26, జూన్ 2021, శనివారం

ఆయుర్వేదం - రస ఔషదాలు .

 ఆయుర్వేదం -  రస ఔషదాలు .


 ఇంతకు ముందు నేను ఆయుర్వేదం లొ శల్య తంత్రం గురించి తెలియచేసాను. ఇప్పుడు ఆయుర్వేదం లొ రస ఔషధాల గురించి తెలియజేస్తున్నాను. 


 మూలికలతో చేసినటువంటి ఔషధాలు వెంటనే ఉపయోగించవలెను. వాటికి ఒక నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. కానీ కొన్ని రకాల లోహములు ను శుద్ధి చేసి ఉపయోగించవచ్చు. అవి ఎప్పుడు ఉపయోగించినా సమర్దవంతం గా పనిచేస్తాయి. మానవుని శరీరం అష్టదాతువులతో నిర్మితమై ఉంటుంది. ఈ దాతువులు లలొ హెచ్చు తగ్గుల వలన మానవునికి రోగాలు ప్రాప్తిస్తున్నాయి. మరలా వాటిని పూరించడం వలన రోగాలు తగ్గు ముఖం పడతాయి. నేటి అల్లోపతి వైద్య విదానం అదే వాటిని ప్రాకృతికం గా తయారు చేయరు . 


ఉదాహరణకు పాండు రొగమునకు ఒక అత్యద్బుతమైన ఔషధం ఉన్నది. పాండు రోగం అనగా శరీరం నందలి రక్తము లేకుండా పాలిపోయినట్టు ఉండుట .ఈ వ్యాధి గ్రస్తులు తెల్లగా మొఖము నందు జీవకళ లేకుండా ఉంటారు.  ఏ గ్రామ భూమియందు 100 ఏళ్ళ నుండి ఉన్నట్టి చిట్టేపు రాళ్లను తీసుకుని వచ్చి వాటిని ఎర్రటి నిప్పుల్లో బాగుగా కాల్చి ఆవుపంచకం లొ ముంచి చల్లార్చాలి . ఈ రకం గా 12 సార్లు చేయాలి . ఇలా చేసిన తరువాత చూర్ణం చేయగా అది సిందూరం రంగులొ వస్తుంది. దానిని ఉదయం సాయంత్రం పుచ్చుకోనిన కేవలం 41 రొజులలొ మనిషి ఎర్రగా తయారవుతాడు. పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. ఇలా చాలా ఉన్నాయి .


       భావ ప్రకాశిక మొదలయిన ఆయుర్వేద గ్రంథాలలో ఈ రసాయనిక తంత్రాల గురించి ఉన్నది. 3,4 శతాబ్దాల నుంచి వాగ్బట్టాచార్యుని కాలం వరకు ఈ రసయనిక ఔషధాలు చికిత్సకు  ఉపయోగించి నట్టు అంతగా లేదు . క్రీ.శ  4 వ శతాబ్దం లొ సంకలనం చేయబడ్డట్టు చెబుతున్న Bowers manicript అంతకు పూర్వం రచించబడిన D .r hernal గారిచే సంపాదించ బడిన వ్రాతపతి గా ఉన్న వైద్య గ్రందం నందు కుడా స్వర్ణ , లొహ ధాతువుల ప్రస్తావన ఉన్నది. కానీ విశేషం గా ఎక్కడా ఉపయోగించినట్టు లేదు .వైదిక కాలం న సోమరస ఉపయోగం అదిక ప్రచారం లొ ఉన్నందున రసవిజ్ఞానం ఋగ్వేద కాలం నుండి ఆదరణ, ప్రచారం లొ ఉనట్టు భావించుచున్నారు. దానిని అనుసరించే చరకాదులు తమ గ్రంధములయందు రసౌషదాలకు స్థానం ఇచ్చారు. భారతీయుల రసప్రక్రియలకు మూలం ప్రాచీనం అని తెలియచున్నది. 


      ఋగ్వేదం న స్వర్ణం, ఇనుము, సీసము, ఇత్తడి, శ్యామ లొహం. ఇలాంటి లోహాల ప్రసక్తి కలదు. రసశాస్త్ర ప్రక్రియ కొన్ని తాంత్రి కముల యందు ప్రాధమిక స్థాయిలో వర్ణించ బడెను. రసాయనిక తాంత్రికం లొ సిద్ధ నాగార్జునుడు ప్రసిద్ధుడు .


 రస తంత్రములో ఉపయోగించబడు ద్రవ్యములను పలువురు తంత్ర కర్తలు పలు విధాలుగా వర్గీకరించారు. అందులొ రత్న సముచ్చయకారుని వర్గీకరణ సామరస్యం గా ఉన్నది. అతడు మహారసములు, ఉపరసములు, సాధారణ రసములు, దాతువులు, ఉపదాతువులు ఇలా వర్గీకరణం చేసారు. 


 మహా రసములు - అబ్రకం, వైక్రాంతం, స్వర్ణ మాక్షిక, తామ్ర మాక్షిక , సస్యకము తుత్తుము , చపలము, రసకము , అని ఎనిమిది మహారసములు గా పేర్కొనబడినవి.


 ఉప రసములు - గంధకం, గైరికము, కాశీసము, స్పటికము, తాలకము , మనశ్హిల , అంజనము, కంకు ఉస్టం అనే ఎనిమిది ఉపరసములగా పేర్కొనబడినవి .


 సాదారణ రసములు - కంపిల్లము, గౌరీ పాషాణము, నవసాగారము, కపర్ధం, అగ్ని జారం, గైరికం, హింగులం, మ్రుద్దారు శృంగి, ఈ ఎనిమిది సాదారణ రసములగా పేర్కొనబడినవి .


  పూర్వాచార్యులు పాదరసం నోక్కదానినే మహారసం గా గ్రహించి తక్కిన వాటిని ఉపరసములుగా పరిగణించారు. రస ఔషద శాస్త్ర ప్రకారం రెండు రకాలు అగు ద్రవ్యాలు కలవు.మొదటి రకం పాదరసం, గంధకం, శంఖ పాషానాది రసొపరసములు. సాదారణ రసములు.రెండొవది సువర్ణం, రజతం, తామ్రము, వంగము, సీసము లోహాది దాతువులు.సుశ్రుతమున వంగం, సీసం , తామ్రము ,రజతము, స్వర్ణం , అయస్కాంతం , మండురం, వైడుర్యం , స్పటికం, ముత్యం , శంఖం ఇవి ఔషద ద్రవ్యాలుగా పేర్కొన్నారు . చరక సంహిత ఎందు రక్తపిత్త వ్యాధి చికిత్సకు , నేత్ర రోగ చికిత్సకు వైడుర్యం, ముత్యములు , మణులు, ప్రవాళం, శంఖం, లోహము, తామ్రము , సౌవీరంజనము ఔషధాలుగా చెప్పినాడు. కుష్టు రొగమునకు పాదరస గంధకములు ఔషదములు గా పేర్కొనెను .ఈ వ్యాధులకు అయస్కాంతం ఉపయోగించడం కూడా సుశ్రుత సంహితలో ఉన్నది.


          సువర్నాధి దాతువులను పలచని రేకులగా చేసి సైంధవ లవనములను ఆ రేకులకు పూసి వానిని కాల్చి నిర్దేశించిన కషాయములలో ముంచి అందునుంచి మెత్తని చుర్ణమును గ్రహించు విదానం వివరించబడెను. ఇట్టి సుక్ష్మ చూర్ణం తయారికి 16 పర్యాయాలు ఆ రేకులను అగ్నిలో కాల్చి ముంచవలసి ఉన్నది. ఈ లొహ రేకులను చండ్రనిప్పుల బొగ్గుల మద్య నుంచి కాల్చి చల్లబడిన తరువాత మెత్తని చుర్ణమును తేనెతో సేవించవలసి ఉన్నది.అని తెలియచేయడం అయినది. అష్టాంగ హృదయం నందు నేత్ర రోగములనుకు పాదరసం తో చేసిన అంజనం ఉపయోగించెడి విదానం తెలియజేసెను.


  

  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:

 భారతకథ మనందరికీ తెలుసు.

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:


1. సర్పయాగం చేసినవాడు?- జనమే జయుడు 


2. అభిమన్యుని కొడుకు? - పరీక్షిత్తు 


3. సూర్యుని రథసారథి? - అనూరుడు (తొడలు లేనివాడు ఉరువు = తొడ)


4. గరుత్మంతుని తండ్రి? - కశ్యప ప్రజా పతి 


5. వ్యాసుని తల్లిదండ్రులు? - మత్స్య గంది ( సత్యవతి), పరాశరుడు  


6. శుక్రాచార్యుని అల్లుడు? - యయాతి 


7. దుష్యంతుని తల్లిదండ్రులు? -  రత్న తార లిన 


8. భరతుని మరోపేరు? - సర్వ దమనుడు 


9. భీష్ముని మరోపేరు? - గాంగేయుడు (దేవా వ్రతుడు) 


10. పాండురాజు నాన్నమ్మ? - మత్స్య గాంధి  ( సత్య వతి) 


11. గాంధారి తండ్రి పేరు? - సుబలుడు 


12. కుంతీదేవి అన్నయ్య? - వసుదేవుడు 


13. వసుసేనుడు ఎవరు? - కర్ణుడు 


14. ద్రోణాచార్యుని గురువులు? - అగ్ని వేశాడు 


15. ఏకలవ్యుని తండ్రి పేరు? - హిరణధను 


16. కమలపాలిక ఎవరు? - హిడింబ 


17. యాజ్ఞసేని సోదరుడు? - దుష్ట ద్యుమయుడు 


18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు? - ప్రతి వింద్యుడు 


19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి? - సర్పరాజు కౌరవ్యుడు 


20. అశ్వత్థామ తల్లి పేరు?​ - కృపి 


 ప్రయత్నించి చూద్దాం. ఎంతవరకు సమాధానాలు రాబట్టగలమో

బలము

 🪔 *卐ॐ _సుభాషితమ్_ ॐ卐* 💎


శ్లో|| పక్షిణాం బల మాకాశం, 

మత్స్యానా ముదకం బలమ్, 

దుర్బలస్య బలం రాజా,

బాలానాం రోదనమ్ బలమ్, 

బ్రాహ్మణస్య సంధ్యావందనం బలమైశ్వర్యమ్ .


తా|| పక్షులకు ఆకాశమే బలము. చేపలకు ఉదకమే బలము. బడుగువర్గం వారికి రాజే బలము. పసిపాపలకు ఏడుపే బలము. బ్రాహ్మణునికి సంధ్యావందనము బలము మరియు ఐశ్వర్యము.


*_సేకరణ: బ్ర.శ్రీ. అడుసుమల్లి ప్రభాకరశర్మ_*

*_అడ్మిన్  - సంస్కృతసుధాసింధువు_*

సమాచార హక్కు చట్టం

 *సమాచార హక్కు చట్టంపై  సామాన్య ప్రజలలో మదలైయ్యే సందేశాలకు జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది బి. ఎస్.కృష్ణారెడ్డిగారి సమాధానాలు*


*1.సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి ?*

◆సమాచార హక్కు చట్టం 2005 లో వచ్చింది. కేంద్ర , రాష్ట్ర పభుత్వాల పాలనకు ఒక పార దర్శకత, జవాబుదారీ తనం తీసుకురావడానికి ఇది ఉద్దేశించినది. రెండు ప్రభుత్వాల పని తీరుకి సబంధించిన సమాచారం దేశ ప్రజలందరికి అందుబాటులో వుంచడానికి ఇది కృషి చేస్తుంది.


*2. పబ్లిక్ ఆధారిటీలు అంటే ఎవరు?*

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాసనాల ద్వారా గాని , రాజ్యాంగంలో చేసిన ఏర్పాటు వల్ల గాని, స్వంతంగా పాలనా నిర్వహణ ఏర్పాటు చేసుకునే సంస్థలు పబ్లిక్ అధారిటి అంటారు. ప్రభుత్వ ఆర్ధిక సహాయంతో నడిచే సంస్థలు, ప్రభుత్వ అధికారం కింద పనిచేస్తున్న సంస్థలు, ప్రభుత్వ స్వంత సంస్థలు  ఇవి కూడా పబ్లిక్ అధారిటి కిందకు  ఆర్ధిక సహాయం వల్ల నడిచే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ కోవలోకే వస్తాయి.


3.కోరిన సమాచారాన్ని ఎవరు అందిస్తారు?

◆సమాచార ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ సమాచార అధికారి ప్రతి పబ్లిక్ సంస్థలోను నియమించబడతారు. వారు తప్పనిసరిగా ప్రజలు కోరిన సమాచారం ఇవ్వాలి. ఆర్.టి.ఐ. దరఖాస్తులు కూడా వీరిని అడ్రస్ చేసి పంపాలి.సబ్ డివిజినల్ స్థాయిలో అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు వుంటారు. వీరు తమకు చేరిన దరఖాస్తులను , అప్పీల్స్ ను పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరుకు పంపుతారు.


*4.సమాచార కమిషనుకు రాసే దరఖాస్తు, పబ్లిక్ అథారిటికి మీరు రాసే దాని కంటే ఏ విధంగా ప్రత్యేకమైనది ?*

◆సమాచార హక్కు చట్టం ప్రకారం ఇతర దరఖాస్తుల మాదిరి కాకుండా ఇక్కడికి సమాచారాన్ని కోరుతూ వచ్చిన దరఖాస్తులకు, అప్పీళ్ళకు తప్పనిసరిగా స్పందించి,పరిమిత సమయంలో అందించాల్సి వుంటుంది. అలా జరగని పక్షంలో ఆ అధికారిపై చట్ట ప్రకారం శిక్ష విధించ వచ్చు. అంతే కాదు, అతనిపై క్రమశిక్షణా చర్య తీసుకోవచ్చు. ఆర్.టి.ఐ. నుపయోగించి, పొందగల సమాచారం పరిధి ఎంతో విశాలమైంది. ఈ చట్టం ప్రకారం, పార్లమెంటుకు కానీ, రాష్ట్ర శాసన సభకు కానీ సమర్పించే ఏ సమాచారమైనా ప్రజలు ఆర్.టి.ఐ. ద్వారా పొంద వచ్చు. ప్రజలు తాము కోరుతున్న సమాచారానికి కారణం కానీ, తమ వ్యక్తిగత వివరాలు కానీ,ఒక్క కాంటాక్టు అడ్రసు తప్ప, అధికారికి చెప్పాల్సిన పనిలేదు.


5.సమాచార హక్కు ను కోరుతున్న దరఖాస్తు ఇన్ని పదాల లోనే వుండాలని నిబంధన ఏమయినా వుందా?*


◆ఔను. ఆర్.టి ఐ అప్లికేషన్, సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామాతో కలిపి, 500 పదాలకు మించి వుండరాదు. అయితే అప్లికేషనుకు అనుబంధం వుంటే అది లెక్కలోకి రాదు. అయినాకానీ , పదాల పరిమితి పెరిగిందనే కారణంతో ఎవరి దరఖాస్తును తిరస్కరించడానికి వీల్లేదు.


*6. సమాచార హక్కు చట్టం ప్రకారం నేను సమాచారం పొందాలంటే ఏం చెయ్యాలి?*

◆నిర్దేశించిన రుసుము చెల్లించి,సంబంధిత పబ్లిక్ అధారిటి యొక్క పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరిట, దరఖాస్తు చేయాలి. ఆ అధికారికి మీరు అడుగుతున్న సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత వుంది. పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పేరు ఇక్కడ అవసరం లేదు.ఒకవేళ మీరు దరఖాస్తు రాయలేని నిరక్షరాస్యులు అయినట్టయితే , మీకు దరఖాస్తు రాసి పెట్టడానికి ఎవరినాయినా సూచించే బాధ్యత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ తీసుకుంటారు.


*7. సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలి?*

సమాచార హక్కు చట్టం కింద ఈ క్రింది విషయాలు మీరు పొందవచ్చు.

◆డాక్యుమెంట్స్, రికార్డ్స్, మెమోలు, ఈ మెయిల్స్, అభిప్రాయాలు. సలహాలు, పత్రికా ప్రకటనలు, ఆర్డర్స్, లాగ్ బుక్స్, కాంట్రాక్టులు, రిపోర్టులు, పేపర్స్, సర్క్యులర్స్, శాంపిల్స్, మోడల్స్

ఎలెక్ట్రానిక్ ఫారంలో వున్న డేటా, డాక్యుమెంటు ఒరిజినల్ కాపీ,

మైక్రోఫిల్మ్, ఇమేజ్ రూపంలో వున్న మైక్రో ఫిల్మ్


*8. ఏ ఏ విషయాలు సమాచార దరఖాస్తు  ద్వారా పొందడానికి సాధ్యం కాదు ?*

◆ఈ క్రింది విషయాలు ఆర్.టి. ఐ ద్వారా పొందడానికి సాధ్యం కాదు. భారతదేశ సమగ్రత, సార్వభౌమత్వాలకు భంగం కలిగించే సమాచారం దేశ భద్రత, వ్యూహాత్మక , వైజ్ణానిక, ఆర్ధిక ప్రయోజనాలపై , విదేశీ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే సమాచారం, హింసను ప్రేరేపించే సమాచారం

ఫలానా సమాచారాన్ని ప్రకటించకూడదని ఏదయినా న్యాయస్థానం లేక ట్రిబ్యూనల్ ఆదేశించి వున్న పక్షంలో అలాంటి సమాచారం ,సమాచార వెల్లడి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందనుకుంటే ఆ సమాచారం సమాచార వెల్లడి పార్లమెంట్ , రాష్ట్ర శాసన సభ హక్కులను ఉల్లంఘించేదయితే అలాంటి సమాచారం

వాణిజ్య పరమయిన గోప్యత, వ్యాపార రహస్యాలు, మేధో సంపత్తికి సంబంధించిన సమాచారం, సమాచార వెల్లడి వల్ల పోటీ రంగంలో తృతీయ పక్షానికి హాని కలిగేటట్లయిటే అలాంటి సమాచారం . అయితే, అలా వెల్లడి చెయ్యడం వల్ల ప్రజలకుఎక్కువ మేలు కలుగుతుందంటే ,ఆ సమాచారం ఇవ్వవచ్చు. ఉద్యోగ సంబంధ రీత్యా ఒక వ్యక్తికి అందుబాటులో వున్న సమాచారం విశాల ప్రజాప్రయోజనాల రీత్యా వెల్లడి చేయాల్సిన అవసరం వుందని సంబంధిత అధికారి భావిస్తే దాన్ని ప్రకటించవచ్చు.

ఏదయినా విదేశ ప్రభుత్వం నుంచి అంది,గోప్యంగా ఉంచాల్సిన సమాచారం సమాచార వెల్లడి వల్ల ఒక వ్యక్తికి ప్రాణ హాని కానీ, ప్రమాదం కలుగుతుందనుకుంటే ఆ సమాచారం, చట్టాల అమలుకోసం, భద్రతా ప్రయోజనాల కోసం గోప్యంగా సమాచారం అందించిన,లేక సహాయపడిన వారి గుర్తింపుకు దారితీసే సమాచారం దర్యాప్తు ప్రక్రియనూ, నేరస్తులను పట్టుకునేందుకు గానీ,వారిని శిక్షించేందుకు అవరోధాలు కలిగించే సమాచారం ఏదైనా అంశాలపై మంత్రి మండలి నిర్ణాయక పత్రాలు,అవి బహిర్గతం చేసే దాకా ఆ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన సమాచారాన్ని వెల్లడి చేయరాదు. సమాచారం ప్రజా ప్రయోజనాలకు కాని, ప్రజా కార్యక్రమాలకు సంబంధంలేని, వ్యక్తిగత సమాచారం గోప్యతను వెల్లడి చేసే వివరాలు


*9. సమాచారం తీసుకోవడానికి ఏ భాషను ఉపయోగించాలి?*

◆మీకు కావలసిన సమాచారాన్ని ఇంగ్లీషు, హిందీ లేక స్థానిక భాష లో ఈ దరఖాస్తు పంపుతున్న మీ ప్రాంతంలోని అధికార భాషగా  గుర్తించిన ప్రాంతీయ భాషలో గాని వుండవచ్చు.


●10. నాకు కావలసిన సమాచారాన్ని నేను కాపీ చేయడం గాని, చూడడం కాని ఎలా చెయ్యాలి?*


◆డాక్యుమెంట్స్ , మాన్యుస్క్రిప్టులు, మరియు రికార్డులు తనిఖీ చేయవచ్చు. నోట్స్ తీసుకోవచ్చు., సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ కాపీలు లేక వాటి అనుబంధ కాపీలు, పదార్ధాల సర్టిఫైడ్ శాంపుల్స్ , సీడీ ల రూపంలో వున్న సమాచారం, ఫ్లాపీలు, టేపులు, వీడియో కాసెట్స్, ప్రిట్ అవుట్స్ ( కంప్యూటరులో వున్న సమాచారం), లేక ఇతర ఎలక్ట్రానిక్ రూపంలో వున్న సమాచారం


*11. కావలసిన  సమాచారం అధికారులు ఏ రూపంలో ఇవ్వగలరు?*

◆పబ్లిక్ సంస్థ వనరులలో వ్యత్యాసాలతో కూడిన మార్పులు జరగకపోతే, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు. ఆ డాక్యుమెంటుకు హాని లేని పక్షంలో , లబ్దిదారులు కోరిన విధంగా, కోరిన రూపంలో సమాచారం ఇవ్వవచ్చు .


*12.సమాచార చట్టం  దరఖాస్తును (అప్లికేషన్) నింపడానికి ఏదైనా  ఖచ్చితమైన ఫార్మెట్ వుందా?*

◆లేదు. సమాచారాన్ని కోరుతూ దాఖలు చేస్కునే దరఖాస్తు ఫారానికి ప్రత్యేకమయిన ఫార్మెట్ ఏమీ లేదు. కానీ దరఖాస్తు దారుడు ఈ‌ క్రింది వివరాలు రాయాల్సి వుంటుంది.

1)దరఖాస్తు తేదీ.

2)సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు చిరునామా

దరఖాస్తుదారుని చిరునామా

3)కోరదల్చుకున్న సమాచారం( స్పష్టత కోసం నంబర్లవారీగా కానీ, టేబుల్ రూపంలో గానీ వుంటే మంచిది. దానికి ప్రతిస్పందనలు కూడా అదే రూపంలో వుంటాయి.)

4)కోరిన సమాచారం ఎలాంటి రూపంలో – ప్రింట్ అవుట్స్, సిడి , ఈ మైయిల్స్ చెల్లించాల్సిన రుసుము స్టాంపు రూపంలో అయితే అంటించండి చెల్లింపు విధానం తెలపండి.సంతకం అనేక కెంద్ర, రాష్ట ప్రభుత్వ సంస్థలు శాంపిల్ ఫార్మేట్స్ ను రూపొందించాయి.పర్యావరణ , అడవుల మంత్రిత్వ శాఖల కు సంబంధించిన దరఖాస్తు ఫారాలను http;//envfor.nic.in/sites/default/files/app_pro.pdf వెబ్ సైట్ లో చూడగలరు. సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు కూడా ఒక దరఖాస్తు ఫార్మెట్ తయారు చేశారు. ఇది దరఖాస్తు సౌలభ్యం కోసం మాత్రమే తప్ప తప్పనిసరిగా పాటించితీరాలని నిబంధన ఏమీలేదు. ఈ ఫార్మెట్ లేదనే కారణం గా దరఖాస్తుని తిరస్కరించడానికి వీల్లేదు.


*13. ఆన్ లైన్ ద్వారా సమాచారాన్ని ఫైల్ చేయవచ్చా?*

◆అది పబ్లిక్ అధారిటి మిద ఆధార పడి వుంటుంది.కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే సమా చార హక్కు http;//rtionline.gov.in/ పేరిట ఒక పోర్టల్ నూ రూపకల్పన చేసింది. ఇందులో కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలపై మాత్రమే వినియోగదారుడు తమ దరఖాస్తులను నమోదు చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కు గురించి వెబ్ సైట్స్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.


*14.సమాచారం  పొందడానికి ఎంత సమయం పడుతుంది?*

1)మీరు అడిగిన సమాచారం   వ్యక్తి ప్రాణానికి, వ్యక్తిగత స్వేచ్చకు (లైఫ్ అండ్ లిబర్తికి ) సంబందించాయిన అంశం అయితే  మీ దరఖాస్తు సంబంధిత అధికారికి  ముట్టిన  ముట్టిన సమయమ నుంచి 48 గంటలలోపు సమాచారం అందించాలి.


2) దరఖాస్తు చేరిన ౩౦ రోజులలోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం అందించాలి. అప్లికేషన్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారికి పంపినట్టయితే అతను సంబంధిత అధికారిని దాన్ని చేర్చి సమాచారం సేకరీంచే నిమిత్తం మరొక 5రోజులు అవసరమవుతుంది. 


*15. సమాచార హక్కు దరఖాస్తు సరైన అధికారికి పంపకపోతే వెనక్కి తిరిగి వచ్చేస్తుందా?*

◆మీ దరఖాస్తు సంబంధిత అధికారికి చేరకుండా మరొకరికి చేరినా కానీ, దాన్ని తిప్పి పంపంచడానికి వీల్లేదు. ఈ‌ చట్టం పకారం దాన్ని అందుకున్న వ్యక్తి, లేక సంస్థ 5 రోజుల్లోగా నిర్దేశిత అధికారికి తిరిగి చేర్చితీరాలి..


*16. సమాచారం తీసుకోవడానికి నేను ఏదైనా ఫీజు చెల్లించాలా.?*

◆సమాచార హాక్కు కింద సమాచారం కోరుతూ పంపే అప్లికేషను ఒక కాపీ మీ దగ్గర అట్టిపెట్టు కొండి. అప్లికేషను రిజిష్టర్ పోస్టు అక్నాలేడ్జిమేంట్

లో పంపండి రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్ అథారిటి సమర్పించబోయే సమాచారానికి ఒక నియమిత ఫీజును నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆ మొత్తాన్ని రూ. 10 గా ప్రకటించింది.(ఈ పైన ఇచ్చిన పట్టికలో


ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫీజు ఎంతెంత నిర్ణ యిన్చిందో, ఎలా ఫీజు కట్టలో ఇవ్వడం జరిగింది. 1) ఒకవేళ దరఖాస్తు దారుడు

దారిద్యరేఖ దిగువున వున్నా వాడితే,( ఫీజు చెల్లించలేని పరిస్థితిలో) వుంటే దానికి సంబంధించిన గుర్తింపు కార్డును సమర్పించాల్సి వుంటుంది అనగా దరఖాస్తు వెంట  తెల్ల రేషన్ కార్డు జిరాక్సు జత పర్చవల్సి ఉంటుంది.

*సెక్షన్7(3)(a)* ప్రకారం సమాచార రుసుము (కోర్టు సంబంచిన మాత్రం రూ25/- మిగతా శాఖ వారికి రూ10/- మాత్రమే చెల్లించాలి.


*దరఖాస్తు రుసం(పీజును)*

(1) నగదు రూపంలో,

(2) ఇండియన్ పోస్టల్ ఆర్డర్లు,

(3) డిమాండ్ డ్రాఫ్టు,

(4) కోర్టు ఫీ స్టాంపు వేయాలి,(కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు చెల్లుబాటు కాదు)

(5)బ్యాంకర్స్ చెక్కురూపంలో మాత్రమే దరఖాస్తు రుసుం. ఎకౌంట్ అధికారి పేరిట పంపించాలి.

విలయినంతగా పోస్టల్ ఆడారు మాత్రమే రుసుముగా చెల్లించాలి.


కోరిన సమాచారాన్ని బట్టి వాటి ప్రింటవుట్స్ కి పేజీకి రూ.2 చొప్పున చెల్లించాలి. అదనపు చార్జీలు ఎవైన వుంటే, ఆఫీసరు తన జవాబులో తెలియజేస్తారు.


 ఒకవేళ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు సమాచారం ఇవ్వడంలో 30 రోజులకంటే ఎక్కువ జాప్యం చేస్తే, అప్పుడు ఎటువంటి ఫీజు వసూలు చెయ్యకుండా ఉచితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది.


*17.ఆర్.టి.ఐ దరఖాస్తుకి స్పందన లేకపోతే ఏం చెయ్యాలి?*

◆సమాచారం కోసం సమర్పించిన దరఖాస్తుకి సంబంధిత అధికారి నుంచి స్పందన లేకపోతే అప్పిలేట్ ఆధారిటీ కి అప్పీల్ చేసుకోవచ్చు. అన్ని పబ్లిక్ అథారిటిల తాలూకు అప్పిళ్ళను చూసేది అప్పలేట్ అధారిటి. మీ మొదటి అప్లికేషనుకు జవాబు రావాల్సిన తేది నుంచి 30 నుంచి 60 రోజుల వ్యవధిలోపల అప్పీలు చేసుకోవాలి.


*18. నాకు చేరిన సమాచారం తప్పుగానో, అసంపూర్తిగానో వుంటే ఏం చెయ్యాలి?*

◆ఇచ్చిన సమాచారం అవాస్తవంగానో , అసంపూర్తిగానో వుంటే అప్పిలేట్ ఆధారిటికి అప్పీల్ చేసుకోవాలి. సమాధానం చేరిన 30 రోజులలోపు అప్పీలుచేయాలి. సరైన కారణాలు వున్నప్పుడు అంతకంటే ఎక్కువ జాప్యం జరిగిన కూడా అప్పీలు అంగీకరిస్తారు.


*19. సమాచారాన్ని ఇవ్వడానికి తిరస్కరించవచ్చా?*

◆వ్యక్తి గత సమాచారం అడిగినప్పుడు తిరస్కరించవచ్చు. కొన్ని సమాచార విషయాలు ఆర్.టి.ఐ. సహాయంతో అందరితో పంచుకునే వీలులేదు. అలాంటప్పుడు సంబంధిత అధికారులు మీ అప్లికేషన్ తిరస్కరించవచ్చు. అయితే, ఆర్.టి.ఐ చట్టం కింద సదరు సమాచారం ఇవ్వ యోగ్యమైనదే అనిపిస్తే, మీరు అప్పీలు చెయ్యవచ్చు.

మీరు ఈ అప్పీలును మీకు జవాబు వచ్చిన 30 రోజుల లోగా చేసుకోవాలి.మీ అప్లికేషన్ తిరస్కరించినప్పుడు, దానికి కారణాలు, మీరు దానిపై ఎలా అప్పీలు చేసుకోవచ్చో, మీరు పంపాల్సిన అప్పలేట్ అధారిటి ,ఇవన్ని కూడా తిరస్కరిస్తున్న పబ్లిక్ అథారిటి ఇవ్వాల్సి వుంది.


