11, మే 2026, సోమవారం

వైశాఖ పురాణం

 *🐚సోమవారం 11 మే 2026🐚*


 _*🚩వైశాఖ పురాణం🚩*_          

      *24వ అధ్యాయము*


           *వాయుశాపము*


అంబరీషునితో నారదుడీవిధముగ వైశాఖ మహాత్మ్యమును వివరించెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తికి శంఖవ్యాధుల సంవాదమును వివరించుచు నిట్లనెను.```


శంఖముని మాటలను విని కిరాతుడిట్లనెను. స్వామీ ! విష్ణువునుద్దేశించి చేయుధర్మములు పూజలు , ప్రశస్తములు వానిలో వైశాఖమాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. బ్రహ్మజ్ఞానీ ! ఆ విష్ణువెట్టివాడు. వాని లక్షణమేమి ? వానిని చెప్పు ప్రమాణమేది ? వానిని తెలిసికొనుటయెట్లు ? వానికి చెందిన ధర్మములేవి ? వీనిచేనతడు సంతోషించును ? నీ సేవకుడనగు నాకీ విషయములను దయయుంచి చెప్పగోరును అని శంఖమహాముని సవినయముగ నడిగెను.


శంఖుడును కిరాతుడా ! వినుము చెప్పెదను. శ్రీమహావిష్ణువు రూపము పాపరహితము. ఆలోచనకు అందనిది. బ్రహ్మమొదలగు దేవతలు మహాత్ములగు మునులను తెలిసికొనజాలనిది. శ్రీమహావిష్ణువు శక్తి గుణములు సర్వధా సంపూర్ణములు నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. గుణరహితుడు నిష్కలుడు , అనంతుడు , సచ్చిదానందరూపుడు. చరాచరస్వరూపము సాటిలేనిది. దీనికి అధిపతి ఆశ్రయము. శ్రీమహావిష్ణువు. ఇవన్నియు పోయినను శ్రీహరి స్థానముపోదు ఆయన నిత్యుడు. ఉత్పత్తి స్థితి , సంహారము , వీని ఆవృత్తి , ప్రకాశము , బంధమోక్షములు , వీని ప్రవృత్తులన్నియు , నివృత్తులును , పరమాత్మవలననే జరుగును. ఇదియే పరబ్రహ్మ లక్షణము. ఇతడే పరబ్రహ్మయని జ్ఞానులయభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మయని చెప్పుదురు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగు వారిలోని బ్రహ్మపదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మపదమునకు వాచ్యులెట్లగుదురు ? కారు. జన్మాద్యస్యయతః అను సూత్రము వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడ నిర్ణయించినది. శాస్త్రములు , వేదములు , స్మృతులు , పురాణములు , ఇతిహాసములు , పంచపాత్రాది ఆగమములు , భారతము మున్నగు వానిచేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలిసికొన వీలగును మరి వేరువిధములచే తెలిసికొనజాలము. కావున వేదాదుల నెరుగనివారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణు నెరుగజాలరు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడునగు శ్రీహరిని ఇంద్రియాదులచేత అనుమానాది తర్కముల చేతను తెలిసికొనశక్యము కాదు. ఇతని యవతారములను కర్మలను తమ బుద్దికొలదిగ దెలిసి కొని సర్వజీవములు ఆయన యధీనవృత్తులై ముక్తిని పొందుచున్నవి. శ్రీహరి మహిమను క్రమక్రమముగ నెరుగవలయును. ఇతడు సర్వశక్తిసంపన్నుడు. దేవతలు , ఋషులు , పితృదేవతలు మున్నగు వారు ఒకొక్క విధమైన శక్తినే కలిగియున్నారు.


బలము , జ్ఞానము , సుఖము మున్నగునవి యుండుటచే , ప్రత్యక్ష , ఆగమ , అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని యెరుగవలయును. అట్టి మనుష్యుని కంటె జ్ఞానాదులుండుటవలన రాజు వందరెట్లు గొప్పవాడు. అట్టి రాజుకంటె మనుష్య గంధర్వులు నూరురెట్లు గొప్పవారు. తత్త్వాభిమానులగు దేవతలను మనుష్య గంధర్వులకంటె నూరురెట్లు గొప్పవారిని యెరుగుము. అట్టిదేవతలకంటె సప్తర్షులు గొప్పవారు , సప్తర్షులకంటె అగ్ని , అగ్నికంటె సూర్యుడు , సూర్యునికంటె గురువు , గురువుకంటె ప్రాణము , ప్రాణము కంటె ఇంద్రుడు మిక్కిలి గొప్పవారు బలవంతులు.


ఇంద్రునికంటె గిరిజాదేవి , ఆమెకంటె జగద్గురువగు శివుడు , శివునికంటె మహాదేవియగు బుద్ది , బుద్దికంటె మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణముకంటె గొప్పదిలేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణము నుండియే ప్రాణాత్మకమగు విశ్వమన్నది పుట్టినది. సర్వము ప్రాణమునందే కూడియున్నది. ప్రాణమువలననే సర్వము కదలుచున్నది. నల్లని మబ్బువలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుచున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీమహావిష్ణువుకంటె గొప్పది సమానమైనది యేదియును లేదు అని శంఖుడు వివరించుచుండగా కిరాతుడు స్వామీ ! ప్రాణము అన్నిటికంటె గొప్పదో , ప్రాణముకంటె విష్ణువు గొప్పవాడో వివరింపుమని శంఖమునిని ప్రార్థించెను.


అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో నిట్లనెను. దేవతలారా ! నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగ / రాజుగ నియమించుచున్నాను. మరిమీలో గొప్పవారెవరెవరో చెప్పిన వానిని యువరాజుగ చేయుదును. అతడు శీలము , శౌర్యము , ఔదార్యము మున్నగు గుణములను కలిగి యుండవలెను అని శ్రీహరి పలుకగ ఇంద్రాదులు నేను గొప్పయనగ నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. కొందరు సూర్యుడు గొప్పవాడనిరి , ఇంద్రుడు గొప్పయని కొందరనిరి. కొందరేమియుఅనక మౌనముగ నుండిరి. ఇంద్రాది దేవతలు యువరాజు పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడకు పోయి ఆయననే అడిగిరి.


