26, ఏప్రిల్ 2026, ఆదివారం

శ్రీ మహావిష్ణు పురాణం* `` *66వ భాగం*``

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*గురువారం 23 ఏప్రిల్ 2026*


      *శ్రీ మహావిష్ణు పురాణం*

`` *66వ భాగం*``


*పరశురామ అవతారం*


తండ్రి ఆదేశంతో చంపిన.. 

తల్లి సోదరులను..

తండ్రి ఇచ్చిన వరముతో పరశురాముడు బ్రతికించుకునుట: ```

కార్తవీర్యార్జునుడిని చక్రవర్తిగా అంగీకరించి సమస్త రాజ్యాల రాజులు సామంతులై అమూల్యమైన వస్తువులు కానుకలుగా సమర్పించారు.  


కార్తవీర్యార్జునుడు బలపరాక్రములు ఎదిరించే వారు లేకపోవడంతో అహంకారం, గర్వం వచ్చాయి. రావణుడంతటి వాడినే బంధించి చెఱసాలలో పెట్టాడు. రావణుడితాత పులస్త్యమహర్షి వచ్చి బ్రతిమాలడంతో వదిలి పెట్టాడు.


చక్రవర్తిని అనుసరిస్తూ భూలోకంలో రాజులు కూడా అహంకార గర్వాలు పొంది క్షత్రియ ధర్మమైన ధర్మ పరిపాలన, ప్రజా రక్షణ వదలి వేశారు. సుఖభోగాలలో మునిగిపోయారు. యజ్ఞయాగాదులు మానివేశారు. గర్వం అహంకారంతో తమకు మంచి చెప్పబోయిన మునులను, బ్రాహ్మణులను అవమానించారు. ఇతర వర్ణాల వారిని బాధలు పెడుతూ కష్టాలు పెట్టసాగారు. రాజు చెప్పినదే చేయాలని, రాజే దేవుడని కొలవమని ప్రజలకు మునులకు చెబుతూ అలా చేయని వారిని బంధించి హింసించ సాగారు.


క్షత్రియ రాజులను దండించగల, దారిలో పెట్టగల సమర్ధుడైన క్షత్రియుడు దేవతలకు కనపడలేదు. ఎవరి రాజ్యం, ఎవరి స్వార్థం వారిదై పోయింది. బ్రహ్మాది దేవతలు, మహర్షులు మహావిష్ణువు దగ్గరకు వెళ్లి భూమి మీద జరుగుతున్న ధర్మనాశనం ఫలితంగా ఉత్పన్నమయిన లోకసంక్షోభం గురించి చెప్పారు. బ్రాహ్మణులను, మునులను కించపరిచి అవమానిండమే కాకుండా క్షత్రియ రాజులు యజ్ఞయాగాదులు ఆపివేశారు అని విన్నవించారు.


మహావిష్ణువు తాను భూలోకంలో అవతారం ధరించి ధర్మ పరిరక్షణ చేస్తానని అభయమిచ్చి దేవతలను మునులను పంపివేశాడు. ఋచీక మహర్షి తపస్సు చేసినప్పుడు ఇచ్చిన వరము జ్ఞప్తి చేసుకుని ఋచీక మహర్షి పుత్రుడైన జమదగ్ని మహర్షికి కుమారుడిగా జన్మించదలచాడు. బ్రాహ్మణుడిగా జన్మించినా క్షత్రియ స్వభావము కలిగి దుష్ట శిక్షణ, ధర్మ పరిరక్షణ చేయవచ్చునని జమదగ్ని మహర్షి భార్య రేణుక గర్భంలో ప్రవేశించాడు.


జమదగ్ని మహర్షికి రేణుకకు అప్పటికే నలుగురు పుత్రులు జన్మించి ఉన్నారు. శ్రీహరి ఐదవ పుత్రుడిగా రేణుకాదేవి గర్భం నుంచి నవమాసాలు అయిన తర్వాత జన్మించాడు. చేతిలో పరశుతోనే జన్మించడం వలన జమదగ్ని మహర్షి పుట్టిన బాలునికి పరశురాముడు అని నామకరణం చేశారు.


తండ్రి వద్దనే అన్నలతో పాటు పరశురాముడు వేద విద్యలు అభ్యసించాడు. కాలక్రమంలో ధనుర్విద్యాది యుద్ద విద్యలలో ప్రవీణుడయ్యాడు. ప్రతిరోజు పరశుతో అరణ్యం లోకి వెళ్లి యుద్యవిద్యలు అభ్యసించి ఆశ్రమానికి కావలసిన కట్టెలు దర్భలు మొదలైనవి తెచ్చి ఇచ్చేవాడు.