*20. అప్పిలేట్ అథారిటీ ఇచ్చిన సమాచారం నాకు అసంతృగా వుందనిపిస్తే నేను ఏం చెయ్యాలి?*

◆అలాంటప్పుడు, మీరు కేంద్ర సమాచార కమిషన్ కు లేదా, రాష్ట్ర సమాచార కమిషన్ కు రెండో సారి అప్పీలు చేయవచ్చు. మీరు మొదట పంపిన అప్పీలుకు జావాబు ఇవ్వాల్సిన సమయం అయిన తరవాత 90 రోజులోగా రెండో అప్పీలు పంపుకోవాలి. లేదా, మొదటి అప్పీలుకు జావాబు వచ్చిన తరవాత 90 రోజులలోగా రెండో అప్పీలు పంపాలి. సరైన కారణం వున్నప్పుడు, ఈ సమయం దాటి పోయినా కూడా అప్పీలు అనుమతించబడుతుంది.


*21. కోరిన సమాచారాన్ని సంబంధిత రాష్ట్ర సమాచార కమిషన్/కేంద్ర సమాచార కమిషన్ గాని నిర్ణిత సమయం లో ఇవ్వాలని వున్నదా?*

◆అటువంటి సమయ నిబంధన ఏది లేదు.


*22.కోరిన సమాచారం ఇవ్వని అధికారి పై ఎం చర్యలు తీసుకుంటారు*

◆పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఈ క్రింద వివరించిన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, అతను దరఖాస్తూ స్వీకరించే వరకు లేదా సమాచారం ఇచ్చే వరకు కేంద్ర సమాచార కమిషన్ లేదా రాష్ట్ర సమాచార కమిషన్ రోజుకు రు .250 లు చొప్పున పెనాల్టి విధించ వచ్చు. గరిష్టంగా రు.25,000లు వరకు పెనాల్టి వేయవచ్చు.

●సరైన కారణం లేకుండానే ఆర్.టి.ఐ. దరఖాస్తు తీసుకోవడానికి నిరాకరించడం

●నిర్ణయించబడిన సమయంలో సమాచారం ఇవ్వడానికి నిరాకరించడం

●సమాచారం కావాలని ఆలస్యంగా ఇవ్వడం

●తెలిసి కూడా తప్పుడు సమాచారం/అసంపూర్తి సమాచారం/తప్పు దోవ పట్టించే

సమాచారం ఇవ్వడం

●అడిగిన సమాచారాన్ని అసలు లేకుండా చెయ్యడం,

●సమాచారం ఇవ్వడానికి ఏదో విధంగా అడ్డుపడడం.


*23.ఏలాంటి పరిస్థితుల్లో మీరు అప్పీల్ వేయకుండా సమాచార కమీషన్ కు దరఖాస్తు చేసుకొనవచ్చు?*

మీరు సమాచారం కొరకు దరఖాస్తు ప్రజా సమాచార అధికారి గారికి దరఖాస్తు చేసుకొని ఉంటే మీ దరఖాస్తు స్వీకరించకుండా తిరస్కరిస్తే (refused) మీరు  సమాచార హక్కు చట్టం రాష్ట్ర)/కేంద్ర  కమీసనర్ల అప్పీల్  చేసుకొనవచ్చు.


*24. రికార్డులను తనిఖీ చేసే అధికారం ఉందా?*

◆సెక్షన్2(j)(1) ప్రకారం పనులను, పత్రాలను తనిఖీ చేసే హక్కు  అధికారం ఉంది (మొదటి గంటకు ఉచితం మరల ప్రతి గంటకు  రూ5/- చెల్లించాలి


25 సమాచార దరఖాస్తు దారునికి వయసు,విద్య స్థానికత అవసరం ఉందా*?

 ◆లేదు

26. సమాచార హక్కు ప్రతి దరకాస్తుదారుడు వినియోగదారరుడేనా?

◆అవును వినియోగదారుడే


*27.అడుగుతున్న సమాచారాన్ని ఎందుకు అని ఆడిగే హక్కు ఎవరికైనా ఉందా?*

◆లేదు  *సెక్షన్6(2)* ప్రకారం సమాచారం ఎందుకో చెప్పనక్కరలేదు.


*28.మీరు అడుగుతున్న సమాచారం ఏ శాఖ అధికారికి వస్తుందో తెలియనప్పుడు. మీరు  తప్పకుండా

◆సెక్షన్-6(1) ప్రకారం సమాచార హక్కు దాఖలు విధానం. తెలియపరుస్తూ కోరిన సమాచార  మీ పరిధిలోకి రాని యెడల *సెక్షన్ -6(3)* ప్రకారం  నా దరఖాస్తును బదిలీ సీజేయగలరు అని తప్పని సరిగా వ్రాయాలి. సమాచారం సంబంధిత శాఖ అధికారికి దరఖాస్తు బదిలీ  ప్రజా సమాచార అధికారిపై ఉండుంది.


*29.ఉచితంగా ఏ సెక్షన్ ప్రకారం సమాచారం పంపిణీ చేయాలి?

◆సెక్షన్7(6) ప్రకారం గడువులోపు సమాచారం ఇవ్వకుంటే సమాచారం ఉచితముగా ఇవ్వాలి.


*30.మినహాయింపులు ఎప్పుడు ఏ సెక్షన్ ప్రకారం వర్తించవు?*

◆సెక్షన్8(2) ప్రకారం అడిగిన సమాచారంలో ప్రజాప్రయోజనం ఉంటే   మినహాయింపులు వర్తించవు.


*31.మొదటి అప్పీలు ఏ సెక్షన్ ప్రకారం అప్పీల్ చేయాలి?*

సెక్షన్19(1) ప్రకారం మొదటి అప్పీలుచేయాలి 45 రోజుల నుంచి 60 రోజుల లోపు ఉండాలి.


*32. ఏ సెక్షన్ ప్రకారం రెండవ అప్పీల్ చేయాలి?*

◆సెక్షన్19(3) ప్రకారం రెండవ అప్పీలు, 90 రోజుల లోగా రాష్ట్ర కేంద్ర సమాచార కమీషన్ అప్పీల్ చేసుకోవాలి. సరైన కారణాలు ఉంటే 90 రోజుల తరువాత అప్పీల్ చేసుకోవచ్చు.


*33*  కేంద్ర రాష్ట్ర కమీసనర్లకు  ఏ సెక్షన్ ప్రకారం పిర్యాదు చేయాలి*

◆సెక్షన్18(1) ప్రకారం కమీషన్లకు పిర్యాదు చేయాలి.


*34. సమాచారం కోరిన సమయంలో మీ దరఖాస్తును అయిన అర్థక పరమైన  నష్టాలు వచ్చి ఉంటే వాటిని చెల్లించమని అడవచ్చు?*

◆సెక్షన్-19(8)(b)  ప్రకారం ధరాఖస్తుదారు తనకు  కలిగిన ఆర్థికపరమైన కష్టనష్టలపై కమిషన్ ఆధారాలు సమర్పించాలి సక్రమంగా ఉంటే  నష్టపరిహారం మంజూరు చేయాలి.


*35.తప్పుడు సమాచారం ఇచ్చిన  సమాచారం ఇవ్వకపోయినా సంబంధిత అధికారిపైకమిసనర్లను  చర్యలు తీసుకోమని ఏ సెక్షన్ కింద కొరవచ్చు?*

◆సెక్షన్20(1) ప్రకారం సమాచారం ఇవ్వకపోతే  (తప్పుడు సమాచారం ఇస్తే రోజుకు రూ 250 చొప్పున రూ 25,000 వరకు జరిమానా. విధించమని కోరవచ్చు.


*36.సమాచారం ఇవ్వకుంటే వినియోగదారుల పోరంకు వెళ్ళవచ్చు?*

*సెక్షన్20(2)* ప్రకారం క్రమక్షణ చర్యలకు సిపారసు

గడువులోగా సమాచారం ఇవ్వకపోతే వినియోగదారుల పొరనికి వెళ్ళవచ్చు.


*37.సమాచార దరఖాస్తుదారులు ఎటువంటి పరిస్థితుల్లో  హైకోర్టు/సుప్రీంకోర్టు వెళ్ళవచ్చు?*

◆ 1)ప్రజా సమాచార అధికారి (ipo) తప్పుడు సమాచారం ఇస్తే రాష్ట్ర కమిసనర్ లేకుంటే  డైరెక్టుగా  న్యాయస్థానానికి వెళ్ళవచ్చు.

2)సమాచార కమిషన్లు సమాచారం ఇవ్వమని ఆదేశించిన  సమాచారం ఇవ్వకుండా ఉంటే హైకోర్టు/సుప్రీంకోర్టులకు వెళ్ళవచ్చు.

కృషితో నాస్తి దుర్భిక్షం

 కృషితో నాస్తి దుర్భిక్షం 

జపతో నాస్థి పాతకం 

మౌనేన కలహం నాస్తి 

జాగ్రతేన భయం నాస్తి 

మన మహర్షులు వారి జ్ఞానంతో మన దైనందిక జీవనానికి ఉపకరించే అనేక సూత్రాలను, నీతులను మనకు అందించారు ఆ పరంపరలో వెలసినదే ఈ శ్లోకం 

కృషితో నాస్తి దుర్భిక్షం : అంటే కృషి చేస్తే దుర్భిక్షం ఉండదు అంటే మనం శ్రమ చేస్తే దరిద్రం ఉండదు. ఎందుకంటె శ్రమకు మనము ఫలితాన్ని పొందుతాము ఆ ఫలితం వలన దరిద్రం పారదోల వచ్చు  ఇక్కడ శ్రమ అంటే ఏదయినా ఉద్యోగం లేక వ్యాపారమో వృత్తి కావచ్చు తద్వారా మనకు ధనం లభిస్తుంది.  ఆ ధనంతో వలసిన వాటిని కొనుక్కొని సుఖ జీవనం చేయవచ్చు. 

జపతో నాస్థి పాతకం: జపం చేయటం వలన అంటే కేవలం జపమే కాకుండా దేముడికి సంబందించిన పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం వలన మనం చేసిన పాపాలు అన్ని పాటా పంచలు అయ్యి పుణ్య ఫలం లభిస్తుంది అందు వలన పాతకాలు నశిస్తాయి అని అర్ధం. మనం నిత్యం జప తపాదులను ఆచరించి మన చిన్నారులకు కూడా మార్గ దర్శకంగా ఉంటే గృహంలో ముందుగా ప్రశాంతత తరువాత అదృష్టం  చేకూరుతుంది. ఏ ఇల్లు పరి శుభ్రంగా ఉండి అక్కడి గృహస్తులు  దైవ చింతనలో వుంటారో ఆ ఇంటిలో నిత్యం లక్ష్మి దేవి వసిస్తుంది అన్నది సత్యం. 

మౌనేన కలహం నాస్తి: ఇది ఇప్పటి కాలంలో ప్రతివారు ఆచరించ వలసిన సూత్రము. మనం చేసిన ప్రతి పనిని ఈ సమాజం వేయి కళ్ళతో గమనిస్తూ ఉండటమే కాకుండా కొందరు వారికి తెలిసి కొంచం తెలియక కొంచం అహంతో కొంతఎదుటి వారిని విమర్శించాలనే సంకల్పంతో మనకు మనసు గాయ పడే విధంగా ప్రవర్తించినా కూడా మనం మౌనంగా ఉంటే ఎటువంటి మనః స్పర్ధలు రావు తత్ ద్వారా కలహం రాదు. కాబట్టి ఈ రకంగా కలహాన్ని ఆపగలం. మహా భారతంలో తిక్కన మహా కవి వ్రాసిన పద్యం ఈ సందర్భంలో అనుసరణగా ఉంటుంది చుడండి 

ఒరులేయవి వనరించిన 

నరవర యప్రియంబుదన మనంబునకగు 

నొరులకు నవి సేయకునికి 

పరాయణము పరమ ధర్మ పదములకెల్లన్ 

భావము: ఇతరులు ఏవయితే అప్రియమైనవి అనగా మనకు ఇష్టము కాని పనులు మన యెడ చేస్తారో అవి వారికి చేయకుండా అంటే అదేవిధంగా వారితో ప్రవర్తించకుండాఉండటం పరమ ధర్మము అంటే   ధర్మాల కన్నా ఎక్కువ అయిన ధర్మము అని అర్ధము. మనకు ఎంతో విలువైన వాగ్మయం వున్నది కానీ అది పెద్ద వారు తెలుసుకోవటం లేదు అట్టి తరి ఇక పిల్లలకు ఏమి నేర్పగలరు. ప్రతి వారు కొంత సమయాన్ని వెచ్చించి చక్కటి విషయాలు తెలుసుకొని తమ సంతతికి నేర్పిన ఈ సమాజం ఎటువంటి గొడవలు లేకుండా చల్లగా ఉంటుందనుటకు సందేహం లేదు. 

జాగ్రతేన భయం నాస్తి:  ఇది ఇప్పటి ప్రపంచానికి ఎంతో ముఖ్యమైన వాక్యంగా నేను  అనుకుంటాను. నాకు ఇటీవల కలిగిన ఒకపరోక్ష అనుభవాన్ని తెలియ చేస్తున్నాను. నాకు తెలిసిన ఒక వ్యక్తికీ ఒక వడ్డీ వ్యాపారం చేసే సంస్థ ఉద్యోగి బలవంతంగా వ్యక్తిగత ఋణము ఇప్పించారట.  ధనాశతో అతనుకూడా అనాలోచితంగా తీసుకున్నాడు.  తరువాత తెలిసింది తాను నెలసరి చెల్లించే వాయిదా సొమ్ము కలిపితే తానూ తీసుకున్న ఋణం కన్నా చాల ఎక్కువ అని. అంతే కాదు తానూ ఈ కరోనా నేపథ్యంతో నెలసరి వాయిదాలు కొన్ని కట్ట నందువల్ల ఆ సంస్థ వారి ఉద్యోగులు రాత్రియంబవళ్ళు దూర శ్రవణితో మాట్లాడుతో అనేక విధముల దుర్భాషలాడటమే కాక అతనిపై అతని ధర్మ పత్ని ఫై  పోలీసు కేసులు పెట్ట గలమని భయపెట్టు చున్నట్లు నాతొ నుడివినాడు, అందు వల్ల తన కుటుంబ జీవనం దుర్భరమైనదని వాపోయినాడు. ఇది యదార్ధంగా జరిగిన సంఘటన.  నిజానికి తనకు అవసరము లేకున్నను దొరికిందని ఋణము తీసుకోవటం వల్ల వచ్చినఁ ముప్పు అంటే తనంతట తానె ముప్పుని కొని తెచుకున్నట్టు.  మనం రోజు అనేకమైన ఇటువంటి విషయాలను వింటున్నాము కంటున్నాము.  అనేకులు ఋణములు చెల్లించ లేక ఆత్మ హత్యలకు పాలుపడుటము కూడా  మన మెరుగుదుము.  ముందు జాగ్రత్త లేక పోవటమే ఇటువంటి పరిస్తుతములకు  దోహద పడుతాయి.  

మనుషులకు ఆశ లేశ మాత్రంగానే ఉండాలి. ప్రస్తుతము కరోనా కారణంగా ధనార్జన లేని అనేక సాఫ్ట్ వెరు జ్ఞానులు అక్రమ ధనార్జనకు పలు తెరుగుల మోసములు చేయుటకు  పాల్పడుతూ అమాయకులను ప్రలోభ పెట్టి వారిని దోపిడీ చేస్తున్నారన్నది విశ్వ విదిత సత్యం. 

