తెలుగు పండిత కవులు
ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
12, జూన్ 2026, శుక్రవారం
శనివారం*🍁 *🌹13, జూన్, 2026🌹* *దృగ్గణిత పంచాంగం*
*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🍁 *శనివారం*🍁
*🌹13, జూన్, 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*ఈనాటి పర్వం*
*🔱మాస శివరాత్రి🔱*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - గ్రీష్మ ఋతౌః*
*అధిక జ్యేష్ఠ మాసం - బహుళ పక్షం*
*తిథి : త్రయోదశి* సా 04.07 వరకు ఉపరి *చతుర్దశి*
*వారం :శనివారం* (స్ధిరవాసరే)
*నక్షత్రం : కృత్తిక* రా 01.16 వరకు ఉపరి *రోహిణి*
*యోగం : సుకర్మ* సా 05.28 వరకు ఉపరి *ధృతి*
*కరణం : గరజి* ఉ 05.55 *వణజి* సా 04.07. ఉపరి *భద్ర* రా 02.15 వరకు ఆపైన *శకుని*
*సాధారణ శుభ సమయాలు:*
*-ఈరోజు లేవు-*
అమృత కాలం : *రా 11.09 - 12.34*
అభిజిత్ కాలం : *ప 11.41 - 12.34*
*వర్జ్యం : మ 02.41 - 04.05*
*దుర్ముహూర్తం :ఉ 05.34- 07.19*
*రాహు కాలం :ఉ 08.51 - 10.29*
గుళికకాళం : *ఉ 05.34 - 07.13*
యమగండం : *మ 01.46 - 03.24*
సూర్యరాశి : *వృషభం*
చంద్రరాశి : *మేషం/వృషభం*
సూర్యోదయం :*ఉ 05.42*
సూర్యాస్తమయం :*సా 06.51*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.34- 08.12*
సంగవ కాలం :*08.12 - 10.49*
మధ్యాహ్న కాలం :*10.49 - 01.26*
అపరాహ్న కాలం :*మ 01.26- 04.03*
*ఆబ్ధికం తిధి :త్రయోదశి / చతుర్ధశి*
సాయంకాలం :*సా 04.03- 06.41*
ప్రదోష కాలం :*సా 06.41 - 08.51*
రాత్రి కాలం :*రా 08.51 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.29*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.07 - 04.51*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
*🌷ప్రతినిత్యం🌷*
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
🍁 *ఓం శ్రీ*🍁
🌹 *ఆంజనేయాయ నమః*🌹
🌷 *సేకరణ*🌷
🌹🌿🍁🍁🌿🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🍃🍁🍁🍃🌷
🌹🌷🍁🍁🍁🍁🌷🌹
శాంతులు
🔔 *సనాతనం* 🔔
*గ్రంథాలలో చెప్పబడిన శాంతులు*
"55వ పుట్టిన రోజు - భీమ శాంతి"
"60వ పుట్టిన రోజు - ఉగ్ర రథ శాంతి"
"61వ పుట్టిన రోజు - షష్టి పూర్తి"
"70వ పుట్టిన రోజు - భీమ రథ శాంతి"
"72వ పుట్టిన రోజు - రథ శాంతి"
"78వ పుట్టిన రోజు - విజయశాంతి" (77 సంవత్సరాల 7 నెలల 7 రోజులు)
"80వ పుట్టిన రోజు - శతాభిషేకం" (80 సంవత్సరాల 8 నెలల 8 రోజులు)
"85వ పుట్టిన రోజు - మృత్యుంజయ" శాంతి
"88 సంవత్సరాల 8 నెలల 8 రోజులు - దేవ రథ" శాంతి
"99 సంవత్సరాల 9 నెలల 9 రోజులు - దివ్య రథ" శాంతి
"100వ పుట్టిన రోజు - పూర్ణాభిషేకం"
"105 సంవత్సరాల 8 నెలల 8 రోజులు *మహా దివ్య రథ* శాంతి
ఇది చదివిన, విన్న ప్రతి ఒక్కరూ "మహా దివ్య రథ" శాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను*
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
యమనియమములు
💐💐💐💐💐💐
*యమనియమములు*
💐💐💐💐💐💐
*యమనియమములు* అంటే యోగశాస్త్రంలో చెప్పబడిన ఆచరణధర్మాలు. ఇవి పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగయోగంలో మొదటి రెండు అంగాలు.
*అష్టాంగయోగం:*
యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి.
*యమములు* — సమాజంలో పాటించవలసిన నియమాలు
*పతంజలి యోగసూత్రం 2.30**లో ఐదు యమములు చెప్పబడ్డాయి:
> *“అహింసాసత్యాస్తేయబ్రహ్మచర్యాపరిగ్రహా యమాః”*
అవి:
1. *అహింస* — మనసా, వాచా, కర్మణా ఎవరికీ హాని చేయకపోవడం.
2. *సత్యం* — నిజం మాట్లాడడం; కానీ హితంగా, ధర్మబద్ధంగా మాట్లాడడం.
3. *అస్తేయం* — ఇతరుల వస్తువు, హక్కు, పేరు, కీర్తి, సమయం దొంగిలించకపోవడం.
4. *బ్రహ్మచర్యం* — ఇంద్రియనిగ్రహం, శక్తిని ధర్మమార్గంలో నిలుపుకోవడం.
5. *అపరిగ్రహం* — అవసరానికి మించి సేకరించకపోవడం; లోభం తగ్గించడం.
*నియమములు* — వ్యక్తిగత ఆత్మశుద్ధి నియమాలు
*పతంజలి యోగసూత్రం 2.32**లో ఐదు నియమములు చెప్పబడ్డాయి:
> *“శౌచసంతోషతపఃస్వాధ్యాయేశ్వరప్రణిధానాని నియమాః”*
అవి:
1. *శౌచం* — బాహ్యశుద్ధి, అంతఃకరణశుద్ధి.
2. *సంతోషం* — లభించిన దానిలో ధర్మబద్ధమైన తృప్తి.
3. *తపస్సు* — శరీర, వాక్కు, మనస్సును నియంత్రించి శ్రేయోమార్గంలో నిలుపుకోవడం.
4. *స్వాధ్యాయం* — శాస్త్రపఠనం, మంత్రజపం, ఆత్మపరిశీలన.
5. *ఈశ్వరప్రణిధానం* — ప్రతి కర్మను భగవంతునికి అర్పించడం; దైవశరణాగతి.
*సరళంగా చెప్పాలంటే:*
*యమములు* —
> ఇతరులతో మన ప్రవర్తనను శుద్ధి చేస్తాయి.
*నియమములు*—
> మన అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి.
*యమ నియమాలు* లేకుండా యోగం కేవలం శరీరవ్యాయామంగా మిగిలిపోతుంది.
*యమ నియమాలు* ఉంటే జీవితం యోగమార్గంగా మారుతుంది.
💐💐💐💐💐💐
*Kumara Sharma*
*న్యాయవాది & ఆధ్యాత్మికవేత్త*
*జగద్గురు జ్ఞానపీఠం*
*9063939567*
💐💐💐💐💐💐
చర్మరక్షణ కొరకు
చర్మరక్షణ కొరకు , సౌందర్యం కొరకు మూలికా యోగములు -
• టంకణం ( borax ) , పసుపు సమానంగా కలిపి కొబ్బరినూనెలో కలిపి పైకి రాయుచున్న కాలిపగుళ్లు , పెదాల పగుళ్లు క్రమేణా నివారణ అగును.
• శ్రీ గంథం , అగరు , వట్టివేళ్లు సమానంగా తీసుకుని మిశ్రమం చేసి ఆ చూర్ణమును పాలు లేదా పన్నీరు కలిపి రాయుచున్న ముఖవర్చస్సు పెరుగుతుంది .
• చందనం , కుంకుమపువ్వు మరియు కస్తూరి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి లేపనం చేయుచున్న ముఖవర్చస్సు పెరుగును .
• శనగలు , పెసలు , కచ్చురాలు , చందనం , కస్తూరి పసుపు మొదలైన ద్రవ్యాలను కలిపి సిద్దం చేసుకున్న " సున్నిపిండి " శరీరానికి పట్టించి మర్దన చేసుకుని ఒక గంట తరువాత స్నానం చేయుచున్న మనస్సుకి ఆహ్లాదం కలిగించడంతో పాటు చర్మరోగాలు రానివ్వకుండా కాపాడును.
