13, సెప్టెంబర్ 2026, ఆదివారం

పంచాంగం 13.09.2026 Sunday,

  ఈ రోజు పంచాంగం 13.09.2026 Sunday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాస శుక్ల పక్ష ద్వితీయ తిథి భాను వాసర హస్త నక్షత్రం శుక్ల యోగః కౌలవ తదుపరి తైతుల కరణం.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.

 

 


శ్రాద్ధ తిథి : తృతీయ 



 

నమస్కాచాలా మటుకు కల్తీరః , శుభోదయం

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                        సప్తమోధ్యాయః

                    జ్ఞాన విజ్ఞాన యోగము


మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ ।

మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ।। 7 ।।



ప్రతిపదార్థ:


 

మత్తః — నా కంటే; పర-తరం — ఉన్నతమైనది; న అన్యత్ కించిత్ అస్తి — వేరైనది ఏదియునూ లేదు; ధనంజయ — అర్జునా, ధనమును జయించేవాడా; మయి — నా యందే; సర్వం — సమస్తము; ఇదం — మనకు కనిపించే ఇవి; ప్రోతం — ఆధారపడి (దూర్చబడి) ఉన్నవి; సూత్రే — దారం పై; మణి-గణాః — పూసలు; ఇవ — లాగా.



తాత్పర్యము:


నా కంటే ఉన్నతమైనది ఏదీ లేదు, ఓ అర్జునా. పూసలన్నీ దారము పై గుచ్చి ఉన్నట్టు సమస్తమూ నా యందే ఆధారపడి ఉన్నవి.



వివరణ :


సర్వోత్కృష్ట భగవానుడు శ్రీ కృష్ణుడు ఇక అన్నిటికన్నా ఉత్కృష్టమైన తన అత్యున్నత స్థానం గురించి మరియు తన ఆధిపత్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనే విశ్వానికి సృష్టికర్త, స్థితికర్త, మరియు లయకర్త. ఆయనే అన్నింటి అస్తిత్వానికి మూలాధారము. దారంలో గుచ్చిన పూసల యొక్క ఉపమానం ఇక్కడ వాడబడింది. అదే విధంగా, జీవాత్మలు తమకు నచ్చినట్టుగా చేసుకునే స్వేచ్ఛ ఉన్నా, దానిని వారికి ప్రసాదించినది భగవంతుడే, అందరిని నిలబెట్టి సంరక్షించేది ఆయనే, మరియు ఆయన యందే అందరూ ఉంటారు. కాబట్టి, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇలా పేర్కొంటున్నది:


న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య

శక్తిర్వివిధైవ శ్రూయతే (6.8)


‘భగవంతునితో సమానమైనది ఏదీ లేదు, ఆయన కన్నా ఉన్నతమైనది ఏమీ లేదు’


భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం, చాలా మంది మనస్సులో ఉన్న సందేహాన్ని నివృత్తి చేస్తుంది, వారు శ్రీ కృష్ణుడు పరమ సత్యము కాదని, కృష్ణుడికే మూలాధారమైన ఇంకేదో నిరాకార తత్త్వం ఉందని అనుకుంటారు. కానీ, ఈ శ్లోకంలో ఆయన, అర్జునుడి ముందు నిల్చొని ఉన్న తన యొక్క ఈ శ్రీకృష్ణ సాకార రూపంలో ఉన్న అతనే, సర్వోన్నత సర్వోత్కృష్ట పరమ సత్యమని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ ప్రకారంగా, ప్ర-ప్రథమంగా జన్మించిన బ్రహ్మ, శ్రీ కృష్ణుడిని ఈ క్రింది విధంగా స్తుతించాడు.


ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః

అనాదిరాదిర్ గోవిందః సర్వ కారణకారణమ్


(బ్రహ్మ సంహిత 5.1)


‘శ్రీ కృష్ణుడే పరమేశ్వరుడు; ఆయన సనాతనుడు (నిత్యుడు), సర్వజ్ఞుడు, మరియు అనంతమైన ఆనంద స్వరూపుడు. ఆయన ఆది, అంతము లేనివాడు, అన్నిటికి మూలహేతువు, సర్వ కారణ కారకుడు’

12, సెప్టెంబర్ 2026, శనివారం

13సెప్టెంబర్26🌹* *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

   🌞 *భానువారం*🌞

 *🌹13సెప్టెంబర్26🌹*  

   *దృగ్గణిత పంచాంగం*       

                

         *స్వస్తి శ్రీ పరాభవ* 

        *నామ సంవత్సరం* 

*దక్షిణాయనం - వర్ష ఋతువు*

*భాద్రపద మాసం - శుక్లపక్షం* 


*తిథి : విదియ* ఉ 07.08 వరకు ఉపరి *తదియ*

*వారం   :ఆదివారం* (భానువాసరే)

*నక్షత్రం  : హస్త* మ 01.07 వరకు ఉపరి *చిత్త*

*యోగం : శుక్ల* మ 01.43 వరకు ఉపరి *బ్రహ్మ*

*కరణం  : కౌలువ* ఉ 07.08 *తైతుల* రా 07.02 ఉపరి *గరజి*

*సాధారణ శుభ సమయాలు:*

*ఉ 07.00-10.00 & 11.00-12.00 మ 02.00 - 04.00*

అమృత కాలం  : *ఉ 07.04 - 08.40*

అభిజిత్ కాలం  : *ప 11.39 - 12.28*

*వర్జ్యం    : రా 09.23 - 11.02*

*దుర్ముహూర్తం: సా 04.33-05.22*

*రాహు కాలం   : సా 04.39- 06.11*

గుళికకాళం      : *మ 03.07 - 04.39*

యమగండం    : *మ 12.03 - 01.35*

సూర్యరాశి : *సింహం*                    

చంద్రరాశి : *కన్య/తుల*  

సూర్యోదయం :*ఉ 06.04*   

సూర్యాస్తమయం :*సా 06.20*

*ప్రయాణశూల   : పడమర దిక్కుకు పనికిరాదు*

*వైదిక విషయాలు:*

ప్రాతః కాలం   :*ఉ 05.55-08.23*

సంగవ కాలం        : *08.23 - 10.50*

మధ్యాహ్న కాలం    : *10.50 - 01.17*

అపరాహ్న కాలం  : *మ 01.17- 03.44*

*ఆబ్ధికం తిధి :భాద్రపద శుద్ధ తదియ*

సాయంకాలం  :  *సా 03.44 - 06.11*

ప్రదోష కాలం  :  *సా 06.11 - 08.32*

రాత్రి కాలం     :  *రా 08.32 - 11.40*

నిశీధి కాలం      :*రా 11.40 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :  *తె 04.22 - 05.09*

¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●¤●

                *🌷ప్రతినిత్యం🌷*

        *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🙏 *ఓం నమో సూర్యదేవాయ నమః🌞* 


🌹🪷🌹🛕🌹🌷🪷🌷🌹

*సర్వే జనాః సుఖినోభవంతు... లోకాఃసమస్తాః సుఖినో భవంతు!* 

<><><><><><><><><><><><>


        🌷 *సేకరణ*🌷

      🌹🌿🌞🌞🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🌞🌞🍃🌷

 🌹🌷🌞🌞🌞🌞🌷🌹

చాలా మటుకు కల్తీ

 మనం తినే మామిడి పండ్లు నూటికి 90 శాతం కార్బెట్ తో పండించినవే అందులో అనుమానమే లేదు

 మనం తినే ఆహారంలో నిత్యం అనేక రకాలైన రసాయనాల కల్తీలతో ఉన్నవే అందుకే మనకు చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలు వస్తున్నాయి 

ముఖ్యంగా మనం వాడే వంట నూనెలు చాలా మటుకు కల్తీ నూనెలే 

మీరు ఒక్క విషయం ఆలోచించండి ఒక కిలో పల్లీలు రెండు వందల రూపాయలు ఉంటే ఒక లీటరు పల్లీ నూనె 150 ,170 రూపాయలకు ఎలా ఇవ్వగలుగుతారు.అంటే అవి నిజంగా స్వచ్ఛమైన నూనెలు కావని వాళ్ళు ఒప్పుకున్నట్లేనా కాదా


 ఒక కిలో పల్లీలను నూనెగా తీస్తే ఒక పావు కిలో నూనె మాత్రమే వస్తుంది అంటే స్వచ్ఛమైన పల్లీలతోటి కిలో నూనె తీయాలంటే నాలుగైదు కిలోల పల్లీల అవసరపడతాయి.

అట్లా చేస్తే మీకు కిలో నూనె ఎనిమిది వందల రూపాయలకి తక్కువకి దొరకదు.

అదే విధంగా ఇతర నునెలలో కూడా చాలా కల్తీలు ఉన్నాయి అని అంటున్నారు.

ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే మనం వాడే పాలలో యూరియా వంటి కెమికల్స్ తోటి తయారు చేస్తున్నారట.అది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి.


ఇది ఇట్లా ఉంటే నేను మాకు దగ్గరలో ఉన్న పశువుల షెడ్డు నుంచి అప్పుడే తీసిన పాలను తెచ్చుకుంటున్నాను అందులో ఎటువంటి కల్తీ లేదని కూడా మనం అనటానికి వీల్లేదు.

ఎందుకంటే గేదెలకు పాలు రావటానికి ఇంజక్షన్లు చేస్తున్నారు అలానే డ్రైనేజీ నీళ్లలో పెంచిన గడ్డి తినిపిస్తున్నారు.

దానివల్ల ఆ గేదల నుంచి వచ్చే పాలు పూర్తిగా కలిసికతమై ఉంటున్నాయి.


ఇంకా బియ్యానికి వస్తే మనం తినే బియ్యం స్టీమ్డ్ రైస్, హెచ్ఎంటి బియ్యం లను పాత బియ్యంగా విక్రయిస్తున్నారు.


ఆ బియ్యమును పాలిష్ చేసి దాని మీద పూర్తిగా తౌడును తొలగించి తెల్లగా నిగలాడేరట్టు చేయటం వలన బియ్యంలోని పోషక విలువలు పూర్తిగా పోయి కేవలం పిప్పి మాత్రమే మిగులుతున్నది.


మనలో చాలామందికి బి కాంప్లెక్స్ లోపము ఏర్పడటానికి కారణం ఇదే.


మనం తినే ఆహారంలో సరైన విటమిన్లు, ప్రోటీన్లు విలువైన ఆహారపు విలువలు లేని కేవలం పిప్పిని మాత్రమే భుజిస్తున్నాము.


ఇక వాతావరణం విషయానికొస్తే మనం రోజు అనేక రకాల రేడియేషన్స్ కి గురి అవుతున్నాము.


కొన్ని మన ఇంట్లో మనమే సృష్టించుకుంటున్నాము.


ముందుగా బయట రేడియేషన్స్ తేల్చుకుందాం.

మన చుట్టూ అనేక మైక్రోవేవ్ రేడియేషన్లు సెల్ఫోన్ టవర్ల నుండి వెలువడుతున్నాయి.


ఇక రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఉండనే ఉన్నది.

మన ఇంట్లో మనం వైఫై ఏర్పాటు చేసుకొని ఆ రేడియేషన్కు కూడా గురి అవుతున్నాము.


ఇది చాలదు అన్నట్లు మనము బ్లూటూత్ పరికరాలను ఉపయోగించి బ్లూటూత్ రేడియేషన్ కూడా కొని తెచ్చుకుంటున్నాము.


ఈ రకమైన రేడియేషన్లు మన శరీరంలో ఉన్న నరాల మీద ప్రభావితం చూపెడతాయి ఇంకా మన రక్తంలో ఉన్న హిమోగ్లోబిన్ మీద కూడా చూపెడతాయి.


సెల్ఫోన్ టవర్లకి దగ్గరగా ఉన్న మానవులకి మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మెదడు లోపల అనేక చెడు లక్షణాలు కనబడుతున్నాయి.

మొదలుగా తలనొప్పి వస్తుంది తర్వాత నరాలకు సంబంధించిన అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉన్నది.

ఇక మనంతట మనమే కొని చేర్చుకున్న అలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలను ఒకసారి చూద్దాం.

మనం రోజు ఎక్కువ సమయం సెల్ ఫోను లాప్టాప్ టీవీ చూడటం లో గడగడుపుతున్నామ

దానివల్ల అల్ట్రా వైలెట్ రేడియేషన్ కి ఇంకా ఎక్కువ ప్రకాశమైనా వెలుతురుని చూడటం వల్ల అది మన కంటిలోని రెటీనా మీద ప్రభావం చూపెట్టి కను గుడ్లు ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి.

చిన్న వయసులోనే పిల్లలకి కళ్ళజోళ్ళు రావడం మనం గమనిస్తున్నాము.

ఇంకా సెల్ ఫోనులో మన యొక్క పూర్తి ఏకాగ్రత ఉంచి వీడియోలు చూడటం వలన అవి మెదడు మీద ప్రభావం చూపుతున్నాయి.


ఇటువంటివి అనారోగ్య సమస్యలు ప్రతి వాళ్ళకి వస్తున్నాయి.


ఇట్లా ఉంటే వాహనాల పొగ వలన వాతావరణంలో ఆక్సిజన్ శాతం రోజురోజుకీ తగ్గుతున్నది.


ఆక్సిజన్ని ఉత్పత్తి చేసే వృక్షాలను మానవులు కొట్టివేసి ఆ స్థలాలలో అనేక మల్టీస్టోరీడ్ బిల్డింగులు కట్టడం వలన ఆక్సిజన్ తక్కువ అవుతున్నది.

అందువలన వాతావరణ కాలుష్యం ఏర్పడుతున్నది.

ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు మనుషులు పూర్తిగా అనారోగ్య పరిస్థితులలో ఉన్నారు అన్నది సత్యం.

ఇక శారీరిక దృఢత్వానికి వస్తే పూర్వకాలంలో ఆడవారు కానీ మగవారు కానీ బావిలో చేత వేసి నీళ్లు చేదుకునేవాళ్లు దానివల్ల వాళ్లకి చక్కటి వ్యాయామం అయ్యేది.


అప్పుడే పెతికిన పాలు తాగేవాళ్లు దంచిన బియ్యం తినేవాళ్లు దానివల్ల పూర్తిగా ఆరోగ్యకరమైనటువంటి ఆహారము ఆరోగ్యకరమైనటువంటి అంటే వ్యాయామ కరమైనటువంటి అలవాట్లు ఉండేవి.

ఇప్పుడు ప్రతిదీ యాంత్రికం కావడం వలన శారీరిక శ్రమ పూర్తిగా తగ్గింది వంట ఇంట్లో ఆడవారు పిండి రుబటం లేదు.

మిక్సీలో పడుతున్నారు కట్టెలపై పొయ్యి వెలిగించటం లేదు గ్యాస్ స్టవ్ మీద వండుతున్నారు.


కూర్చొని వండటం వల్ల చక్కగా ఆ వంట కుదురుగా ఉండి రుచికరంగా ఉండేది.


ఇప్పుడు వండటం నిల్చమని తినటం కుర్చీలో కూర్చొని.

ఇటువంటి అలవాట్ల వల్ల మనం తినే ఆహారం శరీరానికి సరిగా పట్టటం లేదు.

దానివలన అనేకమైన అనారోగ్యాలు వస్తున్నాయి ఇకపోతే శారీరకంగా ఏమాత్రం అలసట చెందకుండా తినంగానే వెంటనే పడుకోవటం వలన కడుపు ఉబ్బి లావుగా తయారవుతున్నారు.

