30, నవంబర్ 2023, గురువారం

 *అర్ధం- అపార్థం*


రెండు పదాలు కు మద్య ఓక అక్షరం తేడా అంతే, కానీ బావం మారతుంది, సంబంధాలను, భవబంధాలను ప్రశ్నార్థకం చేస్తుంది.

పూర్వము భారవి అనే కవి వుండేవాడు. ఆయన చిన్నతనంలోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు. ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. 

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  

ఆయన మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.


తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు. వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది, యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.

అని చాలా సార్లు చెప్పుకున్నాడు.


ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు

ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు భార్య వడ్డిస్తూ వుంది.

భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు


అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. 

వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!


అప్పుడు తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా? తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాటి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.

అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.


తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.


 "పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".


తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు. 

ఇంత  చిన్న శిక్షనా? అన్నాడు భారవి.

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.

సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు. వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని వాళ్ళు విసుక్కున్నారు.


చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు....


దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. 

అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు. భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది.

భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. 

ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను  మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.

ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. 

భార్యకు, అత్తామామలకూ విషయం వివరించి నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.

ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. 


కోపం గా మాట్లడే ప్రతివారి ని శతృత్వము తో చూడరాదు.

చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!

అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

"తల్లిదండ్రులను ద్వేషించకండి!

అంతకంటే పాపం ఇంకోటి వుండదు"

🙏💐🙏శుభోదయం 🙏💐🙏

Panchaag


 

 #అత్యంత_అరుదైన_శ్రీ_మేధా_దక్షిణామూర్తి_స్వామి


#గురువులకే గురువు  ఈ స్వామివారు 🙏


#శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు.


#శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, 


#విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. 


#వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే. 


#ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు.


#గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం

నిధయే సర్వ విద్యానాం 

శ్రీ దక్షిణామూర్తయేనమ:


#అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ నిధి అయిన శ్రీదక్షిణామూర్తికి నమస్కారమని దీని అర్థం.


#శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. 


#దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం.


 #ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.


#మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి.


 #ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. 


#దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. 


#అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.


#మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది. 


#ఆ రూపాలు వరుసగా….


#శుద్ధ దక్షిణామూర్తి, 

#మేధా దక్షిణామూర్తి,

# విద్యా దక్షిణామూర్తి, 

#లక్ష్మీ దక్షిణామూర్తి, 

#వాగీశ్వర దక్షిణామూర్తి, 

#వటమూల నివాస దక్షిణామూర్తి, 

సాంబ దక్షిణామూర్తి¸

#హంస దక్షిణామూర్తి, 

#లకుట దక్షిణామూర్తి, 

#చిదంబర దక్షిణామూర్తి,

 #వీర దక్షిణామూర్తి, 

#వీరభద్ర దక్షిణామూర్తి¸ 

#కీర్తి దక్షిణామూర్తి,

# బ్రహ్మ దక్షిణామూర్తి¸

# శక్తి దక్షిణామూర్తి,

# సిద్ధ దక్షిణామూర్తి.


#దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు.


 #సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. 


#మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు


#ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః🙏


#సర్వేజనా సుఖినోభావంత్

 సంసారమంటే....?

శ్రీ రమణమహర్షి

‘సాధకుల అంతరాయాలకు సంసారమే కారణమని ఎక్కువమంది ఆరోపిస్తుంటారు. ఇది నిజమేనంటారా స్వామీ?' - అని అడిగాడు శిష్యుడు.

ఆ ప్రశ్నకు రమణ మహర్షులు సమాధానమిస్తూ...

'సంసారం బయటకు కనిపించేదా, మనలోనే ఉందా?'* అని ఎదురు ప్రశ్నించారు రమణులు.

'ఉహూ మనలోపల కాదు, బయటదే! అది భార్యాబిడ్డల రూపంలో అడ్డు వస్తోంది' అన్నాడతను.

దానికి ఆయన నవ్వి, 'అలాగే అనుకుందాం! కానీ నువ్వు చెబుతున్న సంసారాన్ని వదిలి ఇక్కడుంటే ఇదొక సంసారం కాదా? పోనీ, కమండలం ధరించి కూర్చుంటే అది సంసారం కాదా?' అన్నారు.

శిష్యుడు ఆశ్చర్యపోయి, *'ఇంతకీ సంసారానికి నిర్వచనమేంటి? అన్నాడు.

'మనలో జరిగే నిత్య సంఘర్షణ, పోరాటాలే సంసారం. అంటే మనసే అసలైన సంసారం.* ఆ చంచలత్వాన్ని అదుపులో పెట్టలేక కుటుంబసభ్యులను నిందిస్తుంటాం. వాస్తవానికి వారు మనకి ధర్మ సాధనలో తోడ్పడతారు. *భౌతిక సంసారాన్ని సజావుగా నిర్వహించ గలిగినప్పుడే మానసిక సంసారాన్ని అదుపుచేయగలం.*

సంసారాన్ని క్షణంలో వదిలేయొచ్చు. కానీ అది ధర్మశాస్త్రరీత్యా పాపం. అలా చేయ కూడదు' అంటూ వివరించారు రమణులు.

భగవాన్ శ్రీ రమణ మహర్షి* సమాధానం:

ప్రశ్న: నేను నా కోరికలను , అభిరుచులను ఎలా అధిగ మించాలి?

శ్రీ రమణ మహర్షి: వాటి మూలాన్ని కనుక్కోండి, అప్పుడు సులభం అవుతుంది.

(తరువాత) అభిరుచులు ఏమిటి?

కామం (కామం), క్రోధం (కోపం) మొదలైనవి ఎందుకు పుడతాయి?

కనిపించే వస్తువుల పట్ల ఇష్టాలు మరియు అయిష్టాల కారణంగా,

మీ దృష్టిలో వస్తువులు తమను తాము ఎలా ప్రదర్శించుకుంటాయి?

మీ అవిద్య, అంటే అజ్ఞానం వల్ల...

దేనికి సంబంధించినదదీ అజ్ఞానం?

ఆత్మానుభూతిని గురించి,

కాబట్టి, మీరు ఆత్మను కనుగొని, దానిలో స్థిరంగా ఉంటే, కోరికల వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు."


🌸🌼ಬೆಳಗಿನ 🌅 ಸೂಳ್ನುಡಿ🌼🌸


*ಶ್ರೀಮಾನಜನನಿಂದ್ಯಶ್ಚ*

*ಶೂರಶ್ಚಾಪ್ಯವಿಕತ್ಥನಃ |*

*ಸಮದೃಷ್ಟಿಃ ಪ್ರಭುಶ್ಚೈವ*

*ದುರ್ಲಭಾಃ ಪುರುಷಾಸ್ತ್ರಯಃ ||*

(ಯೋಗವಾಶಿಷ್ಠ)


ಜನರ ನಿಂದೆಗೆ ಗುರಿಯಾಗದ ಧನಿಕ, ಆತ್ಮಪ್ರಶಂಸೆ ಮಾಡಿಕೊಳ್ಳದ ಶೂರ, ಸಮದೃಷ್ಟಿಯುಳ್ಳ ಪ್ರಭು - ಈ ಮೂವರು ದುರ್ಲಭ.


*🌷🌺🙏ಶುಭದಿನವಾಗಲಿ!🙏🌺🌷*



జననింద కి గురికాని ధనికుడు, ఆత్మస్తుతి చేసుకోని శూరుడు, సమదృష్టి కలిగిన ప్రభువు దొరుకుట దుర్లభం

 *శ్రీకృష్ణపరమాత్మ* గోవర్ధనోద్ధారణ తరువాత  గోపజనులతో ఇలా అంటాడు : 


*మూ॥*  _నాహం దేవో న గన్ధర్వో న యక్షో న చ దానవః ।_  

_*అహం వో బాన్ధవో జాతో* నాస్తి చిన్త్యమతో ఽ న్యథా ॥_  

( *శ్రీవిష్ణుపురాణము* 5.13.12 )


నేను దేవుడిని కాదు , గంధర్వుడిని కాదు , యక్షుడిని (దేవుడు) లేదా దానవుడిని (రాక్షసుడిని) కాను . 

*నేను మీకందరికీ బంధువుగా పుట్టాను* . 

మీరు నా గురించి వేరే విధంగా ఆలోచించ వద్దు - తనను వారిలో ఒకనిగా ప్రీతితో  ఆదరించమని అంటాడు .  


" _సత్యం మేధా యస్య సః సత్యమేధాః_ "  -  సత్యమైన జ్ఞానము కలవాడు . అంటే ఆత్మజ్ఞానము గలవాడు . 


నామరూపాత్మకమైన జగత్తులో కనిపించే అనిత్యమైన వస్తువుల చూచి భ్రమించక , వాటికి అధిష్టానము , ఆధారము తానే అయిన వాడు .


అందువలన   శ్రీమహావిష్ణువు  -   పరమాత్మ  *" సత్యమేధాః "*  అని కీర్తింపబడు చున్నాడు .

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


దానధర్మాలు నిరంతరంగా జరిపించు. ఎవరితోనూ శుష్క వాదాలకు దిగకు. దుష్టసాంగత్యాలు

చెయ్యకు. యజ్ఞయాగాదులు చేస్తూ మహర్షులను సత్కరించు. స్త్రీలను విశ్వసించకు. జూదగాళ్ళను

నమ్మకు. అత్యాసక్తితో వేటను వ్యసనం చేసుకోకు. ద్యూతము, మద్యము, సంగీతము, వారవనితాజనము

-వీటికి నువ్వు దూరంగా ఉండటమేకాదు ప్రజలనుకూడా దూరంగా ఉంచు.

ద్యూతే మద్యే తథా గేయే మానం వారవధూషుచ।

స్వయం తద్విముఖో భూయాత్ ప్రజాస్తేభ్యశ్చ రక్షయేత్ (11-41)


రోజూ బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి స్నానసంధ్యాదికం ముగించు. దీక్షాదక్షుడిపై నిరంతరం

పరాశక్తిని అర్చించు. అదే మానవజన్మకు సాఫల్యం. దేవీమహాపూజను చేసి పావనపాదోదకాన్ని జన్మలో

ఒక్కసారి గ్రోలినా చాలు మరింక ఆ ప్రాణికి గర్భవాసదుఃఖం ఉండదు (పునర్జన్మ ఉండదు),

సకృత్ కృత్వా మహాపూజాం దేవీపాదజలం పిబన్ |

నజాతు జననీగర్భే గచ్ఛేదితి వినిశ్చయః

513

(11-44)

మనం చేసే అన్ని పనులకూ ఆ మహాదేవి సాక్షిభూతురాలు అనే భావాన్ని మనస్సులో

నిక్షేపించుకో. అది నిన్ను ధర్మమార్గాన నడిపిస్తుంది. దారి తప్పనివ్వదు. నిర్భయంగా పయనించు.

నిత్యవిధిగా బ్రాహ్మణులను దర్శించు. తిథివారనక్షత్రాల మంచిచెడ్డలనూ ధర్మశాస్త్రనిర్ణయాలనూ అడిగి

తెలుసుకో. వేదవేదాంగపారంగతులైన విప్రులకు పాత్రత ఎరిగి గోభూహిరణ్యదానాలను సమృద్ధిగా

అందించు. విద్యావంతుడు కాకపోతే బ్రాహ్మణుడైనా పూజార్హుడుకాడు. విద్యాగంధంలేని మూర్ఖులకు

ఆకలి తీరేపాటి ఆహారంమాత్రం అందించు. అంతకన్నా ఎక్కువ దానాలు చెయ్యకు.

అవిద్వాన్ బ్రాహ్మణ: కోఽపి నైవ పూజ్యః కదాచన |

ఆహారాదధికం నైవ దేయం మూర్ఖాయ కర్హిచిత్ II

(11-48)

పుకా ! లోభానికో లాభానికో లొంగిపోయి ధర్మోల్లంఘనం చెయ్యకు. అన్నింటికన్నా

ముఖ్యమైనది - విప్రులను ఏనాడూ అవమానించకు. వారు భూదేవులు. ప్రయత్నతః సమ్మాన్యులు. వారి

తపశ్శక్తి క్షత్రియులకు రక్షణకవచం. వినయంగా ఉంటే చాలు వారు సంతృప్తి చెందుతారు. దానధర్మాలతో

ఆనందపరిచావో ఇక చెప్పేదేముంది!

ధర్మశాస్త్రానుసారంగా దండనీతిని అమలుపరుచు. న్యాయశాస్త్రానుసారంగా కోశాన్ని వృద్ధిపరుచు

 *అభీష్ట గణపతి భక్తులందరికీ సమాచారం*

ఈనాడు (30-11-2023) శోభకృత్ కార్తిక మాస సంకష్టహర చతుర్థి   మరియు ఆర్ద్రానక్షత్రం. శివకేశవులకు ప్రీతి పాత్రమైన కార్తిక మాసంలో శుక్లపక్షం విష్ణువు కూ, కృష్ణపక్షం శివుని కీ విశేష ప్రీతికరం కాగా రేపు ఆ కృష్ణ పక్షము లో శివునికి విశేషమైన  ఆర్ద్రానక్షత్రం మరియు గణపతి కి పూజనీయమైన సంకష్టహరచతుర్థి కలిసిన త్రిపర్వం కాబట్టి మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో మూలవిరాట్ లకు ఉదయం 8 గంటల నుండి న్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించబడుతుంది. ఆసక్తి గల భక్తులందరూ ప్రత్యక్షంగా గానీ,పరోక్షంగా గానీ పాల్గొని స్వామి వారల అనుగ్రహంతో సమస్త సంకటములనూ పోగొట్టుకొని అన్ని సత్కార్యముల యందునూ దిగ్విజయంపొంది ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లగలరు.స్వామి వారి అనుగ్రహం కోరుకునే వారు  వారి వారి గోత్రనామములను మా వాట్సాప్ నంబర్ 9492050200 కు పంపగలరు.

*అభీష్ట గణపతి ఆలయ ట్రస్ట్*

 ౪౪౪ ఆలోచనాలోచనాలు ౪౪౪                                    ( అక్షరరూపం దాల్చిన ఒక సిరా చుక్క ; లక్ష మెదళ్ళకు కదలిక!)                                1* ఒక పసిపిల్లవాడిని యోగ్యుడిగా మార్చడానికి, తల్లి 20 సంవత్సరాల కాలాన్ని తీసుకొంటుంది. భార్య వాడ్ని తెలివితక్కువ వాడిక్రింద జమకట్టడానికి 20 నిముషాల సమయం చాలు!                                 2* మనిషి సరదాగా కొంచెం మద్యాన్ని మాత్రమే పుచ్చుకొంటాడు. లోనికి పోయిన ఆ ద్రవపదార్దం మరికొంతను ఆకర్షిస్తుంది. ఆ తరువాత మద్యమే ఆ తీసుకొన్న మనిషిని లోబరుచుకొని, వాడి చేత సమాజం మెచ్చని పనులను చేయిస్తుంటుంది. -- జపాన్ దేశపు సామెత.                    3* డబ్బు పోగొట్టుకున్నవాడు - కొంత పోగొట్టుకొంటాడు.                   స్నేహితుణ్ణి పోగొట్టుకొన్నవాడు ఎక్కువ పోగొట్టుకొంటాడు.                  విశ్వాసం పోగొట్టుకొన్నవాడు అంతా పోగొట్టుకొంటాడు.                 4* ఒక వ్యక్తిని పడగొట్టినవాడు బలవంతుడైతే,అతడిని పైకి లేపి నిలబెట్టినవాడు మిక్కిలి బలవంతుడు.            5* పూల సుగంధం గాలివాలుతోనే వ్యాపిస్తుంది. కానీ మంచివారి సౌజన్యం , ఎదురు గాలికి కూడా వ్యాపిస్తుంది.                          6* నేనేది ఖర్చు పెట్టానో, అది నేను పోగొట్టుకొన్నట్లే!     నేనేది దాచిపెట్టానో అది నేటికి నేను కలిగివున్నట్లు!     నేను ఇప్పుడు దేనిని పంచిపెడుతున్నానో, దానిని నేను రేపటికి కలిగివుంటాను.                      7* మనుష్యులు తరచూ ఒంటరివారై పోతుంటారు. ఎందుకంటే వారు జగత్తులో వంతెనల కంటే గోడలనే ఎక్కువ కట్టుకొంటూవుంటారు కదా!          8* సరియగు సమయానికి నిద్రించడం ఒకరి రోగాన్ని సగానికి తగ్గిస్తుంది. మిగిలిన సగం సరియైన సమయానికి నిద్ర లేవడం ద్వారా!                                9* నౌకాశ్రయంలో ఓడ సురక్షితమే! కానీ దానిని తయారుచేసింది అట్లా ఓడరేవులో భద్రంగా, ప్రదర్శన వస్తువుగా ఉంచడానికి కాదుగదా!         10* కుక్క చర్మపు సంచీలోని గంగాజలం ఎంత పవిత్రమైనదో, శీలహీనునిగల సంపద అంత పవిత్రమైంది.               11* వేల సూర్యులు, చంద్రులు పోగొట్టలేని అజ్ఞానపు చీకట్లను మహాపురుషుల అమూల్య వాక్కులు పోగొట్టగలుగుతాయి.             12* ప్రతివాడు సమాజాన్ని మార్చాలని ఉబలాటపడేవాడే! కానీ సమాజానికి అనుగుణ్యంగా తాను మారటానికి ఇష్టపడడు.-- టాల్ స్టాయ్.                       14* స్నేహితానికి(+) కూడిక గుర్తు మంచిది. కానీ శత్రుత్వానికి (౼) తీసివేత కలిసి వస్తుంది.                       "" ఆనో భద్రాః క్రతవోయన్తు విశ్వతః""-- ఋగ్వేదం 1వ మండలం, 89 సూక్తం.           " మనకు అన్నివైపులనుండి ఉదాత్త భావనలు లభించుగాక!"           ( Let noble thoughts come from every side.).             Dt 30-- 11--2023, Thursday, Good morning.

 శ్రీభగవాన్ వామన మూర్తి


బలిదనుజుని  మదమణచగ

పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా 

యిలమూడడుగుల నడిగియు 

పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్ 


ఇంతింతగుచును విశ్వము 

సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై 

వింతగు రూపము దాల్చియు 

స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్ 



శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ 

           చిరునవ్వు లొలికించు చిన్ని వటువు

దారు కమండలు దాల్చి తా కరమందు 

          విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు 

పావన దర్భలు పట్టియు న్నొకచేత 

          నతి ప్రసన్నత నున్న యర్భకుండు 

హస్తంబు  పైకెత్తి యభయంబు నిడుచుచు 

          గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర 

ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప 

వామనుని వోలె వచ్చియు  వరము నడిగి 

విశ్వమును నిండి వెల్గిన  విష్ణువునకు 

ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 16*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*16. రుద్ర పశుపతి నాయనారు*


తిరుత్తలైయూరు అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో

జన్మించాడు పశుపతి. అతడు చిన్నప్పటి నుండి పరమేశ్వరుని భక్తితో

సేవిస్తూ వచ్చాడు. 


రుద్రసూత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన ఇతనికి

రుద్రపశుపతి అనే పేరు కలిగింది రోజూ ప్రాతఃకాలంలోనే లేచి మెడవరకు  నీటిలో నిలబడి రెండు చేతులనూ శిరసుపై మోడ్చి భక్తితో రుద్రసూక్తాన్ని

పఠించేవాడు. రుద్ర పశుపతి తపోభక్తికి ప్రసున్నుడై పరమేశ్వరుడు అతనికి

శివలోక సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

*పదహారవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 శ్రీభగవాన్ వామన మూర్తి


బలిదనుజుని  మదమణచగ

పలుయమరుల మొరలు వినియు బాలక వటుగా 

యిలమూడడుగుల నడిగియు 

పలులోకములెల్ల గొలిచె పాదము తోడన్ 


ఇంతింతగుచును విశ్వము 

సాంతంబుగ ప్రోచె జగతి సర్వేశుండై 

వింతగు రూపము దాల్చియు 

స్వాంతంబున బలిని మెచ్చి సద్గతి నిచ్చెన్ 



శ్రీకరంబైనట్టి చిరుత కూకటి తోడ 

           చిరునవ్వు లొలికించు చిన్ని వటువు

దారు కమండలు దాల్చి తా కరమందు 

          విజ్ఞాన ఖనివోలె వెల్గు వాడు 

పావన దర్భలు పట్టియు న్నొకచేత 

          నతి ప్రసన్నత నున్న యర్భకుండు 

హస్తంబు  పైకెత్తి యభయంబు నిడుచుచు 

          గొడుగుతో నున్నట్టి వడుగు కుర్ర 

ఘనుడు బలిచక్రవర్తిపై కరుణ జూప 

వామనుని వోలె వచ్చియు  వరము నడిగి 

విశ్వమును నిండి వెల్గిన  విష్ణువునకు 

ప్రణతు లర్పించు చుంటిని భక్తితోడ


✍️గోపాలుని మధుసూదన రావు 🙏

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *92వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*శుక్రగ్రహ చరిత్ర - 4*


*"ఎలాగైనా సరే , నువ్వు జయించి తీరాలి ! ఆ రాక్షస గురువు , గురు రాక్షసుడూ అయిన శుక్రుడి తపస్సు భగ్నం కావాలి !"* ఇంద్రుని మాటలు జయంతి చెవుల్లో గింగిరుమన్నాయి.


ఎదురుగా , దూరంగా ఎండలో తపస్సమాధిలో కూర్చున్న శుక్రుడి మీద ఆమె చూపులు తాపడం అయిపోయి ఉన్నాయి.


*“గురు రాక్షసుడు...”* తండ్రి మాట ఆమెకు మళ్ళీ గుర్తొచ్చింది. జయంతి పెదవులు చిరునవ్వుతో కదిలాయి. తన తండ్రి శుక్రుడిని చూసినట్టు లేదు. చూసి ఉంటే - అంత అందగాణ్ణి 'గురురాక్షసుడు' అంటాడా !


అద్భుతమైన ముఖ వర్చస్సు ! మెరిసిపోతున్న దేహ కాంతి ! గుండ్రటి భుజాలు ! వెడల్పాటి వక్షపీఠం ! పొడుగాటి చేతులు ! ముఖ్యంగా దృష్టిని లాగుతున్న మూసిన రెప్పల కింద దాగిన పెద్ద పెద్ద కళ్ళు ! బోర్లించిన అరచేతుల్లాంటి రెప్పల పైన వంకీలు తిరిగిన కనుబొమలు ! స్వర్గంలో కూడా తనకు ఇంత వరకూ కనిపించని పురుష సౌందర్యం... *"గుర్తుంచుకో తల్లీ ! ఆ దుర్మార్గుడు 'మృతసంజీవని'ని సాధిస్తే మనకు అత్యంత ప్రమాదం ! నీ అందచందాలు ఉపయోగించు ! శుక్రుడికి దీక్షాభంగం జరిగేలా చూడు ! అతన్ని వివాహం చేసుకో !..."*


*"నీకు సంపూర్ణ స్వాతంత్య్రం ఇస్తున్నాను ! ఆ శుక్రుణ్ణి పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం ! నీ లక్ష్యం ఒక్కటే. శుక్రుడికి మృతసంజీవని దక్కకూడదు"* 


తండ్రి తనను ఉద్బోధిస్తూ ఆవేశంగా పలికిన పలుకులు జయంతి అంతరంగంలో ప్రతిధ్వనించాయి.


*"పతితుణ్ణి చేస్తావో , పతిగా చేసుకుంటావో నీ ఇష్టం !"*


*"శుక్రుడికి మృతసంజీవని..."*


జయంతి అసహనంగా తల విదిల్చింది. తండ్రి మాటల ప్రతిధ్వనిని దూరంగా తరిమి వేస్తూ.


ఆమె పాదాలు మెల్లగా ముందుకు కదిలి , ఆమెను శుక్రుడికి మరికొంచెం దగ్గరగా తీసుకెళ్ళాయి. ఆమె చూపులు తమ అదృశ్య హస్తాలతో శుక్రుడి శరీరాన్ని స్పృశిస్తున్నాయి. ఆయన శరీరంలోంచి యౌవన తేజం పొంగిపొర్లుతోంది. తపస్సమాధి ఆయన పట్టుదలను సూచిస్తోంది. శరీరమంతా స్వేదబిందవులు అలంకరించిన పూలలా ఉన్నాయి.


జయంతి నిట్టూర్చింది. శుక్రుడి వర్చస్సు , తేజస్సు తనను సమ్మోహన పరుస్తున్నాయి. తండ్రి తనకు స్వాతంత్య్రం ఇచ్చాడు సంపూర్ణంగా ! తాను ఆయనను పతితుణ్ణి చేయదు. పతిగా స్వీకరిస్తుంది. తాను ఆయన తపస్సును పాడు చేయదు. ఫలవంతం కావడానికి సహకరిస్తుంది. మృతసంజీవని ! తన భర్త చేతిలో మృతసంజీవనీ విద్య ఉంటే ఏం ? ఉండాలి !


నిర్ణయం ఆమెకు కొండంత బలం ఇచ్చింది. తండ్రినీ , ఆయన ఆజ్ఞనూ మరిచిపోతూ , జయంతి శుక్రుడి సమీపానికి చేరింది. చెమటతో తడుస్తున్న ఆయన శరీరాన్ని చూస్తూ పైట చెరగును వీవనంగా రెండు చేతుల్తో పట్టుకొని విసరబోతూ ఆగింది.


కొంగు గాలి శృంగార సంకేతం ! శుక్రుడికి ప్రస్తుతావసరం శృంగార సంకేతం కాదు. శుశ్రూష ! జయంతి ఆత్రుతగా చుట్టూ పరికిస్తూ చూసింది. పొడుగాటి ఆకులున్న అరటి చెట్టు ఆమెను ఆహ్వానిస్తోంది , గాలికి స్పందిస్తూ. 


జయంతి వెళ్ళి జాగ్రత్తగా అరటి ఆకులు కోసి తెచ్చింది. ఒక కదళీ పత్రాన్ని శుక్రుని మీద ఎండ పడకుండా నీడలా పట్టుకుంది. రెండవ దానితో అతనికి విసరడం ప్రారంభించింది. కదళీపత్రవీవన !


శుక్రుని తపస్సు సాగుతూనే ఉంది. 


జయంతి శుక్రుడు కూర్చున్న స్థలం చుట్టూ , సెలయేటి నీటితో అలుకుతోంది. ప్రతి ఉదయమూ పూల లోంచి సేకరించిన పుప్పొడులతో ముగ్గులు పెడుతోంది. 


తామరాకు దొన్నెలో సెలయేటి స్వచ్ఛ జలం తెచ్చి , తన చేలాంచలాన్ని తడిపి , శుక్రుడి శరీరాన్ని సున్నితంగా తుడుస్తోంది. ఎండ ఉన్నంత సేపూ అరటి ఆకును సూర్యుడికి అడ్డంగా పట్టుకుంటోంది , విసుగూ , విశ్రాంతి లేకుండా.


ప్రతి ఉదయమూ కందమూలాలూ పళ్ళూ సేకరించి , ఆయన తాత్కాలికంగా తపస్సు విరమించి , ఆహారం స్వీకరిస్తాడేమో అన్న ఆశతో వేచి చూస్తోంది.


రాత్రి వేళల్లో ఆయనకు కొద్ది దూరంలో చేతినే తలగడగా చేసుకుని , నేల మీద యనిస్తోంది.


కాలం పరుగెడుతోంది. శుక్రుడి తపస్సు ఏకదీక్షతో సాగుతోంది. జయంతి శుశ్రూష కూడా ఏకదీక్షగా సాగుతోంది. శుక్రుడి లోకం తపస్సు. జయంతి లోకం ఆయన సేవ.


********************************


*"నాథా ! జయంతి వెళ్ళి ఎంత కాలమైందో గుర్తుందా ?”* శచీదేవి ఇంద్రుణ్ణి అడిగింది.


*"ఎంతకాలమైందో , రోజులలో , ఘడియలలో , విఘడియాలలో కూడా చెప్పగలను దేవీ !"* ఇంద్రుడు చిరునవ్వు నవ్వాడు.


*"నాకెందుకో ఆందోళనగా ఉంది. జయంతి...”* శచీదేవి ఏదో చెప్పబోయింది.


*"జయంతి తిరిగి వస్తుంది ! ఆలస్యం నాకు కూడా ఆందోళన కలిగిస్తోంది. అందుకే ఆచార్యులను రమ్మన్నాను..."* ఇంద్రుడు సముదాయింపుగా అన్నాడు.


*“మహేంద్రా !"* మందిర ద్వారం దాటుతూ , పలకరించాడు బృహస్పతి.


*"దయచేయండి, గురుదేవా !”* ఇంద్రుడు సగౌరవంగా బృహస్పతిని ఆహ్వానించాడు.


*"కాలం గడిచిపోతుంది. జయంతి తిరిగి రాలేదు. ఆ ప్రయత్నంలో విజయం సాధించిందో , లేక ఏదైనా అపాయానికి గురి అయ్యిందోనని శచి ఆందోళన చెందుతోంది..."* ఇంద్రుడు బృహస్పతితో అన్నాడు.


బృహస్పతి కూర్చుంటూ, చిరునవ్వు నవ్వాడు. *“ఆ ప్రయత్నంలో జయంతికి విజయమో , పరాజయమో ఎదురవుతుంది తప్ప , అపాయం సంభవించదు ! శుక్రుడు సామాన్య తాపసి కాదు కదా ! సాక్షాత్తుగా శివుడి జఠరం ప్రవేశించి , సజీవంగా బైటపడిన మహా శక్తిశాలి ! అలాంటి మహా యోగులను లొంగదీయడం అనేది అంత త్వరితంగా అయ్యేది కాదు !"*


*"ఏమో గురుదేవా... చిన్నదాని క్షేమం గురించి నాకు భయంగా ఉంది !"* శచీదేవి అంది.


*“ఆందోళన అవసరం లేదు , ఇంద్రాణీ ! నిశ్చింతగా ఉండండి !"* అంటూ బృహస్పతి ఇంద్రుడి వైపు తిరిగాడు. *"మహేంద్రా ! జయంతీ శుక్రుల ఉదంతాన్ని అటుంచి , అసురుల గురించి ఆలోచించాలన్న తలంపు కలిగింది ! శుక్రుడు అందుబాటులో లేడు. వాళ్ళకి మంత్రాలోచన చెప్పే వారు లేరు ! రాక్షసుల మీద దండయాత్ర చేయడానికి ఇది అనువైన సమయం !"*


ఇంద్రుడు తల పంకిస్తూ చూశాడు.


*“అసుర సైన్యం ప్రస్తుతం బలహీనంగా ఉంది. యుద్ధానికి ముహూర్తం నిర్ణయిస్తాను !”* బృహస్పతి అన్నాడు.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 102*


భారత పర్యటన....బయలుదేరుతున్నారు..


తల్లితండ్రులు, చుట్టాలూ, పక్కాలూ, మిత్రులు అందరినీ వదలిపెట్టి ఒంటరిగా జీవించాలి; ఏ స్థలంలోనూ స్థిరంగా ఉండిపోకుండా సంచారం చేస్తూనే ఉండాలి;  చేతకర్ర, కమండలం మాత్రమే తీసుకొని వెళ్లాలి. ఆత్మను మాత్రమే తోడుగా చేసుకోవాలి - ఒక సన్న్యాసి ఈ విధంగా జీవించాలని కోరుకొంటాడు. స్వామీజీ ఆశయం కూడా అదే. అలాంటి జీవితం కోసం ఆయన పరితపించారు. కాని ఆయన ఒంటరిగా పోవడం సోదర శిష్యులకు సుతరామూ ఇష్టం లేదు. అంతేకాదు; బయలుదేరాలని అనుకొన్నప్పుడల్లా ఏవేవో అవాంతరాలు వాటిల్లాయి. 


ఆయన దూర ప్రయాణం చేసి వెళ్లినది వారణాసి (కాశీ) మాత్రమే.  మహాశ్మశాన వాటికగా ఈ స్థలం పేర్కొనబడుచున్నది. ఈ క్షేత్రంలో మరణించే వారందరికీ ముక్తి లభిస్తుందని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఇక్కడే నివాసం ఏర్పరచుకొని తపస్సు, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తే ఎనలేని ఫలం ప్రాప్తిస్తుందని హైందవుల విశ్వాసం. స్వామీజీ కూడా తమ పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు. 


కాశీలో బసచేసిన రోజుల్లో స్వామీజీ పలువురు సన్న్యాసులను, సర్వజ్ఞులను కలుసుకొన్నారు. వారిలో త్రైలింగస్వామి, భాస్కరానంద ముఖ్యులు,


గొప్ప మహాత్మునిగా ఖ్యాతిగాంచారు త్రైలింగస్వామి. 1868 జనవరిలో శ్రీరామకృష్ణులు కాశీ సందర్శించినప్పుడు ఈయనను కలుసుకొని, "ఈయనలో నిజమైన పరమహంస లక్షణాలున్నాయి" అని వ్యాఖ్యానించారు. మణికర్ణికా ఘట్టంలో నివసిస్తున్న త్రైలింగస్వామిని స్వామీజీ దర్శించారు. "త్రైలింగస్వామి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా ఉన్నారు. అలాగని ఆయన ఉపదేశం ఏమీ చేయలేదని భావించరాదు. మౌనమే ఆయన ఉపదేశం" అంటూ కాలాంతరంలో ఆయన గురించి స్వామీజీ వ్యాఖ్యానించారు.


తమ స్వాధ్యాయ, తపోమయ జీవితం వలన భాస్కరానంద ఎనలేని గౌరవ మర్యాదలను పొందారనడం అతిశయోక్తి కాదు. సామాన్యంగా ఆయన దిగంబరం గానే జీవించేవారు. ఈయనను కూడా స్వామీజీ కలుసు

 కొన్నారు. స్వామీజీ ముఖారవిందాన తాండవిస్తున్న దివ్య తేజస్సును చూసి భాస్కరానంద ఆయనను ఆదరాభిమానాలతో ఆహ్వానించారు. వారిద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకొన్నారు. సంభాషణ మధ్యలో భాస్కరానంద, "కామినీ కాంచనాలను సమూలంగా ఎవరూ త్యజించలేరు" అన్నాడు. 

 

అందుకు స్వామీజీ, "స్వామీ, మీరేమంటున్నారు? వాటిని సంపూర్ణంగా త్యజించిన వ్యక్తులు ఎందరో ఉన్నారు! ఒక సన్న్యాసి జీవితమూ, లక్ష్యమూ అదే కదా! కామినీ కాంచనాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేసిన వ్యక్తిని నేను చూశాను" అన్నారు. ఆ మాటలు విని భాస్కరానంద చిన్నగా నవ్వి, “నువ్వు చిన్న వాడివి. నీకేం తెలుసు?" అన్నాడు. ఇది విన్నాక స్వామీజీ ఊరకే ఉండలేక పోయారు. 


కామినీకాంచనాలను జయించిన శ్రీరామకృష్ణుల మహోన్నత జీవితం స్వామీజీ మనస్సులో మెదలింది. దానిని వివరించి, ఉద్వేగంతో తమ భావనలను ప్రకటించారు. స్వామీజీ ఉద్వేగపు వెల్లువను గమనించిన భాస్కరానంద ప్రక్కన ఉన్నవారితో, "ఆహా! ఈయన నాలుక మీద సరస్వతీదేవి కొలువై ఉంది. ఈతడి మనస్సు మహోజ్జ్వల కాంతితో ప్రకాశిస్తున్నది" అన్నాడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

 🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

.          *⚜️పెరియ పురాణం⚜️*

.           *నాయనార్ల చరిత్ర - 16*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 

*16. రుద్ర పశుపతి నాయనారు*


తిరుత్తలైయూరు అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలో

జన్మించాడు పశుపతి. అతడు చిన్నప్పటి నుండి పరమేశ్వరుని భక్తితో

సేవిస్తూ వచ్చాడు. 


రుద్రసూత్రాన్ని భక్తిశ్రద్ధలతో పఠించడం వలన ఇతనికి

రుద్రపశుపతి అనే పేరు కలిగింది రోజూ ప్రాతఃకాలంలోనే లేచి మెడవరకు  నీటిలో నిలబడి రెండు చేతులనూ శిరసుపై మోడ్చి భక్తితో రుద్రసూక్తాన్ని

పఠించేవాడు. రుద్ర పశుపతి తపోభక్తికి ప్రసున్నుడై పరమేశ్వరుడు అతనికి

శివలోక సాయుజ్యాన్ని ప్రసాదించాడు.

*పదహారవ చరిత్ర సంపూర్ణం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🔱🔱⚜️⚜️🔱🔱⚜️⚜️🔱🔱

 'ఓట'ను దివ్యాస్త్రమ్మును

ఓటరు తా పూని మదిని యోపిక తోడన్

దీటుగ పోలింగ్ వద్దను 

'మీట'ను తా నొక్క వలయు మేలగు మదితో

 డాక్టర్ దేవులపల్లి పద్మజ 


గురు'జాడ పుత్తడిబొమ్మ పూర్ణమ్మ 


మాత్రాచందస్సులో  ముత్యాలసరాలు అప్పటి కొత్త ఛందోరీతి లోరాసిన గేయం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ.  సుమారుగా 1890 తరువాత రాసినట్టు అంచనా. గురు'జాడలలో ఒక ఆణిముత్యం ఈ గేయం. వారు అదే సమయంలో రాసిన దేశభక్తి గేయం ప్రభావం వందశాతం అనుసరించవలసిందే. 

       19 శతాబ్దం నాటికి బాలికల, మహిళల స్థితిగతులు పూర్తిగా ఈ గేయంలో మనకి ద్యోతకమవుతుంది. బ్రిటిష్ పాలకుల నిరంకుశ ధోరణి ఒకవైపు,  గృహంలో  ఎదుర్కొంటున్న   వేధింపులు మరోవైపు మహిళల, బాలికల మనోవ్యధకు గురై, నిరాశ, నిస్పృహలతో 




 చావలేక సంతోషం చైతన్యం లేని జీవితంతో నెట్టుకొస్తున్న వైనం అని అప్పటి సామాజికతను తెలియచేస్తోంది. 

     సమాజంపై పూర్తి అవగాహన ఉండి, రుగ్మతలను రూపుమాపాలనే జిజ్ఞాస ఉంటే రచయితగా ఉత్తమ ఫలితాలను సాధించి సంస్కర్తగా కీర్తిశిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించిన మన గురజాడ వారు,  మనకి గురు'జాడలే అందించారు.  ఆ జాడలలో ఒకటి పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం.

     పుత్తడిబొమ్మ పూర్ణమ్మ అనే  గేయ కావ్యం ఒక  ముగ్ధ , అందాలరాశి అయిన ఓ కన్య బ్రతుకు, తండ్రి గల ధనాశ కి బలైపోయిన తీరును వర్ణిస్తూ సమాజాన్ని అప్పటి దురాచాలని రూపుమాపే ఇతివృత్తం  ఈ కథలో వివరించారు గురజాడ. 

        కలువల వంటి చక్కనైన కన్నులు కలిగి, పచ్చని బంగారు ఛాయతో, లోకమెరుగని  బంగారు పాపల్లారా  మీలాగే ఆడుకునే   అమ్మాయి పూర్ణమ్మ కథ  విన్నారా?  అంటూ ప్రశ్నించిన వైనం. 

     ఆటల పాటల పేటికలారా!

       కమ్మని మాటల కొమ్మల్లారా!

        అమ్మలగన్నా అమ్మల్లారా!

         విన్నారమ్మా మీరీ కథను ?


వచ్చీరానీ ముద్దు ముద్దు మాటలతో అలరించే బాలికలారా,  బాల్యంలోనే తల్లైపోయిన పాపల్లారా

ఈ కథ వినండి అని చెప్పడం ప్రారంభించారు.

        కొండల మధ్యలో ఒక కోన,  ఆ కోన మధ్య ఒక కొలనుంది.  ఆ కొలను గట్టున కోవెల ఉంది. ఆ కోవెలలో వెలసిన బంగారు దుర్గమ్మ  కొలువై �

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే!*

               🌷🌷🌷

*కలియుగాబ్ది 5124* *శ్రీ శాలివాహన శకం 1944 స్వస్తి శ్రీ    చాంద్రమాన శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - శరదృతువు - కార్తీక మాసం - కృష్ణ పక్షం  -‌ తృతీయ -‌ఆర్ధ్ర -‌  గురు వాసరే* *(30-11-2023)* 


ప్రముఖ వేదపండితులు,  *బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* గారి నేటి వేద ఆశీర్వచనం.


https://youtu.be/kO6hE4WvG8w?si=dMzbFrn5j1gF23Hf


🙏🙏

 •••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*30-11-2023 / గురువారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


వ్యాపార విషయంలో కుటుంబ పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయటా మానసిక సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. 

---------------------------------------

వృషభం


చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు  వేగవంతం చేస్తారు. వ్యాపార విస్తరణకుపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి.  పాతరుణాలు తీర్చాగలరు.

---------------------------------------

మిధునం


ఇంటాబయటా నూతన సమస్యలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో చిన్నపాటి మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

---------------------------------------

కర్కాటకం


వృత్తి ఉద్యోగాల్లో మీ హోదా పెరుగుతుంది. సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి  కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల నూతన విద్యావకాశములు లభిస్తాయి. 

---------------------------------------

సింహం


బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశించిన విధంగా ఉంటుంది.

---------------------------------------

కన్య


చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.  ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. 

---------------------------------------

తుల


ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆకారణ వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. 

---------------------------------------

వృశ్చికం


నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


గృహ నిర్మాణ ఆలోచనలో ఆచరణలో పెడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట మానసిక ప్రశాంతత కలుగుతుంది.  చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారులు అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

---------------------------------------

మకరం


బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు. దైవ చింతన పెరుగుతుంది. 

---------------------------------------

కుంభం


చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలుచేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలలో తీసుకున్న  నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు కలసిరావు.

---------------------------------------

మీనం


సమాజంలో పేరుకలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

 శు భో ద యం🙏


దాశరధీ!  కరుణా పయోనిధీ !


          ఉ:  ఎంతటి పున్నెమో  శబరి  యెంగిలిగొంటివి ;  వింతగాదె !  నీ


                 మంతన మెట్టిదో యుడుత మైని   కరాగ్ర  నఖాంచలమ్మునన్


                సంతస  మందఁజేసితివి ; సత్కుల  జన్మము  లేమి  లెక్క?   వే


               దాంతము  గాదె  నీమహిమ!  దార

శరధీ !కరుణా  పయోనిధీ !


                            దాశరధి శతకము--  రామదాసు  (కంచర్ల గోపన్న) 


                     దయా సాగరా !శ్రీరామ చంద్రా ! యెంతపుణ్యం  చేసినదో  శబరి  ఆమెయొసఁగిన  యెంగిపండ్లను  తిన్నావు..

నీవుచేసే  వింతలెన్నని  విన్నవించగలను? వారధినిర్మాణ సమయంలో  మేనికంటిన  యిసుకను  దులిపినంత మాత్రానికే  ఆయల్ప

ప్రాణి  ఉడుత  శరీరమును  నీవ్రేళ్ళతోనిమిరి సత్కరించావు. నేటికీ  ఆవ్రేలిగుర్తులు వానిమేనిపై  నలంకారములై  నిలచియున్నవిగదా!


                              సత్కుల మందు జన్మించుట  ప్రసిధ్దు లగుట  యిత్యాదు లెవ్వియు  నీకృపకు అర్హతలు కానేకావు. వారేకులము వారైనా  అల్పులైనా  ప్రాణితతిలో  నెవ్వరైనను  నీకృపకు పాత్రులే యగుట తథ్యము. నీమహిమ  వేదాంతమే  గదా!


                                నీ కృపా పాత్రులకు  మోక్షము లభించుట  వింతగాదని  కవియభిప్రాయము!


                                                                     స్వస్తి!🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

 *ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్త్వార్థవర్ణాత్మికామ్ గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే*


అని మన సంధ్యావందనములో గాయత్రి మాతను స్మరించుకొంటాం కదా.


ఆ మంత్ర తాత్పర్యము ఇదిగో:


ముత్యపు వర్ణము, పగడపు వర్ణము, బంగారపు వర్ణము, నీలవర్ణము, తెల్లని వర్ణము గల ఐదు ముఖములు కలిగినదియు, ప్రతిముఖమునకు మూడు నేత్రములు కలిగినదియు, చంద్రకళతో కూడిన కిరీటము కలదియు, పరమార్థ వివరాణత్మక బీజాక్షరములు కలిగినదియు, వరద మరియు అభయముద్రలు, అంకుశము, కొరడా, స్వచ్ఛమైన కపాలము, శంఖము, చక్రము, గద, రెండు పద్మములను తన పది హస్తములందు ధరించునదియుయైన గాయత్రీదేవిని సేవించెదను.


ఇక్కడ నా సందేహం ఏంటంటే మొదటి పాదాలలో అంతటి శాంత మూర్తిగా వర్ణింపబడిన గాయత్రి దేవికి అంకుశం, కొరడా, కపాలం మరియు గదలను ఎందుకు ఆపాదించవలసి వచ్చినదో మరి, అర్థం కావడం లేదు. 


ఒక వేళ గాయత్రి మాత స్వరూపాన్ని ఇలాగే వర్ణింపబడాలంటే దానికి మరో భేదాభిప్రాయము ఉండదు.


అయినా దీనిపై లోతుగా ఆలోచించిన వారు ఏవైనా కొంత వివరణ ఇవ్వగలరేమో.

 శ్లోకం:☝️ పశుపతి

*బ్రహ్మాద్యాః స్తంబ పర్యంతాః*

    *పశవః పరికీర్తితాః |*

*తేషాం హి నాయకో యస్మాత్*

    *శివః పశుపతిః స్మృతాః ||*


భావం: బ్రహ్మ మొదలుగా స్థావర జంగమాత్మకమైన ఈ సృష్టిలోని పదార్థాలన్నీ "పశువులు''గా చెప్పబడ్డాయి.ఈ పశువులన్నింటికీ శివుడు నాయకుడు కనుక, ఆయన *పశుపతి* అయినాడు. అందుకే *నమో భవాయ చ రుద్రాయ చ నమశ్శర్వాయ చ పశుపతయే చ* అని నమకం చెప్తుంది. *పశు* శబ్దానికి కొంతమంది కనిపించేవి (objective world) అని అర్థం చెబుతారు.*పశ్* ధాతువుకి కనిపించు (పశ్యతి) లేదా చూడు అని అర్థం వస్తుంది. ఈ కనిపించే విశ్వానికి ఆయన ఈశ్వరుడు కనుక పశుపతి అని అర్థం చెబుతారు.🙏

 ఈ రోజు పంచాంగం 30.11.2023  Thursday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం శరదృతు  కార్తీక మాస కృష్ణ పక్ష: తృతీయా తిధి బృహస్పతి వాసర: ఆర్ద్ర నక్షత్రం శుభ యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


తదియ మధ్యాహ్నం 02:29 వరకు 

ఆర్ద్ర మధ్యాహ్నం 03:04వరకు 

సూర్యోదయం : 06:33

సూర్యాస్తమయం : 05:36

వర్జ్యం :  రాత్రి 03:54 నుండి 05:36 వరకు.

దుర్ముహూర్తం : పగలు 10:14 నుండి 10:58 వరకు తిరిగి మధ్యాహ్నం 02:39 నుండి 03:23 వరకు.


శుభోదయ:, నమస్కార: