27, ఏప్రిల్ 2026, సోమవారం

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*మంగళవారం 21 ఏప్రిల్ 2026*

``

               *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣2️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *202వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


ఉద్యోగ పర్వము,  మహాభారతం ఇతిహాసంలోని ఐదవ భాగము. 

ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. 

సంస్కృత మూలంలో 6,698 శ్లోకాలు ఉన్నాయి.  సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు). దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు..


         *ప్రధమాశ్వాసం*

```

ఉత్తరాభిమన్యుల వివాహం గడిచి నాలుగు రోజుల తరువాత ధర్మరాజు తన సోదర, పుత్ర సమేతంగా విరాటరాజు కొలువు కూటంలో ప్రవేశించాడు. అప్పుడు విరాటరాజు కృష్ణుడు, బలరాముడు, వారి పుత్రులు బంధువులతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ చూసి “పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం విజయవంతంగా పూర్తి చేసారు. వారు ఎంతటి ధర్మపరులో అందరికీ తెలుసు. సుయోధనుడు శకుని సాయంతో పాండవులను మాయా జూదంలో ఓడించి పాండవుల రాజ్యలక్ష్మిని అన్యాయంగా అపహరించాడు. కనుక పాండవులకు కౌరవులకు క్షేమకరమైన ఒక మార్గం అన్వేషించి పాండవుల రాజ్యం వారికి సంక్రమింప చేయాలి. పాండవులకు పితృధనంగా కొంతరాజ్యం లభించింది. ధర్మరాజు రాజసూయ యాగం నిర్వహించి రాజ్యాన్ని విస్తరించి మాయా జూదంలో అంతా దుర్యోధనుని పరం చేసి అడవులలో సోదర, పత్నీ సమేతంగా అనేక ఇడుములు పడ్డాడు. సుయోధనుడు,శకుని, దుశ్శాసన, కర్ణాదులతో చేరి వారిని అనేక అవమానాల పాలు చేసాడు. పాండవులు సాయం సంతరించుకునే లోపే వారిని ఎదుర్కోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు. కనుక పాండవులు వారికి సహాయాన్నందించే వారిని సమీకరించడం అనివార్యం. వారి బలపరాక్రమాలను ప్రదర్శించ వలసిన సమయం ఆసన్నమైంది. అయినా కౌరవుల మనసులో ఏముందో తెలుసుకుని తదుపరి కార్యక్రమ రచన చేయడం ఉచితం కనుక హస్తినా పురానికి ఒక దూతను పంపుట ఉచితం. వారు పాండవులకు రాజ్యభాగం శాంతి మార్గంలో ఇస్తే ఇరువర్గాలకు మంచిది. లేకుంటే ఏది ఉచితమో తరువాత నిర్ణయిస్తాము” అన్నాడు. 


అప్పుడు బలరాముడు లేచి.. 

“తమ్ముడు శ్రీకృష్ణుడు చెప్పినది ఉచితం. ఇరువర్గాలకూ ఇది క్షేమకరం. మనం ఒక దూతను కౌరవేంద్రుని వద్దకు పంపుదాము. జూదం ఆడటం సరిగా ఎరుగని ధర్మనందనుడు జూదానికి సిద్దంగావున్న కర్ణ దుర్యోధనాదులను వదిలి జూదంలో నిపుణుడైన శకునిని ఆటకు పిలిచి అతని చేతిలో ఓడిపోతూ, రోషావేశంతో జూదంను కొనసాగించి ఓడిపోయాడు. దానిలో శకుని తప్పేమీ లేదు. తన ప్రావీణ్యంతో రాజ్యాన్ని జూదంలో గెలిచి సుయోధన పరంచేసాడు. ఇందులో దుర్యోధనుని అపరాధం ఏమీ లేదు. కనుక ఇక్కడి నుంచి వెళ్ళే దూత ధృతరాష్ట్రుడికి నమస్కరించి వినయపూర్వకంగా వారికి ఏ విధంగానూ కోపం తెప్పించకుండా సంభాషించి కార్యాన్ని చక్కబెట్టేలా ఉండాలి” అన్నాడు.```


         *సాత్యకి ఆవేశం*```


బలరాముని మాటలు సాత్యకికి కోపం తెప్పించాయి "బలరామా! నువ్వు ఇలా మాట్లాడటం తగదు. ఇలా మాట్లాడటం నీకే తగింది. మనుష్యునికి ఎలాంటి హృదయం వుంటే వారు అటువంటి మాటలే మాట్లాడుతారు. దుర్యోధనుడు మంచి వాడంటున్న నిన్ను మాట్లాడించి వింటున్న వారిని అనాలి. ధర్మరాజు వేడుక పుట్టి జూదం ఆడాడా? దుర్యోధనాదులంతా కుట్రపన్ని ధర్మరాజుని క్షత్రియ ధర్మాన్ని అనుసరించి జూదానికి పిలిచి, కపట జూదం ఆడి అతడి రాజ్యలక్ష్మిని అపహరించి అతని సోదరలను ధర్మ పత్నిని అవమానించారు. ధర్మరాజు ధర్మగుణం లోకానికి తెలియనిదా? నియమం ప్రకారం వనవాసం నుండి విముక్తుడు కాగానే వారి రాజ్యంను పొందడానికి ధర్మరాజు అర్హుడైనాడు. దీనుడై అతడు రాజ్యంను యాచించడం తగదు. పాండవుల వద్ద అపహరించిన రాజ్యం పాండవులకు ఇవ్వక తప్పదు. లేకున్న పాండవులు యుద్ధంలో వారి రాజ్యాన్ని పొందగలరు. భీమార్జునులను ఎదిరించి యుద్ధభూమిలో నిలువగల వాడెవడు. విరాటుని పరాక్రం తక్కువా? పాంచాల వీరులు, వృష్టి వీరులు యుద్ధంలో తలపడి సుయోధనుని తమ్ములను హతమార్చక మానరు. రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం తప్పదు. దూతను పంపండి కానీ న్యాయంగా ఇస్తే సరి. అంతేగాని యాచన వలదు" అన్నాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*గురువారం 23 ఏప్రిల్ 2026*

``

             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

సరళ వ్యావహారిక భాషలో!

                           2️⃣0️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


        *సంపూర్ణ మహాభారతము*            

                    *204 వ రోజు*                    

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*సహాయార్ధియై దుర్యోధనుడు ద్వారకకేగుట*```


హస్థినలో కూడా ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. శ్రీకృష్ణుని వద్దకు దూతను పంపాలనుకున్న దుర్యోధనుడు మనసు మార్చుకుని తనే స్వయంగా ద్వారకకు పయనమయ్యాడు. 


అర్జునుడు కూడా అదే రోజు ద్వారక చేరాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు శయనించి ఉన్నాడు. ముందుగా వచ్చిన సుయోధనుడు శ్రీకృష్ణుని తలవైపు ఉన్న ఆసనంపై కూర్చుచున్నాడు. తరువాత వచ్చిన అర్జునుడు శ్రీకృష్ణుని కాళ్ళ వైపు వినయంగా చేతులు కట్టుకుని నిల్చున్నాడు. శ్రీకృష్ణుడు నిద్రలేచి ముందుగా అర్జునిని వైపు చూసి తరువాత దుర్యోధనుని చూసాడు. ఇద్దరినీ తగురీతిన సత్కరించి వచ్చిన కారణం అడిగాడు. 


సుయోధనుడు ముందుగా "కృష్ణా! పాండవులకు మాకు యుద్ధం సంభవిస్తే యుద్ధంలో మాకు మీ సహాయం కోరడానికి వచ్చాను. నీకు పాండవులెంతో మేము అంతే. పైగా నేను ముందు వచ్చాను ముందుగా వచ్చిన వారిని ఆదరించడం లోక నీతి కనుక నాకు నీ సహాయాన్ని అందించ కోరుతున్నాను.”అన్నాడు.


అందుకు శ్రీకృష్ణుడు "సుయోధనా నీవు ముందు ఏతెంచిన మాట వాస్తవం. కాని నేను ముందుగా అర్జునుని చూసాను కనుక మీ ఇద్దరికి సహాయాన్నందించడం నా విధి. మీ ఇద్దరికీ సమ్మతమయ్యేలా ఒక మార్గం చెప్తాను. నా వద్ద సుశిక్షితులైన నాతో సమాన రూపం కల "నారాయణ" నామం గల పది లక్షల మంది యుద్ధ విద్యా నిపుణులు ఉన్నారు. వారిని ఎంచుకున్న వారి వైపు వారు యుద్ధం చేస్తారు. నేను ఒక వైపు ఉంటాను అయితే నేను మాత్రం యుద్ధం చేయను. ఆయుధం పట్టను. కోరుకున్న వారికి హితుడుగా ఉంటాను. మీరిరువురు ఎవరికి ఇష్టమైంది వారు కోరుకోండి. అర్జునుడు చిన్నవాడు కనుక అతడు ముందు కోరుకోవడం ధర్మం" అన్నాడు. 


వెంటనే అర్జునుడు "నాకు శ్రీకృష్ణుడు కావాలి" అన్నాడు. 


సుయోధనుడు మనసులో సంతోషించి పది లక్షల నారాయణ సైన్యంను తీసుకుని బలరాముని వద్దకు వెళ్ళి సహాయం కోరాడు. 


బలరాముడు "సుయోధనా! అభిమన్యుని వివాహ సమయంలో నేను నిన్ను సమర్ధించాను.అందుకు కొందరు వ్యతిరేకించారు ఆ విషయం నీకు తెలిసే ఉంటుది. ఇరుపక్షాల్తోను మనకు సమాన బంధుత్వం వున్నదని గుర్తుచేశాను. నా మాటను కృష్ణుడు స్వీకరించ లేదు. నాకు కృష్ణుడంటే అభిమానం. అతడిని విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. కనుక నేను ఎవరి పక్షం వహించక ఊరక ఉంటాను" అన్నాడు. 


సుయోధనుడు బలరాముని వద్ద వీడ్కోలు తీసుకుని కృతవర్మ వద్దకు వెళ్ళి సహాయం అర్ధించాడు. కృతవర్మ ఒక అక్షౌహిణి సైన్యాన్ని సహాయంగా ఇచ్చాడు. దానిని తీసుకుని సుయోధనుడు హస్థినకు తిరిగి వెళ్ళాడు.```


*అర్జునుని అంతర్యం*```


శ్రీకృష్ణుడు "అర్జునా! అదేమిటి నన్ను కోరుకున్నావు. ఆయుధము పట్టని యుద్ధం చేయని నా వల్ల నీకు మేలు ఏమిటి" అన్న్నాడు. 


అర్జునుడు "కృష్ణా! నీవు యుద్ధంలో వారందరిని సంహరించ గలవాడవు. వారిని చంపితే ఆ కీర్తి నీకు చెందుతుంది. నేనుకూడా వారిని సంహరించి ఆ కీర్తిని పొందాలనుకుంటున్నాను. నిన్ను ఎదిరించి నేను గెలువగలనా? పైగా నీవు ఉన్న వైపు విజయలక్ష్మి ఉంటుంది కనుక నీ తోడ్పాటు చాలు. దానితో నేను యుద్ధం చేసి రాజ్యం హస్థగతం చేసుకుని ధర్మరాజుని నిలపడమే అతనికి ఖ్యాతి గాని నీవు గెలిచిన రాజ్యానికి ధర్మజుని రాజుని చేయడం ధర్మమా? నీవు మా వైపు ఉంటే చాలు. నా చిరకాల వాంఛ అయిన నీ సారథ్యం ప్రసాదించి నన్ను అనుగ్రహించు అదేచాలు" అన్నాడు. 


శ్రీ కృష్ణుడు "అర్జునా! నీ కోరిక తప్పక తీరుతుంది. నీకు సారథ్యం వహించి విజయలక్ష్మిని నీకు స్వంతం చేస్తాను. మనం వెళ్ళి ధర్మరాజుతో ఆలోచించి తదుపరి కార్యాచరణ చేద్దాము పద " అని అర్జునునితో ఉపప్లావ్యం చేరాడు.```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

 

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

శివుడు ఉండమని అడిగినా

 శివుడు ఉండమని అడిగినా ఆదిశంకరులు ఎందుకు ఉండలేదు రెండు రోజులు:



శంకరాచార్యులు " శివానందలహరి " చేస్తూ ఒక అద్భుత శ్లోకంతో శివుణ్ణి ప్రార్ధిస్తారు:


అశనం గరళం ఫణీ కలాపో

వసనం చర్మచ వాహనం మహోక్షః

మమ దాస్యసి కిం కిమస్తి శంభో

తవ పాదాంబుజ భక్తిమేవ దేహి "


ఓరోజు శంకరాచార్యులవారికి శివుణ్ణి నేరుగా దర్శించి ప్రార్ధన చేసుకోవాలనిపించింది. కైలాసానికి చేరుకున్నారు. శివుడు పరమానందపడిపోయి " రావోయ్, ఎన్నాళ్ళకి వచ్చావు, కూర్చో " అన్నారు. 10 ని.లు అవగానే తను తిరిగి వెడతానన్నారు శంకరులు. " అదేమిటోయ్ రాకరాక వచ్చావు, రెండు రోజులు ఉండి వెడుదువుగాని " అన్నారు శివుడు.

