7, సెప్టెంబర్ 2021, మంగళవారం

భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏

 *07.09.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2254(౨౨౫౪)*


*10.1-1367-వ.*

*10.1-1368-*


*క. పాటవమునఁ బలుపిడికిట*

*సూటిం బడఁబొడిచె బలుఁడు శోభిత ఘన బా*

*హాటోప నృపకిరీటుం*

*గూటున్ వాచాటు నధిక ఘోర లలాటున్.* 🌺



*_భావము: ఇంకా, కంసుని అనుచరుడు, భయంకరమైన ముఖము కలవాడు, అతి వాచాలుడగు కూటుడు అనే మల్లయోధుని పడిపోయేటట్లుగా, బలరాముడు తన బలమైన పిడికిటి తో గురిపెట్టి కొట్టాడు._* 🙏



*_Meaning: Balarama used his strong fist to hit the big mouthed, ugly faced and a close associate of Kamsa named "Kuta" and felled him to ground._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kum

ar (9347214215).*

లలితకళలు 64

లలితకళలు 64 

మనకు చిన్నప్పుడు లలితకళలు 64 అని చెప్పిన విషయం మనలో కొందరికి జ్ఞాపకం వుంది ఉండొచ్చు.  కానీ చాలామందికి ఆ కళలు ఏమిటి అని తెలియకపోవచ్చు.  అందుకే ఇది వ్రాస్తున్నాను. 

మనపూర్వీకులు అప్పుడు సమాజంలో కావలసిన విద్యాలుగా 64 పేర్కొన్నారు. నిజానికి అందులో కొన్ని ఇప్పటికి మన సమయానికి కావలసినవి వున్నాయి. 

ఈ 64 కళను తెలిపే  శ్లోకం చూద్దాం:  

వేద వేదాంగేతిహాసాగమ, న్యాయకావ్యాలంకార, నాటక, గాన కవిత్వ కామశాస్త్ర శకున, సాముద్రికారత్న పరీక్షాస్వర్ణపరీక్షా శ్వలక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద, రసవాదాగ్నిస్తంభజలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంష, వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్ఛాటన మారణ కాలవంచన వాణిజ్య, పాశుపాల్య కృష్యా సవకర్మలావుక యుద్ధమృగయా, రతికౌశలా దృశ్యకరణీద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యౌషధసిద్ధి స్వరవంచనా దృష్టివంచనాంజన, జలప్లవన వాక్సిద్ధి, ఘటికాసిద్ధి, ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుష్టష్టివిద్యా నిషద్యాయమాన నిరవద్య విద్వజ్ఞాన విద్యోతితే.

ఈ శ్లోక భావాన్ని పరికిద్దాము.: 

1. వేదములు (ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అధర్వణవేదము అను నాల్గు) 

2. వేదాంగములు- వేదములకు సంబంధించిన ఆరుశాస్త్రములు

(1. శిక్షలు 2. వ్యాకరణము 3. ఛందస్సు 4. జ్యోతిషము 5. నిరుక్తము 6. కల్పములు అని వేదాంగములు. ఆరు శాస్త్రములు) 

3. ఇతిహాసములు - రామాయణ,మహాభారత, భాగవతం పురాణాదులు 

4. ఆగమశాస్త్రములు- 1. శైవాగమము 2 పాంచరాత్రాగమము 3 వైఖానసాగమము 4 స్మార్తాగమము అని ఆగమములు నాల్గు. 

5. న్యాయము: తర్కశాస్త్రమునకు పేరు 

6. కావ్యాలంకారములు : సాహిత్యశాస్త్రము 

7. నాటకములు 

8. గానము (సంగీతం) 

9. కవిత్వము ఛందోబద్ధముగ పద్యమునుగాని శ్లోకమునుగాని రచించడము 

10. కామశాస్త్రము 

11. ద్యూతము (జూదమాడడము): జూదమునకు సంబంధించిన సూక్తములు ఋగ్వేదములో కొన్ని ఉన్నాయి. వీనికే అక్షసూక్తమనియునందురు. కార్తిక శుద్ధ పాఢ్యమినాడు జూదమాడవలయుననియు శాస్త్రవచనములుగలవు. ఇదియు నొకకళ, 

12. దేశభాషాజ్ఞానం 

13. లిపికర్మ= దేశభాషలకు సంబంధించిన అక్షరములు నేర్పుగ వ్రాయువిధానము. 

14. వాచకము = ఏగ్రంధమైననూ తప్పులేకుండ శ్రావ్యముగ నర్థవంతముగ చదువు నేర్పు 

15. సమస్తావథానములు: అష్టావధాన, శతావధాన, నేత్రాథానాది, అవధానములలో నైపుణ్యము 

16. స్వరశాస్త్రము= ఉచ్ఛ్వాస నిశ్వాసములకు సంబంథించినదై ఇడా పింగళా సుషుమ్న నాడులకు చేరినదై చెప్పబడు శుభాశుభ ఫలబోధకమైన శాస్త్రము, 

17. శకునము= ప్రయాణ కాలమున, పక్షులు జంతువులు మానవులు, ఎదురురావడం గూర్చి గాని, ప్రక్కలకు వెళ్ళడం గూర్చి భాషించు భాషణములను గూర్చి, గమనించి తన కార్యము యొక్క శుభాశుభముల నెరుంగునట్టి శాస్త్రము 

18. సాముద్రికము= హస్తరేఖలు, బిందువులు, వగైరాలను గుర్తించి శుభాశుభముల నెరుంగజేయు శాస్త్రము 

19. రత్నపరీక్ష= నవరత్నాల గురించి వాటి ప్రభావం, వాటి నాణ్యత మొదలగు గుణాల సంపూర్ణజ్ఞానం 

20. స్వర్ణపరీక్ష= బంగారమును గుర్తించు జ్ఞానము 

21. అశ్వలక్షణము= గుఱ్ఱములకు సంబంధించిన జ్ఞానము 

22. గజలక్షణము= ఏనుగులకు సంబంధించిన జ్ఞానము 

23. మల్లవిద్య = కుస్తీలు పట్టు విధానము 

24. పాకకర్మ= వంటలు 

25. దోహళము=వృక్షశాస్త్రము 

26. గంధవాదము = వివిధములైన సువాసన వస్తువులు అత్తరు పన్నీరు వంటివి తయారుచేయు నేర్పు 

27. ధాతువాదము = రసాయన వస్తువులు నెరుంగు విద్య 

28. ఖనీవాద- గనులు వాటి శాస్త్రం . 

