16, మార్చి 2026, సోమవారం

అంబలి

 అంబలి యొక్క ఉపయోగాలు - 

      రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి 

              ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని , రుచిని కలిగిస్తుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వలన శక్తివంతంగా తయారవుతారు. ఇది చలువచేస్తుంది. అన్నహితాన్ని కలగజేస్తుంది.అలసటని పోగొడుతుంది. 

         రక్తపోటు , షుగర్ వ్యాధి ఉన్నవారికి , రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నవారికి , నీరసంతో క్షీణించిన వారికి , అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం .

         అంబలి అంటే ధాన్యపు పిండితో కాచిన జావ మొలకెత్తిన ధాన్యంతో జావకాస్తే జీవనీయ విలువలు మర్రిన్ని శరీరానికి అందుతాయి. ధాన్యాలలోకెల్లా రాగులు శ్రేష్టం . అందుకని రాగిఅంబలి గురించి మీకు తెలియజేస్తున్నాను. బియ్యపుపిండితో కూడా అంబలి చేసుకోవచ్చు . అది కెలోరీలు పెంచుతుంది . కొన్ని వ్యాధుల్లో అపకారం చేస్తుంది . 

       బలకరంగా , వీర్యపుష్టిని ఇచ్చేదిగా రాగి అంబలి మేలు చేస్తుంది ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగడం వలన శరీరదృడత్వం పెరుగుతుంది. స్థూలకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి ఉదయం రాగి అంబలి తాగడం శ్రేయస్కరం. 


మరిన్ని అనుభవపూర్వక, రహస్య ఆయుర్వేద ఔషధ యోగాలు గురించి మరింత వివరణాత్మక సమాచారం నా గ్రంధాల యందు వివరించాను. వాటిని క్షుణ్ణముగా చదవగలరు.


గమనిక ~


నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.

 నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

 ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు . 


            కాళహస్తి వేంకటేశ్వరరావు 

     అనువంశిక ఆయుర్వేద వైద్యులు 

                  9885030034

కామెంట్‌లు లేవు: