25, ఏప్రిల్ 2026, శనివారం

మూత్ర కృచ్చ వ్యాధి

 మూత్ర కృచ్చ వ్యాధి - కారణాలు - నివారణ .


మూత్రం అతికష్టంగా బయటకి రావడమే మూత్రకృచ్చ వ్యాధి అంటారు. మూత్రం సాఫీగా ధారాళంగా బయటకి రాకుండా అగిఆగి కొద్దికొద్దిగా అది కూడా చాలా కష్టంగా వస్తుంది .


కారణాలు -


ముత్ర ద్వారంలో కొన్ని రకాల వాయువులు బిగబట్టడం లేదా ఏవైనా వ్యర్ధపదార్ధాలు అడ్డుపడటం వలన మూత్రం కష్టంగా వెలువడుతుంది. దీనికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు . మనశరీరానికి విరుద్ధమైన ఆహారం సేవించడం వలన శరీరంలో ఎల్లప్పుడూ సమానంగా ఉండవలసిన వాత,పిత్త,కఫ దోషాలు చెడిపోయి అసమానమై ఈ మూడు దోషాలు విడివిడిగా కాని , ఏ రెండు కలిసి అయినా కాని లేక మూడు ఒకేసారి ప్రకోపించి మూత్రాశయంలో ను , మూత్రపిండాలలోను చేరి మూత్రప్రసరణకి ఆటంకం కలిగించడం వలన "మూత్రకృచ్చం " అనే వ్యాధి సంభవిస్తుంది.


నివారణ -


చిన్న ఏలకులు , కొండపిండి చెట్టు సమూలం , కర్పూర శిలాజిత్తు , పిప్పిళ్లు వీటిని సమభాగాలుగా దంచి చూర్ణం కొట్టి పూటకు 6 గ్రాముల మోతాదుగా బియ్యం కడిగిన నీటితో కలిపి రెండు పూటలా తాగిస్తూ ఉంటే మూత్రం బిగించడం వలన మృత్యుముఖానికి చేరిన రోగులకు కూడా మూత్రం ధారళంగా వెలువడి జీవించగలరు .


నా అనుభవ యోగం -


మూత్రం బిగించి క్షణక్షణంకి కడుపు ఉబ్బుతున్న ఒకరికి తమలపాకు కి ఆముదం పూసి క్యాండిల్ కి దగ్గరగా తమలపాకు పెట్టి వేడి చూపించి పొత్తి కడుపు భాగంపై వేశాను . 10 నిమిషాలలో మూత్రం ధారళంగా వెలువడినది.


ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .



భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్

 భగవద్గీత, వేదాంతాలలో క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ (Quantum Entanglement) భావనలు మనకు కనిపిస్తాయి.


ఎలాగో చూద్దాం!


మొదటగా క్వాంటమ్ ఎంటాన్గిల్మెంట్ అంటే సరళంగా ..

క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) అనేది ఆధునిక భౌతిక శాస్త్రంలో అత్యంత విస్మయకరమైన అంశం. రెండు కణాలు ఎంత దూరంలో ఉన్నా (విశ్వం అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి ఉన్నా), ఒక కణం యొక్క స్థితిని మార్చితే, రెండో కణం యొక్క స్థితి తక్షణమే మారుతుంది. ఈ మార్పు కాంతి కన్నా వేగంగా ఉంటుంది. అనగా కాంతి యూనివర్స్ లో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించడానికి కొన్ని కాంతి సంవత్సరాలు పడితే, క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం అంటే దూరం లో ఉన్న కణాల స్థితి మారటానికి ఎట్టి సమయమూ పట్టదు.



భగవద్గీతలోని శ్లోకాలు భౌతిక శాస్త్ర పరంగా రాకపోయినా, అందులో వివరించిన క్షేత్ర-క్షేత్రజ్ఞ విభాగం మరియు విభూతి యోగం క్వాంటం ఎంటాంగిల్మెంట్ (Quantum Entanglement) ఇచ్చే ఏకత్వ సందేశాన్ని అద్భుతంగా ప్రతిబింబిస్తాయి.


గీతలోని కొన్ని ముఖ్యమైన భావనలను ఎంటాంగిల్మెంట్‌తో పోల్చి చూద్దాం:


సర్వవ్యాపకత్వం (Interconnectedness)

క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత (గీత 13.3) - అన్ని శరీరాల్లో (క్షేత్రాలలో) ఉన్న తెలుసుకొనే శక్తి (క్షేత్రజ్ఞుడు) నేనే అని తెలుసుకో అని భావన.

ఈశావాస్యమిదం సర్వం యత్కిఞ్చ జగత్యాం జగత్ - ఈ చరాచర జగత్తు అంతటా ఆ పరమాత్మ వ్యాపించి ఉన్నాడు.



క్వాంటం ఎంటాంగిల్మెంట్ ప్రకారం, రెండు కణాలు ఎక్కడ ఉన్నా అవి ఒకే వ్యవస్థలో భాగమై ఉంటాయి. అలాగే, గీత ప్రకారం విశ్వంలోని ప్రతి అణువులోనూ ఒకే పరమాత్మ చైతన్యం ఉంది. అంటే, బాహ్యంగా మనం వేర్వేరుగా కనిపించినా, లోపల ఉన్న 'కనెక్టివిటీ' ఒక్కటే.


2. విభజన లేని ఏకత్వం (Unity in Diversity)

అవిభక్తం విభక్తేషు తజ్జ్ఞానం విద్ధి సాత్వికమ్ (గీత - 18.20) - విడిపోయి ఉన్నట్లు కనిపించే ప్రాణులన్నింటిలోనూ విభజించలేని ఒకే తత్వాన్ని చూడటమే నిజమైన జ్ఞానం.


ఎంటాంగిల్డ్ కణాలు కూడా మనకు స్పేస్‌లో విడివిడిగా (Separated) కనిపిస్తాయి. కానీ ఒక దాని స్థితి మారగానే రెండోది వెంటనే మారుతుంది—దీని అర్థం అవి 'అవిభక్తం' (Non-separated). భౌతిక దూరం అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే అని గీత మరియు క్వాంటం ఫిజిక్స్ రెండూ చెబుతున్నాయి.


3. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ (గీత - 7.7)

దారంలో గుచ్చిన పూసల వలె ఈ విశ్వమంతా నాలోనే పొదగబడి ఉంది.

ఒక దారాన్ని పట్టుకుని లాగితే అన్ని పూసలు కదిలినట్లే, క్వాంటం లెవల్‌లో విశ్వం ఒక 'క్వాంటమ్ ఫీల్డ్' (Quantum Field) తో అనుసంధానమై ఉంది. ఒక చోట జరిగే మార్పు విశ్వంలోని మరో మూల ప్రభావం చూపగలదు అనే నాన్-లోకాలిటీ (Non-locality) సిద్ధాంతానికి ఇది సరైన పోలిక.


4. కారణ-కార్య సంబంధం - ఎంటాంగిల్మెంట్‌లో ఒక కణం యొక్క 'స్పిన్' (Spin) మారితే రెండో దాని 'స్పిన్' తక్షణమే మారుతుంది. భగవద్గీతలో కర్మ సిద్ధాంతం మరియు ప్రకృతి గుణాల ప్రభావం కూడా ఇలాగే వివరించబడ్డాయి. మనం చేసే ప్రతి ఆలోచన లేదా చర్య ఈ విశ్వవ్యాప్తమైన వలలో (Cosmic Web) ఒక ప్రకంపనను సృష్టిస్తుంది.


అద్వైత మరియు సర్వం ఖల్విదం బ్రహ్మ అనే తాత్విక భావనలు క్వాంటం ఎంటాంగిల్మెంట్‌కు చాలా దగ్గరగా ఉంటాయి.


క్వాంటం ఫీల్డ్ థియరీ ప్రకారం, విశ్వమంతా ఒక శక్తి క్షేత్రం (Field) ఆవరించి ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పే బ్రహ్మ లేదా చైతన్యం కూడా ఒక నాన్-లోకల్ (Non-local) శక్తి. 


అంటే అది ఒక చోట ఉండి ఇంకో చోట లేకపోవడం అనేది ఉండదు. ఎంటాంగిల్మెంట్ కూడా ఈ నాన్-లోకాలిటీ సూత్రం మీదే పనిచేస్తుంది.


5. ఇంద్రజాలం (Indra's Net)

అధర్వణ వేదంలోని (8వ కాండ, 8వ సూక్తం, 8వ మంత్రం) ఇంద్రజలం అనే అద్భుతమైన భావన ఉంది. ఒక అనంతమైన వలలో ప్రతి సంధి వద్ద ఒక మణి ఉంటుంది. ఒక మణిని తాకితే, ఆ ప్రకంపనలు వలలోని అన్ని మణులకూ అందుతాయి.


