21, ఏప్రిల్ 2021, బుధవారం

బాపు గారి అమ్మాయిని.

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

బాపు రమణులను అమితంగా ప్రేమించే మిత్రులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.


“సీతాకల్యాణం చూసిన ఆంగ్లేయులు ‘రాముడు నీలంగా ఎందుకు ఉన్నాడు’ అని బాపుని అడిగేరు – ఆకాశం నీలంగా ఉంటుంది. అది అనంతం, ఆకాశంలాగే దేవుడూ అనంతమే. రాముడు దేముడు గనుక ఆయన ఆకాశంలా నీలంగా ఉన్నాడని బాపు గారు బదులిచ్చారు.”

---సౌజన్యం-: స్వాతి సచిత్ర మాస పత్రిక *


నన్ను చాలా మంది అడిగారు, " ఆ ఇంట్లో పుట్టిన పిల్లగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారూ?" అని. నా జవాబు ఎప్పుడూ ఒక్కటే - "అందరి నాన్నల్లాగే నాకూనూ," అని. 

మమ్మల్ని మామూలుగానే పెంచారు. But we were always surrounded by music, books, రామాయణం, భారతం కథలు. 

మామ ఇంట్లో నాకు దొరికిన రెండు గొప్ప కానుకలు శ్రీరాముడు, గోదావరి. చిన్నప్పటి నించి వాటి గురించి వినీ, వినీ _ నా రక్తంలో ఇంకిపోయాయి. కొత్తనీరుతో గోదావరి - కార్తీక మాసంలో దీపాలతో వెలిగే గోదావరి - వెన్నెల్లో గోదావరి రామనామం సరే సరి. 

వాళ్ళ అమ్మగారు, అక్కగారు, తమ్ముడు - వాళ్ళ కుటుంబం, చుట్టాలూ, పక్కాలూ - ఇల్లంటే ఇలాగే ఉంటుంది అని మా ఉద్దేశ్యం. ఏది చేసినా ఇప్పటికీ కలిసే చేస్తాం, కష్టం, సుఖం, ఏడుపు, నవ్వు - అన్నీ కలిసే పంచుకుంటాం. అలానే ఉండాలి అని నేర్పించారు మాకు. 

ఎమోషనల్ గా అయిపోకుండా, నన్ను ప్రభావితం చేసిన మామ డైలాగ్స్ కొన్ని - మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మామ సినిమాలు ఎన్ని సార్లు చూశానో! నేను పెద్దవుతున్న కొద్దీ - కొన్ని కొన్ని డైలాగ్స్ హఠాత్తుగా అర్ధం అయిపోయి, " కదా?" అనిపిస్తాయి. 

మచ్చుకి కొన్ని:

4 మురగ పెట్టుకున్న పాలు విరుగునన్నాడోయ్ - పంచుకున్న పాలు మంచి పెంచునన్నాడోయ్. 

4  జీవితంలో దొరికిన బొమ్మలు నచ్చవు. నచ్చిన బొమ్మలు దొరకవు. 

4 ఒక్కొక్కప్పుడు, పుట్టెడు డబ్బు పట్టెడు అన్నం కూడా పెట్టదు. 

4  వర్షపు బొట్టు - నీటిలో పడితే కలిసిపోతుంది. ఇసుకలో పడితే ఇంకిపోతుంది. అదే ముత్యపు చిప్పలో పడ్తే, ముత్యమై ప్రకాశిస్తుంది. 

4 ఇంకొల్లు నిన్ను చూసి కన్నుకుట్టే లాగా ఉండాలి కానీ అయ్యో అని అనిపించుకోకు. 

4 సిఫార్సులతో కాపురాలు చక్కపడవు. 

4  అందరిలోనూ గోరంత దీపం ఉంటుంది. దాని పేరే ఆశ. కష్టాలు కారు చీకట్లలాగా ముసురుతూంటే, ఆ గోరంత దీపమే కొండంత వెలుగౌతుంది. 


ఈ సినిమాలు చూసి నా ఆలోచనల్నీ నా perception నీ మార్చుకున్నాను. ఈ డైలాగులు కేవలం సినిమా కోసం రాసినవి కావు. ఆయన నమ్మిన జీవిత సత్యాలు. 

నాన్న - మామలది "never say die" తత్వం. నాకు ఊహ తెలిసినప్పటి నించీ - నాన్న అంటే - కొన్నేళ్ళు కుర్చీలో కూర్చుని - దాని చేతుల మీద డ్రాయింగ్ బోర్డ్ పెట్టుకుని - 100% ఏకాగ్రతతో బొమ్మలు వేసే రూపం. మధ్యమధ్యలో - నేల మీదే - చేతినే దిండుగా పెట్టుకుని పది నిమిషాలు పడుకునే రూపం, ఇవే మెదులుతాయి. 

మామకి - తన మీదా, తన రాముడి మీదా ఎంత నమ్మకమంటే - మొన్న - ఈ మధ్యనే, " ఎందుకు మామా - "కోతి కొమ్మచ్చి," ఆపేశావు? ఏదో అన్నం పెడుతోంది కదా?" అన్నాను. దానికి ఆయన, " జనం ఆపేయి మొర్రో అని అనుకునే దాకా తెచ్చుకోకుండా - ఎందుకు ఆపేశావు? అని అనుకున్నప్పుడే ఆపేయడం మంచిది. ఇది వస్తుంది అని అనుకున్నానా? వచ్చింది. అలాగే ఆ రాముడు ఇంకోటి ఇస్తాడు నాకు పని వస్తుంది." అన్నారు. 

చిన్నప్పటినించీ ఇదే attitude. ఆయన 80వ ఏట కూడా అంత నమ్మకంతోనూ, ధైర్యంతోనూ అన్న మాటలు - నన్ను ఆశ్చర్యపరుస్తాయి. 

" ఎవరైనా తాతగారు అని పిలిస్తే - నేనూ, మీ నాన్న వెనక్కి తిరిగి చూస్తాము - ఎవర్ని పిలిచారా - ఇక్కడ తాతగారు ఎవరా అని ." అని హాయిగా నవ్వేసే మామ - miss you. Miss you very very much.

---- * భానుమతి. నేను బాపు గారి అమ్మాయిని. *

సేకరణ: శ్రీనివాస రావు కర్రి

సీతావిరహంలోవసంతం

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

సీతావిరహంలోవసంతం

-రామునివేదన!

                   విశ్వనాధ!


చ:-

పూవుల వింటి జోదు మఱి పూర్వపు మాదిరి కాదు క్లిష్టమౌ

త్రోవలు చూచి లొద్దుగల దుమ్ములు కన్నులఁ జల్లుఁ తంగెడుం

బూవుల నిండు గుత్తులయి పొల్చెడు కారపు టుండలన్ గనుల్

క్రేవల గొట్టు వట్టి యప కీర్తి గడించె అయోధ మార్గుడై { వి. రా. క.వృ. కి. నూపుర. 16 }


శ్రీరామునకు సీతా విరహం ఎంత దుస్సహంగావుందో ఈ రాముని వచనం మనకు తెలుపుతుంది.


మన్మధుడు పూర్వము వలె కాదు. శత్రువును జయించడానికి అతడిప్పుడు క్లిష్టమైన మార్గాల నెన్నుకొని లొద్దుగు పూల పరాగాన్ని కన్నుల్లో జల్లుతున్నాడు. అంతే కాదు తంగేడు పూల గుత్తులు అనే కారపుటుండల్ని కన్నుల్లో కొట్టుతున్నాడు. అధర్మ యుద్ధం చేస్తూ గొప్ప అయోధ మార్గుడైనాడు.{ ఏ విధంగాను దొరకని మోసగాడు }


కావ్య రస సంబంధి. రసము ఎచ్చట ఉండును? శబ్దార్థముల లోనా? అలంకారముల లొనా? కాదు. కావ్యమును పఠించు సహృదయుని యందు ఉండును. సహృదయుడనగా ఎవడు? కావ్యము చదువువారందరు సహృదయులు కాదా? నిశ్చయముగా కాదు. ఎవడు ఇతరుల యొక్క కష్ట సుఖముల యందు తాదాత్మ్యమును పొంది తనవిగా భావించి, అనుభూతి పొందునో వాడు సహృదయుడు. ఇతరుల కష్టమునకు హృదయము కరుగగా కన్నీరు పెట్టుకొను వాడు సహృదయుడు. అది అందరకు సాధ్య మగు విషయము కాదు. అచ్చమగు మనస్సు కలవారికే అట్టి భావనలు ఉదయించును. వాడు లోకమున వెఱ్ఱిబాగుల వాడు అనుకొందము. కావ్య లోకమునకు వాడే అధికారి. అట్టి సహృదయునిపై ఈ కావ్య జగత్తు ఆధార పడి యున్నది.


కావ్య గతమైన విప్రలంభ శృంగారమును కవి ఎంతగా సమర్ధముగ నిర్వహించు చుండెనో పాఠకుడు తెలుసుకొనినచో అది యొక ఆనందము.


అట్టి సందర్భములలో సంస్కృత వాఙ్మయమున మరియు ముఖ్యముగా ఆంధ్ర ప్రబంధముల యందు నాయికా నాయకుల విరహ స్థితులను గొప్ప చమత్కారముగా వర్ణించిరి.


ఈ ఘట్టమున శ్రీమద్రామాయణమున వాల్మీకి యిట్లు వర్ణించెను.

మన్మథాయాస సంభూతో వసంత గుణ వర్ధితః.

అయం మాం ధక్ష్యతి క్షిప్రం సోకాగ్నిర్న చిరాదివ.


మన్మధ బాధ వలన పుట్టిన యీ శోకాగ్ని వసంత గుణముల చేత పూర్తిగా కాల్చివేయుచున్నదోయీ.


చిశ్వనాధ వాల్మీకి భావమును తిరిగి చెప్పక పూర్తిగా యీ ఘట్టమును క్రొంగ్రొత్త భావములతో నిర్వహించినాడు. మహాకవి ప్రతిభా వ్యుత్పత్తులకు యీ ఘట్ట మొక నిదర్శనముగా నిలిచినది.


పద్యంలో అయోధ మార్గుడై అను పదము సీతను తాను లేని సమయములో పర్ణ శాలకు వచ్చి దొంగిలించుకొని పోయిన మోసకారి అయిన రావణాసురుని స్ఫురింపజేయు చున్నది.


*రసజ్ఙభారతి సౌజన్యంతో-*

*సత్యనారాయణ చొప్పకట్ల.*

_త్రివిధ త్యాగాలు

 🌹🌹🌹🌷🌷🌹🌹🌹

*_త్రివిధ త్యాగాలు - అంటే ఏమిటి? - వాటిని ఎలా ఆచరించాలి ?_*

            🌷🌷🌷

సర్వ జీవకోటి లో ఏదో ఒక కర్మ చెయ్యకుండా ఏ ప్రాణీ ఉండలేదు.

మంచి పనులు చేస్తే కీర్తి ప్రతిష్టలు, స్వర్గసుఖాలు, పుణ్యఫలాలు వస్తాయి...


చెడ్డపనులు చేస్తే సంఘంలో చెడ్డపేరు, నరకయాతనలు, పాపఫలాలు వస్తాయి, ఇది అందరికీ తెలిసిందే...


ఇలా పాపపుణ్యాలు చేస్తూ, స్వర్గనరకాలనుభవిస్తూ, మరల మరల జన్మలెత్తుతూ ఈ జనన మరణ సంసారచక్రంలో ఉండిపోవలసిందేనా? 

లేక మోక్షం పొందడం ఉందా? 

అని మనం విచారించడం సహజం, _మనలోని ఈ విచారాన్ని దూరం చేయడానికే గీతలో శ్రీకృష్ణ భగవానుడు చక్కని మార్గం చూపాడు._


*యత్కరోషి, యదశ్నాసి, యజ్జుహోషి దదాసియత్*

*యత్తపస్యసి, కౌంతేయ! తత్కురుష్వమదర్పణమ్*


" అర్జునా! నువ్వేపని చేసినా, ఏమి తిన్నా, ఏ హోమం చేసినా, అదంతా నాకు సమర్పించు.

*అయితే ఈ సలహా పాటిస్తే - మనకు వచ్చే లాభం ఏమిటి?*


_ఇలా చేస్తే, మనం మూడు త్యాగాలు చేసినట్లవుతుంది._


★ *మొదటిది కర్తృత్వ త్యాగం:*


                  ఈ పని నేనే చేస్తున్నాను లేదా చేయిస్తున్నాననే అహంకారం వదలాలి. 

ఏ కర్మయినా ఆ భగవంతుడే చేయిస్తున్నాడని భావించాలి. 

