అనుకూల పవనాలతో లక్ష్యం వైపుగా తీసుకు వెళ్ళబడుతారు. చూసేవారికి, మెత్తం ప్రయాణాన్ని వీరు ఈ జన్మలోనే పూర్తి చేసినట్టు ఉంటుంది, కానీ శ్రీ కృష్ణుడు అంటున్నాడు: 'అనేకజన్మసంసిద్ధః', ‘యోగములో పరిపూర్ణ సిద్ధి అనేది అనేక జన్మల అభ్యాసంతో ఆర్జించిన ఫలితము.’ అని.

పంచాంగం 31.08.2026 Monday,

 ఈ రోజు పంచాంగం 31.08.2026 Monday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాస క్రిష్ణ పక్ష తృతీయ తిథి ఇందు వాసర రేవతి నక్షత్రం గండ యోగః భద్ర తదుపరి బవ కరణం.


రాహుకాలం : ఉదయం 07:30 నుండి 09:00 వరకు.

 

యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 

 


శ్రాద్ధ తిథి: చతుర్థి.



 

నమస్కారః , శుభోదయం

భగవద్గీత-

 

--------------------------భగవద్గీత. ------------------------

                        షష్ఠమోధ్యాయః

                        ధ్యాన యోగము



తపస్విభ్యోఽధికో యోగీ జ్ఞానిభ్యోఽపి మతోఽధికః ।

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున ।। 46 ।।



ప్రతిపదార్థ:



తపస్విభ్యః — తపస్విల కన్నా; అధికః — ఉన్నతమైన వాడు; యోగీ — ఒక యోగి; జ్ఞానిభ్యః — జ్ఞానవంతుల కన్నా; అపి — కూడా; మతః — పరిగణించబడును; అధికః — ఉన్నతమైనది; కర్మిభ్యః — కర్మ కాండలు చేసే వారి కన్నా; చ — మరియు; అధికః — ఉన్నతమైనది; యోగీ — ఒక యోగి; తస్మాత్ — కాబట్టి; యోగీ — ఒక యోగి; భవ — అయిపో; అర్జున — అర్జునా.



తాత్పర్యము: 


ఒక యోగి తపస్వి కంటే ఉన్నతమైన వాడు, జ్ఞాని కంటే ఉన్నతమైనవాడు, ఇంకా కర్మీ కంటే కూడా ఉన్నతమైనవాడు. కాబట్టి, ఓ అర్జునా, నీవు యోగి అవ్వటానికి ప్రయత్నించుము.



వివరణ:


 తపస్వి అంటే, మోక్ష ప్రాప్తి సాధనకి సహాయంగా, తనకు తానే శారీరిక నిష్ఠలు విధించుకొని, తీవ్ర కఠిన జీవన విధానాన్ని అవలంబిస్తూ, ఇంద్రియ సుఖాలకు దూరంగా, భౌతిక సంపత్తి ఏమీ కూడబెట్టక ఉండే వాడు. జ్ఞాని, అంటే చురుకుగా ప్రయత్నపూర్వకంగా జ్ఞాన సముపార్జన చేసే ఒక చదువుకున్న వ్యక్తి. కర్మీ అంటే, భౌతిక సంపత్తి కోసం, స్వర్గాది లోక ప్రాప్తి కోసం వైదిక కర్మకాండలు ఆచరించే వాడు. వీరందరి కన్నా యోగియే శ్రేష్ఠుడు అని శ్రీ కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి కారణం చాలా సరళమైనది. కర్మీ, జ్ఞాని, మరియు తపస్విల యొక్క లక్ష్యం భౌతిక వస్తువిషయ ప్రాప్తి; వారు ఇప్పటికీ శారీరిక దృక్పథంలోనే ఉన్నట్టు. యోగి, భౌతిక పురోగతి కోసం పాటు పడట్లేదు, భగవత్ ప్రాప్తి కోసం శ్రమిస్తున్నాడు. అందుకే యోగి సాధించేది ఆధ్యాత్మికమైనది మరియు యోగి వీరందరి కన్నా ఉన్నతమైనవాడు.