వేదాంతం: సృష్టిలో ప్రతి అణువు ఇంకో దానితో ముడిపడి ఉంది, 'ఏకమేవాద్వితీయం బ్రహ్మ' (ఒకే మూలం), దేశ, కాలాలకు అతీతమైనది ఆత్మ అని చెపితే..


Quantum Entanglement అవే భావనలను కణాలు దూరంగా ఉన్నా స్పందిస్తాయి, ఒకే మూలం నుండి వచ్చిన కణాలు, దూరం అనేది ఒక భ్రమ (Non-locality) అని చెపుతాయి.

వేద ఆశీర్వచనం

  *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1948 స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణము - వసంత ఋతువు - వైశాఖ మాసం - శుక్ల పక్షం - పంచమి - మృగశిర -‌‌ భౌమ వాసరే* (21.04.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, ఈ 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.




 

.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

---------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

భగవత్పాదులవారి రచనల గురించి

 శ్రీ రామ (128 )


(శ్రీ శంకర భగవత్పాదులవారి రచనల గురించి ఒక మిత్రుని సందేహం, నా సమాధానం, మరొక మిత్రుల అభిప్రాయం, చూద్దాం).


శ్లో //శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయమ్/

నమామి భగవత్పాద శంకరం లోక శంకరమ్//

(శ్రుతులు,స్మృతులు,పురాణములు,ఇతిహాసాదులయందు నిగూఢంగా ఉన్న విషయములను వెలికి తీసి,

సమస్త జీవకోటియందు కరుణ కలవారై, అద్వితీయమైన తమ రచనల ద్వారా మానవాళికి జ్ఞాన భిక్ష పెట్టి,

జగద్గురువులై, సమస్త లోకములకు శుభము కలిగించే,

 శ్రీ శంకర భగవత్పాదుల వారికి నమస్కరిస్తున్నాను).


                          --------------------

            


శ్రీ శంకర భగవత్పాదుల వారి రచనలను గురించి అనేకమంది ఆస్తిక మహాశయులకు తరచుగా వచ్చే సందేహాన్నే " శ్రీ బి. సోమయాజులుగారు" అనే మా మిత్రులు ఈ విధంగా వెలిబుచ్చారు.


సందేహం.


" 🙏 ఓం నమో నారాయణాయ! "


అద్వైత మతాన్ని స్థాపించిన శ్రీ శంకర భగవత్పాదులవారు జగద్గురువులు ఎలా అయ్యారు ?


" అహం బ్రహ్మాస్మి " అని అద్వైతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకరులు అనేక స్తోత్రాలు అనేక దేవతలను ఉద్దేశించి వ్రాయడంలో అంతరార్థం ఏమిటి ?


 "సోహమ్" అన్న ఆచార్యులవారు స్తోత్రాలలో "దాసోహం" అని ఎందుకు అన్నారు?  

ఇది నాకు వచ్చిన సందేహం.

 పెద్దలు వివరించమని ప్రార్థన! "

                             ------


ఆ సందేహానికి నా సమాధానం.


యూనివర్సిటీ " (విశ్వవిద్యాలయం) అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైనా ఇక్కడ విద్య లభిస్తుంది అని భావం.

ఏ తరగతి వారికి ఏ విద్య చెప్పాలో దానిని "సిలబస్" అంటాం.

ఆ "సిలబస్" తో కూడిన పుస్తకాన్ని "టెక్స్ట్ బుక్" అంటాం.

అలా ప్రపంచం లోని సమస్త మానవులకు వారి, వారి, తరగతులకు అనుకూలంగా "సిలబస్" మరియు

"టెక్స్ట్ బుక్స్" రచించిన విశ్వవిద్యాలయం (యూనివర్సిటీ) శ్రీ శంకర భగవత్పాదులవారు.

ఆ విధంగా వారు విశ్వమంతకు గురువులు అయినారు.


రెండు వేల సంవత్సరముల క్రితం అవతరించి, 

"ఆధ్యాత్మిక అగాధాల్లో " కూరుకుపోయిన మానవజాతిని మేల్కొల్పి,

పిన్న వయస్సులోనే, సన్యసించి,  

ధర్మబోధ కోసం ఆశేతు శీతాచలం మూడుసార్లు భారతదేశమంతా పర్యటన చేసి, 

భక్తి, జ్ఞాన, యోగాది విషయములను ప్రజోపయోగం కొరకు గ్రంథస్థం చేసి,

ప్రజలకు జ్ఞానభిక్ష పెట్టిన "జగద్గురువులు"  

శ్రీ భగవత్పాదులవారు.