జమదగ్ని మహర్షి ప్రతిరోజు భగవంతునికి అభిషేక అర్చన పూజలు చేసేవాడు. ఇందుకోసం రేణుక ప్రతిదినము ఆశ్రమం సమీపంలో గల కౌశికి నదికి వెళ్లి స్నానం చేసి తన పాతివ్రత్య మహిమతో ఇసుకతో కుండను చేసి నదీజలాలలను నింపి భర్తకు అభిషేకానికి తెచ్చి ఇచ్చేది. సమయ పాలన పాటిస్తూ రేణుక తెచ్చే నీటితోనే జమదగ్ని మహర్షి అభిషేకార్చనలు చేసేవాడు.


ఒకరోజు నదీతీరంలో రేణుక కుండ చేయడానికి ఇసుక సేకరించసాగింది. అదే సమయంలో చిత్రరథుడు అనే యక్షుడు తన భార్యతో వచ్చి నదిలో జలక్రీడలు ఆడ సాగాడు. యక్ష దంపతుల మధ్య శృంగార భరితంగా సాగుతున్న జలక్రీడ చూసిన రేణుక మనస్సు చెదిరింది. శృంగార భావం కలిగి మనస్సు నియంత్రణ తప్పడంతో రేణుక ఇసుకతో ఎంత ప్రయత్నించినా కుండను చేయలేక పోయింది. సమయం చాలా వ్యర్థం అయ్యింది.


జమదగ్ని మహర్షికి ఆగ్రహం వస్తుందని నీరు తేకుండానే ఆశ్రమానికి వచ్చి రిక్త హస్తాలతో భర్త ముందు తల వంచుకుని నిలబడింది. 


జమదగ్ని మహర్షి చంచలమైన మనస్సుతో, నదీజలాలు తేకుండా నిలబడ్డ భార్యను చూసి దివ్య దృష్టితో జరిగింది గ్రహించాడు. “మహర్షి పత్ని మనస్సు శృంగార భావంతో స్థిరత్వం కోల్పోవడం క్షమించరాని నేరము. పాతివ్రత్యం భంగమైంది. మరణమే దానికి దండన” అని ఆగ్రహించి పెద్ద కుమారుడైన రుమణ్వంతుని పిలిచి "మీ తల్లి పాతివ్రత్య దోషానికి పాల్పడింది. తక్షణం ఈమె శిరస్సు ఖండించు" అని ఆదేశించాడు.


రుమణ్వంతుడు తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని చంపలేకపోయాడు. మౌనంగా తల వంచుకుని నుంచున్నాడు. జమదగ్ని మహర్షి మరింత ఆగ్రహంతో సుషేణ, వసు, విశ్వావసు అనే ముగ్గురు కుమారులను వరుసగా పిలిచి రేణుకను సంహరించమని ఆదేశించాడు. 


వారు కూడా అన్న వలె తల్లి మీద ప్రేమతో ఆజ్ఞ పాటించక అన్న పక్కనే వెళ్లి నిలబడ్డారు.


జమదగ్ని ఆశ్రమ సమీప అడవిలో ఉన్న తన ఆఖరి పుత్రుడైన పరశురాముని "పరశురామా! వెంటనే రా" అని గట్టిగా పిలిచాడు. "తండ్రీ! ఏమిటి మీ ఆజ్ఞ" అంటూ పరశురాముడు అక్కడ ప్రత్యక్షమైనాడు.  


జమదగ్ని మహర్షి జరిగింది చెప్పి "పాతివ్రత్య దోషానికి పాల్పడిన నీ తల్లిని, తండ్రి ఆజ్ఞను పాటించని నీ అన్లనను తక్షణమే సంహరించు!" అని ఆదేశించాడు.


తక్షణమే పరశురాముడు తన పరశువుతో తల్లిని, అన్నలను సంహరించి తండ్రి ఆజ్ఞ పాటించాడు. 


జమదగ్ని పరశురాముని పితృవాక్య పాలనకు సంతోషించి వరము కోరుకోమని అన్నాడు. 


పరశురాముడు తండ్రికి నమస్కరించి "తండ్రీ! మీ ఆజ్ఞ పాటించి తల్లిని సోదరులను సంహరించాను. మీ అమోఘమైన తపశక్తితో వారికి పునఃప్రాణదానం చేసి బ్రతికించండి" అని వరం కోరాడు. 


