17, మే 2023, బుధవారం

ఆణిముత్యాలు

 జిల్లెళ్ళమూడి *అమ్మనోటి ఆణిముత్యాలు*


1. జగన్మాత అంటే జగత్తుకు తల్లికాదు, జగత్తే తల్లి.


2. మాతృత్వం వేరు, మాతృతత్త్వం వేరు.


3. *తన బిడ్డలో* ఏమి చూస్తున్నామో అందరిలోను దాన్ని చూడటమే బ్రహ్మస్థితిని పొందడం. 


4. అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు. ఒడిని విడిచి ఎవరూ లేరు.


5.  అమ్మ అంటే సంపూర్ణ అవతారం కాదు. సంపూర్ణత్వం.

 

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

జీవాత్మ స్వయంగా

 శ్లోకం:☝️

*స్వయం కర్మ కరోత్యాత్మా*

  *స్వయం తత్ఫలమశ్నుతే ।*

*స్వయం భ్రమతి సంసారే*

  *స్వయం తస్మాద్విముచ్యతే ॥*

  - చాణక్యనీతి


భావం: జీవాత్మ స్వయంగా కర్మ చేస్తుంది. జీవాత్మే శుభాశుభ ఫలాలను అనుభవిస్తుంది. జీవాత్మే స్వయంగా లోకంలో అనేక ఉపాధులలో భ్రమిస్తూ (శరీరాలలో జన్మిస్తూ మరణిస్తూ) చివరికి తన స్వయంకృషితో జననమరణ చక్రాన్ని తప్పించుకుని మోక్షాన్ని పొందుతుంది.🙏

దైవేచ్ఛ


 *దైవేచ్ఛ...!!*

మనం ఏదైనా పని చేయ తలపెడతాం. 

ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం. 

అదంతా మన ఘనతేనని చాటుకుంటాం. 

అదే విఫలమైతే దానికి కారణం ఇతరుల పైన నెడతాం. 

లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం. 

భగవంతుడికి మన మీద దయ లేదు, అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోసేస్తాం....

అంతే కాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వ జన్మ కర్మల ఫలితమేననీ, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకోం. 

అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు...!!!


అది ఎలా ??? ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము!!...


ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు...

అతడు కూటికి పేద అయినా అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు. 

కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం సాగిస్తుండేవాడు. 

అలా ఆ ఊళ్లోవాళ్ళందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది.


“దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది, దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను "... 

" దైవేచ్ఛ వల్ల నేను ఈ రోజు ఇంత సంపాదించ గలిగేను.”

ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే అనుకుంటూ ఉండే వాడు. 

ఓ రోజు రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు, ఇంతలో కొంత మంది దొంగలు అటు వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఓ మనిషి కావలిసివచ్చి ఈ పేదవాడ్ని లాక్కెళ్ళి పోయేరు. 


అలా తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగిలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు. 

ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసిన ఆ దొంగలు పారిపోయేరు...


రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఆ పేదవాడ్ని చూసి వీడే దొంగ అని తీసుకుని పోయి కారాగారంలో బంధించారు...


మర్నాడు విచారణకు అతడిని రాజు గారి వద్దకు తీసుకొచ్చేరు. 

ఈ విషయం తెలిసి ఆ ఊళ్లోవాళ్ళందరూ వచ్చి రాజుగారితో.. 

“ప్రభూ! ఇతను మాకందరికీ తెలుసు, చాలా మంచివాడు, గొప్ప భక్తుడు కూడా, దొంగ కాదు ” అని చెప్పేరు. 

అది విని ఆ రాజుగారు పేదవాడితో.. “నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా..?“ అని అడిగితే..

దానికి ఆ పేదవాడు “ప్రభూ! దైవేచ్ఛ వల్ల నేను రాత్రి ఇంటిబయట కూచున్నాను...

దైవేచ్ఛ వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది. 

దైవేచ్ఛ వల్ల వాళ్ళు నన్ను తమవెంట తీసుకుపోయేరు,

దైవేచ్ఛ వల్ల వాళ్ళు దొంగిలించిన నగలమూటను నా నెత్తిన పెట్టేరు. 

దైవేచ్ఛ వల్ల మీ భటులు నన్ను దొంగనుకుని కారాగారంలో బంధించేరు. 

దైవేచ్ఛ వల్ల ఇప్పుడు నేను మీవద్దకు విచారణకు తీసుకురాబడ్డాను. 

అంతా దైవేచ్ఛయే ప్రభూ!“ అని చెప్పేడు. 

ఆ పేదవాడి భక్తినీ, అమాయకత్వాన్నీ చూసి రాజుగారు ఇతడు దొంగ కాదని చెప్పి వదిలేసేరు...


చూసేరా! ఆ పేదవాడు అంతా దైవేచ్ఛయే అనుకుంటుండడాన్ని తనను దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం గాని, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకుగాని, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం గాని, విచారం గాని కలుగలేదు.

అంతా కూడా దైవ నిర్ణయమె, దైవేచ్ఛ యే... అనే భావం ఎప్పుడూ మనలో వుండాలి, అప్పుడే మనలని ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు...


               *_🌺శుభమస్తు🌺_*

    🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀1.

*రామాయణం...*

*ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.*


           *వాల్మీకి రామాయణం*

                   ➖➖➖✍️

                 *( 1వ భాగం )*



రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.


యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.


ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.

రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.


కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్

ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్


రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.✍️

రేపు...2వ భాగం...


.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...9493906277



           *ప్రసాదం - పరమార్థం*

                 ➖➖➖✍️


అది 1993లో నంగనల్లూర్ లో ఆంజనేయ స్వామీ దేవస్థానం ప్రారంభం చేస్తున్న సందర్భం. దేవాలయం నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయి. 


చాలామంది భక్తులు కూడా వస్తున్నారు. ఒకరోజు నేను పరమాచార్య స్వామివారి ఆశీస్సుల కొరకు వెళ్లాను. స్వామికి సాష్టాంగం చేసి నమస్కరించాను. 