అప్పుడు శ్రీహరి నవ్వుచు *"విరాట్ పురుషుడు సృజించిన యీ స్థూలదేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలమంది దేవతలు అంశరూపముననుండిరి. ఏ దేవుడు ఏ దేవుని అంశ ఈ శరీరమునుండి బయటకు వచ్చిన ఈ దేహము పడిపోవునో ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే బ్రహ్మ తరువాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరును అంగీకరించిరి.


స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలకి వచ్చెను. అప్పుడా శరీరము నడువలేక యుండెను. కాని వినుట , చూచుట మున్నగు సర్వకార్యములను చేయుచుండెను. అప్పుడా దేహినికుంటివాడనిరి. స్థూలదేహము గుహ్యవయవమునుండి దక్షుడను ప్రజాపతి ఈవలకు వచ్చెనను శరీరము పడిపోలేదు. వినుచు , చూచుచు , పలుకుచు గాలిని పీల్చుచునుండెను తరువాత హస్తప్రదేశమునుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. అప్పుడా దేహిని హస్తహీనుడనిరి. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగువానిని చేయుచునే యుండును. తరువాత కన్నులనుండి సూర్యుడు వెలుపలికి వచ్చెను. చూపులేకపోయెను కాని ఆ శరీరము వినుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము ముక్కునుండి అశ్వినీ దేవతలు వెలుపలికి వచ్చిరి. వాసన చూడలేక పోయెను గాని వినుట మున్నగువానిని శరీరము చేయుచునే యుండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలికి వచ్చినవి. అప్పుడా దేహికి వినికిడిశక్తి లేకపోయెను. చెవిటి వాడనియనిరి. చూచుట మున్నగు పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరణుడు వెలుపలికి వచ్చెను. దేహికి రుచి తెలియకుండెను. వినుటమున్నగు వానిని చేయుచుండెను. శరీరము పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతియగు అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాటలేకపోవుటచే మూగవాడయ్యెను. చూచుట మున్నగు వానిని చేయుచునే యుండెను. జ్ఞాన స్వరూపుడగు రుద్రుడు శరీరము నుండి వెలుపలికి వచ్చెను. శరీరికి జ్ఞానములేదుగాని వినుట మున్నగునవి యుండెను. తరువాత ప్రాణము , వాయువు వెలుపలికి వచ్చెను. అప్పుడా శరీరము , కన్నులు , చెవులు , మాట మున్నగునవి పనిచేయుచున్నను నిశ్చేష్టమై పడిపోయెను. దీనిని చూచి దేవతలందరును ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనెను. ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును యే దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజని పలికెను.


శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించెను. కాని శరీరము లేవలేదు. దక్షుడగు గుహ్యమును ప్రవేశించెను. శరీరము లేవలేదు. ఇంద్రుడు హస్తములను ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నులలో ప్రవేసించినను ఆ కళేబరము కదలలేదు. దిక్కులు చేవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్నిప్రవేశించినను ఆ కళేబరమునుండి మాటరాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా నా శరీరము లేచెను. అప్పుడు బలము , జ్ఞానము , ధైర్యము , వైరాగ్యము బ్రతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగ దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమని యనిరి.


ఈ ప్రాణము తన అంశలచేత పూర్ణభాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమైయుండెను. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమగు ప్రాణియు నీ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ది లేదు. ప్రాణము లేనిదేదియని ఉండుటలేదు. కావున ప్రాణము సర్వజీవములకంటె అధికము. దానిని మించిన బలాఢ్యమైనది యేదియును లేదు. ప్రాణముకంటె గొప్పవారు సమానులు యెవరును ఉన్నట్లుగ నెవరును చెప్పలేదు , చూడలేదు. ప్రాణదేవుడొక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమమని ప్రాణోపాసన పరులనుచున్నారు. సర్వసృష్టికి వినాశమునకు స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలెవరును ప్రాణమును తిరస్కరింపలేరు.


ప్రాణదేవత సర్వదేవాత్మకము , సర్వదేవమయము నిత్యము శ్రీహరిని అనుసరించియుండును. శ్రీహరివశమున నుండును. ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినదు చూడడు. రుద్రుడు , ఇంద్రుడు మున్నగువారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. ప్రాణదైవము మాత్రము శ్రీహరికెప్పుడును వ్యతిరేకమును చేయుదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీమహావిష్ణువు మహిమను లక్షణమును తెలిసినజీవి పూర్వకర్మవశమున సిద్దమైన స్థూలము తన శరీరముపై నున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము. వినాశవహితమునగు శ్రీహరి పదమును చేరుచున్నాడు.


అప్పుడు శంఖమహాముని వివరించెను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరల శంఖుని యట్లడిగెను. స్వామీ ! బ్రహ్మజ్ఞానీ ! మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడునగు ప్రాణము యొక్క మహిమ లోకమున నెందులకు ప్రసిద్దము కాలేదు ? దేవతలు , మునులు , మహాత్ములు మున్నగువారి మహిమ లోకమున పురాణాదులయందు వినబడుచున్నది. కాని ప్రాణమహాపురుషుని మహిమ యెందులకు ప్రఖ్యాతము కాలేదు అని ప్రశ్నించెను.


