22, అక్టోబర్ 2021, శుక్రవారం

 🛕🦚 *knvr* 🦚🛕

************************

       *శుభోదయం* 

        *శుక్రవారం* 

************************


🔥ఒక ఊళ్ళో గుడి ఎదురుగా కూర్చుని ఓ గుడ్డి వాడు అడుక్కుంటూ ఉండేవాడు.

చెట్టు నీడనే విశ్రాంతి పొందుతూ కాలక్షేపం చేసేవాడు.

రోజూ ఓ భక్తుడు గుడిని సందర్శించి, తిరిగి వెళ్ళే సమయంలో ఈ బిచ్చగాడి పాత్రలో ఓ నాణెం వేసేవాడు.

ఆ భక్తుడి నడక చప్పుడు, అతడు నాణాన్ని వేసినప్పుడు అయ్యే శబ్దం బిచ్చగాడికి స్పష్టంగా ఎరుకే.

ఈ భక్తుడికి, ఆ భిక్షగాడికి మధ్య ఏదో తెలియని అనుబంధం ఏర్పడింది.

బిచ్చగాడు బాగా ముసలివాడై పోయాడు.

చివరి క్షణాలు సమీపించాయని అతడికి అనిపించింది.

తను అభిమానం పెంచుకున్న ఆ భక్తునితో తన మనసులోని ఆఖరి కోరికను విన్నవించాడు.

తను దేహం చాలించిన తర్వాత, తను నివాసమున్న స్థలం లోనే ఆ దేహాన్ని సమాధి చేయాలని కోరాడు.

భక్తుడు సరేనన్నాడు.

ఆ ఘడియ రానే వచ్చింది.

బిచ్చగాడు తుది శ్వాస విడిచాడు.

భక్తుడు అతడడిగిన స్థలంలోనే గొయ్యి తవ్వసాగాడు.

ఆశ్చర్యం ……!

దాని నుండి నిధి బయటపడింది.

వెండి, బంగారు నాణాలు దానిలో ఉన్నాయి.

అవన్నీ అతడి సొంతమయ్యాయి.

మృతి చెందిన బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు.

అక్కడ అతడికి ఈ సంగతి తెలిసింది.

జరిగిన దానికి సంతోషపడ్డాడు.

కానీ, ఒక సందేహం అతడిని పీడించింది.

నిధి మీదే కూర్చున్నాను కానీ జీవితమంతా అడుక్కుంటూ బిచ్చగాడి గానే ఉండిపోయాను.

దారిన పోయే దానయ్య కోటీశ్వరుడు అయ్యాడు.

ఏమిటయ్యా ఇది!

అని ఇంద్రుణ్ణి ప్రశ్నించాడు.

అతడికి ఇంద్రుడు సమాధానం చెబుతూ,

నీ జీవితమంతా భగవంతుని సన్నిధిలోనే కూర్చుని, భగవన్నామాన్నే ఉచ్చరిస్తూ గడిపావు.

అందుకే నీకు స్వర్గప్రాప్తి కలిగింది.

అతడు రోజూ భగవత్సేవ చేస్తూ, నీకు యదా శక్తిగా తనకు చేతనైనంత దానం చేశాడు.

నీ కోరికను తీర్చేందుకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

అందుకే అతనికి సిరిసంపదలు లభించాయి

అన్నాడు ఇంద్రుడు.

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 *నీతి:* 

వ్యక్తి తనలో నిక్షిప్తమైన అనంత చైతన్య శక్తిని గుర్తించలేక దానిని విస్మరించి,గుడ్డి వాడిలా బయటే ఏదో ఉందని పరిభ్రమించడం ఆగాలి.తప్పక అంతర్ముఖుడు కావాలి

🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼

మొగలిచెర్ల

 *దత్త రక్షణ..*


"అన్నయ్యా! రాజ్యానికి పెళ్ళికుదిరిందికదా..వెండి సామాను కొనాలి, అలాగే బంగారమూ కొనాలి..నీకెవరన్నా తెలిసినవాళ్ళ షాపు ఉందా?" అని మా చెల్లెలు గాయత్రి నాకు ఫోన్ చేసింది..ఇది 2007 డిసెంబర్ నాటి ముచ్చట..


బంగారానికి, వెండికి సంబంధించి నాకు తెలిసిన ఒకే ఒక్క షాపు, నా స్నేహితుడు గుఱ్ఱం వెంకటేశ్వర్లు దే! నెల్లూరు జిల్లా వింజమూరులో అతని దుకాణం..


ఇక్కడ శ్రీ గుఱ్ఱం వెంకటేశ్వర్లు గారి గురించి చెప్పుకోవాలి..


శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మాతల్లిదండ్రులను అడిగి మొగలిచెర్ల గ్రామంలో 5 ఎకరాల పొలం ఆశ్రమ నిర్మాణానికి తీసుకున్నారు..అందులో ఆశ్రమ నిర్మాణానికి, నెల్లూరు జిల్లా గొట్టిగుండాల గ్రామ వాస్తవ్యులు శ్రీ బొగ్గవరపు మీరాశెట్టి గారు, వారి ధర్మపత్ని ముందుకొచ్చారు..ఆ మీరాశెట్టిగారి మరదలి కుమారుడే ఈ వెంకటేశ్వర్లు..పెదనాన్న మీరాశెట్టి గారితో మొగలిచెర్ల వస్తూ పోతూ ఉండటం వలనా..వయసులో ఇద్దరం ఇంచుమించు సమానం గనుకా యిట్టె స్నేహితులుగా మారాము..1974 వ సంవత్సరం అంటే నాకు పద్నాలుగేళ్ళు వయసు..


2004 లో నేను మందిరం బాధ్యతలు తీసుకునే నాటికే వెంకటేశ్వర్లు గారికి నగల దుకాణం పెట్టి, వింజమూరు చుట్టుపక్కల చాలా మంచి పేరు తెచ్చుకున్నారు..నావరకూ వెండి, బంగారాల్లో ఏది కొనుగోలు చేయాలన్నా, ఇప్పటికీ అతనే దిక్కు.. గతయేడాది స్వామి వారి మందిరం వద్ద గోశాల కూడా నిర్మించారు..మొగిలిచెర్ల అవధూత దత్తాత్రేయుడి సేవలో తరిస్తున్న వ్యక్తీ..


సరే..గాయత్రి ఫోన్ చేయగానే, వెంటనే మరో ఆలోచన లేకుండా చెప్పాను, "మన వెంకటేశ్వర్లు ఉన్నాడు కదమ్మా..అతన్నే అడుగుదాం "అన్నాను..సరే అన్నది..


నేనూ, మా ఆవిడ జయలక్ష్మీ, చెల్లెలు గాయత్రి కలసి, సింగరాయకొండ నుంచి కార్లో నెల్లూరు వెళ్ళాము..వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చారు..మాకు కావాల్సిన వన్నీ దగ్గరుండి ఇప్పించి వెళ్ళారు..


వెళ్ళింది నెల్లూరు కనుకా..భోజనం వేళకు అక్కడే ఉన్నాం కనుకా..రెండో ఆలోచన లేకుండా, తరతరాల నుంచీ మంచి భోజనానికి కేరాఫ్ గా ఉన్న కోమలా విలాస్ లో భోజనం చేసి, తిరుగు ప్రయాణం అయ్యాము..


మా ఆవిడా, చెల్లెలు ఇద్దరూ వెనుక సీట్లో కూర్చున్నారు..నేను డ్రైవింగ్..ఇక కావలి ఓ 5కిలోమీటర్లు ఉందనగా.. హఠాత్తుగా సైకిల్ తొక్కుతూ రోడ్డుకు ఓ పక్కగా వెళుతున్న నడివయస్కుడు, కారుకు అడ్డం రావడం, 100కి.మీ..వేగంతో ఉన్న కారు అతన్ని గుద్దడం, ఆ మనిషి, బంతిలాగా యెగిరి, ముందు అద్దం మీద పడటం, ఆ అద్దం భళ్ళున పగిలి, ముక్కలు నా మీద లోపల పడటం, క్షణాల్లో జరిగిపోయాయి..


ఒక్క క్షణం మెదడు మొద్దుబారిపోయింది..అసలతను ప్రాణాలతో ఉన్నాడో లేడో తెలీదు..సహజంగా ఇలా ప్రమాదం జరిగిన వెంటనే, చుట్టుపక్కల వాళ్ళు ముందూ వెనుకా ఆలోచించకుండా వాహనం నడిపే వాడిని తిట్టడం, లేదా కొట్టడం కూడా జరుగుతుంది..


ఇక్కడే ఆ దత్తాత్రేయుడి లీల మాకందరికీ ప్రత్యక్షంగా కనబడింది..


కార్లో ఉన్న ఆడవాళ్ళిద్దరూ ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు..నేను కారు దిగి, అతన్ని పైకి లేపే ప్రయత్నం చేసాను.."నేను నిలబడతానయ్యా" అన్న మాటలు అతని నోటివెంట వచ్చాయి..అతను నా సహాయంతో రోడ్డు డివైడర్ మీద కూర్చున్నాడు, మోకాలి వద్ద గాయం లోంచి కొద్దిగా రక్తం వస్తోంది..కానీ మనిషి స్పృహలోనే వున్నాడు..


ఈలోపల ప్రక్కనే ఉన్న పొలాలలోంచి ఓ 20మంది ఆడా, మగా వచ్చారు..రావడమే ఆలస్యం ఇద్దరు ఆడవాళ్ళు వెనుకసీటు వద్దకు వెళ్లి, మా ఆవిడతో, చెల్లెలి తో.."అమ్మా మీరేమీ కంగారు పడకండి, ఆయన మా మనిషే..మేము చూసుకుంటాము" అన్నారు..అలాగే ఓ వ్యక్తీ నాదగ్గరకు వచ్చి, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి దగ్గర వుండే ఆయనవి కదూ..నమస్కారమయ్యా..మా వాడు తాగిఉన్నాడు..మేము కేకవేస్తూనే ఉన్నాము..నీ తప్పేమీ లేదు..ఆడాళ్ళు భయపడ్డట్టున్నారు..నువ్వు బయల్దేరి పో"! అన్నాడు..


నేను 108 కు ఫోన్ చేసాను."ఎందుకయ్యా..మేము తీసుకెళ్తాము వీడిని.."అంటూ దారిలో పోతున్న ఆటో ను మాట్లాడి అతన్ని కూర్చోబెట్టారు..నేను జేబులోంచి ఓ 4000 తీసి ఇవ్వబోయాను..వద్దంటే వద్దన్నారు..నా ఫోన్ నెంబర్ ఇచ్చి, కావలి లో హాస్పిటల్లో చేర్చి నాకు ఫోన్ చేయమన్నాను..నా విజిటింగ్ కార్డు చూసిన ఒకతను, "అయ్యా..నువ్వు మొగిలిచెర్ల స్వామి దగ్గరుంటావా..స్వామీ నమస్కారం అయ్యా" అంటూ ఆటో లో ఆ మనిషిని ఎక్కించుకొని వెళ్ళిపోయారు..కేవలం దత్తాత్రేయుడి కృపే ఆరోజు మాకు కనబడింది..


ప్రమాదం జరిగిన 15 నిమిషాల తరువాత, అద్దం పగిలిపోయిన మా కారు, మేము ముగ్గురమూ మిగిలాము..


ఇప్పటికీ ఆ వ్యక్తుల నుంచి నాకు ఫోన్ లేదు..ఒక్క నయాపైసా తీసుకోలేదు..ఏమీ లేదు..కావలి లో ఉన్న మా బావమరిది ఆరోజు సాయంత్రం అన్ని హాస్పిటళ్లకూ వెళ్లి విచారించాడు..ఎక్కడా ఇలాటి కేసు వచ్చిందని ఎవరూ చెప్పలేదు..


అన్ని వైపులా ఆ దత్తాత్రేయుడి దయ మాత్రం ఉంది..సహస్ర బాహువులతో మమ్మల్ని కాపాడాడని నేనూ నా భార్యా ఇప్పటికీ అనుకుంటాము..


నిజమే..


సర్వం..

దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం.. మొగలిచెర్ల గ్రామం.. లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..9440266380 & 99089 73699)

శ్రీమద్వాల్మీకి రామాయణం



ॐ శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం 

                ----------------------- 

(ప్రభుత్వ డిగ్రీ కళాశాల భద్రాచలం - 2007లో "రామాయణం"పై నిర్వహించిన సదస్సులో సమర్పించిన, 

   "శ్రీమద్వాల్మీకి రామాయణం - ప్రస్తుత విద్యావిషయాలకి ఆదర్శం" 

    అనే పత్రంలోని ఒక అంశం)

  

                    1. చరిత్ర 


ప్రపంచ చరిత్రలు


    భారతదేశ చరిత్ర, ఐరోపా చరిత్ర, ప్రపంచ చరిత్ర - ఇలా అనేక చరిత్రలు పాఠ్యాంశాలుగా మనం చదువుకుంటూ ఉంటాం. 

    అవి వివిధ కాలాలో, వివిధ ప్రాంతాలలో, 

    సామ్రాజ్యాలనీ, నాగరికతలనీ వివరంగా తెలుపుతాయి. 

    చరిత్ర అనేది ఒక సంకలనం. గతంలోని వాస్తవాలని తెలియజేస్తుంది. 

    భారతదేశ చరిత్ర విషయంలో, వేదవిషయాలతోపాటుగా అనేక వాటిపై, ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో, వారికనుగుణంగా చొప్పించబడ్డాయి. 

    తద్వారా మన అసలు చరిత్ర మారిపోయింది. 


భారతీయ చరిత్ర ప్రత్యేకత - రామాయణం 


    పైన తెలిపిన ఆంగ్లేయులు మార్చిన వాటికి తావులేకుండా, 

    శ్రీమద్వాల్మీకి రామాయణంలో అద్భుతమైన చరిత్ర మనకి కనబడుతుంది. 

    ఆ రామాయణం చూస్తే, 

    ప్రధానంగా సూర్యవంశ, నిమివంశ చరిత్రలూ, రావణ చరిత్ర కనబడతాయి. 

    అవి మంచీచెడులు రెండురకాలనీ తెలియజేస్తాయి. 


సీతా - రాముల పూర్వుల చరిత్ర 


    సీతారాముల వివాహ సమయంలో దశరథుని మాటతో వశిష్ఠ మహర్షి, 

    బ్రహ్మతో మొదలుపెట్టి దశరథని వరకూ అయోధ్యను పాలించిన రాజుల వంశ క్రమాన్ని విశదపరూస్తూ, దశరథ సంతానాన్ని గూర్చి తెలియజేశారు. 

    నిమి చక్రవర్తితో మొదలుపెట్టి జనకుని వరకూ జనక మహారాజే మిథిలా నగర రాజుల చరిత్ర స్వయంగా చెప్పారు. 


భిన్న వయో ప్రమాణాలు     


    రావణుడు బ్రహ్మ నుంచీ నాలుగో తరంగా కనబడతాడు.  

    అయోధ్య రాజులలో అనరణ్యుని రావణుడు హింసించాడు. అనంతరం ఇరువది ఎనిమిది తరాల తరువాత శ్రీరామ జననం జరిగింది. 

    ఒక్కొక్క రాజు కాలం కూడ తక్కువేమీ కాదు. దశరథుడు అరవైవేల సంవత్సరాలు పరిపాలించాడు. 

    ఈ విషయాలు గమనిస్తే రావణుని జీవన ప్రమాణం అత్యధికమనీ, ఒకే కాలంలో గణనీయమైన వ్యత్యాసాలతో జీవనకాల ప్రమాణాలు ఉండేవని కూడా తెలుస్తుంది.      


భిన్న నాగరికతలు - ధార్మిక ప్రమాణం 


    అయోధ్యని పరిపాలించిన రాజులందరూ ధర్మాచరణ పరాయణులే. 

    అయోధ్యలో ధార్మిక జీవనంతో కూడిన నాగరికతా, 

    లంకలో భౌతిక భోగలాలసతోనూ కూడిన నాగరికతా ఎంతగానో అభివృద్ధి చెందినవిగా కనిపిస్తాయి. 

    కానీ సత్యధర్మాల విషయంలో ఆ రెంటిమధ్య వ్యత్యాసం మనకి స్పష్టంగా కనబడుతుంది. 


    మొదటి మూడు తరాలూ సత్యధర్మాలు కలిగియున్నా, రావణుడు ఆ వంశధర్మాన్నీ, సంప్రదాయాన్నీ విడిచి దుష్టప్రవర్తన కలిగియున్నప్పుడు, 

    అతని సోదరుడైన విభీషణుడు లంకాధిపతియై ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఇది ప్రత్యేకంగా గమనించవలసిన విషయం. 


      శ్రీమద్వాల్మీకీ రామాయణం మంచీచెడుల వ్యత్యాసాన్నీ, రెండురకాల వాస్తవ చరిత్రలనీ తెలియజేస్తుంది. 


ఒక్కొక్క రాజ చరిత్ర - అందే సందేశం 


      మధ్యమధ్యలో కొంతమంది రాజుల పరిపాలనలు కూడా శ్రీమద్రామాయణంలో ప్రస్తావించబడ్డాయి. 

    వాటిలో 

ఒక్కొక్క రాజు చరిత్ర ద్వారా ఒక్కొక్క ప్రత్యేక విషయం బోధపడుతుంది. 

    ఉదాహరణకి

  - రోమపాదుని చరిత్ర ద్వారా అనావృష్టి నివారణ, 

  - భగీరథుని విషయంలో, ఎన్ని అవరోధాలు వచ్చినా లక్ష్య సాధన (భగీరథ ప్రయత్నం), 

  - త్రిశంకు చరిత్ర ద్వారా అధర్మపరమైన వ్యక్తిగత కోర్కెలకి ఫలితాలు, 

  - కుశనాభుని వృత్తాంతం ద్వారా ఓర్పు కలిగియుండటం, 

  - నృగమహారాజు కథ ద్వారా రాజు ప్రజలకు అందుబాటులో ఉండవలసిన ఆవశ్యకత వంటి సందేశాలు మనకి అందుతాయి. 


ఉపదేశం   


పై అంశాలని పరిశీలిస్తే,  

    శ్రీమద్రామాయణంలోని చరిత్రలద్వారా, 

    ఈరోజు మనక్రియ రేపటికి చరిత్రగా మిగిలేందుకు, 

    మనం ఎలా ప్రవర్తించాలో తెలుపుతుంది. 


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

              భద్రాచలం

వైశ్రవణుడు కుబేరుడుగా ఎలా మారాడో తెలుసా.

 🎻🌹🙏వైశ్రవణుడు కుబేరుడుగా ఎలా మారాడో తెలుసా.

ముక్కోటి దేవ దేవతలలో కుబేరుడికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సిరి సంపదలతో తులతూగాలంటే ప్రతి ఒక్కరు ఆ కుబేరుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. కానీ కుబేరుడికి అంత సంపదను కలిగే అవకాశం, వరం ఏ విధంగా పొందాడో తెలుసా? అదేవిధంగా కుబేరుడినీ ముందుగా వైశ్రవణుడు అనే పేరుతో పూజించేవారు. క్రమంగా వైశ్రవణుడు కాస్త కుబేరుడిగా ఎలా మారాడో ఇక్కడ తెలుసుకుందాం...


మొదటగా కుబేరుడు రావణాసురుడి రాజ్యమైన లంకా నగరానికి అధిపతిగా ఉండేవాడు. ఎంతో బలశాలి, శివభక్తుడైన ఆ రావణాసురుడు లంక పై దండెత్తి రావడంతో రావణాసురుడికి భయపడి, అతనితో యుద్ధానికి తలపడలేక వైశ్రవణుడు లంకా నగరాన్ని వదిలి భయంతో గంగాతీరాన ఉన్న కాశీ నగరానికి పారిపోయాడు. కాశీ నగరంలో తనకు వచ్చిన ఆపదను తల్చుకుని ఎంతో దుఃఖిస్తున్న వైశ్రవణుడు దృఢసంకల్పంతో ఆ పరమశివుడికి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగా వైశ్రవణుడు తనపై రావణాసురుడు దండెత్తి తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న సంగతి తెలియజేశాడు.


వైశ్రవణుడు మాటలు విన్న పరమశివుడు లంకా పట్టణం చేజారిపోయిందని నువ్వే ఏమి దిగులుపడకు, అంతకన్నా అందమైన, అపూర్వమైన నగరాన్ని నీకు కలుగుతుందని, నవ నిధులకు నువ్వే నాయకుడిగా వర్ధిల్లుతావని, అందరికంటే గొప్ప సంపన్నుడు అవుతావని శివుడు వరం ఇచ్చాడు. ఇప్పటినుంచి నీ పేరు వైశ్రవణుడు కాకుండా కుబేరుడిగా వర్ధిల్లుతారని శివుడు వరం ఇచ్చాడు. అప్పటినుంచి కుబేరుడు . రాబోయే కాలంలో సిరి సంపదలతో వర్ధిల్లుతూ, ధనవంతుల ప్రసక్తి వస్తే అందరూ నీ పేరే తలచుకుంటారు అంటూ ఆ పరమశివుడు కుబేరుడికి వరమిచ్చాడు.అప్పటినుంచి ఇప్పటివరకు సిరిసంపదలు కలగాలంటే కుబేరుడికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.అదే విధంగా అధిక డబ్బు ఉన్న వాళ్లను ప్రస్తుతం కుబేరులుగానే పిలవడం మనం చూస్తూ ఉన్నాం..

