8, మే 2023, సోమవారం

విద్యార్థి

 ఆచార్యాత్ పాదమాదత్తే, 

పాదం శిష్యః స్వమేథయా ।

పాదం సబ్రహ్మచారిభ్యః, 

పాదం కాలక్రమేణ చ ॥


భావార్థమ్

విద్యార్థి జ్ఞాన సముపార్జనా మార్గాలని లేదా విధానాలని గురించి తెలియ చెప్పే సుభాషితం.


ఆచార్యుడు లేదా గురువు లేదా teacher వద్ద నుండి విద్యార్థి నిజముగా నేర్చుకునేది ఒక నాలుగవ వంతు మాత్రమే..... 

మరి ఒక నాలుగవంతు భాగం తన యొక్క స్వంత మేధా శక్తితోను, విషయ పరిజ్ఞానపరిశోధనతోను, తన యొక్క విశ్లేషణా శక్తితోనూ నేర్చుకుంటాడు.... 

మరి మూడవ భాగమైన నాలుగవ వంతు భాగాన్ని సహబ్రహ్మచారులతోనూ అనగా తోటి విద్యార్థులతోడి చర్చలద్వారా, discussions ద్వారానూ, interactions ద్వారానూ నేర్చుకుంటాడు...... 

తన యొక్క సంపూర్ణ విద్యాసముపార్జన, జ్ఞాన సముపార్జనలని చివరి నాలుగవ భాగాన్ని, కాలక్రమేణా తన జీవితానుభవముల ద్వారా, తన జిజ్ఞాసతో కూడిన నిరంతర గ్రంథ పఠనాల ద్వారా నేర్చుకుని పరిపక్వత సాధిస్తాడు.... 


అనగా, సమగ్రమైన విద్యాభ్యాసం విద్యాలయాలతో పరిసమాప్తి కాదు... 

అది జీవితాంతమూ జరిగే నిరంతర ప్రక్రియ అని తాత్పర్యం.... 


-------------- ॐ ॐ ॐ --------------

ఆపరేషన్ కావేరీ ' .

 భారత్ సైన్యం జరిపిన అత్యంత క్లిష్టమైన ఆపరేషన్.. ' ఆపరేషన్ కావేరీ ' .. 

భారత సైన్యం చేసిన  సాహసోపేతమైన రెండు-రోజుల ఆపరేషన్‌ కావేరీ కు అంతర్జాతీయ రక్షణ రంగం నివ్వెర పోయింది..

ఒకప్పుడు ఇజ్రాయెల్ ఉగాండా లో తన సైనిక చర్య జరిపినప్పుడు ప్రపంచం ఇజ్రాయెల్ సైన్యం వంక ఎలా చూసిందో అదే నివ్వెరపాటుతో భారత సైనిక పాటవాన్ని..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వేగాన్ని చూసి ప్రపంచం నివ్వెరపోయింది..


భారత్ యొక్క స్వర్ణ యుగం ప్రారంభమైందని ప్రపంచం గమనించింది..


సూడాన్ లో జరిగిన ఈ ఆపరేషన్ మొత్తం ప్రపంచానికి చాలా షాకింగ్ మరియు థ్రిల్లింగ్‌గా ఉంది..ఒక హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని సంఘటన ఇది..


ఉక్రెయిన్ మరియు కాబూల్ నుండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా భారతీయులను రక్షించడం పెద్ద విషయం కాదు.. ఎందుకంటే వారిని అక్కడనుంచి లిఫ్ట్ చేసింది పగటిపూట అది కూడా సాధారణ విమానాశ్రయాల్లో..


కానీ సుడాన్‌లో అలా కాదు.. సుడాన్ యొక్క గగనతలం మూసివేశారు..విమానాలు ఎగరడానికి అనుమతి లేదు..కేవలం US మాత్రమే తన రాయబారులను రక్షించడానికి ధైర్యంగా తన హెలికాప్టర్‌లను పంపింది..


పోరాటం విమానాశ్రయాల్లో కూడా జరుగుతున్నందున అలాగే అక్కడ అల్మోస్ట్ అన్నీ ఇతర దేశాల దౌత్యవేత్తలు అక్కడికే చేరుకున్నారు కనుక అక్కడనుంచీ మనవాళ్లను కాపాడడం దాదాపు అసాధ్యం.. 


దేశంలోని చాలా మంది ఇలా చిక్కుకుపోయారు.