• సీతాఫలం గింజలను వేపనూనెలో మర్దించి పైకి లేపనం చేయుచున్న తలలో చుండ్రు హరించును .
• ఒక కప్పు పాలల్లో ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి మరునాడు ఉదయం గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుగుకొనుచున్న క్రమేణా ముఖం మీద మచ్చలు తగ్గును.
• గసగసాలు పాలలో మర్దించి తలకు పట్టించి తలస్నానం ఆచరించిన చుండ్రు హరిస్తుంది.
• కాలిన గాయాల వలన ఏర్పడిన మచ్చలు పోవడానికి బంతి ఆకుల రసమును పైకి పట్టించుచుండిన మచ్చలు తగ్గును. స్వచ్చమైన తేనె రాసినను కాలిన గాయపు మచ్చలు తగ్గును.
• మామిడి ఆకుల ఈనెలు సేకరించి నీడలో ఆరబెట్టి మెత్తటి చూర్ణం సిద్దం చేసుకుని అందులో కొంచం బట్టలసోడా , కొద్దిగా సున్నం కలిపి పైన పట్టించుచుండిన పులిపిర్లు క్రమేణా నశించును .
• వేపబెరడు గాని వేపచిగుళ్ళు గాని తీసుకుని పసుపు కలిపి నీటితో నూరి శరీరముకు పట్టించి గంట తరువాత స్నానం చేయుచుండిన చెమటకాయలు క్రమేణా తగ్గిపోవును
• కుప్పింట ఆకు రసం రెండు చెంచాలు కడుపులోకి ఇస్తే నులిపురుగులు చచ్చిపడిపొవును .
• నిమ్మరసం మరియు తులసి ఆకు రసం సమానంగా తీసుకుని బాగా కలిపి పైన రాయుచున్న గజ్జలలో దురదతో కూడి బిళ్లలుగా జనియించే రింగ్ వార్మ్ అనే చర్మవ్యాధి నశించును.
• జాజికాయ , చందనం మరియు మిరియాలు సమానంగా గ్రహించి గోరువెచ్చని నీళ్లతో మెత్తగా నూరి ఆ గంధమును పైకి రాయిచున్న మోటిమలు నివారణ అగును.
• ఒక కప్పు పెరుగు నందు అర టీస్పూను నిమ్మరసం , అర టీస్పూను పటిక చూర్ణం కలిపి తలకు మర్దన చేసుకుని స్నానం చేయుచున్న చుండ్రు , తలలో పేలు హరించును .
• కాలిన గాయాలకు కలబంద రసములో కొద్దిగా పసుపు కలిపి పైన పట్టిస్తే త్వరగా మానుతాయి. కాలిన గాయాలకు వెంటనే తేనెను రాస్తే తీవ్రమైన వేదన , మంట శాంతిస్తాయి.
• నిమ్మరసం , కొబ్బరిపాలు కలిపి బాగా గిలకొడితే తెల్లటి మీగడ వంటి పదార్థం తయారగును దీనికి ముఖానికి పట్టిస్తే ముఖవర్చస్సు పెంపొందును.పైన చెప్పినవాటిలో కొన్ని మూలికలు మీకు ఆయుర్వేద దుకాణాలలో లభ్యం అగును.
మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.
దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత -
దక్షిణావర్తి శంఖం యొక్క ప్రత్యేకత -
శంఖములలో రెండు రకాలు కలవు . అవి
• వామావర్తి శంఖము .
• దక్షిణావర్తి శంఖము .
