17, సెప్టెంబర్ 2021, శుక్రవారం

పండుగల గొప్పతనం

 🌈 మన పండుగల గొప్పతనం తెలుసు కోండి 🌈


*🥭ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.*


*🏹శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.*


*🏵అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.*


*🌝వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.*


*🐍నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.*


*🌷వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.*


*👩‍👦రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.*


*🐘వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.*


*🌑పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.*


*🔱దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.*


*🪔దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.*


*🌕కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.*


*🌾సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.*


*💥మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.*


*🌈హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

🙏🏻🌷🌷🌷🌷🙏🏻

కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.

 *🕉కర్మ ఫలం తప్పదు🕉*



*🙏అందర్నీ హెచ్చరించే మంచి వ్యాసం. అందరూ చదవాలని మనవి 🙏*



కర్మఫలం ఎవరికైనా అనుభవించక తప్పదు.


మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది. ఎందుకంటే? కర్మ బలీయమైనది.


పరీక్షిత్తు మహారాజును కాటు వెయ్యాలని బయల్దేరాడు తక్షకుడు. 


కశ్యపుడనే బ్రాహ్మణోత్తముడు గొప్ప మంత్రవేత్త. రాజును సంరక్షింప, రాజప్రాసాదానికి బయలుదేరాడు. దారిలో ఇద్దరూ ఒకరికొకరు తారసపడ్డారు.


తక్షకుడు కూడా బ్రహ్మణ వేషధారియై, కశ్యపుని చూసి మహాత్మా! తమరెవరు? ఎచ్చటికీ పయనం? అని అడిగాడు.


 ఏదో బీద బ్రాహ్మణుడిని. రాజుగారు ఏనుగెత్తు ఐశ్వర్యం ప్రసాదిస్తానంటే, నా మంత్రమహిమ వినియోగించే అవకాశం వచ్చింది కదా అని సంబరపడుతున్నాను అంటూ దాపరికం లేకుండా అసలు విషయం చెప్పేశాడు.


అమాయక బ్రాహ్మణుడా! పరీక్షిన్మహరాజుని కాటూవేయబోయేది ఏదో నీటిపామో, బురద పామో అనుకుంటున్నావా? సర్పరాజు వాసుకితో సమానుడైన ఇంకొక సర్పాధిపుడు తక్షకుడే స్వయంగా అయితేనో? అన్నాడు.


తక్షకుడైనా కానిమ్ము! అతడ్ని మించిన ఆదిశేషుడైనా కానిమ్ము! నా దగ్గర ఉన్నది గారడీవాడి పాముమంత్రమో, విషకీటక మంత్రమో అనుకుంటున్నావా? అని ప్రశ్నించాడు కశ్యపుడు.


అంత గొప్పవాడివా! నేనే ఆ తక్షకుడ్ని అని నిజరూపం చూపించాడు తక్షకుడు. 


అంతటా కశ్యపుడు, సర్పరాజా! నీకిదే నా ప్రణతి! దీనితోపాటే నా వినతి కూడా విను! మంత్రాధిష్ఠాన దైవానుగ్రహం వల్ల నువ్వు రాజును కాటువేసినా గాని, దాన్ని విరిచెయ్యగల మంత్రాన్ని అనుష్ఠించిన వాడను! తక్షణం విషహరమంత్రం ప్రయోగించి, ప్రభువును రక్షించి బహుమానం పొందగలను. ఇది నా దృఢవిశ్వాసం అని అన్నాడా కశ్యపుడు.


అపుడా తక్షకుడు, తమ ఆత్మవిశ్వాసం కడు శ్లాఘనీయమే! భూసురోత్తమా! ఈ మర్రి చెట్టునుచూడు! దీని ఊడలు ఏవో, మొదలు ఏదో తెలియరానంత దట్టంగా ఉంది కదా! లెక్కపెట్టడానికి సాధ్యం కానన్ని పక్షులకిది ఆలవాలమై కూడా ఉంది. దీన్ని ఉన్నదున్నట్లుగా బూడిద చెయ్యగల నా విషశక్తి చూడు! అని ఆ చెట్టును కసితీరా కాటువేశాడు తక్షకుడు. 


కశ్యపుడు అదంతా చిరునవ్వుతో చూస్తున్నాడు. తక్షకుడు చెప్పినదాంట్లో ఆవగింజంతయినా అబద్ధంలేదు. ఆ మహా విషకీలలకు, చెట్టు నిలువునా మాడి బూడిదైపోవడం కళ్లారా గాంచి, అయింది కదా తక్షకా! ఇప్పుడు చూడు! అని పిడికెడు బూడిదను ఆ భస్మరాశి నుంచి తీసుకుని, అత్యంత శ్రద్ధా భక్తులతో అధిష్ఠాన మంత్రజపం చేసి అభిమంత్రించి 


ఆ బూడిదను కుప్పపై పోసి జలం సంప్రోక్షించి విడిచినాడు. 


చిత్రాతిచిత్రంగా మొత్తం సకల పక్షిగణ సహితంగా ఆ మహావృక్షం ఎప్పటిలాగానే అక్కడ నిలబడింది. అతడు సామాన్యుడు కాడని సర్పరాజుకి అర్థమైంది. 


వెంటనే తక్షకుడు ఆయన చేతులు పట్టుకుని మహామంత్రద్రష్టా! తమను తక్కువగా అంచనా వేసినాను, నా అజ్ఞానాన్ని మన్నించండి! తమకు తెలుసో... లేదో, నిజానికి పరీక్షిత్తు శాపరూపాన మృత్యుదేవుని సదనానికి వెళ్లవలసిన విధి ఉంది. లేకుంటే, అంతటి ధర్మమూర్తికి సహజ మరణం సమీపించడం ఇప్పట్లో దుర్లభం. త్వరలో కలిప్రవేశం జరగబోతోంది. అప్పటికి జనమేజయుడు రాజుగా ఉండాలంటే, తక్షణం పరీక్షీతుని అంకం పరిసమాప్తం కావాలి! ఇది విధాత కృతమే గాని, పరీక్షిత్తుకు సహజంగా జనించిన వికృతం కానేకాదు. 


ఇంతకూ తమకు కావలసింది.... అని తక్షకుడు మాట పూర్తి చేసేలోగా ధనమయ్యా! ధనం! అన్నాడు. అంతేకదా! ఈ విలువైన నాగమణులు తీసుకోండి! ఇంకా వజ్ర వైఢూర్యాలు మీపరం చేస్తాను అని అప్పటికప్పుడే పాతాళ నిధుల్లోని విలువైనవి కశ్యపునికి బహుకరించి పంపివేసినాడు.


ఇంతవరకూ కథ బాగుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినది చాలా వున్నది.


మన తలరాత బాగా లేకపోతే సహాయం చేసే వాళ్లు దరిదాపులలో కూడా కనిపించరు.


ఓక వేళ కశ్యపుడు లాంటివాడు బయలుదేరినా వారిని ప్రక్కకు తప్పిస్తుంది కాలం. 


అదే మనం చేసుకొన్న పాపం,కర్మఫలం.


పాపకర్మ బలీయంగా వుంటే ఎవ్వరూ సహాయం చేయలేరు, ఆఖరికి భగవంతుడు కూడా.


ఎందుకంటే వాడి కర్మ కలిసిరావాలి. 


కౌశికుడు రాజును రక్షించుదామని బయలుదేరినా, పరీక్షిన్మహారాజు యొక్క పాపకర్మ అడ్డు పడినది.


ఏమిటి ఆ పాప కర్మ?  


ఓక ముని మీద చచ్చిన పామును వేయడం. 


మంచివారితో మహాత్ములతో చెలగాడటం.


కోరి కోరి తన మృత్యువును అహంకారంతో కొని తెచ్చుకొన్నాడు.


రాజు, మునిశాపం వలనో, తక్షకుడి కాటు వలనో చనిపోలేదు, *కేవలం తన కర్మ చేతనే చనిపోయినాడు.


పరీక్షిత్తు మహారాజుకు, గ్రహముల వలన కీడు జరగలేదు. ఇక్కడ తక్షకుడు ఎంత నిమిత్తమాత్రుడో, అదే విధముగా గ్రహములు కూడా! మానవునికి, కర్మ ఫలము నొసగడంలో గ్రహముల యొక్క ప్రమేయం వుంటుంది. 


మన పాపములు గ్రహముల రూపములో మనల్ని కర్మఫలం అనుభవింప జేస్తాయి.


నిజానికి ఏ గ్రహమూ మనల్ని ఏమీ చేయదు.


మన పాపకర్మే గ్రహరూపంలో వచ్చి బాధిస్తుంది.


కర్మ బలీయమైనది.

🙏🏻

వామనావతారము

 👆   .వి.ఆర్. ఈశ్వర్ గారి సందేశం. 👇

వామనావతారము


ఈ రోజు (17 సెప్టెంబర్ 2021) భాద్రపద బహుళ ద్వాదశి అనగా శ్రీ మహావిష్ణువు వామనావతారం లో జనించిన పర్వదినం. ఈ రోజును వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా మరియూ శ్రవణ ద్వాదశి గా కూడా వ్యవహరిస్తారు. అయితే శ్రవణ ద్వాదశి- (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణ ద్వాదశి అంటారు) "వామనజయంతి" ని భాద్రపద శుక్ల ద్వాదశినాడు జరుపుతారు !


శా. ఇంతింతై వటుఁడింతయై మరియుఁ దానింతై నభోవీధిపై

      నంతై తోయద మండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై

      నంతై చంద్రుని కంతయై ధ్రువుని పైనంతై మహర్వాటిపై

      నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై


పోతనగారి ఈ పద్యం ఏదో ఒక సందర్భంలో వినని వారుండరనుకుంటాను. అంచెలంచలుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ‘ఇంతింతై వటుడింతయై అన్నట్టు ఎదిగిపోయాడు’ అని చెప్పుకోవటం పరిపాటి. అంతగా తెలుగు ప్రజల నాలుకల మీద – కనీసం ఈ పద్యములోని మొదటి పాదము ఐనా – నిలిచిపోయింది. ఈ పద్యంలోని ప్రసన్నమైన శైలి చెప్పకనే చెబుతుంది ఇది బమ్మెర పోతనామాత్యుని పద్యమని. పోతన ఆంధ్రీకరించిన భాగవతం అష్టమ స్కంధంలో – వామనుడు త్రివిక్రముడై పెరిగిపోయే దృశ్యాన్ని అత్యంత సహజసుందరంగా వర్ణించిన పద్యం ఇది.


ఒకప్పుడు బలి అనే రాక్షస రాజు ఉండేవాడు. ఆయన ఎవరో కాదు... సాక్షాత్తు ఆ ప్రహ్లాదుని మనవడే! బలి భాగవతోత్తముడు, మంచివాడే, తన ప్రజలను కన్నబిడ్డలలా చూసుకునేవాడే. కానీ రాక్షసుడు కావడం చేత దేవతలంటే సరిపడేది కాదు. రాక్షస గురువు శుక్రాచార్యుని సహాయంతో బలి ఏకంగా ఆ స్వర్గం మీదకే దండెత్తాడు. తమను రక్షించమంటూ దేవతలంతా వెళ్లి ఆ విష్ణుమూర్తినే శరణువేడారు. అలా భాద్రపద బహుళ ద్వాదశి నాడు అదితి గర్భాన చిన్నారి విష్ణుమూర్తి జన్మించాడు వామనమూర్తి గా !