ఏం చేసినా భగవత్పరంగా చెయ్యాలి, ఇలా చేస్తే, మనం పాపపు పనులు చేయడానికి జంకుతాము...

కర్మసాక్షి అయిన భగవానుణ్ణి తలుచుకుంటూ సదా సత్కర్యాలకు పూనుకుంటాము.


★ *రెండవది ఫలత్యాగం:*


               ఏం చేసినా ఇది నా కర్తవ్యం అని చెయ్యాలి, అంతేగాని ఇది చేస్తే నాకీ ఫలం వస్తుంది అని కోరికతో చెయ్యవద్దు. 

నేనేం చేసినా దాని ఫలం భగవానుడిదే అన్నీ భగవత్ కైంకర్య రూపాలే అని నమ్మాలి...


★ *మూడోది సంగత్యాగం:*


              ఇది నాది, ఇది నేనే చెయ్యాలి, అంతా నా ఇష్టప్రకారం జరగాలి. 

ఇది నా ఆనందం కోసం అని బంధం పెంచుకోవద్దు. 

అంతా భగవన్ముఖ వికాసం కోసం, ఆయన ఆనందమే, నాఆనందం అని మనస్పూర్తిగా అనుకోవాలి...


*సరే! అంతా బాగానే ఉంది మరి - ఈ త్రివిధ త్యాగాలు ఎలా చేయాలి?*


ఏ పనిచేసినా, ఒక్క నమస్కారం పెట్టి, ఒక్క మాట చెపితే చాలు...


*ఏమిటండీ ఆ బంగారాల మాట?*

                   అదే 

*🙏 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏*


పై త్రివిధ త్యాగలను త్రికరణ శుద్ధిగా అవలంబిస్తూ, ఇంకొక్క మాటను కూడా జోడించాలి.అది...


🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

*సత్యనారాయణ చొప్పకట్ల గారి పోస్టు.*

అత్యద్భుతంగా ఉంది

 🙏ఎవరు రాశారో తెలియదు కానీ  అత్యద్భుతంగా ఉంది - ఒక్కసారి పూర్తిగా చదవండి🙏 


ఇంగ్లీషు వాడు వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు కానీ అంతవరకూ రాముడు మనవెంట నడిచిన దేవుడు.


మనం విలువల్లో, వ్యక్తిత్వంలో పడిపోకుండా నిటారుగా నిలబెట్టిన - *ఆదర్శ పురుషుడు*


మనకు మనం పరీక్ష పెట్టుకుని ఎలా ఉన్నామో చూసుకోవాల్సిన అద్దం - *రాముడు*


ధర్మం పోత పోస్తే రాముడు

ఆదర్శాలు రూపుకడితే - *రాముడు*


అందం పోగుపోస్తే- *రాముడు*


ఆనందం నడిస్తే- *రాముడు*


వేదోపనిషత్తులకు అర్థం- *రాముడు*


మంత్రమూర్తి - *రాముడు*


పరబ్రహ్మం - *రాముడు*


లోకం కోసం దేవుడే దిగివచ్చి మనిషిగా పుట్టినవాడు - *రాముడు*


ఎప్పటి త్రేతయుగ రాముడు?

ఎన్ని యుగాలు దొర్లిపోయాయి?


అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగడుగునా *రాముడే!*


చిన్నప్పుడు మనకు స్నానం చేయించగానే అమ్మ నీళ్లను సంప్రోక్షించి చెప్పినమాట -

*శ్రీరామరక్ష సర్వజగద్రక్ష*


బొజ్జలో ఇంత పాలుపోసి ఉయ్యాలలో పడుకోబెట్టిన వెంటనే పాడిన పాట -

*రామాలాలీ - మేఘశ్యామా లాలీ*


మన ఇంటి గుమ్మం పైన వెలిగే మంత్రాక్షరాలు - *శ్రీరామ రక్ష - సర్వజగద్రక్ష*


మంచో చెడో ఏదో ఒకటి జరగగానే అనాల్సిన మాట - *అయ్యో రామా!*


వినకూడని మాట వింటే అనాల్సిన మాట - *రామ రామ*


భరించలేని కష్టానికి పర్యాయపదం - *రాముడి కష్టం*


తండ్రి మాట జవదాటనివాడిని పొగడాలంటే - *రాముడు!*


కష్టం గట్టెక్కే తారక మంత్రం -

*శ్రీరామ!*


విష్ణు సహస్రం చెప్పే తీరిక లేకపోతే అనాల్సిన మాట - *శ్రీరామ శ్రీరామ శ్రీరామ*


అన్నం దొరక్కపోతే అనాల్సిన మాట - *అన్నమో రామచంద్రా!*


వయసుడిగిన వేళ అనాల్సిన మాట - *కృష్ణా రామా!*


తిరుగులేని మాటకు - *రామబాణం*


సకల సుఖశాంతులకు - *రామరాజ్యం*


ఆదర్శమయిన పాలనకు - *రాముడి పాలన*


ఆజానుబాహుడి పోలికకు - *రాముడు*


అన్ని ప్రాణులను సమంగా చూసేవాడు - *రాముడు*


*రాముడు ఎప్పుడూ మంచి బాలుడే*


చివరకు ఇంగ్లీషు వ్యాకరణంలో కూడా -


*Rama killed Ravana;*


*Ravana was Killed by Rama*


ఆదర్శ దాంపత్యానికి -  *సీతారాములు*


గొప్ప కొడుకు - *రాముడు*


అన్నదమ్ముల అనుబంధానికి - *రామలక్ష్మణులు*


గొప్ప విద్యార్ధి - *రాముడు*

(వసిష్ఠ , విశ్వామిత్రులు చెప్పారు).


మంచి మిత్రుడు - *రాముడు*

(గుహుడు చెప్పాడు).


మంచి స్వామి - *రాముడు*

(హనుమ చెప్పారు).


సంగీత సారం - *రాముడు*

(రామదాసు, త్యాగయ్య చెప్పారు) 


నాలుకమీదుగా తాగాల్సిన నామామృతం రామనామం

*పిబరే రామరసం* -

సదాశివ బ్రహ్మేంద్ర యోగి చెప్పారు)


కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం - *రాముడు*


నోరున్నందుకు పలకాల్సిన నామం - *రాముడు*


చెవులున్నందుకు వినాల్సిన కథ - *రాముడు*


చేతులున్నందుకు మొక్కాల్సిన దేవుడు - *రాముడు*


జన్మ తరించడానికి - *రాముడు, రాముడు, రాముడు.*


రామాయణం పలుకుబళ్లు


మనం గమనించంగానీ , భారతీయ భాషలన్నిటిలో రామాయణం ప్రతిధ్వనిస్తూ , ప్రతిఫలిస్తూ, ప్రతిబింబిస్తూ ఉంటుంది.


తెలుగులో కూడా అంతే.


ఎంత వివరంగా చెప్పినా అర్థం కాకపోతే - రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకు రాముడేమవుతాడని

అడిగినట్లే ఉంటుంది ...


చెప్పడానికి వీలుకాకపోతే -

*అబ్బో అదొక రామాయణం*


జవదాటడానికి వీల్లేని ఆదేశం అయితే- *సుగ్రీవాజ్ఞ, లక్ష్మణరేఖ*


ఎంతమంది ఎక్కినా ఇంకా చోటు మిగిలితే -

*పుష్పకవిమానం*


కబళించే చేతులు, చేష్టలు

*కబంధ హస్తాలు*


వికారంగా ఉంటే - *శూర్పణఖ*


చూసిరమ్మంటే కాల్చి రావడం - *హనుమ.*


పెద్ద పెద్ద అడుగులు వేస్తే -

*అంగదుడి అంగలు.*


మెలకువలేని నిద్ర

*కుంభకర్ణ నిద్ర*


పెద్ద ఇల్లు - *లంకంత ఇల్లు*


ఎంగిలిచేసి పెడితే - *శబరి*


ఆడవారి గురించి అసలు ఆలోచనలే లేకపోతే - *ఋష్యశృంగుడు*


అల్లరి మూకలకు నిలయం-

*కిష్కింధ కాండ*


విషమ పరీక్షలన్నీ మనకు రోజూ - *అగ్ని పరీక్షలే*


పితూరీలు చెప్పేవారందరూ -

*మంథరలే.*


సాయం చేసినపుడు- *ఉడుతా భక్తి.*


కార్యాన్ని సాధించినపుడు - *హనుమ యుక్తి..*


 గొడవకు దిగే వాళ్ళ పేరు - *లంకిణి*


యుద్ధమంటే *రామ రావణ యుద్ధమే*


ఎప్పటికీ రగులుతూ ఉండేవన్నీ - *రావణ కాష్టాలే*


కొడితే *బుర్ర రామకీర్తన పాడుతుంది*

(ఇది విచిత్రమయిన ప్రయోగం)


*రాముడు సాక్షాత్తు ధర్మానికి ప్రతీక! అందుకే - రామో విగ్రహవాన్ ధర్మః* 🙏


సీతారాములు తిరగని ఊళ్ళు తెలుగునేల మీద ఉండనే ఉండవు. బహుశా ఒక ఊళ్లో తిండి తిని ఉంటారు. ఇంకో ఊళ్లో పడుకుని ఉంటారు. ఒక ఊళ్లో బట్టలు ఉతుక్కుని ఉంటారు. ఇంకో ఊళ్లో నీళ్లు తాగి ఉంటారు.


ఒంటిమిట్టది ఒక కథ!

భద్రాద్రిది ఒక కథ!

అసలు రామాయణమే మన కథ!

అది రాస్తే రామాయణం!

చెబితే మహా భారతం!


అందుకే కీ.శే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అన్నారు: *హిందుయిజమ్ ఒక మతం కాదు ... అది ఒక జీవన విధానం!*


అందుకే ఇప్పటి South Asian దేశాలు ఇస్లాం, బౌద్ధమతాలను ఆచరించినా వారి దైనందిక జీవన విధానాల్లో రామాయణం ఎంతగా పెనవేసుకు పోయిందో ఇప్పటికీ మనం చూడొచ్చు.


రామాయణకథలు మనకంటే చక్కగా Muslim majority దేశమైన ఇండోనేషియాలో ప్రదర్శిస్తారంటే రామాయణ విశిష్టత వేరుగా చెప్పనక్కర్లేదు.


*జై శ్రీ రామ్.....*


*శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే||*


*సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||*


*ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమేకాదు, భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.*


*అందరికీ తెలియజేసేందుకు దయచేసి షేర్ చేయండి.*


*#సంభవామి_యుగే_యుగే*


*జై శ్రీరామ్*

*జై హనుమాన్*

అస్త్రాలన్నీ మిస్సైల్సే

 మహాభారత యుద్ధం లో అస్త్రాలన్నీ మిస్సైల్సే


18 రోజులు జరిగిన మహాభారత యుద్ధంలో మొత్తం 18 అక్షౌహిణిల సైన్యం పాల్గొంది. అసలు అక్షౌహిణి అంటే ఎంత?ఒక రథము, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, అయిదుగురు కాల్బంబులు (పదాతి దళం) కలిసిన సైన్యానికి ‘పత్తి' అని పేరు. అనగా 1:1:3:5 నిష్పత్తిలో ఉంటుంది సేన. దీనికి మూడు రెట్లయిన సైన్యాన్ని ‘సేనాముఖము' అంటారు. మూడు రథాలు, మూడు ఏనుగులు, తొమ్మిది గుర్రాలు, పదిహేను మంది కాల్బలము ఇందులో ఉంటారు. సేనాముఖానికి మూడు రెట్లును ‘గుల్మము' అంటారు. ఇందులో తొమ్మిది రథాలు, తొమ్మిది ఏనుగులు, 27 గుర్రాలు, 45 మంది కాలిబంట్లు వుంటారు. గుల్మానికి మూడు రెట్లు ‘గణము' ఇందులో 27 రథాలు, 27 ఏనుగులు, 81 గుర్రాలు, 135 మంది కాలిబంట్లుంటారు. గణానికి మూడు రెట్లు ‘వాహిని'. ఇందులో 81 రథాలు, 81 ఏనుగులు, 432 గుర్రాలు, 405 మంది కాలిబంట్లు వుంటారు. వాహినికి మూడు రెట్లు ‘పౄతన' అంటే 243 రథాలు, 243 ఏనుగులు, 729 గుర్రాలు, 1215 మంది కాలిబంట్లు. పౄతనకు మూడు రెట్లు ‘చమువు' ఇందులో 729 రథాలు, 729 ఏనుగులు, 2187 గుర్రాలు, 3645 మంది కాలిబంట్లుంటారు.చముకు మూడు రెట్లు ‘అనీకిని'. ఇందులో 2187 రథాలు, 2187 ఏనుగులు, 6561 గుర్రాలు, 10925 మంది కాలిబంట్లు వుంటారు. అనీకినికి పది రెట్లయితే ‘అక్షౌహిణి' అవుతుంది. అంటే అక్షౌహినిలో 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 గుర్రాలు, 1,09,350 మంది కాల్బలము వుంటారు. ఇటువంటి అక్షౌహిణులు 18 కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. అంటే 3,93,660 రథాలు, 3,93,660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 19,88,330 కాల్బలము అన్నమాట. ఇక్కడ మరో విషయాన్ని తెలియజేయాలి. ఒక్కొక్క రథం మీద ఒక యుద్ధ వీరునితో పాటు ఒక సారథి కూడా వుంటాడు. కాబట్టి సారథులను కూడా లెక్కలోకి తీసుకోవాలి. అప్పుడు రథబలం 7,87,320 అవుతుంది. అలాగే గజబలంలో కూడా ఒక్కొక్క ఏనుగు మీదయుద్ధ వీరునితో పాటు ఒక మావటీ వాడు కూడా వుంటాడు. కాబట్టి గజబలం కూడా 7,87,329 అవుతుంది. వీటన్నింటిని కలిపితే కురుక్షేత్ర యుద్ధంలో 47,23,920 మంది పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఈ 18 అక్షౌహిణుల్లో పాండవ బలం మాత్రం 7 అక్షౌహిణులు, కౌరవ బలం 11 అక్షౌహిణిలు.


