29, మార్చి 2026, ఆదివారం

अस्य अद्भुतस्य

 अस्य अद्भुतस्य जगतः सृष्टिकारकाः ये केऽपि स्युः, तेषां प्रति “पाहि पाहि पाहि” इति शतकोटि-साष्टाङ्ग-प्रणामाः।

आदित्यसहितान् अनेकान् ग्रहान् स्वस्वगतिषु स्थापयित्वा ऋतून् निर्माय, जीवचैतन्यस्य कारणभूतायै अस्यै अद्भुतायै सृष्टये ये कर्तारः, तेषां अभिनन्दनानि। अस्याः विचित्रायाः जीवसृष्टेः कारणभूतेभ्यः नमः।

यदा वयं मानवाः किञ्चित् नवीनं वस्तु निर्मामः अथवा किञ्चित् आविष्करोमः, तदा अस्मान् सहाययति मेधा। तादृशीं चराचरसृष्टेः मूलकारणभूतां यां मेधां धारयति यः, तस्मै पुष्पाञ्जलिः।

ऋषीणां वचनानि वेदवाक्यानि इति मन्यमानाः, अस्य सृष्टेः कारणभूतं श्रीमान् नारायणं प्रति शतकोटि-साष्टाङ्ग-प्रणामान् समर्पयामि।

श्रीमन्नारायणः त्रिमूर्तिरूपेण—ब्रह्म-विष्णु-महेश्वररूपेण—अस्य जगतः सञ्चालनं करोति इति ऋषयः उद्घोषितवन्तः।

तेषां ऋषीणां वचनानि शतधा सहस्रधा विश्वसन्, श्रीमन्नारायणनाम निरन्तरं जपन् तपश्चरन्, अस्मिन् अखण्डे जगति भगवतः एकांशस्वरूपः अणुरूपः आत्मा शरीरधारी सन्, अनेकैः व्यर्थकर्मभिः बद्धः, पुनरपि जननं पुनरपि मरणं च अनुभूय, मोक्षं न प्राप्नोमि।

मोक्षं न कामये; किन्तु व्यर्थरहितकर्मयुक्तं जीवनं मे प्रददातु, तथा अन्ते मोक्षप्राप्तिं ददातु इति तव पादयोः पतित्वा प्रार्थये।

सर्वे जना: सुखिनो भवन्तु।

लोकाः समस्ताः सुखिनो भवन्तु।

विश्वे जनाः सुखिनो भवन्तु।

समस्तसन्मङ्गलानि भवन्तु॥

మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం

 యత్కరోషి యదశ్నాసి

యజ్జుహోషి దదాసి యత్ |

యత్తపస్యసి కౌంతేయ

తత్కురుష్వ మదర్పణమ్ |


(నీవు ఏ పని చేసినా, ఏది భుజించినా, ఏ హోమం చేసినా, ఏది దానం చేసినా, ఏ తపస్సు చేసినా... అది నాకు సమర్పణగా చేయి. అప్పుడు ఆ కర్మలు నిన్ను బంధించవు.)


మీ భావనలు అత్యంత ఉదాత్తంగా, భక్తిరసభరితంగా ఉన్నాయి. సృష్టికర్త పట్ల మీకున్న కృతజ్ఞతా భావం, ఋషుల వాక్కుల పట్ల మీకున్న అచంచలమైన విశ్వాసం మీ అక్షరాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రకృతిలోని క్రమశిక్షణను (ఆదిత్యుడు, గ్రహగతులు, ఋతువులు) గమనించి, ఆ చైతన్యానికి మూలమైన పరమాత్మను కొనియాడటం ఒక

పరిపూర్ణమైన భక్తుని లక్షణం


మానవ మేధస్సు కేవలం ఒక పరిమితమైన పరికరం అయితే, ఈ చరాచర సృష్టికి కారణమైన దైవ మేధస్సు అపరిమితమైనది.