అక్కడ చిక్కుకున్నవారిలో తొలివిడతలో గుర్తించింది 278 మంది భారతీయులను.. ఇప్పుడు వారిని రక్షించడం పెద్ద సవాలుగా మారింది.


ప్రధాని మోదీ భారత వైమానిక దళానికి పూర్తి అధికారాన్ని ఇచ్చారు..

ఇండియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్ కూడా రంగంలోకి దిగింది..మిలిటరీ ఇంటిలిజెన్స్ మానిటరింగ్ మొదలుపెట్టింది..


వీళ్ళకి తోడు డైనమిక్ విదేశాంగ శాఖామాత్యులు జైశంకర్ గారి నేతృత్వంలో  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి ప్రపంచ వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో భారత్ చరిత్రను లిఖించడానికి భారత వైమానిక దళం ఉత్సాహంతో రంగంలోకి దిగింది..


విదేశీ విమానాలు సుడాన్‌లో ఎగరలేవు..ఒకవేళ సూడాన్ కు రెండో వైపునుంచి భారత్ విమానాలు ఎగిరితే ఇంకోవైపు వారు భయంతో దాడి చేయవచ్చు..ప్రధాన విమానాశ్రయం శిధిలమై ఉంది.. ఈ పరిస్తితిలో  సూడాన్ అనుమతి లేకుండా భారతీయులను రక్షించాలి.


భారత ఇంటెలిజెన్స్ సూడాన్‌ లో రెక్కీ వేసింది.. రాజధానికి 50 కిలోమీటర్ల దూరంలో మానవరహిత..ఒక పాడుబడిన విమానాశ్రయాన్ని కనుగొంది.


అక్కడ విమానాన్ని ల్యాండ్ చేయవచ్చు కానీ సమస్య ఏమిటంటే 

అన్నింటిలో మొదటిది..అక్కడ భూమిపై ఎవరూ లేరు..కరెంటు లేదు..జనరేటర్ కూడా శిధిలమైంది..ఇక లైట్లు వెలిగే అవకాశమే లేదు..


ఎయిర్ ట్రాఫిక్ గైడెన్స్ లేదు..ఇక్కడ విమానం ల్యాండింగ్ లేదా టేకాఫ్ అయినా ప్రమాదాన్ని కావాలని కొనితెచ్చుకోవడమే..


విమానం వచ్చినా వారిని ధిక్కరించి రహస్యంగా రావడానికి సుడాన్ అనుమతించదు.


ఇక రక్షణ విషయానికి వస్తే భారతీయ విమానాలు ఎగరడానికి వాళ్ళ నిఘా లేని మార్గం లేదు.


ఇన్ని సమస్యలు!

అయినా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన ఆపరేషన్ లో ముందుకే వెళ్లడానికి నిర్ణయం తీసుకుంది..


మొదటగా భారత వైమానిక దళం తన కమాండోలతో కూడిన ఒక పెద్ద విమానాన్ని సౌదీ జెడ్డాకు పంపింది అక్కడ నుండి అది సూడాన్ వైపు వెళ్లడానికి కావలసిన ఇంధనం నింపుకుంది..


ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు ముందుగా ఆ 278 మంది భారతీయులను ఆ పాడుపడిన విమానాశ్రయానికి చేర్చాయి..


ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన జీవితంలోనే అత్యంత ఉద్విగ్నభరితమైన ఆపరేషన్ మొదలుపెట్టింది..అప్పటిదాకా ఏ విమానాన్ని పంపాలో కూడా టీం అత్యంత రహస్యంగా ఉంచింది..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ' హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ ' ను రంగంలోకి దించింది..ఇక సాహసోపేతమైన ఫీట్ మొదలైంది.


లైట్లు లేని చీకటిలో నైట్ విజన్ పరికరాల సాయంతో  విమానం ఎగిరింది.. లైట్లు లేకుండా ఎగరడంతో సూడానీస్ ఆర్మీ..పారా మిలటరీ దానిని చూడలేకపోయింది.


శ్రీహరి కోట షార్ సెంటర్ నుంచి లభించిన  ఉపగ్రహ మార్గదర్శకత్వంలో భారత విమానం సంపూర్ణంగా చీకటిలో ప్రయాణించింది.


పైలట్లు రాత్రికి రాత్రే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు..ఇంజన్ ను షట్ డౌన్ చేయలేదు..


విమానం డోర్ తెరుచుకోవడంతో భారత కమాండోలు పరుగున వెళ్లి విమానంలోకి 278 మందిని మెరుపు వేగంతో తీసుకెళ్లారు..


7 నిమిషాల పాటు విమానం సూడాన్ నేలపైనే ఉండిపోయింది..

నో లైట్స్..నో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్..నో సైన్ బోర్డ్స్ నథింగ్..అందరూ కూచున్న తర్వాత

కేవలం శాటిలైట్ నావిగేషన్ సాయంతో అంతే మెరుపువేగంతో విమానం టేకాఫ్ తీసుకుంది..


సౌదీ అరేబియాలోని జెడ్డాలో విమానం లాండ్ అయిన తర్వాత జెడ్డా నుంచి డిల్లీకి భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారు.


ఈ సంఘటన ప్రపంచ వేదికపై తీవ్ర దిగ్భ్రాంతిని సృష్టించింది..నిజానికి ప్రకంపనాలే పుట్టించింది..

ఇజ్రాయెల్ తప్ప మరే దేశం ఇలాంటి సవాలును తీసుకోలేదు కానీ భారతదేశం ధైర్యం చేసింది.


మిలటరీ ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ల శక్తి తెలిసి పాకిస్థాన్ వణికిపోతోంది..చైనా ఆర్మీ చీఫ్ డయపర్స్ కి ఆర్డర్ ఇచ్చాడు..


నిజానికి ఈ ఆపరేషన్ చాలా సవాలుతో..ప్రమాదంతో కూడుకున్నది..విమానం అక్కడ చిక్కుకుపోయినా లేదా అక్కడి ఫైటర్స్ విమానాన్ని గమనించి విమానాన్ని చుట్టుముట్టినా  అత్యంత ప్రమాదమే కాదు..భారత్ కు పరువుప్రతిష్టల సమస్య..


కానీ మోదీజీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అతి గొప్ప సాహసం చేసింది.


ఆశ్చర్యకరంగా ఇది ఏప్రిల్ 29, 2023 శనివారం నాడు జరిగింది..


ఏదో ఒకటో రెండో జాతీయవాద చానల్స్ తప్ప మిగిలిన భారత మీడియా

ఎందుకు మాట్లాడలేదు?


భారత సైన్యంపై ప్రపంచం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.. దేశప్రజల ప్రాణాలు కాపాడడంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రుల మాదిరిగా మోదీజీ కూడా చరిత్రలో నిలిచిపోయారు.


తమ ప్రజలను కాపాడుకునేందుకు మోదీజీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని నిరూపించింది.

ఈ ఘనత సాధించిన పైలట్‌, క్రూ చీఫ్‌ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

వీరి పేర్లను అవార్డులకు ఎప్పుడు ప్రకటిస్తారో అప్పుడే బహుశా వారి పేర్లు కచ్చితంగా తెలిసే అవకాశం  ఉంది.


భారత వైమానిక దళం ఒక గొప్ప విజయాన్ని సాధించింది.. 

ప్రతి భారతీయుడు తమ ఛాతీని పైకెత్తి గర్వంగా వారికి సెల్యూట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది.


భారత ప్రభుత్వం తన పౌరులకు "భయం లేదు..భయం లేదు..భయం లేదని ' అభయం ఇచ్చిన క్షణం..


భారత్‌ సూపర్‌ పవర్‌ టైటిల్‌ను చేరిన క్షణం...


బెంగళూరు సమీపంలో రాజీవ్ హంతకులు మెరుపుదాడి చేసినప్పుడు ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి రెండు రోజులు పట్టింది..


ముంబై దాడి సమయంలో ఢిల్లీ నుంచి కమాండోలు రావడానికి ఒక రోజు పట్టింది..


మోడీ హయాంలో 7 నిమిషాల్లో సూడాన్ నుండి భారతీయులను రక్షించాం..

భారత్ మారుతుంది..భారత్ శక్తి మారుతుంది..

భారత్ వేగం మారుతుంది..

భారత్ ను ప్రపంచం చూసే దృష్టి మారుతుంది..

ఇది మోదీజీ నాయకత్వంలో దేశం సాధించిన అపురూప చారిత్రక విజయం..

( ఈ ఆపరేషన్ తర్వాత షుమారు 3 వేలమంది భారతీయులను సౌదీ అరేబియా..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహాయంతో సీ పోర్ట్ మార్గం ద్వారా తరలించారు ) 

జైహింద్..భారత్ మాతాకీ జై..