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహాభీకర యుద్ధానికి దారితీశాయి. దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?


దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయో గించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు? అత్యంత ఆసక్తికరమైన ఈ అంశాలపై ప్రత్యేక కథనమిది...


హరివంశం చారిత్రాత్మక గ్రంథం. చారిత్రాత్మకంగా ఏ సంఘటన ఎప్పుడు జరిగిందో ఇదమిద్ధంగా తెలియచెప్పేదే చరిత్ర. చారిత్రాత్మక సంఘటనలకు రుజువులు లభ్యమవుతాయి. కుణాలుడు రాసిన మాగధ (మగధరాజ్య) చరిత్ర, కల్హణుడు రాసిన రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి రచనలు ఆయా రాజుల జనన మరణాల గురించి తేదీలతో సహా విశదంగా వివరించబడ్డాయి. ఇందులో వాదోపవాదాలకు తావులేదు. అలాగే శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాసిన హరివంశం కూడా రాజతరంగిణి లాంటి చారిత్రాత్మక గ్రంథమే. 16,374 శ్లోకాలు వున్న ఈ గ్రంథంలో సూర్యవంశపు రాజుల చరిత్ర చంద్రవంశపు రాజుల చరిత్రలో వున్నాయి.

క్రీ.పూ. 7536 సంవత్సరంలో శ్రీకృష్ణ ద్వైపాయనుడు హరివంశం రాసినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. హరప్పా మొహంజదారో నాగరికతకన్నా దాదాపు మూడువేల సంవత్సరాల క్రితం హరివంశం రాసినట్లు తెలుస్తోంది. వ్యాస పీఠానికి ఆద్యుడు శ్రీకృష్ణ ద్వైపాయనుడని అంటారు. హరివంశ చరిత్రలో సరస్వతీనదిని గురించిన ప్రస్తావన వుంది. ఎటొచ్చీ హరివంశం ఒక చారిత్రాత్మక గ్రంథం. క్రీ.పూ. 22 డిసెంబర్‌ 5561న ఉత్తరాయణంలో భీష్ముడు ప్రాణత్యాగం చేసినట్లు వ్యాసుడు రాశాడు. హరివంశం శ్రీకృష్ణ ద్వైపాయనుడు రాయటం ప్రారంభించిన తర్వాత ఆ హరివంశ చరిత్రలో వ్యాసపీఠాధిపతులు చారిత్రాత్మక సంఘటనలను నమోదు చేస్తూ వచ్చారు.


మహాభారత యుద్ధ కాలం


దీని ప్రకారం భీష్ముడు 58 రాత్రులు అంపశయ్యపై శయనించి జీవించాడని తెలుస్తుంది. భీష్ముడు సైన్యాధిపతిగా పదిరోజులు యుద్ధం చేశాడు. పదోరోజు సాయంత్రం శిఖండితో యుద్ధం చేయాల్సిన పరిస్థితిలో అస్త్ర సన్యాసం చేశాడు. అంటే 68 రోజుల పూర్వం మహాభారత యుద్ధం ప్రారంభమైందన్నమాట. 22 డిసెంబర్‌ 5561లో భీష్ముడు ప్రాణత్యాగం చేశాడు గనక మహాభారత యుద్ధం సరిగ్గా క్రీ.పూ. 16.09.5561న ప్రారంభమైంది. 18 రోజులు జరిగిన ఈ అత్యంత భీకరమైన యుద్ధంలో 92 లక్షలమంది మరణించినట్లు హరివంశంలో వుంది. మహాభారత యుద్ధ చరిత్రలో సైతం దాదాపు ఈ సంఖ్యనే (89 వేలు) నమోదు చేశారు.

దాదాపు ఒక కోటిమంది మరణించిన మహాభారత యుద్ధాన్ని చాలామంది చరిత్రకారులు మొదటి ప్రపంచ యుద్ధంగా భావిస్తారు. కోల వేంకట చలపతి రాసిన మహాభారత యుద్ధకాలం అనే గ్రంథంలో ఈ యుద్ధం అత్యంత భీకరంగా జరిగినట్లు వర్ణించారు. ధనస్సుతో బాణాలను ఉపయోగించి జరిగిన ఈ యుద్ధంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి గల కారణాలేమై వుండవచ్చు?

దాదాపు 7వేల సంవత్సరాల క్రితం జరిగిన ఈ మహాభారత భీకర సమరంలో భయానకమైన రసాయనిక అస్త్రాలు వినియోగించారని చరిత్రకారులు భావిస్తున్నారు. బాణాలను మాత్రమే ఉపయోగించి వుంటే ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు మరణించి వుండేవారు కాదని ఎవరైనా ఊహించవచ్చు. అయితే రసాయనిక అస్త్రాలు ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం 7వేల సంవత్సరాల క్రితం కౌరవ పాండవులకు ఎలా లభించి వుండవచ్చు?


భారతదేశంలో అర్జునుని మనుమడైన పరీక్షిత్తు కాలం వరకూ నారదుడు భూలోకంలో సంచరించినట్లు భాగవతంలో వుంది. ఈ నారదుడు 372 కాంతి సంవత్సరాల దూరంలో ఎబ్సులా అనే నక్షత్ర మండలంలోని బర్హోస్‌ అనే గ్రహానికి చెందినవాడుగా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. కాంతికన్నా వేగంగా ప్రయాణించే సాంకేతిక పరిజ్ఞానం వుండేదనీ సిరియాలోని పురావస్తు శాస్త్రజ్ఞుల పరిశోధనలో తేలింది.

అస్త్ర శస్త్ర తయారీలో వీరు నిపుణులు. వివిధరకాలైన అస్త్రాలు (మిస్సైల్స్‌) వైవిధ్యమైన ధనుస్సులు (లాంచర్స్‌) పరిజ్ఞానం శ్రీకృష్ణుని సహకారంతో పాండవులకు లభించినట్లుగా తెలుస్తోంది. ఖాండవ దహనం సందర్భంలో అగ్నిదేవుడు శ్రీకృష్ణునికి అర్జునునికి ఇచ్చిన సుదర్శనచక్రం గాండీవం (లాంచర్‌) అక్షయ బాణ తూణీరాలు (మిస్సైల్స్‌) రసాయనికి ఆయుధాలుగానే పరిగణిస్తున్నారు. ఖాండవ దహనం సందర్భంగా అర్జునునికి ఇంద్రునికీ జరిగిన యుద్ధం ఒకరకంగా స్టార్‌వార్‌గానే భావించవచ్చు. దాదాపు 3వేల ఎకరాల్లోని ఖాండవ వనం యావత్తూ ఈ రసాయనిక అస్త్రాల వినియోగం వల్ల కాలి బూడిదైపోయింది.

ఈ అస్త్రాలను వినియోగించేందుకు పాస్‌వర్డ్‌లాంటి టెలిపతిక్‌ అక్షరాలను (మంత్రాలను) ఉచ్ఛ రించేవారని కొందరు పరిశోధకులు విశ్లేషి స్తున్నా రసాయనిక అస్త్రాలను ట్రిగ్గర్‌లాంటి ఒక పరికరాన్ని వొత్తిడికి గురిచేసి భయానక విస్ఫోటం కలిగించేవారని మరికొందరు విశ్లేషిస్తున్నారు.

మహాభారత యుద్ధంలో రిమోట్‌ కంట్రోల్‌తో పాస్‌వర్డ్‌ను గ్రహించి విస్ఫోటనం కలిగించేవారని కూడా కొందరు శాస్త్రజ్ఞులు ఊహిస్తున్నారు.


రిమోట్‌ ద్వారా అస్త్రాల ప్రయోగం


మహాభారత యుద్ధంలో అస్త్రాలు మహా భీకర యుద్ధానికి దారి తీశాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం శ్రీకృష్ణునికీ భీష్ముడికీ అర్జునునికి కర్ణుడికీ అభిమన్యుడులాంటి 36 మంది మహారధులకు మాత్రమే వుండేదని భావిస్తున్నారు. .

జిపిఎస్‌ పరిజ్ఞానం మహాభారత యుద్ధంలో వారికి వుంది అనడంలొఆశ్చర్యంలేదు. 7వేల సంవత్సరాల క్రితమే రసాయన ఆయుధాలను తయారుచేయగల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారికి జిపిఎస్‌ అడ్వాన్స్‌డ్‌ జ్ఞాన సంపత్తి తెలిసి వుండడంలో ఆశ్చర్యంలేదు. .

ప్రతి అస్త్రాన్ని ఉపయోగించ దలచుకొన్నా ఆ అస్త్రం కోడ్‌ నెంబరూ తనకు కేటాయించిన పాస్‌వర్డ్‌(మంత్రం) ఉచ్ఛరించి నంత మాత్రాన టెలీపతీ ద్వారా గ్రహాంతర సాంకేతిక యుద్ధ నిపుణునికి క్షణాల్లో చేరటంతో రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా ఆ అస్త్రం (మిస్సైల్‌) శత్రువులను నాశనం చేయగలిగేదని ఊహిస్తున్నారు. ఇలాంటి ఊహ నిజం అనుకోవడానికి గల మౌలిక కారణం ఈ మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది మూకుమ్మడిగా హతం కావడమే!


అయితే కొన్ని సాధారణ అస్త్రాలు (మిస్సైల్స్‌) వినియోగించే నైపుణ్యం యుద్ధం చేసే వాడికే వుండేది. కొన్ని అస్త్రాలకు ఐపీ అడ్రసులు సైతం వుండి వుండవచ్చని జర్మనీకి చెందిన కొల్విన్‌ హెచ్చర్‌ అంటు న్నారు. మహాభారత యుద్ధం జరిగిన విధానంపై హెచ్చర్‌ 22 సంవత్సరాల క్రితమే పరిశోధన చేసి పి.హెచ్‌.డి. పట్టా పొందాడు. అయితే ఈ అస్త్రాలన్నీ (మిస్సైల్స్‌) ప్రస్తుతం ఉపయోగిస్తున్న శాస్త్ర పరిజ్ఞానానికన్నా భిన్నంగా వుండే అవకాశాలు వున్నాయి.


మహాభారత యుద్ధంలో ఉపయోగిం చిన శస్త్రాల్లోనుంచి భయానక గామా కిరణాలు సైతం వెలువడి వుండవచ్చు. ఈ గామా కిరణాలకు శత్రువు శరీరాన్ని తుత్తునియలు చేసే అవకాశం వుంది. ధృతరాష్ట్రునికి సంజయుడు మహాభారత యుద్ధం గురించి ప్రత్యక్షంగా వివరిస్తూ కౌరవుల తరఫున, పాండవుల తరఫున చాలామంది యోధులు తుత్తునియలై పడిపోతున్నారని చెపుతాడు. మహాభారత యుద్ధంలో అస్త్రాలను ఎదుటివాడిపై ప్రయోగించడానికి మాత్రమేకాక స్వీయ రక్షణకు సైతం వినియోగించినట్లు వ్యాస మహాభారతంలో వుంది.

ఆధునిక సాంకేతిక యుద్ధ అస్త్రాల్లో టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం (మిస్సైల్‌) వుంది. శత్రువు ప్రయోగించిన వందలాది అస్త్రాలను ఈ టెస్లాషీల్డ్‌ అనే అస్త్రం నిర్వీర్యం చేస్తుంది. అంటే ఈ అస్త్రం స్వీయ రక్షణకన్నమాట. ఇలాంటి అస్త్రాలు సైతం మహాభారతంలో వినియోగించబడ్డాయి. అర్జునుడు మహాభారత యుద్ధం జరిగిన తొలి రెండు రోజులూ శత్రువు ప్రయోగిం చిన అస్త్రాలనన్నింటినీ నిర్వీర్యం చేశాడని వ్యాసుడు రాశాడు. నిర్వీర్యం అంటే ఈ అస్త్రం నుంచి వెలువడే అత్యంత శక్తి శత్రువు ఉపయోగించిన అస్త్రాన్ని తాకి వెంటనే ఆవిరి చేస్తుంది. మహాభారత యుద్ధంలో కోటికి పైగా యోధులు మరణించారంటే ఈ యుద్ధం మహాభీకరమైన అస్త్ర శస్త్రాలతో కొనసాగిందనే చెప్పాలి.


18 రోజుల్లోనే ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం సామాన్య యుద్ధంలో జరిగే పనికాదు. సామ్రాట్‌ అశోకుడు చేసిన కళింగయుద్ధంలో 16వేల మందే మరణించారని చరిత్రకారులు రాశారు. మహాభారత యుద్ధంలో చాలా భయానకమైన న్యూక్లియర్‌ ఆయుధాలను వినియోగించి వుండాలని శాస్త్రజ్ఞులు అనుమానిస్తున్నారు.

ప్రతిరోజూ మూకుమ్మడి మరణాలు సంభవించి వుండాలి. మొహంజిదారో నాగరికత ఒకే ఒక్క రోజులో నాశనం అయి వుండవచ్చని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు. నాగసాకిపై ప్రయోగించిన అణుబాంబు విస్ఫోటం లాంటిదే మొహం జదారో నగరంలో జరిగి వుండవచ్చన్నది శాస్త్రజ్ఞుల అనుమానం.

క్రీస్తుకు పూర్వం భూమిపైని మానవుల్లో ఇంతటి సాంకేతిక పరిజ్ఞానం వున్నట్లు ఇటలీకి చెందిన మిలన్‌ అనే పరిశోధకుడు 1979లో తను రాసిన 'అటామిక్‌ డిస్ట్రక్సన్‌ ఇన్‌ 3000 బి.సి' అనే పుస్తకంలో పేర్కొన్నాడు. కురుక్షేత్రంలోని 50 గజాల విస్తీర్ణంలో ఎపి సెంటర్‌ (భూకంపన కేంద్రం) వున్నట్టు కనుగొన్నారు. ఆ 50 గజాల విస్తీర్ణంలో చాలా లోహాలు కరిగి శిలాజాలై కనపడ్డాయి. వీటిపై పరిశోధనలు జరిపితే ఇవి దాదాపు 3000 బి.సి. కాలం నాటివని తేలింది. రోమ్‌కు చెందిన ప్రొఫెసర్‌ అంటోనియో క్యాస్టెల్లానీ కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన తర్వాత ఒక వ్యాసం రాస్తూ అక్కడ ప్రాణాలు కోల్పోయినవారి శరీరాల్లోని ఎముకల శకలాలను పరిశీలించిన తర్వాత ఆ మరణాలు అణుయుద్ధం వల్ల సంభవించినవిగానే నిర్ధారించారు.


అస్త్రాల వివరాలు


మహాభారతంలోని మౌసుల పర్వంలో మహాభారత యుద్ధంలో వినియోగించిన అస్త్రాల గురించిన వివరాలు వున్నాయి. అతి వేగంతో ప్రయాణించే విమానాల్లో విశ్వాన్ని సైతం నాశనం చేయగల అణుబాంబులు వున్నాయని రాశారు. పది సూర్యులు ప్రసరించగల వేడిని పుట్టించే అస్త్రాలు వున్నాయని వుంది. ఒకేసారి వేయిమందిని భస్మం చేసే అస్త్రాలను వినియోగించారని పేర్కొన్నారు. వెంట్రు కలు, గోళ్ళు లాంటి వాటితోసహా దగ్ధం చేయగల మారణాస్త్రాలు వుండేవి. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజులు వందల కిలోమీటర్ల దూరంలోని పక్షులు సైతం ప్రాణాలు కోల్పోయాయి. యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సైతం సూక్ష్మక్రిములకు నిలయంగా మారాయి. వేలాదిమంది సైనికులు పారిపోయి నదీనదాల్లో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకొన్నారు.

మహాభారతంలో బ్రహ్మాస్త్రాన్ని ఎవరూ ప్రయోగించలేదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల భూమి యావత్తూ నాశనం కావడమేకాక సముద్రాలు సైతం ఎడారులుగా మారతాయి. మహాభారత యుద్ధం ఒక చారిత్రక సత్యం. శ్రీకృష్ణుని ఆధ్వర్యంలో జరిగిన ఈ యుద్ధంలో ఆయన తన యుద్ధ నైపుణ్యం కన్నా వ్యూహాత్మకంగా యుద్ధం నడిపించగలిగాడు.


శ్రీకృష్ణుడు దైవాంశ సంభూతుడు. అంతటి భీకర యుద్ధంలో తాను ఎలాంటి అస్త్ర్రాన్ని ప్రయోగించకుండా పాండకులకు విజయం సాధించి పెట్టి కౌరవులను భూమిపై లేకుండా చేయగలిగాడు.


కాపీ పోస్టు

రామునికి పదహారు లక్షణాలు

 వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి? 1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్య పరిపాలకుడు 6. ధ్రుఢవ్రతుదు 7. ఉత్తమ చరిత్ర కలవాడు 8. సర్వ భూతముల హితము కోరేవాడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అసూయ లేనివాడు 16. ఈ సృష్టిలో తనను తాను గెలిచినవాడు.

ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు.

శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని గుణాలలో మన వద్ద లేని వాటిని సంపాదించుకోవడమే లక్ష్యంగా సంకల్పం తీసుకుని ముందుకు నడుద్దాం. ఇంటిల్లిపాదికి శ్రీరామనవమి శుభాకాంక్షలు.

భార్యాభర్తల బంధంలో

 దాంపత్యం ఒక శాశ్వతబంధం. కానీ ఆ బంధంలో చాలాచోట్ల పగుళ్ళు కనిపిస్తున్నాయి. భార్యతో భర్త, భర్తతో భార్య సర్దుకుపోలేని పరిస్థితులు ఎక్కువౌతున్నాయి. ఇటీవల కోర్టుల్లో అత్యధికంగా వస్తున్నవి విడాకుల కేసులే. ప్రేమించి పెళ్ళాడిన వారు కూడా అనతికాలంలోనే విడాకులకోసం ముందుకు వస్తున్నారు.

పటిష్టంగా ఉండవలసిన భార్యాభర్తల బంధంలో ఈ చీలిక ఏమిటి? ప్రధానంగా ఈ బంధం గొప్పతనం తెలియకపోవడమే దీనికి కారణం.

ఒకరిలో ఒకరికి నచ్చనివి తారసపడడం సహజమే. అన్నివిధాలా ఏ వ్యక్తీ మరొక వ్యక్తిని తృప్తిపరచలేడు. కానీ ’ప్రేమ’ అనే మౌలికాంశం ఉన్నప్పుడు క్షమ, సర్దుబాటు ఉంటాయి. ఒకరు కొన్నింటిలో రాజీపడితే, ఇంకొకరు మరికొన్నిటిలో రాజీ పడతారు. జీవితమే ఒక రాజీ.

మనకున్న శరీరంతో దానికి వచ్చే రుగ్మతలతో మనం రాజీ పడుతున్నట్లే - ముఖ్యమైన మానవ సంబంధాలతోనూ రాజీ పడాలి. ఒక అవేశం, ఒక అసహనం బలమైన అనుబంధాల్ని తెంచకూడదు.

కలిసిరాని కాలం, పరిస్థితులు ఎలా ఉన్నా ’ప్రేమ’తో ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క విధంగా చెరి ఒకరు క్షమను పాటించినప్పుడు అనుబంధం నిలుస్తుంది.

కుటుంబవ్యవస్థ - ఈ దేశం సాధించుకున్న గొప్ప అంశం. దానికి మూలం దాంపత్య ధర్మమే.

పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, సీతారాములు అంటూ దాంపత్య ధర్మాన్ని దేవతా స్థానంలో ఉంచి ఆరాధించే సంప్రదాయం మనది. ఆ దేవదంపతులకు అనేకమార్లు కళ్యాణాలు చేస్తూ - ఆ ఉత్సవాల ద్వారా వివాహవ్యస్థలోని పవిత్రతనీ, దాంపత్యంలోని శాశ్వతత్వాన్నీ గుర్తు చేసుకుంటాం.

ముఖ్యంగా ఇరువురికీ లభిస్తున్న ఆర్థికస్వేచ్ఛ కూడా విడిపోవడానికి తెగించడంలో ముఖ్యకారణమవుతోంది. రెండవది తీవ్రమైన అసహనం. మూడవది తమ కుటుంబం, పిల్లల భవితవ్యం గురించి ఆలోచించలేకపోవడం.

ముఖ్యవిషయం:

మన కాస్త సహనం - శాశ్వతమైన ఒక ధర్మాన్ని నిలబెడుతుంది. పతి ఎలా ఉన్నా సహించే పతివ్రతల కథలు మనకి కొన్ని పురాణాల్లో కనిపిస్తాయి. అవి అతికొద్ది, కానీ ఆ కథల అసలు సందేశం పతులు దుర్మార్గంగా ఉండాలని చాటడం కాదు. సహనంతో తమ బంధాన్ని నిలిపి, ఒక ధర్మాన్ని గౌరవించిన త్యాగంలోని దివ్యత్వాన్ని కీర్తించడమే వాటి పరమార్థం.

’స్త్రీని నోటితో గానీ, చేతితో గానీ హింసించరాదు’ - అని వైదిక సంస్కృతి చాటుతోంది. విజ్ఞానంలో, గృహనిర్వహణలో స్త్రీ మహారాణి. ఇంటి సంపద ఆమె చేతులపైననే వినియోగింపబడాలని శాస్త్రం చెబుతోంది.’సామ్రాజ్ఞీభవ’ అంటూ వివాహక్రియలో వరుడు, వధువును మంత్రపూర్వకంగా జీవితంలోకి ఆహ్వానిస్తాడు. ఇరువురూ కలిసి మంచి స్నేహితులుగా మసలాలి - అని వేదం బోధిస్తోంది. సప్తపది - సఖ్యానికి సంకేతం.

’సఖా సప్తప దా భవ’

ఏడడుగులతో స్నేహాన్ని సాధించి, దేవతల సాక్షిగా చివరివరకు -”ప్రాణం, శరీరం’ లా కలిసి ఉండాలి అనే ఆకాంక్ష ఆ పెళ్ళి మంత్రాలలో కనిపిస్తుంది.

స్నేహంలో క్షమించడం, రక్షించడం, ప్రేమించడం, పాలుపంచుకొనడంలో ప్రధానాంశాలు. అవన్నీ భార్యాభర్తల బంధంలో ఉంటాయి - ఉండాలి.

భర్త అల్పాయుష్కుడని తెలిసినా అతడిని అంటిపెట్టుకొని, తన తపశ్శక్తితో కాలాన్నే శాసించి, తన పతిని బ్రతికించుకున్న సతీ సావిత్రిలోని ధైర్యం స్త్రీ ఔన్నత్యానికి ప్రతీక. ప్రతికూల పరిస్థితుల్ని చాకచక్యంగా సానుకూల పరచుకోవడమే ఘనత కానీ, పరిత్యజించడం శ్రేయస్సు కాదు.

నల దమయంతుల చరిత్ర, ఇతిహాసంలో ఒక మణిపూస, దాంపత్యంలోని విలువని చాటే అద్భుత వృత్తం. కాలం కలిసిరాని పరిస్థిథి జీవితంలో ఒక్కొక్క దశలో ఎవరికైనా తప్పనిసరి. ఆ సమయంలోనే ఉద్రేకాలకు లోనుకాకుండా, ప్రశాంత చిత్తంతో, చాతుర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరించే సంయమనం ప్రదర్శించాలి.

ద్యూతంలో తన భర్త ఓడిపోయాక, పిల్లల్ని తన పుట్టింటి రక్షణలో ఉంచినప్పటికీ, తాను మాత్రం పతికి తోడుగా అడవులకు వెళ్ళింది. దమయంతి. కానీ తనతో పాటు ఆె అగచాట్లు పడడం ఇష్టం లేని నలుడు, అడవిలో ఆమెను విడిచి వెళ్ళాడు. తాను కనపడకపోయేసరికి - ఆమె విధిలేక పుట్టింటికి వెళ్ళి రక్షణ పొందుతుందని అతడి ఊహ.

తన భర్త బుద్ధిని ఏదో అదృశ్య శక్తి (కలిపురుషుడు) శాసిస్తోందని గ్రహించిన దమయంతి, అనేక అవరోధాల నెదుర్కొని తన పుట్టినింటికి చేరుకుంది. కానీ అక్కడ ఉంటూనే తెలివిగా ఆమె నలుని జాడను తెలుసుకొని అతడిని తిరిగి చేపట్టింది. ఇక్కడ దమయంతి ఘనతనే పురాణకర్త శ్లాఘించారు. ఓర్పు, సర్దుబాడు - ఎప్పటికైనా గెలుస్తాయి.

సృష్టిలో ’అవసరం’ అనిపించిన వాటికోసం ఎన్నో సర్దుబాట్లు, సహనాలు, రాజీపడడాలు ప్రతివ్యక్తి జీవితంలోనూ మామూలే. ఆ అంశాలే వివాహ బంధంలో కూడా అమలుపరిస్తే సుఖసంతోషాలు సహజంగా లభిస్తాయి.

భార్యాభర్తల బంధం ధనంకంటే గొప్పది. కేవలం ఆర్థికవసరాల వల్లనే కలిసి ఉండడం, ఆర్థిక స్వాతంత్ర్యం వలన విడిపోవడమ్ అనే తేలికపాటితనం దాంపత్య బాంధవ్యంలో తగదు. కడదాకా మిగిలే కమ్మని బంధం ఇది ఒక్కటే. రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరివెళ్ళిపోయినా, పండుటాకులై ఒకరికొకరు మిగిలేది దంపతులే. ఒడుదుడుకుల్లో తోడై, బ్రతుకు పయనంలో ప్రయాణించి అలసి, పడమటి సంధ్యారాగంలో జంట స్వరాలుగా మిగిలే శాశ్వతమైన సాహచర్యం ఇది.

నిగ్రహం, నిబద్ధత - దాంపత్యంలో ప్రధాన సూత్రాలు. ఆరోగ్యవంతమైన ఒక వ్యవస్థను సంయమనంతో కాపాడుకోవలసిందే.

ధ్రువాసి ధ్రువోయం యజమానో స్మిన్నాయతనే!! (యజుర్వేదం)

’ఈ గృహంలో నువ్వు శాశ్వతం, యజమానియైన ఇతడు (భర్త) శాశ్వతం’ ఈ వేదవాక్కు - మార్పుచెంద(కూడ)ని దంపతుల స్థిరత్వాన్ని చాటుతోంది. ’యజమాని’ అంటే సత్కర్మను (యజ్ఞాన్ని) ఆచరించు వాడు అని సరియైన నిర్వచనం.

భారతీయ దృక్పథంలో సతీపతుల బంధం ఇహలోక, పరలోకాలకు, జన్మజన్మలకు కొనసాగుతుంది. ఇంద్రాదులు, గంధర్వాదులు ఆ జాయాపతులకు బంధాన్ని ఏర్పరచారన్ వివాహ మంత్రాలు చెబుతున్నాయి.

దంపతుల స్థిరత్వం కుటుంబానికి పునాది. మన కుటుంబాలు, మన సమాజానికి ఆలంబనలు.

"అస్యాః విముచం న వశ్మి న ఆవృతం’

నేను (భర్త), ఈమె (భార్య) విడిపోవడాన్ని వియోగాన్ని కోరడం లేదు" అనే భావం ఋగ్వేదంలో కనిపిస్తోంది.

అభిప్రాయ భేదాలో, అభిరుచుల తేడాలో ఉండవచ్చు. ఆ మాటకొస్తే, ఒక వ్యక్తికి - తానే తనకు సరిపడని సందర్భాలు ఎన్నో ఎదురౌతాయి. అప్పుడు తనను తాను క్షమించుకుంటాడు. తనలొ తాను సర్దుకుపోతాడు. అలాగే తన జీవిత భాగస్వామితో సర్దుకుపోగలగాలి.

’అనన్యా హి మయా సీతా భాస్కరస్య ప్రభాయథా’

- అని శ్రీరాముడు సీత గురించి చెప్పినమాట ’సూర్యునికి వెలుగువలె సీన అనన్య (వేరుకాదు)’. ఇంతకంటే దంపతుల ప్రేమకు గొప్ప నిర్వచనం మరొకచోట కానరాదు.

సూర్యునీ అతని కాంతినీ ఎలా విడదీయలేమో అలాగే సీతారాముల్ని (భార్యాభర్తల్ని) వేరుచేయలేం.

పురాణేతిహాసాలలొ అత్రిమహర్షి అనసూయలు, అరుంధతీ వసిష్ఠ మహర్షులు, లోపాముద్ర అగస్త్యులు వంటి ఆదర్శ ఋషి దంపతులు గోచరిస్తారు. అనసూయ ఘనతను అత్రి మహర్షి స్వయమ్గా ప్రశంసించాడు. భార్యను శ్లాఘించి, ఆమె ప్రాధాన్యాన్ని భర కీర్తించడం పురాణాల్లో అనేక చోట్ల కనిపిస్తుంది. పురుషాధిక్యం - అనేది ఆ మహాత్ముల్లో గోచరించలేదు,.

అసలు దాంపత్యంలో పరస్పరాధిక్యాలు తగనివి. ఒక్కో సమయ్ంలో ఒక్కో విషయంలో ఒక్కొక్క ఆధిక్యం తప్పదు - అవసరం కూడా.

అన్యోన్యత కలిగిన దంపతుల పెంపకంలో ఎదిగే బిడ్డలు కూడా ఆరోగ్యవంతమైన మనశ్శరీరాలతో ప్రయోజకులుగా ప్రగతిని సాధించగలుగుతారు.

విశ్వనాథ వారి ’వేయిపడగలు’ లో భర్త భార్యతో అన్నమాట - చివరకు ’నేను మిగిలితిని - నీవు మిగిలితివి’.

ఇది ఆ నవలకే చివరిమాట. వేయిపడగల అనంతునిలా విస్తరించ్న ధర్మంలో 998 పడగలు (అసంఖ్యాకధర్మాలు నశించినా - ఇంకా ’భార్యాభర్తలు’ అనే రెండు పడగలు మిగిలాయి.

చాలు - ఆ రెండు పడగలు మిగిలినా -వాటి పైననె తక్కిన సనాతన ధర్మమంతా నిలబడగలదు...

🌺🌺🌺సర్వంశివసంకల్పం🌺🌺🌺

*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం

 *శ్రీ‌రామాయ‌ణ దివ్య‌క‌థా పారాయ‌ణం*


          *9 వ రోజు*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*శ్రీరామ పట్టాభిషేక మ‌హోత్స‌వం*


సీతా ల‌క్ష్మ ణ స‌మేతంగా శ్రీ‌రామ‌చంద్ర‌మూర్తి అయోధ్య‌లో అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి ప్ర‌జ‌లు సంబ‌రాల‌లో మునిగితేలుతున్నారు.

శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం నిశ్చయమయ్యింది. సుగ్రీవాజ్ఞతో జాంబవంతుడు, హనుమంతుడు, వేగదర్శి, ఋషభుడు సుషేణుడు, గవయుడు, నలుడు నదీనద సముద్ర జలాలు తెచ్చారు. వసిష్ఠ మహర్షి ఋత్విక్కులతో కలిసి సీతారాములను రత్న సింహాసనంపై కూర్చుండబెట్టారు. వసిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు, కాత్యాయనుడు, సుయజ్ఞుడు, గౌతముడు, విజయుడు, తరువాత ఋత్విక్కులు, బ్రాహ్నణులు, కన్యలు, యోధులు వారిని అభిషేకించారు. వారితోబాటే లోకపాలకులు, దేవతలు శ్రీరామచంద్రుడిని అభిషేకించారు. వాయుదేవుడు స్వయంగా బంగారు తామరపూల మాలికను రాముని మెడలో వేశాడు.  వేద‌వేత్త‌లు మంత్ర‌ప‌ఠ‌నంసాగిస్తున్నారు.ర‌త్న‌కిరీటాన్ని వ‌శిష్ఠుల‌వారు రాముడి శిర‌స్సుపై అలంక‌రింప చేశారు .

 ప్ర‌జ‌లు  జ‌య‌జ‌య‌ధ్వానాలు చేశారు.

. రాముడు బ్రాహ్మణులకు అనేక దానాలు చేశాడు. సుగ్రీవ, విభీషణ, జాంబవంతాది మహావీరులకు అనేక బహుమతులిచ్చి సత్కరించాడు.

శ్రీరాముడు సీతకొక నవరత్నాలూ పొదిగిన ముత్యాల దండను ఇచ్చాడు. అప్పుడు సీత శ్రీరామచంద్రుని ఇంగితం గుర్తించి ఒకజత గొప్ప విలువైన వస్త్రాలూ, గొప్ప ఆభరణాలూ హనుమంతునకిచ్చింది. అంతటితో తృప్తి తీరక ఆమె తన మెడలో ఉన్న ముత్యాల హారం తీసి చేతబట్టుకొని ఒకసారి రాముడినీ, మరొకసారి వానరుల్నీ చూడసాగింది. సీత మనసు తెలిసికొన్న శ్రీ రాముడు "జానకీ! బలమూ, పరాక్రమమూ, బుద్ధీ ఉండి, నీకు అమితానందం కలిగించినవారికి ఆ ముత్యాలసరం ఇమ్ము" అన్నాడు. అన్న మరుక్షణంలోనే దాన్ని సీతమ్మతల్లి హనుమంతుని చేతిలో పెట్టింది. హారంతో హనుమంతుడు చంద్రకాంతి తగిలిన తెల్ల మబ్బులా ప్రకాశించాడు. రాముని వ‌ద్ద‌ సెలవు తీసికొని విభీషణుడు లంకకు, వానరులు కిష్కింధకు తరలిపోయారు.


యువరాజుగా ఉండమ‌ని లక్ష్మణుడిని కోరాడు. ల‌క్ష్మ‌ణుడు  అందుకు సమ్మతించలేదు. భరతునకు యువరాజ్యాభిషేకం చేశాడు రాముడు. తరువాత శ్రీరాముడు అశ్వమేధం, పౌండరీకం, మరెన్నో క్రతువులు చేశాడు. లక్ష్మణుడు తనకు సాయపడుతూ ఉండగా పదకొండువేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. శ్రీరాముని రాజ్యంలో జనులు సుఖసంతోషాలతో ఉన్నారు.

ప్రజలు  ధర్మపరాయణులై ఉండేవారు.


 ఎవ‌రి నోట విన్నా  రామ‌, రామ , రామ అన్న మాట త‌ప్ప మ‌రో మాట లేదు.


                            **

శ్రీ రఘురామ చారు తులసీదళ దామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో

త్తారకనామ భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ

                             **

ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.


        **

*శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే*

*సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే*

       ***

రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేథసే 

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః

 శ్రీరామ రామ 

రఘునందన రామ రామ!

 శ్రీరామ రామ 

భరతాగ్రజ రామ రామ! 

శ్రీరామ రామ 

రణకర్కశ రామ రామ!

 శ్రీరామ రామ శరణం

 భవ రామ రామ!

 శ్రీరామ చంద్ర చరణౌ

 మనసా స్మరామి!

 శ్రీరామ చంద్ర చరణౌ

 వచసా గృహ్ణామి! 

శ్రీరామ చంద్ర చరణౌ

 శిరసా నమామి! 

శ్రీరామ చంద్ర చరణౌ 

శరణం ప్రపద్యే!.

                         **

                         *ఫలశ్రుతి*


వాల్మీకి రచించిన  శ్రీ‌రామాయ‌ణాన్ని చదివినవారు,

 విన్నవారు కూడా పాపవిముక్తులై ధనధాన్యసంపదలను పొందుతారు.

వారికి కీర్తి, విజయం, చిరాయువు లభిస్తాయి.

 కష్టాలను అధిగమిస్తారు.  . సత్సంతానాన్ని పొందుతారు.

దీర్ఘాయుష్మంతులౌతారు. స‌క‌ల శుభాలూ పొందుతారు.


ఈ రామాయణం శ్రద్ధగా చదివేవారియందు, వినేవారియందు

 శ్రీరాముడు దయాపరుడై ఉంటాడు.