అప్పుడు శంఖమహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణమహాపురుషుడు. సర్వోత్తముడగు శ్రీహరిని అశ్వమేధయాగముల చేసి సేవింపదలచి గంగాతీరమునకు బోయెను. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్దిచేసి యాగశాలలను నిర్మింపదలచెను. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసికొను కణ్వమహామునికి నాగలి తగులుటచే తపోభంగమై కోపించెను. పుట్టనుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకు విఘ్నము నాచరించిన ప్రాణపురుషుని జూచి ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నము నాచరించితివి గాన నీకు ముల్లోకములయందును. ప్రఖ్యాతియుండదు. భూలోకమున మరింతగా ప్రఖ్యాతి యుండదని శపించెను. శ్రీహరి యవతారములు ప్రసిద్దములగును గాని నీవు మాత్రము ప్రసిద్దుడవు కావని యనెను.


ప్రాణమహాపురుషుడును కోపించి దోషము లేని నన్ను తప్పుచేయకుండనున్న వానిని ఇట్లు శపించితివి కావున కణ్వమునీ ! నీవు గురుద్రోహివి కమ్మని శపించెను. నీ ప్రవృత్తి నందరును నిందింతురని యనెను. కణ్వముని శాపము వలన ప్రాణమహాపురుషుడు భూలోకమున ప్రసిద్దుడు కాలేదు. కణ్వుని ప్రాణశాపము ననుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యెను. కిరాతా ! నీవడిగిన వానినన్నిటిని చెప్పితిని. ఇంకను అడుగవలసినది యున్నచో నడుగమని శంఖుడు పలికెను. అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు వివరించెను.```


_*వైశాఖ పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_ 


        🌷 *సేకరణ*🌷

      🌹🌷🕉️🕉️🌷🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏

జబ్బును కూడా

  ఒక్క జబ్బు కెళితె నొక్కటే వందయ్యి

ఆంగ్ల మందు జనుల యంతు జూచు

కాన రారు నిజము కష్టాల పాలైన

సకురు అప్ప రావు సత్య మిదిర!


భావం: ఒక చిన్న జబ్బును కూడా సక్రమంగా నయం చేయగలిగే మందులు ఇంగ్లీషు వైద్యంలో లేకపోవడం చేత తాత్కాలికంగా ఉపశమనాన్నిచ్చే పెయిన్ కిల్లర్లూ, విటమిన్లూ, ఏంటీ బయోటిక్, ఏస్ప్రిన్లూ, ఆయింట్ మెంట్లూ,నిద్ర మాత్రలూ, ఏంటీ ఎలర్జెటిక్ లూ లాంటి మందులతో కాలం గడుపుతూ క్రమంగా వ్యాధిని అంతర్గతంగా ముదరబెట్టి, నివారణ చేయలేనంత తరువాతి దశకు దానిని తీసుకు వెళ్తారు! ఈలోపు ఆ ఏంటీ బయోటిక్ లేదా పెయిన్ కిల్లర్ లోని కెమికల్ రియాక్షన్ కు లివర్, కిడ్నీ పాడయ్యి, షుగర్, బి. పి, కిడ్నీ డయాలసిస్ బాధితులు గానూ, రక్త కణాలూ, జీర్ణాశయం, రక్త నాళాలు పాడయ్యి, కేన్సర్ రోగులు గానూ మారుతారు! ఆ తర్వాత వాటికి చేసే విచ్చలవిడి పిచ్చి వైద్యంతో అవయవాలూ, ఆస్తులూ పూర్తిగా నాశనమై, అద్దాల మేడల్లోని యంత్రాల సాక్షిగా వాటి మధ్యే ఆవిరైపోతాడు! ఈ టెక్నాలజీ పిచ్చిలో చచ్చి కాటికెళ్తున్నా ఈ వాస్తవాన్ని గుర్తించడానికి ఇష్టపడరు! రసాయనాలూ, యంత్రాలూ వైద్యానికి ఉపయోగిస్తే "అమృతం పుట్టదు, హాలాహలమే పుడుతుంది"! ఇప్పటికైనా అర్థం చేసుకొని, ఈ అతితెలివి టెక్నాలజీని వదిలించుకొని, శరీరం లోని ఆటో ఇమ్యూన్ మెకానిజంను ప్రేరేపించి, వ్యాధి నివారణ సహజంగా, సంపూర్ణంగా చేయగలిగే హోమియో, యోగా, ధ్యానం, ఆయుర్వేదం, గృహవైద్యం లాంటి విధానాలకు వెళ్ళటం శ్రేయస్కరం! 

సకురు అప్పారావు చెప్పేది నిజం! 

ఈ ఆటవెలది పద్యాల శతక కవి: హోమియో వైద్యులు సకురు అప్పారావు గారు, 9848025870

(ఎంతటి కఠినమైన, అసాధ్యమైన వ్యాధులకైనా దేశంలో ఎంతటి మారుమూల గ్రామంలో ఉన్న వారికైనా, ఇంటి వద్దకే మందులు పంపుతూ, అనునిత్యం ఫోన్ ద్వారా టచ్ లో ఉంటూ, క్షణక్షణం సూచనలిస్తూ, అనేక మంది వ్యాధులను నివారణ చేస్తున్నవారు! అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికి ఎటువంటి ఎమర్జెన్సీ మరియు ప్రాణాపాయ ఆపద కలిగినా, ఎవరికి వారే వైద్యం చేసుకుని, ఇంటిలోని అందరినీ కాపాడుకోగలిగే సర్వరోగ నివారిణి లాంటి అమృతాన్ని కనిపెట్టి, "సకురు అప్పారావు గారి 1,2,3 ఫార్ములా ఫామిలీ కిట్" అనే పేరుతో ప్రజలకు అందిస్తున్నవారు!)

11-05-2026 సోమవారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

11-05-2026 సోమవారం రాశి ఫలితాలు


మేషం


కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంభందిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.  

---------------------------------------


వృషభం


ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నపటికీ సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. వృధా ఖర్చుల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

---------------------------------------


మిధునం


ధన వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు కలుగుతాయి. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందక ఇబ్బంది పడతారు. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించవు. దూర ప్రయాణాలు కలసిరావు.