" సత్యం, జ్ఞాన, మనంతం బ్రహ్మ" (భగవంతుడు సత్య స్వరూపుడు. జ్ఞాన స్వరూపుడు. ఆద్యంతములు లేనివాడు), 

మరియు,

" ఆనందో బ్రహ్మ" (భగవంతుడు అంటే ఆనందమే),

అని వేదము ఉపదేశించిన పరతత్త్వమును "ఆత్మ " అనగా "తానే" అని తెలుసుకోవడమే, " అద్వైతం ".

ఇది పి.హెచ్.డి.

ఈ డాక్టరేటు (పి.హెచ్.డి) గమ్యంగా,

శ్రీ శంకర భగవత్పాదుల వారు,ఒకటవ తరగతి నుండి,

 పి. హెచ్.డి., దాకా పుస్తకాలు వ్రాసి ఉంచారు.

వారి వారి పూర్వజన్మ సంస్కారమునుబట్టి వివిధ దేవతల యందు ఏర్పడే భక్తి,

యోగ, జ్ఞానములయందు అనురక్తి,

పూర్వజన్మ వాసనలననుసరించి ఏర్పడే స్వభావము,

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని, శివ స్తోత్రాలు, విష్ణు స్తోత్రాలు, దేవీ స్తోత్రాలు మొదలైన అనేక దేవతా స్తోత్రాలు,

యోగ తారావళి లాంటి యోగ శాస్త్రాలు,

జ్ఞాన బోధకములైన ఉపనిషత్తులకు, భగవద్గీతకు,బ్రహ్మసూత్రములకు భాష్యములు, 

మొదలైన అనేక రచనలు ఆచార్యులవారు చేశారు. 

సద్గురువులు ఆ యా తరగతి విద్యార్థులకు వారి వారి యోగ్యతానుసారంగా తగిన పాఠాలు చెబుతారు.

పదో తరగతి పాఠాలు ఒకటో తరగతి విద్యార్థికి అర్థం కావు.

పదోతరగతి విద్యార్థి ఒకటో తరగతి పాఠాలు చదువుతూ కాలం వ్యర్థం చేసుకోడు.

 శ్రీ శంకర భగవత్పాదుల వారు అన్ని తరగతుల విద్యార్థులకు, వారి వారి స్థాయికి తగినట్లు రచనలు చేసి మానవాళిని అనుగ్రహించారు అని మాత్రం అర్థం చేసుకుని,

వారు అనుగ్రహించిన గ్రంథములను మన స్థాయిని బట్టి అధ్యయనం చేస్తూ, 

గురువుల ద్వారా సందేహములు తీర్చుకుంటూ, ముందుకు పోవాలి.

క్రమంగా అన్ని సందేహములు తీరి డాక్టరేటు గమ్యం చేరుకుంటాము".


అద్వైతం లక్ష్యంగా సంస్కరింపబడి, ఇప్పుడున్న శైవ, వైష్ణవ,గాణపత్య,ద్వైత, విశిష్టాద్వైత,స్మార్తాది సమస్త సంప్రదాయములకు మూలం శ్రీ శంకరుల బోధలే.

సద్గురువులు ఆ యా కాలములలో అవతరించి ఈ బోధలను ప్రజల యోగ్యతానుసారం వివిధ రీతులలో ఉపదేశిస్తూ‌ ఉంటారు.

                                  -------


పై సమాధానమునకు శ్రీమతి మాలినీ శ్రీ గారు ఈ విధంగా స్పందించారు.


* నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏🙏 *


అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు, అసత్యం నుండి సత్యం వైపు, చీకటి నుండి వెలుగులోకి, మృత్యువు నుంచి ముక్తి మార్గము వైపు నడిపించే వారు గురువులు 🙏🙏.


శంకరాచార్యుల వారు ఒక విశ్వవిద్యాలయం అని, ఆయన రచనలను పాఠ్యాంశాలు అని, ఎంతో చక్కగా సువిశాలమైన దృక్పథంతో కూడిన వివరణ అపూర్వం పెదనాన్న.


నిజమే కదా, అసలు శంకరాచార్యుల వారు లేక పోతే ఆధ్యాత్మిక చింతన, దేవాలయాలు, పూజలు, అనేవి ఉండేవి కావు. 

ధర్మం అట్టడుగున పడిపోయి ఇతర బౌద్ధం, జైనం, చార్వాక ధర్మాలు, కాపాలిక మతము మొదలైన ఆచరణలు విర్రవీగుతూ ఉన్న సమయంలో శివుడే స్వయంగా శ్రీ శంకరాచార్య స్వామి వారి రూపంలో అవతరించి ధర్మ సంరక్షణ చేశారు.