30, ఆగస్టు 2026, ఆదివారం

మహాభారతంలోనిశల్య వృత్తాంతం

 *🌸మహాభారతంలోనిశల్య వృత్తాంతం

శల్యుడు


 మద్రదేశానికి రాజు.ఇతడు నకులుడు మరియు సహదేవునికి మేనమామ.పాండవుల పక్షాన యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరినప్పుడు,దుర్యోధనుడు మార్గమధ్యంలో అతిథి సత్కారాలు చేయించి,అవి తానే చేయించినవని తెలియకుండా శల్యుని మెప్పించాడు.సంతోషించిన శల్యుడు కోరిన వరం ఇస్తానని మాట ఇచ్చాడు.అప్పుడు దుర్యోధనుడు తన పక్షాన కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొనాలని కోరాడు.ఇచ్చిన మాటకు కట్టుబడి శల్యుడు కౌరవుల పక్షాన చేరాడు.

కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడు ఎంతో పరాక్రమంతో పోరాడాడు.ముఖ్యంగా కర్ణునికి సారథిగా వ్యవహరించాడు.అయితే శల్యుడు పాండవుల పట్ల అంతరంగంలో సానుభూతి కలిగి ఉండేవాడు.అందువల్ల కర్ణుని ఉత్సాహాన్ని తగ్గించే విధంగా మాటలు చెప్పేవాడు.కర్ణుడు,అర్జునుడు తలపడిన సమయంలో కూడా శల్యుడు కర్ణునికి పూర్తిగా సహకరించలేదు.చివరకు కర్ణుడు మరణించిన తరువాత,దుర్యోధనుడు శల్యునిని కౌరవ సేనకు సేనాధిపతిగా నియమించాడు.

యుద్ధం చివరి దశలో ధర్మరాజు శల్యునితో భీకరంగా యుద్ధం చేశాడు.ఇద్దరి మధ్య ఘోరమైన పోరు జరిగింది.చివరకు ధర్మరాజు తన శక్తివంతమైన ఆయుధంతో శల్యుని సంహరించాడు.ఈ విధంగా మహాభారత యుద్ధంలో శల్యుడు ఒకవైపు గొప్ప వీరుడిగా,మరోవైపు ఇచ్చిన మాటకు కట్టుబడిన వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు.కర్ణునికి సారథిగా అతని పాత్ర,ధర్మరాజుగారి చేతిలో అతని మరణం శల్య వృత్తాంతంలో ముఖ్యమైన ఘట్టాలు.

 *మహాభారత పాత్ర (శల్యుడు):* మద్ర దేశాధిపతి,మాద్రికి సోదరుడు (నకుల సహదేవుల మేనమామ).కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరఫున కర్ణుడికి రథసారథిగా వ్యవహరించి,తన మాటలతో కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాడు.దీని నుంచే *"శల్య సారథ్యం"* అనే జాతీయం వాడుకలోకి వచ్చింది


సేకరణ

శ్రీమద్భాగవతం - 35/42*

 


*శ్రీమద్భాగవతం - 35/42* 


*మధురా ప్రవేశం మరియు కంస సంహారం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భాగవత అధ్యయనం లో భాగంగా నిన్న శ్రీకృష్ణ పరమాత్మ మధురా నగరానికి బయలు దేరాడు ఈరోజు మధురా ప్రవేశం కంస సంహారం జరుగుతుంది.


1. మధురా నగర ప్రవేశం & భక్తుల అనుగ్రహం


రామకృష్ణులు నందాది గోపబాలురు మధురా నగరం దగ్గర గల ఉపవనం లో బస చేసారు, ఇష్టం లేకపోయినా అక్రూరుడు కృషుణ్ణీ వీడి ముందుగా నగరంలోకి వెళ్ళి కంసునికి విషయం తెలియచేసి తన నివాసానికి వెళ్ళాడు.


ఆ తర్వాత రోజు నగర సౌందర్యం చూడటానికి గోపాలురు, బల రామకృష్ణులు నగరంలోకి ప్రవేశించారు.ఇన్ని రోజులు 

ఆ నగర వనితలు కృష్ణభగవానుని లీలామహత్త్వములను గూర్చి పదేపదే వినుచు ఆయన దర్శనమునకై తమ మనస్సులలో ఎంతో తహతహపడుచుండిరి. ఇప్పుడు ఆ స్వామిని ప్రత్యక్షముగా దర్శించుటతోవారిలో సంతోషము పొంగులువారింది.ఆనందంతో నగర స్త్రీలంతా మేడలపైకి ఎక్కి వారిపై పూలవాన కురిపించారు.