*రామాయణ పారాయణ* *జరుగుతున్న ప్రతిచోటా*

 *హ‌నుమ  ప్ర‌త్య‌క్ష‌మై  ఆనంద పార‌వ‌శ్యంతో రామకథను వింటుంటాడు.*

*సదా రామభక్తులను కంటికి రెప్పలాకాపాడే బాధ్యత తీసుకుంటాడు.*

                       **

ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకమ్ !

తరుణార్క ప్రభం శాన్తం రామదూతం నమామ్యహమ్ !!

                        **


*హనుమంతుని ద్వాదశనామాలు*


హనుమా, అంజనాసుతః, వాయుపుత్రో, మహాబలః

రామేష్టః, ఫల్గుణ సఖః, పింగాక్షో మిత విక్రమః

ఉధధిక్రమణశ్చ్చైవ, సీతాశోక వినాశకః

లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పహా

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః

 స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః,

 తస్య మృత్యు భయం నాస్తి సర్వత్రా విజయీ భవేత్

                             **

 యదక్షరపదభ్రష్టం మాత్రాహీనన్తుయద్భవేత్ ।

తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తుతే ॥

          *జై సీతారామ్‌*

             *సర్వే జనా*  

        *సుఖినోభవంతు*

      *సన్మంగళాని భవంతు*


  🛕🛕🛕🛕🛕🛕🛕🛕

మంత్రోచ్చారణ

 *మంత్రోచ్చారణ..తత్వ బోధ..*


*(నాలుగవ రోజు)*


ఆదిత్యహృదయం స్తోత్రాన్ని అప్పజెప్పమన్న శ్రీ స్వామి వారి ఆదేశం మేరకు ప్రయత్నించినా.. మొదటి శ్లోకం కూడా చెప్పలేకపోయిన ప్రభావతి గారి ఎదురుగ్గా కూర్చున్న శ్రీ స్వామి వారు..ప్రశాంతంగా ఆ దంపతులను చూస్తూ..


"చూసావా తల్లీ!..నాకు కంఠస్తం కాని స్తోత్రాలు లేవని నువ్వు అనుకున్నావు..కానీ రోజూ క్రమం తప్పకుండా చేసే స్తోత్రాన్నే మరచిపోయావు..దీనినే మాయ అంటారమ్మా..సరే..ఇద్దరూ శ్రద్ధగా వినండి..ఈ సృష్టిలో ఓంకారం మొదలుకొని..పంచాక్షరి..అష్టాక్షరి..శక్తి బీజాలు..ఇలా సర్వమంత్రాలూ కొన్ని కోట్లు ఉన్నాయి..ప్రతి మంత్రానికి ఒక నిర్దుష్టమైన అర్ధమూ..ఉచ్చారణ క్రమమూ.. ఉచ్చరించిన తరువాత కలిగే నాడీమండల స్పందన..అది సాధనచేయగా సమకూరే ఫలితమూ.. స్పష్టంగా ఉంటాయి..


"నాకిన్ని మంత్రాలు వచ్చు!"..


"నాకిన్ని స్తోత్రాలు కంఠతా వచ్చు!"..


"నేను ఇంత జపం చేసాను!.."


అనుకుంటూ చేసే పూజ అహంకారం తో కూడినది....అది పూజకు మొదటి సోపానమే అయినా..రజోగుణపూరితమైనది..


"సప్తకోటి మహామిత్ర చిత్త విభ్రమ కారకః" అన్నట్లుగా ..మంత్రాలు పూజలు ఒక మెట్టు వరకూ మనిషిని తీసుకువెళతాయి..రకరకాల మంత్రాలు జపిస్తే..తికమక తప్ప మరేదీ సిద్దించదు.. అయితే..సద్గురువు లభించి మంత్రోపదేశం చేసినప్పుడు ఆ మంత్రం ఒక్కటే కోటి జపం పూర్తయ్యేసరికి..మంత్రసిద్ది కలిగించి..ముక్తి మార్గాన్ని సుగమం చేస్తుంది..ఇప్పటిదాకా నీవు చేస్తున్న పూజలన్నీ..గృహస్థాశ్రమంలో ఉంటున్న నీకు రక్షాకవచాలుగా పనికివస్తాయి..


సర్వస్య చాహం హృద్ధి సన్నివిష్టో మత్తః 

స్మృతిర్ జ్ఞానమపోహనం చ ౹

వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో 

వేదాంతకృద్వేదవిదేవ చాహం౹౹ (భగవద్గీత 15 / 15)


"సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే!..నానుండియే స్మృతి , జ్ఞానము, అపోహనము (సందేహనివృత్తి) కలుగుచున్నవి..వేదముల ద్వారా తెలిసికొనదగిన వాడను నేనే!..వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే!.." 


అని కదమ్మా భగవానుడు గీతలో చెప్పింది..మరణపు అంచుల్లో వున్న రోగికి వాడవలసిన ఔషధం..అక్కడ వైద్యం చేస్తున్న వైద్యుడికి గుర్తుకువచ్చి, ఆ ఔషధాన్ని ఆ రోగికి ఆ సమయంలో ఇచ్చి, అతని ప్రాణం కాపాడబడితే..అది దైవలీల!..అలాగే అదే రోగికి ఆయుష్షు తీరిపోయివుంటే..ఆ వైద్యుడికి మరపు కలిగించి..సరైన ఔషధం గుర్తుకురాకుండా చేసి..ఆవ్యక్తి మరణించడం కూడా దైవలీలే!..


"నేను చేస్తున్నాను!..ఈపూజను ఇంత పని వుండికూడా నేను రోజూ చేస్తున్నాను!.." అనే అహంతో కాకుండా.."స్వామీ!..నీవు చేయిస్తున్నావు..!" అనే శరణాగతి తో చేసే పూజ ఉత్తమోత్తమమైనది..అటువంటి పూజకొరకే మన మహర్షులు ముందుగా నామపూరితమైన విగ్రహారాధనను తొలిమెట్టుగా చేసి, సాధారణ మానవుల కోసం  ఏర్పాటుచేసారు!.."


ఒక్కక్షణం స్వామివారు తాను చెప్పడం ఆపి..ఆ దంపతుల వైపు చూసారు.. మంత్రముగ్ధుల్లా వింటున్నారిద్దరూ..ఒకే రాతి క్రింద ఏర్పడిన గుహలాంటి ఆ పార్వతీదేవి మందిరంలో అప్పటిదాకా స్వామివారు చెపుతున్న మాటలు ఆ ఇద్దరి హృదయాలలో ప్రతిధ్వనిస్తున్నాయి..


"అమ్మా..ఆదిత్యహృదయాన్ని ఇప్పుడు చెప్పు..మరలా ఇప్పుడు ప్రయత్నం చేయి తల్లీ!.." అన్నారు స్వామి వారు నవ్వుతూ..ప్రభావతి గారు సందేహించారు..ఈసారన్నా తాను ఆ ఆదిత్యహృదయ స్తోత్రాన్ని చెప్పగలనో..లేదో..అని మనసులో సందేహం..


"ఇప్పుడు చదువుతావు..పర్లేదమ్మా..చెప్పు..నేను వింటాను!.." అన్నారు స్వామివారు మరలా నవ్వుతూ..


స్తోత్ర పఠన విధి విధానం..స్వామి వారు తెలియచెప్పడం..రేపటి భాగంలో..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

అందాలరాముడు

 పిల్లలిక పుట్టరేమో అనే సమయాన అపురూపంగా పుట్టావు. 


అవడానికి  పెద్దాడివే అయినా అల్లరిచేశావు. 


అందరాని చందమామకోసం అలకలుపోయావు. 

కాస్త జ్ఞానం రాగానే విద్యలన్నీ బుద్ధిగా నేర్చేసుకున్నావు. 


బాగా చిన్నప్పుడే హాస్టల్లో పడేసినట్టు ఆ విశ్వామిత్రులవారి వెనకాల పంపిస్తే పేచీలేం పెట్టకుండా బుద్ధిగా వెళిపోయావు. 


ఆయన్నేర్పిన నాలుగు ముక్కలూ వంటబట్టించుకుని తిరిగొచ్చావు. 


ఎంత వీరుడివే అయినా నచ్చిందికదా అని నచ్చినట్టు చేసెయ్యకుండా గురువుగారు చెప్పినట్టు నీ ప్రతిభని ప్రదర్శించాకే ఆవిణ్ణి కట్టుకున్నావు. 


తీరా పెళ్ళయ్యీ భోజనాలకి కూచుందాఁవనుకుంటోంటే ఆయనెవడో గొడ్డలట్టుకు బయల్దేరాడు. 


చెప్పొద్దూ! అంతహంకారం పనికిరాదని మర్యాదగా చెప్పే ధైర్యం ఎవరికీలేదు. 


ఎంతటి పరాక్రమవంతుడైనా గర్వం వుంటే అది ప్రతిభని ఎలా కప్పేస్తుందో చిరునవ్వుతో నిరూపించేశావు.


ఎంతముద్దుచేసినా పెద్దాళ్ళంటే గౌరవమే చూపిస్తూ మెలిగావు. 


నీకు పట్టాభిషేకం చేద్దామని, ఏదో పెద్దాయన సరదాపడ్డాడే అనుకో ఆవిడగారేమో ఆయాల మాటట్టుకుని నానాయాగీ చేసేసింది. 


నిన్ను రాజుని చెయ్యడానికి వీల్లేదుపొమ్మంది. అక్కడితో ఆక్కండా అడవుల్లోకి పొమ్మని ఆర్డరేసేసింది. 


ఇక్కడుంటే తమిళనాడులోలా మిగతా ఎమ్మెల్యేల్ని ప్రభావితం చేస్తావనో ఏఁవిటో? 


పోనీ అప్పుడైనా మంత్రిపదవి దక్కలేదని మా ఎమ్మెల్యేల్లా అలిగావా? లేదు. 


‘నాన్నారెలా చెబితే అలానే!’ అంటూ డ్రెస్ మార్చేసి ఎక్కడికెళ్ళాలో అడ్రెస్సైనా అడక్కండా బయల్దేరిపోయావు. 


నీకుతోడు ఆవిడా అలాంటిదే! ‘మీరెళితే వెళ్ళండి! నేనిక్కడే మా అమ్మావాళ్ళింటో వుంటాను. మీరొచ్చేముందు ఓవుత్తరం రాసిపడెయ్యండి. వచ్చేస్తా’నన్లేదు. 


తనూ నారబట్టలు కట్టేసుకుని, మావారెక్కడుంటే అక్కడే నాకు వెన్నెలంటూ తయారైపోయింది.


ఇహ మీతమ్ముడు. చిన్నచిన్న సాయాలడగడానికే భయఁవేసేస్తోంది తమ్ముళ్ళని! వందచెప్తారు. 


డబ్బడిగితే జేబుఖాళీ అంటారు. 

పన్చెబితే చెయిఖాళీలేదంటారు. 


అలాంటిది నీతోపాటు తనూ తయారైపోయాడు. కష్టాలూ, కన్నీళ్ళూ కలబోసుకున్నారు. 


వాళ్ళతో కలిసి నీమూలాల్ని మరిచి కందమూలాల్నే తిన్నావు. 


నిశ్శబ్దమందిరాల్లో నిదరోయే మహరాజుబిడ్డవే అయినా క్రూరమృగాల కూతలమధ్య, కీచురాళ్ళ మోతలమధ్య ఒఠ్ఠికిందే పడుకున్నావు.


ఒకటారెండా..పధ్నాలుగేళ్ళు! 


ఎన్నోతప్పులుచేసిన మావాళ్ళైతే గుండెనొప్పని చెప్పేసి పొలోమని అపోలోలో చేరిపోతారు. 


జెయిలంటే బెయిలంటారు. కనీసం ఒక్కనెలయినా మాసరదా తీర్చకుండా బయటే ఊరేగుతూవుంటారు.


అలాంటిది నువ్వేతప్పూ చెయ్యకుండానే దండకారణ్యాల్లో దండననుభవించావు. 


అందమైన జీవితాన్ని అడవిపాలు చేసేసుకున్నావు. అడవికాచినవెన్నెల్లోనే సీతమ్మతో ఆనందాన్ని పంచుకున్నావు. 


నిన్నర్ధంచేసుకోడానికి మాకెన్ని యుగాలైనా సరిపోవట్లేదు. 


ఇంటో అన్నీవుంటేనే పెళ్ళాంకోరిన సినిమాకి తీసికెళ్ళడానికి తీరికలేదంటాం! 


అట్టాంటిది ఆవిడేదో సరదాపడిందని, ఆలేడికన్నుల్లో బంగారులేడిని చూసి మెరిసిన ఆనందాన్ని చూసి, మురిసి మురిపెంచెంది,  తెద్దాఁవని బయల్దేరావు.


మాయలూమంత్రాలతో కట్టుకున్నదాన్ని పట్టుకెళిపోతే చెట్టుపుట్టల్ని వేడుకున్నావు. చెట్టపట్టాలేసి కోతులతో కలిశావు. 


ఏమాయా చెయ్యలేదు. కుతంత్రాలూ లేవు. 


నిస్సహాయతనేది సామాన్యమానవుణ్ణి ఎలాబాధిస్తుందో నిరూపించావు. 


మా హీరోల్లా విలనింట్లోనే కుటుంబమంతా చేరి, వాళ్ళందర్నీ వెర్రిపీనుగుల్ని చేసి ఆడేసుకుని, చివరాఖర్న వాళ్ళింటమ్మాయిని తెచ్చేసుకోలేదు. 


ఎంతో ఇష్టంకాబట్టే ఎంతకష్టపడాలో అంతాపడ్డావు. 


ఏసాయమూ దొరక్కపోతే దొరికిన సాయాన్ని ఎలావాడుకోవాలో నువుచెప్పినట్టు ఏ ఆరుమెట్ల పుస్తకాలూ చెప్పలేదు. 


తాతయ్య నోటివెంట నీకథ విన్న ప్రతి మనవడికీ వచ్చే మొదటనుమానం కోతుల్నెలా లొంగదీసుకోవడమని! 


అదీ చూసేవాళ్ళం మాచిన్నతనాల్లో! చెప్పినపనల్లా చేసిపెట్టే కోతుల్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళం! 


వాటికి శిక్షణనివ్వడానికి వాడెంతకాలం కృషిచేశాడో తెలీని మాకు వినోదమే కనబడేది! 


ఇపుడాలోచిస్తే నిలకడలేని ఆ వానరుల ఓనరుతో నువుచేసిన స్నేహమూ, ఆనక వాళ్ళసాయంతోనే నువుకట్టిన వారధీ చూస్తే... 


దుస్సాధ్యం వుంటుందేమోగానీ అసాధ్యమనేది వుండబోదని అనిపిస్తుంది!


సెభాషోయ్ రామా! నీగురించి మొదలెడితే నిండిపోయింది మనసు. నిద్రా, నీళ్ళూ గుర్తురావట్లా! 


నిజాయితీకి నిదర్శనం, నిరాడంబరతకి నిలువెత్తు దర్పణం నీజీవితం!


నిలకడలేనివాళ్ళతో పొంతన

నీళ్ళని దాటడానికొక వంతెన

నిర్భయమేగావుంటే నీచెంతన

నిరాధారులకిచ్చావు సాంత్వన

నికార్సైనది నీమార్గం ఎంతైనా

నిరతమూ మాకదేకదా చింతన


నీకందుకే మండే ఎండల్లోనూ కిక్కిరిసిన పందిళ్ళలో కిక్కురుమనకుండా కూర్చుని కళ్యాణం జరిపిస్తాం!


నకనకలాడే ఆకలికి పానకాలతోనే పొట్టనింపుకుని 

నీకన్నంపెట్టిన తరవాతే ముద్దమింగుతాం!


పదిమందీ కలిస్తే పండగ! పదిమందికి మంచిచేస్తే కళ్యాణం! పదిమందికి అన్నంపెట్టడం లోకకళ్యాణం!


అందాలరాముడు....

అందువలన దేముడు!!

సాధారణ హీరో

 బాహుబలి - సాధారణ హీరో - రాజబాబు  


     శరీరం లోకి ప్రవేశించిన కరోనా ను ను  ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఎదుర్కొంటుంది . మొదటి మూడు రోజులు జరిగే యుద్ధం లో  ఇమ్మ్యూనిటి శక్తిని బట్టి మూడు రకాలుగా జరిగే అవకాశం వుంది .


  1 బాహుబలి :  మన ఇమ్మ్యూనిటి బాహుబలిలా బలంగా ఉంటే వైరస్ ను మూడు రోజుల్లో ఉతికి ఆరేస్తుంది. దీనితో వైరస్ దాదాపుగా  చచ్చిపోతుంది . ఇలాంటి పరిస్థితుల్లో దానికి  శరీరం లోని   ఇతర భాగాలకు వెళ్లే అవకాశం  ఉండదు . మూడు రోజుల్లో ఇది దాదాపుగా చచ్చినట్టే . కానీ  అప్పుడు టెస్ట్ చేయించుకొంటే పాజిటివ్ వస్తుంది . దీనికి ప్రధాన కారణం వైరస్ మృత దేహం, ముక్కు లో  వున్నా టెస్ట్ లో పాజిటివ్ వస్తుంది . మొదటి మూడు రోజుల్లో చచ్చిన వైరస్ ,  శరీరం పై దాడి చేసే శక్తి లేక చతికిలబడుతుంది .  బాహుబలి ఇమ్మ్యూనిటి కలిగిన వారికి కనీసం దగ్గు జలుబు లాంటి లక్షణాలు  రావు  . ఇలాంటి వారిని  అసిమ్పటోమాటిక్ అంటారు . ఇలాంటి వారినుంచి ఇతరులకు కరోనా వ్యాపించే అవకాశం తక్కువ .  వీరి కి  తుమ్ములు రావు . దగ్గు ఉండదు . పైగా వైరస్ సగం చచ్చింది . ఇక వీరి నుంచి ఇతరులకు ఎలా వ్యాపిస్తుంది ? అసలు వీరి నుంచి ఇతరులకు వ్యాపించదా అంటే లేదని చెప్పలేము .  వీరి   లాలాజలం ద్వారా అంటే  స్పూనులు ప్లేట్ లు గ్లాసులు మొదలైనవి షేర్ చేసుకోవడం వల్ల ఇతరులకు వ్యాపించవచ్చు . ఒక వేళ వీరినుంచి ఇతరులకు వ్యాపించినా తక్కువ మొత్తం లో నే వైరస్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల అలాగే ఆ వైరస్ అప్పటికే సగం చచ్చి ఉండడం వల్ల  అవతలి వ్యక్తి సీరియస్ గా ఖాయిలా పడే అవకాశం తక్కువ . ఇలాంటి అసిమ్పటోమాటిక్ వ్యక్తుల్లో వాసన రుచి పోవడం తక్కువగా జరుగుతుంది . పది మందిలో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే ఇలా జరుగుతుంది .


2 . వ్యక్తి    ఇమ్మ్యూనిటి వ్యవస్థ మరీ బలంగా కాకుండా అలాగని బలహీనంగా కాకుండా మధ్య స్థాయిలో అంటే బెంగాలీ క్లాసిక్ సినిమాల్లో హీరో లాగ   ఉంటే? :  మూడు రోజుల యుద్ధం లో ఫలితం తేలదు. యుద్ధం కొనసాగుతుంది . మూడో రోజు తరువాత  వైరస్ ముక్కు నుంచి శరీరం లో ప్రవేశిస్తుంది. వైరస్ తన సంఖ్య  ను పెంచుకోవడం ప్రారంబిస్తుంది  . ఇలాంటి వారికి జలుబు దగ్గు జ్వరం వొళ్ళు నొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి . జ్వరం , తల నొప్పి దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తే అప్పటికి వైరస్ శరీరంలోకి ప్రవేశించి మూడు రోజులు లేదా నాలుగు రోజులు అయినట్టు లెక్క . గుర్తుంచుకోండి .  జలుబు తల నొప్పి జ్వరం లాంటివి ఇతరత్రా కారణాల వల్ల కూడా రావొచ్చు . కానీ కుటుంబంలో ఒకే సారి లేదా ఒకటి రెండో రోజుల్లో ఒకరికంటే ఎక్కువ మందికి ఇవే లక్షణాలు వస్తే అప్పుడు అది కరోనా అయ్యే అవకాశం ఎక్కువ .  లక్షణాలు కనిపించాక  కొంత మంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటారు . దాని ఫలితం ఒకటో రెండో రోజుల్లో వస్తుంది . తాము పాజిటివ్ గా తేలిన రోజునుంచి కొంత మంది ఒకటో రోజు రెండో రోజు అని లెక్కించడం మొదలు పెడుతారు . ఇది సరైన పద్దతి కాదు . ఒక వేళ ఒక వ్యక్తి టెస్ట్ result   ఒక నెల రోజులు ఆలస్యం అయితే అప్పుడు కూడా ఇలా లెక్కిస్తారా? కాదు కదా ?  లక్షణాలు కన్పించిన రోజు నుంచి ఒకటో రోజు .. రెండో రోజు అని లెక్కించాలి . అంటే వైరస్ శరీరం లో ప్రవేశించాక ఒకటి ప్లస్ మూడు అంటే నాలుగు .. రెండో రోజు అంటే రెండు ప్లస్ మూడు అంటే ఐదో రోజు అవుతుంది . అర్థం అయ్యింది కదా ?  


 శరీరం లోకి వెళ్లిన వైరస్ అక్కడ glycene  ను తినేస్తుంది . glycene   దాని ఆహారం . మన శరీరానికి కూడా అది కావాలి . మన శరీరం లో glycene  తగ్గడం వల్ల రుచి/  వాసన పొయ్యే అవకాశం వుంది .. నేను చూసిన వారిలో మైల్డ్ లక్షణాలు ఉన్న వారిలో అధిక శాతం మందికి ఇలా రుచి వాసన పొయ్యింది . ఇప్పుడు సెకండ్ లో  వేవ్ లో  కరోనా లక్షణాలు మారినా ఇలా రుచి వాసన పోవడం మాత్రం ఎక్కువ మందిలో కనిపిస్తోంది . మైల్డ్ లక్షణాలు ఉన్న ప్రతి పది మందిలో ఎనిమిది మందికి ఇలా రుచి / వాసన పోవడం చూసాను . కొంత మందికి రెంటిలో ఒకటే పోతుంది . కొంత మందికి రెండూ పోతుంది . రుచి కన్నా వాసన పొయ్యే వారి సంఖ్య అధికం . లక్షణాలు కనిపించిన ఆరవ లేదా ఏడవ ఒక్కో సారి ఎనిమిదవ రోజు ఇలా రుచి వాసన పోవడం జరుగుతోంది . అంటే అప్పటికి వైరస్ వారి శరీరం లో ప్రవేశించి 6 ప్లస్ మూడు అంటే తొమ్మిది రోజులు లేదా పది,  పదకొండు రోజులు అయ్యి ఉంటుంది . అప్పటికి వారికి మిగతా రోగ లక్షణాలు ముఖ్యంగా తల నొప్పి జ్వరం లాంటివి పోయి ఉంటాయి . ఒక విధంగా చెప్పాలంటే రుచి / వాసం పోవడం కరోనా నుంచి వ్యక్తి దాదాపుగా కోలుకున్నారు అని చెప్పడానికి సూచిక . అంటే యుద్ధం దాదాపుగా  ముగిసింది . జరిగిన భీకర యుద్ధం లో కాస్త ఆలస్యం అయినా బెంగాలీ హీరో విజయం సాధించాడు . వైరస్ దాదాపుగా చచ్చింది అన్న మాట . { దగ్గు మాత్రం మరి కొన్ని రోజులు కొనసాగుతుంది } 


     నువ్వుల లడ్డు తినడం ద్వారా మన శరీరానికి తగినంత gylcene  అందించవచ్చు . ఇలా చేస్తే పోయిన రుచి వాసన త్వరగా వస్తుంది . పోయిన నాలుగు నుంచి ఆరు రోజుల్లో ఇది తిరిగి వచ్చేస్తుంది . నేను చూసిన వేల మందిలో ఒక్క వ్యక్తికి   మాత్రం తిరిగి రావడానికి దాదాపు నెల పట్టింది . ఆలా ఆలస్యం కావడం వల్ల అతనికి కొత్తగా ఆరోగ్య సమస్యలు రాలేదు . 


త్రీ రాజబాబు :   దాడి చేసింది బలమైన గుండా లు సైన్యం . ఇవతలేమో రాజబాబు . ఇక యుద్ధం ఏమి జరుగుతుంది ?  రాజబాబు మూడు రోజుల్లో చేతులు ఎత్తేస్తాడు వ్యక్తి శరీరం లోని ఇమ్మ్యూనిటి వ్యవస్థ బలహీనంగా ఉంటే మూడు రోజుల యుద్ధం లో వైరస్ విజయం సాధించి ముక్కు నుంచి శరీరం లోకి వెళుతుంది . అప్పుడు జ్వరం దగ్గు లాంటి లక్షణాలు వస్తాయి . వైరస్ క్రమేపీ తన సంఖ్య ను పెంచుకొంటూ పోతుంది . వ్యక్తి బలహీన ఇమ్మ్యూనిటి వ్యవస్థ దీన్ని ఆపలేదు  . దీనితో వైరస్ కు అడ్డు అదుపు లేకుండా వ్యక్తి రక్త నాళాల్లో లోని glycene తినేస్తుంది . నేను గమనించిన  దాని ప్రకారం డి విటమిన్ లోపము  ఉన్న వారిలో ఇలా జరిగే అవకాశం ఎక్కువ . అప్పుడు రక్త నాళాలు పోరస్ గా మారుతాయి . అంటే వాటి నుంచి రక్తం బయటకు వచ్చే అవకాశం వుంది . ఇలా జరగకుండా చూడడానికి ఆ వ్యక్తి శరీరం రక్తాన్ని చిక్క బరచడం మొదలు పెడుతుంది . చిక్క బడిన రక్తం ఆక్సిజన్ తీసుకొని సామర్త్యాన్ని నెమ్మదిగా కోల్పోతుంది . అందుకే ఇలాంటి వ్యక్తుల్లో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గి పోతుంది . ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల గుండె పోటు లాంటివి రావొచ్చు . బి 12 లోపం ఉన్న వ్యక్తుల్లో వైరస్ విజృంభించిన దశలో సైటోకిన్ స్ట్రామ్ రావొచ్చు . అంటే  ఇమ్మ్యూనిటి వ్యవస్థే పొరపాటున ఆ వ్యక్తి అంగాల పై దాడి చెయ్యడం . భయపడడం వల్ల ఇది మరింత తీవ్రంగా జరిగే అవకాశం వుంది . రక్తం లో గడ్డలు కట్టడం లేదా సీటొకిని స్ట్రామ్ .. ఈ రెండిటిని పట్టించే ఇంటిలోని డాక్టర్ పల్స్ ఆక్సీమీటర్. రాజబాబు ఇమ్మ్యూనిటి వ్యవస్థ ఉన్న వారికీ ఆంటీ వైరల్ డ్రగ్స్ అవసరం అవుతాయి . 


మీ ఇమ్మ్యూనిటి వ్యవస్థ మరీ రాజబాబు లాగా కాకుండా  చూసుకోండి . వాక్సిన్ తీసుకోవడం అంటే దాన్ని బలపరచడమే . అంతే  కాకుండా డి విటమిన్ కోసం ఎండ , శాఖాహారులు బి 12  విటమిన్ , సి విటమిన్ కోసం నిమ్మ నారింజ , భయానికి దూరంగా ఉండడం , పాజిటివ్ ఫీలింగ్స్ కలిగి ఉండడం , వ్యాయామం అంటే కనీసం ఇరవై నిముషాలు నడవడం , బాగా నిద్ర పోవడం లాంటివి చేస్తే డెబ్భై ఏళ్ళ వ్యక్తి అయినా రాజబాబు లాంటి తన ఇమ్మ్యూనిటి వ్యవస్థను అహుబలిగా కాకున్నా బెంగాలీ హీరో గా మార్చుకోవచ్చు . తొంబై ఏళ్ళ బాహుబలులు వున్నారు . ఇప్పటికైనా మించింది లేదు . భయపెట్టే చెత్త వార్తలు పక్కన పెట్టి మీ ఇమ్మ్యూనిటి ని బలోపేతం చేసుకోవడం పై ద్రుష్టి పెట్టండి .

వాక్సిన్ లో వాక్సిన్లు ( స్కెచ్ )

వాక్సిన్ లో  వాక్సిన్లు ( స్కెచ్ )

నిన్న నేను మధ్యాన్నం బోహాజనం చేసి ఒక కునుకు తీద్దామనుకొని పక్కమీదికి వారీగాను కొంతసేపటి తరువాత దూరంగా ఒక కేక వినిపిస్తున్నది. ఈ మధ్య రోడ్డుమీద బండ్లపైన అమ్మేవాళ్ళు చిన్న మీకు ఒకటి పెట్టుకొని దానిలో రికార్డు చేసిన వాటిని ప్లే చేస్తూ  అమ్ముకుంటున్నారు. సరిగ్గా అటువంటి శబ్దమే వినపడుతుంది. ముందుగా కొంచం చిన్నగా వినపడ్డ తరువాత చెవులకు బిగ్గరగా వినపడుతుంది. అది ఏమిటా అని నేను ఆలకించాను . 

వాక్సిన్ లో  వాక్సిన్లు కోవెడు వాక్సిన్లు కావాక్సీన్, కవిషీల్డు, స్పుటినిక్ వాక్సిన్ లో  వాక్సిన్లు బాబు ఇప్పుడు వాక్సిన్లు వేసే బండి మీ వీదిలోకే వచ్చింది, మీ ఇంటిముందుకే వచ్చింది అమ్మలారా, అయ్యలారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని వినపడుతుంది. 

 అప్పుడు నాకనిపించింది ఇదేమి చిత్రంరా నాయన వాక్సిన్లు ఇంటి ముందుకే వచ్చి వేస్తున్నారు అదికూడా కూరగాయలు అమ్మినట్లు అని నేను అనుకునేలోపలే నన్ను ఎవరో తట్టి లేపినట్లయింది ఎవరా అని చుస్తే అది నా శ్రీమతి మీ నిద్ర చాలుకాని ఇంటిముందుకి కూరగాయల బండి వచ్చింది వెళ్లి ఏవైనా రెండు మూడు కూరలు కొనండి అని ఫూరమాయించింది.  నేను అప్పుడే మగత నిద్రలోంచి లేవటం వల్ల ఒక క్షణ కాలం అయోమయంగా అయ్యింది వెంటనే లేచి వాష్ బేసిన్లో మొఖం మీద దోసెడు నీళ్లు కొట్టుకొని టవల్తో తుడుచుకుంటుంటే అప్పుడు ఆ మైక్ శబ్దం నాకు ఇలా వినపడుతుంది 

కూరలండి కూరలు తాజా తాజా కూరలు కూరలమ్మే బండి ఇప్ప్పుడు మీ వీధిలోకి వచ్చింది, మీ ఇంటిముందుకే వచ్చింది అమ్మలారా, అయ్యలారా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని వినపడుతుంది. 

అప్పుడు కానీ నాకు ఇందాక మగత నిద్రలో నేను కల కన్నానని తెలిసింది.  లేకపోతె వాక్సిన్లు బండి మీద తీసుకొని వచ్చి ఇవ్వటమే ఏమిటి. 

మనం ఇప్పుడు ఒక విచిత్రమైన మానసిక స్థితిలో వున్నాము అదేమిటంటే ప్రస్తుతం మన మనస్సు పూర్తిగా ఈ ముదరాష్టపు కరోనానే నిండి వుంది. మనం లేచి వున్నా, నిద్రలో వున్నా, కలత నిద్రలో వున్నా లేక మగత నిద్రలో వున్నా మనం పూర్తిగా కరోనా గూర్చే ఆలోచిస్తున్నాము. ఇక మన మిత్రులకు ఫోన్లో 

మీరు వాక్సిన్ వేయించుకున్నారా  

లేదు 

అయ్యో ఇంకా వేయించుకోలేదా అప్పుడే మేము రెండో డోసుకు కూడా దగ్గర పడుతున్నాము. నా సెల్ఫీ పిక్ గ్రూపులో పెట్టాను చూడలేదా  

వాక్సిన్ వేసుకున్న తరువాత మీకేమైనా ప్రాబ్లమ్ అయ్యిందా. 

ఆ బాబా దయవల్ల నాకు కొంచం జ్వరం వచ్చింది ఇంజన్క్షన్ ఇచ్చిన చోట రెండు మూడు రోజులు నొప్పి చేసింది. కానీ నా శ్రీమతికి మాత్రం నొప్పి కొంచం ఎక్కువగా అయ్యింది.  ఇప్పుడు మేమిద్దరం ఓ.కే. మీరు ఇప్పడి దాకా ఎందుకు వేయించుకోలేదు.  ఇంకా ఆలస్యం చేయకండి వెంటనే వెళ్ళండి లేదంటే మీరు బ్లాకులో కొనాల్సి రావచ్చు. ఇప్పుడు మన దగ్గారలోని ఓం సాయి ఆసుపత్రిలో కూడా వేస్తున్నారట. నేను మాత్రం జనప్రియ పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రిలో వేయించుకున్నాను. జనం మరి అంతగా లేరు. కానీ టెక్సట్లు చేసుకునే వారు కూడా ప్రక్క ప్రక్కగా వున్నారు. అది కొంచం జాగ్రత్తగా ఉండాలి. మీరింకా ఆలస్యం చేయకండి వెంటనే వెళ్ళండి మరొక సారి ఉచిత సలహా ఇచ్చాడు మిత్రుడు. మా చుట్టాలు అందరు రెండో డోసుకూడా వేసుకున్నారు నేనే వెనక పడ్డా నంటే మీరు మాకన్నా వెనక పడ్డారు (ఇండైరెక్టుగా తానేదో ఘన కార్యం చేసినట్లు నను చేయనట్లు దెప్పి పొడుపు )

ఈ సంభాషణలు నిత్యం అనేక మందితో జరుగుతున్నాయి. ఇక కొంతమంది అయితే అదేమిటి రావు నీవు ఇంత భయస్తుడొనుకో లేదు పెద్దగా ఏమి నొప్పి చేయదు మాములుగా ఉంటుంది వెంటనే వేళ్ళు. ఇలా కొంతమంది. ఏతా వాత తేలేది ఏమిటంటే మనం ఎవరికి ఫోను చేసినా కరోనా, వాక్సిన్ కాక వేరొక విషయం లేకుండా పోయింది. 

అయ్యా నేను పూర్తిగా ఇంట్లోనే ఉంటున్నాను. కనీసం మా ఇంటి గుమ్మం ముందుకు కూడా వెళ్ళటం లేదు నేను ఎందుకు భయపడాలి అంటే కాదు ససమీరా నీవు వాక్సిన్ వేసుకోవలసిందే ఇది ప్రస్తుత ట్రాండు. 

సహజంగా ప్రతి మనిషి ఒక ఇల్యూసొంలో ఉంటాడు అదేమిటంటే తానూ చేసింది కరెక్టు తనకే అన్ని తెలుసు ఎదుటువాడిని ఏమి తెలియదు. వాడిని తానూ ఉద్దరించాలి అని అనుకోవటమే కాదు తానె ఉద్దరించినట్లు పదిమందికి చెపుతువుంటాడు. ఈ దోరణి ఇప్పుడు బాగా పెరిగింది. 

ఇక కొంతమంది వాక్సిన్ వేసుకున్న రెండో రోజునుంచే పని వున్నా లేకున్నా రోడ్లమీద బలాదూర్ తీరుగుడు తిరుగుతున్నారు. అటు వైద్య శాఖ వారు మీరు వాక్సిన్ తీసుకున్న జాగ్రత్తగా వుండండి, మాస్కు పెట్టుకోండి ఇల్లు వదలకండి అని వేనోళ్ళ చెపుతున్నా అవి అన్ని పెడచెవిన పెడుతున్నారు. మేము వాక్సిన్ వేసుకున్నాము మాకు ఏమి కాదు అనే విధంగా వున్నారు. వీళ్ళని ఆ దేముడే మార్చాలి. ఇప్పుడే వీళ్ళకి సంఘ సేవ జ్ఞాపకం వస్తుంది. ఇది ఇట్లా ఉంటే ప్రభుత్వం ఎన్నికలని ఇప్పుడే నిర్వహిస్తున్నది. ఎన్నికలలో అనేకులు అవకాశం వదులుకోకుండా సంపాయించాలని పార్టీ జెండాలు పట్టుకొని రోడ్ల మీద విహరిస్తున్నారు. 

కర్పూ : ఎట్టకేలకు తెలంగాణ ప్రేభుత్వం రాత్రి వేళ కర్పూ పెట్టింది. 

మిత్రులారా నేను మీకు చెప్పేది ఏమిటంటే కోవిడు కూడా సాధారణ జలుబు లాంటిదే.  జలుబు ఎలా సంక్రమిస్తుందో అదే విధంగా ఇదికూడా వైరస్ వల్ల సోకుతుంది.  కాకపొతే జలుబు వారం రోజులు ఉండి నిన్ను వదిలి పోతుంది కానీ వారంలో కరోనా నిన్ను తీసుకొని పోతుంది.  ఈ వత్యాసం గమనించండి. జాగ్రత్తగా వుండండి. 

ఎవరి ప్రాణం వాళ్లకు ముఖ్యం. మీరు ఇల్లు వదిలి వెళ్ళకండి మీమ్ము మీరు కాపాడుకోండి. మాస్కు వేసుకోక పోయిన  ,శానిటైజర్ వాడక పోయిన  పర్వాలేదు. ఇల్లు కదలకుండా ఉంటే చాలు.