అప్పుడు శంకరులు పై శ్లోకాన్ని చెబుతారు.

మనం వేరే ఊరిలో ఉన్న స్నేహితుడి ఇంటికి వెళ్ళామనుకోండి. ఇంట్లోకి ఆహ్వానించి సామాను ప్రక్కరూములో పెట్టుకో అంటాడు. లుంగీ ఇచ్చి కట్టుకోమని కాఫీ ఇస్తాడు. స్నానంచేసి రమ్మని టిఫిన్ పెడతాడు. తన స్కూటర్ మీదో కారుమీదో ఊరంతా చూపిస్తాడు. వెళ్ళేటప్పుడు ఏదో చిన్న జ్ఞాపిక ఇచ్చి సాగనంపుతాడు.

ఇదే విషయాన్ని శంకరులు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా శివుడితో ఏమన్నారో చూద్దాం.

నువ్వు ఉండేదే శ్మశానంలో కనుక నన్నుకూడా ఓ ప్రక్కన సర్దుకోమంటావు. నువ్వు త్రాగేదే గరళం కనుక నాకు కూడా కొంచెం అదే త్రాగమని ఇస్తావు. నువ్వుకట్టుకునేదే జంతుచర్మం కనుక ఓ చిన్నముక్క నాకు కూడా ఇస్తావు కట్టుకోమని. నువ్వు తిరిగేదే ఎద్దుమీద కనుక దానిమీద ఎక్కించుకునే అటూ ఇటూ త్రిప్పుతావు నన్ను. నువ్వు ధరించేవే నాగుపాములు కనుక నేను వేళ్ళేటప్పుడు ఓ చిన్నపాముని జ్ఞాపికగా ఇస్తావు. " ఇవన్నీ భరించడం నావల్ల అవదు కానీ నీపాదాలను సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించి అనుగ్రహించు స్వామీ " అని వేడుకున్నారు అనుకోవాలి.

ఎంత అద్భుతంగా ఉంది శంకరుల వేడికోలు..


ఈ పవిత్రమైన "  సోమవారం ". "అవ్యాజకరుణామూర్తి" పరమేశ్వరుడి అశీస్సులు అందరికీ లభించాలని కోరుకుందాం.


శుభ సోమవారం 🔱Happy Monday

ఓ మధురమైన జ్ఞాపకం

 (ఓ మధురమైన జ్ఞాపకం)


శుభోదయం మిత్రులందరికి :


ఆచార్య సి.వి.బి.సుబ్రమణ్యంగారు జ్యోతిష నిపుణులు, శాస్త్ర బోధకులు

ముఖ్యంగా హాస్యప్రియులు.చాలా

జ్యోతిష సభలలో ''హాస్యం-బుధకార

కత్వము అనే విషయంపై నాకు మాట్లాడే

అవకాశాన్ని చ్చి.వివిధ సభలలో నేను

చెప్పిన హాస్యాన్ని''చురకసంహిత ''గా

జ్యోతిర్వాస్తు విజ్ఞానసంస్ద ద్వారా ముద్రించి నన్ను ప్రోత్సహించిన సహృదయులు.వారి వద్దనే ఎం.ఏ

జ్యోతిషం తెలుగువిశ్వవిద్యాలయంలో

చేసాను.


సప్తమభావం(భార్యచురుకైనదయితే)


ఒకాయన రోజూతెగపూజచేస్తున్నాట్ట.

భార్య అడిగింది ఎప్పుడూ లేనిది

ఈ మధ్య ఎక్కువగా పూజ చేస్తున్నా

రేమిటండి అని! (ఆశ్చర్యంగా )


నా శత్రువు నశించాలని చేస్తున్నానోయ్

అన్నాట్ట (కోపంగా ).