29. రసవాదము - పాదరసము మొదలైన వానితో బంగారు మొదలైనవి చేయు నేర్పు. 

30. అగ్నిస్తంభన - అగ్నిలో కాలకుండ తిరుగాడు రీతి. 

31. జలస్తంభన - నీళ్ళను గడ్డగట్టించి, నందులో మెలంగుట. 

32. వాయుస్తంభన - గాలిలో తేలియాడు విద్య 

33. ఖడ్గస్తంభన - శత్రువుల ఖడ్గాదులను నిలుపుదల జేయు విద్య 

34. వశ్యము - పరులను, లోబచుకొను విద్య 

35. ఆకర్షణము - పరులను, చేర్చుకొను విద్య, 

36. మోహనము - పరులను మోహింపజేయు తెరంగు. 

37. విద్వేషణము - పరులకు విరోదము కల్పించడము, 

38. ఉచ్ఛాటనము - పరులను ఉన్నచోటునుంచి వెళ్ళగొట్టడము, 

39. మారణము - పరులకు ప్రాణహాని గల్గించడము. 

40. కాలవంచనము - కాలముగాని కాలమున పరిస్ధితులు మార్పు గలిగించడము. 

41. వాణిజ్యము - వ్యాపారాదులు. 

42. పాశుపాల్యము - పశువులను పెంచడములో నేర్పు. 

43. కృషి - వ్యవసాయ నేర్పు. 

44. ఆసవకర్మ - ఆసవములను, మందులను చేయు రీతి 

45. లాపుకర్మ - పశుపక్ష్యాదులను స్వాధీనబరచుకొను రీతి. 

46. యుద్ధము - యుద్ధముచేయు నేర్పు. 

47. మృగయా - వేటాడు నేర్పు 

48. రతికళాకౌశలము - శృంగార కార్యములలో నేర్పు. 

49. అద్మశ్యకరణీ - పరులకు కానరాని రితిని మెలంగడము. 

50. ద్యూతకరణీ - రాయబార కార్యములలో నేర్పు. 

51. చిత్ర - చిత్రకళ 

52. లోహా - పాత్రలు చేయి నేర్పు 

53. పాషాణ - రాళ్ళు చెక్కడము(శిల్పకళ.) 

54. మృత్ - మట్టితొ చేయు పనులలో నేర్పు 

55. దారు - చెక్కపని 

56. వేళు - వెదరుతో చేయు పనులు 

57. చర్మ - తోళ్ళపరిశ్రమ. 

58. అంబర - వస్త్ర పరిశ్రమ 

59. చౌర్య - దొంగతనము చేయుటలో నేర్పు 

60. ఓషథసిద్ధి - మూలికలద్వారా కార్యసాధనావిధానము 

61. మంత్రసిద్ధి - మంత్రములద్వారా కార్యసాధనము 

62. స్వరవంచనా - కంఠధ్వనివల్ల ఆకర్షణము 

63. దృష్టివంచన - అంజనవంచన - చూపులతో ఆకర్షణము 

64. పాదుకాసిద్ధి - ఇంద్రజాల మహేంద్రజాలములు తలచినచోటికి ఇంద్రజాలములనెడు గారడీవిద్య 

Limitations

 Limitations (LIITATIONS)

Range or boundaries are almost synonymous. Every object we see in this world (the world is not just this world, everything you see is the sun, the moon, even the stars) (the word object here means everything that appears, not just inanimate) is subject to certain limitations. These are explained by our sages in three ways. They are 


1) Material limit 


2) National limit 


3) Calorie restriction. 


Let us now learn about them in detail. 


All of these limitations mean that everything has a precision, but not less than that. For example if you take an object it can be anything but that object has a uniqueness. That is why we call it by a specific name. For example, if there is a cow, we call it a cow because of its appearance. One of the cows may even mark a cow. The reason for that is because we have identified some features of that particular cow. There are millions of people in this world. But we recognize each crook by their own name. I mean suppose you know Rama Rao I said I saw Rama Rao yesterday then you will be able to recognize it immediately. The reason for that is because the Rama Rao I say is the only Rama Rao you know. Now we notice one thing. Rama Rao is not Krishna Rao because Rama Rao is not only Krishna Rao's name but also their appearance and attributes are different. That is, everything we see in this world expresses its specificity. This means that every object found in this world is a range that is finite. Such a limit is spiritually called material scope. This means that everything is materially limited. 


And the second thing is that country here means country is a place. If I say I saw Rama Rao, I will immediately ask you where and when you saw it. Both of these writings are also limited. I looked at Ramalayam Arugu which means when Rama Rao was sitting on Ramalayam Arugu. This subject refers to a country i.e. a particular place. Moreover, that particular place is also subject to a limit. That means you will understand that the Ramalaya I have mentioned is one of the most humane. That's all but not the Ramalayam in Marekodo. Vunnaramalayam in another town means then I have to say that village name too. Such a spatial scope is called a national scope. 


Let's look at the third thing. The third question you asked when I saw Rama Rao was when did you see him. That's what I said at four o'clock yesterday evening. Now we know that Rama Rao (object) Ramalayam Arugu (country means place) is four hours (time or period). This world is completely visible to us subject to these three things. 1) Every visible object is in this world occupying a limited space 2) It is in a certain place 3) It is in a certain period of time. We can attribute this to everything that appears. What we need to know is that these three letters also indicate a limit. 