మనకు ఉరక ఎవ్వరు ఒక్క రూపాయి కూడా ఎందుక ఇస్తారు అని ఆలోచించే వారు ఎట్టి ప్రలోభాలకు లొంగరు. కానీ చాలా మంది అమాయకులు అందులోని నిజా నిజాలను పసి కట్టక లక్షలలో కంప్యూటరు మోసాలకు లోనవుతున్నారు.  మన భారతీయుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కేనియా దేశస్తులు కూడా మోసగిస్తున్నట్లు మనం వార్తలలో చూస్తున్నాము.   

" ఆశయాబద్దతే లోకం కర్మణేన బహుచిన్తయామి" 

మరొక శ్లోక వివరంతో మరలా కలుద్దాము. 

ఇట్లు 

బుధ జన విధేయుడు 

భార్గవ శర్మ 

*మోక్ష మార్గాలు

 *మోక్ష మార్గాలు..


 *తరుణోపాయం...*

 

ప్రతి మార్గంలోనూ ఆ మార్గానికి సంబంధించిన ఇబ్బందులు కష్టనష్టాలు ఉండనే ఉన్నాయి. ఇవి కాక మానవ సహజమైన లోపాలు ఎలాగూ మనలో ఉంటాయి. సాధన అన్న తర్వాత జారు పాట్లు భంగ పాట్లు తప్పవు. మోక్షము అనేది చాలా జన్మల తరవాత వచ్చేది. దానికి అడ్డ దారులు సూక్ష్మ మార్గాలు ఉండవు. కానీ ఇందులో భగవంతుడు చిన్న వెసులుబాటు ఇచ్చాడు. సాధన మార్గంలో కొంత దూరం వెళ్లిన తర్వాత జన్మ పూర్తయితే తర్వాతి జన్మలో మళ్లీ సరిగ్గా ఎక్కడ వదిలేసామో అక్కడ నుంచి సాధన మొదలువుతుంది. చేసిన పూజ, సాధన మురిగిపోవు. గజేంద్రమోక్షం ఘట్టంలో ఆఖర లో ఈ మాట వుంది. 


జ్ఞాన భక్తి కర్మ మార్గాలలో అన్నిటిలో కూడా తప్పకుండా ఉండవలసిన దినుసు వైరాగ్యం. వైరాగ్యం లేకుండా ఏ మార్గము కూడా పనిచేయదు. మనము ఏ మార్గంలో ముందుకు పోదా మనుకున్నా ఆ మార్గంలో మన కంటే ముందు అరిషడ్వర్గాలు వెళ్లి మనల్ని దొర్లించడానికి ఆ మార్గం నిండా గుంటలు తోవ్వుకుని కూర్చొని ఉంటాయి. వైరాగ్యం ఉంటే తప్ప ఆ గుంటల్లోంచి బయటపడ లేము. సంసారాన్ని పూర్తిగా వదిలి పెట్టనక్కర్లేదు. కానీ తాపత్రయాలను కొద్దిగానైనా అదుపులో ఉంచు కోవాలి. అన్నిటికంటే ఇదే ప్రధాన మైనది.


60 ఏళ్ళు వచ్చిన తర్వాత నైనా భగవంతుడి మీదా మోక్షం మీదా ఆసక్తి కలగకపోతే మనకు వచ్చిన ఈ మానవ జన్మ వృధా అయినట్లే. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం మోక్షం మీద ఆసక్తి తప్పకుండా ఉండాలి. మనం చెయ్యవలసినది ఏమిటి అనేది గురువులు ఇలా చెప్తారు. 


*కలియుగంలో తీవ్రమైన సాధన ఎవరికీ వీలుపడదు. ఏదో ఒకటే మార్గము అనిపట్టు కొని కూర్చుంటే అసలు వీలుపడదు. అన్ని మార్గాల్లో ఉన్న మంచిని తీసుకోవాలి. ఎవరో ఒక దేవుడినో దేవతనో నమ్ముకొని సాధ్యమైనంత వరకూ సత్సంగము, నిత్యం భగవంతునికి సంబంధించిన మాటలను వినడము భగవంతునికి సంబంధించిన పుస్తకాలను చదవడం రోజూ నియమంగా ఏదో ఒక రూపంలో భగవంతుడిని కొద్దిసేపైనా పూజిస్తూ ఉండడం. వీటితో పాటు కొద్దిపాటి ఇంద్రియ నిగ్రహంతో కాస్త ధర్మ బద్దంగా బతుకు వెళ్ల దీయ గలిగితే ఇప్పటి పరిస్థితులలో మనకు సరిపోతుంది. ఉన్నంతలో కోరికలు క్రోధాలు అదుపులో ఉంచుకుని శాంతంగా బతకడమే ప్రస్తుత కాలానికి మనం చేయగలిగిన సాధన. లంపటత్వం తగ్గించుకుని వైరాగ్యాన్ని పెంచుకోవాలి. జ్ఞాన భక్తి కర్మ మార్గాల నన్నింటిని వాళ్ల వాళ్ల రుచిని బట్టి, ఓపికను బట్టి, అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కలిపి ఉపయోగించు కోవడం మంచిది.*


బ్రహ్మ సూత్రాల దగ్గర్నుంచి మొదలుపెట్టి వందల పుస్తకాలు రాసిన ఆదిశంకరులు ఆఖరులో మనకు ఇచ్చిన రత్నాల మూట భజగోవింద స్తోత్రం. అందులో ఉన్న సూచన కూడా ఇదే. భజగోవింద స్తోత్రాన్ని చదివి అర్థం చేసుకొని ఆ సూచనలు రోజూ పాటించ గలిగితే చాలు. అంతకంటే మించిన వేరే సాధన ఈ కాలంలో ఇంకేమీ లేదు. 


*పవని నాగ ప్రదీప్.*

ఓ చౌకీదార్ కథ:

 ఓ చౌకీదార్ కథ:

(గొల్లపూడి మారుతి రావు)


కొంతకాలం కిందట నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ కాలమ్‌ రాశాను. నా ఆభిమాని దగ్గర్నుంచి సుదీర్ఘమైన ఈ మెయిల్‌ వచ్చింది.‘‘నరేంద్రమోదీని పొగడకండి సార్‌! అతను దుర్మార్గుడు. కర్కశుడు’’ ఆంటూ రాశాడు. నాకూ మా మిత్రుడితో ఏకీభవించాలని ఉంది. ఒక్క క్షణం నరేంద్రమోదీ అనే దుర్మార్గుడైన ప్రధానమంత్రిని మరిచిపోదాం.


కేవలం ముగ్గురు నాయకుల నమూనా కథలు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి ప్రధాని అయ్యేనాటికి కొడుకు హరిశాస్త్రి అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఉద్యోగి. తీరా ఈయన ప్రధాని అయ్యాక హరిశాస్త్రికి సీనియర్‌ జనరల్‌ మేనేజరుగా కంపెనీ ప్రమోషన్‌ ఇచ్చిందట. ‘‘వారెందుకిచ్చారో నాకు తెలుసు. ముందు ముందు నన్ను వాడుకోడానికి. నువ్వు నీ ఉద్యోగానికి రాజీనామా చెయ్యి. లేదా నేను చేస్తాను’’ అని ఉద్యోగం మాన్పించారు. ఒక ముఖ్య మంత్రి చొక్కా తొడుక్కున్నాక బొత్తాం తెగిపోతే నౌఖరు అ బొత్తాన్ని నిలబెట్టే కుట్టిన కథ చదు వుకున్నాం. ఆయన పేరు టంగుటూరి ప్రకాశం పంతులు. ఒకాయన–ఎమ్మెల్యే. సభ అయ్యాక చేతిలో ఖద్దరు సంచీతో–రూటు బస్సు ఎక్కడం నాకు తెలుసు. ఆయన పేరు వావిలాల గోపాల కృష్ణయ్య.


ఒకావిడ.. పదవిలోకి రాకముందు కేవలం ఒక స్కూలు టీచరు. అవిడ బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ నాయకురాలు మాయావతి. ఆమె సోదరుడు అనందకుమార్‌. 2007లో ఆ మహానుభావుడి ఆదాయం 7 కోట్లు. 7 సంవత్సరాలలో 1,316 కోట్లు అయింది. అంటే 26 వేల శాతం పెరిగింది! అయన ముఖ్యమంత్రి సోదరుడు అన్న కారణానికి ఒకానొక బ్యాంకు సున్నా వడ్డీతో 67 కోట్లు అప్పు ఇచ్చింది. ఇక ములాయంగారి బంధుజనం వందల లెక్కలో ఉన్నారు. వారిని మీరు వెదకనక్కరలేదు. ఉత్తరప్రదేశ్‌ ప్రతీ పదవిలోనూ, వ్యాపారంలోనూ తమరు దర్శించవచ్చు.


ఇక నరేంద్ర మోదీ కథ. ఆయన బంధువులెవరు? ప్రస్తుతం ఏం చేస్తున్నారు? మొన్న ఇండియా టుడేలో వచ్చిన వ్యాసంలో వివరాలు చూద్దాం. ఒక బాబాయి కొడుకు–అరవింద్‌ భాయ్‌–నూనె డబ్బాలు కొనుక్కుని, అక్కర్లేని పాత ఇంటి సామాన్లను కొనుక్కుని–వాటిని అమ్మి నెలకు 9 వేలు సంపాదించుకుంటాడు. అతని కొడుకు గాలిపటాలు, పటాసులు, చిన్న చిరుతిళ్లను తయారు చేసి అమ్మి వాద్‌నగర్‌లో చిన్న గదిలో ఉంటాడు. జయంతిలాల్‌ అనే మరో సోదరుడు టీచరుగా పనిచేసి రిటైరయ్యాడు. అతని కూతురు లీనాను ఒక బస్సు కండక్టరుకిచ్చి పెళ్లి చేశాడు. వాద్‌ నగర్‌లో ఎవరికీ వీళ్లు నరేంద్రమోదీ అనే ప్రధాని బంధువులని కూడా తెలీదు.


మోదీ అన్నయ్య–సోంభాయ్‌ (వయస్సు 75) పుణేలో ఒక వృద్ధాశ్రమం నడుపుతాడు. ఒకా నొక సభలో కార్యక్రమాన్ని నిర్వహించే అమ్మాయి ‘‘ఈయన నరేంద్రమోదీ అన్నగార’’ని నోరు జారింది. ఆయన మైకు అందుకున్నాడు. ‘‘నాకూ ప్రధాని మోదీకి మధ్య పెద్ద తెర ఉంది. మీకది కని పించదు. అవును. నేను నరేంద్రమోదీ అన్నయ్యని. ప్రధానికి కాను. ప్రధాని మోదీకి నేనూ 1.25 కోట్ల భారతీయుల వంటి సోదరుడిని’’ అన్నారు.


మోదీ అన్నయ్య అమృతాభాయ్‌(72) చెప్పాడు: 1969లో అహమ్మదాబాద్‌ గీతామందిర్‌ దగ్గర రోడ్డు రవాణా సంస్థ క్యాంటీన్‌లో టీ దుకాణం నడిపే రోజుల్లో–ఆ దుకాణం నిజానికి వారి మేన మామది–మోదీ రోజంతా పనిచేసి–ఆర్‌.ఎస్‌.ఎస్‌. ఆఫీసుకి వెళ్లి వృదులైన ప్రచారక్‌లకు సేవ చేసి–ఏ రాత్రికో కొట్టుకే వచ్చి క్యాంటీన్‌ బల్లమీదే నిద్రపోయేవాడట–ఇల్లు ఒకే గది ఉన్న వసతి కనుక. 2003లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుటుంబంతో ఒకసారి మోదీ గడిపారట. మరి 2012లో ఎందుకు మళ్లీ గడపలేదు? ఒక రాజకీయ విశ్లేషకుడు అన్నాడుకదా: అధికారంతో వారి బంధుత్వం వారి అమాయకమైన జీవనశైలిని కల్మషం చేస్తుందని. ఆనందకుమార్‌కీ, రాబర్ట్‌ వాద్రాకీ ఈ మాట చెప్పి చూడండి.


నాయకత్వం కొందరికి సాకు. కొందరికి దోపిడీ. కొందరికి–అతి తక్కువమందికి–అవకాశం. సేవ. అందుకే మోదీ గర్వంగా ‘‘నేను మీ చౌకీదారుని’’ అని చెప్పుకోగలిగాడు. నేను ప్రధాని గురించి మాట్లాడడం లేదు. సోంభాయ్‌ చెప్పిన ప్రధాన చౌకీదారు గురించి చెప్తున్నాను. నా అభిమాని నన్ను మరొక్కసారి క్షమించాలి. మోదీకి జోహార్‌ !!!

భారతం కొన్ని ప్రశ్నలు:

 భారతకథ మనందరికీ తెలుసు.

భారతం నుండి కొన్ని ప్రశ్నలు:


1. సర్పయాగం చేసినవాడు?


2. అభిమన్యుని కొడుకు?


3. సూర్యుని రథసారథి?


4. గరుత్మంతుని తండ్రి?


5. వ్యాసుని తల్లిదండ్రులు?


6. శుక్రాచార్యుని అల్లుడు?


7. దుష్యంతుని తల్లిదండ్రులు?


8. భరతుని మరోపేరు?


9. భీష్ముని మరోపేరు?


10. పాండురాజు నాన్నమ్మ?


11. గాంధారి తండ్రి పేరు?


12. కుంతీదేవి అన్నయ్య?


13. వసుసేనుడు ఎవరు?


14. ద్రోణాచార్యుని గురువులు?


15. ఏకలవ్యుని తండ్రి పేరు?


16. కమలపాలిక ఎవరు?


17. యాజ్ఞసేని సోదరుడు?


18. ద్రౌపది, ధర్మరాజుల కొడుకు?


19. అర్జునుడి భార్య ఉలూచి తండ్రి?


20. అశ్వత్థామ తల్లి పేరు?​


 ప్రయత్నించి చూద్దాం. ఎంతవరకు సమాధానాలు రాబట్టగలమో

మొక్క నాటుదాం*

 🌱🌱🌱🌱🌱🌱🌱🌱

*ఈ వానా కాలం* 

*మొక్క నాటుదాం*

,🌱🌱🌱🌱🌱🌱🌱🌱

ఈ వానాకాలం లో పూల మొక్కలు, పండ్ల మొక్కలు ఖాళీ ప్రదేశాలలో నాటుదాం.

    ఖాళీ ప్రదేశాలలో పండ్ల మొక్కలు నాటుదాం.

నాటిన మొక్కను సంరక్షిద్దాం.

   కేవలం మెసేజ్ ఫార్వార్డ్ చేయడం కాకుండా ఒక పండ్ల మొక్క,పూల మొక్క నాటుతానన్న సంకల్పం చెప్పుకుని మాత్రమే ఫార్వర్డ్ చేద్దాం.

మీరు మీ మాట మీద నిలబడే ఉన్నత వ్యక్తిత్వం గల వారు.

*మీరు ఇతరులకు ఆదర్శం.*

*ఈ మంచి పనికి మీరే సరైన వారు.*

ఇంకెందుకు ఆలస్యం పూల మొక్క, పండ్ల మొక్క ఏదీ ఎక్కడ వేయాలో నిర్ణయించి ప్రతి రోజూ దాని ఎదుగుదలను గమనిస్తూ గుండెనిండా ఆనందం నింపుకోండి.....