ఆహారం సరిగా అరగటం లేదు దానివల్ల అనేకమైన రుగ్మతలు వస్తున్నాయి.

ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకాలు పుస్తకాలు రాయవచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే మనము పూర్తిగా అనారోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నాం తింటున్నాం పడుకుంటున్నాము.

ఇది సత్యము సత్యము సత్యము ముమ్మాటికీ

వినాయకచవితి

 *వినాయకచవితి*  గణపయ్య మన అందరిని కాపాడతాడు.  కానీ ఈప్రకృతిని కాపాడేది ఎవరు?” వినాయకుడి విగ్రహానికి  వాతావరణం కాలుష్య కారక రంగులు పుసేది  ఏమిటి?

భక్తి వెనుక దాగిన ఒక పర్యావరణ ప్రశ్న…

వినాయకచవితి సమీపిస్తోందంటే చాలు…

వాడవాడలా గణపయ్య మండపాలు సిద్ధమవుతాయి.

విగ్రహాల తయారీ కేంద్రాల వద్ద సందడి మొదలవుతుంది.

అడుగు, రెండు అడుగుల విగ్రహాల నుంచి…

30-40, అడుగుల భారీ విగ్రహాల వరకు…

విభిన్న రూపాలు, విభిన్న ఆకృతులు, అద్భుతమైన రంగులతో గణనాథులు తయారవుతుంటే చూడటానికే కన్నుల పండుగగా ఉంటుంది.

కానీ ఈసారి నా దృష్టిని ఆకర్షించినది వినాయక విగ్రహం కాదు… ఆ రంగుల మహత్యం!🙏

 ఒక్కసారి గమనించండి

ఎన్ని విగ్రహాలో…

అన్నింటికీ ప్రత్యేకమైన  రకరకాల  కెమికల్స్

పెద్ద విగ్రహాలు

 ఎలా తయారవుతుంది?

ఎక్కడ తయారవుతుంది?

ఎవరు తయారు చేస్తారు?

 ధర కూడా వేల రూపాయల్లో ఉంటుందని చెబుతున్నారు.

అంటే… ఇది ఒక చిన్న విషయం కాదేమో!

విగ్రహాల తయారీకి ఒక పెద్ద వ్యవస్థ ఉన్నట్లే, 

మనలో చాలామంది ఈ ప్రశ్న ఎప్పుడూ వేసుకున్నామా? గణపతి నవరాత్రులు అయిన తరువాత వాటిని ఏమి చేస్తున్నారు

విగ్రహం  అవసరం తీరిన తరువాత దాని పరిస్థితి ఏమిటి?

అది ఎక్కడికి వెళ్తుంది?

ఎన్ని రీసైకిల్ అవుతున్నాయి?

ఏమైనా పర్యవేక్షణ ఉందా?

ఇది వినాయక చవితిని ప్రశ్నించడం కాదు.

ఇది మన పండుగలను పర్యావరణ హితంగా ఎలా చేసుకోవాలనే ప్రశ్న.

ఎందుకంటే మనం పూజించేది విఘ్నేశ్వరుడిని.

ఆయనను మనం ప్రకృతికి ప్రతీకగా కూడా భావిస్తాం.

అయితే…

గణపయ్య  తయ్యార్ కి ఉపయోగించిన రంగులు   మనం నివసించే ప్రకృతికి భారంగా మారకూడదు కదా!

భక్తి ఉండాలి…

వేడుక ఉండాలి…

వినాయక మండపాలు ఉండాలి!

కానీ వాటితో పాటు బాధ్యత కూడా ఉండాలి.

ప్రభుత్వాలు కూడా భారీ పరిమాణంలో ఉండే విగ్రహలు కు ఉపయోగించే  కెమికల్స్, పునర్వినియోగం, వ్యర్థ నిర్వహణపై దృష్టి పెట్టాలి. విగ్రహ తయారీదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలి.

మండప నిర్వాహకులు అవసరమైనంతవరకే విగ్రహలు ఉపయోగించాలి.

మనమూ ఒకసారి ఆలోచించాలి.

వినాయకుడు అందంగా  ఉండటానికి రంగులు అవసరం…

కానీ ప్రకృతికి కూడా  కలుషిత రహితo అవసరమే కదా!

ఈ వినాయక చవితికి మనం గణపయ్యను ఒక కోరిక కోరుకుందాం—

“విఘ్నాలను తొలగించే వినాయకా…

మా పండుగల్లో తెలియకుండానే ప్రకృతికి కలిగిస్తున్న విఘ్నాలను కూడా తొలగించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించు.” 🙏

భక్తి ప్రకృతిని బాధించకుండా ఉంటేనే…

ఆ భక్తికి మరింత అందం.  🌱🙏 

 అందుకే మిత్రులారా నా ఈ సందేశం మీ మిత్రులు కు కూడా  షేర్ చేయండి.

తెలుగు నేర్చుకోండి

 తెలుగు నేర్చుకోండి


 మన తెలుగు వాళ్ళు ఎన్నో దేశాలలో ఉండి నిత్యం ఈ బ్లాగును చూస్తున్నా వాళ్ళు, వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పాలని అభిలాష ఉండటం సర్వసాధారణం.

కాకపోతే విదేశాలలో తెలుగు నేర్పే వాళ్లు లేరని మీరు సందేహించవచ్చు అటువంటి వాళ్లను దృష్టిలో ఉంచుకొని ఆన్లైన్ లో తెలుగు నేర్చుకుందాం అనే కోర్సును ప్రారంభించదల్చాము.


ప్రాథమికంగా తెలుగు మీద అవగాహనసం ప్రత్యేకంగా ఆన్లైన్లో తెలుగు పాఠాలను నేర్పటం కోసం ఈ కోర్సును ఏర్పాటు చేసాము


మీ పిల్లలకు తెలుగు మాట్లాడటం రాయటము నేర్పించదలిచితే వెంటనే కింద కామెంట్ రూపంలో సంప్రదించగలరు మీరు పెట్టే కామెంట్ గోప్యంగా ఉంచబడును అది ఇక్కడ ఎవరికీ కనబడదు కేవలము ఉపాధ్యాయులు గారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది మీరు మీ కామెంట్ ల మీ పిల్లల  వయస్సు తెలుగుతో వారికి ఉన్న అనుబంధం తెలియచేస్తూ మీ మొబైల్ నెంబరు పేర్కొంటే ఆ నెంబర్కు వాట్సాప్ లో సంప్రదించబడును లేక మీ ఈమెయిల్ ఐడి ఇస్తే దాని ద్వారా సంప్రదించుకోవచ్చు ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే మీరు మీ పిల్లలను ఈ కోర్సులో చేర్పించడానికి ఉద్యోత్తులు కండి.



ఆన్లైన్లో కర్ణాటక సంగీత క్లాసులు

 విదేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్లు, సంగీత ప్రియులు సంగీతం నేర్చుకోవాలని అభిలాష పడే వారి కోసం ఆన్లైన్లో సంగీత క్లాసులు నిర్వహించడం జరుగుతున్నది .


బాల బాలికలు ఈ క్లాసులు లో చేరవచ్చు .


మీరు మీ కుమార్తెను గాని మీకుమారుని గాని ఈ క్రాసులలో చేర్పించదల్చుకొనిన మీ ఫోను నెంబర్ తో లేక మీ ఈమెయిల్ ఐడి తో కింద కామెంట్ రూపంలో పేర్కొని వివరాల కోసం సంప్రదించగలరు.




మీరు రాసే కామెంట్ ఈ బ్లాగులో కనపడదు పూర్తిగా గోప్యంగా ఉంచబడును .


అది కేవలం టీచర్ గారికి మాత్రమే చేరుతుంది కాబట్టి నిస్సందేహంగా మీరు వివరాల కోసం సంప్రదించండి.


మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాట్సాప్ లో మీకు వివరాలు తెలుపబడును అదే విధంగా ఈమెయిల్ ఐడి ఇస్తే మేలు ద్వారా మీకు వివరాలు తెలుపబడును.


మీకు కర్ణాటక సంగీతం మీద ఏమైనా పట్టు ఉంటే దాని గురించిన వివరాలు కూడా తెలియజేస్తే అనుగుణంగా క్లాసులు ఏర్పాటు చేయబడును ఇంకా ఎందుకు ఆలస్యం ఇప్పుడే వివరాల కోసం సంప్రదించండి




ఆన్లైన్ క్లాసులు వాట్సాప్ ద్వారా నిర్వహించబడును

భాద్రపద మాసం!*

 🕉️🍀🕉️🍀🕉️🍀🕉️🍀🕉️

 

`నేటి నుండి..`

            *భాద్రపద మాసం!*

                                  `ప్రారంభం`

             ➖➖➖✍️```


చాంద్రమానం ప్రకారం భాద్రపదమాసం ఆరవమాసం!

 

ఈ మాసంలోని పూర్ణిమ తిథినాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది.


ఈ మాసం లో ఒంటి పూట భోజనం చేస్త..  ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. 


ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసం లో విశేష ఫలితాన్నిస్తాయి.


కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. 


ఈ వ్రతాన్ని ఆచరించి, ఉపవాసం, జాగరణ చేస్తారు.


ఈ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తే కష్టాలు తొలగి, అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.


భాద్రపదం అనగానే అందరికీ గుర్తొచ్చేది వినాయకచవితి పర్వదినమే. 

కాని వరాహజయంతి,వామనజననం, రుషిపంచమి, ఉండ్రాళ్ల తద్దె, పితృదేవతలకు ఉత్తమగతులు కల్పించే మహాలయ పక్షం... ఇలా మాసానికి ఎన్నో ప్రత్యేకతలు. 


దేవతా పూజలకు, పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ’భాద్రపద మాసం’. 


చాంద్రమానం ప్రకారం భాద్రపద మాసం ఆరవమాసం. 


ఈ భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం.


భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతాపూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెబుతున్నాయి.


దుష్టశిక్షణ, శిష్టరక్షణ కొరకు శ్రీమహావిష్ణువు దశావతారాలను ధరించినట్లు అందరికీ తెలిసిన విషయమే. 


అట్టి దశావతారాలలో మూడవ అవతారమైన శ్రీ వరాహ అవతారాన్ని, ఐదవదైన శ్రీ వామనావతారాన్ని భాద్రపద మాసంలోనే శ్రీమన్నారాయణుడు ధరించి దుష్టశిక్షణ గావించాడు.


అందుకే ఈ మాసంలో ’దశావతార వ్రతం’ చెయ్యాలనే శాస్త్ర వచనం. 


భాద్రపదమాసంలోని  అష్టమి శ్రీకృష్ణ పరమాత్మ పూజకు ఉత్కృష్టమైన రోజు. 


ఈ నాడు పవిత్ర ప్రేమకు చిహ్నంగా చెప్పబడుతూ ఉన్న శ్రీ రాధాకృష్ణులను పూజించాలి. 


ఈ దినానికి ’రాధాష్టమి’ అని పేరు.

ఈ దినం రాధాకృష్ణులను పూజించడంవల్ల సంసార సుఖం లభిస్తుందని, భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని చెప్పబడుతూ ఉంది.```


*మహాలయ పక్షం:*```

భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. 

ఈ పక్షానికే ’మహాలయ పక్షం’ అని పేరు. 

ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. 

ఈ పక్షంలో పదిహేనురోజులపాటు పితృదేవతలకు తర్పణాలు వదలడం, శ్రాద్ధవిధులను నిర్వహించడం, పిండప్రదానం చేయడం ఆచరించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. 

ఈ రకమైన విధులను నిర్వహించడంవల్ల గయలో శ్రాద్ధ విధులను నిర్వహించినంత ఫలం లభిస్తుంది.```


*భాధ్రపదంలో స్త్రీలు చేయాల్సిన వ్రతాలు:*```

హరితాళిక వ్రతం, సువర్ణగౌరీ వ్రతం 

భాద్రపద శుక్ల పక్ష తదియనాడు 

‘హరితాళిక వ్రతం’ లేదా ‘సువర్ణ గౌరీ వ్రతం’ ‘పదహారు కుడుముల తద్ది’ ఆచరిస్తారు. 


శివపార్వతులను పూజించి, పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. 


ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు.

ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం.```


*ఉండ్రాళ్ళ తద్ది*```

భాద్రపద బహుళ తదియ నాడు అవివాహితలు చేసే వ్రతం.


తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి దేవతాపూజ చేసి, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టి సాయంత్రం ఊయలలో వూగుతారు.```


*శుక్ల చవితి:* 

*వినాయక చవితి:*```

ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. 

అటువంటి వినాయకుడి జన్మదినంను ’వినాయక చవితి’ లేదా ’గణేశ చతుర్ధి’ పర్వదినంగా జరుపుకుంటారు.


ఈనాడు వినాయకుడి ప్రతిమను ఇంటిలో ప్రతిష్టించి స్వామివారికి పూజ చేసి గరికతో పాటు, 21 పత్రాల తో పూజించి, వ్రతకథ చెప్పుకుని, ఉండ్రాళ్ళు, కుడుములను నైవేద్యంగా సమర్పించవలెను.```


*శుక్ల ఏకాదశి : పరివర్తన ఏకాదశి*

`తొలి ఏకాదశినాడు క్షీరాబ్దిపై``` శేషతల్పంమీద శయనించిన శ్రీమహావిష్ణువు ఈ దినమున ప్రక్కకు పొర్లుతాడు అంటే పరివర్తన చెందుతాడు కనుక దీనికి ’పరివర్తన ఏకాదశి’ అని, 

‘విష్ణు పరివర్తన ఏకాదశి’ అని ’పద్మ పరివర్తన ఏకాదశి’ అని పేరు.

ఈనాడు ఏకాదశి వ్రతం ఆచరించడంవల్ల కరువుకాటకాలు రావని, వచ్చి వుంటే విముక్తి లభిస్తుందని కథనం.```


*శుక్ల ద్వాదశి : వామన జయంతి*

`దశావతారాల్లో ఐదవదైన``` వామనావతారాన్ని శ్రీమహావిష్ణువు ఈ దినం ధరించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. 

ఈనాడు వామనుడిని పూజించి, వివిధ నైవేద్యములు సమర్పించి, పెరుగును దానం చేయాలని శాస్త్ర వచనం.```


*శుక్ల చతుర్డశి : అనంత చతుర్ధశి*

`అనంతుడు అనేది``` శ్రీమహావిష్ణువుకు ఉండే పేర్లలో ఒకటి.

శ్రీమహావిష్ణువును అనంతుడిగా పూజిస్తూ చేసే వ్రతమునకే ‘అనంత చతుర్దశి వ్రతం’ లేదా ’అనంత పద్మనాభ వ్రతం’ అని పేర్లు. 

ఈ వ్రతం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు వివరించినట్లు భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.```


*కృష్ణ పక్ష ఏకాదశి : అజ ఏకాదశి*

`అజ ఏకాదశికే ’ధర్మప్రభ ఏకాదశి’` `అని కూడా పేరు. పూర్వం గౌతమ` `మహర్షి చెప్పిన ఈ వ్రతం చేసి``` రాజ్యాన్ని, భార్యాకుమారులను పోగొట్టుకుని కాటికాపరిగా పని చేసిన హరిశ్చంద్రుడు వాటిని తిరిగి పొందినట్లు పురాణ కథనం.