---------------------------------------


కర్కాటకం


గృహమున సంతోషంగా గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. ఖర్చులకు మించి ఆదాయం ఉంటుంది. సంఘంలో ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. 

---------------------------------------


సింహం


ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్ధిరాస్తి వివాదాల పరిష్కారానికి చేసే ప్రయత్నాలు కలసివస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. శత్రువులు కుడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు.

---------------------------------------


కన్య


దీర్ఘకాలిక ఋణాలు కొంత వరకు తీర్చగలుగుతారు. నిరుద్యోగులు ఉద్యోగమున అంచనాలు అందుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయటపడతారు. వృత్తి ఉద్యోగాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెడతారు.

---------------------------------------


తుల


కొన్ని వ్యవహారాలలో సన్నిహితులు మీ మాటతో విభేదిస్తారు. పని ఒత్తిడి అధికమై మానసిక ఆందోళనలు పెరుగుతాయి. వాహన ప్రయాణ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో శత్రు సమస్యలు పెరుగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగమున శ్రమాధిక్యత పెరుగుతుంది.

---------------------------------------


వృశ్చికం


చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపార వ్యవహారాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. ఉద్యోగమున అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృథా వ్యాపారాలలో మీ కృషికి తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 

---------------------------------------


ధనస్సు


ఇతరులతో కొన్ని విషయాలలో విభేదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచెయ్యక వాయిదా వేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఆర్ధికంగా స్వల్ప నష్టాలు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులుంటాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి.

---------------------------------------


మకరం


ముఖ్యమైన వ్యవహారములలో అప్రయత్న విజయం సాధిస్తారు. దాయాదులతో భూ సంభందిత వివాదాలు నుండి బయటపడతారు. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. గృహమున పెద్దల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగమున జీత భత్యాల విషయంలో శుభవార్త అందుకుంటారు. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.

---------------------------------------


కుంభం


వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం ఆశించినంత లభించదు. ఇంటా బయట ఊహించని ఖర్చులు ఎదురవుతాయి. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఉద్యోగమున కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.

---------------------------------------


మీనం

 

అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణాలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన విద్యా విషయాల పట్ల శ్రద్ద వహించాలి. ఉద్యోగమున మీ పని తీరుతో అందరిని ఆకట్టుకుంటారు.

---------------------------------------

మనసు మాత్రం

 చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్. సమయం ఉదయం మూడు గంటలు. అక్కడ ప్రయాణీకులంతా నిద్రలో ఉన్నారు. డెబ్భై ఎనిమిదేళ్ళ వృద్ధుడు. తెల్లటి ధోవతి, చొక్కాతో కూర్చున్నాడు. చేతిలో ఒక వెదురు బుట్ట. అందులో వేడి వేడి ఇడ్లీ ఉన్నాయి. ఆయన, 

"పేదరాశి పెద్దమ్మ page"