🌱🌱🌱🌱🌱🌱🌱🌱

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

పెద్దల తిథులు

 🌹 *పెద్దల తిథులు ఏ కారణము చేతనో జరపలేక పోతే ఏమి చెయ్యాలి?* 🌹

(సేకరణ: పి.యల్.నరసింహాచార్య

దాసన్)

(25.6.21)


మంచి పనులకే ఆటంకాలు ఎక్కువ! అయినా జన్మ‌నిచ్చిన తల్లిదండ్రుల‌ పట్ల కర్తవ్యలోపము రాకూడదు.‌ స‌కల్పముండాలే కాని ఏ కారణమూ అడ్డము కాదు. వీలైతే ముగ్గురు సద్బ్రాహ్మణులు  భోక్తలుగా దొరకనప్పుడు ~ ఇప్పటి కరోనా ఇబ్బ‌దులవల్ల  ~ హిరణ్య శ్రాద్దా‌న్ని‌ చేయవచ్చును. దేవాలయములోని‌ అర్చకునికి చెప్పితే,  వారు మీతో మంత్రపూర్వకముగా తర్పణము చేయిస్తారు; మీకు తోచిన దక్షిణను తాంబూల సహితంగా ఇవ్వ వచ్చును. 


      ఇదే కాక *ఆమశ్రాద్దము* చేయవచ్చు‌ను. ఒక బ్రాహ్మణునికి కావలసిన *అపక్వ* పదార్థాలను ఇచ్చి అతను చెప్పిన విధముగా మీరు తర్పణాన్ని చేసి అతనికి దక్షిణతాంబూలాదులు ఇవ్వ వచ్చును.  బియ్యము, పప్పుది‌నుసులు,  పాలు, పెరుగు, కొ‌‌న్ని కాయగూరలను ఇచ్చి  వారీంటిలో తళిహ (వంట) చేయించుకుని  భోజనము చేయమని‌ చెప్పవచ్చును. దీన్ని ఆమ శ్రాద్దమని అంటారు. ఈ నాడున్న కరోనా వల్ల కొందరు బ్రాహ్మణులు వంటకు అవసరమైన పదార్థాలను తీసుకొనడానికి ఇష్టపడక పోవచ్చును. అలాంటప్పుడు ఇలా *హిరణ్య శ్రాద్దా‌న్ని*  జరిపించవచ్చును. ఇదే కాక మీ కులదైవానికి దేవాలయములో ఏదో ఒక ప్రసాదాన్ని చేయించి దాన్ని నైవేద్యముగా సమర్పించి పెద్దల గొత్రనామాలతో అర్చన‌‌ చేయించి ప్రసాదాన్ని, దక్షిణ తాంబూలను అర్చకునికి ఇచ్చి నమస్కరించాలి. ఈ పద్దతులను నిష్ట కల స్వాములు అందుబాటులో లేనప్పుడు మాత్రమే పాటించాలి సుమా!


*(శ్రీమతే రామానుజాయనమః)*

విస్తరాకులో అన్నం ఎలా వడ్డిస్తారు

 విస్తరాకులో అన్నం ఎలా వడ్డిస్తారు 


పైభాగంలో పండు కాయగూరల తాళింపులు 

కింద భాగంలో అన్నం చారు వంటివి 


ఎందుకు ఇలా అని తెలుసా 

ఏదో పెడుతున్నారు తినేస్తున్నాం ఆకలి తీరింది అనుకుంటున్నారా 


ఈరోజు ఆ కథేంటో తెలుసుకుందాం రండి 


రాముడు తన పదనాలుగేళ్ళ వనవాసం తరువాత సీత లక్ష్మణుడు సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడితో కలిసి అయోధ్యకు పయనమయ్యాడు 


రాజ్యం ఆశతో కాదు కానీ వనవాసం ముగిశాక రాకపోతే ప్రాణాలు వదిలేస్తానని భరతుడు చెప్పాడు 

భరతుడు చెప్పినంత పని చేస్తాడని రాముడు అయోధ్యకు బయలుదేరాడు 


వనవాసం మొదలెట్టినప్పుడు భరధ్వాజ ముని ఆశీర్వాదంతో మొదలుపెట్టారు ఇప్పుడు ముగిసాక ఆయన ఆశీర్వాదం తీసుకుని అయోధ్య కు వెళ్ళాలని రాముడు ఆశపడ్డాడు 


రాముడిని సీతమ్మతో కలిసి చూసిన భరధ్వాజ ముని ఆనందంతో పొంగిపోయి ఆరోజు తమ ఆతిథ్యం స్వీకరించి విందు ఆరగించాల్సిందిగా కోరారు 


ఆయన మాటకు ఎదురుచెప్పక ఒప్పుకున్నారు రామయ్య కానీ గుండెల్లో భరతుడి గురించి ఆలోచన 

అందుకు హనుమను పిలిచి భరతుడి దగ్గరకు వెళ్ళి మేము వస్తున్నాం అనే సమాచారాన్ని చేరవేయమని ఆజ్ఞాపించాడు రాముడు 


ముని అక్కడ వచ్చిన అందరికీ విందు ఏర్పాటు చేసి వారికందరికి విస్తరాకులు వేసి భోజనానికి సిద్ధం చేసారు 

హనుమంతుడు రాడనుకుని ఆయనను మరిచాడు 

కానీ విందు ఆరగించే సమయంలో హనుమంతుడు రావడంతో ఏం చేయాలో అర్థం కాకుండా ముని ఆలోచిస్తుంటే 


అప్పుడు రాముడు 

హనుమా నువ్వు నా ఎదురుగా కూర్చుని నా ఆకులోనే బోంచేయి 

పైభాగంలో హనుమా తినేటువంటి పండ్లు కాయగూరలు ఉంచండి 

కింద భాగంలో అన్నం చారు పెట్టండి అన్నారు 


ఆరోజు నుండి అదే ఆచారంగా ఇప్పటివరకు హిందువులంతా పాటిస్తున్నాం 


తండ్రీ మాట జవదాటని రామయ్య మాటను మనమూ జవదాటకుండా 


ఇప్పుడు తెలిసిందా ఆకులో భోజనం ఎలా వడ్డించాలో 


🌹నా హృదయం 🌹

Indian Health Tips.*

 *Some Ancient Indian Health Tips.*

••••••••••••••••••••



1. *Ajeerne Bhojanam Visham.*


If previously taken Lunch is not digested, taking Dinner will be equivalent to taking Poison. (We can certainly know and feel ourselves if the earlier food is digested. Hunger is one signal that the previous food is digested.)


2.  *Ardharogahari Nidhraa*


Proper Sleep cures half of your Diseases.


3. *Mudhgadhaali Gadhavyaali*


Of all the Pulses, Greengrams  are the best. It boosts Immunity. Other Pulses all have one or the other side effects.


4. *Bagnaasthi Sandhaanakaro Rasonaha*


Garlic even joins broken Bones.


5. *Athi Sarvathra Varjayeth*


Anything consumed in Excess, just because it tastes good, is not good for Health. Be moderate.


6. *Naasthimoolam Anoushadham*


There is No Vegetable that has no medicinal benefit to the body.


7. *Na Vaidhyaha Prabhuraayushaha*


No Doctor is Lord of our Longevity. Doctors have limitations.


8. *Chinthaa Vyaadhi Prakaashaya*


Worry aggravates ill health.


9. *Vyayaamascha Sanaihi Sanaihi*


Do any Exercise slowly. Speedy exercise is not good.


10. *Ajavath charvanam Kuryaath*


Chew your Food like a Goat. Never Swallow food in a hurry. Saliva aids first in digestion.


11. *Snaanam Naama Manahprasaadhanakaram Dhuswapna Vidhwasanam*


Bath removes Depression. It drives away Bad Dreams.


12. *Na Snaanam Aachareth Bhukthvaa*.


Never take Bath immediately after taking Food. Digestion is adversely affected.


13. *Naasthi Meghasamam Thoyam.*


No water matches Rainwater in purity.


14. *Ajeerne Bheshajam Vaari*


Indigestion can be addressed by taking plain water.


15. *Sarvathra Noothanam Sastham Sevakaanne Puraathanam.*


Always prefer things that are Fresh. Old Rice and Old Servant need to be replaced with new. (Here what it actually means in respect of Servant is: Change his Duties and not terminate.)


16. *Nithyam Sarvaa Rasaabhyaasaha.*


Take complete Food that has all tastes viz: Salt, Sweet, Bitter, Sour, Astringent and Pungent).


17. *Jataram Poorayedhardham Annahi*


Fill your Stomach half with Solids, a quarter with Water and rest leave it empty.


18. *Bhukthvopa Visathasthandraa*


Never sit idle after taking Food. Walk for at least half an hour.


19. *Kshuth Saadhuthaam Janayathi*


Hunger increases the taste of food. (In other words, eat only when hungry.)


20. *Chinthaa Jaraanaam Manushyaanaam*


Worrying speeds up ageing.


21. *Satham Vihaaya Bhokthavyam*


When it is time for food, keep even 100 jobs aside.


22. *Sarvaa Dharmeshu Madhyamaam*.


Choose always the middle path. Avoid going for extremes in anything.

Legal heir and Nominee

Is Legal heir and Nominee the same?


I wonder how many of us are aware of this legal twist.


Read on...


Will your Nominee get the money on your death ?


Did you think that your nominee is the person, who will get all the money legally from your Life Insurance Policy and Mutual funds investments ?

Ha! That is exactly what you think if you are not aware of the legal aspects.

We assume a lot of things which sounds like they are obvious, but are not true from the legal point of view.


Today, we all concentrate on nominations in financial products.


For whom are we earning ?

For whom are we investing ?


Who, do we want to leave all our wealth to, in case something happens to us ?


It might be your children, your spouse, parents, siblings etc., or just a subset of these.

You also might want to exclude some people from your list of beneficiaries!.

So you think you will nominate person X in your Insurance policy, and when you are dead and gone, all the money goes to person X and he/she becomes the sole owner ? You are wrong, dude !

It does not work that way.


Let us see how it actually does!


What is a Nominee ?


According to law, a nominee is a trustee, not the owner of the assets.

In other words, he is only a caretaker of your assets.


The nominee will only hold your money/asset as a trustee and will be legally bound to transfer it to the legal heirs.


For most investments, a legal heir is entitled to the deceased’s assets.


For instance, Section 39 of the Insurance Act says the appointed nominee will be paid, though he may not be the legal heir.

The nominee, in turn, is supposed to hold the proceeds in trust and the legal heir can claim the money.


A legal heir will be the one who is mentioned in the will.

However, if a will is not made, then the legal heirs of the assets are decided according to the succession laws, where the structure is predefined on who gets how much.


For example, if a man during his lifetime executes a will... In the will, he mentions his wife and children as legal heirs, then after his death, his wife and children are the legal owners of his assets.


It is essential that one needs to execute a will.

It is the ultimate source of truth and replaces the succession law.


Nominee can also be one of the legal heirs.


Important :

Mention the Full Name, Address, age, relationship to yourself of the nominee.

Do not write the nomination in favour of wife and children as a class.

Give their specific names and particulars existing at that moment.

If the nominee is a minor, appoint a person who is a major as an appointee giving his full name, age, address and relationship to the nominee.


Why is the concept of Nominee ?


So you might be wondering, if the nominee does not become the sole owner, why does such a concept of a nominee exist at all ?


It is pretty simple. When you die, you want to make sure that the Insurance company, Mutual fund or your Shares should at least get out of the companies and go to someone you trust, and who can further help, in process of passing it to your legal heirs.


Otherwise, if a person dies and has not nominated anyone, your legal heirs will have to go through the process of producing all kind of certificates like death certificates, proof of relation etc., not to mention that the whole process is really cumbersome! (For each legal entity! The insurance company, the mutual funds, for the shares, for the real estate..) .

So, to simplify, if a nominee exists, these hassles do not happen, since the company is bound to transfer all your money or assets to the nominee.

The company then goes out of scene & then, it is between nominee and legal heirs.


Example of Nomination :


Ajay was 58 years old who died recently in an accident. As his children were settled, he wanted to make sure that his wife is the sole owner of all the monetary assets. This includes his insurance policy and mutual funds. So during his lifetime, he nominated his wife as a nominee in his term insurance policy and mutual funds investments. However, after Ajay’s death things did not turn up the way he wanted. The reason being Ajay did not leave a will. Though his wife was the nominee in all his movable assets, as per the law, his wife, along with children, were the legal heirs and all of them had equal right to Ajay’s assets.


One simple step which could have saved the situation was that Ajay should have made a will which clearly stated that only his wife was entitled to get all the money and not his children.


Nomination in Life Insurance :


A policyholder can appoint multiple nominees and can also specify their shares in the policy proceeds. Nomination in life insurance has one limitation, as insurance policies are bought to secure your financial dependents, your first choice of nominee has to be your family members. In case you want to nominate a non-family member like a friend or third party, you will have to show/PROVE the insurance company that there is some insurable interest for the person. This happens because of a Clause called PRINCIPAL OF INSURABLE INTEREST in insurance. Note that provision of nomination in life insurance is related to Section 39 of the Insurance Act.


Note that as per LIC website –....


Nomination is a right conferred on the holder of a Policy of Life Assurance on his own life to appoint a person/s to receive policy moneys in the event of the policy becoming a claim by the assured’s death. The Nominee does not get any other benefit except to receive the policy moneys on the death of the Life Assured.

A nomination may be changed or cancelled by the life assured whenever he likes without the consent of the Nominee.


Make sure, you have a nominee for your policy for easy settlement of the claim, if you do not have any nominee mentioned in the policy, it can turn out to be a disaster for your dependents to get a claim.


Nomination in Mutual Funds :


In case of mutual funds, you can nominate up to three people, who can be registered at the time of purchasing the units. While filling in the application form, there is a provision to fill in the nomination details.


Even a minor can be a nominee, provided the guardian is specified in the nomination form.

You can also change nomination later by filling up a form which is available on the mutual fund company website.

Nomination in mutual funds is at folio level and all units in the folio will be transferred to the nominee(s). If an investor makes a further investment in the same folio, the nomination is applicable to the new units also.

A non-resident Indian can be a nominee, subject to the exchange control regulations in force from time to time.


Nomination in Shares :


Quiz for you...

Now you know what a Nominee means and who actually gets the money.

So if there is a husband H, with wife W and nephew N, and he has nominated his nephew N to be the nominee of his shares in demat account, who will have the legal right to own the shares after husband’s death ? If you answer is wife, you are wrong in this case!


In case of stocks, it does not work the usual way, if a will does not exist.


In the verdict, Justice Roshan Dalvi struck down a petition filed by Harsha Nitin Kokate, who was seeking permission to sell some shares held by her late husband.

The Court noted that as she was not the nominee, she had no ownership rights over the shares. Ms Kokate’s lawyer had argued that as she was the heir of her husband who had died intestate (without a will), she should have ownership rights of the shares, and be able to do anything with them as she wished.

In this case, Ms Kokate’s husband had nominated his nephew in favour of the shares. Justice Dalvi however noted that under the provisions of the Companies Act and the Depositories Act, Acts which govern the transfer of shares, the role of a nominee was different.


A reading of Section 109(A) of the Companies Act and 9.11 of the Depositories Act makes it abundantly clear that the intent of the nomination is to vest the property in the shares which includes the ownership rights there under in the nominee upon nomination validly made as per the procedure prescribed, as has been done in this case.


It means that if you have not written a will, anyone who has been nominated by you for your shares will be the ultimate owner of those stocks... The succession laws on inheritance will not be applicable... but, in case, you have made a will, that will be the source of truth.