ఈ ఏకాదశినాడు వ్రతం ఆచరించడంతోపాటు నూనెగింజలు దానం చేయాలని శాస్త వచనం.✍️```

.        *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                     

A Best Collection from Brahmana Samaakya 

✡️🍀✡️🍀✡️🍀✡️🍀✡️

భాద్రపద మాసం..*

  *నేటినుండి భాద్రపద మాసం..* 

*************************

భాద్రపదం అనగానే మనకు గుర్తొచ్చేది *వినాయకచవితి* పర్వదినం!... అయితే దేవతా పూజలతోపాటు -- పితృదేవతల పూజకు కూడా ఉత్కృష్టమైన మాసం ‘భాద్రపద మాసం’...

చాంద్రమానం ప్రకరం భాద్రపద మాసం ఆరవది.. ఈ మాసంలోని పూర్ణిమనాడు చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రం సమీపంలోగాని, ఉత్తరాభాద్ర నక్షత్రం సమీపంలోగానీ ఉండడంవల్ల ఈ మాసానికి ‘భాద్రపద మాసం’ అనే పేరు ఏర్పడింది. భాద్రపద మాసం వర్షఋతువులో రెండో మాసం. 

-- భాద్రపద శుద్ద చవితి నాడు ఆది దేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు, ఏ పూజ అయినా, వ్రతమైనా, చివరకు ఏ పని ప్రారంభించాలన్నా ముందుగా వినాయకుడిని పూజించడం మన సాంప్రదాయం. అటువంటి వినాయకుడి జన్మదినం మనకు ‘వినాయక చవితి’  పర్వదినం.

భాద్రపద మాసం అనేది కేవలం పండుగలు, ఆచారాల పరంగానే కాకుండా ఖగోళ, వాతావరణ మరియు ఆయుర్వేద కోణాల్లో కూడా స్పష్టమైన శాస్త్రీయ ప్రాతిపదిక కలిగిన కాలం. 

ఖగోళ ప్రాతిపదిక :

చంద్రుడు పూర్ణిమ నాడు పూర్వాభాద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రాల సమీపంలో పూర్ణబింబంగా కనిపించడం వల్ల ఈ నెలకు "భాద్రపద మాసం" అనే పేరు వచ్చింది.

---కన్యాసంక్రమణం: ఈ మాసంలో సూర్యుడు సింహం నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. సెప్టెంబర్17 న ప్రతి ఏడాదీ వచ్చే ఈ కన్యాసంక్రమణం విశ్వకర్మ పరమాత్మ యజ్ఞమహోత్సవం. యజ్ఞం,హోమం,అగ్ని మొదలు పంచభూతాత్మకమైన సమస్తసృష్టికీ మూలం విశ్వకర్మ పరమాత్మయే.. అంచేత కన్యా సంక్రమణం నాడీ పరమాత్మ పూజ చేస్తారు. 

---విషువత్తు (Equinox): 

ఈ సెప్టెంబర్ నెలలో వచ్చే శరద్ విషువత్తు (రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు) దాదాపు ఈ మాసంలోనే ఏర్పడుతుంది.


వినాయక చవితి - ఏకవింశతిపత్ర పూజ: వినాయక చవితి నాడు వాడే 21 రకాల పత్రాలు తులసి, బిల్వం, మాచిపత్రి, దూర్వా మొదలైనవి అన్నీ అత్యంత శక్తివంతమైన ఔషధ గుణాలున్న మొక్కలే.వీటితో పూజలు చేయడంలో ఆయుర్వేద విజ్ఞానందాగి ఉంది. వర్షాకాలంలో వచ్చే క్రిమికీటకాలు, బ్యాక్టీరియా నశించడానికి వీటితో వచ్చిన రసాయనాలు, సువాసనలు తోడ్పడి గాలిని శుద్ధి చేస్తాయి.

మట్టి విగ్రహాల విశిష్టత: సహజసిద్ధమైన బంకమట్టితో చేసిన విగ్రహాలను తిరిగి చెరువులు, నదులలో నిమజ్జనం చేయడం వల్ల ఆ మట్టి నీటిలోని మలినాలను తొలగించి, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు తోడ్పడుతుంది.

మహాలయ పక్షం (పితృ పక్షం): భాద్రపద బహుళ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు, అన్నదానం చేస్తారు. 

భాద్రపద మాసంలోని ప్రతి పండుగ, వ్రతం మరియు నియమం వెనుక ప్రకృతి మార్పులకు అనుగుణంగా శరీరాన్ని, సమాజాన్ని సమాయత్తం చేసే జీవన విజ్ఞానం స్పష్టంగా కనిపిస్తుంది.

--- జయోస్తు!

సిద్ధి వినాయక అనుగ్రహ ప్రాప్తిరస్తు!!.. 🌸🙏🌸

శ్రీమద్భాగవతం - 47/48*🙏

  *స్థిరవారం 12 సెప్టెంబర్ 2026*


*శ్రీమద్భాగవతం - 47/48*🙏 


*శ్రీకృష్ణ పరమపద ప్రాప్తి & పరీక్షిత్తు మోక్షం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భగవదనుగ్రహం చేత సాగుతున్న భాగవత అధ్యయనం చివరి దశకు వచ్చింది. ఈరోజుతో బలరామ కృష్ణులు, పరీక్షిత్తు వైకుంఠం చేరి పరమపదం పొందుతారు, కానీ మన హృదయ పీఠంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు, ఉండాలి అని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేసుకుందాం..


1. ప్రభాస తీర్థంలో యాదవ వంశ ఉపసంహరణ

ద్వారకలో అశుభ శకునాలు పెరిగిపోవడంతో, శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం యాదవులంతా తమ పాప విముక్తి కోసం సరస్వతీ నదీ సంగమమైన ప్రభాస తీర్థానికి వెళ్లారు. అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి, బ్రాహ్మణులకు అన్నదానాలు, గోదానాలు చేశారు.


* మదిరాపానం & వివేక భ్రంశం: అనంతరం విధి ప్రేరణతో, బుద్ధిభ్రష్టులై 'మైరేయం' అనే మధువును (చెరకుతో చేసిన మత్తు పదార్థం) అపరిమితంగా సేవించి యాదవ వీరులంతా మతిభ్రమించారు.


కృష్ణ మాయా ప్రభావాన వారి మధ్య పరస్పర స్పర్ధలు, పాత శత్రుత్వాలు రగిలాయి. సాత్యకి కృతవర్మను, ప్రద్యుమ్నుడు ఇతరులను ఎగతాళి చేసుకుంటూ ఒకరినొకరు నిందించుకున్నారు.


ఆవేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చేతుల్లోని ఆయుధాలు విరిగిపోగా, పూర్వం పిండారక మునుల శాపంతో పుట్టిన ఇనుప రోకలి పొడి నుండి సముద్ర తీరాన మొలిచిన 'ఏరకా గడ్డిని' (తుంగ గడ్డిని) చేతుల్లోకి తీసుకున్నారు. ఆ గడ్డిపోచలు చేతిలోకి రాగానే ఇనుప దండాల వలె, వజ్రాల వలె మారిపోయాయి.


బలరామ కృష్ణులు ఆపాలని చూస్తే వారి మీద కూడా దాడి చేశారు, దాంతో వారు గదలతో వారిని మోదారు.


* వంశ నాశనం: అలా ఆ గడ్డి దండాలతో ప్రద్యుమ్నుడు, సాంబుడు, సాత్యకి, అనిరుద్ధుడు తదితర సమస్త యాదవ వీరులు పరస్పరం కొట్టుకుని, భగవత్ సంకల్పంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


2. బలరామ నిర్యాణం & శ్రీకృష్ణుని పరమపద ప్రస్థానం

సమస్త యాదవ వంశం తన కళ్లముందే నశించడం చూసిన శ్రీ బలరాముడు అక్కడే సముద్ర తీరాన పద్మాసనం వేసుకుని, సమాధి నిష్ఠలో మునిగిపోయాడు. ఆయన ముఖం నుండి సహస్ర ముఖాల దివ్య శ్వేత సర్పం (ఆదిశేషుడు) వెలువడి సముద్రంలోకి ప్రవేశించి అనంత లోకాలకు చేరుకుంది.