“ఇడ్లీ… వేడి ఇడ్లీ… ఒక రూపాయి… ఒక్క రూపాయి మాత్రమే…” అని పిలుస్తున్నాడు. కానీ, ఎవరూ కొనలేదు. ఇది 2026 సంవత్సరం. ఒక రూపాయికి చాక్లెట్ కూడా రాదు… ఇడ్లీలా? చాలామంది నవ్వుతూ అతన్ని పిచ్చివాడని అనుకున్నారు. నా పేరు అరవింద్. నేను ఒక ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. నైట్ షిఫ్ట్ ముగించుకుని ఇంటికి వెళ్తున్నాను. ఆకలిగా ఉంది. కానీ స్టేషన్ స్టాళ్లలో ఇడ్లీ ప్లేట్ ₹50. ఆ వృద్ధుడిని గమనించాను. బుట్టలో దాదాపు 100 ఇడ్లీలు ఉన్నాయి. ఒక్క కస్టమర్ కూడా లేడు. ఆయన కళ్లలో తేమ కనిపించింది. నేను దగ్గరకు వెళ్లి అడిగాను: “తాతయ్య… ఒక రూపాయికి ఇడ్లీ అమ్మితే నష్టమవదా?” ఆయన చిరునవ్వు నవ్వాడు. “బాబూ… ఇది నష్టం కాదు. లాభం.” “ఎలా తాతయ్య? బియ్యం ధర, గ్యాస్ ధర… ఒక్క ఇడ్లీకి కనీసం ₹5 ఖర్చవుతుంది కదా!” ఆయన బుట్ట మూసి నెమ్మదిగా చెప్పడం ప్రారంభించాడు… “1975 సంవత్సరం. అప్పటికి నాకు 25 ఏళ్లు. రైల్వే పోర్టర్‌గా పనిచేసేవాడిని. నెల జీతం ₹100. ఒక రోజు భారీ వర్షం. పని లేదు. డబ్బు లేదు. మూడు రోజులు ఆకలితో ఉన్నాను. స్టేషన్ బెంచ్ మీదే మూర్చపోయాను.” “అప్పుడు ఒక అమ్మ వచ్చింది. ఆమె ప్లాట్‌ఫాంపై ఇడ్లీలు అమ్మేది. ఒక్క రూపాయికి. నన్ను లేపి నీళ్లు చల్లి 4 ఇడ్లీలు పెట్టింది. డబ్బు అడగలేదు.” “నేను ఏడుస్తూ… ‘నా దగ్గర డబ్బు లేదు’ అన్నాను. అప్పుడు ఆమె చెప్పింది — ‘బాబూ… నేను కూడా ఒకప్పుడు ఆకలితో ఉన్నాను. అప్పుడు ఎవరో నాకు భోజనం పెట్టారు. అప్పుడే నేను ఒక మాట ఇచ్చుకున్నాను — నేను బ్రతికినంతకాలం ఆకలితో ఉన్నవారికి ఒక రూపాయికి ఇడ్లీ ఇస్తాను. నువ్వూ పెద్దవాడైన తర్వాత ఆకలితో ఉన్నవారికి సహాయం చేయాలి.’” వృద్ధుడి కళ్లలో నీళ్లు మెరిశాయి. “ఆమె 1995లో చనిపోయింది. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని అడిగింది — ‘నా మాట నిలబెడతావా?’ నేను ‘అవును’ అన్నాను.” “ఆ తర్వాత నేను రైల్వే కాంట్రాక్టులు తీసుకున్నాను. బాగా సంపాదించాను. మూడు ఇళ్లు. ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో ఉన్నారు. కానీ 1995 నుంచి ఈరోజు వరకు… ప్రతి ఉదయం 3 గంటలకు… 100 ఇడ్లీలు… ఒక రూపాయి… ఈ స్టేషన్‌లోనే.” నా శరీరమంతా గగుర్పొడిచింది. “తాతయ్య… రోజుకి ₹400 నష్టం. నెలకి ₹12,000. సంవత్సరానికి ₹1.5 లక్షలు. 30 సంవత్సరాలకు ₹45 లక్షలు!” ఆయన చిరునవ్వుతో అన్నాడు: “డబ్బు ప్రకారం చూస్తే నష్టం. కానీ మనసు ప్రకారం చూస్తే లాభం. ఈ 30 ఏళ్లలో ఎంతమందికి తినిపించానో తెలుసా? 10 లక్షల ఇడ్లీలు… 10 లక్షల కడుపులు… 10 లక్షల ఆశీర్వాదాలు… వాటి విలువ ఎన్ని కోట్లుంటుంది బాబూ?” అంతలో ఒక చిన్న బాలుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. చిరిగిన చొక్కా. వయస్సు 12 సంవత్సరాలు. “తాతయ్య… ఇడ్లీ… మూడు రోజులుగా తినలేదు. అమ్మ ఆసుపత్రిలో ఉంది. డబ్బు లేదు.” వృద్ధుడు ఒక ఆకు మీద 4 ఇడ్లీలు పెట్టి చట్నీ వేశాడు. “నెమ్మదిగా తిను బాబూ.” ఆ బాలుడు తింటూ ఏడ్చాడు. “రేపు డబ్బు ఇస్తాను…” “అవసరం లేదు. నువ్వు పెద్దవాడైన తర్వాత ఇంకొక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టు. అదే చెల్లింపు.” ఆ బాలుడు ఆయన కాళ్లకు పడిపోయాడు. “నేను కూడా మాట ఇస్తున్నాను తాతయ్య. నేను కూడా ఒక రూపాయికి ఇడ్లీ అమ్ముతాను.” నేను వెంటనే ₹1000 తీసి ఇచ్చాను. “తాతయ్య… దయచేసి ఈ ఇడ్లీల్లన్నీ నాకు ఇవ్వండి.” ఆయన నవ్వి అన్నాడు: “ఇవి ఒకరికే అమ్మడానికి కాదు బాబూ… ఆకలితో ఉన్నవారికోసం. నీకు ఆకలి అయితే ఒక ఇడ్లీ తీసుకో. ఒక రూపాయి వేయి. చాలు.” నేను ₹1 పెట్టి ఒక ఇడ్లీ తీసుకున్నాను. నా జీవితంలో అంత రుచిగా అనిపించిన భోజనం మరొకటి లేదు. కన్నీళ్లతో తిన్నాను. “తాతయ్య… ఒకటి అడగనా?” “అడుగు బాబూ.” “మీ పిల్లలు ఇది డబ్బు వృథా అంటారా?” ఆయన ఫోన్ తీసి వీడియో కాల్ చేశాడు. అమెరికాలో ఉన్న తన కొడుకు ఫోన్ ఎత్తాడు. “అప్పా, ఇడ్లీలు అమ్మేశారా? ఆరోగ్యం ఎలా ఉంది?” “బాగున్నాను. ఈరోజు ఒక యువకుడు నా కథ విన్నాడు.” ఆయన కొడుకు నన్ను చూసి నవ్వాడు. “సర్, మా నాన్నను చూసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రతి నెలా మేము ₹50,000 పంపిస్తాం — ఇడ్లీల కోసం. అది ఆయన కోరిక. అదే మా ఆశీర్వాదం. ఆయన ఇచ్చిన మాట… ఇప్పుడు మా మాట.” వృద్ధుడు కాల్ ముగించి అన్నాడు: “చూశావా బాబూ? నా పిల్లలు కూడా ఈ వ్రతాన్ని కొనసాగిస్తున్నారు. నేను చనిపోయినా ఈ బుట్ట ఆగదు. ఒక రూపాయి ఇడ్లీ ఆగదు.” ఈరోజు 2026. ఆ వృద్ధుడు ఇక లేరు. గత సంవత్సరం 79 ఏళ్ల వయసులో చనిపోయారు. చనిపోయే ముందు నా చెయ్యి పట్టుకుని చెప్పారు: “బాబూ… ఈ బుట్టను చూసుకో. మాట నిలబెట్టు.” ఇప్పుడు ప్రతి ఉదయం 3 గంటలకు… అదే చెన్నై సెంట్రల్ స్టేషన్‌లో… అదే బెంచ్ దగ్గర… నేను ఉంటాను. బుట్ట నిండా ఇడ్లీలు. ఒక్క రూపాయి. నేను నా ఐటీ ఉద్యోగం వదల్లేదు. కానీ ప్రతి ఉదయం 2 గంటలు… ఇడ్లీల కోసం కేటాయిస్తున్నాను. మా కంపెనీలో 200 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ నెలకు ₹100 ఇస్తున్నారు. “వన్ రూపీ ఇడ్లీ ట్రస్ట్.” ఆ 12 ఏళ్ల బాలుడు — గణేష్ — ఇప్పుడు ఇంటర్ చదువుతున్నాడు. సాయంత్రం వచ్చి సహాయం చేస్తాడు. “అన్నా… నేనూ మాట ఇచ్చాను. పెద్దవాడైన తర్వాత నేనూ ఇదే చేస్తాను.” --- స్నేహితులారా… డబ్బు సంపాదించడం గొప్ప కాదు. ఆ డబ్బుతో పుణ్యం సంపాదించడం గొప్ప. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒక చిన్న పొదుపు డబ్బా పెట్టండి. “₹1 డబ్బా.” ప్రతి రోజు ₹1 వేయమని చెప్పండి. నెలకి ₹30 అవుతుంది. ఆ డబ్బుతో ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. ఎందుకంటే… మీకు ₹30 ఒక చిన్న ఖర్చు మాత్రమే కావచ్చు… కానీ ఇంకొకరికి అది 30 రోజుల ఆశ కావచ్చు. --- ఒక మాట ఇచ్చుకుందాం: కనీసం ఒక ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి. డబ్బు పోతుంది… పుణ్యం మిగులుతుంది… బుట్ట ఖాళీ కావచ్చు… కానీ మనసు మాత్రం నిండిపోతుంది… 🙏