శంకరాచార్యులవారు సనాతన ధర్మాన్ని పదిలంగా నిలపడానికి జన్మించిన మహాపురుషుడు. 

ఈ వేదం, పురాణాలు, ఉపనిషత్తులు ఈరోజు ఇంకా నిలదొక్కుకొని ఉన్నాయంటే దానికి మూలం శ్రీ శంకరులు.


కొందరు అద్వైత సిద్ధాంతాన్ని ఖండిస్తూ ఉంటారు. 

కానీ అది అన్నిటికీ పునాది. 

ఒక ఆలయం నిలబడడానికి పునాది ఎలాగో అలాగే అద్వైతం. 

అద్వైతం పునాది అయితే దానిపై నిలబడిన ఆలయ గోపురాలు విశిష్టాద్వైత, ద్వైతములు.

 పునాది లేనిదే ప్రయోజనం లేదు.

ఇది చాలా మంది పెద్దల అభిప్రాయం.


గురువు అంటే శ్రేయస్సు కోరేవారు. శంకరులు సమస్త మానవాళికి, భూమికి శ్రేయస్సు కోరుతూ, దానికి అనువైన సనాతన ధర్మాన్ని కాపాడారు. అందుకే శంకరులు జగద్గురువు. 🙏


మీరు తరగతులు, దానికి తగినట్లుగా పాఠ్యాంశాలు, విద్యార్థుల అర్హత, పూర్వ జన్మ సుకృతం మేరకు ఆయన రచనలను అభ్యాసం చేస్తారు అన్నది అమోఘం. 

ఎంతో సత్యము, అంతరార్థము దాక్కుంది దానిలో 🙏


అద్వైతం నిజంగానే పి.హెచ్. డి.

అనంతమైన పాఠ్యాంశం ఉన్న పదవి. 

దానిని పొందడం కేవలం ఇద్దరు ముగ్గురికి మాత్రమే సాధ్యం అని నా అభిప్రాయం.


నేను కేవలం శంకరులు రచించిన స్తోత్రములు చదివే ఒకటో తరగతి విద్యార్థిని. 

ఇంతకే ధన్యురాలిని అనుకుంటా. 

ఇంకా కాస్త పై తరగతిలోకి ఉత్తీర్ణత సాధించగలిగితే అది తప్పకుండా శారదా మాత, గురువుల ఆశ్శీస్సులు. 🙏


శ్రీ శంకరులు పంచాయతన పూజా విధానం స్థాపించి సుబ్రహ్మణ్య స్వామిని అన్ని విధానాల్లో జ్యోతి స్వరూపంలో నిలిపారు.


 భారత దేశం మొత్తం నాలుగు దిక్కులా నాలుగు పీఠాలు స్థాపించి రక్షణా కవచాన్ని నిర్మించి ధర్మం నిలబెట్టారు. 🙏

అలా చేయడం వల్లే వైష్ణవ, మధ్వ, మరియు ఇతర మతాలు ఈనాడు మనగలుగుతున్నాయి.


శివ కేశవులకు అభేధం. అది గళస్య కంఠస్య బంధం. 


సోహం, దాసోహం వివరణ చాలా ఆలోచింప చేస్తుంది. సోహం అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. 


అన్నీ నేనే, అన్నింటా నేనే అనేదే ఆత్మ తత్వము.

ఆ తత్త్వమును అలవరుచుకొని దానికి లోబడి ఉండడం దాసోహం, అని నేను అనుకుంటున్నాను.

ఇతర దేవతలకు దాసోహం అని పైకి తోస్తున్నా , వారిలో ఉన్న ఆత్మ తత్త్వానికి దాసోహం అని నేను అనుకుంటున్నాను.

అలా ఆ అద్వైత తత్వానికి శరణాగతి కావడం, ఆచరించడం మన కర్తవ్యం అని ఇంతమాత్రం నా చిన్న, పామర మెదడు అర్థం చేసుకుంది.


నా అభిప్రాయంలో తప్పులుంటే సరిదిద్దండి పెదనాన్న.


శంకరాచార్యుల వారి గురించి మాట్లాడే అర్హత నాకు లేదు.

 🙏. ఆయన అనంతం. 🙏

కేవలం నమస్కారం చేసే యోగ్యత మాత్రమే ఉంది.


నాకు చాలా చాలా నచ్చిన వ్యాసం ఇది పెదనాన్న. 

నాతో చాలా ఆలోచింప చేసి, నేను విన్న ఎన్నో విషయాలు స్ఫురణకు తెచ్చింది మీ వ్యాసం.

ధన్యవాదాలు పెదనాన్న.

మీరు మీ రచనలతో అందరికి ఎంతో జ్ఞానం పంచుతున్నారు 🙏


                            ------------

                 (25-4-'23 న పెట్టిన పోష్టు)

 

శుభమస్తు

తూములూరి మధుసూదనరావు,

25-4-'26

సఖ్యం" (స్నేహం) యొక్క గొప్పతనాన్ని

 కృష్ణ యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం ప్రథమ ప్రశ్న మూడవ అనువాకం Mantra - 20 ARUNAM 


 *యస్తిత్యాజ సఖివిదగ్ం సఖాయమ్। 

న తస్య వాచ్యపి భాగో అస్తి| 

యదీగ్ం శృణోత్యలకగ్ం శృణోతి|| 

న హి ప్ర వేద సుకృతస్య పన్థామితి॥* 


ఈ మంత్రం, "సఖ్యం" (స్నేహం) యొక్క గొప్పతనాన్ని, మరియు జ్ఞానాన్ని పంచని వాడు పొందే నష్టాన్ని చాలా హెచ్చరికతో వివరిస్తుంది.


*యస్తిత్యాజ సఖివిదగ్ం సఖాయమ్:*

"ఎవరైతే తనతో కలిసి చదువుకున్న, తన కష్టసుఖాలు తెలిసిన స్నేహితుడిని (సఖాయమ్) విడిచిపెడతాడో..." ( _ఇక్కడ 'సఖి' అంటే కేవలం వ్యక్తి మాత్రమే కాదు, తనతో పాటు ఉన్న వేద విద్య లేదా జ్ఞానం అని కూడా అర్థం_ ).


*న తస్య వాచ్యపి భాగో అస్తి*: 

"...అలాంటి వానికి వాక్కులో (జ్ఞానంలో) ఎటువంటి భాగము ఉండదు." అంటే అతను మాట్లాడే మాటలకు విలువ ఉండదు, అతని జ్ఞానం ప్రకాశించదు.


*యదీగ్ం శృణోత్యలకగ్ం శృణోతి*: 

"ఒకవేళ అతను ఏదైనా విన్నా, అది వృధాగా (అలకమ్ - అసత్యం లేదా వ్యర్థం) విన్నట్లే లెక్క." అతను గ్రహించే జ్ఞానం అతనికి ఉపయోగపడదు.


*న హి ప్ర వేద సుకృతస్య పన్థామితి*: 

"అతను పుణ్య మార్గాన్ని (సుకృతస్య పంథామ్) లేదా సరైన మార్గాన్ని ఎప్పటికీ తెలుసుకోలేడు."


ఈ మంత్రం ప్రధానంగా కృతజ్ఞత మరియు జ్ఞానాన్ని పంచుకోవడం గురించి బోధిస్తుంది:


*సఖుడు అంటే ఎవరు?*: వేద పరిభాషలో జ్ఞానాన్ని ఇచ్చే గురువు, తోటి విద్యార్థి, మరియు మనం నేర్చుకున్న విద్య - వీరందరినీ 'సఖులు' అంటారు. వీరిని విస్మరించడం అంటే మన మూలాలను విస్మరించడమే.


*వాక్కులో భాగం లేకపోవడం*: ఎవరైతే స్వార్థంతో జ్ఞానాన్ని దాచుకుంటారో లేదా తనను ఉన్నత స్థితికి చేర్చిన వారిని మర్చిపోతారో, వారి మాటలో శక్తి (ఓజస్సు) ఉండదు. వారు ఎన్ని చదివినా ఆ సత్యం వారికి అనుభవంలోకి రాదు.


*వృధా శ్రవణం*: జ్ఞానాన్ని సరిగ్గా వినియోగించని వాడు ఎన్ని వేదాలు విన్నా అది అడవిలో చేసిన రోదన వంటిదే. అది అతనికి మోక్షాన్ని గానీ, శాంతిని గానీ ఇవ్వదు.


ఈ మంత్రం ఒక నైతిక హెచ్చరిక.


మనిషి తన ఎదుగుదలకు తోడ్పడిన స్నేహితుడిని (లేదా విద్యను) విడిచిపెట్టకూడదు. అలా చేసినవాడు ధర్మ మార్గం నుండి తప్పుకుంటాడని, అతని జ్ఞానం నిష్ఫలమవుతుందని అరుణప్రశ్నలోని ఈ మంత్రం చెబుతోంది.