Only those subject to these three limitations are visible to us in this world. The first limitation of which is the object limit which specifies an object. But the fact is that the object did not exist in the past. As soon as it perishes its existence is lost to this world. One principle can be proposed here is that it perishes in the period of its birth. On closer inspection this world is the source of every object found in this material creation. I.e. the Panchabhutas. The birth is completely with the Panchabhutas and after the extinction they merge into the Panchabhutas. 


I think my body is also built with the Panchabhutas so it needs to merge into the Panchabhutas one day. But we are bound by this ignorant world that this is me (the body) this is my house, this is me. We want to get joys and pleasures with them. Are getting. We are changing a truth that will give us happiness today and tomorrow will give us happiness. 


Our sages prophesy that there are no such limits in the case of God. The only thing we can finally know from reading any of the Upanishads that you have read in the Vedanta scriptures is that God 1) Absolute 2) Nirguna 3) Eternal (Eternal) These three attributes are different from the objects that appear to us physically. Let's take a look at it somewhere. 


1) Absolute: We call God Absolute. That is, God has no form, so he is not subject to the limit of coming. When an object is not subject to an architectural limit then it is not subject to a national limit as well. That is why God is not subject to the limit of desertia. The 3rd limit we have taken is the time limit. Are we saying that God is eternal and eternal? That means he is always there. In other words, God is in the past, present, and future. That is, he is always there. 


This truth was discovered by our sages thousands of years ago and the ways to reach that sage have been communicated to us through the Upanishads. 


Mukuksuvulara Our sages have given us the knowledge of intelligence that is nowhere in the world. Let us walk in their footsteps and become salvation lovers and attain salvation. 


Om Tatsat 


Peace Peace Peace: 


Mercury is obedient 


C. Bhargava Sharma, 

హేమహస్తి

 నిన్న హిరణ్యరథదానం వరకు తెలుసుకొన్నాం, నేడు హేమహస్తి నుండి తెలుసుకొందాం.

-------------------


(9) హేమహస్తి మహదానం > హేమం అంటే బంగారం, హస్తి అనగా ఏనుగు. బంగారంతో ఏనుగుశిల్పాలను తయారుచేసి అర్హులైన పురోహిత, పండిత, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, చండాలురకు దానం చేయడమేనని నా అభిప్రాయం.


(10) హేమలాంగుల మహదానం > లాంగులి అంటే నాగలి, మడక. వ్యవసాయానికి ప్రధానమైంది నాగలే కదా! బంజరు భూములను అటవీభూములను ఉషరక్షేత్రాలు మొదలైన భూములను వినియోగంలోనికి తెచ్చి వ్యవసాయాభివృద్ధి చేయడం పాలకుని లక్షణం. అందుకే బంగారుతో నాగలి శిల్పాలు తయారుచేసి, ఏరువాకరోజున అర్హులైన కర్షకులకు దానం చేయడమే హేమలాంగుల దానమని నా ఊహ.


(11) పంచలాంగుల దానం > ఇది కూడా పైలాంటిదే, కాకపోతే స్వర్ణంతోపాటు వెండి, పంచలోహాలు, ఇనుము, కర్రలతో నాగళ్ళను తయారుచేసి మంత్రోక్తంగా పంచవర్ణాలకు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, చండాలర జాతులకు దానం చేయడం. ఈ దానం ముఖ్యవుద్దేశ్యమని నా భావన. 


(12) విశ్వచక్ర మహాదానం > చరిత్రలో క్రింది శ్లోకం విశ్వచక్ర మహదానం గురించి చెప్పబడింది.


"సమగ్రహారాన్ దదతోహాగ్రహార దానాం కియద్యస్య వదాన్యమౌలే: 

కింవా బహ్వచ్యఖిల విశ్వచక్ర బ్రహ్మండ దాతు: కి మదేయమస్తి: "


 ఇమ్మడి నృసింహదేవరాయలు ఈ శాసనం (1505 ACE)లో విశ్వచక్ర దానం గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. దానపద్ధతి,వివరాలు లేవు. బహుశా వైష్ణవ అగ్రహారీకులకో, శ్రోత్రియందారులకో భూములనో అగ్రహారాలనో దానం చేయడమని భావించాల్సి వస్తోంది.


(13) కల్పలతమహాదానం > బహుశా ఇది కూడా గతంలో చెప్పుకొన్న కల్పవృక్షంలాంటిదైవుండవచ్చును. కాకపోతే పూజాపద్ధతులు క్రతువులు వేరుగా వుండవచ్చును.


(14) సప్తసాగరమహాదానం > ఏడు నుండి వేయివరకు పలముల (తులములు అనుకొందాం ) బంగారు కుండలను చేయించి, వాటిలో ఒక్కోదానిలో లవణం (ఉప్పు), పాలు, నెయ్యి, బెల్లం, పెరుగు, పంచదార, పుణ్యనదులనుండి తెచ్చిన పవిత్రజలాలను పోసి, బంగారుతో చేయబడిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సూర్య, చంద్ర, లక్ష్మి, పార్వతి విగ్రహాలను వుంచి, కుండలను ఆభరణములతో నింపి సప్తమహసముద్రాలను ఆహ్వానించి, ఆ భాండాలను అర్హులైన పంచవర్ణాలకు దానం చేయడమే సప్తసాగర మహాదానం.