బలి చక్రవర్తి వద్ద నుంచి మూడడుగుల నేలను దానంగా పొంది, ఒక అడుగును భూమిపై మోపి, రెండో అడుగుతో బ్రహ్మాండాన్ని ఆక్రమించడం కోసం క్రిందనుంచి ఒక్కోదాన్నే దాటుకుంటూ ఎలా విజృంభించాడో, ఏ విశేషణాలూ లేకుండా, ఒక మహాద్భుత దృశ్యాన్ని కండ్ల ముందు రూపు కట్టించాడు పోతన.


ఇంతైనాడు, మరింకింతైనాడు, ఆకాశానికి అంతైనాడు, మేఘమండలానికి అల్లంతైనాడు, జ్యోతిర్మండలానికి అంతైనాడు, చంద్రుణ్ణి దాటాడు, ధ్రువుడికి ఇంకా పైకి సాగాడు, మహర్లోకం దాటినంతైనాడు, సత్యలోకంకన్నా ఉన్నతంగా ఎదిగాడు. బ్రహ్మాండమంతా నిండిపోయాడు – ఇదీ ఒక కుబ్జబాలకుడు క్రమక్రమంగా అజాండభాండాన్ని ఆక్రమించిన త్రివిక్రమ స్ఫూర్తి. క్రింద మునులూ, బలి చక్రవర్తీ, శుక్రుడూ నివ్వెరపోయి చూస్తున్నారు. క్షణం పూర్వం కండ్లముందు నిలుచున్న బ్రహ్మచారి బాలకుడు – ఒక్కసారిగా కాదు – క్రమక్రమంగా ఎదిగి భూనభోంతరాలు నిండిపోవడాన్ని ఇంతకన్నా అందంగా రూపు కట్టించడం అసాధ్యమనుకుంటాను. పద్యం పద పదానికీ విరుగుతూ, వామనుడు పదపదానికీ పెరుగుతూ పోయే క్రమతను రూపించింది. ఇంతై, అంతై, దీనికింతై, దానికింతై అంటూ ఒక గొప్ప దృశ్యానికి ప్రత్యక్ష వివరణ, ప్రత్యక్ష ప్రసారము ఏకకాలంలో చేశాడు కవి. ఈ పద్యం మనసులో పట్టించుకొని చదువుతూ ఉంటే ఒక రవినగాయిచ్ సినీమాటిక్ దృశ్యం కండ్లముందు నిలిచిపోతుంది.


వామనుడు బలి చక్రవర్తిని దాన మడిగిన తీరు చాలా విచిత్రంగా ఉంది. మూడడుగులు దాన మిమ్మని స్పష్టంగా పలుకక ‘ఒకటి రెండడుగుల మేర’ అన్నాడు. ఏమిటిది? ఒకటి, రెండు కలిపితే మూడనే అర్ధం వచ్చేటట్లు పద్యాన్ని తీర్చినాడా పోతన్న? కాదు. ఒకటి భూమి, రెండు ఆకాశం. వామనుడికి ఉన్న రెండు పాదాలు భూమిని, ఆకాశాన్ని ఆక్రమించాయి. ఇక మూడవ అడుగునకు చోటెక్కడిది? అదే బలి శిరం. తద్వారా బలికి విష్ణుసాయుజ్యం. మూడడుగుల దానమిస్తే నేను నీవాడినై నీతో ఉండి నిన్ను కాపాడుతాను అన్నాడు హరి. ఈ మూడడుగులు జీవుని సర్వస్వాలైన జాగ్రత్, స్వప్న, సుషుప్తులు అనబడే అవస్థలే. ఇవి నాది అనే భవబంధానికి కారణం. ‘తవైవ వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే’ అని భగవంతునికే సమర్పిస్తే ఆయనే ‘యోగక్షేమం వహామ్యహమ్’ అంటూ కాపాడుతాడు. ఈ అద్భుత సత్యాన్ని వ్యాసులవారు వామన ఘట్టం ద్వారా స్పష్టం చేసినాడు. ఈ నిగూఢార్థం బలికి శుక్రునకు ఇరువురకు తెలిసినప్పటికి వారివారి సంస్కారాలకు అనుగుణంగా వారు తమతమ మార్గాలు నిర్దేశించుకున్నారు.


ఇంతేకాదు. ఈ పద్యం తరువాతనే మరో పద్యం ఉంది. క్రిందినుంచి వామనుడు క్రమక్రమంగా పైకి పోయే కొద్దీ పైనున్న సూర్యబింబాన్ని ఈ పెరిగే పెద్దమనిషితో కలిపి చూపిస్తూ ఆ రవిబింబపు దశల్లోని వివిధరూపాలని వర్ణించిన పద్యం అది. ఇంతకు ముందు చూపిన దృశ్యాన్నే మరో కోణంలో చూపించడమన్నమాట. వామనుడు పెరిగేకొద్దీ సూర్యబింబం ఎలా ఉందంటే, ముందు ఒక గొడుగు లాగా అతని తలపై కనిపించి, క్రమంగా శిరోరత్నం గానూ, చెవి కమ్మగానూ, నగగానూ, బంగారు జాజుబందీ లాగానూ, కరకంకణం లాగానూ, నడుముకు కట్టిన మొలతాటి బంగారు గంట గానూ, పాదాల అందె గానూ ఆఖరుకు పాదపీఠం గానూ ఉపమించడానికి యోగ్యంగా కనిపించిందట. ఆ పద్యం కూడా చిత్తగించండి.


రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణ కేయూరమై

ఛవి మత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండ మున్నిండుచోన్


మహానుభావుడు పోతన. కథ పాటికి కథ నడిచిపోతున్నా, భగవంతుని లీలలను వర్ణించే ఘట్టం వచ్చేసరికి పోతనను తెలియనంత తాదాత్మ్యం ఆవహిస్తుంది. ఆ తాదాత్మ్యంలో వ్రాసే పద్యాలు హృదయాలను పట్టుకునేవిగా రూపొందుతాయి. ఆ పద్యాల్లో గణాలు, యతులు, ప్రాసలు ఇవ్వన్నీ వాటి ప్రాథమ్యాన్ని కోల్పోయి, ఒక మహాభక్తుని ఆంతరంగ పారవశ్యం వాటిల్లో పొంగిపొరలుతూ వుంటుంది. భాగవతంలోని అనేక ఘట్టాలు – ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షము, రుక్మిణీ కళ్యాణము, కృష్ణ లీలలు, అంబరీషోపాఖ్యానము లాంటివి – దీనికి తిరుగులేని సాక్ష్యాలు. భాగవతం లాంటి గొప్ప భక్తి పురాణం పోతన చేతిలో పడి తెలుగులోకి రావటం, తెలుగు జాతి చేసుకున్న గొప్ప అదృష్టం. దీనికి రెండోమాట లేదు.


వామనావతారం శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో ఐదవ అవతారం. మానవునిగా మొదటి అవతారము. ఈ వామనుడి ప్రసక్తి రుగ్వేదంలోనే ఉందని చెబుతారు. 

సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్య భరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే!


బలి అమరావతి పై చేసిన దేవాసుర యుద్ధంలో దేవతలు విహ్వలులై బృహస్పతి వచనములు విని అమరావతి వీడి పారిపోయారు.


దేవతల దుస్థితిని చూసి, సురమాత అదితి, తన భర్తయైన కశ్యప బ్రహ్మను వేడుకుంటుంది. అంతట కశ్యపుడు అదితికి పయోభక్షణ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. ఆమె ఫాల్గుణ మాసం, శుక్లపక్ష పాడ్యమి నుంచి 12 రోజులు హరిసమర్పణంగా వ్రతం చేసి భర్తను చేరగా, భగవదంశతో, 'శ్రావణ ద్వాదశి' నాడు శ్రోణ అభిజిత్‌ సంజ్ఞాత లగ్నంలో, రవి మధ్యాహ్నమున చరించునప్పుడు, గ్రహ తారా చంద్ర భద్ర స్థితిలో వామనుడు జన్మించాడు.


వామానావ‌తారాన్ని పోత‌నామాత్యులు త‌న ప‌ద్య చిత్ర‌ణ ద్వారా తెలుగు ప్ర‌జ‌ల క‌ళ్ల‌ముందు నిల‌బెట్టాడు.


ఒక్కొక్క ప‌ద్యం చ‌దువుతూ వామ‌నావ‌తార ఘ‌ట్టాన్ని స్మ‌రించుకుంటే మీ కళ్లెదుటే విష్ణుమూర్తి, బ‌లిచ‌క్ర‌వ‌ర్తి గ‌ర్వాన్ని అణిచిన‌ దృశ్యం క‌నిపించేలా వామ‌నావ‌తార ‌ఘ‌ట్టానికి

ప్రాణం పోశాడు పోత‌న‌.


పోత‌న ప‌ద్యాలు చ‌దివి త‌రించండి.

తెలుగువాడిగా గ‌ర్వించండి.

            ***


వామనుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, మకరకుండల మండిత గండ భాగుడై, కపిల రంగు వస్త్రమూ, కదంబ వనమాల సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా, జ‌గ‌న్మోహ‌నుడిగా అదితి గ‌ర్భం నుంచి అవ‌త‌రించాడు.

వెంట‌నే,

తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, వటుని వలె, ఉపనయన‌ వయస్కుండై వామన బాలకుడయ్యాడు.


వామనుడికి వడుగు చేయడం కోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు.

పోతన గారి ఉపనయన వర్ణన అద్భుతం అనిర్వచనీయమయిన సంతోషం తో మన వెన్నుగగుర్బాటుచెందుతుంది 🙏


బృహస్పతి యజ్ఞోపవీతాన్ని ఇచ్చాడు . కశ్యప మహర్షి మొలత్రాడు ప్రసాదించాడు. తల్లి అదితి కౌపీనాన్ని , భూమాత నల్లజింక చర్మాన్నీ , చంద్రుడు దండాన్నీ , గగనాధిష్ట దేవత ఛత్రాన్నీ , బ్రహ్మ కమండలువునూ , సరస్వతి అక్షమాలికనూ (జపం చేసే సమయాన జప సంఖ్యను లెక్కపెట్టుకోవడానికి) , సప్తర్షులు పవిత్రాలను ( కుశలను/దర్భలు ) వామన మూర్తికి బహూకరించారు. స్వయంగా సూర్యభగవానుడే గాయత్రీ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇవే కాక


బిక్షాపాత్రిక నిచ్చెను, యక్షేశుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను, బిక్షునకు భవాని పూర్ణ బిక్ష నరేంద్రా.


కుబేరుడిచ్చిన అక్షయ పాత్రలో, స్వయంగా సాక్షాత్కరించి పూర్ణ బిక్ష పెట్టింది అన్నపూర్ణాదేవి. నిజంగా వామనుని సౌభాగ్యమే సౌభాగ్యం. ఏ బ్రహ్మ చారికైనా ఇంతకంటే కావలసిందేముంటుంది గనుక. అసలు ఉపనయనానికి బహుమతిగా ఇవ్వవలసిన వస్తువులు ఇవి మాత్రమే .


ఈ పద్యం పిదప వచ్చే పోతన పద్యాలన్నీ అద్భుతం, అజరామరం. ఉదాహరణకు

 

“స్వస్తి జగత్రయీ, కలరున్ దాతలు నిత్తురున్ ధనముల్, ఇంతింతై వటుడింతయై” లాంటివే కాకుండా మరింకెన్నో. పోతన భాగవతంలో వామన చరిత్ర చదివి అనందింని వారెవ్వరూ ఉండరు చదివిన వారి అదృష్టమే అదృష్టం 👏


ఆవిధముగా బలిని వామనుడు అణచివేసే రోజు కోసం దేవతలందరూ ఎదురుచూడసాగారు.

మహాబలి ఒకసారి అశ్వమేథ యాగాన్ని తలపెట్టాడని తెలిసింది. దాని రంగస్థలం నర్మదానది ఉత్తర భాగాన. అతన్ని అణగదొక్కేందుకు ఇదే సరైన అదనుగా భావించిన మన చిన్నారి బ్రాహ్మణధారియైన వామనుడు హోమ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని భిక్ష కోసం, యాగశాల వద్దకు చేరుకున్నాడు. అప్పటికి యాగంలో భాగంగా దానధర్మాలు సాగుతున్నాయి. అందరితో పాటుగా వామనుడు కూడా రాజు చెంతకి చేరాడు.


అతనిని చూచి జనులు గుజగుజలు పోవుచూ, గజిబిజి పడుచూ, కలకలములై ఎవరీ పొట్టి బాలుడు? శివుడా? హరియా? బ్రహ్మయా? సూర్యుడా? అగ్నియా? ఈ బ్రహ్మచారి ఎవరు? అని విస్మయం చెందారు. కొందరితో చర్చించుచూ కొందరితో జటలు చెప్పుచూ, గోష్ఠిలో పాల్గొనుచూ, తర్కించుచు, ముచ్చటలాడుచు, నవ్వుచూ అనేక విధంబుల అందరికీ అన్ని రూపులై వినోదించుచూ వామనుడు రాజును ఎట్లా సమీపించెనో వర్ణించడములో పోతన తన కల్పనల్లో శబ్ద లేదా అర్థగతమైన శిల్పాన్ని పాటించకుండా ఉండలేరు. వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు ఎట్లు చేరినంటే -


వెడవెడ నడకలు నడచుచు

ఎడనెడ నడుగిడుచు నడరి యిలదిగబడగా

బుడిబుడి నుడువులు నుడువుచు

చిడిముడి తడబడగ వడుగు చేరెన్ రాజున్. రాజును సమీపించి .. 


"స్వస్తి ! జాగత్త్రయీ భావన శాసన కర్తకు! హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు, ఉదారపద వ్యవహర్తకు, మునీంద్ర స్తుత మంగళాధ్వ విధాన విహర్తకు, దానవ లోక భర్తకు స్వస్తి అని దీవించెను.


ఆ వడుగు ఆయనను అడుగుటకై వెళ్ళినట్లు చెప్పిన రెండు పద్యాలు సర్వలఘు కందాలే.


హరిహరి; సిరి యురమునఁ గల

హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;

బరహితరత మతియుతులగు

దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్


దీనివల్ల పరులను యాచించేవాని తక్కువదనాన్ని స్ఫురింపజేసినాడు. అయితే తన దైవం పరహితానికే దాన మడుగుచున్నాడు కాన అది మంచిపనియే అని సమర్థించినాడు.


బలి అతనికి సముచితాదరమిచ్చి గౌరవించి... 

 

వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది

య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్

కడు ధన్యాత్ముడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నా కోరికల్

కడ తేరెన్ సుహ్రుతంబులయ్యె సఖులున్ కళ్యాణ మిక్కాలమున్ !!


ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడంవల్ల నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది. అన్నాడు బ‌లి చ‌క్ర‌వ‌ర్తి.

దాన మిచ్చేటప్పుడు యాచకుని ఊరు పేరు అడుగరాదని శాస్త్రము నిర్దేశిస్తున్నది. అయితే 

అడిగినవాడు పరమభాగవతుడు. వచ్చినవాడు ఆశ్చర్యం గొలుపు బ్రహ్మవటువు. అంతేకాక వెంటనే ‘నీ వరుదెంచుటన్ సఫల మయ్యెన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడ నైతి’ అనుటలో బలి ఉదాత్తత ద్యోతక మగుచున్నది. అతిథి రాకపట్ల ఆనందాన్ని సంతృప్తిని వ్యక్తం చేయాలే తప్ప ముఖం మాడ్చుకోరాదు. ఇట బలి ఉత్తమ గృహమేధియై దర్శనమిస్తున్నాడు.


ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?” అని అడిగాడు.

                                        ****

ఒంటి వాడ నాకు నొకటి రెండడుగుల

మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల

కోర్కె దీర బ్రహ్మ కూకటి ముట్టెద

దాన కుతుక సాంద్ర దానవేంద్ర !!


ఓ దానవరాజా! దానం చేయాలనే చిక్కని కుతూహలం కలవాడా, బలిచక్రవర్తీ, నేను ఒంటరివాడిని ... నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. నొకటి రెండడుగుల అంటే మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను.

                         

అర్థించేవాడికి లేక పోయినా, దాత గొప్ప‌తనాన్ని చూసి అయినా గొప్ప‌గా అడ‌గాలి క‌దా అన్న బ‌లి చ‌క్ర‌వ‌ర్తి మాటలకు వామనుడు ...


" రాజా ఒంటి వాడను నేను. నాకు ఒకటి మరియు రెండడుగుల మేర యిమ్ము" . అయినను అడుగమంటివి కనుక అడిగితిని. దాత పెంపు సొంపు తలపవలెను గదా! కావున నాకు మూడడుగుల నేలనిమ్ము, చాలు అని మాయావడుగు పలికెను. 


అపుడు ఎలాంటి దానం అడ‌గాలో వామ‌నుడికి ఇలా చెబుతున్నాడు బ‌లి...


"వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్

వెస నూహించితొ కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో

పసి బాలుండవు నేరవీవడుగ నీ భాగ్యంబు లీపాటి గా

కసురేంద్రుండు పద త్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే ?"


 “భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.” అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనమూర్తి తో !


గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో

వడుగే నెక్కడ? భూములెక్కడ ? కరుల్ వామాక్షు లశ్వంబు లె

క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూ

డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!


“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం..... అన్నాడు వామ‌నమూర్తి !


ఇక్కడ యదృచ్ఛాలాభ సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు వామనుడు. అట్లే దాతగా ప్రశస్తి గన్న బలి ‘అభ్యాగత స్వయం విష్ణుః’ అని భావించి తృప్తిగా ఎంతైనా ఇచ్చుటకు సంసిద్ధుడైనాడు. 


కాని ‘ఒకటి రెండడుగుల మేర ఇమ్ము’ అన్న పొట్టి వడుగుతో దాత స్థాయిని బట్టి అడుగనక్కర లేదా?’ అనే సందేహాన్ని వ్యక్తం చేసినాడు బలి. అప్పుడు వామనవటువు ‘నీవు రాజు వనుచు నిఖిలంబు నడుగుట తగవు కాదు’ అని ‘సంతుష్టుడు ముల్లోకాలలో పూజ్యు డగు’ నని, సంతోషికి ఎప్పుడూ సుఖమే ప్రాప్తిస్తుం దని, సంతోషమే ముక్తిమార్గ మని, లభించినదానితో తృప్తిపడేవాని తేజస్సు పెరుగుతూ ఉంటుం దని, ఎవడు నిస్సంతోషుడో వాడు కోర్కెలు తీర్చుకోవటానికై మళ్ళీ మళ్ళీ జన్మ నెత్తుతూ నరకకూపంలో పడి కాంతి చెడుతా డని చెప్పినాడు. ఇది అసంతృప్తులకు కన్నులు తెరిపించే నీతి.


ఆ వామనుడిని విష్ణువుగా గుర్తించిన శుక్రుడు బలి చక్రవర్తిని వారించెను. బలి గురువుకు వినయముగా నమస్కరించి ...ఇచ్చెదనని పలికితిని. ఆడిన మాట తప్పను అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు నీవిచ్చినచో అఖిలంబు పోవును. అంతేకాక...


"వారిజాక్షులందు వైవాహికములందు

ప్రాణ విత్త మాన భంగమందు

చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు

బొంక వచ్చు నఘము వొంద దధిప !!


బొంకవచ్చు.....తప్పు లేదు.....అనే దుర్నిర్ణయాన్ని త్రోసిరాజన్నాడు బలి చక్రవర్తి ..


కారే రాజులు రాజ్యముల్‌ కలుగవే, గర్వోన్నతింబొందరే వారేరీ? సిరి మూట గట్టుకొని పోవంజాలిరే? భూమిపై పేరైనంగలదే!


శిబి లాంటి దాతల పేరు ఈనాటికీ స్థిరములైనవి కదా, భార్గవా! అని పలుకుతూ తన మాటను తోసి పుచ్చిన రాజును పదభ్రష్ఠునివి గమ్మని శుక్రాచార్యుడు శపించాడు. దానికి బలి చక్రవర్తి .. చిట్టెడు విత్తి పుట్టెడు రాల్చుకొను రైతునకు వలె దాతకూడా మంచి మనస్సుతో దానం చేస్తే అది కొంచెమైనా అనంతమైన ఫలితాలను ఇస్తుందనే విశ్వాసాన్ని ప్రకటించినాడు. ‘మేరువు తలక్రిందైనను…. తప్పక ఇత్తున్’ అన్నది ఆయన తుది నిర్ణయం. దానం ఇచ్చేటప్పుడు “విప్రాయ ప్రకట వ్రతాయ। భవతే విష్ణు స్వరూపాయ।” అనటంలో పోతన భాషామర్యాద చూపినాడు. ఈ సంబోధనలన్నీ చతుర్థీ విభక్త్యంతాలు. ఒక వస్తువుపై తనకు గల హక్కును సంపూర్ణంగా వదులుకొని ఇచ్చేటప్పుడే చతుర్థి వాడాలనే సంస్కృత వ్యాకరణ సంప్రదాయం పాటించినాడు. పాత్ర నెరిగి చేసిన దానమే గుర్తింపబడుతుంది.


కమలనాభు నెరిగి, కాలంబు దేశంబు

నెరిగి, శుక్రు మాట లెరిగి, నాశ

మెరిగి, పాత్ర మనుచు నిచ్చె దానము బలి,

మహి వదాన్యు డొకడు మరియు గలడె।


అంటాడు పోతన్న. ‘తముదామె వత్తు రర్ధులు, క్రమ మెరిగిన దాత కడకు రమ్మన్నారా కమలమ్ములున్న చోటికి భ్రమరమ్ముల’ అనేది ప్రకృతినీతి. తుమ్మెద యొక్క పాదతాడనకు వెరువక, దాని నలుపునకు తనకు పులుముతున్న దని ఈసడింపక, గుండెలోతుల మాధుర్యాన్ని కొల్లగొడుతున్నా చలింపక, పద్మము తుమ్మెదను ఆహ్వానిస్తుంది. అర్హులైనవారికి అవసరమైనది అందించుటలో గల ఆనందం ఇట్లే ఉండును.