మహాస్వామివారు ఆశీర్వదించి నాతో ఇలా అన్నారు, *“ఇక్కడకు వచ్చే చాలా మంది భక్తుల ద్వారా విన్నాను దేవాలయానికి భక్తులు ఎక్కువగా వస్తున్నారు అని. చాలా పెద్ద విగ్రహం కదా స్వామివారి ఆకర్షణ శక్తి కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టుంది”.*

నన్ను ఆశీర్వదించి ఎంతో వాత్సల్యంతో, *“ఆయన చాలా పెద్ద స్వామి కదా! మరి ఎక్కువ ప్రసాదం నివేదన చెయ్యాల్సి పడుతుంది కదా?”* అని అడిగారు. 


నేను వెంటనే, *“ఒక పెద్ద సంచి బియ్యాన్ని వండి నివేదన చేస్తున్నాము పెరియవ”* అని బదులిచ్చాను.


*“ఉత్తి అన్నం మాత్రమేనా?”*


*“లేదు పెరియవ చిత్రాన్నాలు వంటివి చేసి నివేదిస్తాము”*


*“నివేదనకు ఏమేమి తయారు చేస్తుంటారు?”*


*“ఉదయం నుండి చాలా రకాలు తయారు చేస్తుంటాము. వెణ్ పొంగల్, బెల్లం పొంగల్, పులిహోర, మిరియాల అన్నం, పెరుగన్నం అలా వరుసగా చేస్తుంటాము పెరియవ”*


*“మరి వీటికోసం చాలా మంది భక్తులు వస్తుంటారు కదా!”*


కొంచం గర్వంతో, *“ప్రతిరోజూ చాలా ఎక్కువ మంది భక్తులు వస్తారు. ప్రసాదాలు ఏవీ మిగలవు”* అన్నాను.


మహాస్వామి వారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు. *“ప్రసాదాలు కొద్ది కొద్దిగా ఇస్తారా, ఎక్కువ మొత్తంలో ఇస్తారా?”* అని అడిగారు స్వామి.


అతిశయించిన గర్వంతో, *“ఒక పెద్ద ఆకులో ఎక్కువ ప్రసాదం ఇస్తాము పెరియవ”* అని అన్నాను.


*“ఇక్కడకు వచ్చే వారి వద్ద నేను ఈ విషయం విన్నాను. నిన్ను ఒక విషయం         అడగదలచుకున్నాను. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగా ఇవ్వాలా? లేక భోజనం లాగా ఎక్కువ ఇవ్వాలా?”* అని ఆత్రుతతో అడిగారు.


ఏమని సమాధానం చెప్పాలో తెలియక నిలబడ్డాను.


మహాస్వామివారు నవ్వుతూ, *“ఎందుకు అలా స్థాణువులా నిలబడిపోయావు? కేవలం నేను తెలుసుకోవడానికే నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను”* అని అన్నారు.


కొద్దిగా సంశయిస్తూ వినయంగా, *“లేదు పెరియవ. భక్తులు ఎంతో దూరం నుండి ఇక్కడకు వస్తారు. బహుశా వారికి ఆకలిగా ఉంటుంది కాబట్టి వారికి ఎక్కువ మొత్తంలో ప్రసాదాన్ని . . . ”* అని ఇంకా నేను ముగించకుండానే, స్వామివారు *“నువ్వు ఏమి ఆలోచిస్తున్నావో నాకు అర్థం అవుతుంది. కాని నా ఉద్దేశ్యం ప్రసాదాన్ని ప్రసాదం లాగా తక్కువ మోతాదులో ఇవ్వాలి. ఆకలిగొన్న వారిని కూర్చుండబెట్టి వేరేగా భోజనం పెట్టాలి”* అని *“మన వేదాలు, శాస్త్రాల్లో ఎన్నో చెయ్యవలసినవి, చెయ్యకూడనివి నిర్దేశించబడి ఉన్నాయి. కొన్ని కేవలం మన స్వీయానుభావం వల్ల మాత్రమే అర్థం అవుతాయి”* అని ఇతమిత్తంగా ఏమి చెప్పకపోవడంతో, అర్థం కాక, *“నాకు ఈ విషయం అర్థం కాలేదు పెరియవ. ఏది సరైనది? ప్రసాదం కొంచం ఇవ్వాలా? ఎక్కువ ఇవ్వాలా? ఈ విషయంలో నాకు సహాయపడవలసింది”* అని అడిగాను.


*“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”* అని నన్ను ఆశీర్వదించి పంపారు.


ఇప్పుడు నేను పాండిచెర్రి నుండి దిండివనం వెళ్ళే దారిలో ఉన్న పంచవటిలో ఒక దేవాలయం నిర్మిస్తున్నాను. అది ముప్పైఆరు అడుగుల పంచముఖ ఆంజనేయ స్వామీ ఆలయం. నిర్మాణం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు. 


ఇక్కడ కూడా పెద్ద ఆకుల్లో ఎక్కువ ప్రసాదం ఇవ్వడం ఆనవాయితీ. కొన్నిసార్లు నేనే  ఆ ప్రసాద వితరణ చేస్తుంటాను. ఇటీవల ఒకరోజు ఎప్పటిలాగే ఒక ఆకులో కదంబం (సాబారు అన్నం) మరొక ఆకులో పెరుగన్నం పెద్దమొత్తంలో ఇస్తున్నాము. అక్కడే కూర్చుని తింటున్న కొద్దిమంది నా వద్దకు వచ్చారు.


అందులో ఒకరు చాలా నిష్టూరంగా నాతో, *“మీరు సాంబార్ అన్నం, పెరుగన్నం ఎక్కువ ఎక్కువ ఇస్తున్నారు బావుంది. రుచిగా కూడా ఉంది. కాని మీకు ఒక సలహా ఇవ్వాలి అని ఉంది. సాంబార్ అన్నానికి నంచుకోవడానికి పోరియల్, పెరుగన్నానికి తోడుగా కారం ఊరగాయ(ఆవకాయ) ఇస్తే బావుంటుంది”*


ఆ మాటలు విని నేను నిశ్చేష్టుణ్ణి అయ్యాను. 1993లొ పరమాచార్య స్వామివారి మాటలు ఒక్కసారిగా గుర్తువచ్చాయి.


*“లేదు, లేదు ఈ విషయంలో సరైనది ఏది అని నీకు అనుభవంలోకి వస్తుంది. అప్పటి దాకా ఓపికగా ఉండు”*


స్వానుభవంతో ఇప్పుడు నాకు నిజం అవగతమైంది. ప్రసాదాన్ని ప్రసాదం లాగా కొద్దిగానే ఇవ్వాలి అని!


--- శ్రీ రమణి అన్న, “మహా పెరియవర్” నుండి.


 అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*

ప్రేమ అనగానే గుర్తుకు రావాల్సింది అమ్మ ప్రేమే. ఎందుకంటే ప్రేమే తప్ప స్వార్ధం తెలియనిది తల్లి ప్రేమే కాబట్టి. నవమాసాలు మోసి కని పెంచడానికి తల్లి ఎంత కష్టపడతుందో ఏ బిడ్డకి తెలియకపోవచ్చు అందులో తప్పు లేదు. కాని ఎంత ప్రేమ పంచిందో ప్రతీ బిడ్డకు తెలుస్తుంది కాని తెలిసి తెలిసి ఎందరో ఎన్నో తప్పులు చేస్తుంటారు. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే!.........


జపానులో పూర్వం ఒక కౄరమైన అలవాటు ఉండేదట… వయసైపోయి ఏ పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న తల్లిదండ్రులను తీసుకుని వెళ్లి ఎతైన కొండప్రాంతాలలో వదిలి వచ్చేవారట. 


వారి పని కూడా వారు చేసుకోలేని ఆ ముసలివారు ఆకలితో అలమటించి క్షీణించి చనిపోయేవారట. 


ఒకరోజు ఒక యువకుడు తన తల్లిని కొండల్లో వదలేసి రావడానికి తన భుజాలపై మోసుకుని బయలు దేరాడు.


దారిలో భుజం పై ఉన్న తల్లి ఏదో చేస్తున్నట్టు అనిపించి గమనించగా చెట్టు కొమ్మల నుంచి ఆకులు తెంపడం గమనించి చాలా దూరం వెళ్ళిన తరవాత తల్లిని దించి నువ్వు ఎందుకు ఆకులు తెంచుతున్నావు అని అడిగాడు. 


అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పుకొచ్చింది… “నాయనా! నేను ముసలిదాన్ని అయిపోయానని, నన్ను వదిలెయ్యాలని పైగా నేను తిరిగి రాకూడదని చాలా దూరం తీసుకుని వస్తున్నావు. ఒకవేళ నువ్వు దారితప్పి ఇబ్బంది పడతావేమో అని బాధతో నీకు దారిని తెలిపే ఉద్దేశ్యంతో ఆ కొమ్మలను తెంపి దారిపొడుగునా వేస్తూ వచ్చాను. ఆ గుర్తులతో జాగ్రత్తగా ఇల్లు చేరుతావని అలా చేశాను.” అని చెప్పింది ఆ తల్లి. 


అమ్మ మనసు మంచు కన్నా చల్లనిది, మల్లె కన్నా తెల్లనిది, దేవతతో సమానురాలు అని అందుకే అంటారు. ఆమె మాటలు విన్న ఆ యువకుడికి కనువిప్పు కలిగి తల్లిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్లి చక్కగా చూసుకోవడం మొదలు పెట్టాడు. అప్పటి నుంచి అందరూ ఆ ఆచారం వదిలేసారంట.


మనం కన్న పిల్లలు ఏమి చేసినా నేను కూడా చిన్నప్పుడు అలాగా చేసాను, ఇలానే చేసాను ఇప్పుడు నా పిల్లలు కూడా అంతే అని మురిసిపోయే మనం… మన తల్లి తండ్రులు వృద్దులైపోతే నేను కూడా కొన్ని సంవత్సరాల తరవాత ఇలా ఉంటాను అన్న మాట అని ఎందుకు అనుకోము. నేటి తరం అయిన మన పిల్లల రేపటి భవిష్యత్తు కోసం పాకులాడి, మన స్థాయికి మించిన చదువులు వాళ్ళ ఇష్టాలు తీర్చడానికి పాటు పడే మనము, మనకి భవిష్యత్తులో వచ్చేది ఆ ముసలితనమేనని ఎందుకు మరచిపోతాము ??? ✍️                

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

: *దైవేచ్ఛ...!!*

మనం ఏదైనా పని చేయ తలపెడతాం. 

ఆ కార్యాన్ని సాధించడంలో మనం సఫలీకృతులమైతే ఆ విజయం మన ప్రతిభేనని చెప్పుకుంటాం. 

అదంతా మన ఘనతేనని చాటుకుంటాం. 

అదే విఫలమైతే దానికి కారణం ఇతరుల పైన నెడతాం. 

లేదా ప్రతికూల పరిస్థితులు అంటాం. 

భగవంతుడికి మన మీద దయ లేదు, అది మనకు వ్రాసి పెట్టలేదు అని ఆ వైఫల్యాన్ని భగవంతుడి మీదకు తోసేస్తాం....

అంతే కాని ఆ వ్రాసిపెట్టడమనేది మన పూర్వ జన్మ కర్మల ఫలితమేననీ, అంతా దైవేచ్ఛ అని మాత్రం అనుకోం. 

అలా అనుకుంటే మనకు ఖేదమోదాలుండవు...!!!


అది ఎలా ??? ఓ చిన్న కథ ద్వారా తెలుసుకొందాము!!...


ఓ ఊళ్ళో ఓ పేదవాడుండేవాడు...

అతడు కూటికి పేద అయినా అతనిలో భక్తికి మాత్రం లోటు లేదు. 

కూలీ, నాలీ చేసి వచ్చినదానితో సంతృప్తి చెందుతూ సంతోషంగా జీవనయానం సాగిస్తుండేవాడు. 

అలా ఆ ఊళ్లోవాళ్ళందరికీ అతడంటే అభిమానం ఏర్పడింది.


“దైవేచ్ఛ వల్ల నాకు ఈరోజు పని దొరికింది, దైవేచ్ఛ వల్ల నేను ఆ పనిని సక్రమంగా పూర్తి చేయగలిగేను "... 

" దైవేచ్ఛ వల్ల నేను ఈ రోజు ఇంత సంపాదించ గలిగేను.”

ఇలా అన్నీ దైవేచ్ఛ వల్లే అనుకుంటూ ఉండే వాడు. 

ఓ రోజు రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ ఇంటి బయట కూర్చున్నాడు, ఇంతలో కొంత మంది దొంగలు అటు వస్తూ వాళ్లకు మూటలు మోయడానికి ఓ మనిషి కావలిసివచ్చి ఈ పేదవాడ్ని లాక్కెళ్ళి పోయేరు. 


అలా తీసుకెళ్ళి వాళ్ళు ఒక ఇంటిలో దొంగిలించిన నగల మూటను వాడి నెత్తి మీద పెట్టి తమతో రమ్మన్నారు. 