మీరెంత పూజలుచేసినా నేనిప్పట్లోపోను

అందిట భార్య (నవ్వుతూ ).


                         ........

జె.ఎల్. నరసింహం,హాస్యావధాని, హైదరాబాద్. (డా::సి.వి.బి.సుబ్రమణ్యంగారు సత్కరి

స్తున్న జ్ఞాపకం ఫోటోలోసాగికమలాకర

శర్మగారు కూడా ఉన్నారు. )

26, ఏప్రిల్ 2026, ఆదివారం

శ్రీ మహావిష్ణు పురాణం* `` *66వ భాగం*``

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 23 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *66వ భాగం*``


*పరశురామ అవతారం*


తండ్రి ఆదేశంతో చంపిన.. 

తల్లి సోదరులను..

తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట: ```

కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు.  


కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు.


చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు.


క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు.


మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు.


జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు.


తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు.


జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు.


ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది.


జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది. 


జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు.


రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు. 


వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు.


జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.  


జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు.


తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు. 


జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు. 


పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు. 


భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. 


పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు.


పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ

  శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు


నమో ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


1080వ వారము


*అరుణ పారాయణము, సూర్య నమస్కారములు*


శ్రీ వరుణ సహిత సంజ్ఞా ఉషా ఛాయా పద్మినీ సువర్చలాంబా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కరుణా కటాక్షములతో, శ్రీ కాంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్యానుగ్రహముతో, శ్రీ పరాభవ నామ సంవత్సర, వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ దశమి భానువారము, అనగా *26-ఏప్రిల్-2026 తేదీన, ఉదయం 07:30 గంటల* నుండి అరుణ పారాయణము తో కూడిన సూర్య నమస్కారములు ఋత్విగ్వరేణ్యుల సత్సాంగత్యములో యథా శక్తి గా జరుపుటకు నిశ్చియించడమైనది. 

విశేషములు:

• గురు వందనం

• పరిషదనుజ్ఞ

• సభా నమస్కారము

• శ్రీమహాగణపతి పూజ

• పుణ్యహవచనం

• కలశ స్థాపన

• షోడశోపచార పూజ

• తృచ పారాయణ

• అరుణ ప్రశ్న తో కూడిన సూర్య నమస్కారములు

• నవగ్రహ సూక్త పారాయణ

• నక్షత్ర సూక్త పారాయణము

• పునః పూజ 

• అష్టోత్తర శత నామార్చన

• ఆదిత్య హృదయ పారాయణ

• వేద స్వస్తి

• మంగళ హారతి

• ప్రసాద స్వీకారం


ఈ కార్యక్రమములో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి అనుగ్రహముతో స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.


స్థలము

 Flat A-102, Isha Yara apartment, Vadakkupattu, Medavakkam, Chennai


జయతాచ్ఛంకరోగురుః

హర హర శంకర జయ జయ శంకర

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

పంచాంగశుద్ధి

 *నేటి పంచాంగశుద్ధి* 

  ------------------------------------

     26---04--2026 ఆదివారం     -------------------------------------

🌞శ్రీ పరాభవ సంవత్సరం 

_--------------------------------------

🌸ఉత్తరాయణం 🌸

------------------------------

🌞 వసంత ఋతువు 🌻

------------------------------

 🌞 వైశాఖ  మాసము 🌞

--------------------------------------


🌻శుక్ల  పక్షం 🌻

----------------------------------------                    .                           🌸దశమి   ఈరోజు  రాత్రి  8----44  ని  ఉంది  తదుపరి  ఏకాదశి🌸

---------------------------------------        

 🌞మఖ   నక్షత్రము  ఈరోజు   రాత్రి   10----57 ని వరకు  ఉంది  తదుపరి  పుబ్బ నక్షత్రము  🌞

------------------------------------

🌚రాహుకాలం  ఈరోజు  సాయంత్రం  4-----30. ని   నుండి  6.  గం   వరకు ఉంది

---------------------------------------

🌑 యమ గండం ఈరోజు మధ్యాహ్నం  12. గం  నుండి   1----30. ని వరకు   ఉంది 🌑

------------------------------------

వర్జ్యం ఈరోజు  ఉదయం  11----15  ని  నుండి  12---49 ని  వరకు  ఉంది. --------------------------------------- 

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - దశమి - మఘ -‌‌ భాను వాసరే* (26.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఋతుర్ ఋతునా నుద్యమానః।

 Mantra - 21 ARUNAM 3 anuvaakam


ఋతుర్ ఋతునా నుద్యమానః। 

విననాదాభిధావః |

షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః|

శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ|| 


ఇది కాల గమనాన్ని, ముఖ్యంగా రోజులు మరియు నెలల విభజనను ఒక అద్భుతమైన రూపకంతో (Metaphor) వర్ణిస్తుంది.