(15) రత్నధేనుమహదానం > బంగారుతో ఆవుదూడల బంగారు బొమ్మలను తయారుచేసి, ఆవు నోటిలో 81 పద్మరాగాలను, నాసికాగ్రము (ముక్కుపై) 100 పుష్పరాగాలను, నొసటిపై బంగారు తిలకం ధరింపచేసి, కండ్లలో 100 మౌక్తికాలను, రెండు కనుబొమలపై 100 విద్రుమములు,

రెండు చెవులకు రెండు పెద్ద మౌక్తికాలను చేర్చి, బంగారుకొమ్ములు బాగుగాచేసి, నూరువజ్రాలతో తలను అలంకరింపచేసి, మెడపై 100 వజ్రాలను, మూపుపై 100 నీలములు చేర్చి, 100 వైడూర్యములతో ప్రక్కలను అలంకరించాలి,


అదేవిధంగా ఆవుకు అలంకరించిన నవరత్నాలలోని సగభాగం వజ్రవైడూర్యాలతో దూడను అలంకరించి బ్రాహ్మణులకు, మిగిలిన చతుర్వర్ణాలకు దానంచేయడమే రత్నధేను మహాదానం.


(16) భూతఘట్టన మహదానం > ? తెలిసిన ప్రాజ్ఞులు తెలియచేస్తే సంతోషం.

(సేకరణ)

..................................................................................... జిబి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

ఆకాశయానానికి కేరాఫ్

 ఆకాశయానానికి కేరాఫ్ …. భారతీయ శాస్త్రాలే !!!


ప్రాచీన భారత దేశం సాధువులకు, జ్ఞానులకు, భక్తులకు, ఆధ్యాత్మిక తత్వవేత్తలకు మాత్రమే కాక, మేధావులకు, వైజ్ఞానిక శాస్త్రవేత్తలకు కూడా పుట్టినిల్లు. పాశ్చాత్య దేశాలు ఇంకా కళ్లు తెరవక ముందే మన మునులు అనేక విషయాలపై పరిశోధనలు చేసి, ఎన్నో ఆవిష్కరణలు చేశారు. అలనాడు విస్తృత పరిశోధనలు జరిగిన రంగాలలో వైమానిక శాస్త్రం ఒకటి. 


అగస్త్య మహా ముని, భరద్వాజ మహర్షి వంటి ఎందరో శాస్త్ర పారంగతులు వివిధ విమానాల గురించి తమ గ్రంధాలలో వివరించారు. 


అగస్త్యుడు రాసిన అగస్త్య సంహిత లో రెండు రకాల విమానాల గురించి తెలిపారు. మొదటి దానిని ఛత్రం 'అన్నారు. దీనిని పారాచూట్ లేదా బెలూన్ గా భావించవచ్చు. 


ఎందుకంటే, 'ఉదజని '(హైడ్రోజెన్) అనే రసాయనం తో అది ఎగురుతుందని ఆ రచన లో తెలిపారు. నీటిని విభజించి ఉదజనిని ఉత్పత్తి చేస్తారని కూడా రాశారు. ఆ విధంగా నీటిని విభజించే ప్రక్రియను వివరించారు. ఇక శత్రువులు దాడి చేసినప్పుడు, కోట నుంచి పారిపోవడానికి 'అగ్నియానం' అనే విమానాన్ని ఉపయోగించుకోవచ్చని వివరించారు. 


ఇక మహర్షి భరద్వాజుడు రాసిన 'యంత్ర సర్వస్వం'లో వైమానిక శాస్త్రం ఒక భాగం. దీనిని ఈ కాలపు ఏరోనాటిక్స్ తో పోల్చుకోవచ్చు. "శాస్త్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట మానవ జాతి భవిష్యత్తు కోసం, నేను వేదాల సారాన్ని గ్రహించి, వైమానిక శాస్త్రాన్ని 8 భాగాలలో, 100 విభాగాలలో, 500 సూత్రాలతో రచిస్తున్నాను. ఈ సూత్రాలు మానవాళి ఆకాశయానం చేసే అవకాశాన్ని, ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి" అని భరద్వాజ మహర్షి తన గ్రంధం 'యంత్ర సర్వస్వం'లో 'వైమానిక శాస్త్రం'అనే అధ్యాయంలో రాశారు. 


ఇది ఏం తెలియజేస్తుంది?? 


విమాన నిర్మాణం, దానిని గాల్లో, భూమి మీద, నీటి మీద, నీటి లోపల నడిపే ప్రక్రియలు ఈ గ్రంధ ముఖ్యాంశాలు. అభేద్యమైన (విరగని), అదహ్యమైన (కాలనివి), అచ్ఛేద్యమైన (ముక్కలు కాని) విమానాలు, యుద్ధ విమానాల గురించి కూడా ఈ గ్రంధంలో ప్రస్తావాలున్నాయి. 


సుందర, శుకన, రుక్మి, మొదలైన 25 రకాల విమానాల వివరాలు, 'శత్రు విమాన కంపన క్రియ ', శత్రు నాశన క్రియలు - అంటే శత్రు విమానాన్ని ఫోటో తీయడం, వాటిలో ఉన్న వారికి మూర్చ వచ్చేలా చేయడం. మన విమానాలను కనబడకుండా చేయడం వంటివి కొన్ని విద్యలు. 


ఇవే కాకుండా విమాన చోదకుడు (పైలట్) నేర్వవలసిన విషయాలను 32 రహస్యాలుగా వివరించారు. వారు వేసుకోవలసిన వస్త్రాలు, వారి భోజనం, వారు నేర్చుకోవలసిన విద్యలు వివరించారు. 


వైమానిక శాస్త్రం లో భరద్వాజ మహర్షి కొన్ని గ్రంధాలను ఊటంకించారు. అవి విమాన చంద్రిక (రచన - నారాయన ముని), వ్యోమయాన మంత్ర (రచన - శౌనక ముని), యంత్ర కల్ప (రచన - వాచస్పతి), రహస్య లహరి ( రచన - ఆచార్య లల్లా), కేతాయన ప్రదీపిక ( రచన - చక్రాయణి). 


సైన్స్...విజ్ఞానం ఏ అమెరికాలోనో, ఐరోపాలోనో పుట్టిందనుకుంటే పొరపాటు. మన మునులు ఎన్నో పరిశోధనలు చేసారు. వాటితో ఎన్నో గ్రంధాలు రచించారు. అయితే, వాటిని ప్రాచుర్యంలో కి తీసుకురావాలని వారు ఎప్పుడు భావించలేదు. 