ఇంతలో అటువైపు రాజభటులు రావడం చూసిన ఆ దొంగలు పారిపోయేరు...


రాజభటులు నెత్తిన మూటతో ఉన్న ఆ పేదవాడ్ని చూసి వీడే దొంగ అని తీసుకుని పోయి కారాగారంలో బంధించారు...


మర్నాడు విచారణకు అతడిని రాజు గారి వద్దకు తీసుకొచ్చేరు. 

ఈ విషయం తెలిసి ఆ ఊళ్లోవాళ్ళందరూ వచ్చి రాజుగారితో.. 

“ప్రభూ! ఇతను మాకందరికీ తెలుసు, చాలా మంచివాడు, గొప్ప భక్తుడు కూడా, దొంగ కాదు ” అని చెప్పేరు. 

అది విని ఆ రాజుగారు పేదవాడితో.. “నువ్వు చెప్పుకోవలసిందేమైనా ఉందా..?“ అని అడిగితే..

దానికి ఆ పేదవాడు “ప్రభూ! దైవేచ్ఛ వల్ల నేను రాత్రి ఇంటిబయట కూచున్నాను...

దైవేచ్ఛ వల్ల దొంగలు అటుగా రావడం జరిగింది. 

దైవేచ్ఛ వల్ల వాళ్ళు నన్ను తమవెంట తీసుకుపోయేరు,

దైవేచ్ఛ వల్ల వాళ్ళు దొంగిలించిన నగలమూటను నా నెత్తిన పెట్టేరు. 

దైవేచ్ఛ వల్ల మీ భటులు నన్ను దొంగనుకుని కారాగారంలో బంధించేరు. 

దైవేచ్ఛ వల్ల ఇప్పుడు నేను మీవద్దకు విచారణకు తీసుకురాబడ్డాను. 

అంతా దైవేచ్ఛయే ప్రభూ!“ అని చెప్పేడు. 

ఆ పేదవాడి భక్తినీ, అమాయకత్వాన్నీ చూసి రాజుగారు ఇతడు దొంగ కాదని చెప్పి వదిలేసేరు...


చూసేరా! ఆ పేదవాడు అంతా దైవేచ్ఛయే అనుకుంటుండడాన్ని తనను దొంగలు తీసుకెళ్ళినప్పుడు అతనిలో భయం గాని, తన నెత్తిన మూట పెట్టినప్పుడు జంకుగాని, రాజభటులు కారాగారంలో పెట్టినప్పుడు దుఃఖం గాని, విచారం గాని కలుగలేదు.

అంతా కూడా దైవ నిర్ణయమె, దైవేచ్ఛ యే... అనే భావం ఎప్పుడూ మనలో వుండాలి, అప్పుడే మనలని ఆ భగవంతుడు కంటికి రెప్పలా కాపాడుతుంటాడు...


              శ్రీ సద్గురుపీఠం కోటకదిర

వడదెబ్బ నివారణా యోగాలు -

 వడదెబ్బ నివారణా యోగాలు  -


 *  ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.


 *  వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.


 *  నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.


 *  వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.


 *  కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.


 *  విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.


 *  48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.


 *  తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.


 *  తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.


 *  నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .


 *  చన్నీటితో స్నానం చేయించవలెను .


 *  వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .


        వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.


         మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి .


 

         మరింత విలువైన సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు . 


   

దండం దశగుణం భవేత్*

 *దండం దశగుణం భవేత్*


ఈ వాక్యానికి  అర్థాన్ని మార్చేశారు. దండిస్తే కానీ పని జరగదు అనే సందర్భంలో "దండం దశగుణ భవేత్" అంటారు నేటి సమాజంలో. కానీ ఆ వాక్యం అసలు అర్థం అదికాదు...


అసలు అర్థాన్ని ఈ క్రింది శ్లోకం తెలియ జేస్తుంది


శ్లోll విశ్వామిత్రాహి  పశుషు

కర్దమేషు జలేషు చ

అంధే తమసి వార్ధక్యే

దండం దశగుణం భవేత్


దీనిలోని అర్థం -


1. వి - పక్షులు,

2. శ్వా - కుక్కలు,

3. అమిత్ర - మిత్రులుకానివారు (శత్రువులు),

4. అహి - పాములు,

5. పశు - పశువులు,

6. కర్దమేషు - బురదలో,

7. జలేషు - నీటిలో,

8. అంధే - గుడ్డితనంలో,

9.తమసి - చీకటిలో,

10. వార్ధక్యే - ముసలితవనంలో


దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, భవేత్ - కలిగిస్తుంది.


అంటే

కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి,

బురదలోను, నీటిలోను, గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆసరాగా ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగ పడుతుంది అని భావం


✨✨✨✨✨✨✨✨✨

కర్మకాలానుగుణంగ వచ్చితీరుతాయి*.

 .

            _*సుభాషితమ్*_


 𝕝𝕝శ్లోకం𝕝𝕝


*అప్రార్థితాని దుఃఖాని*

*యథైవాయాన్తి దేహినామ్l*

*సుఖాన్యపి తథా మన్యే*

*దైన్యమత్రాతిరిచ్యతే॥*


తా𝕝𝕝 

*మనం కోరకపోయినా పూర్వకర్మానుగుణంగ దుఃఖాలురావడం అందరికీ అనుభవమేగదా..... అట్లేసుఖాలు గూడా కర్మకాలానుగుణంగ వచ్చితీరుతాయి*.... *ఇంకెందుకు ఈ మనిషి సుఖాలకోసం వెంపర్లాడుతాడు?*

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 62*


.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 62*


చాణక్యుడు ముసిముసిగా నవ్వి ...