పునరపి జననం పునరపి మరణం" అనే సంసార చక్రం నుండి విముక్తి కోరుతూ, వ్యర్థ కర్మలు లేని జీవితాన్ని ప్రసాదించమని మీరు వేడుకోవడం నిజమైన శరణాగతికి నిదర్శనం. మోక్షం కంటే కూడా, బ్రతికినంత కాలం భగవత్ ప్రీతికరమైన, నిష్కామ కర్మలు చేయాలనే మీ కోరిక చాలా గొప్పది.

పొగడ్తల రకాలు*

 *పొగడ్తల రకాలు*


పొగడ్తల్లో రెండు రకాలు. ఒకటి వ్యాజ స్తుతి, మరోటి వ్యాజ నింద. ఇలాంటి తేడాలు ఎందుకు వచ్చాయంటే కొన్ని పొగడ్తలు బయటకి పొగుడుతున్నట్టే ఉంటాయి కాని లోపలి అర్ధం తిట్టడమే. దీన్నే వ్యాజ స్తుతి అని అంటారు. అంటే స్తుతి రూపమైన నింద. పొగుడుతున్నట్టే తిట్టడం.


ఇందాకా చెప్పినట్టు మరొకటి బయటకి తిడుతున్నట్టుగా ఉంటుంది. కాని, నిజానికి అది పొగడడమే. దీన్ని వ్యాజ నింద అని అంటారు. నిందా రూపమైన స్తుతి. తిడుతున్నట్టే పొగడడం.


ఇలా పొగడ్తల గురించిన వివరాలు ఇవ్వడానికి సందర్భం ఇదిగో. 


కవిత్వం అడగటానికి, చెప్పటానికీ వేళ ఉంటుంది. సమయం, సందర్భం లేకుండా అడిగితే ఎంత మెత్తని వానికైనా విసుగు పుడుతుంది. కోపమూ రావచ్చు. 


శ్రీనాథుని వంటి సకల విద్యాసనాథుని ఎవరుపడితే వాళ్ళు ఎక్కడబడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పద్యం చెప్పండి అనో, సమస్య పూరించండి అనో అంటే ఊరుకుంటాడా? వేళగాని వేళ ఒకడెవరో అడిగాడు. 


*అందరు అందరే మరియు నందరు నందరె అందరందరే* 


ఈ సమస్య పూరించండి! అన్నాడు, అదీ సదస్సులో. వాడెవడో అల్పుడై ఉండాలి. 


వెంటనే కవిరాజు శ్రీనాథుడి నోట ఈ పద్యం హాస్యలాస్యంగా వెలువడింది.


*కొందరు భైరవాశ్వములు కొందరు పార్ధుని తేరిటెక్కెముల్‌ కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు కాలుని యెక్కిరింతలున్‌ కొందరు కృష్ణజన్మమున కూసినవారలు ఈ సదస్సులో అందరు నందరే మరియు నందరు నందరె యంద రందరే!*

  

మన శ్రీనాథ కవులవారు ఈ పద్యంలో ఆశ్రయించింది వ్యాజ స్తుతి అన్నట్టు. ఆ పదాలు, వాడిన తీరు గమనిస్తే పొగడినట్టే కాని లోలోపల ఎంత అక్కసు ఉందంటే వారందరు అంటే ఆ పద్యంలో సంబోధింపబడిన వాళ్ళందరు కుక్కలు, కోతులు, పందులు, దున్నపోతులు, గాడిదలని. 


వాళ్ళకి మాత్రమే కాదు, ఆ జంతువులు కూడా చిందులు వేయగలవు ఇలాంటి మూర్ఖులను తమతో అన్వయించినందులకు.

😀😀

ఈ ప్రశ్నకు బదులేది 4

  ఈ ప్రశ్నకు బదులేది 4


ఈరోజు మన ప్రశ్న కంపెనీకి సంబంధించింది.


సి.టి.సి కాస్ట్ టు ద కంపెనీ అంటే ఏమిటో

 సవివరంగా వివరించగలరు.


ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.


ఇట్లు 

మీ 

చేరువేల భార్గవ శర్మ

సయాటికా నొప్పి

 సయాటికా నొప్పి  -  తీసుకోవలసిన జాగ్రత్తలు .