గోపికలు నిజముగా ఎంత ధన్యాత్మలోగదా! మానవాళికి పరమానందదాయకులైన ఈ మహానుభావులను నిత్యము దర్శించెడి భాగ్యమునకు నోచుకొనిన ఆ గోపవనితలు ఎంతటి తపస్సులను ఆచరించిరోయేమో అని తమలో తాము అనుకున్నారు.


ఇంతలో వస్త్రములను శుభ్రముగా ఉతికేవాడు, వాటికి రంగులు అద్దె వాడైన ఒక చాకలి శ్రీకృష్ణునకు కనబడెను. అప్పుడు ఆ స్వామి, 'మేలైన ఉతికిన వస్త్రములను ఇమ్ము' అని అడుగుచు అతనితో ఇట్లనెను- “మిత్రమా! అర్హులమైన మా ఉభయులకును కొన్ని మంచి వస్త్రములను ఇమ్ము. గుడ్డలను ఇచ్చినందున నీకు చక్కని శ్రేయస్సు కలుగును. ఇది ముమ్మాటికిని నిజము”.అన్నాడు


కానీ కంసుని రాజవస్త్రాలు ఉతికే ఆ చాకలివాడు (రజకుడు) అహంకారంతో అడవులలో, గుట్టల్లో తిరిగే గోపాలులారా మీకు మేలైన వస్త్రాలు కావాలా, కళ్ళు నెత్తికి ఎక్కాయా ఇవి రాజులు ధరించే వస్త్రాలు అంటూ యుక్తాయుక్తములు మరచి ఇష్టారీతిన పలుకుతూ 

అవమానించగా కృష్ణుడు అరచేతి దెబ్బతో వాడి శిరస్సును ఖండించాడు. 


ఇతర సేవకులు ఉత్తమ వస్త్రాలను అందించగా, దర్జీవాడు (వాయకుడు) వాటిని రామకృష్ణులకు తగినట్లు కుట్టి అలంకరించి భగవదనుగ్రహం పొందాడు.


*సుదాముడనే మాలాకారుడు*

అనంతరం బలరామ కృష్ణులు పూల వ్యాపారియైన సుదాముడు ఇంటికి వెళ్ళారు.అతను రామకృష్ణులను భక్తితో తన ఇంటికి ఆహ్వానించి, దివ్యమైన పూలమాలలతో పూజించి సాష్టాంగ నమస్కారం చేసి సేవించాడు. స్వామి ఆయనకు అచంచల భక్తిని, వంశాభివృద్ధిని వరంగా ఇచ్చాడు.


*కుబ్జ (త్రివక్ర)కు సౌందర్య ప్రదానం*

శ్రీకృష్ణుడు సుదాముని అనుగ్రహించిన పిదప రాజమార్గం గుండా సాగిపోవుతూ ఒక యువతిని చూసాడు.


ఆమె మూడు వంకర్లు తిరిగిన శరీరంతో (కుబ్జ), కంసునికి సుగంధ లేపనాలు తీసుకువెళ్తున్న 'సైరంధ్రి' అనే యువతి. కృష్ణుడు ఆమెను ఆపి చందనం అడిగాడు. ఆమె పరవశించి తన వద్దనున్న దివ్య చందనాన్ని రామకృష్ణులకు పూసింది. కృష్ణుడు ఆమె కాలి బొటనవేలుపై తన పాదం ఉంచి, గడ్డం కింద రెండు వేళ్లు పెట్టి పైకి ఎత్తగానే... ఆమె వంకరలు అన్నీ పోయి అత్యంత సౌందర్యవతిగా మారిపోయింది. శ్రీకృష్ణునీ ఆమె గృహానికి రమ్మనగా ఆమెను సమాధాన పరచి ముందుకు సాగుతూ ధనుర్యాగ స్థానం తెలుసుకుని అందులో ప్రవేశించాడు.


2. శివ ధనుర్భంగం


కంసుడు ఏర్పాటు చేసిన 'ధనుర్యాగ' శాలకు రామకృష్ణులు వెళ్లారు. అక్కడ పూజలందుకుంటున్న మహా భయంకరమైన, ఇంద్రధనుస్సు వంటి శివధనుస్సును చూశారు.


అనేకమంది కావలిభటులు వారిస్తున్నా వినకుండా, శ్రీకృష్ణుడు ఆ భారీ ధనుస్సును సమీపించి ఒక చిన్న చెరకుగడను విరిచినట్లు అలవోకగా ఎత్తి నారి సంధించి మధ్యకు విరిచివేశాడు!


* **కంసుని భయం:** 

ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన భయంకర శబ్దానికి మధురా నగరమే కంపించింది.కంసుని గుండెలు పగిలినంత పనైంది. ధనుస్సును కాపలా కాస్తున్న సైనికులు రామకృష్ణులపై దాడి చేయగా, విరిగిన ధనుస్సు ముక్కలతోనే వారిని సంహరించి రామకృష్ణులు సాయంత్రానికి నగరం వెలుపల ఉన్న తమ శిబిరానికి చేరుకున్నారు.


3. కువలయాపీడ గజ సంహారం & రంగాగ్ర ప్రవేశం

బలరామ కృష్ణులు అవలీలగా ధనుస్సు విరిచి, బటులను సంహరించిన సంగతి విన్నది మొదలు కంసుడి భయం రెట్టింపు అయినది,ఆ రాత్రి నిద్రకూడా పట్టలేదు, కనులు మూసిన తెరచిన మృత్యువును సూచించే అపశకునాలే కనపడ్డాయి. ఎలాగో ఆ రాత్రి గడిచింది.


మరుసటి రోజు ఉదయం కంసుడు మల్లయుద్ధ రంగాన్ని సిద్ధం చేసి, సింహాసనంపై కూర్చున్నాడు. రంగద్వారం వద్ద రామకృష్ణులను తొక్కించి చంపడానికి **'కువలయాపీడము'** అనే మదపుటేనుగును మావటివానితో నిలబెట్టాడు.


శ్రీకృష్ణుడు, బలరాముడు ప్రాతః కాలస్నానాది విధులను నిర్వర్తించుకొని.మల్లయోధుల భుజాస్ఫాలనాది ధ్వనులను, దుందుభి మొదలగు వాద్యముల ఘోషలను విని, రంగస్థల విశేషములను స్వయముగా తిలకించుటకై బయలుదేఱిరి.రంగస్థల ద్వారం దగ్గరకు రాగానే అక్కడ కువలయా పీడం అనే ఏనుగును చూసాడు కృష్ణుడు 


గజ సంహారం:ఆ ఏనుగు కృష్ణునిపైకి మావటి ప్రేరణతో దూసుకురాగా, స్వామి దాని తోకను పట్టుకుని తిప్పి, దాని దంతాలను పెకిలించి ఆ దంతంతోనే ఏనుగును, మావటివాడిని సంహరించాడు.


రక్తసిక్తమైన ఏనుగు దంతాన్ని భుజాన ధరించి రామకృష్ణులు మల్లరంగంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నవారికి రకరకాల భావాలతో దర్శనమిచ్చాడు:


మల్లురకు **వజ్రాయుధంలా**, పురుషులకు **నరశ్రేష్ఠుడిగా**, స్త్రీలకు **మన్మథునిగా**, గోపాలురకు **మిత్రుడిగా**, కంసునికి **సాక్షాత్తు మృత్యువులా**, యోగులకు **పరతత్త్వంగా** కనిపించాడు.


4. చాణూర-ముష్టిక వధ & కంస సంహారం

కంసుడు ఎంతో దైర్యం కలవాడే కానీ, అత్యంత శక్తివంతమైన కువలయా పీడం కూడా కృష్ణునీ చేతిలో మడిసిపోవడంతో అతనిలో భయం రెట్టింపు అయినది.


అప్పుడు ప్రసిద్ధ మల్ల యోధులు అయిన చానూర, ముష్టికులను బలరామకృష్ణులతో మల్ల యుద్ధానికి ఉసి గోల్పెల చేయమని ఆదేశించాడు.


ప్రసిద్ధ మల్లురైన చాణూరుడు కృష్ణునితో, ముష్టికుడు బలరామునితో మల్లయుద్ధానికి దిగారు.


* **మల్లయుద్ధం:** చిన్న బాలురతో భారీకాయులైన రాక్షసులు పోరాడటం చూసి సభలోని స్త్రీలు "ఇది అధర్మం" అని బాధపడ్డారు. కానీ శ్రీకృష్ణుడు చాణూరుని చేతులను పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించాడు. బలరాముడు ముష్టికుడిని పిడిగుద్దులతో చంపేశాడు. కూటుడు, తోశలకుడు మొదలైన ఇతర రాక్షస మల్లురంతా సంహరించబడ్డారు.ప్రాణములమీది తీపిచే, బ్రతుకుజీవుడా యనుచు శరవేగముతో మిగతా మల్లురు పిక్కబలము చూపిరి.  


ప్రత్యర్థులైన మల్లురను మట్టిగఱపించిన బలరామకృష్ణులు తమ మిత్రులగు గోపాలురను చేరబిలిచిరి. ఒకవైపు తూర్యములు మొదలగు వాద్యములు మ్రోగుచుండగా వారు గోపాలురతోగూడి నృత్యము లొనర్చిరి. అప్పుడు వారి కాలి అందెల రవళులు మధురముగా నినదించెను. 


* **కంస వధ:** 

ఇది చూసి భయపడిన కంసుడు పిచ్చివాడిలా లేచి: "ఈ బాలురను నగరం నుండి వెళ్ళగొట్టండి! నందుని సంపదను లాక్కోండి! అతడినిబంధించండి;వసుదేవుని, ఉగ్రసేనుడిని చంపండి!"వాధ్యములు ఆపండి అని అరిచాడు.


కంసుడు ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండగానే కోపంతో

కంసుని మాటలు పూర్తికాకముందే శ్రీకృష్ణుడు ఒక్క ఉదుటున ఎగిరి కంసుని ఎత్తైన సింహాసనంపైకి లంఘించాడు.కంసుడు కత్తి దూసి ఎదిరించే ప్రయత్నం చేశాడు కానీ ఒడుపుతో కంసుని కిరీటాన్ని తన్ని, ఆయన జుట్టును గట్టిగా పట్టుకుని రంగస్థలంపైకి విసిరికొట్టాడు.


* **ప్రాణాపహరణం:** అక్కడి నుండి కంసుని గుండెలపై దూకి ఒక్క గుద్దు గుద్దగానే కంసుడు రక్తాలు కక్కి ప్రాణాలు విడిచాడు. నిరంతరం భయంతోనైనా కృష్ణుడినే ధ్యానించినందువల్ల కంసునికి సారూప్య ముక్తి లభించింది.


అప్పుడు కంసుని సోదరులైన కంకుడు, న్యగ్రోధుడు మొదలగువారు ఎనిమిదిమంది మిక్కిలి క్రుద్ధులై తమ అన్న ఋణము తీర్చుకొనగోరి (అన్నను హతమార్చిన శ్రీకృష్ణునిపై పగదీర్చుకొనుటకై) ఆ బలరామకృష్ణుల మీదికి దాడిచేసిరి. 


అలా దూసికొనివచ్చుచున్న కంకాదులను జూచి, బలరాముడు ఇనుపకట్ల గుదియను చేబూని, సింహము పశువులను వలె వారిని అందఱిని సంహరించెను. 


అప్పుడు శ్రీహరియొక్క విభూతి స్వరూపులైన బ్రహ్మాది దేవతలు ఆనందముతో బలరామకృష్ణులపై పూవులను చల్లుచు ప్రశంసలను కురిపించిరి. ఆకాశమున దుందుభులు మ్రోగెను. అప్సరసలు నృత్యములొనర్చిరి.


రాజ పత్నులు అక్కడికి చేరి గుండెలు బాదుకుని ఏడ్చారు.శ్రీకృష్ణుడు దుఃఖితలైయున్న ఆ రాజపత్నులను అనునయ వచనములతో ఓదార్చెను. మృత్యువుపాలైన కంసాదులకు ఆ ప్రభువు లోకరీతిని అనుసరించి ఉత్తరక్రియలను జరిపించెను