ఎన్ని విద్యలు నేర్చినా... జీవిత లక్ష్యం మోక్షమనే సూత్రాన్ని దృఢంగా నమ్మేవారు భారతీయులు. 


అందుకనే, ఎన్ని ఆవిష్కరణలు జరిగినా విజ్ఞాన పరంగా ఎంత అభివృద్ధి జరిగినా వాటికి ప్రాముఖ్యత లభించలేదు. గ్రంధస్తం అయిన ఆవిష్కరణల్ని దురాక్రమణదారులు కొల్లగొట్టి ధ్వంసం చేసారు.


- - - సేకరణ

సంస్కృత మహాభాగవతం

 *7.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.17 (పదిహేడవ శ్లోకము)*


*తత్తస్థుషశ్చ జగతశ్చ భవానధీశో యన్మాయయోత్థగుణవిక్రియయోపనీతాన్|*


*అర్థాంజుషన్నపి హృషీకపతే న లిప్తో యేఽన్యే స్వతః పరిహృతాదపి బిభ్యతి స్మ॥12392॥*


హృషీకేశా! స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తునకు నీవు అధీశుడవు. మాయయొక్క గుణముల సంక్షోభము వలన ఈ జగత్తు ఉత్పన్నమైనది. నీవు ఇంద్రియములకు స్వామివి. జీవాత్మగా నీవు ఆ ఇంద్రియార్థములను అనుభవించుచున్నను వాటిచే లిప్తుడవుగావు (ఆ ఫలితములు నిన్ను అంటవు). కానీ, స్వయముగా ఆ భోగములను (ఇంద్రియ సుఖములను) త్యజించిన యోగులుగూడ విషయములకు సంబంధించిన పూర్వసంస్కారములకు భయపడుచుందురు.


*6.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*స్మాయావలోకలవదర్శితభావహారిభ్రూమండలప్రహితసౌరతమంత్రశౌండైః|*


*పత్న్యస్తు షోడశసహస్రమనంగబాణైర్యస్యేంద్రియం విమథితుం కరణైర్న విభ్వ్యః॥12393॥*


ప్రభూ! నీ పదునారువేలమంది పత్నులు చిరునవ్వులొలికించుచు, తమ కటాక్షవీక్షణములచే మనోహరములైన హావభావములతోను, సురతాలాపములతోను తమ కామబాణములను నీపై ఎంతగా ప్రయోగించినను అవి నీ ఇంద్రియములను మథించుటద్వారా వశపరచుకొనటకు ఏమాత్రమూ సమర్థములు కావు.


*6.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*విభ్వ్యస్తవామృతకథోదవహాస్త్రిలోక్యాః పాదావనేజసరితః శమలాని హంతుమ్|*॥


*ఆనుశ్రవం శ్రుతిభిరంఘ్రిజమంగసంగైస్తీర్థద్వయం శుచిషదస్త ఉపస్పృశంతి॥12394॥*


నీ వలన ప్రభవించిన రెండు పవిత్రనదులు ముల్లోకములయందలి పాపములను అన్నింటిని పూర్తిగా ప్రక్షాళనమొనర్చుటకు సమర్థములు. వాటిలో ఒకటి నీ కథామృతమనెడి నది. దానిని నిరంతరము చెవులార గ్రోలెడివారి హృదయములు పునీతములగును. రెండవది నీ పాదములనుండి ప్రభవించిన గంగానది. అందు స్నానమొనర్చిన వారు పవిత్రులగుదురు. పవిత్రములైన ఈ రెండు నదులను పుణ్యాత్ములైన సజ్జనులు ఎల్లప్పుడును సేవించుచు ఇహపరలాభములను పొందుచుందురు" అనుచు దేవతలు పరమాత్ముని స్తుతించిరి.


*బాదరాయణిరువాచ*


*6.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఇత్యభిష్టూయ విబుధైః సేశః శతధృతిర్హరిమ్|*


*అభ్యభాషత గోవిందం ప్రణమ్యాంబరమాశ్రితః॥12395॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షిన్మహారాజా! పరమశివుదు, బ్రహ్మదేవుడు, తదితర దేవతలు శ్రీహరిని ఇట్లు స్తుతించిన పిమ్మట వారు ఆ స్వామికి ప్రణమిల్లి ఆకాశమున నిలిచిరి. అంతట బ్రహ్మ శ్రీకృష్ణునకు ఇట్లు విన్నవించెను.


*బ్రహ్మోవాచ*


*6.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*భూమేర్భారావతారాయ పురా విజ్ఞాపితః ప్రభో|*


*త్వమస్మాభిరశేషాత్మంస్తత్తథైవోపపాదితమ్॥12396॥*


*బ్రహ్మదేవుడు పలికెను* "సర్వాంతర్యామివైన ఓ ప్రభూ! భూభారమును తొలగించుటకై ఈ లోకమున అవతరింపుమని ఇదివరలో మేము నీకు విన్నవించి యుంటిమి. నీవు మా ప్రార్థనను మన్నించి, యథోచితముగా మా అభ్యర్థనను పూర్తిచేసితివి.


*6.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*ధర్మశ్చ స్థాపితః సత్సు సత్యసంధేషు వై త్వయా|*


*కీర్తిశ్చ దిక్షు విక్షిప్తా సర్వలోకమలాపహా॥12397॥*


సత్యసంధులైన సత్పురుషుల పరిరక్షణమునకై నీవు ధర్మస్థాపన మొనర్చుటవలన నీ కీర్తి దిగంతములవరకును వ్యాపించినది. నీ దివ్యలీలలను కీర్తించుటవలనను, వినుటవలనను జనుల మనోమాలిన్యములు పూర్తిగా క్షాళితములైపోవును.