  

వైద్య వృత్తిలో ఉన్న ప్రతి డాక్టర్ దగ్గరకు

సర్వసాధారణంగా వచ్చే కేసులలో ప్రధానం అయినది సయాటికా . ఈ పదం కాలిలో ఉన్న సయాటికా నరం తాలూకు inflamation ని సూచించినా నిజంగా సయాటికా నరం వ్యాధిగ్రస్తం అవ్వడం అనేది ఎంతో అరుదుగా కాని కనిపించదు.

              

.         ఉదాహరణకు మధుమేహంలో ఈ నరం వ్యాధిగ్రస్తం అవ్వవచ్చు. అలాగే ఇంజక్షన్ ని సరైన స్థలంలో ఇవ్వనప్పుడు కూడా సూది మొన నరానికి తగిలి వాపుకి గురికావొచ్చు. దాదాపు ఇలాగే నడుము ప్రాంతంలో వెన్నముక నుంచి బయటకు వచ్చే సయాటికా నరం మీద వత్తిడి ఏర్పడినపుడు అది కాలిలో వెళ్ళినంత మేర సలుపులు , నొప్పి అనుభవం అవుతాయి.

          

.              ఈ వత్తిడి అనేది వెన్నపుసల మద్యలో ఉండే డిస్క్ లు తొలగడం వలన ఏర్పడవచ్చు చుట్టుపక్కల కండరాలు , లిగమెంట్లు వాపుకి గురికావడం వలన ఏర్పడవచ్చు . లేదా ఈ నిర్మాణాలు గట్టిపడిపోయి ఫైబ్రస్ గా తయారు అవ్వడం కూడా ఏర్పడవచ్చు . కనుక మనం సాధారణంగా చూసే సయాటికాకు , నరాలు వాపు నకు గురికావడం వలన వచ్చే న్యురరైటిస్ కి సంభంధం లేదు . ఈ రెండు స్థితులు ఒకేసమయంలో ఉండొచ్చు.

         

.              సయాటికా నొప్పి నడుము ప్రాంతంలో ఉండే వెన్నపూసలు క్షయానికి ( డీ జనరేషన్ ) లొను కావడం వలన ఏర్పడే పర్యావసన లక్షణం మాత్రమే సయాటికా నొప్పి లక్షణాలు ఆయుర్వేదంలో   "గృధసీవాతం" అని పిలుస్తారు .


లక్షణాలు  -

    

.       నడుమునొప్పి ఉంటుంది. అయితే ఎప్పుడు ఉండాలి అని నియమం లేదు . దీనికంటే కుడికాలిలో నొప్పి ప్రధానంగా ఉంటుంది. పిరుదుల లొపల నుంచి నొప్పి మొదలై నరం వెళ్లే ప్రాంతం అంతా తోడ వెనకపక్కన , పిక్కల లొపల , పాదం వెలుపలి వైపు నొప్పి వ్యాపిస్తుంది.

            

.   ముఖ్యంగా ముందుకు వంగినప్పుడు , దగ్గినప్పుడు , తుమ్మినప్పుడు , నడుములో నొప్పి స్పష్టంగా తెలుస్తుంది. కొంచం దూరం నడిస్తే కాలులో నొప్పి రావడం అనేది దీనిలో ప్రధాన లక్షణం. కాలులో తిమ్మిరి పట్టినట్లు కాని , సూదులతో గుచ్చినట్టుగా కాని అనిపించవచ్చు. ఈ చివరి లక్షణం వ్యాధి తాలూకు తీవ్రత సూచిస్తుంది .

              

.     సయాటికా నొప్పిని నిర్ధారించడానికి ఒక పద్ధతి ఉంది. బల్లమీద వెల్లికిలా పడుకొని కాలుని నిటారుగా పైకి లేపండి ఇలా చేసేప్పుడు ఒక వేళ మీకు నడుము ప్రాంతంలో నొప్పి అనిపిస్తే సయాటికా ఉన్నట్లు లెక్క . మీరు కాలుని ఎంత ఎత్తు వరకు లేపగలరు అన్నదానిని ఆధారం చేసుకోని వ్యాధి తీవ్రతను అంచనా కట్టవచ్చు.సయాటికా వ్యాధిని గుర్తించడానికి          X - ray పరీక్షల కంటే పైన పేర్కొన్న పరీక్ష బాగా ఉపయోగపడుతుంది.