వాట్సప్ సేకరణ

10, మే 2026, ఆదివారం

అద్భుతమైన కథ..!! ❤️

L

                         

 *ఒక అద్భుతమైన  కథ..!! ❤️*


రాత్రి 11 గంటలకు.  తాళం వేసిఉన్న ఇనుప ద్వారం  బయట నుండి ఒక పిలుపు.  ఎవరా అని వచ్చి చూశాను.  గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు.  చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన  బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి  ఉన్నారు.  అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు.  "అవును నేనే ఆనంద్.  ఇదే చిరునామా.  మీరూ ..." అని అడిగాను.  అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో  తడుపుకుంటూ "బాబూ!  నేను మీ నాన్నగారి మిత్రుడిని.  మీ ఊరినుండే వస్తున్నాను...!


నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు..!


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను.  అందులో "ప్రియమైన ఆనంద్!  నీకు నా ఆశీర్వాదములు.  ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు.  పేరు రామయ్య.  చాలా కష్టజీవి.  కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్  లో చనిపోయాడు...!


  నష్టపరిహారం  కోసం తిరుగుతున్నాడు.  అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది.  ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి  నీకు పంపాను.  డబ్బులు Head Office  లో తీసుకోమన్నారు...!


  ఆయనకు హైదరాబాద్  కొత్త.  ఏమి తెలియదు.  నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను.  ఆరోగ్యం జాగ్రత్త.  కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది..! 


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు.  ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను.  మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను.  "లేదు బాబూ.  ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని  చెప్పారు..!


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను.  "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను...!


 నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు.  నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు..!


 అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది.  కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు.  సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది.  నా కళ్ళలో నీళ్లు తిరిగాయి..!


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు.  అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు.  ఇతడు మాత్రమే మాకు మిగిలాడు.  పేరు మహేష్.  కష్టపడి చదివించాను.  బాగా చదువుకుని  ఉద్యోగం సంపాదించుకున్నాడు.  మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు.  ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది...!


 అక్కడికక్కడే చనిపోయాడు.  నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము.  కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది..!


  నా భార్య ఆరోగ్యం బాగా  లేదు.  మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను.  నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన..! 


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు.. 


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము..!


  దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము.  "ఆనంద్!  ఇక నేను చూసుకుంటాను.  నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన.  "పర్లేదండి.  నేను లీవ్ పెట్టాను" అన్నాను.  దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను...!


 చాలా థాంక్స్ బాబూ!  నేను ఊరికి బయల్దేరుతాను.  మా ఆవిడ ఒక్కతే  ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు.  "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను..!


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ!  నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు.  ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి.  కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు..! 


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ.  నా పేరు అరవింద్.  మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు.  ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి...!


  మీరేమో  అలసిపోయి ఉన్నారు.  అందుకే నేను నిజం చెప్పలేదు.  మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను.  ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట.  ఆ మిత్రుడికి విషయం చెప్పాను...!


అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు.  మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది.   కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది..!


  నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను.  బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.  "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు.  ఆ మాటే చాలనుకున్నాను నేను.  పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు.  ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు..!


ఆకాశంలోకి చూశాను.  అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న.  "నాన్నా!  నా అభివృద్ధి  చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు!  ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా?  మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా!  మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను..!


సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు..!

మిగిలినవన్నీ దానికి తోడుగా నిలబడతాయి..!!


ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి....😔

*శ్రీ మహావిష్ణు పురాణం

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*ఆదివారం 10 మే 2026*


       *శ్రీ మహావిష్ణు పురాణం*

               *84 వ భాగం*


        *శ్రీరామావతారం-5*


సీతారామ కళ్యాణం:```

అయోధ్యలో దశరథుడు జనక మహారాజు దూత తెచ్చిన సందేశం “విశ్వామిత్ర మహర్షి ఆదేశంతో శ్రీరాముడు సీతాదేవి స్వయంవరంలో  శివధనుర్భంగం గావించి సీతాదేవి చేత వరింపబడ్డాడు” విని ఆనందపడ్డాడు.  కౌసల్య సుమిత్ర కైకేయిలకు చెప్పాడు. వారందరి ఆనందానికి అవధులు లేవు.


శుభ దినాన దశరథుడు కులగురువు వసిష్ట మహర్షి, భరత శత్రుఘ్నలు, బంధు మిత్రులు, ముఖ్య ప్రజలతో కలసి సీతరామ కళ్యాణం కోసం మిథిలానగరానికి బయలుదేరి వెళ్లారు.