మనం గత 3-4 రోజులుగా చూస్తున్న ఈ వరుస మంత్రాలు (సాకంజానాం..., కో ను మర్యా..., యస్తిత్యాజ...) కాల చక్రం నుండి నైతిక విలువల వరకు మనిషిని ఎలా సంస్కరించాలో వివరిస్తాయి.


అద్వైత తత్వార్థం పరిశీలిద్దాం!

ఈ మంత్రాన్ని అద్వైత సిద్ధాంతం ప్రకారం విశ్లేషిస్తే, ఇక్కడ 'సఖుడు' (మిత్రుడు) అంటే కేవలం బయట వ్యక్తులు కాదు, మన అంతరాత్మలో నిగూఢమై ఉన్న పరమాత్మ.


*ఆత్మద్రోహం* (Betraying the Self)

అద్వైతం ప్రకారం, పరమాత్మ మనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడు. ఆయన మనకంటే వేరు కాదు. ఎవరైతే అజ్ఞానం వల్ల "నేను వేరు, పరమాత్మ వేరు" అని భావించి, ఆ ఏకత్వ తత్వాన్ని (సఖ్యాన్ని) విడిచిపెడతారో, వారు సత్యానికి దూరమవుతారు. తన నిజ స్వరూపాన్ని (ఆత్మను) మర్చిపోవడమే ఇక్కడ 'మిత్రుడిని త్యజించడం'. ఇదే నిజమయిన ఆత్మ ద్రోహం, ఆత్మ హత్య.


*వాక్కు - అనుభవం* (Speech vs. Realization)

"వాని వాక్కులో భాగం ఉండదు" అంటే, వారు వేదాలను వల్లించినా, మంత్రాలను చదివినా అది కేవలం శబ్దమే అవుతుంది తప్ప అనుభవ పూర్వక జ్ఞానం (Self-Realization) అవ్వదు. ఆత్మజ్ఞానం లేని పాండిత్యం కేవలం భారమే అని అద్వైతం చెబుతుంది.


*శ్రవణం - వ్యర్థం* (Vain Listening)

వేదాంతంలో 'శ్రవణం' (గురువు ద్వారా సత్యాన్ని వినడం) ఒక ముఖ్యమైన ప్రక్రియ. కానీ పరమాత్మతో ఉన్న సంబంధాన్ని (ఏకత్వాన్ని) గుర్తించని వాడు ఎన్ని వేదాంత వాక్యాలు విన్నా, అవి 'అలకమ్' (వ్యర్థం లేదా అసత్యం) గానే మిగిలిపోతాయి. అది పొట్టును దంచడం వంటిదే తప్ప బియ్యాన్ని పొందడం కాదు.


*సుకృతస్య పంథా* (The Path of Truth)

నిజమైన పుణ్య మార్గం అంటే ఆత్మ సాక్షాత్కార మార్గం. ఎవరైతే ద్వైత భ్రమలో ఉండి, తనలోని దైవత్వాన్ని నిరాకరిస్తారో, వారు 'సుకృత' మార్గాన్ని అంటే మోక్ష మార్గాన్ని కనుగొనలేరు.


Conclusion:

నీలో ఉన్న పరమాత్మను (సఖుడిని) గుర్తించకుండా చేసే ఏ అధ్యయనమైనా, ఏ విచారణ అయినా వ్యర్థమే. ఆ ఏకత్వమే పరమ సత్యం. దానిని విస్మరించిన వాడు జ్ఞాన మార్గం నుండి తప్పుకుంటాడు.

మనం చదివే ప్రతి అక్షరం, వినే ప్రతి మాట మనల్ని ఆ లోపలి మిత్రుడి (ఆత్మ) వైపు నడిపించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది.

25 4 2026 నాడు సన్మార్గం కార్యక్రమం CB

  


పంచాంగం 25.04.2026

  ఈ రోజు పంచాంగం 25.04.2026 Saturday,


స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సరః ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాస శుక్ల పక్ష నవమి తిథి స్థిర వాసర ఆశ్రేష నక్షత్రం గండ యోగః బాలవ తదువరి కౌలవ కరణం.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.

 

యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00 వరకు.