"తక్షశిల వదిలిన మేము కాశీ నగరాన్ని చేరినట్లు మీకు తెలుసు కదా ! కాశీ పండిత పరిషత్ లో శ్యామశాస్త్రి అను వృద్ధ పండితుడు మా చేతుల్లో ఓటమి పాలైన పండితుల్లో ఒకడు. ఆయన ఆంధ్రుడు. ఆయన కుమార్తె, అల్లుడు అకాల మరణం చెందారు. వారి కుమార్తె గౌతమి. మాతామహుల సంరక్షణలో వుంటోంది. వారూ మేమూ ఆంధ్రులమే కావడం చేత, వారికి తోడు మరెవరూ లేకపోవడం చేత మా బస వారింట, వారి బలవంతం చేత ఏర్పాటయింది. మా అమ్మగారికి గౌతమి నచ్చడం చేత, ఆవిడ బలవంతం వల్ల గౌతమితో మా వివాహం నిరాడంబరంగా జరిగింది. మాకెటూ ఈ కార్యభారము దేశాలు తిరగవలసిన అవసరం ఉన్నది కదా ! అందుకే గౌతమితో పాటు మా అమ్మగారిని కూడా కాశీలో శ్యామశాస్త్రిగారి సంరక్షణలో ఉంచక తప్పలేదు. కాకపోతే, విశేషమేమిటంటే, మేము కాశీని వదిలి మగధకి ప్రయాణం ప్రారంభించేనాటికి గౌతమికి ముచ్చటగా మూడవ మాసం. రేపో... మాపో మా అమ్మగారికి మనవడో, మనవరాలో జన్మిస్తారు..." అని చెప్పి కొంచెం సిగ్గుపడ్డాడు చాణక్యుడు. 


"శుభాభినందనలు గురుదేవా..." అంటూ మిగతా ఇద్దరు సింహళవాసుల వేషధారులైన చాణక్య శిష్యులు, శార్జారవుడు, సంఘభూతి ఆయనకి తమ ఆనందాన్ని, అభినందనలను తెలియజేశారు. అనంతరం వారు చాణక్యుని సైగననుసరించి అతనికి మరొక మారు నమస్కరించి కర్తవ్య పరాయణులై నిష్క్రమించారు. 


"ఇదంతా నాకు చాలా, వింతగా విచిత్రంగా ఉంది గురుదేవా ! ఆ నలుగురూ తమ శిష్యులని గానీ, తమరి ఆదేశనుసారమే నాకు పాటలీపుత్ర అధికారవర్గంలో స్థానం కల్పించడానికి మాయాసింహం నాటకం ఆడారని నేను వూహించనే లేదు" అన్నాడు చంద్రగుప్తుడు. 


చాణక్యుడు నవ్వి "నీ ఊహకి అందని మరెన్నో వింతలూ విశేషాలు మున్ముందు తెలుసుకుందువు గానిలే..." అని చెప్పి మురాదేవి వైపు సాభిప్రాయంగా చూసి ఇలా చెప్పాడు....


"అమ్మా ! మీ తండ్రిగారు పిప్పలవన ప్రభువు జన్మతః హిందువులై వుండీ, మీ వివాహానంతరం బౌద్ధమతమును స్వీకరించి, మరికొంత కాలం తర్వాత మరల హిందూ మతమును స్వీకరించడాన్ని జీర్ణించుకోలేని కొందరు హిందూమత దూరహంకారులు ఆయనను శూద్రుడని నిందించి, ఆయనకి ప్రాయశ్చిత్తము లేదని ప్రకటించడం మీకు కలిసి వచ్చింది. ఆనాడు ఏకాంత దుర్గము నుండి తప్పించుకున్న మిమ్మల్ని మీ తండ్రిగారు ఆదరించిననూ, ఆయన మతమార్పిడి కారణంగా చంద్రునికి 'వృషలుడనే' నామాంతరం కల్పించడం చేత ఇంతకాలం మీ రహస్యం మీ విరోధులకి తెలియలేదు. చంద్రునికి ఆపదలు సంభవించలేదు. ఇప్పుడు మన శత్రువులందరికీ చంద్రుడు 'చిరంజీవి' అన్న వార్తని నేనే వ్యాపింపజేశాను. ఇక ముందున్నది మన వైరులకు ముసళ్ళ పండగ. నేనూ చంద్రుడూ ప్రయాణమై వివిధ రాజ్యాధీశులను కలిసి సైనిక సహాయాన్ని అర్దిస్తాం. ఈ బృహత్తర కార్యక్రమంలో తమరూ కాస్త సహకరించాలి." 


"ఆజ్ఞాపించండి స్వామీ ! నా ప్రభువు మహానందుల వారికి జరిగిన ద్రోహం గురించి మగధ ప్రజలందరూ తెలుసుకోవాలి. వారికి జరిగిన అన్యాయాన్ని ఈ లోకమంతా ముక్తకంఠంతో ఖండించాలి. ఆనాడు, నా ప్రభువు కన్నీళ్ళతో చేతులు జోడించి నాతో చెప్పిన చివరి సందేశాన్ని... నా ప్రభువు నాకిచ్చిన అంతిమ ఆదేశాన్ని... అంతిమ ఆదేశాన్ని... " అంటుంటే మురాదేవి కంఠం రుద్ధమై దుఃఖం ముంచుకొచ్చింది. ఆవిడ దుఃఖంతో వివశురాలై సన్నగా రోదించసాగింది. 


తల్లి దుఃఖిస్తుంటే తట్టుకోలేని చంద్రుడి వదనం కందగడ్డలా ఎరుపెక్కింది. అతడు ఆవేశంతో పగబట్టిన త్రాచులా బుసలుకొడుతూ... 

"అమ్మా ! పదహారేళ్ళుగా నీ కాన్నీటిని చూస్తూ... భరిస్తూ... నీ కన్నీళ్లను తుడిచే వయస్సూ, అవకాశమూ లేక ఇంతకాలం వ్యర్ధుడిలా జీవించాను. పగతురులు కళ్ళముందే తిరుగుతూ ప్రగల్భాలు పలుకుతుంటే, సందర్భం వచ్చినప్పుడల్లా మా నాన్నగారిని హేళన చేసి మాట్లాడుతుంటే, పౌరుషాన్ని దాచుకుని, నీ మాటకు కట్టుబడి జీవచ్చవంలా బ్రతికాను. ఇహ నీ దుఃఖాన్ని చూడలేను. ఇకనైనా నాకు ఆనతి ఇయ్యమ్మా ... ఇప్పుడే వెళ్లి ఆ నందుల మీదికురికి నా శౌర్య ప్రతాపాలు వాళ్లకి రుచి చూపిస్తాను. మా తండ్రి, మగధ సామ్రాజ్యాధినేత మహానందుల వారి పవిత్ర రక్తమే నాలో ప్రవహిస్తోందని రుజువు చేస్తాను. నాన్నగారి ఆత్మ శాంతి కోసం ఆ నందులతో ముఖాముఖి తలపడి పోరాడి, అవసరమైతే వీరుడిలా మరణిస్తాను. నన్ను ఆదేశించమ్మా" అన్నాడు ఆవేశంతో. 