శ్రీకృష్ణ పరమాత్మ ఒంటరిగా ఒక రావిచెట్టు (అశ్వత్థ వృక్షం) మొదట్లో కూర్చున్నాడు. తన ఎడమ తొడపై ఎర్రటి పద్మంలా మెరిసిపోతున్న కుడి పాదాన్ని ఉంచి ఏకాగ్ర ధ్యానంలో ఆసీనుడయ్యాడు.


ఆ సమయంలో 'జరుడు' అనే బోయవాడు వేటాడుతూ, చెట్ల పొదల మాటున ఉన్న శ్రీకృష్ణుని ఎర్రటి పాదాన్ని జింక ముఖంగా భ్రమించాడు. పూర్వం ముసల రజను మింగిన చేప కడుపులో దొరికిన ఇనుప ముక్కతో తయారుచేసిన బాణాన్ని సంధించి శ్రీకృష్ణుని పాదంపై కొట్టాడు.


ఆ తదుపరి సమీపానికి వచ్చి చూసిన జరుడు... చతుర్భుజాలతో, పీతాంబరంతో వెలిగిపోతున్న పరమాత్మను చూసి వణికిపోతూ స్వామి పాదాలపై పడి: "స్వామీ! ఘోర పాపం చేశాను, నన్ను సంహరించు" అని రోదించాడు. కృష్ణుడు చిరునవ్వుతో: "భయపడకు జరుడా! ఇది పూర్వ సంకల్పం. నా అనుమతితోనే జరిగింది. నీవు పుణ్యలోకాలకు వెళ్లు" అని అతనికి దివ్య విమానాన్ని అనుగ్రహించి స్వర్గానికి పంపాడు.


శ్రీకృష్ణుని రథ సారథి అయిన దారుకుడు స్వామిని వెతుక్కుంటూ వనమాల సువాసనలను గుర్తుపట్టి అక్కడికి చేరుకున్నాడు.


యాదవ వంశ నాశనం, బలరామకృష్ణులు దేహం విడిచిన విషయాన్ని ద్వారకలోని వారికి తెలిపి, అందరినీ అర్జునుని వెంట పంపమని స్వామి ఆజ్ఞాపించాడు.


బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలంతా విమానాలలో వచ్చి పుష్పవృష్టి కురిపించగా, భగవానుడు భౌతిక దేహాన్ని వదలకుండా తన నిత్య దివ్య స్వరూపంతోనే పరమపదమైన వైకుంఠ ధామానికి వేంచేశాడు.


3. ద్వారక జలమయం & అర్జునుని శోకం

శ్రీకృష్ణుని, బలరాముని నిర్యాణ వార్త విన్న వసుదేవుడు, దేవకి, రోహిణీదేవి శోకంతో ప్రాణాలు విడిచారు. రుక్మిణి మొదలైన అష్టమహిషులు అగ్నిప్రవేశం చేసి స్వామిని చేరుకున్నారు.


* అర్జునుడు మరణించిన వారందరికీ ఉత్తరక్రియలు నిర్వహించి, మిగిలిన స్త్రీలను, పిల్లలను తీసుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు.

* సముద్రం ముంచుట: అర్జునుడు ద్వారకా నగరాన్ని విడిచి అడుగు ముందుకు వేయగానే... పరమాత్మ నివాసం లేని ఆ సువర్ణ ద్వారకా నగరాన్ని సముద్రుడు క్షణంలో తన జలాలలో ముంచివేశాడు (శ్రీకృష్ణుని నిత్య మందిరం తప్ప).


మిగిలిన యాదవ రాజైన వజ్రునికి (అనిరుద్ధుని కుమారునికి) మథురా నగరానికి పట్టాభిషేకం చేశాడు. (బాలురు, వృద్ధులు, స్త్రీలను వేరొక చోటకు పరమాత్మ ముందుగానే పంపాడు, వారిని అర్జునుడు ద్వారక నుండి రక్షించాడు)


4. ద్వాదశ స్కంధ ప్రవేశం – భవిష్య రాజవంశాలు & కలియుగ లక్షణాలు


ద్వాదశ స్కంధంలో శుకమహర్షి రాబోయే కలియుగ చరిత్రను ముందే దర్శించి వివరించాడు:


* రాజవంశాల పతనం: మగధను పాలించే శిశునాగ, నంద, మౌర్య, శుంగ, గుప్త తదితర వంశాల రాజులంతా క్రమంగా ధర్మాన్ని వీడి కేవలం అధికారం, ధనం కోసం ప్రజాపీడకులుగా మారతారు.

* కలియుగ దోషాలు

* కలియుగంలో ధనం ఉన్నవాడికే కులం, శీలం, న్యాయం దక్కుతాయి.

* బలవంతుడే రాజు అవుతాడు; న్యాయం కేవలం ధనవంతుల పక్షమే మాట్లాడుతుంది.

* వివాహం కేవలం బాహ్య ఆకర్షణ కోసమే జరుగుతుంది; దానధర్మాలు కీర్తి కోసమే చేస్తారు.

* వర్షాలు కురవవు, కరవులు వస్తాయి, మానవుల ఆయుష్షు 20 నుండి 30 ఏళ్లకు పడిపోతుంది.

* తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోరు; వేదాలు వ్యాపార వస్తువులవుతాయి.


* కల్కి అవతారం: కలియుగం అంతిమ దశలో శంబల గ్రామంలోని 'విష్ణుయశస్సు' అనే బ్రాహ్మణుని ఇంట కల్కి భగవానుడు తెల్లటి గుర్రంపై చేతిలో ఖడ్గంతో అవతరించి, అధర్ములను సంహరించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడు.

* కలియుగ తారక నామం

"కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్ గుణః |

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధః పరం వ్రజేత్ ||"

"ఓ పరీక్షిన్మహారాజా! కలియుగం సమస్త దోషాల నిలయమే అయినప్పటికీ, ఇందులో ఒకే ఒక్క మహత్తరమైన గుణం ఉంది. సత్యయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరయుగంలో అర్చన వల్ల లభించే మోక్షం... కలియుగంలో కేవలం శ్రీకృష్ణ దివ్య నామ సంకీర్తనం వల్లే లభిస్తుంది!"


5. శుకమహర్షి అంతిమ బోధ & పరీక్షిత్తు మోక్షం

ఇక ఏడవ రోజు సమీపించింది. శృంగి శాపం ప్రకారం తక్షకుడు వచ్చి కాటువేయబోయే సమయం ఆసన్నమైంది. శుకమహర్షి పరీక్షిత్తుకు అంతిమ పరమ బోధ చేశాడు:


* "త్వం బ్రహ్మ పరమం ధామ":

"రాజా! 'నేను మరణిస్తాను' అనే పశుబుద్ధిని విడిచిపెట్టు. నీవు దేహానివి కావు, పుట్టేది గిట్టేది దేహానికే కానీ నీలోని చిన్మయ ఆత్మకు కాదు. కడవ పగిలితే లోపలి ఆకాశం బయటి ఆకాశంలో కలిసిపోయినట్లే... నీ దేహం రాలిపోగానే నీ ఆత్మ పరబ్రహ్మంలో లీనమవుతుంది. నీవు సాక్షాత్తు ఆ పరమాత్మవే!"

* పరీక్షిత్తు సమాధి నిష్ఠ: పరీక్షిత్తు మహారాజు సమస్త ప్రాపంచిక బంధాలను, దేహ స్పృహను వదిలి, గంగాతీరాన ఉత్తరాభిముఖుడై కూర్చుని, పరబ్రహ్మ భావనతో సమాధిలో మునిగిపోయాడు. శుకమహర్షి ఆయనను ఆశీర్వదించి నిష్క్రమించాడు.