  


శ్రాద్ధ తిథి: నవమి 


 

నమస్కారః , శుభోదయం

ఆర్యా శతకం - 1*

  *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*ఆర్యా శతకం - 1*


*శ్లోకము - 92*


*విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటీ ౹*

*కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ॥*


*భావము :*


*ధవళ వర్ణ వస్త్ర ధారిణివై, కమలాసనాసీనవై, అత్యంత విశాలమైన నేత్రములతో, ఒక చేత పుస్తకమును, మరొకచేత రుద్రాక్ష జపమాలను ధరించి, వీణాపాణియై, బ్రహ్మదేవుని దేవేరియైన సరస్వతీ మాతవు నీవేకదా?*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

భగవద్గీత

 --------------------------భగవద్గీత. ------------------------

                       చతుర్దోధ్యాయః

               జ్ఞాన కర్మ సన్యాస యోగము



కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।

క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ।। 12 ।।



ప్రతిపదార్థ:


కాంక్షంతః — కోరికతో; కర్మణాం — ప్రాకృతిక కర్మలు; సిద్ధిం — విజయం; యజంతే — పూజిస్తారు; ఇహ — ఈ లోకంలో; దేవతాః — దేవతలను; క్షిప్రం — త్వరగానే; హి — నిజముగా; మానుషే — మానవ సమాజంలో; లోకే — ఈ లోకంలో; సిద్ధి — సిద్ధించును; భవతి — కనిపించును; కర్మ-జా — భౌతిక క్రియాకలాపముల వలన.



 తాత్పర్యము : 


ఈ లోకంలో భౌతిక(ప్రాకృతిక) కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి.



వివరణ:


ప్రాపంచిక లాభాల కోసం ప్రయత్నించే వారు, వరముల కోసం, దేవతలను ఆరాధిస్తారు. దేవతలు ప్రసాదించే వరాలు ప్రాకృతికమైనవి మరియు తాత్కాలికమైనవి. భగవంతుడు ఆయా దేవతలకు ప్రసాదించిన శక్తి ద్వారానే వారు ఆ వరాలను ఇవ్వగలుగుతున్నారు. ఈ విషయం పై ఒక చక్కటి ఉపదేశం చెప్పే కథ ఉంది:


ఒకసారి సంత్ ఫరీద్, అక్బర్ చక్రవర్తి కొలువుకి వెళ్ళాడు. (భారత చరిత్రలో అక్బర్ ఒక శక్తిమంతుడైన రాజు). అక్బర్ ప్రక్క గదిలో పూజలో ఉండగా, అతను కొలువులో రాజు గారి కోసం వేచి ఉన్నాడు. ఏం జరుగుతోందో అని ఫరీద్ ఆ గదిలోకి తొంగి చూసినప్పుడు, అక్బర్, ఇంకా శక్తివంతమైన సైన్యం, మరింత కోశాగార నిధి, మరియు యుద్ధ విజయం కోసం భగవంతుడిని అడగటాన్ని గమనించి ఆశ్చర్యపోయాడు. రాజుగారి ఆరాధనకి భంగం కలిగించకుండా, ఫరీద్, రాజ కొలువుకి తిరిగి వచ్చేసాడు.


తన పూజ పూర్తయిన తరువాత, అక్బర్, ఆయన చెప్పేది వినటానికి వచ్చాడు. ఆ మహోన్నత వ్యక్తిని ఏమైనా కావాలా అని అడిగాడు. ఫరీద్ ఇలా బదులిచ్చాడు, ‘నా ఆశ్రమ నిర్వహణ కొరకు నాకు కావలసిన సామాగ్రిని అడగటానికి చక్రవర్తిగారి దగ్గరకు వచ్చాను. కానీ, చక్రవర్తి కూడా ఆ భగవంతుని వద్ద యాచకుడే అని తెలుసుకున్నాను. కాబట్టి నేరుగా భగవంతుడినే కాకుండా, మహారాజుని ఏదో కావాలని అడగటం ఎందుకు?’ అని.


భగవంతుడు తమకు ప్రసాదించిన శక్తి ద్వారానే దేవతలు వరాలు ఇస్తుంటారు. సరైన జ్ఞానం లేని వ్యక్తులు వారిని ఆశయిస్తారు, కానీ నిజంగా వివేకవంతులు ఈ మధ్యవర్తుల దగ్గరికి వెళ్ళటంలో అర్థంలేదు అని తెలుసుకొని, తమ తమ కోరికల నివృత్తి కోసం ఆ సర్వ శక్తివంతుడైన భగవంతుడినే ఆశ్రయిస్తారు. జనులు విభిన్న రకాలుగా ఉంటారు, కొందరికి ఉన్నత స్థాయి ఆశయాలు ఉంటాయి, మరికొందరికి నిమ్న స్థాయివి ఉంటాయి. శ్రీ కృష్ణుడు ఇక ఇప్పుడు నాలుగు రకాల కర్మ, గుణముల గురించి వివరిస్తాడు.