Nomination in PPF :


Let me give you some shock first. If you have Rs 10 lakh in your public provident fund (PPF) account and you have not nominated anyone for your PPF account, your legal heirs will get maximum of Rs1 lakh only!

Yes, it is so important to have a nominee, now you get it .


You can nominate one or more persons as nominee in PPF. Form F can be used to change or cancel a nomination for PPF.

Also note that you cannot nominate anyone if you open an account for a minor.


Nomination in Saving/Current/FD/RD Account in Banks :


FD’s also come with nomination facility. While opening a new account, there is a column for nomination in the same form and you should fill it. You can nominate two persons with first and second option. Note that in case you have not done any nomination till now, you should request Form No DA-1 from your Bank which is used to assign a nominee in future. (Examples of ICICI Bank , HDFC Bank , Canara Bank) .

In the same way to change/cancel the nomination, you need to fill up Form no DA-2.


Read about Corporate Fixed Deposits :


As per a famous case, A Bench of Justices Aftab Alam and R M Lodha in an order said that the money lying deposited in the account of the original depositor should be distributed among the claimants in accordance with the Succession Act of the respective community and the nominee cannot claim any absolute right over it.

Section 45ZA(2)(Banking Regulation Act) merely put the nominee in the shoes of the depositor after his death and clothes him with the exclusive right to receive the money lying in the account. It gives him all the rights of the depositors so far as the depositors account is concerned. But, it by no stretch of imagination make the nominee the owner of the money lying in the account, the Bench observed.


CONCLUSION :


Now you know!

Taking Personal finance for granted can be fatal!!!!!


Just investing knowledge, is not enough to have a great financial life.

You also need to be well versed with basic legal aspects and make sure you carry out all due arrangement .


Nomination is one important aspect you should seriously consider, when checking for the financial products you have bought or plan to buy in future.


Mistakes in Personal Finance :


It’s important to make sure that your loved ones do not face legal issues and only say and think lovely thoughts about you when you are not around, rather than crib & grumble.


*Very Important message for all middle aged people*

గాడిద గుడ్డు, కంకర పీసు

 గాడిద గుడ్డు, కంకర పీసు - ఎలా వచ్చింది?


గాడిద గుడ్డురా నీకేం తెలీదు...

గాడిద గుడ్డేమీ కాదా!!! 


ఇలా తెలుగులో గాడిద గుడ్డు అని వాడటం అలవాటు అయ్యింది మనకు.


కానీ, ఇది అస్సలు తెలుగు నానుడి కాదు...

బ్రిటిష్ వాళ్ళు మనల్ని పాలించే రోజుల్లో, వాళ్ళు ప్రేయర్ చేస్తూ, ఇలా అనే వారంట...


GOD THE GOOD, CONQUER PEACE


వాళ్ళ భాషా, మనవాళ్ళకి అర్థం అవ్వక, నోరు కూడా తిరగక...GOD THE GOOD కాస్తా గాడిద గుడ్డు అయ్యింది, CONQUER PEACE కాస్తా కంకర పీసు అయ్యింది.


అది దీని వెనక రహస్యం.🤗🤗🤗

: *🙏మహర్షుల *9.ఉతథ్యమహర్షి

: *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*9.ఉతథ్యమహర్షి* 

బ్రహ్మదేవుడు మనస్సునుండి పుట్టిన మానసపుత్రులు అనబడే వారిలో మూడవవాడయిన అంగిరస మహర్షి కొడుకే మన ఉతథ్య మహర్షి .. అంగిరసుడికి పెద్దకొడుకన్నమాట . ఉతథ్య మహర్షి గొప్ప తపస్సంపన్నుడు . నెమ్మదయిన వాడు , తీర్థయాత్రలంటే చాలా ఇష్టమున్నవాడు . ఈయన భార్య పేరు మమత . వారికి సంతానం కలగగానే ఉతథ్యుడు తీర్ధయాత్రలకి వెళ్ళిపోయాడు . దేవతలు రాక్షసుల్ని ఓడించి వాళ్ళని కష్టాలు పెట్టడం మొదలు పెట్టారు . రాక్షసులు తమ గురువయిన శుక్రాచార్యుడికి విషయం చెప్పి రక్షించమన్నారు . శుక్రాచార్యుడు వాళ్ళ కష్టాలు తీర్చడానికి అస్త్రాలు , శస్త్రాలు తీసుకుని వస్తానని శివుణ్ణి గురించి తపస్సు చెయ్యడానికి వెళ్ళాడు . ఆ సమయంలో బృహస్పతి శుక్రాచార్యుడి రూపం ధరించి రాక్షసులందర్ని వశపరచుకున్నాడు . శుక్రాచార్యుడు వచ్చాక విషయం తెలుసుకుని బృహస్పతిని శపించాడు . ఒకసారి బృహస్పతి తన అన్న ఉతథ్య మహర్షి ఇంటికి వెళ్ళాడు . వదిన మమత అతన్ని ఆదరించి భోజనం పెట్టింది . బృహస్పతి శుక్రాచార్యుడి శాపం వల్ల ధర్మం , మంచితనం మర్చిపోయి వదినగారితో అనుచితంగా ప్రవర్తించాడు . అతని వల్ల ఒక కుమారుడు కలిగాడు మమతకి..


 కానీ అప్పటికే ఆమె కడుపులో వున్న బిడ్డ బృహస్పతి శాపం వల్ల గుడ్డివాడయ్యాడు . ఉతథ్య మహర్షి యాత్ర ముగించుకుని వచ్చి జరిగింది అంతా విన్నాడు . ఇదంతా శుక్ర చార్యుడి వల్లనే జరిగిందని చెప్పి మమతని ఓదార్చాడు . కొంతకాలం తర్వాత మాంధాత అనే చక్రవర్తి ఉతథ్య మహర్షికి శిష్యుడయి రాజనీతి గురించి తెలుసుకున్నాడు . దాని పేరే ' ఉతథ్యగీత ' . ' ఉతథ్య గీత ' రాజధర్మాన్ని బోధిస్తుంది . రాజధర్మం అంటే రాజు అనేవాడు ప్రజలతో ఎలా ఉండాలి , ధర్మాన్ని ఎలా నిలపాలి అని తెలియపరుస్తుంది . దాన్లో ఏముందో మనం కూడా తెలుసుకుందామా ..... రాజు ధర్మంగా ఉంటే ప్రజలు నిశ్చింతగా భయం లేకుండా బ్రతుకుతారు . ధర్మం వేదవిదుల వల్ల కలిగింది కాబట్టి రాజెప్పుడూ వేదవిదులను పూజించాలి . అసూయ దురభిమానం ఉంటే ఆ రాజు దగ్గర లక్ష్మీదేవి ఉండదు . నాలుగు వర్ణాల వాళ్ళు ఎవరి ధర్మం వాళ్ళు చేస్తున్నారా లేదా అని రాజు చూడాలి . శూద్రుడికి సేవ , వైశ్యుడికి కృషి , క్షత్రియుడికి దండనీతి , బ్రాహ్మణునికి బ్రహ్మచర్యం , తపస్సు చేయడం , నిజం పలకడం ధర్మాలు .

ప్రజలు దీనంగా వేడుకుంటున్నప్పుడు కూడా రాజుదగ్గర ఉండే ఉద్యోగులు కఠినంగానూ , ధనాశతోనూ ప్రవర్తించకూడదు . ఏ రాజ్యంలో ప్రజలు ధర్మంగా ఉంటారో ఆ రాజు కీర్తి నాలుగు దిక్కులా వినపడుతుంది . తప్పు చేసినది కొడుకయినా రాజు క్షమించకూడదు . సాధువులని పూజించడం , ఎప్పుడు నిజాన్నే మాట్లాడడం , భూదానాలు చెయ్యడం , అతిథులని గౌరవించడం లాంటివి రాజు చెయ్యాల్సిన ధర్మాలు . ధర్మాత్ముడైన రాజు ఇంద్రుడితో సమానం . ఇలాంటి రాజుని దేవతలు , ఋషులు , గంధర్వులు కూడ కీర్తిస్తారని మాంధాత మహారాజుకి ఎన్నో రాజధర్మాల్ని గురించి ఉతథ్య మహర్షి చెప్పాడు . అందుకే ఉతథ్య మహర్షి ధర్మోపదేశకుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు . 

                          *9.ఉతథ్యమహర్షి* 

*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*🙏

[5/24, 21:33] JAYANTI: *🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*

*10.ఉదంక మహర్షి.*

    ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు . గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు . ఆ కాలంలో గురువుగారికి సేవచేస్తూ విద్య నేర్చుకునేవారు . గురువుగారు శిష్యుడ్ని పిలిచి శిష్యా ! నీ చదువు అయిపోయింది . ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే చదువయిపోయినట్లే . అంతే గానీ , ఇప్పట్లో సర్టిఫికెట్లు లాంటివి ఏమిలేవు . చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ మహర్షి చెప్పలేదు . ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు . ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది . ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో ! నా బాల్యం , యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది . నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు . గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను . నీ ముసలితనం పోయేలా చేస్తాను . నాకూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను అన్నాడు . మరి గురువుగారి కూతుర్ని చేసుకోకూడదు కదా అని ఆలోచించకు నీ శరీరాన్ని మార్చినట్టే ఆమె శరీరాన్ని కూడా మార్చి పెళ్ళి చేస్తానని చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేశాడు గౌతమమహర్షి .

           మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా .... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు . గౌతమ మహర్షి నీ గురుభక్తే నాకు గురుదక్షిణ . ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు . ఉదంక మహర్షి ఊరుకోక గురువుగారి భార్యని అడిగాడు . ఆవిడ కూడ అదే చెప్పింది . కాని ఉదంకుడు ఏదో ఒకటి అడగమన్నాడు . అపుడు గురువుగారి భార్య మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి , అవి నాకు కావాలి అనడిగింది . ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు . ఆ రోజుల్లో రాజుకి ఒక శాపం ఉంది . రాక్షసుడిగా తిరుగుతూ మనిషి మాంసం తినమని . ఉదంకుడిని చూడగానే రా ! రా ! వచ్చావా .. ఇప్పుడే నిన్ను తినేస్తా అన్నాడు . ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు . అవి నా గురువుగారి భార్యకిచ్చి మళ్ళీ వస్తాను , అప్పుడు నన్ను తినెయ్యి అన్నాడు . సరే నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు ఇప్పిస్తానని భార్యకి చెప్పి కుండలాలు ఇప్పించాడు రాజు . ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని , ఇవి గురువుగారి భార్యకిచ్చి వస్తాను నన్ను తింటానన్నావు కదా ! అప్పుడు తిను అన్నాడు . అన్నమాట ప్రకారం తిరిగివచ్చిన ఉదంకుని చూసి రాక్షసుడి మనసు కరిగిపోయింది . స్వామీ ! “ నన్ను క్షమించు ” అన్నాడు . ఉదంక ముహర్షి ఆకసుడి వీపు నిమిరి పరవాలేదులే , అన్నాడు . ఉదంక మహర్షి చెయ్యి తగలగానే


రాక్షసుడికి రాజు రూపం వచ్చేసింది . మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు . భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి . ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు . రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు . ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు . ఏమయినా మహరులకి కోపం ఉండకూడదు కదా .... ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు . మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు . ఆ మూట క్రింద పడిపోయింది . ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు . అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టని తవ్వడం మొదలెట్టాడు . ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ! ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి . నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు . ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని సుళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు .


అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు . అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది . పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు . ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ , చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ , పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు . వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు . ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు . అయితే నువ్వు ఈ గుఱ్ఱం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు . ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి . తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది . ఉదంకుడికి గురువుగారి భార్య ఇచ్చిన గడువు ఆ రోజుతో అయిపోతుంది . అతడు బాధపడుంటే గుఱ్ఱం మీద ఉన్న ఆ దివ్య పురుషుడు ఈ గుర్రమెక్కి ఎక్కడికి వెళ్లాలో తల్చుకో అక్కడికి వెళ్ళిపోతావన్నాడు . ఉదంకుడు గుఱ్ఱం మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు . గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.


ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు , ఆరుగురు కుమారులు , తెలుపు , నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ ? అని అడిగాడు . గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు , ఆరుగురు కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు , ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా ! అది రాత్రి పగలు , ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం . ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం . ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి . ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నీ భార్యతో కలిసి వెళ్ళమన్నాడు . ఉదంక మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినా కూడ నాగరాజు తక్షకుడు చేసిన అవమానం మర్చిపోలేక జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు . అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు . ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు . శివుడు ప్రత్యక్షమై ఉదంకా ! నీకు ఏంకావాలో కోరుకో అన్నాడు . మన ఉదంకుడు డబ్బు కావాలి లేకపోతే మంత్రి పదవి కావాలి అని అడగలేదు . స్వామి ! నేను ఎప్పుడు ధర్మాన్ని విడవకుండా , నిజాన్నే మాట్లాడుతూ నీ మీద భక్తి కలిగి ఉండాలి అన్నాడు . శివుడు నువ్వు లోకం కోసం నుంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు  ఉదంకుణ్ణి .



ఆ కాలంలో మధుకైటభులు అనే రాక్షసుల వంశంలో ధుంధుడు అనే వాడు పుట్టాడు . వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని , గంధర్వుల్ని . , రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు . సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు . వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది . అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి . అందరూ చాలా భయపడున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు . బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు .


 ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు . ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామీ ! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ , పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగారు.


శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వరజ , తమోగుణాలు నావశంలో ఉంటాయి . మరుత్తులు , వసువులు అందరూ నాలోంచే పుట్టారు . ఓంకారంతో ఉన్న వేదాలు నేనే . నాలుగు ఆశ్రమాలు , అన్ని కర్మలు , అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి . మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే . బ్రహ్మ , విష్ణువు , ఈశ్వరుడు ఈ మూడూ నేనే . లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను . కౌరవులు అధర్మం గల పన్లే చేశారు , వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు . అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు . 


        *శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుమన్నాడు . నేనుండే ప్రదేశంలో నీళ్ళు లేక అందరూ బాధపడుతున్నారు . నీరు ఇమ్మని అడిగాడు ఉదంకుడు . బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు . ఆ మేఘాన్ని ' ఉదంకమేఘం ' అంటారు . ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు . ఉదంక మహర్షి మనం గురుభక్తితో , స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పన్లు చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.*

*10.ఉదంక మహర్షి.*


*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆహారపు ఏర్పాటు..*


1973 వేసవి సెలవులకు నేను కనిగిరి నుంచి మొగలిచెర్ల కు వచ్చేసాను..అప్పటికే ఆశ్రమ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది..ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది..ఆశ్రమ ప్రాంగణం లోనే బావి త్రవ్వడం..శ్రీ స్వామివారి కోసం ఒక వంటగది కూడా నిర్మించడం జరిగిపోయాయి..బావి త్రవ్వకం..అందులో జలధార గురించి ఇంతకుముందు శ్రీ స్వామివారి చరిత్రలో పాఠకులు చదువుకొని వున్నారు..