*6.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*అవతీర్య యదోర్వంశే బిభ్రద్రూపమనుత్తమమ్|*


*కర్మాణ్యుద్దామవృత్తాని హితాయ జగతోఽకృథాః॥12398॥*


*6.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*యాని తే చరితానీశ మనుష్యాః సాధవః కలౌ|*


*శృణ్వంతః కీర్తయంతశ్చ తరిష్యంత్యంజసా తమః॥12399॥*


మహాత్మా! నీవు సర్వోత్తమమైన దివ్యరూపముతో యదువంశమున అవతరించితివి. లోకకల్యాణమునకై అద్భుతములైన ఘనకార్యములను ఆచరించితివి. సర్వేశ్వరా! కలియుగమునందలి జనులు నీ దివ్యలీలామృతమును తనివిదీర గ్రోలుదురు. వాటిని పారవశ్యముతో కీర్తింతురు. వారు అజ్ఞానాంధకారమునుండి బయటపడి తరింతురు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*409వ నామ మంత్రము* 7.9.2021


*ఓం శివప్రియాయై నమః*


శివునికి ప్రియమును చేకూర్చునటువంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివప్రియా* యను నాలుగక్షరముల నామ మంత్రమును *ఓం శివప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి చక్కని ప్రియకరమైన భాషణము కలవారిగను, ప్రియవచనములతో అందరి మనసులను ఆకట్టుకొనువారిగను ప్రవర్తింపజేసి కీర్తిప్రతిష్టలతోబాటు సిరిసంపదలు, జ్ఞానసంపన్నత సంప్రాప్తమగునట్లు అనుగ్రహించును.


పరమేశ్వరి పార్వతిగా కఠోరమైన తపమునొనరించి, పరమేశ్వరునికి ప్రియము కలిగించి పరిణయమాడినది. పరమేశ్వరుడే మహా అందగాడైతే, తానేమీ తీసిపోనట్లు త్రిభువనసుందరియై శివుని తన ప్రియుడుగా పొందినది. ఆయన మనసుకొల్లగొట్టి, పరమేశ్వరుని వామభాగం తనదిగా చేసుకొన్నది. కామేశ్వరుని ఓరగంటచూచుచు, మందహాసచంద్రికలను ఆయనపై రువ్వుచూ, ప్రియవచనములు పలుకుచూ మెల్లగా ఆయన వామాంకమునధిష్ఠించినది. ఆయన మంగళకరుడు అయితే, ఈమె సర్వమంగళ. ఎవరికి ఎవరూ తీసిపోనంత భక్తపరాధీనులు. శివుడు తన ప్రియుడే కాదు. తన ఉపాసకుడై, శ్రీవిద్యోపాసకు డనిపించుకున్నాడు. లోక కల్యాణమునకై క్షీరసాగర మథనమప్పుడు వెలువడిన పరమభయంకరమైన హాలాహలాన్ని గ్రోలించి, శివుడు తన ప్రియుడనియు, తన మాట జవదాటడనియు అనిపించుకొనినది. 


శ్రీచక్రంలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్నముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచించడమే గాక శ్రీచక్రము శివశక్త్యైక్యమును మాత్రమేగాక, శివుడే పార్వతి, పార్వతియే శివుడు వారిరువురు ఆదిదంపతులు అన్న మాట ఆర్యోక్తి అయినది. కాబట్టి జగన్మాత శివప్రియా యని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం శివప్రియాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*992వ నామ మంత్రము* 7.9.2021


*ఓం అవ్యాజ కరుణా మూర్త్యై నమః*


కారణం, ఫలాపేక్షలేని, నిర్హేతుకమైన కరుణాస్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అవ్యాజ కరుణా మూర్తిః* అను ఆరక్షరముల నామ మంత్రమును *ఓం అవ్యాజ కరుణా మూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులపై ఆ తల్లి ఎనలేని కరుణచూపి, ఆపదలను కలుగకుండా రక్షించుచూ, అభీష్టసిద్ధిని అనుగ్రహించును.


జగన్మాత పరబ్రహ్మస్వరూపిణి. ఆ తల్లి కోరికలకు అతీతంగా ఉండే పరమాత్మ ( *నిష్కామా* - 142వ నామ మంత్రము). ఆమెకు ఏమియు అక్కరలేదు. ఆ తల్లికి భక్తులు ఇవ్వగలిగినది ఏమియు ఉండదు కేవలం నామస్మరణ తప్ప. కాని ఎనలేని కరుణా స్వరూపురాలు. నిర్హేతుకమైన కరుణాస్వరూపురాలు. తన భక్తులయెడ ఆ తల్లి చూపే కరుణకు కారణాలు ఉండవు. ప్రతిఫలాపేక్ష అసలే ఉండదు. అనంతకోటి జీవులపైనా భేదభావములేని కరుణ. ఆ కరుణ అవ్యాజమైనది. అనంతమైనది. క్రూరమృగములపైన, విషపూరితమైన కాలనాగులపైన, సాధువర్తనులపైనా కూడా ఒకే విధమైన కరుణ కలిగి ఉంటుంది గనుకనే *అవ్యాజకరుణామూర్తిః* అని అనబడినది.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం అవ్యాజ కరుణా మూర్త్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

యుధిష్ఠిరుడు

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏


ధర్మరాజుకి ‘యుధిష్ఠిరుడు’ అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పోరాడేవాడు అని అర్థం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం రుజువు చేయడం కష్టం. మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్థకమవుతుంది?


యుద్ధం అంటే శత్రువులతో చేసేది మాత్రమే కాదు. ఆయుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపోయినా, ఏ ఆయుధం దొరకకపోయినా మనల్ని మనం జయించడం కోసం చేసే నిత్య జీవన సంగ్రామమే నిజమైన యుద్ధం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్ఠిరుడయ్యాడు.

భోజన ప్రియులకు మాత్రమే!

 భోజన ప్రియులకు మాత్రమే!