5. తల్లిదండ్రుల విముక్తి & ఉగ్రసేన పట్టాభిషేకం

కంస వధ అనంతరం రామకృష్ణులు కారాగారానికి వెళ్లి, తమ తల్లిదండ్రులైన దేవకీ-వసుదేవుల కాళ్లకు ఉన్న సంకెళ్లను తొలగించి వారి పాదాలకు ప్రణమిల్లారు. దేవకీ వసుదేవులు ఆనందబాష్పాలతో బిడ్డలను గుండెలకు హత్తుకున్నారు.(దేవకి వసుదేవులు ఇంతకాలం కృష్ణుడు సాక్షాత్ పరమాత్మ అని ఉపాసించారు, ఇప్పడు ఆ భావం ఉంటే పుత్ర వాత్సల్యం చూపలేరు అని మాయ చేత వారి నుండి ఆ భావం తొలగించి పుత్ర ప్రేమ పెట్టాడు)


* **ఉగ్రసేనునికి రాజ్యం:** కృష్ణుడు స్వయంగా రాజ్యాధికారాన్ని చేపట్టకుండా, కారాగారంలో ఉన్న కంసుని తండ్రి ఉగ్రసేన మహారాజును విడుదల చేసి, యదువంశానికి చక్రవర్తిగా పట్టాభిషేకం చేశాడు.


శ్రీకృష్ణుడు (శ్రీహరి) విశ్వసృష్టికి కారకుడు. కంసుని దురాగతములకు భయపడి నలుదిక్కులకు పాఱిపోయిన యదు, వృష్టి, అంధక, మధు, దాశార్హ, కుకురాది వంశీయులైన తన బంధువులను అందఱిని ఆ ప్రభువు మధురకు పిలిపించెను. ఇంతవఱకును కాందిశీకులై విదేశములలో బిక్కుబిక్కుమనుచు తలదాచుకొనుచున్న వారినందఱిని సగౌరవముగా ఆహ్వానించి, ఆ స్వామి ఆత్మీయతతో ఓదార్చెను. పిమ్మట వారిని ధనాది సంపదలచే తృప్తిపఱచి, వారివారి గృహములలో నివసింపచేసెను. 


శ్రీకృష్ణబలరాముల అనుగ్రహముతో వారి మనస్తాపములు తీఱిపోయెను, మనోరథములన్నియును ఈడేరెను. ఆ నందకుమారుల బాహు బలచ్చాయలో వారు సురక్షితులై యుండిరి. అందువలన ఆ యదు ప్రముఖ వంశీయులందఱును తమ తమ గృహములలో హాయిగా నుండిరి. 


*నందునికి వీడ్కోలు*

పిమ్మట కృష్ణభగవానుడు, బలరాముడు నందగోపునిజేరి, ఆయనను కౌగిలించుకొని,తండ్రీ! నీవును, తల్లి యశోదయు, మిగుల ప్రేమ వాత్సల్యములతో మమ్ము లాలించి, పోషించితిరి. మాతాపితలు తమ సంతానమును ప్రాణములకంటెను మిన్నగా చూచుకొందురు. అందు ఏమాత్రమూ సందేహము లేదు.  


కన్న తల్లిదండ్రులును, తదితర బంధువులును తమ శిశువులను పోషించుటకును, రక్షించుటకును (లాలన, పాలనలకు) వీలుకాని పరిస్థితులలో వదలివేసినప్పుడు, వారిని చేరదీసి ప్రేమాదరములతో పెంచి పోషించిన వారే. నిజమైన తల్లిదండ్రులు. 


నాయనా! ఇక మీరు వ్రజభూమికి వెళ్లిరండు. మేము మీ యెదుట లేనందున మీరు మిక్కిలి బెంగపడుదురను మాట వాస్తవమే. అందువలన మేమును ఇక్కడి బంధుమిత్రులకు ఆత్మీయతతో | సుఖసంతోషములను గూర్చిన పిదప, మారాకకై అనుక్షణము నిరీక్షించుచు తపనపడుచుండెడి మీ అందఱిని చూచుటకై అక్కడికి మేము తప్పక వత్తుము”. అని చెప్పి..


కృష్ణభగవానుడు నందునకును, తదితర వ్రజవాసులకును ఈవిధముగా ఊఱటగూర్చి, వస్త్రాభరణములను, కంచుపాత్రలను సమర్పించి, వారిని సాదరముగా పూజించెను. ఎంతో బాధతో నందుడు వారిని వీడ్కోనీ వ్రజ భూమికి చేరాడు.


