16, అక్టోబర్ 2022, ఆదివారం

అన్నం - తైత్తిరీయోపనిషత్తు

 ॐ     అన్నం - తైత్తిరీయోపనిషత్తు 


1. అన్నం న నింద్యాత్ - తద్వ్రతం (తై .ఉ. 3.7). 


    మనం ఆహారాన్ని ఎప్పుడూ నిందించరాదు  - అనేది వొక వ్రతం. 


    అన్నాన్ని నిందించని వాడే - బ్రహ్మజ్ఞానానికి అర్హుడు. అటువంటి వాడికే - పుష్కలంగా - అన్నం ఇవ్వబడుతుంది. 

    అన్నాన్ని నిందించే వాడికి, సరైన ఆహారమూ దొరకదు. అది పుష్కలంగానూ యివ్వబడదు. ఇచ్చినా, అతడు ఆ ఆహారాన్ని తినలేని పరిస్థితుల్లో వుంటాడు. 

    ఇలా ఎన్నో చోట్ల ఉపనిషత్తులలో చెప్పబడింది.  

    

    నిందించడమంటే - తిట్టడం మాత్రమే  కాదు. కంచంలోనో, ఆకులోనో వేసుకున్న ఆహారాన్ని, ఎవరిపైననో కోపంతో  విసిరి వేయడం, 

    చేసిన వారినో, వండిన వారినో తిట్టడం కూడా ఇందులోకే వస్తుంది. 

    మనలో కొంత మంది ఇలాంటివి ఎన్నో చేస్తాము. 

    ఇది బాగు లేదు, అది బాగు లేదు - అనడం కూడా పనికి రాదు. ఇవన్నీ చేయరాదు. దీని తరువాత మరి కొన్ని వస్తాయి. అవికూడా చదువుదాం.


2.అన్నం న పరిచక్షీత - తద్వ్రతం (తై .ఉ. 3.8). 


    అన్నాన్ని నిరసన  భావంతో ఎప్పుడూ నిరాకరింప కూడదు. 

    ఇది కూడా ఒక వ్రతం. 


    వ్రతం అంటే ఏమిటి?  నమ్మకంతో, భక్తితో పాటించ వలసిన నియమం. 

    అన్నం పట్ల పూర్తి సద్భావం ఉండాలి. వీళ్లిచ్చారనో, వాళ్లిచ్చారనో - బాగున్న అన్నాన్ని తృణీకరించరాదు.


    ఈ మొదటి రెండూ - తీసుకుని తినేవారికీ, అతిథులకీ చెప్పబడింది. 

    అంతే కాదు. ఇంట్లో సాధారణంగా గృహిణి  వండివడ్డిస్తుంది. మిగతా వారు తింటారు. 

    ఆ తినేవాళ్లకు అందరికీ ఇది తప్పకుండా వర్తిస్తుంది. 

    వండిన వాళ్లనో, వడ్డించే వాళ్లనో, తినే ఆహారాన్నో - తినే వారు తప్పు పట్టకూడదు. కృతజ్ఞతా భావం ఉండాలి.   

    అది ఉపనిత్  వాక్యం. ఇది జీవితాంతం పాటించ వలసిన వ్రతం.   


    ఈ క్రింద వచ్చే సూత్రాలు - అన్నాన్ని  సంపాదించేవారికి, చేసేవారికి, వడ్డించేవారికి వర్తించే నియమాలు, వ్రతాలు.


3. అన్నం బహుకుర్వీత - తద్వ్రతం (తై .ఉ. 3.9). 


    అన్నాన్ని ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా  సంపాదించాలి. ఇది కూడా ఒక వ్రతం. 

    అన్నం - అంటే, మనం నిత్యం ఉపయోగించే ఆహార వస్తువులు కూడా - అని తెలుసుకోవాలి. 

    అంటే, మనుషులకు ఉపయోగపడే అన్ని ఆహార వస్తువులు సంపాదించాలి. 

    ఎందుకు మన అవసరాలకు మించి సంపాదించాలి?  ఈ ప్రశ్న  మన మనస్సులో తప్పక వస్తుంది .


ఎందుకు?


    దీనికి సమాధానం, దీని తరువాత చాలా రకాలుగా నిర్దిష్టంగా  యివ్వ బడింది.     

    మనం  గమనించ వలసిన  ముఖ్య విషయం ఏమిటంటే   -  "ఎక్కువ సంపాదించడం " - తప్పు  అని మన వారు అనలేదు. 

    ధార్మికంగా  ఎంతైనా  సంపాదించవచ్చు. తప్పులేదు.  


4. న కంచన వసతౌ ప్రత్యా చక్షీత . తద్వ్రతం - తస్మాత్ యయాకయా చ విధయా - అన్నం - ప్రాప్నుయాత్ (తై .ఉ .3.10.)


    ఆశ్రయాన్ని కోరి మన ఇంటికి ఎవరైనా వస్తే, అటువంటి అతిథిని - ఎవరినికానీ - లేదు, అని చెప్పి తిప్పి పంపరాదు. ఇది కూడా ఒక వ్రతం.      

    వారికి కావలసినవన్నీ - ఎంత వీలైతే అంత, ఎన్ని రకాలుగానైనా సంపాదించాలి. అంటే అన్నీ ధర్మ బద్ధమైన మార్గాలలోనే. 

    చూశారా ! 

    అతిథుల కోసం, అవసరం ఉన్నవారి కోసం, అడిగే వారి కోసం, లేనివారి కోసం - మనం (ఎంత ఎక్కువైనా)  సంపాదించాలనే  - ఉపనిషత్తు కూడా చెబుతోంది. 

    - ఇది వ్రతం అన్నారు.  

          ...ఇంకాఇంకా ఇలాంటి విషయాలెన్నో శాస్త్రం చెబుతుంది.

Jai Sriram


 



 

రామాయణానుభవం_ 181*

 *రామాయణానుభవం_ 181* 


సీతాదేవి కోరిక ప్రకారం సరమ రావణునిసభకు వెళ్లి అక్కడ అదృశ్యంగా ఉండి, అన్ని విషయాలను పూర్తిగా తెలిసికొని సీతాదేవి దగ్గరకు తిరిగి వచ్చింది.


రావణుని సభ నుండి తిరిగి వచ్చిన సరమను సీతాదేవి ప్రేమతో కౌగిలించుకొని అక్కడి విశేషాల గురించి అడిగింది. సరమ తన సమాధాన్ని చెప్పసాగింది.


"సీతా! రావణుని తల్లికైకసి, ఆయన వృద్ధ మంత్రి అవిద్ధుడు రావణునికి అనేక

విధాల హిత బోధ చేశారు.


ఖరదూషణాదులను వారి పదునాల్గు వేల సైన్యమును కొన్ని క్షణాలలో ఒంటరిగా సంహరించగలిగిన సర్వసమర్ధుడు రాముడు. ఇప్పుడేమో రాముడు ఒంటరివాడు. కానేకాడు. లక్ష్మణుడు లక్షలాది వానర సైన్యము రాముని కంటి కి రెప్పవలె కాపలా కాస్తుంటారు.


"నా సైన్యములో ఖరుని మించిన వారెందరో ఉన్నారు". అంటావా ? ఎందరు ఉండి ఏమి లాభము? హనుమ ఒక్కడే వచ్చి లంకానగరాన్ని అంతటిని అగ్నికి ఆహుతి చేసినప్పుడు ఎందరుండి ఏమి చేశారు?


ఈ విధంగా ఎవరెన్ని విధాల చెప్పినా లోభి ధనాన్ని వదలనట్లు పరవధూసంగమును కాంక్షించే రావణుడు నిన్ను వదలడానికి అంగీకరించలేదు.

*నోత్సాహత్యమృతో మోక్తుం యుద్ధే త్వమ్ ఇతి మైథిలీ*

*సామాత్యస్య నృశంస్య నిశ్చయో హ్యేష వర్తతే*

ప్రాణాల కంటె ఎక్కువగా కాంక్షించే నిన్ను రావణుడు చంపజాలడు. ఆయన వలన నీకు ఏ భయములేదు.


అయితే నిన్ను వశం చేసికోవాలనుకొని అప్పుడప్పుడు నిన్నుబెదిరిస్తాడు.”


ఈ మాటలను సరమ సీతాదేవికి చెప్పుతుండగానే వారికి వానర సేనల అరుపులు శంఖ, భేరుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించాయి. శ్రీరామచంద్రుడు లంకను ముట్టడించడాన్ని ప్రారంభించాడని వాళ్లకు తెలిసింది.


ఒక వైపు ఆ ధ్వనులు సీతా సరమలకు సంతోషాన్ని కలిగిస్తే మరొక వైపు రావణునికి, రాక్షసులకు పిడుగు పడ్డట్లు అయింది. 

ముందుగానే తనకు ఎప్పటి వార్తలను అప్పుడు ఎందుకు తెలుపలేదని రావణుడు రాక్షసులపై మండిపడ్డాడు. ఇప్పటికైనా ముందుకొచ్చి తనకు విజయాన్ని చేకూర్చుమని ఆజ్ఞాపించాడు.


అప్పుడు రావణుని తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి అయిన మాల్యవంతుడు ఆయనతో ఈ విధం గా హితము పలకడానికి సిద్ధ పడ్డారు......

** 


మాల్యవంతుడు రావణునితో చెబుతున్నాడు....

"మహారాజా ! రాజయినవాడు సామ, దాన, భేద, దండోపాయాలను గురించి చక్కగా తెలిసికోవాలి.


ఇప్పుడు రామలక్ష్మణులు సామ, భేదాలకు లొంగరు. కనుక దానదండాలను గురించి ఆలోచించాలి.

*తన్మహం రోచతే సంధిః సహ రామేన రావణా* 

*యదర్థమ్ అభియుక్తాః స్మ సీతా తస్మై ప్రదీయతామ్*


ప్రస్తుతము దానము అంటే "సీతాదానము" అని అర్ధము. సీతరామునిదే కదా! ఆమెను అపహరించి తెచ్చాక ఆమెను మళ్లీ అప్పగించడము కూడ దానమేనా ? అంటే అవును అది కూడా ఒక రకమైన దానమే.


 "దీయత ఇతి దానం"

"ప్రదీయతాం దాశరథాయమైధిలీ" అని సీతను రామునికి ఇవ్వుమని విభీషణాదులు తెలిపారు కదా!


సీతాదేవిని శ్రీరామునికి ఇవ్వడం ద్వారా నీకు శ్రీరామునికి సంధి కుదురుతుంది. సంధివలన స్నేహము కుదురుతుంది. స్నేహము వలన సీతాదేవిని తీసికొని శ్రీరాముడు. లక్ష్మణ, సుగ్రీవ వానరసేనా సమేతంగా తిరిగి వెళ్లి పోతాడు.


శ్రీరామునికి రాజ్యకాంక్షలేదు. ఆయన కిష్కింధానగరానికి వచ్చి వాలిని సంహరించిరాజ్యాన్ని సుగ్రీవునికి అప్పగించాడు. ఆయనకు రాజ్యకాంక్షే ఉంటే కిష్కింధను అయోధ్యా

రాజ్యంలో కలుపుకొనే వాడు కదా!


రామునికి లంకా రాజ్యకాంక్ష కూడలేదు. సీతాదేవిని ఆయనకు సమర్పిస్తే నీ రాజ్యము, నీవు క్షేమంగా ఉంటారు. "అదేమిటి? సీతాదేవిని ఇవ్వకుంటే యుద్ధము వస్తే మాత్రము నాకేమి భయమంటావా?


నిన్ను మించిన బలవంతుడు వాలి. రాముని ఒకే కోలకు నేల కూల లేదా? రాముని ఎదిరించడానికి బ్రహ్మ రుద్రేంద్రాలకు కూడ సాధ్యము కాదని హనుమ చెప్పలేదా ? ఒంటరిగా వచ్చిన హనుమను మనము ఏమి చేయగలిగాము ?


నీవు వధించబడడము దేవతలకు కావలసింది. కనుక రామలక్ష్మణులకు వానర బలమే కాదు. దేవతాబలం కూడ ఉంది.


"ధర్మము" -"అధర్మము" అని రెండు పక్షాలను బ్రహ్మకల్పించాడు. దేవతలు ధర్మాన్ని, రాక్షసులు అధర్మాన్ని అవలంభిస్తారు.


నీవు అధర్మమును వరించినా, నీ తపోబలము వలన నీ అధర్మానికే విజయము కలుగుతూ వచ్చింది.


కాని కొంతకాలానికి నీ తపో బలము క్రమంగా తగ్గిపోయి, నీ అధర్మాచరణము

నీకు వినాశాన్ని కల్గిస్తుంది.


మహర్షులందరు నీవు పెట్టు చిత్రహింసలు భరిస్తూ కూడ నీ వినాశానికై మహత్తరమైన తపస్సును తీవ్రంగా ఆచరిస్తున్నారు. వారి శాపబలము కూడ నీకు హానిని కలిగిస్తుంది. ఇప్పుడా ఋషులు ఆశ్రమంలో యజ్ఞధూమాలు దట్టంగా వ్యాపిస్తున్నాయి. అవి రాక్షసుల చితా ధూమాలుగా కనబడుతున్నాయి.. 


"నేను వరబలుడను" అని అహంకరిస్తున్నావేమో ? కాని రావణా నీకు ఎవ్వరి వలన చావు రాకూడదని కోరుకొన్న వారిలో నరులు, వానరులు లేరు. ఇప్పుడు నీపైకి దండెత్తి వచ్చింది. మహా వీరులైన నరవానరులే.


కనబడే శకునాలు కూడ నీకు అనుకూలంగా లేవు. మేఘాలు ఉరుముతూ లంకపై నెత్తురును కురిపిస్తున్నాయి. ఏనుగులు, గుఱ్ఱాలు నిష్కారణంగా కళ్లనీళ్ళు కారుస్తున్నాయి.


జండాలు రంగులు పోయి కూలి పోతున్నాయి. నక్కలు, గద్దలు లంకలో గుంపులు గుంపులుగా గుమిగూడి తీవ్రంగా అరుస్తున్నాయి. నీచ, పిశాచాలు రాక్షస స్త్రీల కలలో కనబడి వికృతంగా నవ్వుతున్నాయి.


రాక్షసులు తాము ఆరాధించే దేవతల కొరకు వేసిన బలులను కుక్కలు పైబడి తింటున్నాయి. ఆవులకు గాడిదలు పుట్టుతున్నాయి. ఎలుకలు, ముంగిసలు స్నేహంగా కలసి తిరుగుతున్నాయి.


పులులు, పిల్లులు, కుక్కలు, పందులు కలిసి తిరుగుతున్నాయి. మృగ పక్షులు సూర్యుని జూచి ఏడుస్తున్నాయి. ఇండ్లలో పెంచుకొంటున్న గోరింకలు వికృతంగా కూస్తున్నాయి.


ఇన్ని ఉత్పాతాలు రాక్షస వినాశాన్ని సూచిస్తున్నాయి. కనుక రావణా! యుద్ధానికి కాలుదువ్వక సీతాదేవిని రామునికి అప్పగించి సంధికి అంగీకరించు"మని మాల్యవంతుడు  రావణుని ప్రభోదించాడు....

[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 183* 


శ్రీ రామ చంద్రుడు తన సేనా నాయకులకు దిశలను నిర్దేశించి సుగ్రీవ విభీషణులను చూచి, తామందరు సువేల పర్వతాన్ని ఎక్కి రాత్రి అక్కడే ఉండాలని తెల్లవారి లంకానగరాన్ని చూడాలని చెప్పాడు.


ఆయన సుగ్రీవ విభీషణాదులతో రావణుని నీచప్రవర్తన గురించి ముచ్చటించాడు. రావణుడు పుట్టింది స్వయంగా "పులస్త్య బ్రహ్మ” వంశంలో చదువుకొన్నది వేదవేదాంగాలను. అయినా "పరదారాపహరణ"మనే ఎంత నీచానికి పాల్పడ్డాడు. ఆయన ఒక్కని మూలంగా ఆయన పరివారమంతా నాశనం అవుతున్నది.

*ఏకో హి కురుతే పాపం కాల పాశ వశం గతః*

*నీచేన ఆత్మాపచారేణ కులం తేన వినశ్యతి*


ఒక పాము నీటి మడుగులో చేరితే దాని వలన మడుగులోని చేపలు కూడా చస్తాయి కదా


*ఏకః పాపాని కురుతే ఫలం భుంక్తే మహాజనాః*

అని ఆగ్రహంతో శ్రీరాముడు సువేల పర్వతము పైకి ఎక్కాడు. ఆయన వెనువెంటనే లక్ష్మణ సుగ్రీవ, విభీషణాదులు హనుమదాది వానరులు అందరు పర్వతాన్ని ఎక్కారు. సుగ్రీవ, విభీషణ, జాంబవవాది సమేతంగా లక్ష్మణుడా రాత్రి నిద్రలేకుండా శ్రీ రాముని, వానర సైన్యాన్ని కాపాడాడు.


తెల్లవారి వారందరు శ్రీ రామ సమేతంగా లంకానగరాన్ని పరిశీలించారు.  లంకానగరము వెలుపల ఉన్న పెద్ద పెద్ద తోటలను చూశారు. వాటి లోపల క్రూరమృగాలు లేవు. ఆతోటలలో తాళవృక్షాలు, మద్ది చెట్లు మొదలైన పెద్ద వృక్షాలు ఉన్నాయి. కొత్త కొత్త పూలు ఉన్నాయి. పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి.


ఆ వనము ఇంద్రుని నందన వనంతో, కుబేరుని చైత్ర రధముతో పోటీ పడుతున్నది. ఆ తోటలలో నెమిళ్ల నృత్యాలు, తుమ్మెదల ఝంకారాలు, కోకిలల "కుహూ కుహూ" నాదాలు మనస్సులకు హాయినిస్తున్నాయి. 


సుగ్రీవుడు సువేల పర్వతముపై ఉన్నవారిని తప్ప మిగిలిన వారందరిని లంకలోకి పంపించాడు.వారు లంకలోకి ప్రవేశించి, తమ సింహనాదాలతో నగరాన్ని అల్లకల్లోలం చేయసాగారు. ఆ అల్లకల్లోలానికి భూమివణికింది. లంక అంతా దుమ్ముతో నిండిపోయింది. మృగాలు భయంతో కూతలు పెడుతూ పారిపోసాగాయి.


లంకానగరం కూడా పర్వత శిఖరం పైనే ఉంది. ఆ పర్వతానికి మూడు శిఖరాలు ఉన్నాయి. సువేల  ,లంక , త్రికూటము...


వాటి మధ్యలో కైలాస శిఖరము వంటి అద్భుతమైన వేయి స్థంభాల భవనము ఉంది. అది రావణుని నివాస భవనము. ఎల్లప్పుడు రాక్షస వీరులచే కాపాడబడుతు ఉంటుంది.


ఆ భవనంలో అనేక ఉద్యాన వనాలు, అనేక పక్షులు, పెంపుడు జంతువులు ఉన్నాయి.


శ్రీ రాముడు అద్భుత సౌందర్యముతో అలరారే ఆ లంకా నగరాన్ని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.


సువేల పర్వత శిఖరముపై వెలిగే దివిటీల కాంతి వలన అక్కడికి శ్రీ రాముడు వేలాది వానర వీరులతో ఆ శిఖరము పై ఉన్నాడని అందరికి తెలిసింది......

[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 182* 


మాల్యవంతుని హితోపదేశము రావణుని చెవులకు ఎక్కలేదు. రాక్షసరాజు ఆగ్రహంతో మాల్యవంతుని ఈ విధంగా నిందించాడు:

*హితా బుద్ధ్యా యద్ అహితం వచః పరుషం ఉచ్యతే*

*పర పక్షం ప్రవిశ్యై ఏవ న ఏతత్ చ్ఛోత్రం గతం మమ*

“తాతా !నీవు ముసలివాడవు ఆగుట వలన నీ బుద్ధి మందగించింది. నీవు శత్రువు వలన ఏదో లాభపడి, ఆయన వైపు న్యాయవాదిగా మాట్లాడుతున్నావు.


నిజానికి రాముడు ఎందులో గొప్పవాడు? దేవ, దానవ గంధర్వాదులలో నాకు ఎదురేలేదు కదా!


రాముడు ఒక మానవుడు. తండ్రివలన దేశాన్నుండి బహిష్కరింపబడ్డవాడు. రాజ్యహీనుడు. ఇప్పుడు భార్యాహీనుడు కూడ.


ఇప్పుడు ఆశ్రయించింది కోతులను అంటే తనకంటే తక్కువ వారిని (నీచులను) ఆశ్రయించాడు. ఆయనలో ఏమి గొప్పదనాన్ని చూచి మాట్లాడుతున్నావు?


నేను రాక్షసరాజును రాజుపట్ల మాట్లాడవలసింది

 ఈ విధంగానేనా?


కమలం లేని అదృష్ట దేవత అయిన లక్ష్మీదేవిలా ఉన్న సీతను రాముని భయంతో అడవి నుండి దూరం చేసి నేనెందుకు తిరిగి ఇవ్వాలి?

*ఆనీయ చ వనాత్ సీతాం పద్మ హీనామ్ ఇవ శ్రియమ్*

*కిం అర్థం ప్రతిదాస్యామి రాఘవస్య భయాద్ అహమ్*


నీవన్నట్లు రాముడు గొప్పవాడు కూడ కావచ్చు. అయితే మాత్రమేమిటి? అంతకంటే అత్యధికుడు నా ముందు వచ్చి నిలిచినా నేను తలవంచుతానా? మరొకరికి నమస్క రిస్తానా?


"ద్విధాభజ్యేయమ ప్యేవం న నమేయంతు కస్యచిత్

ఏషమే సహజోదోషః స్వభావోదురతిక్రమః"


నన్ను రెండుగా చీల్చినా నేనెవ్వరికి నమస్కరిచను. ఇది నా స్వభావము. నా స్వభావము తప్పుకూడ కావచ్చు. అయినా స్వభావము పుట్టుకతో వచ్చి కాటిదాకా వెంట ఉంటుంది. దానిని మార్చడం ఎవ్వరి తరము కాదు.


"రాముడు సముద్రముపై సేతువు కట్టలేదా?" అందువా? కాకి కూచుండగానే తాటిచెట్టుపై పండు క్రింద బడితే కాకే పండును తెంపిపడగొట్టినట్లా ? కాదు కదా కాకి కూచున్నప్పుడే పండు పడిపోవడం హఠాత్తుగా అనుకోకుండా జరిగిందే. ఏదైనా అకస్మాత్తుగా జరుగడాన్ని గూర్చే "కాకతాళీయము" అంటారు కదా!

రాముడు సముద్రముపై సేతువు నిర్మించడము కూడ కాకతాళీయమే.


అంతెందుకు? రామలక్ష్మణులు వేలాది వానర సమేతంగా లంకపైకి దండెత్తి వచ్చారు. కదా! వారందరు శవాలరాశులవుతారు. అంతేకాని ఎవ్వరు కూడ బ్రతికి తిరిగి పోజాలరు. తాతా! నీ నోటికి వచ్చింది మాట్లాడావు చాలుగాని ఇక నీవు వెళ్లవచ్చు" అని ఆజ్ఞాపించాడు. మాల్యవంతుడు రావణుని మాటలు విని మౌనంగా తిరిగి వెళ్లాడు.

*

["ఇసుకలో నుండి నూనె తీసినా తీయవచ్చు. ఎండమావులలో నీరును త్రాగినా త్రాగవచ్చు. కాని మూర్ఖుని మనస్సును మాత్రము ఎవ్వరు మార్చజాలరు కదా...!]

** 


మాల్యవంతుడు వెళ్లిపోయాక, రావణుడు మంత్రులతో లంకానగర రక్షణ సన్నాహాల గురించి చర్చించాడు.


లంకానగరము యొక్క తూర్పుద్వారానికి రక్షకుడుగా ప్రహస్తుని, దక్షిణ ద్వారం దగ్గర మహోదర, మహాపార్శ్వులను, పడమట ఇంద్రజిత్తును, ఉత్తరాన శుకసారణులను పంపి అచటికి తానే స్వయంగా వస్తానని తెలిపాడు. పుర మధ్య భాగంలో విరూపాక్షుని నియమించాడు. సముద్ర భాగం నుండి లంకలోకి రావడానికి లంకలోని పశ్చిమ భాగాలే ముఖ్యం కనుక ఒక వైపు ఇంద్రజిత్తును నిలిపి, మరొక భాగంలో తానే ఉన్నాడు..


ఈ విధంగా వ్యూహరచన చేసి "ఇక లంకపై శ్రీరాముడు దాడి చేయడం అసాధ్యము" అని నిశ్చయించుకొన్నాడు.

*ఏవం విధానమ్ లంకాయాం కృత్వా రాక్షసపుంగవాః*

*కృతకృత్యమివాత్మానం  మన్యతే కాలచోదితాః*


ఇక శ్రీరామ సైన్యం చూస్తే

రామ లక్ష్మణులు హనుమ సుగ్రీవ, జాంబవదంగదాదులతో కలిసి యుద్ధాన్ని గురించి ఆలోచించసాగారు.


ఎంతో కాలం నుండి “లంకలోకి చేరుకోవడమెలాగా ? అనుకొన్న మనము లంకలోకి రాగలిగాము.

ఇప్పుడు 'దీనిని జయించడమెలా?' అని ఆలోచించాలి.


ఈ లంక దేవగంధర్వ, యక్షకిన్నర, కింపురుషాదులకు ఎవ్వరికి కూడా జయించ సాధ్యము కాదు.


దీనిలోకి ఏ వైపు నుండి కూడా ప్రవేశించడానికి వీలులేదు. కనుక దీనిని ముట్టడించడం, శత్రువులను చీల్చుకొని వెళ్లడం తప్ప వేరే మార్గము లేదు” అనివారు అనుకొంటున్నారు.


అంతలో విభీషణుడు "ప్రహస్తుని తమ్ముడైన "ప్రఘసుడు", తమ్ముడి కొడుకులు 'అనలుడు' 'సంపాతి' అనే వారు నావెంట లంకను, సమస్త బంధు జనాన్ని

పరిత్యజించి వచ్చారు. వారు లంకానగరంలో సైనికుల ఏర్పాట్లను చూచి వచ్చారు. లంకలో తూర్పువైపు ప్రహస్తుడు, దక్షిణంలో మహాపార్శ్వ మహోదరులు, మధ్య భాగంలో విరూపాక్షుడు, పశ్చిమోత్తరాలలో ఇంద్రజిత్తు, రావణుడు ఉన్నారని తెలిసింది'. రావణుడు అప్పుడు తనకు ఉన్న అరవై వేల మంది సైనికులతో వెళ్లి కుబేరున్ని జయించాడు. ఇప్పుడు ఆయన సైన్యము లెక్కకు మించి ఉంది.


రామభద్రా! నీకు భయాన్ని కలిగించడానికి ఈ విషయాలు చెప్పలేదు. ఆ ఏర్పాట్లకు తగిన విధంగా నీవు నడచుకొంటావని మాత్రమే తెలుపుతున్నాను". అని ఊరుకున్నాడు.

*అత్ర మన్యుర్ న కర్తవ్యో రోషయే త్వం న భిషయే*

*సమర్థో హ్యసి వీర్యేణా సురాణామ్ అపి నిగ్రహే*

లంకానగరానికి తూర్పు వైపు ఉన్న ప్రహస్తుని నీలుడు ఎదుర్కోవాలి. దక్షిణ దిశలో మహోదర, మహా పార్వ్యులను అంగదుడు జయించాలి.


పశ్చిమము వైపు ఇంద్రజిత్తును మహాబల సంపన్నుడైన హనుమ ఢీకొనాలి. సేనా మధ్య భాగంలో సుగ్రీవ, విభీషణ, జాంబవంతులు రక్షించాలి.


ఇక యుద్ధానికంతటికి రావణుడే ప్రాణము కనుక అతనిని సంహరించడానికి ఉత్తరంలో నేను, నాతమ్మునితో సిద్ధంగా ఉంటాను.


మరొక ముఖ్య విషయము వానరులందరు వారివారి రూపాలతోనే ఉండి పోరాడాలి. ఎవ్వరు మానవ రూపాలను ధరించరాదు.ఎందుకంటే, కోతుల సైన్యంలో, ఈ కోతి ఆకారం మన మధ్య గుర్తింపుకు చిహ్నంగా ఉపయోగపడుతుంది. 

*న చైవ మానుషం రూపం కార్యం హరిభిరా హవే* 

*ఏషా భవతు సంజ్ఞానో యుద్ధే అస్మిన్ వానరే బలే*


మా అన్నదమ్ములతో పాటు విభీషణుడు, ఆయనతో పాటు నలుగురు సహచరులు మానవ రూపాలను ధరించి ఉంటారు.

[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 185* 


వానర రాక్షసుల మధ్య సంకుల సమరము మొదలైంది. అంగదుడు ఇంద్రజిత్తుతో, సంపాతి ప్రజంఘునితో, జంబుమాలి హనుమంతునితో, సుగ్రీవుడు ప్రముసునితో, లక్ష్మణుడు విరూపాక్షునితో తలపడ్డారు.


యుద్ధ భూమి అంతా రక్తసిక్తమైంది.


అంగదుని వీర విహారాన్ని నిలుపడానికి ఆయనను ఇంద్రజిత్తు గదతో మోదాడు. అంగదుడు ఆగ్రహంతో ఇంద్రజిత్తు రథము పైకి ఉరికి, సారధిని, గుజ్జలను చంపాడు. అంతేకాక ఇంద్రజిత్తు చేతిలోని విల్లమ్ములను విరిచి పారవేశాడు.


జంబుమాలి ఆంజనేయునిపై శక్తిని ప్రయోగించాడు. దానిని తప్పించుకొని హనుమ జంబుమాలి రధముపైకి ఉరికి ఆయనను హతమార్చాడు.


నలుడు ప్రతపనుని రెండ్లు కండ్ల గుడ్లను పీకి వేశాడు. సుగ్రీవుడు వానర సేనపై విరుచుక పడుతున్న ప్రఘసుని సంహరించాడు.


లక్ష్మణుడు శర వర్షంతో విరూపాక్షుని రూపుమాపాడు.


సుషేణుడు విద్యున్మాలిని ఒక కొండతో కొట్టి చంపాడు. మైందద్వివిదులు వజ్ర ముష్టి, నికుంభులను తుదముట్టించారు.


ఈ విధంగా మొదటి రోజు ద్వంద్వ యుద్ధంలో రాక్షస వీరులు చనిపోయారు. 

** 


శ్రీరామచంద్రుడు రాక్షసులపై శరవర్షాన్ని కురిపించాడు. ఆ బాణ వర్షానికి రాక్షసులు

అనేక సంఖ్యలో హతులయ్యారు.


ఒక వైపు మొదటి రోజు యుద్ధంలో రాక్షస నాయకులు సంహరింపబడడము, మరొకవైపు శ్రీరాముని శరవర్షానికి సామాన్య రాక్షసుల మరణము ఇంద్రజిత్తును కృంగదీశాయి.


ఇంద్రజిత్తు వానరులపై విరుచుకుపడ్డాడు. కాని అంగదుడు అతని అశ్వాలను,

రథసారధిని అతిలాఘవంగా హతమార్చాడు. అంగదుని దేవగణాలు, బుషిగణాలు,

రామలక్ష్మణులు సుగ్రీవ విభీషణులు అనేక విధాలుగా ప్రశంసించారు.


ప్రత్యక్ష యుద్ధంలో తన పాచికలు పారవని గమనించిన ఇంద్రజిత్తు మాయా.. యుద్ధానికి పూనుకొని,  తాను కనబడకుండా వానరులపై బాణ వర్షాన్ని కురిపించసాగాడు.


అంగదాది మహావీరులు మహా వృక్షాలను, మహాశిలలను గైకొని ఇంద్రజిత్తును ఎదిరించుటకు నిలువగా, ఆయన వారికి కనబడకుండా ఉండి పెద్ద పెద్ద అస్త్రాలను ప్రయోగించి వారిని కదలకుండా చేశాడు.


రామ లక్ష్మణులపై భయంకరమైన "నాగాస్త్రాన్ని" ప్రయోగించాడు. నాగాస్త్రాన్ని ఇంద్రజిత్తు వర ప్రసాదంగా లభించినవాడు. అందువలన అది అమోఘమైనది.


*అదృశ్యో నిశితాన్ బాణాన్ ముమోకముమోశా శనివర్చసః*  

*సరామం లక్ష్మణం చైవ ఘోరైర్నాగ మయై శరైః*

రామలక్ష్మణులు కూడా ఆ నాగాస్త్రానికి కట్టుబడ్డారు. భయంకరమైన సర్పాలు రామ లక్ష్మణుల శరీరాలకు గట్టిగా చుట్టుకొన్నాయి. వారికి ఊపిరాడడం కూడా కష్టంగా ఉంది. వారి శరీరాల నుండి మేఘనాదుని బాణ వర్షానికి రక్తము ధారగా కారుతున్నది. వారిద్దరు విధిలేక భూమిపై పడిపోయారు.


ఆ అన్నదమ్ములు ఒకరినొకరు చూచి నిరాశతో మూర్ఛచెందారు. '


అప్పుడు మైందద్వివిదులు సుగ్రీవాంగద, విభీషుణులు నాగాస్త్ర బద్ధులైన రామలక్ష్మణులను చూసి విషాదాన్ని పొందారు.

*నీలా ద్వివిదా మైందాశ్చ సుషేణ కుముదాంగదాః*

*తుర్ణం హనుమతా సార్ధం అన్వశోచంత రాఘవౌ*

అయితే మేఘనాధుడు తన మాయా విద్య వలన అంగదాది మహా వానరులందరిని తన బాణ వర్షంచేత బంధించాడు.


రాక్షస వీరులు రాక్షస రాజపుత్రుని పరాక్రమానికి సంతోషించి రామలక్ష్మణులు చనిపోయారని, నిశ్చయించుకొని, ఇంద్రజిత్తుకు జయ జయ ధ్వానాలను చేశారు......

[14/10, 4:32 pm] K Sudhakar Adv Br: 🌹 *రామాయణానుభవం_ 184* 


శ్రీరాముడు రావణుని వైపు చూస్తుండగానే చిటికెలో సుగ్రీవుడు మాయమయ్యాడు.

శ్రీరామునికి అయోమయం కలిగింది.


ఇంతలో సుగ్రీవ రావణ ద్వంద్వ యుద్ధము, గాయాలతో, నెత్తురు ధారలతో సుగ్రీవుడు తిరిగి రావడం జరిగి పోయాయి.


శ్రీరాముని మనస్సు "సుగ్రీవునికి ఏమవుతుందో ఏమో అనే బాధతో నిండి పోయింది."


అందువలన సుగ్రీవుడు తిరిగి రాగానే వానర వీరులందరు ఆయనను ప్రశంసిస్తే శ్రీరాముడు మాత్రము ఆయనను మందలించాడు.


"మిత్రమా! ఎంత పని జరిగింది! ఎంత పని జరిగింది! ఎంత సాహసం చేశావు?


నీవు వెళ్లేప్పుడు నాకు చెప్పి వెళ్లాలనిపించలేదా? ఒంటరిగా నీకు నీవు ఇంత సాహసం

చేయడం తగునా?


*అసమంత్య్ర మయా సార్థం తదిదం సాహసం కృతం*

*ఏవం సాహసకర్మాణి న కుర్వంతి జనేశ్వరః*

రాజు ఎప్పుడు స్వతంత్రించి సమరంలో ముందు దిగకూడదు. ఆయన పరివారాన్ని ముందు దింపి, సమయాన్ని చూచి తాను సమరంలో కాలు పెట్టాలి.


అందువలన ఒక రాజువై ఉండి నీవు ఈ విధంగా సాహసించడం మంచి పద్దతికాదు


అంతేకాదు మేమందరము ఎవ్వరి బలాన్ని చూసుకొని ఇంతదాకా వచ్చాము ? నీ బలాన్ని చూసుకొనే కదా? ఆ విధంగా అందరికి రక్షణనిచ్చే నీవే అరక్షణలో పడితే


*త్వయకించిత్ సమాపన్నే కింకార్యం సీతయా మమ?*


నీకేదైనా అయితే నేను

జీవింపజాలను. అప్పుడు సీత మాత్రము నాకెందుకు? అంతే కాదు నన్ను ఆశ్రయించిన వాడివి. నీకేదైన ప్రమాదం కలిగితే నా ఆశ్రిత రక్షా దీక్ష" ఏమయిపోతుంది? "

తనను ఆశ్రయించిన సుగ్రీవుడి కొరకు వాలిని వధించి, ఆయన రాజ్యాన్ని,

భార్యను  ఆయనకు రాముడు ఇప్పించాడు.


కాని తన ఆశ్రితులు ఆపదల పాలు కానీయకుండా రక్షించవలసిన తానే సుగ్రీవునికి కలిగే ప్రమాదాన్ని కూడా చూడకుండా ఆయనను రావణుని పైకి దాడి చేయడానికి రాముడు అనుమతించాడు." అని నాగురించి ఎంత నీచంగా జనం చెప్పుకుంటారు ?


అంతే కాదు నీవు నాకు ముఖ్య మిత్రుడివి. నీతో సమానం నాకెవ్వరు కాదు. సుగ్రీవా! నీకేదైనా ప్రమాదము జరిగితే దానికి కారణమైన రావణాసురుని సపరివారంగా చంపి, విభీషణునికి నేనిచ్చిన మాట ప్రకారం లంకా పట్టాభిషేకము చేసి, అయోధ్యకు వెళ్లి భరతునినే శాశ్వతంగా పాలించుమని నిర్బంధించి, నాప్రాణాలను విడువాలనుకొన్నాను" అని రాముడు వివరించాడు.....

** 


శ్రీరామ చంద్రస్వామి సువేల పర్వతము దిగి లంకను పూర్వము అనుకున్నట్లుగా ముట్టడించదలిచాడు.

*తస్మాద్ అవతరత్ శీఘ్రం పర్వత అగ్రాన్ మహా బలః*


నీలుడు తూర్పు దిక్కు, అంగదుడు దక్షిణంవైపు, హునుమంతుడు పశ్చిమం వైపు సైన్య మధ్యలో సుగ్రీవుడు ముప్పై ఆరు కోట్ల వీరులతో, ఉత్తరము (రావణుడున్న) వైపు స్వయంగా రామ లక్ష్మణులు యుద్ధ సన్నద్ధులైనిలిచారు.


ప్రతి ద్వారము ముందు కోటి వానర సైన్యాన్ని సుగ్రీవుడు నిలిపాడు. సుగ్రీవుడు మధ్యలో నుండి ఉత్తర ద్వారము దగ్గర నిలిచిన రామలక్ష్మణులను, దక్షిణ ద్వారము దగ్గర ఉన్న అంగదుని ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు.

క్షణాలలో లంకా నగరం యొక్క అన్ని ద్వారాల వద్ద వానరులు నిండిపోయారు. లోపలి వారిని బయటకు రానీయకుండా బయటి వారిని లోనికి పోనీయకుండా కట్టడి చేశారు.


శ్రీ రామచంద్ర ప్రభువు రావణాసురునికి మరొక అవకాశమివ్వదలచి రాయబారాన్ని పంపాలనుకొన్నాడు.


హనుమ, సుగ్రీవుల బలాన్ని రాక్షసులు ఇది వరకే రుచి చూశారు. కనుక అంతవాడైన అంగదుని దూతగా ఈ సారి పంపాలనుకొన్నాడు.

*గత్వా సౌమ్య దశగ్రీవం బ్రూహి మద్ వచనాత్ కపే*

*లంఘయిత్వా పురీం లంకాం భయం త్యక్త్వా గత వ్యథాః*

*భ్రష్ట శ్రీకా గతా ఐశ్వర్య ముమూర్షో నష్ట చేతనః*


"అంగదా ! నీవు ఈ ప్రాకారము పైకి ఎగిరి లంకానగరంలోపల దూకు. అక్కడ రావణుడు సపరివారంగా ఉంటాడు. వాని ముందుకు వెళ్లి నిర్భయంగా నేను చెప్పిన మాటలను తెలుపు "రావణా! నీవు ఋషి కన్యలను అప్సరసలను, దేవగందర్వ కన్యలను అపహరించి, వారికి మన్నించరాని మహాపరాధం చేశావు. 


నా భార్యను అపహరించి నిన్ను శిక్షించే అవకాశము నాకు ఇచ్చావు.


ఏ బలగర్వంతో సీతను అపహరించావో, ఆ బలాన్ని మగవాడివి అయితే నా ముందు చూపు. నిన్ను ఒక్కడిని సంహరించడమే కాదు, నిన్ను బలపరిచే రాక్షసులనెవ్వరిని మిగిలను. నాకంటబడితే నిన్ను భస్మము చేయకుండా వదలను.


ధర్మాత్ముడైన విభీషణుడు లంకానగరాన్ని పరిపాలించుటకు సమర్ధుడు. ఆయనకు ఇదివరకే సముద్ర తీరంలో పట్టాభిషేకం జరిపించాను. ఇక లంకా సింహాసనము ఆయనదే. అందువలన నిన్నువధించుట తప్పదు. 


భయంకరమైన నా బాణాగ్నికి భస్మం కాకుండా మిగులాలంటే, సీతాదేవిని నాకు సమర్పించి, నన్ను శరణువేడు. 


ఇక నీవధ తప్పదు. నీవు సపరివారంగా సంహరింపబడుతావు. కనుక నీ మరణం తరువాత నీకు తద్దినము పెట్టే వారు మిగలరు. కనుక యుద్ధానికి వచ్చే ముందే “జీవశ్రాద్ధము” పెట్టుకొనిరా.”


అంగదుడు ప్రాకారముపై నుండి రావణుని ముందు దుమికాడు. తన పేరును తెలిపి శ్రీరామచంద్రుని సందేశాన్ని ఉన్నదున్నట్లు వినిపించాడు.

తన ముందుకు ఒకరి తరువాత ఒకరు వానర వీరులు వచ్చితమ పరాక్రమాన్ని ప్రదర్శించి వెళ్లడం రావణునికి నచ్చలేదు.


అందువలన ఆయన సైనికులతో "ఈ దుష్టుణ్ని పట్టుకొండి, కొట్టండి చంపండి” అని ఆగ్రహంతో ఆజ్ఞాపించాడు. 

*తతః స రోష తామ్రాక్ష  శశాస సచివామ్స్తదా*

*గృహ్యతామేష దుర్మేధా వధ్యతాం ఇతి చాసకృత్*

రాక్షస వీరులు చుట్టుముట్టి అంగదుని పట్టుకున్నారు. కావాలనే వారికి అంగదుడు పట్టుబడ్డాడు. వారిని తన చేతులలో బిగించి, పామును బంధించిన గరుడుని వలె ప్రాకారము చివరి దాకా తీసుకెళ్లి క్రింద పడవేశాడు. రాక్షసరాజు కళ్లముందే ఆయన భటులు క్రిందపడి, కీళ్లు విరిగి, హతులయ్యారు.


అంతే కాదు ఆ భవన శిఖరాన్ని అంగదుడు పిండిపిండి చేశాడు. ఆశిఖరము రావణుని పాదాల ముందే ముక్కలైపడిపోయింది.


తన బలాన్ని మచ్చుకు రుచి చూపించి అంగదుడు రావణుడు చూస్తుండగానే పైకి ఎగిరి శ్రీ రాముని సన్నిధిలో వాలాడు. ఈ అంగదుని అద్భుత కార్యము రాక్షసులలో మహాభయాన్ని వానరులలో మహోత్సాహాన్ని నింపింది.


రావణుడు కోపావిష్టుడై యుద్ధానికి బయలుదేరుమని ఆజ్ఞాపించాడు. అనేక ఆయుధాలను ధరించి సైనికులు యుద్ధానికి బయలుదేరారు.....

 [14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra m -- 21 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

పరీక్షిత్తు – కలి – ధర్మదేవత

పరీక్షన్మహారాజు సార్వభౌముడు అయ్యాడు. దేశాన్నంతటినీ కూడా ఎంతో సుభిక్షముగా పరిపాలిస్తున్నాడు. ధర్మరాజు పరిపాలించినప్పుడు దేశం ఎంత శోభతో, కళ్యాణ ప్రదముగా ఉన్నదో అంత ఆనందముగా ఉన్నది. ఎక్కడ చూసినా మూడు పువ్వులు ఆరుకాయలు. నెలకి మూడు వానలు! ఎక్కడా ధర్మమునకు లోపమన్నది లేదు. ఎన్నో దిగ్విజయ యాత్రలు చేసాడు. తన మేనమామగారయిన ఉత్తరుని కుమార్తె అయిన ఇరావతిని వివాహం చేసుకున్నాడు. నలుగురు కుమారులు జన్మించారు. వారిలోని వాడే సర్పయాగం చేసిన జనమేజయుడు. కురు, పాంచాల, కోసల, కాశి, మల్ల, అంగ, మగధ, మత్స్య, చేది, అవంతి, గాంధార, కాంభోజ, సౌరాష్ట్ర మొదలయిన రాష్ట్రములు అన్నిటిని జయించాడు. ఏకచ్ఛత్రాధిపత్యంగా విశాలమయిన సామ్రాజ్యమును తన పతాకఛాయలలో అత్యంత సంతోషంగా పరిపాలన చేస్తున్నాడు.

పరీక్షిత్తు యాగం చేసినప్పుడు దేవతలను పిలుస్తుంటే దేవతలు వచ్చి ఎదురుగుండా కూర్చునేవారట! యాగం చెయ్యని వాళ్ళుకూడా ఆ యాగశాలలోకి వచ్చి కూర్చుని, దేవతలు అందరూ వచ్చి కూర్చుని హవిస్సు పుచ్చుకుని వెళ్ళడము చూసేవారు. అంత నిష్ఠాగరిష్ఠుడై యాగములు చేసాడు. ఆయన దిగ్విజయయాత్రకు వెళ్ళి శిబిరము వేసుకుని ఉండగా, ఆయా ఊళ్ళల్లో ఉన్న జానపదులు వచ్చి 'మహానుభావా ! మీ పెదతాతగారయిన ధర్మరాజుగారు ఇలాగే దిగ్విజయ యాత్రకు వచ్చి శిబిరము వేసుకుని ఉంటే, మహానుభావుడు కృష్ణ పరమాత్మ, శిబిరములో పాండవులందరూ నిద్రపోతుంటే తానొక్కడే కత్తి పైకి తీసి పాండవులకు ఆపద వస్తుందేమోనని నిద్రపోతున్న పాండవులకు తెలియకుండా కత్తి పట్టుకుని శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండేవాడు. కృష్ణుడు మీ తాతలని అంతలా రక్షించాడు. అదే కృష్ణుడు సారథ్యం చేస్తుంటే పాండవ మధ్యముడయిన అర్జునుడు ఒక్కొక్కసారి పిలవడం కోసమని తన పాదముతో కృష్ణుడిని డొక్కలో చిన్నగా తన్నితే కృష్ణుడు వెనక్కి తిరిగి చూసి 'ఫల్గుణా! రథం ఎటు తిప్పాలి’ అని అడిగేవాడు. అర్జునుని పిలిచి బావా! అని హాస్యం ఆడేవాడు. ‘శ్రీకృష్ణుడు నిజంగా పాండవులను ఎంతో ఆదరించాడు. మహాశివరాత్రి నాడు అర్జునుడు పాలచెంబు పట్టుకుని గబగబా పరుగెడుతుంటే చూసి కృష్ణుడు 'బావా ! ఎక్కడికి పరుగెడుతున్నావు?’ అని అడిగాడు. అర్జునుడు ‘శివాలయానికి వెడుతున్నాను. ఈవేళ శివరాత్రి అభిషేకము చెయ్యాలి’ అన్నాడు. కృష్ణుడు శివాలయములోనే ఉన్నాడని అనుకుంటున్నావా? ఇదిగో ఇక్కడ లేడా’ అని పంచెను పైకి తీశాడు. శ్రీకృష్ణుని మోచిప్పలో శివలింగం కనపడింది. శివకేశవ అభేదం! కృష్ణ భగవానుడి మోచిప్పను చూసి అర్జునుడు అభిషేకము చేసాడు.

కృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా కాపాడాడు. పరీక్షిత్తు కృష్ణకథలు విని, తన తాతలు కృష్ణుడితో గడిపిన మర్యాదా పురస్కృతమైన విశేషములను విని, కన్నుల నీరు కారిపోయి పొంగిపోతూ పట్టుబట్టలు, చీని చీనాంబరములు తెప్పించి పాండవులతో కృష్ణుడు గడిపిన రోజులు గురించి చెప్పిన వాళ్ళందరికీ బహుమానములను ఇచ్చేవాడు. కృష్ణుని పాదములయందు నిరంతరము రమించి పోతూ ఉండేవాడు. మహాత్ముడయిన పరీక్షిత్తు పరిపాలిస్తూ ఉండగా లోకమంతా ప్రశాంతముగా ఆనందముతో ఉన్నది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన చూశాడు. దీనిని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. దీనిని కేవలము ఒక పురాణ కథగా చదివితే దానివలన ఎంత ప్రయోజనము వస్తుంది అంటే చెప్పలేము. ఈ ఘట్టమును చాలా సునిశితముగా పరిశీలించాలి. భాగవతము భాగవతముగా అర్థం కావాలి అంటే ఇది చాలా కీలకమయిన ఘట్టం. ఒక మహాపురుష ప్రవేశం జరిగేముందు దాని వెనక ఒక కీలకమయిన సందర్భం ఉంటుంది. శుకుడు వచ్చి కూర్చోవలసిన సందర్భం వస్తున్నది. అలా రావడానికి దాని వెనక ఏదో మహత్తరమయిన సంఘటన జరుగుతున్నది. ఆ కోణములో పరిశీలన చేయకపోతే భాగవతమును వ్యాసుడు ప్రారంభం చేసిన రహస్యం అందదు. భాగవతమును విన్నంత మాత్రం చేత జీవితం మారిపోతుంది.

పరీక్షిన్మహారాజు దిగ్విజయ యాత్రలో తిరుగుతూ తిరుగుతూ ఒక ప్రదేశమునకు వచ్చాడు. ఒక ఆవు, ఎద్దు నిలబడి వున్నాయి. ఈ ఆవు పిల్లల పక్కన లేక పిల్లలు కనపడక, పిల్లల క్షేమవార్త తెలియక ఏడుస్తున్న తల్లి ఎలా ఉంటుందో అలా ఉన్నది. ఇటువంటి ఉపమానమును తండ్రికి వెయ్యరు. తల్లికి మాత్రమే వేస్తారు. అమ్మ అనే మాట చాలా గొప్పది. మాతృత్వంలో ఉన్న ప్రేమ అంతటినీ తీసుకువచ్చి ఒక ముద్దగా పెడితే ఆ ముద్దను చూడాలి అనుకుంటే ఆ ముద్దయే భూమి అమ్మ. ఇందుకే భూమి గురించి ఎక్కడయినా చెప్పవలసి వస్తే ఋషులు పొంగిపోతారు. వాల్మీకి మహర్షి అయితే ‘క్షితి క్షమా పుష్కర సన్నిభాక్షీ’ అంటారు. అమ్మకి ఉండే గొప్ప లక్షణము ఓర్పు. అమ్మకి ఓర్చగలిగిన గుణం ఉంటుంది. కలియుగ ప్రారంభములో ఇవాళ భూమి దానిని కోల్పోయింది. బిడ్డ కనపడని ఆవు ఏడ్చినట్లు ఆవిడ ఏడుస్తోంది. ఇది కలియుగానికి ప్రారంభం. అమ్మ ఏడుపుతో కలియుగం ప్రారంభమయింది. దీనిని గుర్తుపట్టాలి. ఆవు అలా ఏడుస్తుంటే పక్కన ఒక ఎద్దు వచ్చి నిలబడి ఉన్నది. ఆ ఎద్దు ఒక కాలితోనే ఉన్నది. ఎద్దుకు మూడు కాళ్ళు లేవు. ఒక కాలిమీద ఎద్దు నిలబడగలదా? ఒక కాలితో ఉన్న ఎద్దు భూమిమీద డేకుతూ ఉంటుంది. నిలబడినట్లు కనపడుతుంది అంతే. అలా నిలబడినట్లుగా ఉన్న ఎద్దు తన మూడుకాళ్ళు పోయాయని ఏడవడము లేదు – ఆవు ఏడవడము చూసి ఆశ్చర్యపోయింది. ఇదీ గుర్తుపట్టవలసిన రహస్యం. ఆవు ఎందుకు ఏడుస్తోందని గోమాత వంక తిరిగి – ‘నీవు ఎందుకు ఏడుస్తున్నావు మంగళప్రదురాలా’ అని అడిగింది. ‘మంగళప్రదురాలా’ అంటే ‘శుభం ఇవ్వడం మాత్రమే తెలిసున్నదానా’ అని అర్థం.

ఒక ఇల్లు కట్టుకోవాలంటే భూమిని గునపంతో ఆవిడ గుండెల మీద కన్నం పెడతారు. శంకుస్థాపన చేస్తే ఆవిడ ఇల్లు కట్టుకోమంటుంది. అన్నం తినడానికి నాగలిపట్టి అమ్మ గుండెలమీద గాట్లు పెడితే అమ్మ పంటలు పండించి కడుపు నిండేటట్లుగా అన్నం పెడుతోంది. ఎంత బాధ పెట్టినా కన్నులవెంట నీరు పెట్టుకోవడము ఆమెకు తెలియదు. బ్రతకడానికి ఇవ్వడం తెలుసు. గోవు ఏడుస్తుంటే ఎద్దు అడిగింది. ‘నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకేమి బాధ కలిగింది? నువ్వు చాలా సంతోషముగా ఉండేదానివి కదా!’ అడిగితే భూమి ‘నేను నాకు ఏదో బాధ కలిగిందని ఏడవడం లేదు. కృత యుగమయినా, మరొకటి అయినా నా బాధ ఎప్పుడూ అలానే ఉంటుంది. గోవు బాధ పడుతోంది. కలియుగ ప్రారంభంలో ఎందుకు గోవు అలా ఏడుస్తున్నదో చెప్తున్నారు. ఆవు ఎద్దుతో చెప్తోంది ‘కలి ప్రవేశించాడు – నేను ఏడుస్తున్నా నంటావేమిటి? నీకు మూడు కాళ్ళు లేని తనమును చూసి నేను ఏడుస్తున్నాను’ అన్నది. ఆయనకు మూడుకాళ్ళు లేకపోతే ఈవిడ ఏడవడం ఎందుకు? ఆవిడ –

కలి బలవంతంగా రాలేదు. ఈశ్వరుడు అనుగ్రహించాడు. కలియుగం రావడానికి కాలము దారిని ఇచ్చింది కాలము ఈశ్వరరూపం. ఆ కలి లోపలి అడుగు పెట్టి పాదములు ఇంకా పూన్చుకోలేదు – పరిస్థితి మారిపోయింది. పూర్వము నీకు నాలుగు పాదములు ఉండేవి. నీకు ఒక పాదమే ఉన్నది. మూడు పాదములు లేవు. కలిపురుషుడు రావడము వలన నీకు మూడు పాదములు పోయాయి’ అన్నది.

అది మామూలు ఎద్దు కాదు. ఆ ఎద్దు ధర్మము. ధర్మమునకు, భూమికి ఎంతో దగ్గర సంబంధము. ధర్మమునకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఈ నాలుగు పాదములతో ధర్మం నడుస్తుంది. ఇలా నడిచే నాలుగు పాదములు కలిగిన ధర్మమనబడే వృషభమును శంకరుడు ఎక్కుతాడని అంటారు. ఆయన ధర్మమును అధిరోహించి నడుస్తారని భావము. ఆవు చెపుతున్న మాటలను చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. ‘నేను దేవతల గురించి ఏడుస్తున్నాను. హవిస్సులు పొందని దేవతలు తయారవుతారు’ అన్నది. రాబోయే కాలములో యజ్ఞయాగాదులను విమర్శించే వాళ్ళు ఎక్కువయిపోతారు. యజ్ఞయాగాది క్రతువులు ఒక్క మన సనాతన ధర్మములో మాత్రమే ఉంటాయి. ఇంకెక్కడా లేవు. యజ్ఞం చేయడం, అగ్నిహోత్రంలో హవిస్సు వెయ్యడం మున్నగు కార్యక్రమములు జరగవు. మరల సంపదను పొందడానికి అగ్నిహోతము ద్వారా దేవతలకు హవిస్సులు ఇస్తే, ప్రీతిచెందిన దేవతలు మరల వర్షమును కురిపించి మనకు సంపదలను ఇస్తారు. తిరిగి వారిపట్ల కృతజ్ఞతను ప్రకటించనప్పుడు దేవతల ఆగ్రహమునకు గురి అవుతారు. కలియుగంలో దేవతలకు హవిస్సులు ఇవ్వబడవు. ‘హవిస్సులు ఇవ్వని మనుష్యులకు శుభమును మేము చేయము’ అని దేవతలు శుభములను చేయరు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 22 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఏది సనాతన ధర్మమో, ఏ సనాతన ధర్మము ఈ గడ్డ మీద నిలబడిందో ఆ సనాతన ధర్మము ఈ గడ్డమీద విమర్శకు గురి అవుతున్నది. యజ్ఞ యాగాది క్రతువులు నశించిపోవడం ప్రారంభమవుతుంది. ఎవరు వేదమును కష్టపడి చదువుకుని, చాలా కష్టపడి ఆ స్వరంతో వేదం చెపుతారో అటువంటి వారికి ఆదరణ తగ్గిపోతుంది. లోకంలో అసలు ఆ వేదమును ఆదరించాలనే బుద్ధి నశించిపోతుంది. ఎవరు తపస్సుతో ఉన్నాడో, ఎవరు లోకంలో ఈ విషయ సుఖములు అక్కర్లేదని జడలు కట్టి భగవంతుని యందు ఉన్నాడో వానిని లోకులు రాళ్ళుపెట్టి కొట్టే రోజు వస్తుంది. అలాంటి వానిని చూసి నిష్కారణంగా విమర్శ చేసే రోజులు బయలుదేరతాయి. పితృదేవతలకు తద్దినములు పెట్టేవాళ్ళు కరువైపోతారు.


ధర్మం పోతుంది. ఆవులు అవమానింపబడతాయి. ఆవుల్ని కొడతారు, అమ్ముతారు, తోళ్ళు తీసేస్తారు. ఆవుమాంసం తింటారు. ఈ మాటలను కలియుగ ప్రారంభంలోనే చెప్పేసింది. ‘వీళ్ళందరూ బాధలకు గురి అవడం ప్రారంభం అవుతున్నది. అందుకు ఏడుస్తున్నానని ఒకమాట చెప్పింది. ‘నీకు సత్యము, శౌచము, తపస్సు, దయ అనే నాలుగు పాదములు ఉండేవి. ఇందులో మూడు పాదములు పోయాయి’ అన్నది.


ఎద్దును ధర్మ స్వరూపంగానూ, ఆవును భూస్వరూపముగానూ తలంచాలి. ధర్మ స్వరూపమునకు మూడు పాదములు పోయాయి అంటే ఏమిటి? ధర్మమన్నా ఆచరించాలి లేదా అధర్మమన్నా ఆచరించాలి. ధర్మంగా ఉండాలి. అలా ఉండకపోతే అధర్మం చేసినట్లు. అధర్మమయినవి మూడు తిరగకూడనివి తిరుగుతున్నాయి. అవి తిరగబట్టి ధర్మమునకు ఉండే ఈ మూడు పాదములు తెగిపోయాయి. సత్యమనే పాదము మాత్రము ఎన్నటికీ తెగదు. దీనిని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇన్ని అధర్మములు చేసినా, దేవుడి గురించి తిట్టేవాడికి కూడా లోపల దేవుడు ఉన్నాడు. లోపల ఆయన ఉండి ఊపిరిని వాక్కుగా మారిస్తే వాడు కృతఘ్నుడై తిట్టగలుగుతున్నాడు.


ఈశ్వరుడు ఇంకా ఉన్నాడు కాబట్టి ఈలోకం ఉన్నది. మారని పదార్థము ఇంకా కాపాడుతున్నది. నాలుగు పాదములలో సత్యమనే పాదము ఒక్కటే నిలబడింది. శౌచము – దుష్టజనులతో కూడిన సంగమము వలన పోయింది. జీవితములో అన్నిటికన్నా స్నేహం విషయములో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి తమంత తాముగా యాభైమంది వచ్చి వారంతా మాట్లాడవచ్చు. ఎప్పుడూ మీరు మీ స్థితి నుండి జారిపోకూడదు. ఒకనాడు దుష్టుడయిన వాడు ప్రమేయం లేకుండా తారసపడతాడు. వాని మాటలను ఒక తామరాకు మీద నీటిబొట్టు పట్టినట్లు ఆ మాటలు వెంటనే జారిపోవాలి. వాని మాటలను ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప వాటికి మనసులో స్థానం ఇవ్వకూడదు. అలా స్థానం ఇస్తే శౌచము పోతుంది. శౌచము అంటే ఆచారము, నడవడి, వ్యవహారము. ఇవన్నీ నశించిపోతాయి.

మూడవ పాదము దయ. దయ దేనివలన పోయింది? దయ పోవడానికి ప్రధాన కారణము అహంకారము. అహంకారము వలన దయ నశించి పోతుంది. తనలో ఫాల్స్ ఈగో ఒకటి వృద్ధి చేసుకుంటాడు. ఎప్పుడూ నిన్ను పొగిడేవాడిని ఎక్కువగా నీ దరికి చేర్చకు’ అని చెపుతారు. నీకు తెలియకుండా నీవు నిర్మించుకున్న నీ శీలము అహంకారము వలన నశించిపోతుంది. మీ పక్కన కూర్చున్న వాడు నిరంతరం పొగడడం మొదలు పెడితే – ‘నా అంతటి వాడిని నేను’ అన్న అహంకారము వచ్చి ఈ అహంకారము ప్రబలిపోవడం వలన భూతదయ నశించిపోతుంది. అహంకారము కారణమయింది. దయ స్థానంలో, కలిపురుషుడు ఉన్నచోట అహంకారము కనపడుతూ ఉంటుంది. ధర్మము స్థానంలో అధర్మము ప్రవేశిస్తోంది.


మూడవది తపస్సు, తపస్సు సమ్మోహము వలన పోయింది. సమ్మోహము అనేది ఒక విచిత్రమయిన లక్షణము. కాబట్టి ఇప్పుడు ఈ మూడూ పోయాయి. ధర్మము మూడు పాదములు పోయి అధర్మము పాదములు వచ్చాయి. అధర్మము పాదములు ధర్మమునకు అంటుకుని ఉండవు. అది ధర్మ స్వరూపమయిన వృషభము. అది కలియుగంలో మూడు పాదములు లేకుండా కనపడుతోంది. ఈ మూడు పాదములు ఇంకొక చోట ఉన్నాయి. ‘ఆ మూడు పాదములే ఇప్పుడు తిరుగుతున్నాయి. కాబట్టే ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. నేను ఏడవడానికి కారణం నీమూడు పాదములు లేకపోవడము’ అన్నది.


అక్కడ ఆవు, ఎద్దు అలా ఏడుస్తుంటే ఒక విచిత్రమయిన సంఘటన జరిగింది. ఒక వ్యక్తి ఆ ఆవు, ఎద్దు దగ్గరికి వచ్చాడు. ఆ వచ్చిన వాడు మిక్కిలి క్రోధంతో ఉన్నాడు. వాని క్రోధం సామాన్యమయిన క్రోధం కాదు. అపారమయిన కోపం ఉన్నవాడు. పైగా చేతిలో కత్తి, కర్ర పట్టుకున్నాడు. చూడడానికి రాజుగారిలా ఉన్నాడు. రాజు ఎటువంటి ఆభరణములు పెట్టుకుంటాడో, ఎటువంటి కిరీటము పెట్టుకుంటాడో అటువంటివి పెట్టుకుని పరిపాలకుని వలె ఉన్నాడు. కానీ వాడు ఎప్పటికీ పరిపాలకుడు కాలేడు. వానిలోపల పరిపాలనాంశ లేదు. పరిపాలించడానికి తగిన సంస్కార బలం లేదు. కానీ పరిపాలకుడు అయ్యాడు. ఇది కలియుగ లక్షణం. నృపాకారంలో వచ్చినవాడు బిడ్డ కనపడక ఏడుస్తున్న తల్లిలా శుష్కించి పోయివున్న, ఏమీ చేయకుండా అలా నిలబడిపోయి వున్న ఈ ఆవుని, అపారమయిన కోపంతో తన కాలు ఎట్టి ఒక్కతన్ను తన్నాడు. ఆ ఆవు నేలమీదికి తిరగబడి పోయింది. అక్కడే ఉన్న ఒక కాలుమీద నిలబడిన ఎద్దును మరో తన్ను తన్నాడు. ఎద్దు కూడా క్రింద పడిపోయింది. అలా పడిపోతే వాడు ఊరుకోలేదు. తన చేతిలో ఉన్న దండముతో ఆ రెండింటినీ కొట్టడం ప్రారంభించాడు. వాడు భూదేవిని కొడుతున్నాడు. భూమి వలన తాను బ్రతుకుతున్నాడన్న విషయమును మరిచిపోయి ప్రవర్తిస్తున్నాడు. ధర్మమును దెబ్బతీస్తున్నాడు. అదేపనిగా కొడుతున్నాడు. అవి ఏడుస్తూ, కన్నులవెంట నీరు కారుస్తూ కిందపడి లేచి కుంటుతూ ఉన్నాయి. అతను కొడుతున్న ఆవు కైలాస పర్వతం ఎలా ఉంటుందో అంత తెల్లనయిన ఆవు. కైలాసము ఈశ్వరుని ఆవాసము. ఈశ్వరుడు పైకి అపవిత్రముగా, అమంగళముగా ఉన్నట్లు కనపడతాడు. పుర్రెలమాల వేసుకున్నట్లు, శ్మశానములో ఉన్నట్లు, శవవిభూతి రాసుకున్నట్లు ఉంటాడు. ఆయనంత మంగళప్రదుడు వేరొకడు లేదు. ఆయనకు ‘శివ’ అని పేరు. పైకి అమంగళంగా కనపడతాడు. రెండు పరస్పర విరుద్ధమయిన విషయములు ఒకరియందు ఏకకాలమునందు ఉన్నాయి. ఆయన ఎప్పుడూ మంగళమునే చేస్తాడు. శివుడు ఎప్పుడూ అమంగళమును చెయ్యడు. ఆవుకూడా ఎప్పుడూ అమంగళమును చెయ్యదు.

నిరంతరము ఉపకారము తప్ప వేరొకటి తెలియని ఆ ఆవుని చూసి పరీక్షిత్తు – ‘నిన్ను ఇలా కొట్టిన వారు ఎవరు? నీవు చేసిన ద్రోహం ఏమిటి? నువ్వు పాలను ఇస్తావు. నీపేడ ఉపయోగపడుతుంది. నీ మూత్రము ఉపయోగ పడుతుంది. ఎవ్వరికీ పనికిరాని గడ్డిని ఎద్దు తింటోంది. ఎక్కడో జనం వెళ్ళి నీరు తెచ్చుకోని చోట మూతి పెట్టి నీరు త్రాగింది. ఇందులో ఒక రహస్యం ఉంది. ఎద్దును పాము ఎక్కడ కరిచినా చచ్చిపోదు అంటారు. కానీ మూతిమీద కరిస్తే మాత్రం చచ్చిపోతుంది. ఆవుకి ఆహారం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి. పుట్టలమీద గడ్డి చాలా బాగా పెరుగుతుంది. అలా పుట్టల మీద పెరిగిన గడ్డిని తినడం ఆవుకి, ఎద్దుకి చాలా ప్రమాదకరం. ఆవు కాని, ఎద్దు కాని పుట్టలమీద గడ్డి తిని గబుక్కున ఎందులోకయినా జారితే గభాలున పైకి రాలేవు.


ఎద్దును చూసి, ‘వీధిలో గడ్డితిని ఏట్లో నీరు త్రాగి కాలం గడుపుకొనే నీ మూడు కాళ్ళను తెగగొట్టిన వాడెవడు? నువ్వు అపరాధం చేశావని ఎలా నమ్మాడు? వాడు భూమిలో దాగున్నా, ఆకాశమునకు ఎగిరిపోయినా, వాడు మణులు పెట్టుకున్న భూషణములతో కూడిన వాని భుజములను నా కత్తితో నరికేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. ఏ చేతితో నీ పాదములు నరికాడో ఆ చేతిని, వాని పాదములను నరికేస్తాను’ అన్నాడు. ఇంకా ధర్మ సంస్థాపన కోసము పరీక్షిత్తు వరకు పూనిక ఉన్న రాజు భూమి మీద ఉన్నాడు.

ఈ మాటలు అన్న తరువాత పరీక్షిత్తు వాటి స్వరూపమును చూసి అక్కడున్న వృషభము, గోవుల అసలు రూపములను గుర్తుపట్టి – ‘అమ్మా, నువ్వు ధరణీదేవివి. ఆయన ధర్మము. మీ ఇద్దరు ఇలా అయినందుకు నేను శోకిస్తున్నాను. ఎవరు ఇలా మీ పాదములు తెగగొట్టాడు?’ అని అడిగాడు.


వృషభము – ‘కొందరు కాలము అన్నారు. కొందరు కర్మ అన్నాడు. ఇది యుగసంధి అన్నారు. ఇది యుగలక్షణం అన్నారు. ‘ఏవేవో కారణములు చెప్పారు. నా కాళ్ళు మాత్రం తెగిపోయాయి’ అని చెప్పింది.

ఆయన అటూ ఇటూ చూస్తున్నాడు. ఇప్పటివరకు నృపాకారముతో ఉన్నవాడు వెళ్ళి పరీక్షిత్తు పాదముల మీద పడిపోయి ‘నన్ను రక్షించండి. తప్పయిపోయింది. ఆ మూడు పాదములు నేనే నరికేశాను’ అన్నాడు. ధర్మము మూడు పాదములు కలి వలన పోయాయి. అనగా కలి తెంచలేదు. కలి మీలోకి వస్తే మీచేత ధర్మమును తెంపించి వేస్తాడు. ఇపుడు కలి ప్రవేశం జరిగింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 23 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


కలి 'నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. యుగం వచ్చేసింది నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. నేను గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో నేను ప్రవేశించాలి కదా! నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానాచోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటావు. నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్పు' అన్నాడు.

పరీక్షిత్తు 'నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు' అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ . మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు.

ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూదశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – కలి ఎలా పాడుచేస్తాడు? ఇది విశ్లేషణ చేయాలి.

జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవరు చెప్పరు. మర్యాద పోతుందని తెలుసు. అబద్ధం చెప్తారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. వీరందరూ లోపల కూర్చుని పేక ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దముగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అక్కడ కలిస్థానం అసత్యం ప్రారంభమవుతుంది.

సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడము మొదలవుతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తే పాపం భార్య ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటే ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. ’ అంటాడు. అక్కడొక అసత్యం. క్రమంగా విషయం తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అని దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది.

రెండవది పానశాల. తాగగానే యుక్తాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెడతాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత రాక్షసుడయిపోతున్నాడు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం అయిపోతుంది. ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అయితే ఆ మదము భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగలోలుడు అయిపోతున్నాడు.

నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తుంచుతారు. ఆకులను సృష్టించలేదు. ఆ ఆకులను తుంచివేసే హక్కు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట. ఒక మనిషిని పడుకోబెట్టి మత్తుమందు ఇవ్వకుండా రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం ఉండదు. ఈశ్వరుడు నోరు ఇచ్చాడు వాక్కునందు అదుపు ఉండాలన్న జ్ఞానం ఉండదు. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.

ఈ నాలుగు స్థానములు కలికి ఇచ్చాడు. తాను పరిపాలనలో ఉండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. కలి ప్రతినిధి.

ఈ నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నా మిగిలిన మూడింటివైపు ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో తెలుసుకోగలుగుతారు.

కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలడు. కలి పరీక్షిత్తుతో 'మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు.

ఆ రోజుల్లో బహుశ ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.

పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన పరీక్షిత్తుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతారు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉన్నది. కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణముగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, క్రూర మృగముల సంఖ్య పెరిగి పోయింద' ని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారముతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగములను వేటాడతాడు. అలా వెళ్ళాలి. జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు. పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టి వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 24 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


పరీక్షిత్తు వేటకి వెళ్ళి వేటాడాడు. దప్పిక, ఆకలి కలిగింది. ఆకలి దప్పిక కలిగినప్పుడు అవి పోగొట్టుకునేందుకు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి. పరీక్షిత్తుకి బుద్ధి భ్రంశము అవుతున్నది. అతడు దగ్గరలో ఉన్న మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాడు. దాహార్తి తీర్చమని అక్కడ ఆశ్రమములో సంచరిస్తున్న స్త్రీ పురుషులనెవరినయినా అడగాలి. కానీ పరీక్షిత్తు వారినెవరినీ అడగలేదు. అతనిలో అహంకారము ప్రవేశించింది. నేరుగా తపోదీక్షలో ఉన్న శమీకమహర్షి దగ్గరకు వెళ్ళాడు. ఆయన

స్థాణువయి ధ్యానమునందు తపస్సునందు చాలా మగ్నుడయి బ్రహ్మమునందు రమిస్తు

ఏమాత్రం కదలిక లేకుండా ఉన్నాడు. ప్రాణాయామము చేత ప్రాణమును నియంత్రించి కుంభకము చేత వాయువును పూరించి ఆపుచేసాడు. మనస్సు ఊపిరిమీద ఆధారపడుతుంది. మనస్సు ఇప్పుడు కదలడం లేదు. మనస్సు కదలకపోవడం వల్ల బుద్ధి కదలడం లేదు. బుద్ధి కదలకపోవడం వల్ల ఇంద్రియములు కదలడం లేదు. బయట విషయమును కన్ను చూడదు, చెవులు వినబడవు. స్పర్శేంద్రియములు బాహ్యజ్ఞానము తెలియదు. జాగ్రదాది మూడు అవస్థలను దాటిపోయి చివరకు తురీయమనే స్థాయికి చేరిపోయి, తాను సాక్షాత్తు ఆత్మగా సాక్షీభూతుడై శరీరమును చూస్తూ బ్రహ్మముగా నిలబడిపోయి ఉన్నాడు. అలా కూర్చుని బ్రహ్మముతో రమించి ఉండిపోతే ఆయన వెంట్రుకలు, గోళ్ళు, పెరిగిపోతున్నాయి. అవి జటలు కట్టేసి కేశ సంస్కారము లేక వ్రేలాడుతున్నాయి. ఒక కృష్ణజింక చర్మమును కట్టుకుని అలా కూర్చుని ఉండిపోయాడు. వస్త్రం కూడా లేదు.

శమీకమహర్షి దగ్గరకు దాహంకోసం ఆర్తిపొందిన పరీక్షిత్తు వెళ్ళాడు. ఆయన నీటికోసం వెళ్ళడం ప్రధానాంశం. పరీక్షిత్తు లోపల ఒక మౌనభాష బయలుదేరింది. ఇప్పుడు పరీక్షిత్తు తానెవరో మరిచిపోయాడు. అతని బుద్ధి భ్రంశమయి బ్రహ్మమునందు రమిస్తున్న తాపసిని చూసి నిశ్శబ్దముగా తాను వెళ్ళిపోవాలి. కానీ తాను అలా వెళ్ళక మహారాజునయిన నేను వస్తే లేచి నిలబడలేదని, నమస్కరించలేదని, ఆసనం చూపించలేదని ఆ తపస్వి మిక్కిలి అహంకారుడని భావించాడు.

ఇప్పుడేమయింది? అంత గొప్ప పరీక్షిత్తు, తెల్లవారిలేస్తే బ్రాహ్మణులకు నమస్కారం చేసేవాడు అన్నీ తెలిసినవాడు అన్నిటినీ మరచిపోయాడు. కలి ప్రవేశము వలన అన్నీ భ్రంశమయి అతనిలో ఆగ్రహం పుట్టి యుక్తాయుక్త విచక్షణను కోల్పోయాడు. ఒక స్థానంలోంచి మరొక స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు.

ఆ మహర్షిని ఎలా అవమానించాలా! అని తలంచాడు. సమీపములో చచ్చిపోయి పడివున్న పాము ఒకటి కనిపించింది. చచ్చిపోయిన పాము అయినా మెడలో వేసేసరికి చల్లగా తగిలి మహర్షికి తెలివి వస్తుంది. ఆయనను గేలిచేయవచ్చు అనుకున్నాడు. పరీక్షిత్తు లోపల వికృతాతివికృతమయిన ఆలోచనలు పెరిగిపోయి తన ధనుస్సు చివరి భాగంతో మృతసర్పమును పైకి ఎత్తాడు. ఒక ప్రభువు, ధర్మరాజు మనుమడు, అభిమన్యుడి కుమారుడయిన పరీక్షిత్తు ఒక చెయ్యరాని పనిని చేసాడు. ప్రపంచంలో పరమ భయంకరమయిన సన్నివేశము జరుగుతున్నది. ఆ మృత సర్పమును పైకి ఎత్తి శమీక మహర్షి మెడలో వేశాడు.

ఆయనకు స్పర్శ తెలియలేదు. తపస్వియై ఉన్న వానిలోనికి కలి వెళ్ళలేకపోయాడు. ఎందుచేతనంటే మహర్షి ఇంద్రియములు, మనస్సు ఈశ్వరుని పట్టి వున్నాయి. ఒక్క స్థానమునకు ఆశ్రయం ఇచ్చిన పరీక్షిత్తులోనికి కలి ప్రవేశించి మొత్తం నాశనం చేయగలిగాడు.

బాగుపడాలంటే శమీకమహర్షి పట్టుకున్న భగవంతుని పాదములు పట్టుకోవాలని భాగవతం చెపుతున్నది. శమీకుడు పట్టుకున్న ఈశ్వరుని పాదములు పట్టుకుంటే ఆ స్పర్శ ఉన్నంతకాలం కలి సమీపమునకు రాలేడు. ఇది భాగవతము చెప్తున్న తీర్పు. పరీక్షిత్తు తాను చేసిన పనికి సంతోషపడి వెనక్కి వెళ్ళిపోయి, అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం తీసి ప్రక్కనపెట్టాడు. బంగారుకిరీటం ప్రక్కన పెట్టగానే అందులోంచి కలి బయటకు వెళ్ళిపోయాడు.

కిరీటం ప్రక్కన పెట్టగానే ఆయనకు అనుమానం వచ్చింది. ‘దాహం వేయడం ఏమిటి? – నేను ఆయన ఆశ్రమమునకు వెళ్ళడం ఏమిటి? – వెళ్ళిన వాడిని ఊరుకోకుండా చనిపోయిన పామును ఆయన మెడలో వేయడం ఏమిటి? – అయిపోయింది – నా రాజ్యం అయిపోయింది. నా ధనం అయిపోయింది – నా భోగం అయిపోయింది – నా పరిపాలన అయిపోయింది – నేను చెయ్యరాని దుష్కృతమును చేసాను – దీనికంతటికీ కారణం కలిపురుష ప్రవేశము – ఎంత తప్పు చేశానో' అని పశ్చాత్తాప పడ్డాడు. పరీక్షిత్తు సహజస్థితి అదికాదు. కలి పురుషుడి వలన అలా భ్రష్టుడయి పోయాడు.

పరీక్షిత్తు మహర్షి మెడలో చచ్చిపోయిన పామును వేయడం, సమీపములో ఉన్న మునికుమారులు చూశారు. వాళ్ళు పరుగెత్తుకుంటూ అక్కడికి సమీపములో కౌశికీనది ఒడ్డున ఆడుకుంటున్న శమీక మహర్షి కుమారుడయిన శృంగి వద్దకు వెళ్ళారు. ఆ పిల్లవాడు మహా తపస్వి. ఆ పిల్లలు ‘మీనాన్నగారు తపస్సు చేసుకుంటూ సమాధిలో ఉండగా ఒక రాజు వచ్చి ఏదో మాట్లాడాడు. మీ తండ్రి పలకలేదు. అపుడు ఆ రాజుకి కోపం వచ్చి చచ్చిపోయిన పామును ధనుస్సుతో ఎత్తి మీ నాన్నగారి మెడలోవేసి వెళ్ళిపోయాడు అని చెప్పారు.

ఈ మాటలు విన్న వెంటనే శృంగి ‘నాతండ్రి వంటి తపస్వి ఇక్కడ ఉండడం వలన రాజు క్షేమంగా రాజ్యమును పరిపాలించగలిగాడని వెంటనే శాపం ఇవ్వడానికి కౌశికీ నదీ జలములను చేతిలోకి తీసుకుని చేతిలో ధనుస్సు ఉన్నది కదా అని ఆ రాజు చెయ్యకూడని పనిని చేశాడు. అటువంటి రాజు ఎవరయినా ఉండవచ్చు గాక! ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువు అడ్డుకున్నా వానిని నేటినుండి ఏడవనాటికి తక్షకుడనే మహాసర్పము కాటు వలన రాజు మరణించుగాక!’ అని శపించి నీళ్ళు విడిచిపెట్టి, తిరిగి ఆశ్రమమునకు వచ్చి, తండ్రి ముందు ఏడవడము ప్రారంభించాడు.

తండ్రికి బాహ్యస్మృతి వచ్చింది. ‘ఎందుకు ఏడుస్తున్నావని కుమారుని అడిగాడు. తండ్రీ! మీ కంఠమునందు మృత సర్పము ఉన్నది అన్నాడు. దానిని తీసి క్రింద పడవేశాడు శమీకుడు. ఎవరు వేశారని కుమారుని ప్రశ్నించాడు. నాకు తెలియదు. ఎవరో రాజు వేశాడట. నేటికి ఏడవనాటికి ఆ రాజు చచ్చిపోవాలని నేను ఆ రాజును శపించానని శృంగి జవాబిచ్చాడు. వెంటనే మహర్షి – నాయనా! ఎంతపని చేశావు? నీవు చేసిన దుష్కర్మ వలన మనకి పాపం సంప్రాప్తిస్తుంది. నీవు రాజు మరణించాలని కోరుకున్నావు’. కలిపురుషుడు ప్రవేశించిన మనస్సులు అలా ఉంటాయి. అపకారియందు కూడా ఔదార్యంతో ధర్మం మాట్లాడతాడు. అటువంటి పరిపాలకుడు ఎక్కడ వస్తాడు మనకు! సమాజము భ్రష్టు పట్టిపోతుంది. పరీక్షిత్తును కొట్టి సమాజమునందు ఇన్ని ప్రమాదములు తేవడానికే కలి ఇలా నీచేత శాపం ఇప్పించాడు. నీవు క్రోధమునకు వశుడవయిపోయావు. ఎంత పొరపాటు చేశావు!’ అన్నాడు.

ఈవార్త పరీక్షిత్తుకు తెలిసి ఇంకా నాటికి ఏడవరోజున శరీరం విడిచిపెట్టేస్తానని ప్రాయోపవేశం చేస్తానని గంగ ఒడ్డుకు వెళ్ళి, తూర్పుదిక్కుకు కొసలు ఉండేలా దర్భలు పరుచుకుని ప్రాయోపవేశం చేసి, ఈశ్వరుని యందు మనస్సును నిలబెట్టాడు. గంగ ఒడ్డుకు ఎందుకు వెళ్ళాడు అంటే ఎవరయినా గంగ దగ్గరకు వచ్చి ‘అమ్మా, గంగమ్మా’ అని పిలిస్తే గంగమ్మ పొంగిపోయి ఆ పిలిచిన వానిని ఎంతగానో అనుగ్రహిస్తుంది. గంగలో స్నానం చేయడం ద్వారా అతడు చేసిన తప్పులన్నిటినీ తీసివేసి మోక్షమును ప్రసాదించి పంపించివేస్తుంది. గంగ ఒడ్డున ప్రాయోపవేశం చేశాడు. ఎవరు యాగం చేస్తే దేవతలు అందరూ వచ్చి కూర్చున్నారో అటువంటి మహా పురుషుడు శాపగ్రస్తుడై ప్రాయోపవేశం చేశాడు. ఈ సన్నివేశమును చూడడానికి గౌతముడు, అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వసిష్ఠుడు మొదలయిన ఋషులందరూ వచ్చారు. ఈ ఏడురోజులలో తాను ఏమిచేస్తే మోక్షం పొందుతాడో చెప్పవలసినదని పరీక్షిత్తు అందరినీ అడుగుతున్నాడు. ఇంత ధర్మము ఉన్నవాడు ఇంత అధర్మమయిన పని చేయడమా! కలికి కొద్ది అవకాశం ఇస్తే అంత ప్రమాదమును తెచ్చాడు. కాలమును అతిక్రమించడం ఎవరి తరం కాదు. ఇంతటి స్థితిలోకూడా ఈశ్వర పాదములు పట్టుకున్న వాడు మాత్రం చెక్కు చెదరడము లేదు. ఆ సమయములో అక్కడికి పదహారు సంవత్సరముల వయస్సు కల ఒకాయన వచ్చాడు. ఆయన మంచి యౌవనములో ఉన్నాడు. నల్లటి జుట్టు ముఖం మీద చిందరవందరగా పడిపోయి ఉంది. ఒక కౌపీనము పెట్టుకుని ఉన్నాడు. చుట్టూ చిన్నపిల్లలు అందరూ చేరారు. సూర్యుడు ఈ భూమండలం మీద నడుస్తున్నాడా అన్నట్లుగా ఒకరు పిలవకపోయినా ఆవుపాలు పితికే సమయం కంటే ఎక్కువసేపు ఒకచోట నిలబడని శుకుడు తనంత తాను నడిచి వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయన తేజస్సు చూసి పొంగిపోయిన పరీక్షిత్తు ‘కృష్ణభగవానుని మా వంశము అంతా అర్చించినందుకు నేను వెళ్ళిపోతున్న సమయములో నాకు మార్గం చూపించడానికి గురువును పంపాడు కృష్ణ పరమాత్మ’ అని పొంగిపోయి అర్ఘ్యపాద్యములను ఇచ్చి శుకుడి కాళ్ళమీద పడితే, కదిలి వెళ్ళిపోవడం అలవాటున్న శుకుడు కూర్చున్నాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

[14/10, 4:30 pm] K Sudhakar Adv Br: Srimadhandhra Bhagavatham -- 25 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శుకబ్రహ్మ రావడములో ఒక గొప్పతనం ఉన్నది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశము జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న అందరూ కలిచేత బాధింపబడుతున్న వాళ్ళే . ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా? – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. కలి బాధలను పడుతున్న మనమీద కలి ప్రభావం ప్రసరించకుండా ఉండడము కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు రావాలి. అటువంటి సమర్థుడయిన శుకుడు వచ్చాడు.

ఇక్కడ ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని రెండు మూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెపితే – ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని – మీకు భాగవతము చెపుదామని వచ్చామ’ ని అంటే – ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించక ఇప్పుడు ఎందుకు అంటాడు. ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయింది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి శపించాడని నేను ఖేదపడడము లేదు. నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడినయి, తపస్సు చేసుకుంటున్న ఒక మహర్షి మెడలో మృతసర్పమును వేసి చేయరాని పని చేసానని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచెపుతాను. నేను నా మరణమును అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళీ జన్మ వచ్చినప్పుడు నా మనస్సు ఎల్లవేళలా శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడ స్వామివారి ఉత్సవమూర్తి కనపడినా, స్వామి దేవాలయం కనపడినా గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక ! నిరంతరము ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరు నన్ను అనుగ్రహించి ఆశీర్వచనం చేయవలసింద’ ని ప్రార్థించాడు.

పరీక్షిత్తు ఉత్తరజన్మ ఉత్కృష్టమయినది కావాలని ఆయన అడగలేదు. ఆయన – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగు నాకు కావాలని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేసి ఆచమనీయము ఇచ్చి సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘నాకు ఒక్క కోరిక ఉన్నది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షములా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు. నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

భాగవతం - ద్వితీయస్కంధము

భాగవతములో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తాను ఏమీ చెప్పుకోలేదు. శుకుడు ఒక్కమాట చెప్పాడు. ‘పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు యుద్ధములో సాయము చెయ్యాలని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెప్పమని అడిగాడు. దేవతలు వాని ఆయుర్దాయం లెక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నదని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించి వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయము ఉన్నది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు.

ఇంత గొప్పగా ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్నఈ శరీరమే కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతుంది. ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోవడము జరుగుతున్నది. ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకొమ్మని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచమహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. ఎక్కడ చూసినా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఎందుకు కనపడడము లేదు? అదే మాయ. అది నామ రూపములయందు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ ఆ మాయని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాననేత్రము చేత చూస్తే ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తరక్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినడమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. వెళ్ళాడంటే అతని జీవితములో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడము నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది.

భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. ‘నీవు భగవత్కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

మహర్షుల చరిత్రలు🌷

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 *🌷మన మహర్షుల చరిత్రలు🌷* 

                 🌷🌷🌷                       

*🌹ఈరోజు 51,వ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకుందాము...🌹*


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁


☘️ఇపుడు భరద్వాజ మహర్షిని గురించి తెలుసుకుందాం . సప్తఋషులంటూంటారు విన్నారు కదా ! వాళ్ళల్లో ఒకడు మనం తెలుసుకోబోయే భరద్వాజ మహర్షి .


🍁ఈయన తపస్సు చేసిన ఆశ్రమం పేరు ' భరద్వాజ తీర్థ ' బృహస్పతి తన అన్నగారైన ఉతథ్యుడింటికి వచ్చాడు . బృహస్పతికి శాపం ఉండటం వల్ల వదిన గారైన మమతని ఇష్టపడ్డాడు .


☘️మమత తప్పని చెప్పినా వినిపించుకోలేదు . మరి శాపప్రభావం కదా ! వీళ్ళిద్దరికీ పుట్టినవాడు ' భరధ్వాజుడు ' మమత నాకిష్టం లేదు కాబట్టి ఈ పిల్లాడ్ని నేను పెంచనంది .


🍁బృహస్పతి నువ్వే పెంచమని మమతకి చెప్పి వెళ్ళిపోయాడు . మరుత్తులు ఆ పిల్లాణ్ణి పెంచుతున్నారు . దుష్యంత మహారాజు కొడుకు భరతుడు చక్రవర్తి వందలకొద్ది అశ్వమేధయాగాలు చేసినా పిల్లలు లేక బాధపడుతున్నాడు .


☘️మరుత్ స్తోకియం అనే యాగం చేశాడు భరతుడు . మరుత్తులు భరద్వాజుణ్ణి భరతుడికి అప్పగించారు . మమత బృహస్పతులు ఇద్దరితో వదిలివేయబడి భరతుడు పెంచినవాడు కాబట్టి భరద్వాజడని పేరు . 


🍁' భరద్వాజుడు ' మహాతపస్వి కదా ! తండ్రి భరతుడితో యజ్ఞాలు చేయించడం వల్ల నలుగురు కొడుకులు కలిగారు . కొంతకాలం తర్వాత భరద్వాజుడు కూడ పెళ్ళి చేసుకున్నాడు . 


🌷కూతురు దేవకర్ణి , కొడుకు మనువు అనే ఇద్దరు పిల్లల్ని పొందాడు . భరద్వాజుడు కొంతకాలం తర్వాత భరతుడి దగ్గర నుంచి గంగాతీరం వెళ్ళి ఆశ్రమం నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకుంటూ వున్నాడు . 


🍁గంగానదిలో స్నానం చేస్తూ ఒక అప్సరసని చూశాడు . ఆమె వల్ల భరద్వాజుడికి ద్రోణుడనే కొడుకు కలిగాడు . ద్రోణుడు , వృషతుడనే రాజు కొడుకు ద్రుపదుడు కలిసి చదువుకున్నారు . 


☘️ద్రుపదుడు పాంచాల దేశానికి రాజు అయ్యాడు . ద్రోణుడికి వేదవిద్యలు , విలువిద్యలు నేర్పించి ' కృషి ' అనే అమ్మాయినిచ్చి పెళ్ళి చేశాడు భరద్వాజుడు . 


🍁ద్రోణుడికి అశ్వత్థామ పుట్టాడు . ఇలా భరద్వాజ వంశం వృద్ధి అయింది . భరద్వాజుడు భృగుమహర్షిని అడిగి అనేక విషయాలు తెలుసుకున్నాడు .


☘️భరద్వాజుడు మూడు కాలాలు తెలుసుకోకలిగిన జ్ఞానంతో గొప్ప తపశ్శక్తితో చాలామంది శిష్యుల్తో తన ఆశ్రమంలో వున్నాడు .


🍁ఒకనాడు శ్రీరాముడు అరణ్యవాసానికి వెడుతూ భరద్వాజుడి ఆశ్రమానికి వచ్చాడు . మహర్షి శ్రీరాముణ్ణి విష్ణుమూర్తిగా గుర్తుచేసి మర్నాడు ఉదయాన్నే బయలుదారి చిత్రకూటానికి వెళ్ళమన్నాడు .


☘️శ్రీరాముడు అరణ్యవాసం అయిపోయాక మహర్షి ఆశ్రమానికి వచ్చి తిరిగి అయోధ్య వెడుతున్నట్లు చెప్పాడు . నువ్వు విష్ణుమూర్తి అవతారమే అయినా నీకేంకావాలో అడగమన్నాడు మహర్షి మహాత్మా ! మీ ఆశ్రమంలో ఉన్నట్లే సాకేతపురం చుట్టూ చక్కటి ఉద్యానవనాలు ఉండేలా చెయ్యమని వరం తీసుకుని అయోధ్యకి బయలుదేరాడు రాముడు .


🍁భరద్వాజుడుకొన్ని యుగాలు తపస్సు చేసి తరువాత తీర్థయాత్రలు చేస్తూ వ్రేపల్లె వచ్చి యమునానదిలో స్నానం చెయ్యాలనుకుని అక్కడున్న వాళ్లని రేవు చూపించమన్నాడు . వాళ్ళు ఆయన్ని ఆటలు పట్టించారు . 


☘️గోపాల బాలకులతోనూ , బలరాముడితోనూ అందరితో కలిసి అక్కడ తిరుగుతున్న శ్రీకృష్ణుడు పరుగుపరుగూ వచ్చి మహర్షికి నమస్కారం చేసి ఆతిథ్యం తీసుకోమన్నాడు .


🍁భారద్వాజుడు అతణ్ణి శ్రీకృష్ణుడయిన విష్ణుమూర్తి అవతారంగా తెలుసుకుని స్తోత్రం చేశాడు . 

పూర్వం మనువంశం వాడయిన వీతహవ్యుడనే రాజుకి వందమంది కొడుకులు . వాళ్ళు కాశేశుడనే రాజుతో యుద్ధం చేసి ఓడించారు .


☘️తర్వాత అతడి కొడుకు సుదేవుణ్ణి రక్షించమని భరద్వాజుణ్ణి అడిగాడు దివోదాసుడు . సుదేవుడి కొడుకు దివోదాసుణ్ణి కూడా ఓడించారు .


🍁భరద్వాజుడు రాజుకి అన్ని విద్యలు తెలిసిన కొడుకు ప్రతపర్ణుణ్ణి అనుగ్రహించాడు . హైహేయుల్ని అందర్నీ చంపగా వీతహవ్యుడు మిగిలి భరద్వాజాశ్రమానికి వెళ్ళి మహర్షిని రక్షించమన్నాడు . 


☘️భరద్వాజుడు తన శిష్యుల్తోపాటు వీతహవ్యుడ్ని ఉండమన్నాడు . ప్రతర్ధనుడు వెతుక్కుంటూ వచ్చి మహర్షి ఆశ్రమంలో వీతహవ్యుడున్నాడేమో అని అడిగాడు . 


🍁మహర్షి అప్పటికే వీతహవ్యుడ్ని బ్రాహ్మణ్ని చేశాడు గనుక ఇక్కడ క్షత్రియులు ఎవ్వరూ లేరని చెప్తే ప్రతర్థనుడు వెళ్ళిపోయాడు . ఈ విధంగా మహర్షి అందర్నీ రక్షిస్తూ ఉండేవాడు .


☘️భరద్వాజుడు రాజధర్మాల్ని చెప్తూ రాజుకి గద్ధ చూపు , కొంగ వినయం , కుక్క విశ్వాసం , సింహ పరాక్రమం , కాకి సంశయం , పాము నడక ఉండాలని , ధర్మకార్యక్రమాలు ఎలా చెయ్యాలో , దోషుల్ని ఎలా దండించాలో కూడా శత్రుంజయుడనే రాజుకి చెప్పాడు .


🍁ఒకసారి గొప్ప గొప్ప మనులందరూ భరద్వాజుడి దగ్గరకొచ్చి శాస్తోక్తంగా ఉదయం ముఖం కడుక్కోవటం దగ్గర్నుంచి పడుక్కునే వరకు అన్ని పనులు ఎలా చెయ్యాలో తెలుసుకున్నారు .


☘️ఏ కొత్త పని మొదలు పెట్టినా తూర్పువైపు తిరిగే మొదలు పెట్టాలని అన్ని విషయాలు వివరంగా చెప్పాడు భరద్వాజుడు . ఈ గ్రంధాన్నే ' భరద్వాజ స్మృతి ' అన్నారు .


🍁మీకొక గొప్ప విషయం చెప్తాను . మీరు మీ స్నేహితులకి కూడా చెప్పుకోవచ్చు . ఆశ్చర్యం కలిగించే విషయం .


☘️భరద్వాజుడు ' వైమానిక శాస్త్రం ' అంటే విమానాలు ఎలా తయారు చెయ్యాలి అని , ఒక గ్రంథం రాశాడు . మనం ఇప్పుడు తెలుసుకుంట్నుది భరద్వాజ మహర్షికి ఎపుడో తెలుసన్నమాట . 


🍁దీంట్లో ఏమేమున్నాయో చూదం. ఈ విమానం ఎలా వుంటందంటే విరగనిది కోసినా తెగకుండా కాలిపోకుండా ఉండేది , నాశనంకాకుండానూ వుంటుంది . 


☘️ఈ పుస్తకంలో ఎనిమిది అధ్యాయాలున్నాయి . ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి . దొరికితే నాక్కూడా చెప్పండి  ! ఈ విమానంలో శత్రువుల మాటలు వినగలిగేలా , ఫోటోలు తీసుకోగలిగేలా , శత్రువిమానం రాకపోకలు తెలుసుకోగలిగేలా పైలట్లని మూర్ఛపోయేలా చెయ్యకలిగేవి చాలా పరికరాలుంటాయి . 


🍁అంటే ఇవి యుద్ధవిమానాలేమో . విమానానికి 31 భాగాలుండాలనీ . విమానం నడిపే వాళ్ళకి వేరువేరు బట్టలుండాలనీ , కాలాన్ని బట్టి తినడానికి మూడు రకాల ఆహార పదార్ధాలుండాలనీ వాటి వల్ల గాలిలో ఉండే ఇరవై అయిదు రకాల విషాలు ఏం చెయ్యకుండా వుంటాయనీ రాశాడు . 


☘️పదహారు రకాల లోహాలో తయారు చేస్తే ఏ వాతావరణానికయినా తట్టుకుని చెక్కు చెదరకుండా వుంటుందిట .అంతటి గొప్ప మహర్షి భరద్వాజ మహర్షి..


🍁ఒకనాడు ఇంద్రుడు, ' మహర్షీ !  వేద విజ్ఞానం అపరిమితం.  ఒక్క మహావిష్ణువుకే  వేదసారమంతా తెలుసు. మనం తెలుసుకోవలసింది, వేదముల  ఉపయోగము, 


☘️మానవ జీవితంలో యెంత వరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే. 

అన్నివేదాల పరమార్ధము ఆ 

శ్రీ మహావిష్ణువే. అయన గురించి తపస్సు చెయ్యి. 


🍁ఆయనే నీకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తాడు' అని చెప్పాడు. అప్పుడు భరద్వాజుడు తెలుసుకున్నాడు, '  వేదాలను పూర్తిగా గ్రహించడమంటే, శ్రీహరి కైవల్యం పొందడమేనని. ' 


☘️ఇంద్రుడు చెప్పిన విధంగా,  భరద్వాజుడు, శ్రీహరిని ప్రార్ధించడానికి అనువైన ప్రదేశం వెదికి, చివరకు, మట్టపల్లి అనే గ్రామం (  తెలంగాణ రాష్ట్రం, నల్లగొండ జిల్లా ) వెళ్లి, అక్కడ నిత్యమూ, కృష్ణా నదిలో స్నానం ఆచరిస్తూ,  నరసింహ స్వామిని గురించి తపస్సు చేసాడు.  


🍁భరద్వాజుని తపస్సుకు మెచ్చి, నారసింహుడు,  మహర్షికి వైకుంఠ ప్రాప్తి కలుగజేసాడు. 

    

☘️భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవలసిన విషయాలు అపారం. ఇది విహంగ వీక్షణమే.


🍁ఇదండీ భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్న విశేషాలు రేపు మరో మహర్షి గురించి తెలుసుకుందాము స్వస్తి..


☘️🍁☘️🍁☘️🍁☘️🍁☘️🍁

అహంభావం

 *అహం*


*అహం ఉన్న వ్యక్తికి , ఎన్ని తెలివితేటలు ఉన్నా పరాభవం తప్పదు* 🥹

                                       

*ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు. ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే, పేరు ప్రఖ్యాతులున్న విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ పట్టలేక పోయేవారు. ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే, అవన్నీ ప్రాణమున్న వాటివిగా, మన పక్కన వున్నట్టు, మనకు చేయి అందిస్తున్నట్టు, మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.. ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే! ఆ అసాధారణ ప్రతిభ, నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [ Ego ]* *నింపాయి.*


*ఇదిలావుండగా, ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని, జన్మ నక్షత్ర వివరాలను పరిశీలించి 'మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా!" అని చెప్పాడు*.


*శిల్పికి చెమటలు పట్టాయి, ఆయన ఇలా అనుకొన్నాడు, నేను బ్రహ్మ లాంటివాడిని కదా! ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే, ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా.... అనిపించే శిల్పాలు సృష్టిస్తాను*... *కాబట్టి, నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కి వుంచుతాను. అపుడు మృత్యు దేవత ప్రాణమున్న శిల్పి ఎవరో, బొమ్మ ఏదో కనుక్కోలేక వెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను అని ఉపాయం పన్నాడు* 


*అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి, మృత్యు దేవత వచ్చే రోజున ఒక దాని వెనుక దాక్కొన్నాడు* 


*మృత్యుదేవత ఆ గది లోకి వచ్చింది. శిల్పి శ్వాసను పూర్తిగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు. దేవత వెతుకుతూ వస్తోంది. ఊపిరి బిగపట్టి చూస్తున్నాడు శిల్పి. ఇక కనుక్కోలేదులే అని అనుకొన్నాడు. శిల్పి ప్రతిభకు మృత్యు దేవత ఆశ్చర్య పోయింది. ఎంత ప్రయత్నం చేసినా జీవి ఎవరో... శిల్పమేదో... కనుక్కోలేక పోయింది*. 


*ఇక తనవల్ల కాదని , వచ్చిన దారినే వెళ్ళి పోవాలనుకొని వెనుతిరిగింది. శిల్పి ఆనందనాకి అవధులు లేవు. తన తెలివితేటలను తన కళా నైపుణ్యాన్ని తనలో తానే పొగుడుకుంటున్నాడు. ఇంతలో దేవత మళ్ళీ శిల్పాల వైపు తిరిగి "ఈ శిల్పి" ఎవరోకానీ, ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పంలోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు! అంది*

 *అంతే !* *మన అపరబ్రహ్మకు అహం దెబ్బతింది. తన వృత్తి జీవితంలో ఇప్పటివరకు హేమాహేమీలు ఒక్కరుకూడా వంక పెట్టలేదు. అలాంటిది ఈరోజు తప్పు జరిగింది అంటుందా! ఈ దేవత... అనుకున్నాడు. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో* '' *ఏది ? ఎక్కడుంది తప్పు చూపించు? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు!"* *అనేసాడు*


*అపుడు మృత్యుదేవత నవ్వుతూ.... నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు, నీకు నువ్వే పట్టుబడ్డావు!* *"ప్రాణాధార మైన నీ శ్వాసను కూడా నియంత్రించ గలిగావు కానీ, నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించ లేకపోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది"* *అని ఆయన్ను తీసుకెళ్ళి పోయింది*


*మనం పెంచుకొనే అహంభావం [ Ego ]* *అంత ప్రమాదకరమైనది*. *అది సత్యాన్ని చూడనివ్వదు, వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు, మనం అనుకొన్నదే సరైంది, ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి ''నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు'' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం, దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం*. 


*మీరు గమనించారా ?* 🧐


'' *అహంభావం* '' అనే పదం లోంచి *' అహం '* తీసేస్తే మిగిలేది ' *భావం '* .

అంటే *అర్థం*.

 *అర్థమైతే అనర్థం జరగదు*.                                                         

🙏💐🙏శుభోదయం 🙏💐🙏

Telugu typing tools





 



Ok




 


 


 


 


 


 


 


 


 

భగవంతున్ని పట్టుకుందాం

 దేవుడు పంపిన ఇమెయిల్ భక్తుని సమాధానం కోసం వెయిటింగ్.. కాన్సెప్ట్ కొత్త గా ఉంది కదా ..కానీ నిజం ఇదే గుండెల మీద చేయి వేసుకుని ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది.. సరే లెండి లోపలకి పోదాం ఏముందో ..చూద్దాం


🌼🌺🌷🌸🎋🌱🍂🌻🌾🌿🍁🦋💐🌹


*“భగవానుడు పంపిన మెయిల్”*

.

 

.

.నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను .

.


 . 

నువ్వు రోజూ నిద్ర లేచాక నా వేపు చూస్తావనీ , నన్ను పలకరించి రెండు మాటలు మాట్లడతావనీ ఎదురు చూస్తుంటాను .  

.

కానీ 

.

 నువ్వు లేచీ లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు . అందులో నీకు వచ్చిన మెస్సేజెస్ చూస్తావు .

.

 అది అయ్యాక నా వేపు చూస్తావేమో అనుకుంటాను . అపుడు నీకు టైం కనిపిస్తుంది . అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్ రూం లోకి వెళ్లి పోతావు .

.


అక్కడనుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక సారి నా వేపు చూసి పలకరిస్తావు అని చూస్తుంటాను 

.

కానీ 

.

. డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి టిఫెన్ తింటూ పేపర్ చూస్తూ టి వి ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు . 

.

టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకుని ,జుట్టును తీరిగ్గా దువ్వుకుని , సెంటు రాసుకుని , ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని , షూ వేసుకుని బయటకు వెడుతూ నా కేసి చూస్తావేమో అనుకుంటాను .

.

కానీ 

.

 

.

బయటకు ఆదరా బాదరా వెళ్లి పోతావు .

.

అయ్యో నీకు పాపం తీరిక లేదే అని బాధ పడడం తప్ప ఏమి చెయ్యను ?

.


.

పోన్లే !

.


మధ్యాహ్నం లంచ్ టైం లో భోజనం కారియర్ విప్పుతూ కాంటీన్ లో నాలుగు టేబుళ్ళ వెనకాల ఒకాయన కళ్ళు మూసుకుని నన్ను తలచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలచుకుంటావు అని ఎదురు చూస్తున్నాను 

.

కానీ 

.

నువ్వు నవ్వుకుని నీ స్నేహితుడితో సినిమా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసావు . 

.


 .

సాయంత్రం ఇంటికి వచ్చాక తీరు బడిగా నాతో మాట్లాదతావేమో అని అనుకున్నాను . 

.

కానీ 

.


 సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో రెండు మూరల మల్లె పూలు కొన్నావు . నా కోసం కూడా పూలు కొంటున్నావు అనుకున్నాను .

.

 కానీ 

.

నీకు అవి కనిపించ లేదనుకుంటాను .

.

పోన్లే !

పూలెందుకు ? నువ్వు నాతో మాట్లాడితే చాలు . నా కేసి చూస్తే చాలు . 

.


.

ఇంటికి వచ్చావు . 

.


సోఫాలో కూల బడి టి వి చానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు . బాత్ రూం కి వెళ్లి స్నానం చెసి వచ్చి తెల్లటి బట్టలు కట్టుకున్నావు . అప్పుడు కూడా నా కేసి వస్తావనీ , నాతో మాట్లాదతావనీ ఎదురు చూశాను . 

.

కానీ 

.


.

నీ లాప్ టాప్ ముందుకు వెళ్లావు . అందులో నీకు ఇష్టమైన వన్నీ చూస్తూ రాత్రి 11 గంటల వరకూ గడిపావు . ఇక నీకు నిద్ర వస్తోంది . అపుడు నా దగ్గరకు వస్తావు అని అనుకున్నాను . నీ ఎదురుగా నే ఉన్నాను . 

.

కానీ 

.

నువ్వు నన్ను చూడలేదు . 

.


.

ఇంకో అరగంట తర్వాత నా కేసి చూస్తావు అనుకున్నాను . నువ్వు అలిసిపోయావు . నీ భార్య తో గుడ్ నైట్ చెప్పి పడుకుండి పోయావు . నాకూ చెబుతావు అనుకున్నాను . చెప్పలేదు 

.

పోన్లే !

.

నాకు ఓపిక ఉంది . నేను ఎదురు చూస్తుంటాను . నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన .

.


.

నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను . . కానీ ... కానీ ... నాకు కూడా నీవు నా వేపు చూడాలనీ , ఒక్క సారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలనీ ఉంటుంది . 