భార్య, సోదరుల శిరస్సు మొండాలు దగ్గరకు చేర్చమని జమదగ్ని మహర్షి చెప్పి తన తపశక్తితో అతికించి ప్రాణ ప్రతిష్ఠ చేశాడు. 


పునఃజీవితయై పాతివ్రత్య దోషం తొలగి పునీతయైన రేణుకను అర్థాంగిగా జమదగ్ని మహర్షి స్వీకరించాడు.


పరశురాముడు తల్లికి నమస్కరించి "అమ్మా! తండ్రి ఆజ్ఞను పాటించి నిన్ను వధించడం వలన మాతృహత్యా మహాపాపం పొందాను. ఆ పావ పరిహార్థం నేను తపస్సుకి వెళుతున్నాను. చాలా సమయం పడుతుంది. నీకు అవసరం అయినప్పుడు నన్ను స్మరించి పిలువుము. తక్షణమే వస్తాను. నన్ను క్షమించి తపస్సిద్దికై ఆశీర్వదించు" అని తల్లి రేణుక ఆశీస్సులు తీసుకున్నాడు. తండ్రి జమదగ్ని అనుమతి పొంది తపస్సుకి వెళ్లి పోయాడు.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ

  శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు


నమో ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః


1080వ వారము


*అరుణ పారాయణము, సూర్య నమస్కారములు*


శ్రీ వరుణ సహిత సంజ్ఞా ఉషా ఛాయా పద్మినీ సువర్చలాంబా సమేత శ్రీ సవితృ సూర్యనారాయణ స్వామి వారి దివ్య కరుణా కటాక్షములతో, శ్రీ కాంచి కామకోటి పీఠాధీశ్వరులు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారి దివ్యానుగ్రహముతో, శ్రీ పరాభవ నామ సంవత్సర, వసంత ఋతువు వైశాఖ మాసము శుద్ధ దశమి భానువారము, అనగా *26-ఏప్రిల్-2026 తేదీన, ఉదయం 07:30 గంటల* నుండి అరుణ పారాయణము తో కూడిన సూర్య నమస్కారములు ఋత్విగ్వరేణ్యుల సత్సాంగత్యములో యథా శక్తి గా జరుపుటకు నిశ్చియించడమైనది. 

విశేషములు:

• గురు వందనం

• పరిషదనుజ్ఞ

• సభా నమస్కారము

• శ్రీమహాగణపతి పూజ

• పుణ్యహవచనం

• కలశ స్థాపన

• షోడశోపచార పూజ

• తృచ పారాయణ

• అరుణ ప్రశ్న తో కూడిన సూర్య నమస్కారములు

• నవగ్రహ సూక్త పారాయణ

• నక్షత్ర సూక్త పారాయణము

• పునః పూజ 

• అష్టోత్తర శత నామార్చన

• ఆదిత్య హృదయ పారాయణ

• వేద స్వస్తి

• మంగళ హారతి

• ప్రసాద స్వీకారం


ఈ కార్యక్రమములో పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వారి అనుగ్రహముతో స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు.


స్థలము

 Flat A-102, Isha Yara apartment, Vadakkupattu, Medavakkam, Chennai


జయతాచ్ఛంకరోగురుః

హర హర శంకర జయ జయ శంకర

లోకాస్సమస్తాస్సుఖినో భవంతు

పంచాంగశుద్ధి

 *నేటి పంచాంగశుద్ధి* 

  ------------------------------------

     26---04--2026 ఆదివారం     -------------------------------------

🌞శ్రీ పరాభవ సంవత్సరం 

_--------------------------------------

🌸ఉత్తరాయణం 🌸

------------------------------

🌞 వసంత ఋతువు 🌻

------------------------------

 🌞 వైశాఖ  మాసము 🌞

--------------------------------------


🌻శుక్ల  పక్షం 🌻

----------------------------------------                    .                           🌸దశమి   ఈరోజు  రాత్రి  8----44  ని  ఉంది  తదుపరి  ఏకాదశి🌸

---------------------------------------        

 🌞మఖ   నక్షత్రము  ఈరోజు   రాత్రి   10----57 ని వరకు  ఉంది  తదుపరి  పుబ్బ నక్షత్రము  🌞

------------------------------------

🌚రాహుకాలం  ఈరోజు  సాయంత్రం  4-----30. ని   నుండి  6.  గం   వరకు ఉంది

---------------------------------------

🌑 యమ గండం ఈరోజు మధ్యాహ్నం  12. గం  నుండి   1----30. ని వరకు   ఉంది 🌑

------------------------------------

వర్జ్యం ఈరోజు  ఉదయం  11----15  ని  నుండి  12---49 ని  వరకు  ఉంది. --------------------------------------- 

నేటి వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - దశమి - మఘ -‌‌ భాను వాసరే* (26.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఋతుర్ ఋతునా నుద్యమానః।

 Mantra - 21 ARUNAM 3 anuvaakam


ఋతుర్ ఋతునా నుద్యమానః। 

విననాదాభిధావః |

షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః|

శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ|| 


ఇది కాల గమనాన్ని, ముఖ్యంగా రోజులు మరియు నెలల విభజనను ఒక అద్భుతమైన రూపకంతో (Metaphor) వర్ణిస్తుంది.