* **గురుకుల ప్రవేశం:** 

ఇదివఱలో కంసుడు వసుదేవుని గోసంపదను అన్యాయముగా లాగుకొనియుండెను. బలరామకృష్ణులు జన్మించినప్పుడు ప్రజ్ఞాశాలియైన (ధర్మబుద్ధిగల) వసుదేవుడు బ్రాహ్మణులకు గోదానములను చేయుటకు సంకల్పించి యుండెను. 


ఆ సంకల్పమును అనుసరించి, కంసుని మరణముతో తనకు స్వాధీనమైన ఆ గోవులను ఇప్పుడు భూసురోత్తములకు దానము చేశాడు . 


యదువంశమునకు ఆచార్యుడైన (పురోహితుడైన) గర్గమహర్షిచే జరిపింపబడిన ఉపనయన సంస్కారముల ద్వారా బలరామకృష్ణులకు ద్విజత్వము ప్రాప్తించెను. ఆ మహామునినుండి గాయత్రీ మంత్రోపదేశమును పొందిన పిమ్మట సోదరులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింపదొడగిరి.


అనంతరం బలరామకృష్ణులు అవంతి నగరంలోని **సాందీపని మహర్షి** వద్దకు వెళ్లి కేవలం అరవై నాలుగు (64) రోజులలో సమస్త వేదాలు, వేదాంగాలు, 64 కళలను అభ్యసించారు. 


గురుదక్షిణ సమర్పిస్తాను అని వారు అడగగా వీరి అపార మహిమలు ఎరిగిన సాందీపని ముని ప్రభాస తీరంలో సముద్రంలో మునిగిపోయిన పుత్రుడినీ బ్రతికించి ఇవ్వండి అన్నాడు.


బలరామ కృష్ణులు ఇద్దరూ సరే అని ప్రభాస తీర్థం కి వెళ్ళి సాగరా నీ ఉత్తుంగ తరంగాల లో మా గురు పుత్రుని దాచావు మాకు ఇవ్వు అని ఆదేశిస్తే, కృష్ణ పంచజనుడు అనే రాక్షసుడు మీ గురు పుత్రుని అపహరించాడు అని చెపితే, సముద్రంలోకి ప్రవేశించి వాడిని సంహరించాడు కానీ వాడి ఉదరంలో గురు పుత్రుడు లేడు కానీ పాంచజన్యం అనే శంఖం వాడి శరీరం నుండి పుట్టింది దాన్ని తీసుకుని, యమ లోకానికి వెళ్ళి శంఖం పూరించాడు. యముడు శ్రీకృష్ణునీ గుర్తించి సేవించి గురు పుత్రుని ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్మ ఆ బాలుని తీసుకుని గురువుకు అప్పగించి గురువర్య ఇంకా ఏమి కావాలో తెలుపండి అని వినయంగా అడిగాడు.


గురువు వారిని ఆశీర్వదించి, నాయనా మీ కీర్తి అజరామరం, సమస్త లోకాల్లో మీకు తిరుగుండదు అని ఆశీర్వదించి పంపాడు.వారు రథాలపై ఎక్కి తిరిగి మధురకు చేరుకున్నారు.


📝 నేటి ముఖ్య విషయాలు:


1. **భావగ్రాహీ జనార్దనః:** పత్రం, పుష్పం, ఫలం, తోయం... లేదా కుబ్జ సమర్పించిన చందనం, సుదాముడు ఇచ్చిన పూలమాల అయినా సరే నిష్కల్మష భక్తితో సమర్పిస్తే భగవంతుడు సర్వస్వాన్నీ అనుగ్రహిస్తాడు.


2. **అధర్మ నాశనం:** బలవంతుడైన కంసుడు ఎంతటి భద్రతలను ఏర్పాటు చేసుకున్నా, అధర్మ మార్గంలో నడిచినందువల్ల భగవత్ సంకల్పం ముందు క్షణంలో నేలకూలాడు.


3. **నిస్వార్థ ధర్మం:** కంసుడిని చంపినప్పటికీ శ్రీకృష్ణుడు సింహాసనాన్ని ఆశించక, ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా నిస్వార్థ ప్రజాపాలనా ధర్మాన్ని చాటాడు.


రేపు ఉద్ధవ గీత వస్తుంది వేచి ఉండండి శ్రీకృష్ణ శరణం మమ 


.....సశేషం

🙏🌹🙏


       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*