ఇక్కడ అవతలి వ్యక్తి ఎవ్వరో, ఎందుకు వచ్చాడో బలిచక్రవర్తికి తెలుసు. శ్రీహరి స్వయముగా తనకోసమే వామనుడై అవతరించాడంటే ఆ శ్రియఃపతి తనను దీవించి మోక్షమీయడానికే అన్నది తనలో రూఢి అయ్యింది. మనం అనుభవిస్తున్న సంపద అంతా మనదా? కాదు. భగవంతుడు ఇచ్చినదే. ఆయనది ఆయనకే కైంకర్యం చేయడంలో మనం నిమిత్తమాత్రులై ఉపాధిస్థానీయులై ఉండటంలో ఎంతో గొప్పతనం ఉంది. అలాకాకపోతే ఒక్కమారు మన అనుభవంలోనికి వచ్చిన దానిని వదులుకోవడానికి చాలా ఆవేదన చెందవలసివస్తుంది. అందుకై బలి త్యాగానికి పీటవేశాడు. దైవార్పణగా పరుల కిచ్చిన దానికంటే దైవమే గ్రహించిన దాని ఫలితం ఎంతో గొప్పదని పోతన్నయే క్రింది పద్యంలో పేర్కొన్నాడు.


పరమేశ్వరార్పణంబుగ

పర జనులకు భిక్ష యిడిన పరమ పదంబుం

బరగెదరట తుది సాక్షా

త్పరమేశుడు భిక్ష గొన్న ఫలమెట్టిదియో!


స‌క‌ల జ‌గ‌త్తుకూ మూల‌మైన

వామన మూర్తి యాచనా హస్తం కింద‌,

దాత‌గా త‌న హ‌స్తం పై న ఉండ‌డాన్ని ఆలోచించుకుని ఉప్పొంగి పోయాడు బ‌లి....


ఆదిన్ శ్రీసతి కొప్పు పై తనువు పై నంసోత్తరీయంబు పై

పాదాబ్జంబుల పై కపోల తటి పై పాలిండ్ల పై నూత్న మ

ర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే

ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !!


ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం దాత‌గా నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా. అనుకున్నాడు బ‌లిచ‌క్ర‌వ‌ర్తి..


ఆ విధంబున బలిచక్రవర్తి హరిచరణములు కడిగి, త్రిపాద ధరిణిం దాస్యామి అనుచు నీటిధార విడిచాడు. ఆ కలశములో సూక్ష్మకీటక రూపమున చేరి శుక్రాచార్యుడు నీటిధారను ఆపబోయాడు. అప్పుడు హరి కుశాగ్రముతో కలశరంధ్రమును బొడువగా కన్ను పోగొట్టుకొని శుక్రాచార్యుడు (ఏకాక్షి) ఏక నేత్రుడయ్యెను.

పుట్టి నేర్చుకునెనో, పుట్టక నేర్చెనో.. ఈ పొట్టి వడుగునకీ చిట్టి బుద్ధులెట్లబ్బెనో, ఈతని పొట్టనిండా అన్నీ భూములే.. అని నవ్వుతూ మూడడుగుల నేలను బలి వడుగుకు దానమిచ్చెను.


అలా ధారా పరిగ్రహంబు చేసిన, వామనుడు  

త్రివిక్రముడిగా విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.


భాగవత సౌరభము: 


‘నహి జ్ఞాన సదృశం ధనం’ 

          (జ్ఞానానికి మించిన ధనంలేదు),

‘విద్యయా అమృతమశ్నుతే’ 

          (విద్యవల్లనే అమృతత్వం సిద్దిస్తుంది) 

అని వేదం వక్కాణిస్తుంది. ఆదైవీయ జ్ఞానాన్ని, మోక్షవిద్యను ప్రసాదించడంలో భాగవతానిదే అగ్రస్థానం. ఇందలి వామనావతార ఘట్టం వదాన్యులకు ఆదర్శమార్గాన్ని నిర్దేశిస్తూ ఉంది.


బలిచక్రవర్తి యొద్ద దాన దర్పం లేని ‘సత్యకరుణా ధర్మోల్లసన్మూర్తిమత్వం’ గోచరిస్తుంది. ‘తాను చేసిన ధర్మంబు తన్ను కాచు’ అనే ప్రబలమైన విశ్వాసం కలవాడు బలి.


దాన విషయంలో బలి, అతని గురువు శుక్రుడు, ఇరువురు రెండు భిన్న ధృవాలు. మూర్ఖుడు తన దగ్గర ఉన్నది కాస్తా ఇస్తూ పోతే దరిద్రు డవుతా నని భయపడుతాడు. సమ్యక్ దృష్టి ప్రసాదించవలసిన గురువు ఇక్కడ సంకుచిత మనస్తత్వం ప్రదర్శించినాడు. అలనాడు భక్తి విషయంలో తండ్రిని దిద్దిన తనయుడుగా ప్రహ్లాదుడు వెలిగినాడు. నేడు గురువును దిద్దే శిష్యుడుగా ప్రహ్లాదుని మనవడు బలి బలమైన పునాది పై నిలబడినాడు. ‘చిన్నిపాపని త్రోసిపుచ్చగ చిత్త మొప్పదు’ అని ‘మాట తిరుగ లేరు మానధనులు’ అని ‘రానిమ్ము కానిమ్ము పో….. తిరుగన్నేరదు నాదు జిహ్వ’ అని ఘంటాపథంగా పలికినాడు.  

శుక్ర లక్షణం జారిపోవడం. అనగా స్థిరత లేనిది. కావున దానికి విలువ ఈయనక్కరలేదు.

ఒక వ్యక్తిని ఉన్నత సోపానాల చేర్చేది శాశ్వతమైన తిరుగులేని నిర్ణయమే. స్వార్ధపరులకు పనికివచ్చేది తాత్కాలిక నీతి మాత్రమే. అందుకే - బలి ఇహము వదలి పరముని సన్నిధిలో సాయుజ్యము పొందడానికి ఇదొక వరంగా భావించినాడు.


ప్రస్తుతం బలి పదునాలుగులోకాల తర్వాత సుతలంలో ఉన్నాడని, రాబోయే ఎనిమిది మన్వంతరాలలో అనగా ఇప్పటికి ఏడు మన్వంతరాలు గడచిన దృష్ట్యా ఇంకొక్క మన్వంతరానికి ఇంద్రు డవుతాడని పురాణాలు చెబుతున్నాయి. సుతలం అనగా శ్రేష్ఠస్థానం. భగవత్ప్రాప్తిని మించిన మంచిచోటు వేరే ఏముంది? బలి వదాన్యత కారణంగా విష్ణువే సుతల ద్వారపాలకుడై ఉన్నా డని పలకటం బలి యొక్క మహద్భాగ్యం.


బలి దానమీయడానికి సన్నద్ధుడైన వేళ అతనిలో అధైర్యము గాని, నిరాశ గాని లేదు. ఎందు కిస్తా నన్నానా అనే పశ్చాత్తాపం గాని, శుక్రుని మాట విని ఉంటే బాగుండేది కదా అనే ఆలోచన గానీ, భార్య నడిగి అంగీకారం తీసుకోవాలని గాని అనుకోలేదు. అంతా హరికృప అనుకున్నాడు. ఆ పరాత్పరునకు ఎవ్వరిని ఎప్పుడు ఎక్కడ ఎట్లా వాడుకోవాలో తెలుసు. అందుకు మానసిక సంసిద్థతతో మనం ఉండటమే మహనీయ మార్గం. బలిది పారలౌకిక దృష్టి. శుక్రునిది ఇహలోకదృష్టి.

బలి అనగా మాయను తెలిసికోగల ఆత్మబలం ఉన్నవాడు. అందుకే ఆయన. ఎదుట దుర్బలు డయ్యాడు శుక్రుడు. దైవీయ విషయంలో ప్రతి వ్యక్తి బలి సదృశుడు కావాలి.


ఈ ఘట్టంలో చివరగా, పదవీ గర్వం గలవానికి సంపదల మధ్య తులతూగుతున్న కారణంగా చెవులు వినబడ వని, మనస్సు కాడుపడుతుందని, దానితో ధర్మానికి దూరమౌతా డని, నేడు బలిని పదవీచ్యుతుణ్ణి చేసి, అతని సంపద నెల్లా నీ అధీనంలోనికి తెచ్చుకోవడం ద్వారా, రక్షించి మేలు చేసావు.” అని ప్రహ్లాదుడు విష్ణువుతో అంటాడు. సాధారణంగా అన్య దేవతలు భక్తుల్ని కరుణిస్తే దానికి సాక్ష్యంగా రకరకాల ఐశ్వర్యాలను ఇస్తారేమో కాని విష్ణువు దీనికి భిన్నంగా మోక్ష మిచ్చే దృష్టితో భక్తుని సర్వస్వాన్ని హరిస్తాడు.


వామనునకు పోతన్నకు భేదం లేదనిపిస్తుంది. వామనుని పాదాలు ముల్లోకాలను ఆశ్రయించినట్లే ఈ వామనచరిత్రలోని పోతన్న పద్యాలు మూలానికి మూడింత లైనాయి. వామనుని కృప ఆశ్రితులకు వినమ్రులకు ముక్తిని ప్రసాదించినట్లే. పోతన కవిత భాగవత పాఠకులకు పునర్జన్మ లేకుండా చేసింది.

వామనుని ఆవిర్భావంలో వలె మనలో జ్ఞానోదయం తొందరగా కలగాలి. వామన పాదఘాతంచే బ్రహ్మాండం చిట్లి ఆకాశగంగ చిమ్మినట్లు, అజ్ఞానావరణం బ్రద్దలై జ్ఞాన స్రోతస్సు ప్రవహించాలి. దానికి మన సంపదను కీర్తి కండూతితో గొప్పకార్యాలకు ఖర్చుపెట్టక ఉత్తమ కార్యాలకు అర్హులైన ఆశ్రితవర్గాలకు సమంగా వ్యయించాలి. యాచన అనివార్యమైతే మంచిపనులకే చేయిచాచాలి. దానం స్వీకరించవలసివస్తే అవసరాన్నిమించి తీసుకోరాదు. ప్రపంచం విశ్వాసంమీద నడుస్తున్న దృష్ట్యా దాన్ని పెంపొందించుకోవాలి. విశ్వాసం ఎట్టివాని నైనా రక్షిస్తుంది.


'వామన' జయంతి ప్రత్యేకత:


వామన జయంతి ని భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జరుపుతారు. బహుశా వామనుడు శ్రవణ నక్షత్ర అభిజిత్ లగ్నమున అవతరించాడు కాబట్టి 'శ్రావణ ద్వాదశి' అని కూడా అంటారు !  