*ఋతుర్ ఋతునా నుద్యమానః*: 

ఒక ఋతువు మరొక ఋతువు చేత ముందుకు నెట్టబడుతోంది. అంటే కాల చక్రంలో వసంతం తర్వాత గ్రీష్మం, గ్రీష్మం తర్వాత వర్ష ఋతువు.. ఇలా ఒకదాని వెనుక ఒకటి క్రమ పద్ధతిలో వస్తూ ఉంటాయి. 


*విననాదాభిధావః*: 

ఆ కాలం లేదా సూర్యుడు గొప్ప శబ్దము చేస్తూ (ప్రకృతిలో కలిగే మార్పుల ధ్వని) వేగంగా పరిగెడుతున్నాడు. కాలం ఆగకుండా ప్రవహిస్తోందని దీని భావం.


*షష్టిశ్చ త్రిగ్ం శకా వల్గాః*: 

ఇక్కడ కాల గణన స్పష్టంగా కనిపిస్తుంది.

త్రిగ్ం శకాః: అంటే 30 కాల ప్రమాణాలు. ఇవి ఒక నెలలోని 30 రోజులు లేదా 30 ఘడియలు గల ఒక పగటి కాలం లేదా రాత్రి కాలం.

షష్టిశ్చ: అంటే 60 కాల ప్రమాణాలు. ఇవి ఒక రోజులో 60 ఘడియలు లేదా ఋతువు లో 60 రోజులు.  వీటిని "వల్గాః" (గుర్రపు కళ్లెములు) అని పిలిచారు. అంటే ఒక గుర్రం కళ్లెముల ద్వారా ఎలా నియంత్రించబడుతుందో, కాల చక్రం ఈ రోజులు, నెలల ద్వారా అలా నడపబడుతోంది.


Additional info:

వైదిక కాల విభజన క్రమం పరిశీలిద్దాం!

1 ఘడియ = 24 నిమిషములు

2 ఘడియలు = 48 నిమిషములు = 1 ముహూర్తం

2.5 ఘడియలు = 1 గంట

5 ఘడియలు = 2 గంటలు = 1 హోర 

30 ఘడియలు = 12 గంటలు = 1 పగలు / 1 రాత్రి

60 ఘడియలు = 24 గంటలు = 1 రోజు

60*60 ఘడియలు = 60 రోజులు = 1 ఋతువు 


ఒక రోజులో 60 ఘడియలు (షష్టి)

ఒక నెలలో 30 రోజులు (త్రింశక)


(వేదం జ్యోతిశ్శాస్త్రానికి బీజం అని పై లెక్కల ప్రకారం చెప్పవచ్చు)


షష్టిశ్చ (60): "షష్టిశ్చ" అంటే అరవై. దీనిని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు:

కాల విభజన - ఒక కాల ప్రమాణంలో ఉండే 60 భాగాలు (ఉదాహరణకు, ఒక రోజులో 60 ఘడియలు

లేదా ఒక ఋతువులో 60 రోజులు)


శుక్ల కృష్ణౌ చ షాష్టికౌ: 

"శుక్ల" (తెల్లని - వెలుగు) మరియు "కృష్ణ" (నల్లని - చీకటి). ఇక్కడ 60 పగుళ్లు 60 రాత్రుళ్ళు కలిపి 60 రోజులు ఒక ఋతు కాలం.


అరుణ కేతుక చయనంలో కాలాన్ని ఒక గుర్రంగా లేదా రథంగా ఊహిస్తారు. ఈ మంత్రం ఆ కాల చక్రంలోని విడి భాగాలను వివరిస్తోంది.

 

*కాల ప్రవాహం*: ఋతువులు ఒకదానినొకటి అనుసరిస్తూ రావడం అనేది సృష్టిలోని క్రమశిక్షణకు నిదర్శనం. భూమి తన చుట్టూ తాను గంటకు సుమారు 1,670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ, సూర్యుని చుట్టూ గంటకు సుమారు 1,07,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. కాలం తరుముకు రావటం అంటే ఇదే


*సంవత్సర విభజన*: ఒక సంవత్సరంలో 12 నెలలు, ఒక్కో నెలలో 30 రోజులు, ఒక్కో ఋతువు లో 60 రోజులు ఉంటాయని, ఒక్కో రోజులో 60 ఘడియలు ఉంటాయని, ఒక్కో నెలలో రెండు పక్షాలు (శుక్ల, కృష్ణ) ఉంటాయని వేద కాలం నాటి ఖగోళ విజ్ఞానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.


సూర్యుడే ఈ కాలాన్ని నియంత్రించే శక్తి. ఆయనే ఈ రోజులను, రాత్రులను తన కళ్లెములతో (వల్గాః) నడిపిస్తున్నాడు.


సూర్యుడు (అరుణుడు) కాల స్వరూపుడిగా మారి, ఈ సృష్టిని ఎలా పరిపాలిస్తున్నాడో, మనం ఆ కాలాన్ని ఎలా గౌరవించాలో ఈ మంత్రాలు బోధిస్తున్నాయి.


అద్వైత వేదాంతం ప్రకారం, ఈ మంత్రం 'మాయ' మరియు 'బ్రహ్మము' మధ్య ఉన్న సంబంధాన్ని వివరిస్తుంది:


*కాలము - ఒక మిథ్య* (Time as an Appearance)

కాలం నిరంతరం మారుతూ ఉంటుంది (ఋతువుల మార్పు). అద్వైతంలో మారుతున్న ప్రతిదీ 'మిథ్య' (Relative Truth). ఈ మంత్రం వర్ణించిన కాలప్రవాహం అంతా చైతన్యం మీద కదిలే ఒక చిత్రపటం వంటిది. కాలం కదులుతోంది అంటే, ఆ కదలికను గమనించే 'సాక్షి' (Observer) ఒకడు ఉండాలి. ఆ సాక్షియే కాలాతీతుడైన పరమాత్మ.


*విభజనలో అవిభజితత్వం* (Unity in Division)

మంత్రంలో అరవై, ముప్పై, శుక్ల, కృష్ణ అని కాలాన్ని ముక్కలుగా విభజించారు. కాల ప్రమాణాలు 1, 2, 2.5, 5, 30, 60… మొదలైనవి కానీ ఈ విభజనలన్నీ ఒకే సంవత్సరంలో (కాలచక్రంలో) అంతర్భాగాలు. అలాగే, జగత్తులో మనకు కనిపించే నామ-రూప భేదాలన్నీ ఆ ఒక్క బ్రహ్మము లోనివే. సముద్రంలో తరంగాలు వేరు వేరుగా ఉన్నా, అన్నీ నీరే అయినట్లుగా, కాలగతులు వేరైనా అవన్నీ ఒక్క సత్యం మీద ఆధారపడి ఉన్నాయి.


*నుద్యమానః* - నిరంతర పరిణామం

ప్రకృతిలో ఏదీ స్థిరంగా ఉండదు. ఒక ఋతువు పోయి మరొకటి రావడం అనేది జగత్తు యొక్క అనిత్యత్వాన్ని (Impermanence) సూచిస్తుంది. అద్వైత సాధకుడు ఈ మార్పులను చూసి, వీటన్నింటికీ మూలమైన, మార్పు లేని (అవికారి) తత్వం వైపు దృష్టి సారించాలి.


*విననాదః* (The Cosmic Sound)

శబ్దం లేదా నాదం అనేది ఆకాశానికి గుణం. ‘శబ్ద గుణక మాకాశం’. వేదాంత పరంగా, ఈ సృష్టి అంతా ఓంకార నాదం నుండి వ్యక్తమైంది. కాలం వేగంగా పరిగెడుతూ చేసే ఈ 'విననాదం', సృష్టిలోని చైతన్య శక్తిని (Prana Shakti) సూచిస్తుంది.


Conclusion:

సంక్షిప్తంగా చెప్పాలంటే, ఈ మంత్రం కాలం యొక్క భీకరమైన వేగాన్ని, క్రమశిక్షణను వర్ణిస్తుంది.

అద్వైత కోణంలో:

మారుతున్న నిమిషాలు, ఘడియలు, హోరలు, అహోరాత్రములు, మాసములు, ఋతువులు, సంవత్సరాలు అన్నీ కాల స్వరూపాలు. కానీ వీటన్నింటికీ ఆధారం, కాలానికి కూడా కాలమైన (కాలాకాలాయ), మార్పు లేని ఆ పరమాత్మ ఒక్కడే.