* తక్షకుని దంశనం & కైవల్యం:

బ్రాహ్మణ వేషంలో వచ్చిన తక్షక సర్పం పరీక్షిత్తును కాటువేసింది. ఆ విషాగ్నిలో పరీక్షిత్తు యొక్క భౌతిక శరీరం మాత్రమే భస్మమైంది. కానీ అప్పటికే దేహాతీతుడై సమాధిలో ఉన్న పరీక్షిత్తు జీవాత్మ పరబ్రహ్మమైన శ్రీహరి దివ్య చరణాలలో లీనమై శాశ్వత కైవల్య ముక్తిని పొందింది. దేవతలు ఆకాశం నుండి దుందుభులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు.


📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:


* అవతార సమాప్తి సత్యం: భగవంతుని అవతార పరిసమాప్తి అనేది మానవులకు దేహ నశ్వరతను, ఆత్మ నిత్యత్వాన్ని గుర్తుచేసే దివ్య లీల మాత్రమే.

* కలి ప్రభావ నివారణ: కలియుగ దోషాల నుండి తప్పించుకోవడానికి ఏకైక రక్షాకవచం 'కృష్ణ' నామ సంకీర్తనమే.

* భాగవత శ్రవణ ఫలం: కేవలం ఏడు రోజులు అనన్య శ్రద్ధతో భాగవతాన్ని శ్రవణం చేసిన పరీక్షిత్తు మహారాజు మృత్యుభయాన్ని జయించి సాక్షాత్తు ముక్తినే పొందాడు.


*రేపటితో భాగవతానికి మంగళం.* 


ఈ ప్రయాణంలో సహకరించి ఆదరించిన పాఠకులకు నా ధన్యవాదాలు. 


*హరే కృష్ణ శ్రీ కృష్ణ శరణం మమ 🙏 🙏*


...*స్థిరవారం 12 సెప్టెంబర్ 2026*


*శ్రీమద్భాగవతం - 47/48*🙏 


*శ్రీకృష్ణ పరమపద ప్రాప్తి & పరీక్షిత్తు మోక్షం*


ఓం నమో భగవతే వాసుదేవాయ!


భగవదనుగ్రహం చేత సాగుతున్న భాగవత అధ్యయనం చివరి దశకు వచ్చింది. ఈరోజుతో బలరామ కృష్ణులు, పరీక్షిత్తు వైకుంఠం చేరి పరమపదం పొందుతారు, కానీ మన హృదయ పీఠంలో ఎప్పటికీ నిలిచి ఉంటారు, ఉండాలి అని ప్రార్థన చేస్తూ ప్రారంభం చేసుకుందాం..


1. ప్రభాస తీర్థంలో యాదవ వంశ ఉపసంహరణ

ద్వారకలో అశుభ శకునాలు పెరిగిపోవడంతో, శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం యాదవులంతా తమ పాప విముక్తి కోసం సరస్వతీ నదీ సంగమమైన ప్రభాస తీర్థానికి వెళ్లారు. అక్కడ పవిత్ర స్నానాలు ఆచరించి, బ్రాహ్మణులకు అన్నదానాలు, గోదానాలు చేశారు.


* మదిరాపానం & వివేక భ్రంశం: అనంతరం విధి ప్రేరణతో, బుద్ధిభ్రష్టులై 'మైరేయం' అనే మధువును (చెరకుతో చేసిన మత్తు పదార్థం) అపరిమితంగా సేవించి యాదవ వీరులంతా మతిభ్రమించారు.


కృష్ణ మాయా ప్రభావాన వారి మధ్య పరస్పర స్పర్ధలు, పాత శత్రుత్వాలు రగిలాయి. సాత్యకి కృతవర్మను, ప్రద్యుమ్నుడు ఇతరులను ఎగతాళి చేసుకుంటూ ఒకరినొకరు నిందించుకున్నారు.


ఆవేశంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చేతుల్లోని ఆయుధాలు విరిగిపోగా, పూర్వం పిండారక మునుల శాపంతో పుట్టిన ఇనుప రోకలి పొడి నుండి సముద్ర తీరాన మొలిచిన 'ఏరకా గడ్డిని' (తుంగ గడ్డిని) చేతుల్లోకి తీసుకున్నారు. ఆ గడ్డిపోచలు చేతిలోకి రాగానే ఇనుప దండాల వలె, వజ్రాల వలె మారిపోయాయి.


బలరామ కృష్ణులు ఆపాలని చూస్తే వారి మీద కూడా దాడి చేశారు, దాంతో వారు గదలతో వారిని మోదారు.


* వంశ నాశనం: అలా ఆ గడ్డి దండాలతో ప్రద్యుమ్నుడు, సాంబుడు, సాత్యకి, అనిరుద్ధుడు తదితర సమస్త యాదవ వీరులు పరస్పరం కొట్టుకుని, భగవత్ సంకల్పంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.


2. బలరామ నిర్యాణం & శ్రీకృష్ణుని పరమపద ప్రస్థానం

సమస్త యాదవ వంశం తన కళ్లముందే నశించడం చూసిన శ్రీ బలరాముడు అక్కడే సముద్ర తీరాన పద్మాసనం వేసుకుని, సమాధి నిష్ఠలో మునిగిపోయాడు. ఆయన ముఖం నుండి సహస్ర ముఖాల దివ్య శ్వేత సర్పం (ఆదిశేషుడు) వెలువడి సముద్రంలోకి ప్రవేశించి అనంత లోకాలకు చేరుకుంది.


శ్రీకృష్ణ పరమాత్మ ఒంటరిగా ఒక రావిచెట్టు (అశ్వత్థ వృక్షం) మొదట్లో కూర్చున్నాడు. తన ఎడమ తొడపై ఎర్రటి పద్మంలా మెరిసిపోతున్న కుడి పాదాన్ని ఉంచి ఏకాగ్ర ధ్యానంలో ఆసీనుడయ్యాడు.


ఆ సమయంలో 'జరుడు' అనే బోయవాడు వేటాడుతూ, చెట్ల పొదల మాటున ఉన్న శ్రీకృష్ణుని ఎర్రటి పాదాన్ని జింక ముఖంగా భ్రమించాడు. పూర్వం ముసల రజను మింగిన చేప కడుపులో దొరికిన ఇనుప ముక్కతో తయారుచేసిన బాణాన్ని సంధించి శ్రీకృష్ణుని పాదంపై కొట్టాడు.


ఆ తదుపరి సమీపానికి వచ్చి చూసిన జరుడు... చతుర్భుజాలతో, పీతాంబరంతో వెలిగిపోతున్న పరమాత్మను చూసి వణికిపోతూ స్వామి పాదాలపై పడి: "స్వామీ! ఘోర పాపం చేశాను, నన్ను సంహరించు" అని రోదించాడు. కృష్ణుడు చిరునవ్వుతో: "భయపడకు జరుడా! ఇది పూర్వ సంకల్పం. నా అనుమతితోనే జరిగింది. నీవు పుణ్యలోకాలకు వెళ్లు" అని అతనికి దివ్య విమానాన్ని అనుగ్రహించి స్వర్గానికి పంపాడు.


శ్రీకృష్ణుని రథ సారథి అయిన దారుకుడు స్వామిని వెతుక్కుంటూ వనమాల సువాసనలను గుర్తుపట్టి అక్కడికి చేరుకున్నాడు.


యాదవ వంశ నాశనం, బలరామకృష్ణులు దేహం విడిచిన విషయాన్ని ద్వారకలోని వారికి తెలిపి, అందరినీ అర్జునుని వెంట పంపమని స్వామి ఆజ్ఞాపించాడు.


బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలంతా విమానాలలో వచ్చి పుష్పవృష్టి కురిపించగా, భగవానుడు భౌతిక దేహాన్ని వదలకుండా తన నిత్య దివ్య స్వరూపంతోనే పరమపదమైన వైకుంఠ ధామానికి వేంచేశాడు.


3. ద్వారక జలమయం & అర్జునుని శోకం

శ్రీకృష్ణుని, బలరాముని నిర్యాణ వార్త విన్న వసుదేవుడు, దేవకి, రోహిణీదేవి శోకంతో ప్రాణాలు విడిచారు. రుక్మిణి మొదలైన అష్టమహిషులు అగ్నిప్రవేశం చేసి స్వామిని చేరుకున్నారు.


* అర్జునుడు మరణించిన వారందరికీ ఉత్తరక్రియలు నిర్వహించి, మిగిలిన స్త్రీలను, పిల్లలను తీసుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు.

* సముద్రం ముంచుట: అర్జునుడు ద్వారకా నగరాన్ని విడిచి అడుగు ముందుకు వేయగానే... పరమాత్మ నివాసం లేని ఆ సువర్ణ ద్వారకా నగరాన్ని సముద్రుడు క్షణంలో తన జలాలలో ముంచివేశాడు (శ్రీకృష్ణుని నిత్య మందిరం తప్ప).


మిగిలిన యాదవ రాజైన వజ్రునికి (అనిరుద్ధుని కుమారునికి) మథురా నగరానికి పట్టాభిషేకం చేశాడు. (బాలురు, వృద్ధులు, స్త్రీలను వేరొక చోటకు పరమాత్మ ముందుగానే పంపాడు, వారిని అర్జునుడు ద్వారక నుండి రక్షించాడు)


4. ద్వాదశ స్కంధ ప్రవేశం – భవిష్య రాజవంశాలు & కలియుగ లక్షణాలు


ద్వాదశ స్కంధంలో శుకమహర్షి రాబోయే కలియుగ చరిత్రను ముందే దర్శించి వివరించాడు:


* రాజవంశాల పతనం: మగధను పాలించే శిశునాగ, నంద, మౌర్య, శుంగ, గుప్త తదితర వంశాల రాజులంతా క్రమంగా ధర్మాన్ని వీడి కేవలం అధికారం, ధనం కోసం ప్రజాపీడకులుగా మారతారు.

* కలియుగ దోషాలు

* కలియుగంలో ధనం ఉన్నవాడికే కులం, శీలం, న్యాయం దక్కుతాయి.

* బలవంతుడే రాజు అవుతాడు; న్యాయం కేవలం ధనవంతుల పక్షమే మాట్లాడుతుంది.

* వివాహం కేవలం బాహ్య ఆకర్షణ కోసమే జరుగుతుంది; దానధర్మాలు కీర్తి కోసమే చేస్తారు.

* వర్షాలు కురవవు, కరవులు వస్తాయి, మానవుల ఆయుష్షు 20 నుండి 30 ఏళ్లకు పడిపోతుంది.

* తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోరు; వేదాలు వ్యాపార వస్తువులవుతాయి.


* కల్కి అవతారం: కలియుగం అంతిమ దశలో శంబల గ్రామంలోని 'విష్ణుయశస్సు' అనే బ్రాహ్మణుని ఇంట కల్కి భగవానుడు తెల్లటి గుర్రంపై చేతిలో ఖడ్గంతో అవతరించి, అధర్ములను సంహరించి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడు.

* కలియుగ తారక నామం

"కలేర్దోషనిధే రాజన్నస్తి హ్యేకో మహాన్ గుణః |

కీర్తనాదేవ కృష్ణస్య ముక్తబంధః పరం వ్రజేత్ ||"

"ఓ పరీక్షిన్మహారాజా! కలియుగం సమస్త దోషాల నిలయమే అయినప్పటికీ, ఇందులో ఒకే ఒక్క మహత్తరమైన గుణం ఉంది. సత్యయుగంలో ధ్యానం వల్ల, త్రేతాయుగంలో యజ్ఞాల వల్ల, ద్వాపరయుగంలో అర్చన వల్ల లభించే మోక్షం... కలియుగంలో కేవలం శ్రీకృష్ణ దివ్య నామ సంకీర్తనం వల్లే లభిస్తుంది!"


5. శుకమహర్షి అంతిమ బోధ & పరీక్షిత్తు మోక్షం

ఇక ఏడవ రోజు సమీపించింది. శృంగి శాపం ప్రకారం తక్షకుడు వచ్చి కాటువేయబోయే సమయం ఆసన్నమైంది. శుకమహర్షి పరీక్షిత్తుకు అంతిమ పరమ బోధ చేశాడు:


* "త్వం బ్రహ్మ పరమం ధామ":

"రాజా! 'నేను మరణిస్తాను' అనే పశుబుద్ధిని విడిచిపెట్టు. నీవు దేహానివి కావు, పుట్టేది గిట్టేది దేహానికే కానీ నీలోని చిన్మయ ఆత్మకు కాదు. కడవ పగిలితే లోపలి ఆకాశం బయటి ఆకాశంలో కలిసిపోయినట్లే... నీ దేహం రాలిపోగానే నీ ఆత్మ పరబ్రహ్మంలో లీనమవుతుంది. నీవు సాక్షాత్తు ఆ పరమాత్మవే!"

* పరీక్షిత్తు సమాధి నిష్ఠ: పరీక్షిత్తు మహారాజు సమస్త ప్రాపంచిక బంధాలను, దేహ స్పృహను వదిలి, గంగాతీరాన ఉత్తరాభిముఖుడై కూర్చుని, పరబ్రహ్మ భావనతో సమాధిలో మునిగిపోయాడు. శుకమహర్షి ఆయనను ఆశీర్వదించి నిష్క్రమించాడు.

* తక్షకుని దంశనం & కైవల్యం:

బ్రాహ్మణ వేషంలో వచ్చిన తక్షక సర్పం పరీక్షిత్తును కాటువేసింది. ఆ విషాగ్నిలో పరీక్షిత్తు యొక్క భౌతిక శరీరం మాత్రమే భస్మమైంది. కానీ అప్పటికే దేహాతీతుడై సమాధిలో ఉన్న పరీక్షిత్తు జీవాత్మ పరబ్రహ్మమైన శ్రీహరి దివ్య చరణాలలో లీనమై శాశ్వత కైవల్య ముక్తిని పొందింది. దేవతలు ఆకాశం నుండి దుందుభులు మోగిస్తూ పుష్పవృష్టి కురిపించారు.


📝 నేటి అంతరార్థం / ముఖ్య విషయాలు:


* అవతార సమాప్తి సత్యం: భగవంతుని అవతార పరిసమాప్తి అనేది మానవులకు దేహ నశ్వరతను, ఆత్మ నిత్యత్వాన్ని గుర్తుచేసే దివ్య లీల మాత్రమే.

* కలి ప్రభావ నివారణ: కలియుగ దోషాల నుండి తప్పించుకోవడానికి ఏకైక రక్షాకవచం 'కృష్ణ' నామ సంకీర్తనమే.

* భాగవత శ్రవణ ఫలం: కేవలం ఏడు రోజులు అనన్య శ్రద్ధతో భాగవతాన్ని శ్రవణం చేసిన పరీక్షిత్తు మహారాజు మృత్యుభయాన్ని జయించి సాక్షాత్తు ముక్తినే పొందాడు.


*రేపటితో భాగవతానికి మంగళం.* 


ఈ ప్రయాణంలో సహకరించి ఆదరించిన పాఠకులకు నా ధన్యవాదాలు. 


*హరే కృష్ణ శ్రీ కృష్ణ శరణం మమ 🙏 🙏*


.....సశేషం

🙏🌹🙏


           *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*..సశేషం

🙏🌹🙏


           *🍁సేకరణ🍁*

       🙏*న్యాయపతి*🙏 

          *నరసింహారావు*