బలి రాక్షసుడే కావచ్చు. కానీ ప్రజారంజక పాలకుడిగా పేరొందినవాడు, తన ప్రజలని కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు. అందుకే ఓసారి తిరిగివచ్చి తను పాలించిన ప్రాంతాన్ని చూసుకునే వరం ఈయమని వామనుడికి అడిగాడు. ఆ వరం ప్రకారమే ప్రతి ఏటా బలి పాలించినట్లుగా ప్రదేశాల్లో పేర్కొనే కేరళ ప్రజలు తన ప్రజలు సుఖసంతోషంగా ఉండటాన్ని చూసి, తృప్తిగా తిరిగి స్వర్గానికి మరలిపోతాడని అందుకు ఆయన ప్రతి సంవత్సరం .. “తిరువోణం” దినమున తమ ప్రభువు తమ వద్దకు వస్తాడని విందు భోజనం తయారు చేసి బలికి నివేదిస్తారు. కాలక్రమేణా ఆ శుభ దినమున కేరళీయులు తిరు "ఓణం" పర్వదినముగా వేడుక జరుపుకుంటున్నారు !


మూడు అడుగులతో ఈ లోకాన్ని జయించాడు కాబట్టి వామనుడికి త్రివిక్రముడు అని పేరు. ఆ త్రివిక్రముని పేరు మీద చాలా ఆలయాలు కూడా ఉన్నాయి. కంచిలో ఉన్న ‘ఉళగలంద పెరుమాళ్‌’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం వీటిలో ప్రముఖమైనవి. ఇవే కాకుండా ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా వామనుడి ఆలయాలు కనిపిస్తాయి.

మిత్రానందపురము వామన మూర్తి దేవాలయం, చెరుపు, త్రిస్సూర్, థ్రికక్కర (థ్రికక్కర ఆలయం), కొచ్చిన్ మరియూ వామన కంచిలో అద్భుతమైన వామన అవతారం గుడి ఉంది. తిరుకొయిలూర్, విల్లుపురము జిల్లా, తమిళనాడు.


బలి గమ్యం లేని శక్తికి ప్రతీక, వామనుడు లక్ష్యం ఉన్న జ్ఞానానికి సూచన. వామనుడు కోరిన మూడు అడుగులకు కూడా చాలా అర్థాలే చెబుతారు. సత్వరజోతమోగుణాలనీ, సృష్టిస్థితిలయలనీ సూచిస్తాయని అంటారు. ఇక తల మీద పాదం మోపడం అంటే అహంకారాన్ని అణచివేయడమే! వామన జయంతి సందర్భంగా ఆ విష్ణుమూర్తని కొలిచినవారు కూడా ఆ అహంకారాన్ని జయించి, ఈతి బాధల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు !


ఓం నమో భగవతే వాసుదేవాయ 

🙏

 *ఎం. వి. ఆర్ . ఈశ్వర్.*

ఒరవడులు సృష్టిస్తున్న కావ్య

 భారతీయ వైదిక శాస్త్రాల మీదున్న నమ్మకంతోనే.– అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడులు సృష్టిస్తున్న కావ్య


వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాల రూపకల్పన


– ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న తెలుగు మహిళ


నేటి తరం యువత పురాణాలు, ఇతిహాసాలను కల్పితాలుగా భావిస్తోంది. వాటిని అద్భుతమైన ఊహలుగా పేర్కొంటోంది. యువతలో ఆధ్యాత్మిక చింత కొరవడుతున్న నేటి సమాజంలో పురాతన భారతీయ శాస్త్రాలను ఆధారం చేసుకొని విమానాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తోంది ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావ్య వడ్డాది.


భారతీయ వైమానిక శాస్త్రాన్ని ఆధారం చేసుకొని కావ్య తన పరిశోధనలను కొనసాగిస్తోంది. నేటి సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పర్యావరణం దెబ్బతింటోందని, భూ ఉపరితలం చెత్తతో నిండిపోతోందని, అలాంటి వాటిని నిర్మూలించేం దుకు భారతీయ విమాన శాస్త్రం ఉపయోగపడు తుందని ఆమె ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతోంది.


వైమానిక రంగంలో తన పరిశోధనలతో భారతీయ శాస్త్ర వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది కావ్య వడ్డాది. సైన్స్‌తో భారతీయ శాస్త్రాలను పోల్చడం అవమానంగా భావించే ఆధునిక శాస్త్రవేత్తల నోరు వెళ్లబెట్టేలా చేస్తోంది. ఋషులు భారతీయుల కోసం రూపొందించిన జ్ఞాన సంపద గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు కషి చేస్తోంది. తనకు ఇష్టమైన అంతరిక్ష రంగంలో కొత్త ఒరవడులను సష్టించేందుకు ఉల్లాసంగా ముందుకు వెళ్తోంది.


శ్రీకాకుళం జిల్లాలో నవంబరు 21, 1992లో కావ్య ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించింది. కావ్య తాతయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యుడు, ఉపాధ్యాయుడు, గాయకుడు, నాటక రంగ కళాకారుడు, జ్యోతిష్కుడు కూడా. తాతయ్య వద్ద జ్యోతిష్య శాస్త్ర విషయాలను తెలుసుకుంటూ ఆమె పెరిగింది. రామాయణంలో పుష్పక విమానం గురించి విని ఆశ్చర్యపోయింది. అంతేకాకుండా పురాణేతిహాసాల్లోని అంశాలను తెలుసుకుంటూ వాటి పట్ల ఆసక్తిని పెంచుకుంది. ఎప్పటికైనా అంతరిక్షం లోకి అడుగుపెట్టాలని కలలు కన్నది. తన ఆసక్తికి అనుగుణమైన అంశాల పట్ల అవగాహన పెంచు కుంటూ వచ్చింది. ఆ ఆసక్తే ఇంజనీరింగ్‌లో ఏరోనాటికల్‌ స్పేస్‌ సబ్జెక్టును ఎంచుకునేలా చేసింది.


2014లో కావ్య బి.టెక్‌ పూర్తి చేసింది. వైదిక విమానాల పట్ల ఆమెకున్న ఆసక్తిని గమనించిన కళాశాల అధ్యాపకులు కావ్యను ప్రోత్సహించారు. అయితే ఆధునిక వేదికలపై వైదికమైన అంశాలకు చోటు లేదని కావ్యకు ముందే తెలుసు. అయినప్పటికీ తన ఆసక్తిని, పరిశోధనా అంశాలను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఎలాగైనా భారతీయ వైదిక శాస్త్రాల ఆధారంగా విమానాలను రూపొందించాలని ధడ నిశ్చయంతో ముందడుగు వేసింది. తన లక్ష్యాల వైపు ప్రయాణం మొదలుపెట్టింది.


అంతర్జాతీయ వేదికపై జరిగిన ఓ సమావేశంలో ‘రుక్మా విమానాలపై పరిశోధన’ పేరుతో ఓ నివేదికను కావ్య ప్రదర్శించింది. అందుకు భారతీయ విమాన శాస్త్ర నిపుణులు శివకర్‌ బాపూజీ తల్పడే నుంచి స్ఫూర్తి పొందింది. అలా తన పరిశోధనల ద్వారా చిన్న, పెద్ద తరహా విమాన నమూనాలను తయారు చేయడంలో విజయం సాధించింది. అదే తన మొదటి విజయం. అనంతరం విమాన శాస్త్రం ఆంగ్ల అనువాదాన్ని చదివింది. అందులో పొందుపరచిన అంశాలను ఆమె పరిశీలించింది. అవి కేవలం ఏ ఒక్క గ్రంథానికో పరిమితమైన అంశాలు కాదని కావ్య గుర్తించింది. వాటిని ఎలాగైనా వెలికి తీయాలని సంకల్పించింది. ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌’ అనే కాన్సెప్ట్‌తో తొలి అడుగు వేసింది. భారతీయ శాస్త్రాలు, పురాణేతిహాసాల్లో విమానాల గురించి ఉన్న అంశాల గురించి క్షుణ్ణంగా పరిశోధించడం ప్రారంభించింది. విమాన శాస్త్రాలతో పాటు రోదసి సాంకేతికతకు సంబంధించిన ఎన్నో అంశాలు భారత ఆక్రమణ దారుల దాడుల్లో కాలగర్భంలో కలిసిపోయినట్లు ఆమె అభిప్రాయ పడుతోంది. అయినప్పటికీ వాటిని వెలికితీసేందుకు మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతోంది కావ్య.


తన పరిశోధనల్లో భాగంగా తల్పడే రూపొందిం చిన విమానాల నమూనాలకు ఆధారాలను అన్వేషించడం మొదలుపెట్టింది. ఆ ఋజువులను బయటపెట్టేందుకు కషి చేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకొని వారిని కలిసింది. వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించింది. తనకు అందిన వివరాల్లో బ్రిటీషర్ల ద్వారా రైట్‌ సోదరులకు తల్పడే విమాన నమూనాలు లభించినట్లు కావ్య తెలుసుకుంది. ఆంగ్లేయులు నమూనాలలో చిన్నపాటి మార్పులు, చేర్పులు చేసి నేటి విమానాలను రూపొందించినట్లు కావ్య చెబుతోంది. మనదేశంలోని పురాతన శాస్త్రాలన్ని విదేశీ గ్రంథాలయాలకు చేరాయని, నేడు మనం వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి వైదిక శాస్త్రాల్లో పొందుపరిచారని కావ్య స్పష్టం చేస్తోంది. అయితే వాటిని అర్థం చేసుకునే సామర్థ్యం ప్రస్తుత తరానికి చాలా తక్కువని ఆమె అభిప్రాయం వ్యక్తంచేస్తోంది.


విమాన శాస్త్రాన్ని అవపోసన పట్టిన కావ్య అందులోని సమాచారం సహకారంతో 3డి మోడలింగ్‌ సాఫ్ట్‌వేర్‌లో నమూనాలను తయారు చేయడంలో విజయం సాధించింది. అనంతరం వైదిక శాస్త్రాల ఆధారంగా కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్స్‌ డైనమిక్స్‌ను రూపొందించింది. విమానాల సామర్థ్యాన్ని, ఉష్ణ నిరోధకతను తను రూపొందించిన విధానంలో విశ్లేషించడంలో సఫలత పొందింది. తన పరిశోధనల ద్వారా వైదిక విమానాలు అత్యంత అధునాతనమైనవిగా కావ్య నిరూపించింది. ఆధునిక భారతీయ శాస్త్రవేత్తలు, ఆచార్యులు, ప్రాచీన, వైమానిక శాస్త్రాల నుంచి రూపొందించిన పరికరాల ఆధారంగా విమానశాస్త్రంలో పేర్కొన్న వాటిని పునర్నిర్మించవచ్చని కావ్య నిశ్చయించుకుని తన పరిశోధనలను మరింత వేగవంతం చేసింది.


నేటి ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం పర్యావరణాన్ని దెబ్బతీస్తోందని కావ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు వైదిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో సహకరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత సాంకేతికత భూమిని, భూ ఉపరితల పర్యావరణాన్ని చెత్తకుండీలా మార్చేస్తోందని కావ్య భావిస్తోంది. అదే వైదిక శాస్త్ర ప్రమాణాలతో రూపొందే విమానాలు, పరికరాలు పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నివారణకు దోహదం చేస్తాయని తన వాదనను ఆధారాలతో బలపరచుకుంటోంది. పరిష్కారం మన దగ్గరే ఉన్నప్పుడు ఊరంతా వెతకడం ఎందుకని కావ్య ప్రశ్నిస్తోంది. వైదిక గ్రంథాల్లోని జ్ఞానాన్ని లోక కళ్యాణానికి వినియోగించాలని ఆమె తాపత్రయ పడుతోంది.