జనకుడు తన బంధు మిత్ర పరివార జనంతో మిథిలానగర ముఖ ద్వారం వద్ద దశరథునికి, వచ్చిన అతిథులకి స్వాగతం పలికి  విడిది ఏర్పాట్లు చేసాడు.   విడిదిలో దశరథుడు వసిష్టునితో కలసి జనకునితో వివాహ లగ్నం గురించి చర్చిస్తున్నప్పుడు, జనకునికి మరో కుమార్తె ఊర్మిళ, జనక సోదరుడు- కుశధ్వజునికి మాండవి, శ్రుతకీర్తి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారని తెలిసింది.  వారిని పిలిపించి దశరథుడు చూసాడు. తన కుమారులు భరత లక్ష్మణ శత్రుఘ్నలకు తగిన వధువులు అనిపించింది.


నలుగురి కుమారుల వివాహం ఒకేసారి చేయాలని తలచి జనకునితో మనస్సు లోని విషయం ప్రస్తావించాడు. జనకుని ఆనందానికి హద్దులేదు. కుశధ్వజుడు కూడా అంగీకరించాడు.   కులగురువు వసిష్టుడు, జనకుని పురోహితుడు శతానందుడు జాతకాలు పరిశీలించి భరతునికి మాండవితో, లక్ష్మణునికి ఊర్మిళతో, శత్రుఘ్నునికి శుత్రకీర్తితో వివాహం చేయవచ్చని తెలిపారు.


దశరథుడు, జనకుడు వెంటనే భరతుడు మాండవికి, లక్ష్మణుడు ఊర్మిళకు, శత్రుఘ్నడు  శుత్రకీర్తిలకు పెళ్ళి చూపులు ఏర్పాటు చేసి అభిప్రాయం అడిగారు.   

ఒకరికొకరు నచ్చి పెళ్ళి చేసుకోవడానికి వారు ఆనందంగా అంగీకరించారు. 


నాలుగు వివాహాలు ఒకే ముహుర్తానికి ఒకే వేదిక పై జరిపించాలని సుముహూర్తం నిశ్చయించారు. చైత్ర శుద్ద నవమి శ్రీరామచంద్రుని జన్మదినం. సీతారాముల కల్యాణానికి అదే శుభముహుర్తం అని పురోహితులు నిర్ణయించారు. నలుగురి అన్నదమ్ముల వివాహానికి ఆ ముహుర్తం సరైనది అని భావించి వివాహ ఏర్పాట్లు చేయసాగారు.  జనకుడు మగపెళ్ళివారి అంతస్థుకు తగినట్టు విడిది మందిరాలు ఏర్పాటు చేసాడు. 


భూలోకంలో సకల దేశ రాజులను వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలు పంపారు. దేవలోక వాసులను పిలవడానికి నారద మహర్షి ఊర్ధ్వలోకాలకు వెళ్లాడు.  శ్రీ సీతరామ కళ్యాణం చూడటానికి దేవలోక భూలోక వాసులందరు ఆనందోత్సాహాలతో మిథిలకు తరలి రాసాగారు.


జనకుడు రంగ రంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు చేశాడు. ఆకాశమంత పందిరి, వేదిక నిర్మించారు. వచ్చిన అతిథిలందరికి సంతృప్తి చెందేలా భోజనం, వసతి కల్పించారు. సుముహూర్తం రోజు రానే వచ్చింది. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలను  పెళ్లికుమారులుగా దశరథుని విడిది భవనంలో, సీతా ఊర్మిళ మాండవీ శ్రుతకీర్తులను జనకుని రాజభవనంలో పెళ్ళికుమార్తెలుగా  మంగళ స్నానాలు, అలంకరణలు చేసి కళ్యాణ వేదిక వద్దకు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా నృత్య గానాలతో తీసుకువచ్చారు.


మిథిలానగర వాసులు భూమి పై, దేవ గంధర్వులు కిన్నెర కింపురుషులు ఆకాశం నుండి పెళ్లికుమారులు, పెళ్ళికుమార్తెల పై పూల వర్షం కురిపిస్తున్నారు. కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన వారిని వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, శతానందుడు వేద మంత్రాలు చదువుతూ వివాహ విధులు పూర్తి చేయించారు.


జనకుడు భార్య సునయనతో కలసి జానకిని, ఊర్మిళను శ్రీరామ లక్ష్మణులకు సాలంకృత కన్యాదానం చేశాడు. కుశధ్వజ దంపతులు మాండవీ శ్రుతకీర్తులను భరత శత్రుఘ్నలకు సాలంకృత కన్యాదానం చేసారు. తరువాత పురోహితులు వధూవరుల చేత సప్తపది, అగ్నిహోమం మొదలైన వివాహ విధులు నిర్వర్తింప చేశారు.


చూచినవారందరికి కన్నుల పండుగగా సీతారామ కళ్యాణం మహావైభవంగా జరిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవి, బ్రహ్మదేవుడు సరస్వతీదేవి, ఇంద్రుడు శచీదేవి మరియు ఇతర దేవతలు తమ పత్నులతో అదృశ్యంగా వచ్చి నూతన వధువరులను పూలు అక్షింతలు చల్లి ఆశీర్వదించారు. వసిష్ట విశ్వమిత్రాది మహర్షులు, అంగ వంగ కళింగ కాశీ తదితర రాజ్యాల రాజులు ఆశీస్సులు అభినందనలు తెలిపారు. కళ్యాణ మహోత్సవం తిలకించిన అతిథులందరు ఆనందంతో తమ తమ నివాస ప్రదేశాలకు తిరిగి వెళ్లారు.


మిథిలలో వివాహ తదనంతర విధులు పూర్తి చేసిన తర్వాత జనక దంపతులు, కుశధ్వజ దంపతులు తమ కుమార్తెలకు అప్పగింతలు జరిపి దశరథుడు, శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నల వెంట ఒక పక్క వివాహ ఆనందం మరొక పక్క కుమార్తెలు దూరం అవుతున్నారన్న దుఖంతో వీడ్కోలు పలికారు.


నూతన వధువరులను స్వాగతం పలకడానికి అయోధ్యను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రజల హర్షధ్వానాల మధ్య, మంగళవాయుద్యాలు మధురంగా మ్రోగుతుంటే  శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నలు తమ పత్నులు సీత ఊర్మిళ మాండవి శ్రుతకీర్తిలతో,  దశరథుడు వసిష్టాది మహర్షులు బంధు పరివారం వెంటరాగా అయోధ్యలోకి ప్రవేశించారు.


రాచవీధులలో ప్రజలు పుష్ప వర్షం కురిపిస్తుంటే రథాలపై ప్రజలకు నమస్కరిస్తూ నూతన దంపతులు రాజభవనం చేరారు. సింహద్వారం వద్ద కౌసల్యా సుమిత్ర కైకేయిలు తమ కుమారులకు, కోడళ్ళకు మంగళహారతులతో స్వాగతం పలికి గృహప్రవేశం చేయించారు.


ఆనాటి నుండి  రాజభవనంతో పాటు అయోధ్య అంతా నిత్య పండుగ వాతావరణం నెలకొంది. దశరథుడు ఆనందోత్సాహాలతో గడుపుతున్నాడు. కొంతకాలం తర్వాత కైకేయి తండ్రి అనారోగ్యం పాలై మనవడిని చూడాలని కోరిక కలిగి తన కుమారుడిని అయోధ్య పంపాడు. మేనమామ వెంట భరతునితో పాటు శత్రుఘ్నని దశరథుడు కేకయ రాజ్యానికి పంపాడు..


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

పంచాంగం

 


హోమియోపతి వైద్యం

 ఆన్లైన్లో హోమియోపతి వైద్యం

 కొరకు సంప్రదించండి


 దీర్ఘకాల రోగములకు చక్కటి చికిత్స కలదు 


తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం మరియు మలయాళం భాషలలో ఏ భాషలోనైనా డాక్టర్ గారితో మీరు మాట్లాడవచ్చు.


మీ సమస్యని తెలుపుకొని చికిత్స తీసుకోగలరు.


మందులు మీ ఇంటికి ఆన్లైన్లో కొరియర్ ద్వారా పంపించబడును.


వివరాలకు 9035231905 నెంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు . 


మీ పేరు,

వయస్సు, 

లింగము 

మీ చిరునామా

 మీ సమస్యను క్లుప్తంగా వివరించండి 


మీరు ఏ భాషలో డాక్టర్ గారి ని సంప్రదించదల్చారు పేర్కొనండి 


తరువాత డాక్టర్ గారే మీకు ఫోను చేసి మీతో మాట్లాడగలరు.

డాక్టర్ గారి ఫీజు మందుల ఖర్చులు అడిగి తెలుసుకోండి


డాక్టర్ సాయి అఖిల


 స్త్రీల రోగముల నిపుణురాలు

వాగర్థావివ సంపృక్తౌ

  


*వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే౹*

*జగతఃపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ॥*


అని కాళిదాసమహాకవి ఆదిదంపతులను ప్రార్థనచేశాడు. 


ఆ ఆదిదంపతులు ఎట్లా ఉంటారటంటే.....   వాక్కు అంటే పదము ఒక పదాన్ని అంటిపెట్టుకొని దాని అర్థం ఉంటుందో...  ఆ అర్థాన్ని పదం నుండి ఎలా విడదీయటం కుదరదో...  అర్థం నుండి పదాన్ని 

అదేవిధంగా ఎలా విడదీయటం కుదరదో... ఒకరికొకరు అవిభాజ్యంగా ఉంటారుట. అదే అర్థనారీశ్వరతత్త్వం. 


ఇది ఆదిదంపతుల విషయంలో చెప్పబడినా.... ప్రతి ఒక్క మానవదంపతులకు కూడా వర్తిస్తుంది. 


మీరన్నట్లు శరీరం భౌతికం అంటూ భౌతికతత్త్వంతో చూడకూడదు. మానవునిలో "చిత్" అనే పేరుకలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది అమ్మవారి/భగవంతుడి శక్తి. ఈ "చిచ్ఛక్తి" పురుషులలో హృదయంలో కుడివైపున ఉంటే స్త్రీలలో హృదయంలో ఎడమవైపున ఉంటుంది. 


ఈ రెండింటి కలయికతోనే సృష్టి పరిపూర్ణమౌతుంది. 



_అమ్మ ప్రేమ , నాన్న ఆధారం

 _మాతా గురుతరా భూమేః పితా స్వర్గస్య దుర్లభః ।_

_తయోః పూజా పరం తీర్థం త్రిషు లోకేషు విశ్రుతమ్ ॥_


తల్లి భూమికంటే గొప్పది. తండ్రి స్వర్గానికంటే దుర్లభుడు, మహోన్నతుడు. అట్టి తల్లిదండ్రులను సేవించడం, పూజించడం మూడు లోకాలలో ప్రసిద్ధమైన పరమ పవిత్ర తీర్థయాత్రతో సమానం. తల్లి ప్రేమకు హద్దులుండవు. తండ్రి త్యాగానికి కొలమానం ఉండదు. వీరిద్దరూ కలిసే జీవితం నిర్మాణకర్తలు. వారిని విడిగా చూసే కన్నా, ఒకటిగా పూజించడం భారతీయ సంస్కృతి నేర్పిన మహత్తర ధర్మం.


చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న విషయం ఒకటి గుర్తుకొచ్చింది 


_అమ్మ ప్రేమ అయితే, నాన్న ఆధారం._

_అమ్మ కరుణ అయితే, నాన్న కర్తవ్యం._


*మాతా పితరో నిత్యం పూజనీయౌ ప్రయత్నతః ।*

*తయోః ప్రసాదసిద్ధ్యర్థం సర్వం శ్రేయః ప్రవర్తతే ॥*


🙏🙏🙏🙏