*ఋతుర్ ఋతునా నుద్యమానః*: 

ఒక ఋతువు మరొక ఋతువు చేత ముందుకు నెట్టబడుతోంది. అంటే కాల చక్రంలో వసంతం తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి. 


*విననాదాభిధావః*: 

ఆ కాలం లేదా సూర్యుడు గొప్ప శబ్దము చేస్తూ (ప్రకృతిలో కలిగే మార్పుల ధ్వని) వేగంగా పరిగెడుతున్నాడు. కాలం ఆగకుండా ప్రవహిస్తోందని దీని భావం.


*షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః*: 

ఇక్కడ కాల గణన స్పష్టంగా కనిపిస్తుంది.

త్రిగ్ం శకాః: అంటే 30 కాల ప్రమాణాలు. ఇవి ఒక నెలలోని 30 రోజులు లేదా 30 ఘడియలు గల ఒక పగటి కాలం లేదా రాత్రి కాలం.

షష్టిశ్చ: అంటే 60 కాల ప్రమాణాలు. ఇవి ఒక రోజులో 60 ఘడియలు లేదా ఋతువు లో 60 రోజులు.  వీటిని "వల్గాః" (గుర్రపు కళ్లెములు) అని పిలిచారు. అంటే ఒక గుర్రం కళ్లెముల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో, కాల చక్రం ఈ రోజులు, నెలల ద్వారా అలా నడపబడుతోంది.


Additional info:

వైదిక కాల విభజన క్రమం పరిశీలిద్దాం!

1 ఘడియ = 24 నిమిషములు

2 ఘడియలు = 48 నిమిషములు = 1 ముహూర్తం

2.5 ఘడియలు = 1 గంట

5 ఘడియలు = 2 గంటలు = 1 హోర 

30 ఘడియలు = 12 గంటలు = 1 పగలు / 1 రాత్రి

60 ఘడియలు = 24 గంటలు = 1 రోజు

60*60 ఘడియలు = 60 రోజులు = 1 ఋతువు 


ఒక రోజులో 60 ఘడియలు (షష్టి)

ఒక నెలలో 30 రోజులు (త్రింశక)


(వేదం జ్యోతిశ్శాస్త్రానికి బీజం అని పై లెక్కల ప్రకారం చెప్పవచ్చు)


షష్టిశ్చ (60): "షష్టిశ్చ" అంటే అరవై. దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:

కాల విభజన - ఒక కాల ప్రమాణంలో ఉండే 60 భాగాలు (ఉదాహరణకు, ఒక రోజులో 60 ఘడియలు

లేదా ఒక ఋతువులో 60 రోజులు)


శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ: 

"శుక్ల" (తెల్లని - వెలుగు) మరియు "కృష్ణ" (నల్లని - చీకటి). ఇక్కడ 60 పగుళ్లు 60 రాత్రుళ్ళు కలిపి 60 రోజులు ఒక ఋతు కాలం.


అరుణ కేతుక చయనంలో కాలాన్ని ఒక గుర్రంగా లేదా రథంగా ఊహిస్తారు. ఈ మంత్రం ఆ కాల చక్రంలోని విడి భాగాలను వివరిస్తోంది.