"అలా చేస్తే మహానందుల వారి ఆత్మ శాంతిస్తుందా చంద్రా..." చాణక్యుని గంభీర కంఠస్వరం పెల్లుబికుతున్న చంద్రుని ఆవేశం పైన నీళ్లు చిలకరించినట్లైంది. అతడు చాలా ఉక్రోశంగా ఆర్యుని వైపు చూసాడు. 


"నువ్వు వ్యర్ధావేశానికి లోనై నందుల మీద దాడి చేసి మూర్ఖంగా చావు తెచ్చుకుంటే నీ తల్లి దుఃఖం తీరుతుందా ? చక్రవర్తికి ఆవిడ ఇచ్చిన మాటకి విలువ ఉంటుందా ?" గంభీరంగా ప్రశ్నించాడు చాణుక్యుడు. 


చంద్రుడు ఆవేదనతో తల్లడిల్లిపోతూ "గురుదేవా...!" అన్నాడు బాధగా. 

(ఇంకా ఉంది)...


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*

 


యోగసాధన, ఉపాసన మార్గం లో గణపతి అర్చన /మంత్ర సాధన, ప్రవేశద్వారం వంటిది.  గణపతి ఉపాసన చేయనిదే ఇతర దేవతా మంత్ర సాధనలు ఫలించవు.  గణపతి మంత్ర సాధన ఎంత ఎక్కువ చేస్తే అంత సాధకుని శరీరానికి, మనస్సుకు, బుద్ధి కి దైవఆకర్షణ పెరుగుతుంది.  గణపతి తత్వం ప్రధానంగా ఆకర్షణా, వశీకరణ. అందువల్ల ఇతర దేవతా చైతన్యం తొందరగా సిద్ధిస్తుంది. యోగసాధనా /ఉపాసనా మార్గం లో గణపతి తత్త్వం :  1. పెద్ద శిరస్సు (మేధస్సు )- శాస్త్రపరిజ్ఞానం, అవగాహన.2. పెద్ద చెవులు -ప్రతి విషయాన్ని క్షుణ్ణo గా వినడం, అర్ధం చేసుకోవడం.  3. చిన్న నేత్రాలు - స్పష్ట ద్రుష్టి, సునిసిత పరీశీలన.  4.  దీర్ఘ తుండం - దీర్ఘ ఉచ్చ్వాస, నిచ్వాసల ద్వారా, విశ్వావ్యాప్తమైన ప్రాణశక్తిని అధికంగా గ్రహించి శరీరం లో నిలుపుకోవడం ద్వారా ఉపాసనా  మంత్రానికి ప్రాణ చైతన్యం అధికం గాను, శాశ్వతం గాను ప్రాప్తిస్తుంది.  5.( బృహత్ ) పెద్దదైన, ధ్రుఢమైన, ఆరోగ్యావంతమైన శరీరం, - దీర్ఘ కాలం యోగ /ఉపసనా మార్గంలో నిలకడ. 6. బలమైన నాలుగు కాళ్ళు - సాధనలో స్థిరత్వం. 7. మందగమనం - నిదానమైన సాధన. 8.  తుండం చివర అమృతకలశం - ప్రాణ వాయువే అమృత రూపం. దానిని నాసికాగ్రమ్ నుండే గ్రహించాలి. 8.  రక్త వస్త్రం, రక్త వర్ణ శరీరం రజో గుణ తత్త్వం. 9.  రత్న సింహాసనం, రత్న కిరీటం - లోకాధిపత్యం. 10.  ఎలుక వాహనం - సేవాభావంతో మనసా, వాచా, కర్మణా ఆరాధించే సాధకులను జన్మలతో సంబంధం లేకుండా తన దగ్గరే స్థిర నివాసం.


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


నాన్న అపోహ  (కథ)

 ✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు


“ విరిగిపోయిన ఈ బక్కెట్టు తీసుకెళ్లి పాత సామాన్ల వాడికి ఇచ్చెయ్” అంది అమ్మ  రవికి  ప్లాస్టిక్ బకెట్ అందిస్తూ. తొమ్మిదో తరగతి చదివే రవిలో తెలివి, సృజనాత్మకత శాతం ఎక్కువ. 


 ఆకుపచ్చ రంగున్న బకెట్ మీద రంగు రంగుల్లో పువ్వులున్నాయి. విరిగినదే అయినా సరే అందంగా కనిపిస్తోందది. దాన్ని పాత సామాన్ల  వాడికివ్వడం   రవికి నచ్చలేదు.   కాసేపు ఆలోచించాడు రవి.  వాడికో ఆలోచన వచ్చింది. 


 ఒక కత్తెర తీసుకుని బకెట్ అంచు నుండి విరిగిన భాగం వరకు  క్రమ పద్ధతిలో కత్తిరించి. అడుగున ఒక   రంధ్రం చేసి, మట్టితో నింపాడు. పెరట్లోని  గులాబీ మొక్కల్లో ఒకటి తెచ్చి మట్టిలో  పాతాడు. దాని మీద  నీళ్లు  పోసాడు. ఇప్పుడది పూల కుండీ అయింది. దాన్ని తీసుకెళ్లి ప్రహరీ గేటు ప్రక్కన అలంకరణగా  పట్టేసి  అమ్మకి చూపించాడు.


 “ఇదెప్పుడు కొన్నాము?” అని ఆశ్చర్య పోయిందావిడ.  జరిగింది  అమ్మకి చెప్పాడు రవి. వాడి ఆలోచనకు మెచ్చుకుని,  వాళ్ళ నాన్నతో  చెప్పబోయింది. “చదువుకోవాల్సిన  సమయాన్ని ఇలా  వృధా చేయవద్దు.  చదువుకోమను” అన్నాడు నాన్న.    

 మరొక రోజు వీధిలో అందరికీ కరెంట్ పోయింది. రవి గదిలో మాత్రం విద్యుత్ బల్బు వెలుగు కనబడింది. 


వీధిలో వాళ్లకు రవి వాళ్లింట్లో మాత్రం వెలుగు కనబడడం ఆశ్చర్యమేసింది. 

“మీకు కరెంట్ పోలేదా? లేకపోతే ఇన్ వర్టర్ దా?” అని అడగడానికి వచ్చారు కొందరు.  