సంస్కత శ్లోకాల్లోని భావాలను ఏరోనాటికల్‌ సాంకేతికతకు అన్వయించుకుంటూ కావ్య పరిశోధనలు సాగుతున్నాయి. వాటిలో చాలా వరకు తానూ అన్వయించుకొని అవగాహన పొందింది. దేవ భాష అయిన సంస్కతంలో ఒకే పదానికి నానా అర్థాలుంటాయి. వాటిని మనం అర్థం చేసుకోగలిగి నప్పుడు వాటిల్లో దాగి ఉన్న నిగూఢ రహస్యాలను ఛేదింగలమని కావ్య చెబుతోంది. ప్రాచీన కావ్యాలలో విమాన చోదకుల గురించి, వాటి తయారీ గురించి విస్తారమైన అంశాలున్నాయని కావ్య పరిశోధనల్లో తేలింది. వాటిలోని రహస్యాలను ఛేదించి వాటి ఫలాలను దేశ అభివద్ధికి అందించేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా ఆమె పనిచేస్తోంది. ఇప్పటికే ఎన్నో విజయాలను సాధించి విమర్శకులు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది ఈ తెలుగు బిడ్డ.


ఇప్పటికే పురాతన గ్రంథాల్లోని శ్లోకాల అన్వయం ద్వారా విమానాల 3డి నమూనాలను రూపొందించింది. అంతేకాకుండా డిఆర్‌డిఒ, నాసా మాజీ శాస్త్రవేత్తల సహకారం కూడా కావ్యకు లభిస్తోంది. తను అనువదించుకున్న శ్లోకాల ద్వారా వైదిక కాలంలోని విమానాల తయారీ, గగనతల రక్షణ వ్యవస్థ, యూఎఫ్‌ఒలు, గ్రహాంతరవాసులు, ఏరోడైనమిక్స్‌, ప్రోపల్షన్‌, వాయుగతిక శాస్త్రం, యాంటీగ్రావిటీ టెక్నాలజీ వంటి అంశాలను తెలుసుకుంది. వాటి ఆధారంగా ‘రివర్స్‌ ఇంజనీరింగ్‌ వేదిక్‌ విమానాస్‌’ అనే పుస్తకాన్ని రచించింది. అందులో తన పరిశోధనల్లో శోధించి, సాధించిన అంశాలను లోతుగా వివరించింది కావ్య.


తన పరిశోధనల ద్వారా ‘మార్వలెస్‌ రికార్డ్స్‌ బుక్‌ ఆఫ్‌ ఇండియా’ లో కావ్య చోటు దక్కించుకుంది. ‘ఏరో నాటికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా 2015’ లో నిర్వహించిన సదస్సులో ‘మినీ రుక్మా విమాన నమూనా ప్రదర్శన’, వేవ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్పిరిచువలిటీ ఇన్‌ సైన్స్‌’ సదస్సులో ‘స్పిరుచువల్‌ కాయిల్‌-నికోలా టెస్లా అండ్‌ విమానా’ వంటి ప్రాజెక్టులతో మంచి గుర్తింపును పొందింది. అంతేకాకుండా మరికొన్ని ప్రాజెక్టులతో భారతీయ ప్రాచీన శాస్త్రాల సత్తాను చాటి చెప్పింది. ప్రస్తుతం ‘స్వస్తిక్‌ టీమ్‌’ అనే బందంతో కావ్య పనిచేస్తోంది. ఇందుకు ఎనిగ్మా ఎడిజియోని అనే సంస్థ సహకారం అందజేస్తోంది. వైదిక శాస్త్రాల ఆధారంగా శాస్త్ర సాంకేతికతలో నూతన అధ్యాయనాన్ని సష్టించడమే ఈ బందం లక్ష్యం. ఇప్పటికే బంద సభ్యలు సమన్వయ, సహకారాలతో కావ్య ఎన్నో పురాతన అంతరిక్ష సాంకేతికతపై పరిశోధన పత్రాలను అంతర్జాతీయ వేదికలపై సమర్పించింది. మరిన్ని పరిశోధన పత్రాలను రూపొందిస్తోంది.


ప్రాచీన విమాన నమూనాల 3డి మోడలింగ్‌, సిఎఫ్‌డి విశ్లేషణ, వైదిక విమానాల నిర్మాణాత్మక వివరణ, వివిధ ధాతువుల ప్రయోగం ద్వారా ఉష్ణ మార్పులను వివరించడం, విమానాల 3డి ప్రింటింగ్‌ వంటి అంశాలలో కావ్య విజయాలను సాధించింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించి ప్రపంచం ముందుంచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమెలో భారతీయ వైదిక శాస్త్రాల పట్ల ఉన్న నమ్మకం, గౌరవం అలాంటిది.


భవిష్యత్తులో మిని రుక్మా, త్రిపుర, సుందర విమానాలను, యాంటీ గ్రావిటీ ప్రొపల్షన్‌ వ్యవస్థను, ప్లాస్మా కవచాన్ని, ఎలక్ట్రో మాగ్నటిక్‌ కవచాలు, శక్తి ఉత్పాదకాలు, వోర్టెక్స్‌ జనరేటర్లు, గైరో స్కోప్లను వైదిక శాస్త్రం ఆధారంగా తయారు చేసేందుకు పరిశోధన లను వేగవంతం చేసిన కావ్య భారతీయ శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెబుతానని ధీమాగా చెబుతోంది.


–విజేత..(FB నుంచి ) సేకరణ :వేదుల జనార్దన రావు.

మన ఇతిహాసాలు

 *📖 మన ఇతిహాసాలు 📓*



*శుకుడు*



శుకుడు వేద వ్యాసుని కుమారుడు. ఈ మహర్షి తన జీవితమంతయు సంచారియై ప్రతి గృహమునందు ఆవు పాలు పితికినంత సమయము మాత్రమే గడుపుచుండెడివాడు. కాని పరీక్షిత్తు మహారాజు అంత్యకాలమునందు అతని ఇంటిలో ఏడు దినములు గడిపి అతనికి శ్రీ మద్భాగవతము మొదలగు పురాణములు వినిపించాడు.



ఆకాశమార్గమున నిప్పు వలె వస్తున్న శుకుని చూస్తున్న వ్యాసాదులు

వ్యాస మహర్షి శివుని గురించి తపస్సు చేసి పరమశివుడు ప్రత్యక్షంకాగా సుపుత్రుని ప్రసాదించమని ప్రార్థించగా నీకు సుపుత్రుడు జన్మించగలడని పరమేశ్వరుడు పలికి అదృశ్యుడయ్యాడు. ఒకనాడు వ్యాసుడు అరణి మథించుచుండగా ఘృతాచి కనుపించింది. ఆమెను చూడగానే వ్యాసుడు కామవశుడై వీర్యస్థలనం చేసికొన్నాడు. ఘృతాచి తన్ను బుషి శపించునేమోయని చిలుక రూపం దాల్చి పొంచి యున్నది. అంత వ్యాస మహర్షి వీర్యం నుండి శుకుడు జన్మించాడు. పార్వతీ సహితుడై పరమశివుడు వచ్చి ఈ బాలునకు ఉపనయనం చేశాడు దేవేంద్రుడు కమండలం యిచ్చాడు. దేవతలు దివ్యవస్త్రం ప్రసాదించారు. తండ్రి అనుమతి తీసికొని శుకుడు బృహస్పతిని గురువు చేసికొని ధర్మశాస్త్రము, రాజనీతి నేర్చుకొన్నాడు. విద్య పూర్తి అయిన పిమ్మట శుకుడు తన తండ్రి యగు వ్యాసుని ఆశ్రమమునకు తిరిగి వచ్చాడు. వచ్చిన శుకుని కౌగలించుకుని గౌరవించాడు. మునిబాలకులతో శుకుడు ఆట పాటలతో కాలం వెల్లబుచ్చుతున్నాడు. అది గ్రహించి తండ్రి కుమారుని దగ్గరకు పిలిచి నాయనా నీవు జనకుని వద్దకు వెళ్ళి మోక్షమార్గం తెలిసికొని రమ్మని పంపాడు.


శుకుడు తిన్నగా మిథిలానగరం చేరి తన రాకను జనకునకు తెలియజేయండని ద్వారపాలకులను లోపలికి పంపాడు. వార్త తెలియగనే సపరివారంగా ఎదురేగి జనకరాజు శుకుని లోనికి ఆహ్వానించాడు. కాంచన సింహాసనం చూపాడు. కుసుమములచే అతని పూజించాడు. శుకుని రాకకు కారణం అడుగగా, శుకుడు జనక మహారాజ మా తండ్రి గారి ఆదేశానుసారం మీ వద్ద మోక్షమార్గం తెలిసికొనగొరి వచ్చాను అని మౌనం వహించాడు. జనకుడు శుకునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు పరమశాంతుడై జనకుని వద్ద సెలవు తీసికొని తిన్నగా తండ్రి గారి వద్దకు వచ్చాడు. శుకుడు వ్యాసుని వద్దనే వుండి కాలక్షేపం చేస్తున్నాడు.


శుకునకు వ్యాసమహర్షి సృష్టి రహస్యములను తెలిపాడు. ఎన్నో పరమ రహస్య విషయాలు తెలియజేశాడు. అంత శుకుడు అవధూతయై తండ్రి ఆజ్ఞగొని ఎచ్చలను ఉండక భూభాగమంత సంచరించసాగాడు.ఆ సంచారంలో అతడు పరీక్షన్నరేంద్రుని వద్దకు రాగా ఆ రాజు శుకుని పూజించి ఏడు దినములలో ముక్తి లభించునట్లు చేయని అర్ధించాడు.అంత శుకుడు తండ్రి గారిచే వ్రాయబడిన భాగవత కథను ఏడు రోజులు వినిపించి ఈ రాజును మోక్షమార్గుని చేశాడు.భాగవత కథా శ్రవణంలో పరీక్షిత్తు ముక్తినందాడు.శుకుడు సంచారం పూర్తిచేసికొని తిరిగి తండ్రి గారి ఆశ్రమమునకు చేరి ఆయన వద్దనే సుమంత మొదలైన వ్యాస శిష్యులతో గూడి వేదాధ్యయనం చేయసాగాడు.