 

*కాల ప్రవాహం*: ఋతువులు ఒకదానినొకటి అనుసరిస్తూ రావడం అనేది సృష్టిలోని క్రమశిక్షణకు నిదర్శనం. భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు సుమారు 1,07,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాలం తరుముకు రావటం అంటే ఇదే


*సంవత్సర విభజన*: ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక్కో నెలలో 30 రోజులు, ఒక్కో ఋతువు లో 60 రోజులు ఉంటాయని, ఒక్కో రోజులో 60 ఘడియలు ఉంటాయని, ఒక్కో నెలలో రెండు పక్షాలు (శుక్ల, కృష్ణ) ఉంటాయని వేద కాలం నాటి ఖగోళ విజ్ఞానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.


సూర్యుడే ఈ కాలాన్ని నియంత్రించే శక్తి. ఆయనే ఈ రోజులను, రాత్రులను తన కళ్లెములతో (వల్గాః) నడిపిస్తున్నాడు.


సూర్యుడు (అరుణుడు) కాల స్వరూపుడిగా మారి, ఈ సృష్టిని ఎలా పరిపాలిస్తున్నాడో, మనం ఆ కాలాన్ని ఎలా గౌరవించాలో ఈ మంత్రాలు బోధిస్తున్నాయి.


అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం 'మాయ' మరియు 'బ్రహ్మము' మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది:


*కాలము - ఒక మిథ్య* (Time as an Appearance)

కాలం నిరంతరం మారుతూ ఉంటుంది (ఋతువుల మార్పు). అద్వైతంలో మారుతున్న ప్రతిదీ 'మిథ్య' (Relative Truth). ఈ మంత్రం వర్ణించిన కాలప్రవాహం అంతా చైతన్యం మీద కదిలే ఒక చిత్రపటం వంటిది. కాలం కదులుతోంది అంటే, ఆ కదలికను గమనించే 'సాక్షి' (Observer) ఒకడు ఉండాలి. ఆ సాక్షియే కాలాతీతుడైన పరమాత్మ.


*విభజనలో అవిభజితత్వం* (Unity in Division)

మంత్రంలో అరవై, ముప్పై, శుక్ల, కృష్ణ అని కాలాన్ని ముక్కలుగా విభజించారు. కాల ప్రమాణాలు 1, 2, 2.5, 5, 30, 60… మొదలైనవి కానీ ఈ విభజనలన్నీ ఒకే సంవత్సరంలో (కాలచక్రంలో) అంతర్భాగాలు. అలాగే, జగత్తులో మనకు కనిపించే నామ-రూప భేదాలన్నీ ఆ ఒక్క బ్రహ్మము లోనివే. సముద్రంలో తరంగాలు వేరు వేరుగా ఉన్నా, అన్నీ నీరే అయినట్లుగా, కాలగతులు వేరైనా అవన్నీ ఒక్క సత్యం మీద ఆధారపడి ఉన్నాయి.


*నుద్యమానః* - నిరంతర పరిణామం

ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ఒక ఋతువు పోయి మరొకటి రావడం అనేది జగత్తు యొక్క అనిత్యత్వాన్ని (Impermanence) సూచిస్తుంది. అద్వైత సాధకుడు ఈ మార్పులను చూసి, వీటన్నింటికీ మూలమైన, మార్పు లేని (అవికారి) తత్వం వైపు దృష్టి సారించాలి.


*విననాదః* (The Cosmic Sound)

శబ్దం లేదా నాదం అనేది ఆకాశానికి గుణం. ‘శబ్ద గుణక మాకాశం’. వేదాంత పరంగా, ఈ సృష్టి అంతా ఓంకార నాదం నుండి వ్యక్తమైంది. కాలం వేగంగా పరిగెడుతూ చేసే ఈ 'విననాదం', సృష్టిలోని చైతన్య శక్తిని (Prana Shakti) సూచిస్తుంది.


Conclusion:

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మంత్రం కాలం యొక్క భీకరమైన వేగాన్ని, క్రమశిక్షణను వర్ణిస్తుంది.

అద్వైత కోణంలో:

మారుతున్న నిమిషాలు, ఘడియలు, హోరలు, అహోరాత్రములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అన్నీ కాల స్వరూపాలు. కానీ వీటన్నింటికీ ఆధారం, కాలానికి కూడా కాలమైన (కాలాకాలాయ), మార్పు లేని ఆ పరమాత్మ ఒక్కడే.

25, ఏప్రిల్ 2026, శనివారం

పంచాంగం