సాంబారులో చందమామలు

తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు. మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది. అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 


‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, 

పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ 

ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!.


..’ వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. 

భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు. ‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క 

‘చల్లా న౦బలి త్రావితిన్‌ రుచులు దోసంబంచు పోనాడితిన్‌ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్‌’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే! 


కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. ‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.


మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్‌’ అనేది వీరి అభిప్రాయం.


 ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్‌) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది! తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు. ‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు. ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు. ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు. దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్‌’ అని వర్ణించారు. విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ. వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.


వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది. ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్‌’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్‌’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు. దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్‌ జనరల్‌ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్‌’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం! (తెలుగు వెలుగు మాసపత్రిక సౌజన్యముతో)

                         ---------------------- శుభరాత్రి -------------------------

పరిమితులు (LIITATIONS)

పరిధి లేక అవధులు, హద్దులు  ఇవ్వన్నీ దాదాపు పర్యాయ పదాలు. మనకు ఈ జగత్తులో ( జగత్తు అంటే ఈ ప్రపంచమే కాదు మీరు చూసేది ప్రతిదీ అంటే సూర్య చంద్రాదులు, నక్షత్రాలు కూడా)  కనపడే ప్రతి వస్తువుకు (ఇక్కడ వస్తువు అనే  పదానికి కేవలము జీవము లేనిది అని మాత్రమే అర్ధం కాదు కనపడే ప్రతిదీ అని అర్ధం చేసుకోవాలి) కొన్ని పరిమితులు కలిగి వాటికి లోబడి  ఉంటాయి. వీటిని మన జ్ఞ్యనులు మూడు విధాలుగా వివరించారు. అవి 

1) వస్తురీత్యా పరిమితి 

2) దేశరీత్యా పరిమితి 

3) కాలరీత్యా పరిమితి. 

ఇప్పుడు వాటిగూర్చి వివరంగా తెలుసుకుందాము. 

ఈ పరిమితులు అన్ని తెలిపేది ఏమిటంటే ప్రతిదీ ఒక నిర్దుష్టత కలిగి ఉంటుందని, దానికి మించి కానీ తక్కువగా ఉండదని అర్ధం.  ఉదాహరణకు మీరు ఒక వస్తువును తీసుకోండి అది ఏదైనా కావచ్చు కానీ ఆ వస్తువు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది.  అందుకే దానికి మనం ఒక నిర్దుష్టమైన పేరుతొ పిలుస్తాము.  ఉదాహరణకు ఒక ఆవు ఉందనుకోండి దానికి వున్న రూపాన్ని బట్టి మనం ఆవు అని పిలుస్తున్నాము.  కొన్ని ఆవులలో ఒక ఆవును కూడా గుర్తుపట్టగలము.  దానికి కారణం మనం ఆ ప్రత్యేక ఆవుకు కొన్ని లక్షణాలను గుర్తించాము కాబట్టి.  ఈ ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు వున్నారు.  ఐనా మనం ప్రతి వక్కరిని వారి వారి పేర్లతో గుర్తిస్తున్నాము.  అంటే మీకు రామారావు తెలుసు అనుకోండి నేను నిన్న రామారావుని చూసాను అన్నాను అనుకోండి అప్పుడు మీరు వెంటనే గుర్తించగలుగుతారు.  దానికి కారణం నేను చెప్పే రామారావు మీకు తెలిసిన రామారావు ఒక్కరే కావటంవల్ల . ఇప్పుడు మనం ఒక విషయాన్నీ గమనిద్దాము.  రామారావు కృష్ణారావు కాదు ఎందుకంటె రామారావుకి కృష్ణారావుకి పేర్లే కాదు వారి రూపురేఖలు, గుణగణాలు కూడా తేడాగా వున్నాయి.  అంటే మనం ఈ  జగత్తలో చూసే వస్తువు ప్రతిదీ దాని నిర్దుష్టకత చాటుకుంటున్నది.  అంటే ఈ జగత్తులో కనిపించే ప్రతి వస్తువు ఒక పరిధి అంటే పరిమితంగా వున్నది అని అర్ధం. ఇటువంటి పరిమితిని ఆధ్యాత్మికతగా వస్తుపరిధి అని అంటారు. దీనిఅర్ధం ప్రతిదీ వస్తురీత్యా పరిమితిగా వున్నదని. 

ఇక రెండవ విషయం దేశం ఇక్కడ దేశం అంటే ఒక ప్రదేశం అని అర్ధం. నేను రామారావుని చూసాను అన్నననుకోండి వెంటనే నీవు ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు అని అడుగుతావు.  ఈ రెండు రాసులు కూడా పరిమితంగానే వున్నాయి.  రామాలయం అరుగు వద్ద చూసాను అంటే రామారావు రామాలయం అరుగు మీద కూర్చొని వున్నప్పుడు.  ఈ విషయం ఒక దేశాన్ని అంటే ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని సూచిస్తున్నది.  అంతేకాదు ఆ నిర్దుష్ట ప్రదేశం కూడా ఒక పరిమితికి లోబడి వుంది.  అంటే నేను చెప్పిన రామాలయపు అరుగు మానవురిలోది అని నీకు అర్ధం అవుతుంది.  అంతే కానీ మారేక్కోడో వున్న రామాలయం కాదు. వేరే ఊరులో వున్నరామాలయం అంటే అప్పుడు నేను ఆ ఊరుపేరు కూడా చెప్పాల్సివస్తుంది.  ఇలాగా ఒక ప్రదేశపరంగా వున్న పరిధిని దేశరీత్యా వున్నపరిది అంటారు. 

ఇక మూడవ విషయం చూద్దాము దీనిని కాల రీత్యా వున్నపరిది అంటారు.  నేను రామారావుని చూసాను అన్నప్పుడు నీవు అడిగిన మూడవ ప్రశ్న  ఎప్పుడు చూసావు అని.  అంటే నిన్న సాయంత్రం నాలుగు గంటల సమయంలో అన్నాను అనుకోండి . ఇప్పుడు రామారావు (వస్తువు) రామాలయం అరుగు (దేశం అంటే ప్రదేశం) నాలుగు గంటలు (సమయం లేక కాలము )  అని మనకు తెలుస్తున్నాయి. ఈ మూడు విషయాలకు లోబడే మనకు ఈ జగత్తు పూర్తిగా కనబడుతున్నది. 1) కనబడే ప్రతి వస్తువు ఒక పరిమిత ప్రదేశాన్ని ఆక్రమిస్తూ ఈ ప్రపంచంలో వున్నది 2) ఒక నిర్దుష్ట ప్రదేశంలో వున్నది 3) ఒక నిర్దుష్ట కాలంలో వున్నది. ఈ విషయాలు కనబడే ప్రతి దానికి మనం ఆపాదించవచ్చు.  మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఈ మూడు రాసులు కూడా ఒక పరిమితిని సూచిస్తున్నాయి. 

ఈ మూడు పరిమితుయ్లకు లోబడినవి మాత్రమే మనకు ఈ జగత్తులో గోచరిస్తున్నాయి. ఇందులో మొదటి పరిమితి వస్తుపరిమితి ఇది ఒక వస్తువుని  తెలుపుతున్నది. కానీ నిజానికి ఆ వస్తువు గతంలో లేదు అది ఒక కాలంలో ఈ జగత్తులోకి వచ్చింది అది వచ్చిన నాటినుండి భవిష్యత్తులో (కాలంలో) దూరం ప్రయాణించి ఒకచోట నశిస్తుంది. అది నశించినతరువాట్ దాని ఉనికి ఈ ప్రపంచానికి తెలియకుండా పోతుంది. ఇక్కడ ఒక సూత్రాన్ని  ప్రతిపాదించవచ్చు అదేమిటంటే కాలంలో పుట్టింది కాలంలోనే నశిస్తుంది. క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ చరాచర సృష్టిలో కనిపించే ప్రతి వస్తువుకు మూలం ఈ  ప్రపంచం. అంటే పంచభూతాలు. పుట్టుక పూర్తిగా పంచభూతాలతో వుంది నశించింతరువాత పంచభూతాలలో విలీనం అవుతున్నాయి. 

నేను అనుకునే నా దేహంకూడా పంచభూతాలతో నిర్మించినదే కాబట్టి ఇది ఒకరోజు పంచభూతాలలో విలీనం  కావలసిందే. కానీ మనం మనకున్న అజ్ఞానం వాళ్ళ ఇది నేను (శరీరం) ఇది నా ఇల్లు, ఇది నాకారు అని పలుతెరుగుల  ఈ ప్రపంచంతో బంధాలు పెట్టుకుంటున్నాము.  వాటితో సంతోషాలను, ఆనందాలను పొందాలనుకుంటున్నాము. పొందుతున్నాము. ఒక సత్యాన్ని మాత్రం మారుస్తున్నాము అదేమంటే ఈ రోజు మనకు సుఖాన్ని ఇచ్చేదే రేపు దుక్కన్నికూడా ఇస్తుందన్నది. 

భగవంతుని విషయంలో ఈ పరిమితులు లేవు అని మన మహర్షులు ప్రవచిస్తున్నారు.  మీరు వేదాంత గ్రంధాలైన  ఏ ఉపనిషత్ తీసుకొని చదివిన మనకు చివరకు తెలిసేది ఒక్కటే, అదేమంటే భగవంతుడు 1) నిరాకారుడు 2) నిర్గుణుడు 3) నిత్యుడు (శాస్వితుడు) ఈ మూడు లక్షణాలు బౌతికంగా మనకు కనపడే వస్తువులకు భిన్నంగా తోస్తున్నాయి. అది ఎట్లాగో పరిశీలిద్దాం. 

1) నిరాకారుడు: భగవంతుడిని మనం నిరాకారుడు అని అంటున్నాము.  అంటే భగవంతునికి ఆకరం  లేదు కాబట్టి వస్తూ రీత్యా పరిమితికి లోబడి లేదు. ఎప్పుడైతే వాస్తురీత్యా పరిమితికి లోబడి లేడో అప్పుడు దేశరీత్యా కూడా పరిమితికి లోబడి వుండడు ఎందుకంటె వస్తువు లేనప్పుడు ఆ వస్తువు ఏ దేశంలో (ప్రదేశంలో) ఉందని మనం అనగలం. అందుకే భగవంతుడు దేసరిత్యా పరిమితికి లోబడి లేదు. ఇక మనం తీసుకున్న 3వ పరిమితి కాల రీత్యా పరిమితి. భగవంతుని మనం నిత్యుడు, శాస్వితుడు అని కదా అంటున్నాము.  అంటే ఎల్లప్పుడూ వుండే వాడు అని అర్ధం. ఇంకా వివరిస్తే భగవంతుడు భూతకాలంలో వున్నాడు, వర్తమానంలో వున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు.  అంటే సర్వకాలాలలో కూడా ఉంటాడు. 

ఈ సత్యాన్ని మన మహర్షులు వేల సంవస్త్సరాలకు పూర్వమే ఆవిస్కహరించి ఆ శాస్వితుని చేరే మార్గాలు మనకు ఉపనిషత్తుల ద్వారా మనకు తెలియచేసారు. 

ముకుక్షువులారా ప్రపంచంలో ఎక్కడా లేని నిఘాడ జ్ఞానం మనకు మన మహర్షులు  అందించారు. మనం వారి అడుగుజాడలలో నడుద్దాము మోక్ష కాములుగా మారుదాము మోక్షాన్ని పొందుదాము. 

ఓం తత్సత్ 

శాంతి శాంతి శాంతిః 

బుధజన విధేయుడు 

సి. భార్గవ శర్మ,