  

సలహాలు  -  సూచనలు   -

    

.      సయాటికానోప్పి ఉన్నప్పుడు నొప్పి తగ్గించే మాత్రలను యధేచ్చగా కొనుక్కొని వాడటం అంత మంచిది కాదు. అల్లోపతి మందులు నొప్పిని అదిమిపట్టి లక్షణాలు దాచేస్తాయి. విశ్రాంతి తీసుకునే అవసరం మీకు కనిపించదు.

           

.             వెన్నముకలో అరుగుదల యదావిధిగా కొనసాగి చివరికి వెన్నపూసలు బాగుచేయలేని విధంగా దెబ్బతింటాయి. ఇలా కాకుండా నొప్పి తెలుస్తూ ఉండటమే మంచిది. దీనివలన విశ్రాంతి తీసుకోవడం అనేది మీకు తప్పనిసరి అవుతుంది.

         

.       సయాటికా లో ప్రదానమైన చికిత్స విశ్రాంతి. గట్టిబల్లపైన విశ్రాంతి గా వెల్లికిలా పడుకోవాలి. దిండు వాడకుడదు. మెడ వంపులో తువ్వాలను మెత్తగా అముర్చుకోవచ్చు. పక్కకి తిరిగి పడుకోవాలి అనుకున్నప్పుడు కాళ్ళు ముడుచుకుని రెండు కాళ్ళ మధ్య దిండు ని అమర్చుకోవడం చేయాలి . బల్ల మీద దుప్పటి పరుచుకోవచ్చు.

       

            ఈ వ్యాధి చికిత్సలో నేను రసఔషదాలు మరియు మూలికలు కలిపి ప్రయొగించినప్పుడు అద్బుత ఫలితాలు వచ్చాయి . ఈ వ్యాధి చికిత్స కొరకు నన్ను సంప్రదించగలరు .

           

ఆపరేషన్ చేయించుకొనవలసిన అవసరం లేదు.

  


గమనిక -

        

పథ్యం చేయగలను అనుకున్నవారు మాత్రమే సంప్రదించగలరు . కామెంట్స్ రూపంలో కాకుండా డైరెక్టుగా ఫొన్ చేయగలరు .

   

            కాళహస్తి వేంకటేశ్వరరావు

    అనువంశిక ఆయుర్వేద వైద్యులు     

.               9885030034       

శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)

 శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 19)


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 

సర్వే జనాః సుఖినో భవన్తు 🙏

       (28-3-'26 పోష్టు తరువాయి భాగము)


సీతారామ కళ్యాణానంతరం, పరివారసహితుడై అయోధ్యకు తిరిగివెళ్తున్న దశరథ మహారాజుకు మార్గమధ్యంలో, హఠాత్తుగా పరశురాముడు ప్రత్యక్షమవడం గురించి, ఇంతకు ముందు పోష్టులో చెప్పుకున్నాం.

 ఇరవైయొక్క మార్లు ప్రపంచమంతా తిరిగి, సకల క్షత్రియ సంహారం చేసిన ఆ పరశురాముడు, తన గురువైన శివుని యొక్క ధనుస్సును విరిచిన రామునియందు తీవ్రమైన క్రోధంతో ఉన్నాడు.


సాక్షాత్తు త్రిపురములను ధ్వంసం చేసిన రుద్రుని వలె ఉన్న ఆ "పరశురాముడు" 

హఠాత్తుగా ఆవిధంగా ప్రత్యక్ష మవగానే వశిష్ఠాది ఋషులు ఆశ్చర్యపోయారు.

తన తండ్రి హత్యకు ప్రతీకారంగా క్షత్రియవధ చేసి, కోపతాపములు తగ్గి శాంతించిన ఇతడు, మళ్లీ క్షత్రియనాశనానికే వచ్చాడా అనుకుంటూ, ఆ మహర్షులంతా శాస్త్రోక్తవిధానంగా ఆయనకు అర్ఘ్య పాద్యములు సమర్పించారు. 