పైన చెప్పిన రెండురకాల శంఖాలలో దక్షిణావర్తి శంఖం సులభముగా లభ్యం అగును. ఇది ఒక మంచి తాంత్రిక వస్తువు . దీనిని పూజలలో మహాలక్ష్మితో సమానంగా భావించెదరు .తంత్రగ్రంధాల ప్రకారం వామావర్తి అంటే ఎడమ చేయి వైపు "కడుపు" కలది అనగా ఎడమచేయి వైపు తెరిచి ఉండేది అని దక్షిణావర్తి అంటే కుడివైపు తెరచి ఉండేదని అర్థం . ఇప్పుడు శంఖాల గురించి కొంత వివరణ మీకు ఇస్తాను . శంఖం అనేది " ఘోoఘా " అనే సముద్రజాతికి చెందిన జంతువు . ఇది తెరుచుకొని ఉన్న భాగమే దీని కడుపు లేక నోరు . తలవలే ఉండి ఊదే భాగం దానియొక్క పృష్ఠభాగం అంటే వెనక భాగం లేక తోకభాగం . దీనికే గుండ్రని కన్నం చేసి నోటితో ఊదుతారు. దక్షిణవర్తి శంఖం అనేది చాలా ప్రత్యేకమైన తాంత్రిక వస్తువు . సముద్రము నందు జన్మించడం మూలాన శ్రీ మహాలక్ష్మితో పోల్చబడిన వస్తువు . సమస్త సిరులు , భోగభాగ్యాలు ప్రసాదించును . శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు వంటి వారు ఒక్క యుద్ధ సమయము నందు తప్ప మిగిలిన సమయాలలో పూజా మందిరము నందు ఉంచి పూజించేవారు . దీనిని లక్ష్మీదేవి సహోదరిగా చెప్పుదురు . ఇది అరుదుగా లభ్యం అగును . రామేశ్వరం , కన్యాకుమారి వంటి స్థలములలో తప్ప అన్య ప్రదేశాలలో దొరకదు . ఈ దక్షిణావర్తి శంఖం మోగదు . మోగేది దొరుకుట అదృష్టము మరియు కష్టం . దోషయుక్తం అనగా పగిలిన మరియు విరిగిన శంఖం ఇంటి యందు ఉంచరాదు .
ఇప్పుడు పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఎటువంటి అవలక్షణాలు లేనటువంటి దక్షిణావర్తి శంఖమును సేకరించుకుని ముందుగానే కర్రతో చేసిన ఆసనము పైన ఒక ఎర్రని కొత్త గుడ్డని పరచి దానిపై శంఖువు యొక్క శిఖరం తూర్పు ,ఉత్తర ఈశాన్యం వైపు ఉంచాలి. ఇలా పెట్టడానికి ముందుగా కొన్నిరకాల స్నానాలు చేయించాలి . మొదట శుద్ధోదక స్నానం అనగా శుభ్రమైన నీటితో స్నానం తరువాత పంచామృత స్నానం ( తేనె , ఆవుపాలు , ఆవుపెరుగు , ఆవునెయ్యి , బెల్లం పంచామృతాలు .బెల్లం లేనప్పుడు పంచదార వాడవచ్చు .) అటుపిమ్మట ఫలోదక స్నానం అనగా కొబ్బరి , బత్తాయి , నారింజ మొదలైన ఫలరసాలతో స్నానం చివరగా మరొక్కసారి శుద్ధోదక స్నానం చేయించాలి . శుద్ధోధక స్నానం అయిన తరువాత శంఖానికి బొట్టుపెట్టి పసుపు , గంధములు మిశ్రమములు లేపనం చేసి ఆసనం పైన కూర్చుండబెట్టిన తరువాత ధూపదీపాలను సమర్పించాలి . అగరుబత్తి ధూపముతో పాటు సాంబ్రాణి ధూపము కూడా వేయవలెను . తరువాత పుష్పాలతో అర్చిస్తూ క్రింద చెప్పబోవు మంత్రమును 1116 సార్లు ఉచ్చరించాలి .
మంత్రం -
"ఓం శ్రీo దక్షణావర్తి శంఖాయ నమః ".
ఇక్కడ ముఖ్యముగా మరొక్క విషయాన్ని గుర్తు ఉంచుకొనవలెను . శంఖపూజ చేయుటకు మునుపు గణపతి పూజ చేయవలెను . హోమాము చేయించే ఓపిక ఉన్నవారు కనీసం 1116 సార్లు మంత్రోచ్ఛారణతో హోమము చేయించి ఆ హోమగుండము నందలి విభూధిని శంఖానికి మొత్తం లేపనం చేసి ఆ తరువాత శంఖాన్ని పూజాస్థలము నందు పెట్టుకోవాలి . నైవేద్యం ఏదైనా తియ్యని వస్తువును సమర్పించవచ్చు . ఓపిక ఉన్నవారు శ్రీమహాలక్ష్మి సహస్త్ర నామార్చన చేయించుట మంచిది .
దక్షిణవర్తి గృహము నందు ఉండటం వలన కలిగేడు శుభాలు -
• ఈ శంఖువు యే గృహము నందు ఉండునో ఆగృహము నందు దరిద్రం అనే మాట వినిపించదు .
• గృహములో ఎక్కడ ఉంచితే అక్కడ అభివృద్ధి కనపడును .
• అన్నగృహములో అన్నవృద్ధి , లాకర్లు , అలమారాలు వాటిలో ధనవృద్ధి , పూజగది యందు ఉంచిన సమస్త సంపదల వృద్ది జరుగును .
• దీని యందు గంగాజలం నింపి చల్లిన బ్రహ్మహత్యాది పాపాలు నశించును . సమస్త వస్తువులు , గృహము అంతా చల్లిన అన్ని రకాల దోషాలు పోవును భూతప్రేత , పిశాచ బాధ తప్పును .
• నెగిటివ్ శక్తి నశించును .పైన చెప్పిన ఫలితాలు సంపూర్ణముగా సిద్ధించాలి అంటే దోషములు లేనటువంటి శంఖువు సేకరించి శాస్త్రోక్తముగా పూజ జరిపించి గృహము నందు ఉంచుకొనవలెను .
దోషములు గురించి వివరణ -
• పగిలినది , విరిగినది , ముక్క ఊడినది పనికిరాదు .
• శంఖు పైభాగములో గరుకుగరుకుగా ఉండరాదు .
• మచ్చలు , లోపలికి అణిగి ఉండునట్లు గుంతలుగా ఉండరాదు .
• శంఖువు యొక్క శిఖరము మరియు తోక భాగము రెండుగా చీలడం గాని విరిగిగాని ఉండరాదు .శంఖువు తెలుపు రంగుతో ఉన్న సర్వశ్రేష్ఠం . అలా కానప్పుడు పసుపు చిన్న ఎరుపు రంగుల మిశ్రమముతో ఉన్న కొంత పరవాలేదు . ఈ శంఖువు పుజ చేయుటకు గురువారం పుష్యమి నక్షత్రం , ఆదివారం పుష్యమి నక్షత్రంతో ఉన్న రోజు చాలా మంచిది . ఈ సమయాన్ని "పుష్యార్క యోగము " అని అందురు . లేకున్న విజయదశమి రోజు , కార్తీక పౌర్ణమి రోజు , మకరసంక్రాంతి రోజు పూజ జరిపించుటకు ఉత్తమమైన దినములు .పైన చెప్పిన సమయములు దగ్గరలో లేకున్న రేవతి , విశాఖ , పుష్యమి , శ్రవణం , రోహిణి నక్షత్రాలు బుధ , గురు , శుక్రవారాలలో కలిసినవి సంభవిస్తే ఆ సమయాలలో పూజ చెయవలెను . ఆయా గ్రహాల సహస్రనామాలతో పూజ చేయుట చాలా మంచిది .
సమాప్తం
మరిన్ని అతి సులభ యోగాలు, మరింత విలువైన సమాచారం కొరకు నా గ్రంథాలను చదవగలరు.
గమనిక -
నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్ 9885030034 మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
. కాళహస్తి వేంకటేశ్వరరావు .
. అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
. 9885030034
నిర్మాల్యం ఏం చేయాలి?*
*శాస్త్ర వచనం*
*నిర్మాల్యం ఏం చేయాలి?*
*దేవతా పూజలలో ఉపయోగించిన పువ్వులను నిర్మల్యాన్ని ఏ రకంగా విసర్జించాలి తెలుసుకుందాము*
*శ్రీమద్దేవీభాగవత పురాణే*
నిర్మల్యం శిరసా వంద్యం నదీతోయే విసర్జయేత్ ।
అథవా భూమిగర్తే చ స్థాపయేత్ ప్రయతో నరః ॥
దేవ నిర్మల్యాన్ని మొదట భక్తితో కళ్లకు అద్దుకుని (శిరస్సుపై వంచుకుని), ఆ తర్వాత పవిత్రమైన నదీ జలాల్లో విసర్జించాలి. ఒకవేళ నది లేదా ప్రవహించే జలాశయం అందుబాటులో లేకపోతే, భూమిలో ఒక చిన్న గుంత తీసి అందులో భద్రంగా నిక్షిప్తం (పాతిపెట్టడం) చేయాలి.
*పద్మ పురాణే*
దేవస్య నిర్మల్యం సర్వం వృక్షమూలేషు నిక్షిపేత్ ।
పవిత్రే చ జలే వాపి న కదాచిత్ చతుష్పథే ॥
దేవుని నిర్మల్య మొత్తాన్ని పవిత్రమైన వృక్షాల (రావి, మర్రి, ఉసిరి లేదా పూల మొక్కల) మొదట్లో వేయాలి లేదా పవిత్ర జలంలో కలపాలి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ చతుష్పథే (నాలుగు రోడ్ల కూడలిలో/రహదారులపై) లేదా జనులు నడిచే దారిలో వేయకూడదు.
*స్కాంద పురాణే*
నిర్మల్యమన్యథా కుర్యాత్ గంగాయాం వా హ్రదేషు చ ।
శుచౌ దేశే చ నిఖనేత్ న పాదైః స్పృశ్యతే యథా ॥
పూజా ద్రవ్యాలను గంగానది వంటి పుణ్యనదులలో గానీ, చెరువులలో గానీ విడవాలి. లేదా ఎవరి పాదాలూ తగలని ఒక స్వచ్ఛమైన, పవిత్రమైన ప్రదేశంలో భూమిలో పాతిపెట్టాలి.
*స్మృతి ముక్తాఫల వైద్యనాథ దీక్షితీయ ధర్మశాస్త్రే*
దేవతార్చన నిర్మల్యం న త్యజేదశుచౌ స్థలే ।
నదీతీరే వృక్షమూలే కూపే వా తద్విసర్జయేత్ ॥
దేవతార్చన చేసిన నిర్మల్యాన్ని అపవిత్రమైన స్థలాలలో (ఉదాహరణకు మురికి కాలువలు, చెత్తకుండీలు) పడేయకూడదు. నదీతీరంలో గానీ, పెద్ద వృక్షాల మొదళ్లలో గానీ, లేదా బావులలో గానీ (ఉపయోగించని పాడుబడ్డ బావులు/నీటి వనరులు) విసర్జించాలి.
*అగ్ని సంస్కారము స్కాంద పురాణే*
అలాభే సర్వతీర్థానాం శుచౌ దేశే చ నిఖనేత్ ।
అగ్నౌ వా ప్రక్షిపేత్ ప్రాజ్ఞః తద్భస్మ శిరసా వహేత్ ॥
ఏ తీర్థాలు (నదులు) అందుబాటులో లేనప్పుడు, పవిత్రమైన స్థలంలో భూమిలో పాతిపెట్టాలి. అది కూడా వీలు కానప్పుడు, బుద్ధిమంతుడైనవాడు ఆ నిర్మల్యాన్ని అగ్నిలో వేసి దహనం చేయాలి. ఆ తర్వాత మిగిలిన ఆ పవిత్ర భస్మాన్ని (బూడిదను) శిరస్సున ధరించాలి లేదా మొక్కలకు వేయాలి.
*స్వగృహే ఆవాపనమ్ స్మృతిముక్తాఫల ధర్మశాస్త్రే*
నదీ వృక్షాద్యలాభే తు స్వగృహే వస్త్రపూతకే ।
మృత్పాశే వా ఘటే క్షిప్త్వా భూమౌ తత్ పరిపాచయేత్ ॥
నది, వృక్షాలు లభించనప్పుడు, తన ఇంట్లోనే ఒక మట్టి పాత్రలో గానీ (మృత్పాశే), కుండలో గానీ మట్టిని వేసి, అందులో నిర్మల్యాన్ని వేసి పరిపాచనం (కుళ్లిపోయేలా/ఎరువుగా మారేలా) చేయాలి.
*వాయు విసర్జన – పరాశర స్మృత్యాం*
శుష్కం నిర్మల్యమాదాయ చూర్ణయిత్వా తు వాయునా ।
వికీర్యేత్ పావనే దేశే న దోషో మనురబ్రవీత్ ॥
నిర్మల్యాన్ని బాగా ఎండబెట్టి (శుష్కం), ఆ తర్వాత దాన్ని చేతులతో నలిపి పొడి (చూర్ణం) చేయాలి. ఆ పొడిని గాలి ద్వారా ఎవరూ తొక్కని పవిత్రమైన ప్రకృతి ప్రదేశంలో లేదా చిన్న మొక్కలపైన చల్లవచ్చు. దీనివల్ల ఎలాంటి దోషం ఉండదని మనువు చెప్పారు.
*గుడిలో భక్తులకు ప్రసాదంగా పువ్వులు పూలమాల లభిస్తే ఎక్కడ వదిలివేయాలి?
నిర్మాల్యం పూజితం దేవైః శిరసా ధార్యతే నరైః |
తత్త్వమ్భసి నదీతోయే క్షిపేద్వా వృక్షమూలకే ||
దేవతల చేత పూజించబడిన నిర్మాల్యాన్ని మనుషులు భక్తితో శిరస్సున ధరించాలి. ఆ తర్వాత దానిని పవిత్రమైన నదీ జలాలలో (ప్రవహించే నీటిలో) కానీ లేదా ఎవరి పాదాలు తగలని పెద్ద వృక్షాల మొదట్లో (చెట్ల వేర్ల వద్ద) కానీ సమర్పించాలి.
*నిర్మాల్యం లంఘయేన్నైవ న పద్భ్యాం సంస్పృశేత్ క్వచిత్*
దేవ నిర్మాల్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు (దాటడం అంటే అవమానించడం) మరియు కాలితో తొక్కకూడదు.
కాబట్టి, మురికి కాలువలలో, చెత్త కుండీలలో లేదా నలుగురు నడిచే దారులలో దేవతా ప్రసాదమైన పూలను అస్సలు పడేయకూడదు. ఇది దోషంగా పరిగణించబడుతుంది.
*ఆధునిక అనుకూలత*
*ఇంట్లోనే ఒక చిన్న పాత్ర లేదా కుండీ పెట్టుకుని, ఎండిపోయిన పూజా పూలను అందులో వేసి కర్పూరంతో లేదా నెయ్యితో కాల్చివేయవచ్చు. ఆ బూడిదను నుదుట బొట్టుగా పెట్టుకోవచ్చు లేదా ఇంట్లోని చిన్న మొక్కల కుండీలలో వేయవచ్చు.
*ఫ్లాట్లలో లేదా అపార్ట్మెంట్లలో ఉండేవారు ఒక మట్టి కుండీని కేవలం నిర్మల్య విసర్జన కోసమే కేటాయించవచ్చు. అందులో కొద్దిగా మట్టి, పూజా పువ్వులు వేస్తూ ఉంటే, కొద్ది రోజులకు అది పవిత్రమైన "నిర్మల్య ఖాదము" (Holy Compost) గా మారుతుంది. దీన్ని ఇంట్లోని మొక్కలకే వాడుకోవచ్చు.
*పూజా పుష్పాలను పడేయకుండా ఒక కవర్ లోనో, గిన్నెలోనో వేసి ఎండబెట్టాలి. అవి బాగా ఎండిన తర్వాత పొడి చేసి, ఇంట్లో ఉండే చిన్న మొక్కల కుండీలలో చల్లితే అవి మట్టిలో కలిసిపోతాయి.
బ్రహ్మాండాన్ని నడిపించే -
బ్రహ్మాండాన్ని నడిపించే గురుత్వాకర్షణ శక్తి - అమ్మవారి "పాశ హస్తం" మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం..........!!
శ్రీ లలితా త్రిపురసుందరి దేవి చేతుల్లో ఉండే ఆయుధాలలో, ఆమె ఎడమ వైపు పైచేతిలో ఉండే "పాశం" (తాడు) అనే ఆయుధం.. చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన బ్రహ్మాండ రహస్యాన్ని తనలో దాచుకుంది!
ఆధ్యాత్మిక గ్రంథాలలో, ఈ పాశాన్ని అమ్మవారు అసురులను (రాక్షసులను) బంధించడానికి ఉపయోగించే ఒక ఆయుధంగా వర్ణించినప్పటికీ, దీని వెనుక ఉన్న అసలైన తత్త్వం ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో (Modern Science) అచ్చుగుద్దినట్లు సరిపోలుతుంది.
దాని వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం ఇదిగో:
గురుత్వాకర్షణ శక్తి - జగన్మాత పాశం:
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, ఈ విశ్వంలో ఉన్న కోట్లాది సూర్యుళ్లు, గ్రహాలు, నక్షత్రాలు తమ కక్ష్యలను (Orbits) దాటిపోకుండా ఒకదానితో ఒకటి బంధించబడి ఉండటానికి కారణం గురుత్వాకర్షణ శక్తి (Gravity). ఈ శక్తి గనుక లేకపోతే, విశ్వం ముక్కలై నశించిపోతుంది.
ఈ అండసరాచరాలన్నీ చెల్లాచెదురు కాకుండా, ప్రేమానురాగాలనే తాడుతో ఒకదానితో ఒకటి కట్టి, తనలోనే ఉంచుకున్న మహాశక్తి యొక్క పరాక్రమమే అమ్మవారి చేతిలో ఉన్న 'పాశం'. ఆమె సృష్టించిన ఆకర్షణ శక్తి వల్లే ఈ జగత్తంతా నడుస్తోంది!
మానవ శరీరంలో పాశం యొక్క ప్రాముఖ్యత:
తమిళంలో "పాశం" అనే పదానికి 'అன்பు' (ప్రేమ), 'ஆசை' (ఆశ/కోరిక), 'பிணைப்பு' (బంధం) అని అనేక అర్థాలు ఉన్నాయి. ఈ ఆయుధం మానవ శరీరంలో మన "కోరికలను" సూచిస్తుంది.
మనం దేనినైతే తీవ్రంగా కోరుకుంటామో, దేనిపై ఎక్కువ ప్రేమను పెంచుకుంటామో... దానిని మనవైపు లాక్కునే ఒక అయస్కాంత శక్తి (Magnetic energy) మన మనస్సుకు ఉంది. మనం ప్రాపంచిక వస్తువులపై పాశాన్ని (మోహాన్ని) పెంచుకుంటే అది మనల్ని సంసార బంధాలలో నెట్టేస్తుంది; అదే పాశాన్ని (భక్తిని) అమ్మవారిపై ఉంచితే, అది మనల్ని పరమానంద స్థితికి తీసుకెళ్తుందని సిద్ధుల వాక్కు.
ఇచ్ఛాశక్తి మహాపాశం:
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అమ్మవారి పాశాన్ని "ఇచ్ఛాశక్తి మహాపాశాయై నమః" అని కీర్తిస్తుంది. అంటే, మనుషులలో ఉండే 'అనుకున్నది సాధించే మహా శక్తి' ఆమె స్వరూపమే. మనకు కావలసిన వాటిని ఆకర్షించుకునే శక్తిని అమ్మవారు ఈ ఆయుధం ద్వారా మనకు ప్రసాదిస్తుంది.
అమ్మవారి చేతిలో ఉన్న పాశం మనల్ని శిక్షించడానికి కాదు; విశ్వంలోని ప్రతి అణువునూ ప్రేమతో ముడిపెట్టి ఉంచడానికి! మనలో ఉన్న పవిత్రమైన ప్రేమానురాగాలు, లోతైన ఆకర్షణ శక్తి.. అమ్మవారి అనుగ్రహం వల్ల కలిగినవే అని గ్రహించడమే నిజమైన "శాక్త జ్ఞానం"!
శుక్రవారం రాశి ఫలితాలు
శ్రీ గురుభ్యోనమః 🙏
12-06-2026 శుక్రవారం రాశి ఫలితాలు
మేషం
సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
---------------------------------------
వృషభం
రావలసిన సొమ్ము సకాలంలో వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
---------------------------------------
మిధునం
దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి.
---------------------------------------
కర్కాటకం
చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కీలక వ్యవహారాలలో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన లభించిన అవకాశాలు చేజారుతాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
---------------------------------------
సింహం
నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. గృహమున సంతాన శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు.
---------------------------------------
కన్య
రావలసిన ధనం చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వస్తు వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.
---------------------------------------
తుల
ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ఆర్థిక నష్టాలుంటాయి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
---------------------------------------
వృశ్చికం
నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి.
---------------------------------------
ధనస్సు
సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన సహకారం లభిస్తుంది. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు.
---------------------------------------
మకరం
వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.
---------------------------------------
కుంభం
ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. ఉద్యోగస్థులకు నూతన అవకాశములు లభిస్తాయి. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
---------------------------------------
మీనం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సన్నిహితుల నుండి వివాద విషయమై కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. కొన్ని విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సంతాన శుభకార్యల విషయమై ప్రస్తావన వస్తుంది.
---------------------------------------