.

నీ గుండెలో ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమీ చెయ్యక పోతే ఎలా ?

.

 ఒకవైపు నుండే సంభాషణ ఎలా ? 

.

.

ఇదిగో ఈ మెయిల్ చూశాక అయినా నీవు నా వేపు చూస్తావనీ , నాతో రోజులో కొన్ని సెకనులు అయినా గడుపుతావనీ ఎదురుచూస్తుంటా !

నీ లోనే నీతోనే ఉన్న " నేను.

ధ్యానం ద్వార మనలో ఉన్న భగవంతున్ని పట్టుకుందాం.ధ్యానమంటె శ్వాసమీద ధ్యాస.

నిరుత్సాహోక్తి - నీరసోక్తి

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

  *🌷నిరుత్సాహోక్తి - నీరసోక్తి🌷* 

                  🌷🌷🌷


కొందరికిఏదీగొప్ప అనిపించదు. వారిని ఏదీ చలింప చేయలేదు.  పెద్దనగారి మహోత్కృష్ట పద్యం ‘’అటజనికాంచె భూమి సురుడు ‘’చదివి వినిపిస్తే –స్వారస్యం తెలియనివాడు ‘’ఆ ఏముందయ్యా అందులో?  ప్రవరుడు హిమాలయం వెళ్ళాడు.  అక్కడ ఏం చూశాడో అంతా సంస్కృతంలో ఓజో భూయిష్టంగా చెప్పాడు.  భాష నీ చేతుల్లో ఉంటె అంతకంటే దానబ్బలాంటి పద్యం నువ్వూ రాస్తావు.  అక్కడ కొండల్ని చూట్టమూ గొప్పేనా?  మా అమ్మాయి కొండపల్లి కొండలు చూసింది .పర్వత సానువుల్లో ఏనుగుల్ని చూశాట్ట, ఓరి వీడిల్లు బంగారంకానూ!  మహారణ్యంలో ఏనుగుల్ని కాక పీనుగుల్ని చూస్తాడా ?’’అన్నాడు .ఇదే నిరుత్సాహోక్తి అన్నారు ముని మాణిక్యంమాస్టారు.


 అలాంటి వాడితోనే ముని మాణిక్యంమాస్టారు ఒకసారి ‘’చూశారా బాబుగారూ!మనవాడు వర్తకం మొదలెట్టి ఏడాది తిరక్కుండానే లకారాధిపతి అయ్యాడు.’’  అన్నారు మహోత్సాహంగా అభినందిస్తూ వాళ్ళబ్బాయిని.  ఆ మేళానికిఇదేమీ కిక్ ఇవ్వలేదు, చప్పరించి ఇదోన్యూసా  అనుకోని ‘’వాడి జాతకం అలాంటిదయ్యా శుక్రమహర్దశ నడుస్తోంది.  లగ్నాన్ని బుధుడు చూస్తున్నాడు శుభగ్రహాలన్నీ బాగా నిక్కినిక్కి చూస్తుంటే అంతే., శని ఉచ్చ దశలో వుండి ముడ్డిమీద తంతుంటే వాడు సంపాదిస్తాడా వాడి తలలో జేజమ్మ సంపాదిస్తుందా?  గ్రహబలమయ్యా అంతాగ్రహబలం ‘’అన్నాడు .


ఇలా ఏ విషయాన్నైనా లైట్ తీసుకొని, చెప్పేవాడికి నీరసం పుట్టిస్తారు.  ఇవే నీరసోక్తులు అంటే అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు గురూజీ.


మునిమాణిక్యం మాష్టారు గారికి కృతజ్ఞతలతో.


శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్.

సేకరణ: వాట్సాప్ పోస్ట్.

త్యాగేనైకేన అమృతత్వమానశుః

 శ్లోకం:☝️

*మానం హిత్వా ప్రియో భవతి*

 *క్రోధం హిత్వా న శోచతి l*

*కామం హిత్వాఽర్థవాన్భవతి*

 *లోభం హిత్వా సుఖీ భవేత్ ll*


మనుజు డహము విడువ మాన్యూడౌ జనులందు 

క్రోధ వర్జనమున బాధ లుడుగు

కోర్కె వీడె నేని కూర్మి సంపన్నుడౌ 

వదల లోభ గుణము వరలు సుఖము


గోపాలుని మధుసూదనరావు


భావం: మనిషి అహంకారాన్ని త్యాగం చేయడం ద్వారా ప్రజలకు ప్రియమైనవాడు అవుతాడు, కోపాన్ని త్యజించి శోకించడు, కామాన్ని విడిచిపెట్టి ధనవంతుడు అవుతాడు మరియు లోభాన్ని  విడిచిపెట్టి సంతోషంగా ఉంటాడు. చివరికి త్యాగం ద్వారా అమృతత్వం (మోక్షం) లభిస్తుంది.

*త్యాగేనైకేన అమృతత్వమానశుః*

మహోన్నతుల అవిరళ కృషి,

 మహోన్నతుల అవిరళ కృషి, నిత్య ప్రశాంత విశ్వ జీవన గమనంలో దివ్య ప్రకాశిక ! ప్రకృతి ఒసగెడి మహోన్నత ఆలంబన, విశ్వ జీవ నిత్య మనుగడకు సుచైతన్య స్ఫూర్తి ! సకల విశ్వ జీవజాలపు సంరక్షణకై, సృష్టి కర్త విశ్వ మానవాళికి ఒసగిన జీవకారుణ్యతా భావన ! " బ్రతుకు, బ్రతకనివ్వు ", అనే అద్భుత జీవన విధానంలో సుహృద్భావ స్ఫూర్తి ఒక దివ్య దృక్పథం ! పట్టుదల, ధృఢ సంకల్పం నిరంతరం తోడుగా నుండ మహత్తర లక్ష్య సాధనలో భగవత్కృపా కటాక్షం సుసాధ్యమన్నది సత్య వాక్కు ! ఈర్ష్యా ద్వేష రహితులై, విశ్వ మానవాళి వారి నిత్య జీవన ప్రణాళిక ఏర్పర్చుకోవడంలోనే సత్ఫలిత సాధన తథ్యమన్నది ముఖ్యాంశం ! సకల చరాచర జీవ జగత్తు, నిత్య ప్రశాంత సంక్షేమ జీవన గమనంలో విశ్వ మానవాళి పాత్ర మహోన్నతం ! ప్రకృతి పరిరక్షణలో నిత్య సుచైతన్య సన్మైత్రీ భావన, విశ్వ మానవాళికి సృష్టి కర్త ఒసగిన దివ్య వరం ! భారతీయ దివ్య వేద ధార్మిక  సంస్కృతి, అనాదిగా విశ్వ జీవజాలపు సంరక్షణకై వెన్నుదన్నై నిలవడం మహత్తర విషయం !                          " సర్వే భవంతు సుఖినః ! సర్వే సంతు నిరామయాః ! సర్వే భద్రాణి పశ్యంతు ! మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్ ! "                                 " సహనావవతు ! సహనౌ భునక్తు ! సహవీర్యం కరవావహై ! తేజశ్వినావధీతమస్తు ! మా విద్విషావహై !                                            " ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః "                                                 🤝🌹💐🌹🤝                                          రచన :                                       గుళ్లపల్లి ఆంజనేయులు

వృద్ధాప్యము శాపము కారాదు

 వృద్ధాప్యము శాపము కారాదు ఎవరికైనను. 

ఒక్కరు సంపాదిస్తే పది మంది కూర్చొని తినే రోజులు

గతించాయి. ఇద్దరు సంపాదిస్తే నలుగురు బ్రతికే

రోజులు వచ్చినవి. ప్రేమాప్యతలు మెండుగా గల 

రోజులవి. 

నేడు భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తేనే గడవని

రోజులొచ్చినవి, అన్ని సంబంధములు ఆర్ధిక సంబంధములైనవి.ధరల ప్రభావము, పెరిగిన స్వార్ధము, పెరిగిన కుల ద్వేషాలు, చిన్న కుటుంబ

వ్యవస్థలే కారణము. సొంతమగువారే పట్చిచుకోరు. 

  సంపాదనకు భార్యాభర్తలు, విద్యాభ్యాసమునకు

పిల్లలు పోయి సాయంత్రము గాని ఇంటికి రాలేని 

పరిస్థితి వుంది. 

ఇంటిలో గల వృద్ధులను చూసుకొనే వారు తక్కువ. 

కేర్ టేకర్ లు గూడ మంచివారు దొరికితే వారి

అదృష్టము. ఇది చాలా ఖర్చు తో కూడిన వ్యవహారము. ఐదు శాతం కూడా వుండక పోవచ్చు 

భరించు వారు. 

రానున్న కాలము వృద్ధులన శాతం పెరుగు నని

గణాంక ములు సూచిస్తున్నాయి. కావున ప్రభుత్వ 

పాఠశాలలవలె ప్రభుత్వ వృద్ధాశ్రమాలను నెలకొల్ప

వలసిన అవసరం తప్పక వుంది. 

ప్రజా సంఘాలు గాని, కుల సంఘాలు గాని, 

ప్రభుత్వ దృష్టికి తీసుకు రావలసిన అవసరముంది. లేకున్న వృద్ధుల పరిస్తితి అగమ్యగోచరమే. 

అందరమూ ఆలోచించి తీరవలసిందే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వములు ప్రణాళిక లు తయారు చేయాలని. 

ఇది నా అభిప్రాయము. కృతజ్ఞతలు🙏💕.

ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 4

 ధర్మాకృతి : మహాస్వామి - మహర్షి - 4


నియమాలు పాలింపజేయడానికి ఏర్పడ్డ పీఠాలు ఒక్కొక్కరి విషయంలో ఒక నియమం పాటిస్తే, అట్టి స్థితిలేని కొందరు ఇది సాకుగా చూపి నియమభంగం చేస్తారు కదా! అయినా శ్రీవారు పూజ కట్టులోకి ప్రవేశించే బ్రాహ్మణుల విషయంలో ఈ నిర్ణయం చేశారు గానీ మిగతా మఠభక్తులకేమీ చెప్పలేదు. కల్లూరివారు, ఇలా అనేకులు అక్కడినుంచి ఇక్కడకు తిరుగుతూనే ఉన్నారు కదా! వారిని వెళ్ళవద్దని శ్రీవారు నిషేధించలేదు. సరి! బ్రాహ్మణులు పోయి రమణులతో ఫిర్యాదు చేసారు. రమణులు సరి! అని నిర్లిప్తంగా ఊరుకున్నారు.


తగిన సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు బ్రాహ్మణులు. "కంచి స్వామి వారు అల చెప్పవచ్చునా?" అని ప్రశ్నించారు. "వారు వీరు ఎందుకయ్యా? అక్కడ ఇక్కడ అనేదే సరి అయిన మాట. అలా చూస్తే అంతా సరిగానే తోస్తుంది. వాద ప్రతివాదాలెందుకయ్యా? ఆ పీఠనియమాలు వారు అనుసరించి చూపాలి కనుక వారు అలా సూచించారు. నిశబ్ధంగా మన పని మనం చూసుకుందాం. ఇష్టమైన వాళ్ళు రావొచ్చు. లేకుంటే మానవచ్చు. పండితులవైపు తిరిగి దీనిపై ఎవరు సమస్యలు సృష్టించవద్దు" అని చెప్పారు. తరువాత 1949లో కుంభాభిషేకం జరిగినప్పుడు తగిన శాంతి కర్మలు జరిగాయని శ్రీ రా. గణపతితో శ్రీవారన్నారట - బహుశ: కుంభాభిషేకం ప్రయోగం లోనే ఈ శాంతి కర్మలుంటాఏమో! లేక అక్కడ ప్రత్యేకంగా చేశారో!.


కనకమ్మ గారు పరంపరాగతంగా కంచి పీఠాధిపతులకు శిష్యవర్గమైన కుటుంబంలో జన్మించారు. పరమ విరాగి అయిన ఆమె రమణుల సన్నిధిలో శరణాగతి పొందారు. కుటుంబ సభ్యులు దానిని వ్యతిరేకించారు. వారి మామ్మగారు ఆమెను కంచిస్వామి వద్దకు తీసుకొని వచ్చి ఫిర్యాదుచేసి స్వామివారి శరణాగతిలోనికి తీసుకోమని ప్రార్ధించారు. శ్రీవారు సరిగ్గా రమణులు చెప్పినట్టే వారు వీరు అనే పదాలు కాకుండా "అక్కడైతే నేమి, ఇక్కడైతే నేమి" అని సమాధానం చెప్పారు.


1947 లో కంచి పెద్దలు ఆర్కాటు జిల్లలో తిరువణ్ణామలై సమీపంలో పర్యటిస్తున్నప్పుడు ఎవరో రమణుల నడిగారట "రమణులు కంచిస్వామి వారు ఎప్పుడైనా కలుసుకున్నారా?" అని. దానికి రమణులు "మేమెప్పుడు విడిగా ఉన్నాము? ఇప్పుడు కలవడానికి" అని బదులు ఇచ్చారట. మహార్ములిరువురూ నిజమైన అద్వైతానుభవులు.

అద్వైతం - రెండు లేవు. రమణులు కంచిస్వామి వారు అని ఇద్దరు లేరు. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ స్వరూపం.


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

భగవద్గీత శ్లోకం

 🙏 ప్రతిరోజూఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేద్దాము, చేయిద్దాము 🙏

  🌿భగవద్గీత 1వఅధ్యాయం, అర్జున విషాద యోగం,🌿

               -------------------------------------------------

🌻40-వ,శ్లోకం- కులక్షయే ప్రణశ్యంతి కుల ధర్మా సనాతనః |            ధర్మేనష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత॥🌻

అర్థం- కులక్షయము వలన సనాతనమైన కులధర్మములన్నీ నశిస్తాయి.ధర్మము అంతరించిపోయినప్పుడు కులమందు పాపమే వ్యాపిస్తుంది. 

-----------------------------------------------------------------

 వ్యాఖ్య- సనాతన ధర్మం వేదముల నుండి వచ్చింది. ఋషులు మానవలు సుఖశాంతులతో మనుగడ సాగించటం కొరకు ధర్మశాస్త్రాలను అందించారు. అవి పరంపర సంప్రదాయములై  భావితరముల వారికి మార్గదర్శకముగా వస్తున్నాయి. వీటిని అనాదిగా  అందరూ శ్రద్ధగా ఆచరిస్తూ,రక్షిస్తూ, మనకందించారు. వీటినే కులధర్మములు, సాంప్రదాయములు అంటారు. యుద్ధములో పురుషులు ఇంటి పెద్దలు  మరణిస్తే ధర్మములు సాంప్రదాయములు అంతరించే అవకాశం ఉంది. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు విచ్చలవిడితనంగా  వ్యవహరించే అవకాశం ఉంది. వేద శాస్త్రములను ఉల్లంఘించే అవకాశం ధారాళంగా జరుగుతుంది. సమాజ వ్యవస్థ మొత్తం అస్త వ్యస్తమవుతుంది. వర్ణసంకరం ఏర్పడుతుంది. ఈ దుష్పరిణామాలను తలుచుకొని అర్జునుడు బాధపడుతున్నాడు. మనకు ఈ శ్లోకం ద్వారా కులక్షయం, (వర్ణసంకరం) ఏర్పడకూడదు తద్వారా అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయి అని భగవద్గీత తెలుపుతోంది.

------------------------------------------------------------------------------

🙏షేర్ చేసి కొన్ని కోట్లమంది ప్రజలు ప్రతిరోజు  ఒక్క భగవద్గీత శ్లోకం పారాయణం చేసే అదృష్టాన్ని కల్పిద్దాము. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని,ఈ భగవద్గీత పారాయణ మహాయజ్ఞ ఫలితాన్ని అందరం పొందుదాము. గీతామృతాన్ని అందరం త్రాగుదాము, 🙏