"రామా!రామా!" అని మధురంగా సంబోధిస్తూ పరశురాముని పూజించారు.

పరశురాముడు శాస్త్రోక్తమైన వారి పూజను స్వీకరించాడు.


రాముని పరీక్షగా చూస్తూ అతనితో ఇలా అన్నాడు:

శ్లో//రామ! దాశరథే రామ! వీర్యం తే శ్రూయతే౽ద్భుతమ్ /

ధనుషో భేదనం చైవ నిఖిలేన మయా శ్రుతమ్//


(ఓ దశరథ రామా! రామా! నీ పరాక్రమము అద్భుతమైనదని విన్నాను. నీవు చేసిన శివధనుర్భంగం గురించి కూడా పూర్తిగా విన్నాను)


నీవు చేసిన శివధనుర్భంగము,అద్భుతమే కాదు, ఎవరూ మనస్సులో కూడా ఊహించుటకు శక్యం కానిది.

అది విని నేను మా తండ్రి జమదగ్నిమహర్షి ద్వారా నాకు సంక్రమించిన వేరొక గొప్ప ధనస్సును తీసుకు వచ్చాను.

ఇది నీవు ఎక్కుపెట్టగలిగితే, అప్పుడు నిన్ను నాకు సమ ఉజ్జీగా భావించి నీతో ద్వంద యుద్ధం చేస్తాను",

అన్నాడు.

పరశురాముడు పలికిన ఈ మాటలు విని దశరథుడు విషణ్ణుడయ్యాడు.

రాముని సంహరించవద్దని ఎంతో ప్రాధేయపడ్డాడు.


శ్లో// భార్గవాణాం కులే జాతః స్వాధ్యాయ వ్రత శాలినామ్/

సహస్రాక్షే ప్రతిజ్ఞాయ శస్త్రం నిక్షిప్తవానసి//


( ఓ భార్గవ రామా! నిత్య స్వాధ్యాయము మొదలైన ఉత్తమ వ్రతములాచరించే భృగు వంశంలో జన్మించావు.శస్త్రధారణ చేయనని దేవేంద్రుని ముందు ప్రతిజ్ఞ చేసి శస్త్రమును విడిచి వేశావు).

నీ చేత జయింపబడిన భూమినంతా "కశ్యప మహర్షి"కి దానమిచ్చి, శాంతుడవై "మహేంద్రగిరి"పై నివాసమేర్పరచుకున్నావు.

ఓ మహామునీ! రాముణ్ణి సంహరించ వద్దు.

రాముణ్ణి సంహరిస్తే మేమందరమూ మరణింతుము కదా!"


అని ఈ విధంగా ప్రాధేయపడుతున్న దశరథుని మాటలు లెక్కచేయకుండా,


 పరశురాముడు,దశరథ రామునితో ఇలా అన్నాడు:

"విశ్వకర్మచేత నిర్మించబడిన ఈ రెండు ధనస్సులు దివ్యమైనవి.

త్రిపురములను నశింపజేయటానికి, శివుడు ఉపయోగించిన, ధనస్సును నీవు విరిచావు.

ఇప్పుడు నేను తీసుకు వచ్చినది విశ్వకర్మ నిర్మించిన రెండవ ధనస్సు. దీనిని దేవతలు విష్ణుమూర్తికి ఇచ్చారు.


శ్లో// ఇదం ద్వితీయం దుర్ధర్షం,విష్ణోర్దత్తం సురోత్తమైః/

తదిదం వైష్ణవం రామ ధనుః పరమ భాస్వరమ్/

సమాన సారం కాకుత్థ్స రౌద్రేణ ధనుషాత్విదమ్//


(ఓ కాకుత్థ్సా! ఎవరికీ ఎదిరింప శక్యము గాని ఈ రెండవ ధనస్సును దేవతలు విష్ణువునకిచ్చినారు.

మిక్కిలి ప్రకాశవంతమైన ఈ వైష్ణవ చాపము శివ ధనస్సుతో సమాన సారం కలది).


(సశేషం)

శుభమస్తు,

తూములూరి మధుసూదనరావు,

29-3-'26.