ఇట్లుండ ఒకనాడు నారద మహర్షి వ్యాసాశ్రమమునకు రాగా శుకమహర్షి ఆ నారద మహర్షికి సుఖాసనం చూపి మహర్షి ఈ లోకమున పుట్టిన వానికి హితమేదియో తెలియజేమండని అడిగాడు. నారదుడు వివరించి చెప్పగా శుకుడు యోగియైనాడు. శుకుని చూచి అప్సరలు సిగ్గువిడిచి వలువలు విడిచి నగ్నంగా ఉండిపోయేవారు. అందుకు శుకుని యోగి ధర్మమే కారణము. కాని వ్యాసమహర్షిని చూచి వారు వలువలు ధరించేవారు. శుకుడు ఆసక్తత గలవాడనియూ తాను సక్తత గలవాడని వ్యాసుడు కుమారుని గొప్పదనమునకు ఆనందించే వాడు. పుత్రుడు మహాన్నతకు సంతోషపడేవాడు. శుకుని పోలిన తత్త్వజ్ఞుడు యోగీశ్వరుడు మూడు లోకాల లోన లేడు. ఇది త్రికాలబాధ్యమానమైన సత్యం. పరమశివుని వరప్రసాదంతో జన్మించిన శుకుడు పరమచయోగీశ్వరుడు. శుకుని రూప సౌందర్యానికి ముగ్ధురాలై రంభ తనను అనుభవించి తృప్తిపరచమంది. శుకుడు తుచ్ఛ సుఖములు ఆశించనని ఆమెను నిరాకరించాడు. ఈ విషయం శుకరంభా సంవాద రూపమున లోకమందు ప్రసిద్ధి చెందింది.

వామన ఏకాదశి

 🎻🌹🙏నేడు పరివర్తన ఏకాదశి , పార్శ్వ ఏకాదశి , వామన ఏకాదశి


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


భాద్రపద శుక్ల ఏకాదశిని *పరివర్తన ఏకాదశి* అని పిలుస్తారు. పరివర్తన ఏకాదశికి మన ప్రకృతి లో వచ్చే మార్పులకు సంబదించినదిగా పరిగణిస్తారు కావున ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పేరు వచ్చింది అని అంటారు. ఈ రోజునే శ్రీ మహా విష్ణువు వామన అవతారాన్ని ఎత్తి మహాబలిని పాతాల లోకానికి పంపిస్తాడు. *పరివర్తన ఏకాదశి రోజు వామన అవతరాన్ని పూజించడం* వలన బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులని సేవేస్తే కలుగు ఫలం లబిస్తుందని పురాణాలూ చెబుతున్నాయి. పరివర్తన ఏకాదశి తరువాత వచ్చే *ద్వాదశే వామన జయంతి.*


ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం వలన తెలియక చేసిన పాపాలు అన్ని నశిస్తాయని , కోరిన కోరికలు ఫలిస్తాయని అని నమ్మకం.


శ్రీ మహా విష్ణువు అది శేషు పైన శయనించి (దక్షిణాయనం లో) విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు తిరిగి భాద్రపద శుక్ల ఏకాదశి నాడు తిరిగి ఇంకో వైపు శాయనిస్తాడు అందుకే ఈ ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని పిలుస్తారు. పరివర్తన అంటే మార్పు అని కూడా అర్థం వస్తుంది. 


పూర్వం యుద్ధమున దైత్యరాజైన బలిచక్రవర్తి ఇంద్రుని వలన పరాజయము పొంది గురువైన శుక్రాచార్యుడిని శరణువేడెను. కొంతకాలము గడిచిన తర్వాత గురుకృప వలన బలి స్వర్గముపై అధికారము సంపాదించెను. దీంతో అధికార విహీనుడైన ఇంద్రుడు అదితి దేవిని శరణు కోరాడు. ఇంద్రుని పరిస్థితిని చూసిన అదితి దేవి దుఃఖించి పయోవ్రతానుష్టానము చేసింది. ఆ వ్రత చివరిరోజున భగవానుడు ప్రత్యక్షమై అదితితో *"దేవీ.. చింతించవద్దు నీకు నేను పుత్రునిగా జన్మించి , ఇంద్రునికి చిన్న తమ్మునిగా ఉండి వానికి శుభము చేకూర్చెదనని"* పలికి అదృశ్యమవుతాడు.


ఇలా అదితి గర్భమున భగవానుడు వామన రూపమును జన్మించెను. భగవానుని పుత్రునిగా పొందిన అదితి సంతోషమునకు అంతులేదు. భగవానుని వామనుడగు బ్రహ్మచారి రూపమున దర్శించిన మహర్షులు , దేవతలు ఎంతో ఆనందించిరి. వామనమూర్తికి ఉపనయన సంస్కారములు గావించారు. ఒకసారి బలి చక్రవర్తి భృగుకచ్ఛమను చోట అశ్వమేధ యజ్ఞము చేయుచున్నాడని వామనభగవానుడు విని అచ్చటికి వెళ్లెను. ఒక విధమైన రెల్లుగడ్డితో మొలత్రాడును , యజ్ఞోపవీతమును ధరించి , శరీరముపై మృగచర్మము , శిరస్సున జడలు ధరించిన వామనుడిని బ్రాహ్మణ రూపమున యజ్ఞమండపము నందు ప్రవేశించాడు.


అట్టి మాయామయ బ్రహ్మచారి బ్రాహ్మణ రూపమున చూసిన బలి హృదయము గద్గదమై... వామన భగవానుడిని ఉత్తమ ఆసనముపై కూర్చొండబెట్టి పూజించెను. ఆ తర్వాత బలి వామనుని ఏదైనా కోరమని అడుగగా.. *"వామనుడు మూడు పాదముల భూమి"* ని అడిగెను. శుక్రాచార్యుడు భగవానుని లీలలను గ్రహించి , దానము వద్దని బలిని ఎంత వారించినా బలి గురువు మాటను వినలేదు. అంతేగాకుండా దానమొసగుటకు సంకల్పము చేసేందుకు జలపాత్రను ఎత్తెను.

శుక్రాచార్యుడు తన శిష్యుని మేలుకోరి జలపాత్ర మందు ప్రవేశించి జలము వచ్చు దారిని ఆపెను. కానీ వామన భగవానుడు ఒక దర్భను తీసుకుని పాత్రలో నీరు వచ్చే దారిని చేధించెను. దీంతో శుక్రాచార్యునకు ఒక కన్ను పోయెను. సంకల్పము పూర్తి అయిన వెంటనే వామన భగవానుడు ఒక పాదమును పృథ్విని , రెండవ పాదముతో స్వర్గలోకమును కొలిచెను. మూడవ పాదమునకు బలి తనకు తానే సమర్పితుడయ్యెను.


ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి ఉపవాస దీక్షను చేపట్టి జాగరణకు సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. 


''ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ ... పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ'' అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి 

పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది...సేకరణ..🙏💐


హరినామ స్మరణం ..

సమస్తపాప హరణం...🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

భగవద్గీత

 🌺🙏🌺శ్రీ శివాయగురవే నమః.🌺🙏🌺

🌺🙏🌺 శ్రీ పరమాత్మనే నమః. 🌺🙏🌺


         🌺🙏🌺భగవద్గీత.🌺🙏🌺

ఏడవ అధ్యాయము, జ్ఞానవిజ్ఞానయోగము నుంచి

9వ శ్లోకము, పదచ్ఛేద, టీకా, తాత్పర్యసహితముగా.

   🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ.🙏🌺


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺


పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ ౹

జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు ౹౹ (9)


పుణ్యః , గంధః , పృథివ్యామ్ , చ , తేజః , చ ,

 అస్మి , విభావసౌ ౹

జీవనమ్ , సర్వభూతేషు , తపః , చ , అస్మి ,

తపస్విషు ౹౹ (9)    


పృథివ్యామ్ = పృథ్వియందు ;

పుణ్యః , గంధః = పవిత్రమైన గంధతన్మాత్రను ;

చ = మఱియు ;

విభావసౌ = అగ్నియందు ;

తేజః = తేజస్సును ;

అస్మి = ఐ యున్నాను ;

చ = మఱియు ;

సర్వభూతేషు = సమస్తప్రాణులయందు ;

జీవనమ్ = జీవశక్తిని(చైతన్యమును) ;

చ = మఱియు ;

తపస్విషు =తాపసులయందు ;

తపః = తపస్సును ;

అస్మి = ఐ యున్నాను .      


తాత్పర్యము: పృథ్వియందు పవిత్రగంధతన్మాత్రను,

అగ్నియందు తేజస్సును ,సమస్తప్రాణులలో జీవశక్తిని

(చైతన్యమును) తాపసులలో తపస్సును నేనే . (9)


🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺

కృష్ణం వందేజగద్గురుమ్. శ్రీ కృష్ణం వందేజగద్గురుమ్.

    🌺🙏🌺సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.🌺🙏🌺

    అందరికీ శుభ శుభోదయం . తదుపరి శ్లోకముతో

   మళ్ళీకలుసుకుంద్దాం. జై శ్రీ మన్నారాయణ.🙏🙏


🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️

🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

                    Yours.....

Yennapusa Bhagya Lakshmi Reddy Advocate AP High Court Amaravathi and State President Legal Cell AP Reddy Sangam and Chairman AP Advocates Associations JAC Andhra Pradesh State

రాజమండ్రి లో నే

 నేను రాజమండ్రి లో నే పుట్టి రాజమండ్రి లో పుట్టిన అమ్మాయినే పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడ్డాను. యుక్త వయస్సులో అమెరికా వెళ్ళక ముందు రోజూ ఫ్రెండ్స్ తో సాయంత్రం గోదారి గట్టున ఇటుక రంగు మెట్లపై కూర్చుని మెత్తని చల్లని గాలి తో వచ్చే గోదావరి సువాసన ఆస్వాదిస్తూ అలా గోదారిని చూస్తూ బజ్జీలో సమోసాలో తింటూ సరదాగా మాట్లాడుకుంటూ వుంటే ఇక స్వర్గం ఎందుకండీ. ఇంకా కోసి నిమ్మకాయ పిండిన బజ్జీలు, సమోసాలు పిడత క్రింద పప్పు పల్లీలు ఐస్ ఫ్రూట్ లు ఒకటేమిటి అన్నీ దొరికే అదో స్వర్గం. ఇక రాజమండ్రి లో ఏ హోటల్ కి వెళ్ళినా టిఫిన్లు మహా అద్భుతం గా ఉంటాయి...... ఇక పుష్కరాల రేవు దగ్గర రెండు వంతెన ల మధ్య మెట్ల మీద అదో దృశ్యానందం. ఇక దేవాలయాలు, గౌతమి ఘాట్ గురింఛీ ఎంత చెప్పినా తక్కువే. అందుకే నేమో రాజమండ్రి లో పుట్టిన వాళ్ళు ఎక్కడికి పోయినా చివరి సమయం లో అక్కడకే వచ్చి తనువులు చాలించాలి అనుకుంటారు.. అమెరికా లో వున్నా ఏడాదికొ రెండేళ్ల కొ ఓసారి రాజమండ్రి వచ్చి ఓ పదిరోజుల పాటు ఆ స్వర్గాన్ని మేమిద్దరము ఫ్రెండ్స్ తో అనుభవించే వాళ్ళము.. తన పెద్దలు నా పెద్దలు ఒకళ్ల తర్వాత ఒకళ్ళు వెళ్ళిపోయారు ఆయనెవరో బాచీ గారు మా పెద్దవాళ్ళ కార్యక్రమాలు కంభం వారి సత్రం దగ్గర గోదారి గట్టుమీద ఎంతో అద్భుతం గా జరిపించారు ఇక రాజమండ్రి తో రుణం తీరిపోయింది.. వర్క్ బిజీ పిల్లల చదువు బిజీ ఓ 20 ఏళ్ళు గడిచిపోయాయి నేను ఈ 20 ఏళ్ళు గా రాజమండ్రి రాలేదు ఫ్రెండ్స్ తో వీడియో కాల్స్ వాట్స్అప్. 2030 వచ్చేసింది మా ఆవిడ ఆరోగ్యం పాడయ్యింది. తన ఆఖరి కొరిక తన కార్యక్రమాలు రాజమండ్రి లో జరగాలి అని. పిల్లల కి పర్మిషన్ దొరకలేదు వాళ్ళకీ పెళ్లిళ్లు అయ్యిపోయాయి అమెరికా లో సెటిల్ అయిన ఆంధ్రుల తో.. ఇక ఒంటరిగా నేను బాడీ ని రాజమండ్రి తీసుకు వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు నన్ను రిసీవ్ చేసుకోవడానికి ఖననానికి ఏర్పాట్లు అన్నీ వాళ్లే చేస్తున్నారు. రుద్రభూమీకి వెళ్ళాను. పూర్వం అమ్మిరెడ్డి కైలాస భూమి అనే పేరు వుండేది అది కనపడలేదు. అంబాదాని కైలాస వాటిక అనే పేరు వుంది. పూర్వం కాటికాపరి వుండేవాడు వాడి స్థానం లో ఒక సూటు బూటూ వేసుకున్న వ్యక్తి, వాడికి ఇద్దరు అసిస్టెంట్లు, కట్టెలతో నా? ఎలక్ట్రిక్ క్రీమేషనా? కట్టెలతో అయితే 50000/- ఎలక్ట్రిక్ అయితే 25000/- అని గోడపై అతికిచ్చి వున్న క్యూ ఆర్ కోడ్ స్టీక్క్కర్ చూపించాడు. మీరు మీ చాయిస్ ఎన్నుకుని పే చేయండి మాకు మెసేజ్ వస్తుంది మేము కార్యక్రమం మొదలు పెడతాం అన్నారు. 50000 ట్రాన్సఫర్ చేశాను మరి పంతులుగారు ఏరీ పూజ చేయించడానికి అని అడిగా దానికి మరో 10000/- అదనం అన్నాడు అదీ కట్టాను. ఎవరికో కాల్ చేశాడు ఓ అరగంట తర్వాత ఒక బక్క చిక్కిన బ్రాహ్మణ ప్రాణి ఒకటి వచ్చాడు. వాడికి అంబాదానీ ఉద్యోగి ఒక 500/- నోటు ఇచ్చి పూజ చేయించాడు. ఆ కార్యక్రమం అంతా అయ్యాక కంభం సత్రం లో మిగతాది చేద్దాం అని నా ఆశ అన్నాను. అక్కడికి తీసుకు వెళ్లారు. అక్కడ కంభం సత్రం లేదు. అంబాదానీ పితృ కర్మల సత్రవ్ అని వ్రాసి వుంది. ఈ లోపల ఆవిడ వైపు బంధువులు నా వైపు బంధువులు వచ్చారు. లోపలకి వెళ్లాము వాడు మేను కార్డ్ ఇచ్చాడు టోటల్ 12 రోజులకు 20 లక్షలు కార్యక్రమం అంతా వాళ్లే చేస్తారట గోదానం భూ దానం సువర్ణ దానం వగైరా చివరికి పిండాలు కూడా వాడే ఏర్పాటు చేస్తాడట, ఇక సత్రవు లో టీ టిఫిన్ భోజనం, సప్లయ్ వాడే చేస్తాడు. పది మందికి ఎక్కువ గా జనాలు వస్తే మనిషికి రోజుకి 2000/- అదనంగా కట్టాలి అన్నాడు. తప్పెదేముంది.. బక్క చిక్కిన బ్రాహ్మలు కార్యక్రమం మొదలు పెట్టారు. వాళ్ళకి రోజుకి ఒక్కొక్కడికి 700/- అంబాదానీ కంపనీ ఇస్తుందట. ఇవి పట్టించుకునే పరిస్థితిలో నేను లేను చాలా బాధలో వున్నాను ఫ్రెండ్స్ నా తో నే వున్నారు. రెండో రోజు సాయంత్రమ్ ఓసారి అలా గౌతమి ఘాట్ కి వెళ్లొద్దాము రండి రా అన్నాను తను నేను మొదటి సారి కలిసినది ప్రేమించుకున్నది అక్కడే ఒకసారి తన జ్నాపకాలోకి వెళ్తాను అన్నాను. అందరూ సరే అన్నారు అక్కడ గౌతమి ఘాట్ అనే పేరు లేదు అంబాదానీ ఘాట్ అనే పేరు వుంది. పూర్వం చాట్ బండి, బజ్జీల బండి పల్లీల బళ్ళు చాలా వుండేవి ఇప్పుడు అవేమీ లేవు.. ఘాట్ యూజర్ చార్జ్ మనిషికి గంటకి 100/- అని వ్రాసి వుంది ఫ్రెండ్స్ నలుగురము ఓ రెండుగంటలకు మనిషికి 200 చొప్పున యూజర్ ఛార్జీలు కట్టి లోపలకి వెళ్లాము. అక్కడ లోపల తినుబండారాలు వాళ్ళే సప్లయ్ చేస్తున్నారు పాప్ కార్న్ 200/- సమోసా ప్లేట్ 100/- బజ్జీలు ప్లేట్ 100/- చాట్ ప్లేట్ 150/- అంబాదానీ ఉద్యోగులే సప్లయ్ చేస్తున్నారు. సమోసాలు తిన్నాము. గోదావరి ని చూస్తే మనసు ఉరకలు వేసి బట్టలు ఊడదీసుకుని చడ్డీ తో స్నానం చెయ్యాలి అనిపించి మెట్లు దిగి నది వైపు వెళ్తున్నా వెనక నించి నా ఫ్రెండ్స్ అరుపులు ఒరే స్నానానికి టాగ్ వేయించుకో టాగ్ లేకుండా నీళ్ళల్లోకి దిగితే 500/- ఫైన్ అన్నారు. నేను అప్పుడు అడిగాను ప్రొద్దున్న నించి చూస్తున్నాను రాజమండ్రి కి ఏమయ్యింది ఈ వ్యవహారం ఏమిటి రా ఈ టాగ్ ల గోలెంటి అని. అప్పుడు నా ఫ్రెండ్స్ గొల్లుమన్నారు. ఒరే మూర్తి రాజమండ్రి లో కొటి లింగాలు ఘాట్ నించి గౌతమి ఘాట్ వరకూ గోదారి గట్టుని మరియు శ్మశానాలని అంబాదానీ కి అమ్మేశారు రా అని . 2027 పుష్కరాలకి అంబాదానీ గాడు ఎక్కేడెక్కడ నించో పుష్కర స్నానాలకి వచ్చిన వాళ్ళ దగ్గర నించి మనిషికి ఒక స్నానానికి 100/- చొప్పున వసూలు చేశాడు. మామూలు గా అయితే ఒక స్నానానికి 50/- అది పర్వం రోజుల్లో 100/-. సరదాగా గోదారి గట్టున కూర్చుని మందేద్దాము అంటే మందు కర్చు కన్నా గోదారి గట్టు యూజర్ చార్జీలు ఎక్కువ. పూర్వం పల్లి బండోళ్ళు, సమోసాలు , చాట్ , బజ్జీల బళ్ళు వుండేవి వాళ్ళందరికీ మేము గోదారి గట్టు కొనుక్కున్నాము మీరు ఇక్కడ అమ్ముకోడానికి వీలులేదు అని గెంటేశారు పూర్వం గోదారి గట్టుని నమ్ముకుని ఎంతో మంది బ్రాహ్మలు బ్రతికేవారు, ఎంతో మంది ముష్టి వాళ్ళు ఈ గట్లమీదే పడుకునేవారు. వాళ్లందరిని గెంటేశారు. ఈ కంభం సత్రం కూడా అంబాదానీ కి అమ్మేశారు వాడి రేట్లు వాడిష్టం గో దానాలు, భూ దానాలు, సువర్ణ దానాలలో అంతా మోసమే అన్నారు. పోనీ కొవ్వూరు కానీ వాడపల్లి కానీ వెళ్ళి కార్యక్రమాలు చేస్తే ఎలా వుంటుంది అన్నాను వాళ్ళు దానికి ఆ ఘాట్లని లంబాని కి అమ్మేశారు అక్కడ రేట్లు ఇంకా ఎక్కువ అన్నారు. ఇలా అడగడం బాగుండదు మరి మధ్య తరగతి వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎలా తట్టుకుంటున్నారు అని అడిగాను. ఈ గోదారి గట్టునే అమ్ముడు పోనీ కొన్ని ప్రదేశాలు వున్నాయి అక్కడ ఫెసిలిటీస్ ఏమీ వుండవు కొందరు అక్కడ చేసుకుంటున్నారు అని చెప్పారు.

ఒరే రేపు మనం చిన్నప్పుడు ఆడుకున్న దానవాయి పేట వేళదాం రా పార్క్ కి వెళ్దాం రా అన్నాను. అలాగే మర్నాడు సాయంత్రం దానవాయి పేట పార్క్ కి వెళ్లాము. పార్క్ పేరు మారిపోయింది ఉదాని పార్క్. అక్కడ కూడా యూజర్ ఛార్జీలు గంటకి తలకి 100/- లోపల కూర్చునే బెంచీ లకు ఒక్కో బెంచీ కి ఒక్కో రేటు. సరదాగా గడ్డి లో కూర్చున్నాము నా భార్య గుర్తుకు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ పరాధ్యానం లో ఓ గడ్డి పరక ని పీకాను పార్క్ లో అలారం సిస్టమ్ గట్టిగా మోగడం మొదలు పెట్టింది. ఉదానీ గ్రూప్ ఉద్యోగులు వచ్చి గడ్డిపరక పీకినందుకు 500/- ఫైన్ వసూలు చేశారు. ఈ పార్క్ ని ఉదాని కి అమ్మేశారు రా గడ్డి పీకితే 500/- పువ్వు కొస్తే 1000/- ఫైన్. ప్రేమించుకునే వాళ్ళకి టిక్కెట్లు గంటకి జంటకి 500/- ఆ పొదలు చూడు ఆ పొదలలోనే జంటలు కూర్చుంటారు అన్నారు. రేపు ఎక్కడికి వెల్దాము రా అన్నారు. నాకెంతో ఇష్టమైన కంబాల చేరువుని చూడాలి అనిపించి కంబాల్ చెరువు గురించి ఏం వినాలో అని భయంవేసి నోర్మూసుకున్నా. నా ఫ్రెండ్స్ అందరూ నాకు మహా క్లోజ్. వాళ్ళు నా మనసులో ఉన్నది కనిపెట్టేశారు ఏరా మూర్తీ కంబాల్ చెరువు గురించే కదా ఆలోచిస్తున్నావు అది ఎవడో జఠ్మలానీ కి అమ్మేశారు. బోటింగ్ పెట్టి వాడుకూడా పిండుతున్నాడు అన్నారు. ఆ రాత్రి అంబాదానీ సత్రవులో అలా పడుకుని వున్నాను నిద్రలో ఏవేవో కలలు నా రాజమండ్రి కి ఏమయ్యింది

JSRee