నేను మొగలిచెర్ల లో లేని రోజుల్లో శ్రీ స్వామివారికి ఆహారం తీసుకెళ్లి అందించే బాధ్యత మార్నేని లక్ష్మీ నరసింహం అనే అతను నాకంటే వయసులో కేవలం ఓ సంవత్సరం పెద్దవాడు నిర్వహించేవారు..ఈ లక్ష్మీనరసింహం అంటే మా తల్లిదండ్రులకు కూడా విపరీతమైన అభిమానం ఉండేది..అతనూ అంతే చనువుగా మసిలేవాడు.. ఒకరకంగా చెప్పాలంటే..మా ఇంట్లో మాతో పాటు లక్ష్మీ నరసింహం కూడా ఒకడు అన్న  భావన మా అందరిలో ఉండేది..


రోజూ క్రమం తప్పకుండా శ్రీ స్వామివారివద్దకు వెళ్లి మా అమ్మగారు ఇచ్చిన ఆహారాన్ని శ్రీ స్వామివారికి అందించి..శ్రీ స్వామివారు ఏదైనా కబురు చెపితే..దానిని తిరిగి చేరవేసేవాడు..శ్రీ స్వామివారికి కూడా లక్ష్మీ నరసింహం అంటే అవ్యాజ కరుణ ఉండేది.. ..శ్రీ స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి..ప్రస్తుతం ఈ లక్ష్మీ నరసింహం కందుకూరులో ఉంటున్నాడు..


ఒకరోజు యధావిధిగా నేను శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..శ్రీ స్వామివారు ఆశ్రమం లోపల తాను సాధన చేసే గదిలో వున్నారు..తలుపులు వేసి ఉన్నాయి..కొద్దిసేపు అక్కడే నిలబడ్డాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా బయటకు రాలేదు..మరి కొద్దిసేపు అక్కడే వేచి వుండి.. శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని ఎప్పుడొస్తారో తెలీక..తీసుకొచ్చిన ఆహారపు డబ్బా ను వంటగదిలో పెట్టి వచ్చేసాను..


ఇంటికొచ్చి ఆ మాటే చెప్పాను..అమ్మ కోప్పడింది.."ఆయనకు నువ్వు ఆ డబ్బా ఎక్కడ పెట్టింది తెలీదు కదా..ధ్యానం నుంచి లేచిన తరువాత నువ్వు రాలేదనుకొని పస్తు వుంటారేమో..కొంచెం సేపు అక్కడ వుండి రాలేక పోయావా?.." అని.నేనేమీ జవాబు చెప్పలేదు..ఇకనుంచి శ్రీ స్వామివారితో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను..


ఆ ప్రక్కరోజు నేను వెళ్లే సరికి శ్రీ స్వామివారు బావి వద్ద వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."నిన్న వచ్చి వెళ్ళావా?..నా కోసం చూసావా?..ఇకనుంచీ..నేను ధ్యానం లో వుంటే..నిన్నటి లాగే ఆ గదిలో పెట్టి వెళ్ళు.. ఇబ్బంది ఏమీ లేదు..అమ్మతో నా గురించి ఆందోళన పడొద్దని చెప్పు..ఒకవేళ నీకు ఇబ్బంది గా వుండి రాలేకపోయినా..నేను ఆ నాలుగు గింజలు ఇక్కడ ఉడకేసుకుంటాను.. మా తమ్ముడు పద్మయ్య నాకోసం బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టి పోతాడు.." అన్నారు..


నాకు ఆశ్చర్యం వేసింది.. అంతవరకు అమ్మ బాధపడ్డ విషయం నేను శ్రీ స్వామివారితో చెప్పలేదు..కానీ ఆ సంగతి ఆయనే ప్రస్తావించారు..నా వరకూ ఏదో ఒక పెద్ద భారం తప్పినట్లు అనిపించింది..నేను అన్నింటికీ సరే అన్నట్లుగా తలూపాను..


శ్రీ స్వామివారు నాతో మాట్లాడటం ముగించి..బావి లోకి బక్కెట్ వేసి నీరు తోడుకున్నారు..ఆ బక్కెట్ ను నూతి గట్టు మీద పెట్టి..తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకొని..బక్కెట్ ను రెండు చేతులతో పైకెత్తి..తన తలమీద ధారగా నీళ్లు పోసుకున్నారు..శ్రీ స్వామివారి తలమీద నీళ్లు పడగానే..తలమీద వదులుగా ముడివేసుకుని ఉన్న జుట్టు పాయలుగా విడిపోయి..శ్రీ స్వామివారి భుజాల క్రిందకు వచ్చింది..ఆ జుత్తునుంచి నీళ్లు ధారగా కారుతూ ఆ శరీరాన్ని తడుపుతున్నాయి..అలా దాదాపు పదిహేను నిమిషాల పాటు తీరుబడిగా స్నానం చేసారు.. 


నేను చూస్తూ ఉండిపోయాను..ఎందుకనో ఆ దృశ్యం నా మనసులో హత్తుకొనిపోయింది..ఏదో తెలియని అనుభూతి మనసంతా ఆవరించింది..శ్రీ స్వామివారిది ఆరడుగుల పైనే ఎత్తు గల దేహం..తెలుపు పసుపు వర్ణాలు కలిసిన మేని ఛాయ.. భుజాల క్రిందకు వ్రేలాడుతున్న జటాఝూటం లాంటి కేశాలు.. ఇప్పటికీ కూడా ఆనాడు శ్రీ స్వామివారు స్నానం చేసిన దృశ్యం నాకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది..


భగవంతుడు నాకు ప్రసాదించిన అత్యద్భుత దృశ్యాలలో ఇది ఒకటి..


మరో అనుభవంతో రేపు ...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

శివ శబ్ద శక్తిని ప్రకృతి

 శివ శబ్ద శక్తిని ప్రకృతి యని సృష్టి మూల జీవ లక్షణమని సులువుగా అవగాహన కలుగుటకు అనగా ఋక్కులవలన తెలియు కాంతిని తెలుపు ప్రయత్నమే రుద్ర ప్రశ్న. నమకం చమకంచైవ పురుష సూక్తంచ యద్విదుః మహాదేవంచ తత్తుల్యం తన్మేమనః శివ సంకల్ప మస్తు. నమకం చమకం చ ఏవం పురుషసూక్తమని అది వివరంగా తెలియుట విదు వేద లక్షణము. విదు క్షుణ్ణంగా శక్తిని గ్రహించుట విదు విద్వన్లక్షణము.విద్వాంసుల లక్షణము. తెలిసి దానినిలో లీనమగుట వేద నిర్వచనము. పురుష అనగా అగ్ని రూపమును చైతన్యము వలన కాంతి దాని పరిభ్రమణం,లక్ష

ణము తెలియుట.కాంతిని పదార్ధ రూపముగా మార్చు తత్వము. అగ్నియే సమస్త ప్రపంచ సృష్టికి మూలమని ప్రతీ వస్తు మూల ప్రకృతికి తత్వము శివ రూపంలో గల అగ్ని రూప శక్తి లక్షణము. దీనికి సోమ చంద్రుని ద్వారా సూర్యుని తెలియాలి. సోమ ప్రకృతి జీవ శక్తి, దీని మూల ప్రకృతి సూర్య శక్తి. సూర్య శక్తితో బీజ రూపం. బీజ మార్పు వలన పదార్ధ రూపము సోమ తత్వం. వీటికి ఉపాధి పదార్ధరూపమైన ఆశ్రయము భూమి. సృష్టికి తగు ప్రకృతి లక్షణము సమ పాళ్ళలో గల సూత్ర తత్వము భూమి. ఏదైనా ఎవరైనా భూమి పైనే పంచభూతాత్మకమైన ప్రకృతి వలననే ప్రకృతి తత్వాన్ని తెలియగలరు. యిలా తెలియుటయే విదు ఙ్ఞానము. యిదే మహా దేవ లక్షణము. మహా అనే శబ్దము వక్క శక్తికే తప్ప యితర పదార్ధ రూపమునకు లేదు. మహా అనే శబ్దం మామూలు వ్యక్తులు లేక సమూహమునకు అన్వయం కుదరదు. నమకం చమకం మంత్ర శక్తి పురుషసూక్తం లో వివరంగా అన్వయం జరిగినా ప్రకృతి దాని పరిణామ సూత్రములు తెలియవు. ప్రకృతి లక్షణము ద్వారానే అదియును పదార్ధ రూపమై రస లక్షణమై అనుభవించిన గానీ దాని గురించి యిది యని తెలియదు. దానినే వేదం తత్ సత్ యని ప్రతిపాదన. తత్ అనగా ఏదైతే తెలియబడినదో అది సత్ ఎల్లవేళలా పదార్ధ రూపముగా మార్పు చెందుతూ తెలియుచున్నది. దట్ తత్ వకటే  that  దట్ తెలిసినది సత్ అయినది. Sath శనికి రూపం. సత్ శని వలననే సమస్త జీవ లక్షణము. సూర్య శక్తిని తెలియుటకై శని ద్వారానే సమస్త పరిణామం చెందినదని తెలియుచున్నది.ప్రధమ పరిణామ క్రమంలో శని ఆవిర్భావం. నమకం చమకం మంత్రములయందు  గల శబ్ద లక్షణము గ్రహించుటయే సృష్టి ధర్మం వివరణ. యిది శని వలననే ఆది చైతన్యమునకు మూలం. సూర్య శక్తితో సమాన ప్రవృత్తి శనికి మాత్రమే కలదు. ఆ తరువాతనే మిగిలిన కాంతి తత్వం తెలిసినది. దీని సూత్రమును గమనించిన ౦ పూర్ణము విసర్గగా రెండు పూర్ణ ములుగా మారినది.అప్పుడు ఆ రెండింటి తత్వం తెలిసి వాటి రెండు కలిసి మెుదటి తత్వము తోగూడి మూడు తత్వములు గుణములుగా మూడు పూర్ణములుగా తెలిసినది.ప్రధమ తక్వం ౦ పూర్ణము సమాంతర ముగా రెండుగా మారి మూడవది కూడా అదియును మూడు గోళ తత్వములు గల కోణ ప్రకృతి త్రిమూర్య్త రూపకమైన గుణ తత్వమైనదని తెలియుచున్నది. 

దీనిని సవివరంగా రుద్ర మంత్రం తెలుపుతున్నది.గ్రహ నక్షత్ర మండలంలో శనికి యున్న ప్రాధాన్యత వేరు గ్రహములకు లేదు. యిది సూర్య సంబంధమైన ప్రకృతి చంద్ర శక్తికి శని వలననే అపరిమిత లక్షణము గల అజేయమైన ప్రకృతి గా ధర్మంగా వున్నదని మనకు ఖగోళ,జ్యోతిష విజ్ఞానము తెలుపుచున్నది. అదే ప్రకృతి ధర్మంగా తెలియుచున్నది.దీని నిర్ణయము కూడా సమాంతర రేఖలు పుష్యమి శ్రవణం మకర కర్కాటక తత్వము లుగా అనగా శని చంద్ర గ్రహ రాశి తకేవములుకు అధిపతులుగా శని చంద్రుల లక్షణములుకు మూలమైన శివ శివానీ లక్షణములుగా తెలియును. శని యనగా అమ్మ తత్వం అది విష్ణు తత్వం. వేంకటేశ తత్వం. అందుకే అటువంటి వేంకటేశ తత్వరూపంలో గల శివారాధన సగుణారాధ విధానమని తెలియుచున్నది. అదే మనకు జీవ లక్షణముగా ప్రకాశించుచున్నది. అనంతమైన ఙ్ఞానమును తెలుసుకుంటూనే వుందాం. ఆచరిస్తూనే వుందాం.

విష్ణు సహస్రనామం

 *విష్ణు సహస్రనామం విశిష్టత*


ఆర్ధిక ఇబ్బందులను దూరం చేయాలన్నా..

పిల్లలు మనమాట వినాలన్నా..(ఎంతవయసు వచ్చినా సరే) ఈ స్తోత్రం పఠించాల్సిందే..!


సమస్త మానవాళి ఉద్ధరింపబడడానికి వచ్చినది విష్ణు సహస్రనామము. 

ఇది అందరూ చేయవచ్చు. 

ఏదైనా కామ్యము కొరకు పారాయణగా చేసేవారు పూర్వోత్తర పీఠికలు చదవాలి. 


కాసేపు కూర్చొని విష్ణు సహస్రనామం చదువుకుందాం, 

భగవంతుని నామం చెప్పుకుంటాను అనుకునే వారికి అవి అవసరం లేదు. 


ఆనంద భారతీ తీర్థ స్వామిగా పిలువబడే మల్లాది దక్షిణామూర్తిగారు వారే ఈ విషయాన్ని తెలియజేశారు. 

నామము అందరూ చెప్పవచ్చు. 


మంత్రజపం చేసేవారు స్థాణువులాగా ఉండి చేయాలి. కానీ నామం మాత్రం అటూ ఇటూ తిరుగుతూ, నిలబడి, కూర్చొని, పనిచేసుకుంటూ చేయవచ్చు. 


స్వప్న, సుషుప్తులకు అధిదేవత పరమశివుడు. అందుకని రాత్రి నిద్రపోయేముందు మూడు మార్లు శివనామం చెప్పి పడుకోవాలి. 

జాగృతికి అధిదేవత శ్రీ మహావిష్ణువు. 

అందువల్ల ఉదయం లేస్తూనే శ్రీహరీ శ్రీహరీ శ్రీహరీ అంటూ లేవాలి. 


శాస్త్రంలో మంచంమీద పడుకొని ఏది చేయడాన్నీ అంగీకరించదు. 

విష్ణు సహస్రనామానికి ఆ నిబంధన లేదు. 

ఏకవస్త్రగా ఉన్న ద్రౌపదికి రక్షణ కల్పించింది శ్రీమహావిష్ణువు ప్రార్థన. 

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మంచంమీద ఔషధం కూడా సేవించకూడదు. 

గజేంద్ర మోక్షం ఉదయం లేవగానే ఎవరు భావన చేస్తారో దుస్స్వప్న ఫలితాలు తొలగిపోతాయి. 


కానీ మంచంమీద నుంచి లేస్తూనే విష్ణు సహస్రనామం చదవాలని ఉంటే చక్కగా చదువుకోవచ్చు. నిబంధనలు లేవు.

దుఃస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనమ్!

కాననే నారసింహం చ పావకే జల శాయినమ్!!


విష్ణు సహస్ర నామాన్ని ఎవరు పట్టుకుంటారో ఇహమునందు రక్షణ.

పరమునందు పరమేశ్వరుని చేరుకొనే మార్గము సుగమం అవుతుంది. 


శంకరులకు ఒకసారి సరస్వతీదేవి సాక్షాత్కరించి

కలి ఉద్ధతి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైన సహస్రనామ స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రమే. 

అది సంజీవనీ ఓషధి వంటిది. 

కాబట్టి నీవు దీనికి భాష్యం వ్రాయాలి. అని పలికింది. విష్ణు సహస్రనామానికి శంకరులు భాష్యం చెప్పారు. ఆతరువాత ఉత్తరభారతదేశంలో దానిని రామస్వామి వారు వ్రాశారు.


భీష్మాచార్యుల అనుశాసనమే విష్ణు సహస్ర 

నామ స్తోత్రం. 

ఆచార్యుడైన భీష్ముడు చెప్తుండగా ఆచార్యులకే ఆచార్యుడైన శ్రీకృష్ణు పరమాత్మ వింటూండగా వచ్చి, మరొక గురువైన శంకర భగవత్పాదులచే భాష్యాన్ని పొంది విష్ణు సహస్రనామం త్రివేణీ సంగమం అయింది. 


విష్ణు సహస్రనామం చదవడం అంటే పరమేశ్వరుని చేరుకొనే మార్గంలో ప్రయాణం చేయడం. 

భగవంతునికి సహస్ర నామాలతో పూజ చేయాలి. కుదరని పక్షంలో 108 నామాలతో చేయాలి. 

108 రక్షణ హేతువు. 

గురువుకు 116 పేర్లతో పూజ చేయాలి. 


లోకంలో ఏప్రాణియైనా 27 నక్షత్రములలో పుడుతుంది. 

ఒక్కొక్క దానికి నాలుగు పాదాలు. 27 X 4 = 108. 


పూజకు సమయంలేనప్పుడు..

కేశవ, 

మాధవ, 

నారాయణ, 

గోవింద, 

మధుసూదన, 

విష్ణు, 

త్రివిక్రమ. 

వామన, 

శ్రీధర, 

హృషీకేశ, 

పద్మనాభ, 

దామోదర 

అనే ఈ పన్నెండు నామాలతో చేస్తే పూర్తి అవుతుంది. 


అలా అని ఆలస్యంగా లేవమని కాదు. 

ఈనామాలు చెప్తూ విష్ణు భక్తులు ఊర్ధ్వపుండ్రములను ధరిస్తారు. 


(సేకరణ)

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*ఆహారపు ఏర్పాటు..*


1973 వేసవి సెలవులకు నేను కనిగిరి నుంచి మొగలిచెర్ల కు వచ్చేసాను..అప్పటికే ఆశ్రమ నిర్మాణం దాదాపుగా పూర్తికావొచ్చింది..ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతోంది..ఆశ్రమ ప్రాంగణం లోనే బావి త్రవ్వడం..శ్రీ స్వామివారి కోసం ఒక వంటగది కూడా నిర్మించడం జరిగిపోయాయి..బావి త్రవ్వకం..అందులో జలధార గురించి ఇంతకుముందు శ్రీ స్వామివారి చరిత్రలో పాఠకులు చదువుకొని వున్నారు..


నేను మొగలిచెర్ల లో లేని రోజుల్లో శ్రీ స్వామివారికి ఆహారం తీసుకెళ్లి అందించే బాధ్యత మార్నేని లక్ష్మీ నరసింహం అనే అతను నాకంటే వయసులో కేవలం ఓ సంవత్సరం పెద్దవాడు నిర్వహించేవారు..ఈ లక్ష్మీనరసింహం అంటే మా తల్లిదండ్రులకు కూడా విపరీతమైన అభిమానం ఉండేది..అతనూ అంతే చనువుగా మసిలేవాడు.. ఒకరకంగా చెప్పాలంటే..మా ఇంట్లో మాతో పాటు లక్ష్మీ నరసింహం కూడా ఒకడు అన్న  భావన మా అందరిలో ఉండేది..


రోజూ క్రమం తప్పకుండా శ్రీ స్వామివారివద్దకు వెళ్లి మా అమ్మగారు ఇచ్చిన ఆహారాన్ని శ్రీ స్వామివారికి అందించి..శ్రీ స్వామివారు ఏదైనా కబురు చెపితే..దానిని తిరిగి చేరవేసేవాడు..శ్రీ స్వామివారికి కూడా లక్ష్మీ నరసింహం అంటే అవ్యాజ కరుణ ఉండేది.. ..శ్రీ స్వామివారి సేవలో తరించిన ధన్యజీవి..ప్రస్తుతం ఈ లక్ష్మీ నరసింహం కందుకూరులో ఉంటున్నాడు..


ఒకరోజు యధావిధిగా నేను శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాను..శ్రీ స్వామివారు ఆశ్రమం లోపల తాను సాధన చేసే గదిలో వున్నారు..తలుపులు వేసి ఉన్నాయి..కొద్దిసేపు అక్కడే నిలబడ్డాను..శ్రీ స్వామివారు ధ్యానం లో ఉన్న కారణంగా బయటకు రాలేదు..మరి కొద్దిసేపు అక్కడే వేచి వుండి.. శ్రీ స్వామివారు ధ్యానం ముగించుకొని ఎప్పుడొస్తారో తెలీక..తీసుకొచ్చిన ఆహారపు డబ్బా ను వంటగదిలో పెట్టి వచ్చేసాను..


ఇంటికొచ్చి ఆ మాటే చెప్పాను..అమ్మ కోప్పడింది.."ఆయనకు నువ్వు ఆ డబ్బా ఎక్కడ పెట్టింది తెలీదు కదా..ధ్యానం నుంచి లేచిన తరువాత నువ్వు రాలేదనుకొని పస్తు వుంటారేమో..కొంచెం సేపు అక్కడ వుండి రాలేక పోయావా?.." అని.నేనేమీ జవాబు చెప్పలేదు..ఇకనుంచి శ్రీ స్వామివారితో మాట్లాడి ఏదో ఒక ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాను..


ఆ ప్రక్కరోజు నేను వెళ్లే సరికి శ్రీ స్వామివారు బావి వద్ద వున్నారు..నన్ను చూసి పలకరింపుగా నవ్వి.."నిన్న వచ్చి వెళ్ళావా?..నా కోసం చూసావా?..ఇకనుంచీ..నేను ధ్యానం లో వుంటే..నిన్నటి లాగే ఆ గదిలో పెట్టి వెళ్ళు.. ఇబ్బంది ఏమీ లేదు..అమ్మతో నా గురించి ఆందోళన పడొద్దని చెప్పు..ఒకవేళ నీకు ఇబ్బంది గా వుండి రాలేకపోయినా..నేను ఆ నాలుగు గింజలు ఇక్కడ ఉడకేసుకుంటాను.. మా తమ్ముడు పద్మయ్య నాకోసం బియ్యం తెచ్చి ఇక్కడ పెట్టి పోతాడు.." అన్నారు..


నాకు ఆశ్చర్యం వేసింది.. అంతవరకు అమ్మ బాధపడ్డ విషయం నేను శ్రీ స్వామివారితో చెప్పలేదు..కానీ ఆ సంగతి ఆయనే ప్రస్తావించారు..నా వరకూ ఏదో ఒక పెద్ద భారం తప్పినట్లు అనిపించింది..నేను అన్నింటికీ సరే అన్నట్లుగా తలూపాను..


శ్రీ స్వామివారు నాతో మాట్లాడటం ముగించి..బావి లోకి బక్కెట్ వేసి నీరు తోడుకున్నారు..ఆ బక్కెట్ ను నూతి గట్టు మీద పెట్టి..తూర్పు వైపు తిరిగి సూర్యుడికి నమస్కారం చేసుకొని..బక్కెట్ ను రెండు చేతులతో పైకెత్తి..తన తలమీద ధారగా నీళ్లు పోసుకున్నారు..శ్రీ స్వామివారి తలమీద నీళ్లు పడగానే..తలమీద వదులుగా ముడివేసుకుని ఉన్న జుట్టు పాయలుగా విడిపోయి..శ్రీ స్వామివారి భుజాల క్రిందకు వచ్చింది..ఆ జుత్తునుంచి నీళ్లు ధారగా కారుతూ ఆ శరీరాన్ని తడుపుతున్నాయి..అలా దాదాపు పదిహేను నిమిషాల పాటు తీరుబడిగా స్నానం చేసారు.. 


నేను చూస్తూ ఉండిపోయాను..ఎందుకనో ఆ దృశ్యం నా మనసులో హత్తుకొనిపోయింది..ఏదో తెలియని అనుభూతి మనసంతా ఆవరించింది..శ్రీ స్వామివారిది ఆరడుగుల పైనే ఎత్తు గల దేహం..తెలుపు పసుపు వర్ణాలు కలిసిన మేని ఛాయ.. భుజాల క్రిందకు వ్రేలాడుతున్న జటాఝూటం లాంటి కేశాలు.. ఇప్పటికీ కూడా ఆనాడు శ్రీ స్వామివారు స్నానం చేసిన దృశ్యం నాకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది..


భగవంతుడు నాకు ప్రసాదించిన అత్యద్భుత దృశ్యాలలో ఇది ఒకటి..


మరో అనుభవంతో రేపు ...


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా.. పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

అపూర్వమైన దర్శనం...

 🎻🌹🙏అత్యంత అపూర్వమైన దర్శనం...


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


మహా కాళీ, మహా లక్ష్మీ, మహా సరస్వతీ అమ్మవార్లు, ముగురమ్మలూ ఒకేచోట దర్శనమిచ్చే అద్భుతమైన క్షేత్రం


కొన్ని కోట్లజన్మల పుణ్యఫలం ఈ అపూర్వమైన దర్శనం


ముంబై లోని ఈ ఆలయంలో ముగురమ్మలూ కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం.సముద్రతీరంలో మహాలక్ష్మి వెలసివున్న ఆ ప్రాంతాన్ని కూడా 'మహాలక్ష్మి' పేరిటనే వ్యవహరించటం విశేషం


లక్ష్మీదేవి ఆలయమైనా, అక్కడ దేవి, కుడివైపున శ్రీమహాకాళి, ఎడమవైపున శ్రీమహా సరస్వతి కనిపిస్తారు


ఆ విధంగా మూడు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్న ఆ చల్లని తల్లి కొలువైవున్న మహాలక్ష్మి ఆలయ విశేషాలు


పురాతన దేవాలయాల్లో ముంబయి లోని మహాలక్ష్మి దేవాలయం ఒకటి. ఈ దేవాలయం ముంబయి నగరంలో బ్రీ చ్ క్యాండీలోని బి.దేశా య్ రోడ్‌లో నెలకొని ఉంది. అరేబియా సముద్రపు ఒడ్డున కొలువైవున్న మహాలక్ష్మి మాతను సందర్శించి ఆమె దీవెనలు పొందేందుకు లక్షలమంది భక్తులు వస్తుంటారు. అష్టైశ్వర్యాలను ఒసగే మహాతల్లిగా హిందువులు మహా లక్ష్మిని కొలుస్తారు


ఈ దేవాలయాన్ని ఒకసారి పరికించి చూస్తే... ఆలయ ప్రధాన ద్వారం అద్భుతంగా తాపడం చేయబడి వుంటుంది. లక్ష్మీమాతకు పూజలు చేసేందుకు పూలు, ఇతర పూజ సామగ్రి ఆలయ ప్రాంగ ణంలోని షాపులలో లభ్యమవుతాయి


స్వర్ణాభరణాలతో సంపదల తల్లిగా గోచరించే ఇక్కడి మహాలక్ష్మి రూపు హిందూ గృహాల్లో కనబడుతుంటుంది


సిరిసంపదలనొసగే ముంబయి మహాలక్ష్మికి భక్తకోటి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. దేవాలయం చరిత్ర గురించి చూసినప్పుడు... ఆలయానికి ప్రత్యేకమైన చరిత్ర వుంది


ఆసక్తి గొలిపే ఆలయ చరిత్ర

నాలుగు దశాబ్దాల క్రితం విదేశీయుల ఆక్రమణలకు వెరచిన స్థానికులు తమ దేవతలను కాపాడుకోగలిగిన వారు కాపాడుకున్నారు. కుదరనివారు, ఆయా దేవతలను సగౌరవంగా సముద్రం పాలు చేశారు. అలా సమద్రగర్భం లోకి చేరిన కొన్ని విగ్రహాలు కాలాంతరాన కొట్టుకువచ్చి, మళ్లీ జనం చేత పూజలందున్న గాథలూ వున్నాయి. సరిగ్గా అలాంటి చరిత్ర గల ఆలయాల్లో ఒకటి శ్రీమహాలక్ష్మి ఆలయం


1775 ప్రాంతాల్లో ముంబయి ప్రాంతంలోని

ఏడు ద్వీపాలనూ బ్రిటిష్‌వారు పోర్చుగీసువారికి అప్పజెప్ప వలసివచ్చింది


సప్తద్వీపనగరంగా బొంబాయిని ఏకంగా తీర్చాలని లార్డ్ హాననీ అనే బ్రిటిష్ అధికారి ప్రయత్నిం చాడు. ఎంత శ్రమించినా, సముద్రతరంగాల ధాటికి ఆగలేక పనులన్నీ పాడయ్యేవిట


అందరికీ ఆశ్చర్యమూ, ఆందోళనా కలుగుతున్న తరుణంలో, కాంట్రాక్టర్ రామ్‌జీ శివాజీప్రభుకు, స్వప్నంలో శ్రీదేవి దర్శనమిచ్చి,

తన విగ్రహం సముద్రంలో నిక్షిప్తమై వుందనీ,

దాన్ని ముందు జలంలోంచి బయటికి తీస్తే పనులు నిరాటంకంగా సాగుతాయనీ చెప్పిందట.

ఆ సంగతి అతను పై అధికారులకు చెబితే, నిజానిజాలు పరీక్షించగోరిన వారు, సముద్రంలో వెతకసాగారు


ఎంత వెతికినా విగ్రహం కానరాలేదు.

వారి పనులూ ప్రారంభం కావటం, ఆగి పోవటం జరుగుతూనేవున్నాయి. చివరికి కొందరు నావి కులు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లినప్పుడు, మహా భయంకరంగా వర్షం ప్రారంభమైంది


ఆ వర్షంలోనే కృష్ణ మోరే అనే నావికునికి,

దేవి మూడు శిరస్సులతో దర్శనమి చ్చింది.


అందరూ తమ ప్రాణాలు కాపాడమని ప్రార్థించిన మీదట, కృష్ణమోరే వేసిన వలలో మూడు విగ్రహాలు లభించాయి. తరువాత ఆంగ్లేయులు ఆ దేవీవిగ్రహాలను ప్రతిష్ఠాపించి, ఆలయ నిర్మాణం చేయించారు


మంగళ వారాల్లో ఈ తల్లికి విశేషంగా పూజలు జరుగుతాయి. నవ దంపతులు ఈ దేవి ఆశీస్సుల కోసం వస్తుంటారు. ముంబయిలోని మహమ్మదీయులకు సైతం, ఈ దేవి పట్ల భక్తిప్రపత్తులు వుండటం మరో విశేషం


ఆలయంలో మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి విగ్రహాలున్నాయి. మూడు విగ్రహాలకు ముక్కు పుడకలతోపాటు, బంగారు గాజులు వజ్ర వైఢూర్యాలతో తయారుచేసిన నగలు వున్నాయి. ముగ్గురమ్మలను చూసిన భక్తులు భక్తి సాగరంలో మునిగిపోవాల్సిందే. ఎవరైతే త్రికరణశుద్ధితో అమ్మవార్లను పూజిస్తారో వారి కోర్కెలు తప్పక నెరవేరతాయని చెప్పబడింది. అమ్మవారిని వీక్షించేందుకు భక్తులు బారులు తీరి వుంటారు. సమయం ఎంతైనా... లక్ష్మీమాతను దర్శించి పూజలొనర్చిన తర్వాతే భక్తులు తిరుగుముఖం పడతారు


ఎలా వెళ్లాలి

వాణిజ్య కేంద్రమైన ముంబయికు అన్ని ప్రధాన పట్టణాల నుంచి రైలు, రోడ్డు మార్గాలున్నాయి. ముంబయి చేరుకున్నవారు స్థానిక బస్సులలో ప్రయాణించి అమ్మవారిని దర్శించుకోవచ్చు. ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో వుంటాయి. ఈ టాక్సీలు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, విమానాశ్రయాలనుంచి కూడా వుంటాయి


ఓం శ్రీ మాత్రే నమః

ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే

ఓం శ్రీ సరస్వత్యై నమః..🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