రవి అమ్మా నాన్నలు కూడా  ఆశ్చర్యపోయి “మాకూ కరెంట్ పోయింది. ఇన్ వర్టర్  లేదు” అని చెప్పారు.  


“మీ ఇంట్లో  లైట్ వెలుగుతోంది” అని వాళ్లు చెబితే ఆశ్చర్యపోయి లోపలకు వెళ్లారు.  అక్కడ విద్యుత్ వెలుగులో చదువుకుంటూ కనబడ్డాడు రవి. 

“ఇదెలా సాధ్యం?” అని అడిగారు రవిని.

“ పనిచెయ్యని కారు బ్యాటరీలను ఒక అంకుల్ పారెయ్యబోతుంటే అడిగి తీసుకున్నాను. మనింట్లో కరెంట్ రిపేరు చేసినప్పుడు మిగిలిపోయిన రాగి వైర్లు   నా దగ్గర దాచాను. ఆ పాత బ్యాటరీలో మెగ్నీషియం సల్ఫేట్ (ఎప్సమ్ సాల్ట్), కాస్టిక్ సోడా ,  పరిశ్రమల్లో  ఉపయోగించే స్ఫటికాకార ఆమ్లం ఉపయోగించి ఛార్జింగ్ చేశాను.  దానికి  కొత్త జీవితం వచ్చింది. ఇన్ వర్టర్ లాగా పనిచేసి వెలుగు ఇస్తోంది” అన్నాడు రవి. 


వీధిలో వాళ్లంతా రవి తెలివిని అభినందించి వెళ్ళిపోగా, నాన్న మాత్రం ఇలాంటి వాటికి సమయం వృధా చేస్తున్నాడని గొణుక్కున్నాడు. 


 ఒకరోజు సాయంత్రం బడి నుండి వచ్చిన రవితో ‘దోమతెర  చినిగిపోయిందని,  కొత్త దోమతెర  కట్టడానికి సాయం  రమ్మని’  పిలిచింది వాళ్ళమ్మ.  పాత   దోమతెరలో  కొన్నిచోట్ల  రంధ్రాలు పెద్దవయ్యాయి. పనయ్యాక  పాత తెరని  బయట పడెయ్యమంది. 


దాన్ని చూసిన  రవి  మనసులో బయట పారేయడం కంటే  వడియాలు, పిండి, నువ్వులు  ఆరబోసేటప్పుడు  పక్షులు ఎత్తుకు పోకుండా  వల లాగా  వాడాలన్న ఆలోచన కలిగింది.  ఆ మాటే వాళ్ళమ్మకి చెప్పగా  భలే ఆలోచన అంటూ మెచ్చుకుంది ఆమె.   


సరిగా అప్పుడే వాళ్ళ నాన్న ఇంట్లోకి వస్తూ ఆ మాటల్ని  విన్నాడు.  “ అదే పనిగా మెచ్చుకుని వాడిని పాడు చెయ్యకు” అని కసిరాడు. 


రవి  మీద వాళ్ళ నాన్నకి ప్రేమ ఉంది. ఇలాంటి పనులతో చదువుకి ఆటంకం వస్తుందని  భయపడుతుంటాడు.  తరగతి  పుస్తకాలు చదవాలి తప్ప ఇలాంటి  పనులు చేయొద్దంటాడు. ఏదైనా కొత్తగా  ఆలోచించి రవి చెప్పగానే వాటిని  మొగ్గలోనే తుంచి పారేసేవాడాయన. కొడుకుని ప్రోత్సహించాలని ఉన్నప్పటికీ భర్తకి ఎదురు చెప్పలేక పోయేది వాళ్ళమ్మ. 


ఒక  రోజు ఉదయం  కూరగాయలు కోసం  వెళ్లిన రవి నాన్నకి సైన్సు మాస్టారు కనిపించారు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. రవి తెలివిని , సృజనాత్మకతని     మెచ్చుకున్నారు మాస్టారు. 

  రవి నాన్న  సంతోషించలేదు సరికదా   “నాకూ అదే  భయం. వేరే ఆలోచనల్లో పడిపోయి  చదువుని  నిర్లక్ష్యం చేస్తాడేమోనని ” అన్నాడు.    


“ అందులో భయపడాల్సిందేముంది?   వాళ్ల కొచ్చే  ఆలోచనలను స్వాగతించాలి.  రవిలా సృజనాత్మకత  ఉన్నవాళ్లు మాత్రమే దేన్నైనా   కొత్త కోణంలో చూస్తారు.  బడిలో పిల్లలకు వచ్చే కొత్త  ఆలోచనలను మేం స్వాగతిస్తుంటాం.  వాటిని నూతన ఆవిష్కరణలుగా మార్చడానికి ప్రయత్నిస్తుంటాము. విజ్ఞాన ప్రదర్శనలప్పుడు ప్రదర్శిస్తుంటాం”  అన్నారు మాష్టారు. 


రవి ఇంట్లో చేసిన  పనుల గురించి  మాష్టారికి చెప్పి “వీటివల్ల ఏం ప్రయోజనం ఉంది?” అనడిగాడు   రవి నాన్న. 


మాష్టారు “ఎన్నో ఏళ్ళు పిండి విసిరిన తిరగలి అరిగిపోతే కొందరు పారేస్తారు. మరికొందరు గార్డెన్లో మెట్టుగా వాడతారు. టీ  కప్పు పగిలితే  కొందరు పారేస్తారు. మరికొందరు బడ్ వేజ్ గా వాడతారు . ఇందులో డబ్బు  ఎంత మిగిలిందన్నది ప్రశ్న కాదు. కొత్త రూపంలో పాత వస్తువుని చూసినప్పుడు కలిగే  మానసిక ఆనందం  వేరు. అందులో  ఉన్న కొత్త కోణాన్ని. సృజనాత్మకతను చూస్తే  ఆ పని ఎంతో గొప్పదని తప్పక అర్ధమవుతుంది.  రవిలో చురుకైన బుద్ధి ఉంది.  తెలివిగా, వేగంగా  ఆలోచిస్తాడు. అందువల్ల చదువుల్లో కూడా ముందుంటాడు  తప్ప నష్టం జరగదు” అన్నారు  నమ్మకంగా. 


 రవి నాన్నకి అంతవరకూ ఉన్న  అపోహలన్నీ తొలగిపోయాయి.  రవిని చదువుకే పరిమితం చేయకుండా మిగతా విషయాల్లో కూడా  ప్రోత్సహించాడు. తన మీద అమ్మానాన్నలకు ఉన్న   నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు రవి.  

—---*******-----

సేకరణ:- కన్యాకుమారి వాట్సాప్ పోస్ట్. 

🌹

శుభోదయం. సర్వే జనాః సుఖినోభవంతు.     ఉపాసన :  మంత్ర సాధన చెయ్యాలి అనుకునేవారు ముందుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనకు మంత్రోపదేశం చేసే గురువు కి ఆ మంత్ర సాధనకి సంబంధించిన గురు పరంపర ఉండాలి. అంటే తనకు మంత్రోపదేశం  చేసే స్వ గురువు, ఆ గురువుకి గురువు పరమ గురువు , ఆ గురువుకి గురువు పరమేష్టి  గురువుల  యొక్క( దీక్షా నామం. Etc ) వివరాలు తెలియాలి. గురుత్రయం ఉపదేశం తో ప్రారంభించి, ఉపసక మంత్రం యొక్క ఋషి /చంధస్సు /అధిష్టానా దేవత /బీజం /శక్తి /కీలకం /వినియోగం /ధ్యాన శ్లోకం ఉపదేశం చెయ్యాలి. ధ్యాన శ్లోకం ఉపాసక దేవత యొక్క సగుణ రూప వర్ణన. ఉపాసకుని సంకల్పం నెరవేరాలంటే దేవత, ధ్యానశ్లోకం లో వర్ణించినట్టు గానే అనుగ్రహిస్తుంది. గురువు ఉపదేశించిన ధ్యాన శ్లోకమే అనుష్టానం చెయ్యాలి. ఉపదేశం చేసే మంత్రాలకు సంస్కార మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. అనేక విధాలైన దోష నివారణా / మంత్ర చైతన్య /శాప విమోచన (ఉపాసనలో శాప విమోచన అంటే శపించడం కాదు. ఇది మంత్ర వినియోగానికి ఒక password/pin లాంటిది.)/ఉజ్జీవన /ఉద్దీపాన /ప్రాణ యోగ /ముఖ శోధన /కుళ్ళుక /మంత్ర సేతు /మహాసేతు లాంటి మంత్రాలను గురువు ఉపదేశ పూర్వకం గా చెప్పాలి. (ఆ గురువు ఇవన్నీ చేసివుండాలి ). ఉపదేశం, ఆ దేవతా గుడి /మందిరం /క్షేత్రాలలో జరగాలి. గురువుకి ఆ మంత్రానికి సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉండాలి. అన్నింటికంటే ముందు ఉపదేశం చేయడానికి ఆయన స్వగురువు అనుజ్ఞ ఉండాలి. ఉపదేశం తో పాటు ఆ గురు పరంపర /సాధన కి సంబంధించిన ఆచారాలు, నియమాలు చెప్పి పాటించేలా చెయ్యాలి. ఉపసకునికి మంత్రార్వణం (ధన, సుసిద్ధ /సిద్ధ Etc.,)తప్పక  చూడాలి. సాధనా కాలం గురువు పర్యవేక్షణ ఉండాలి. పై విధమైన అంశాలు పరిగణలోకి తీసుకోకుండా మంత్రసాధన చేస్తే అది ఫలించదు. గురూపదేశం లేని విద్య అసుర విద్య గా విపరీత సంకల్పాలకు,స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించాలనే ప్రమాదకరమైన ఆలోచనలు వచ్చి బ్రష్టుపట్టిపోతారు.కర్త, కారాయితా చైవ, ప్రేరకశ్చ, అనుమోదాకహా అన్నట్టు మంచైనా,చెడైనా ఎవరి వాటా వాళ్లకి వస్తుంది.T. V లో, ఇతర  చానాల్స్ లో సమయం, సందర్భం లేకుండా మంత్రో పదేశాల  విషయం లో ఉపదేశం చేసే గురువులు, సాధన చేసే శిష్యులు తస్మాత్ జాగ్రత్త. శుభం భూయత్ .


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*



          *అన్నదాతా సుఖీభవ...!!*

                  ➖➖➖✍️


*పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.* 


*వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు.*


*అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు.*


*ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, “స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును” అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.*


*'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట!’ అంటూ వెనుదిరిగాడు.* 


*అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. *


*లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి’ అని తొందర పెట్టాడు.*


*అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది'* 


*’ఇదేనా ఆ గొప్ప ఉపకారం?’ అన్నాడు ధనికుడు అసహనంగా.* 


*సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు!’ అన్నాడు.*


*ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు.* 


*ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా?’ అని ప్రశ్నించాడు.*


*ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు.*


*ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని.* 


*ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు.*


*’నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి’ అని అతడికి చెప్పాడు.* 


*ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు.*


*సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.*


*గుమాస్తా చదవడం ప్రారంభించాడు...*


*1వ వాడు:*

*’ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!’*


*2వ వాడు:*

*’ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా.’*


 *3వవాడు: *

*’అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?’* 


*అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. ‘చాలు చాలు చదవకు..’ అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు.*


*’స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది..’ అంటూ వాపోయారు.*


*సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు.* 


*ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు.*


*మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు.*


*మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.*


*1వ వాడు:*

*’అన్నదాతా సుఖీభవ!’*


*2వ వాడు:*

*’ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.’*


*3వ వాడు: *

*అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.*


*దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.*


*కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఈనాడు లభించింది.*


*అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు. ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

తనకి తానే స్నేహితుడు

 శ్లోకం:☝️

*ఆత్మైవ హ్యాత్మనో బంధుః*

  *ఆత్మైవ రిపురాత్మనః ।*

*ఆత్మైవ హ్యాత్మనః సాక్షీ*

 *కృతస్యాప్యకృతస్య చ ।।*

(మహాభారతం, అనుశాసనపర్వం 6.27)


భావం: ప్రతి వ్యక్తి తనకి తానే స్నేహితుడు మరియు తనకి తానే శత్రువు కూడా. తన పాపపుణ్యాలకు తానే సాక్షి. ఎవరి కర్మకు వారే బాధ్యులు!🙏 భగవద్గీతలో కూడ ఇలాంటి శ్లోకం ఉంది.

*ఉద్ధరేదాత్మనాత్మానం*

 *నాత్మానమవసాదయేత్ ।*

*ఆత్మైవ హ్యాత్మనో బంధుః*

 *ఆత్మైవ రిపురాత్మనః ।।*