అట్లతద్ది

 🕉🕉🕉అట్లతద్ది కధ🕉🕉🕉    


పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు.

రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది. అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది.

ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు. ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది. రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు . కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు.

ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు. అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.

  ఇక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారుచేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు. మగవాళ్ళు ఈ పండుగ కోసం ఎదురుచూస్తూ ఇంట్లో ఊయల కడతారు. పెరట్లో చెట్లకి కూడా ఉయ్యాల వేస్తారు. ఈ ఉత్సవంలో పిల్లలంతా ఆసక్తిగా పాల్గొంటారు.

అట్లతద్దినాడు తెల్లవారుఝామున లేస్తారు.అన్నం, గోంగూర పచ్చడి, పెరుగుతో కడుపునిండా తింటారు. 'అట్లతద్దోయ్, ఆరట్లోయ్ ముద్దపప్పు మూడట్లోయ్' అంటూ అరుస్తూ ఇరుగు పొగురు స్నేహితులందరితో కలిసి ఆటలు ఆడతారు. ఇందులో పెద్దలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ధైర్యంగా వీధుల్లోకి వచ్చి ఆడుకోవడానికి ఇదే అదును కాబట్టి పిల్లలతో బాటు తల్లులు కూడా బాల్య జీవితాల్లోకి వెళ్లి ఆనందం పొందుతారు.

శ్రీమద్భాగవతము

 *21.10.2021*

*వందేమాతరం*


*భక్తపోతన గారి శ్రీమద్భాగవతము:* 🙏  

*రోజుకో పద్యం: 2298(౨౨౯౮)*


*10.1-1435-వ.*

*10.1-1436-*


*క. సిద్ధవిచారు గభీరున్*

*వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్*

*బుద్ధినిధి నమరగురుసము*

*నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.* 🌺



*_భావము: గోపికాస్త్రీల గురించి ఆలోచించిన శ్రీకృష్ణుడు, ఉత్తమమైన ఆలోచలు కలిగినవాడు, శాంతగంభీరుడు, పెద్దలచే వృష్ణి వంశస్థులలో సద్బుద్ధికి నిలయమైనవాడని కీర్తించబడిన వాడు, బుద్ధి లో దేవతల గురువైన బృహస్పతికి సమానుడగు ఉద్ధవుని చూసి సౌమ్యంగా ఇలా అన్నాడు:_* 🙏



*_Meaning: Sri Krishna thinking about the state of the womenfolk of Vrepalle, saw Uddhava, the noble thinker, sublime personality, the one praised by elders as personification of the virtuous Sri Brihaspati, the Guru of Devatas (Celestial beings) and pleasantly spoke to him further._* 🙏



*-ప్రభాకర శాస్త్రి దశిక (9849795167)*

*శ్రీ రాజమౌళి నిడుమోలు (8977500180) &*

*Kiran (9866661454)*

*Pavan Kumar (9347214215).*

పేస్ బుక్ ఫ్రెండు

 రాత్రి మూడు గంటల సమయంలో అలికిడికి నిద్ర లేచింది పంకజం ,ఆమె చుట్టు నలుగురు దొంగలు చేతిలో కత్తులతో నిలుచుని ఉన్నారు...


భయంతో పతి దేవుడు కుటుంబరావు కోసం చూస్తే అతనిని అప్పటికే మంచానికి తాళ్లతో కట్టి వేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి ఉంచారు..పిల్లలను వేరే రూములో బంధించి గడియ పెట్టారు...దొంగలు బీరువా,కప్ బోర్డు,అన్నీ వెతుకుతున్నారు....


ఇది అంతా చూసి పంకజం గజగజ వణికిపోతూ...

"మా ఇంట్లో ఏమి ఉంచుకోము అన్నీ బ్యాంకు లాకరులోనే ఉంటాయి" అంది....


దానికి ఆ దొంగల నాయకుడు "ఆ విషయం మాకు తెలుసు కాని, మొన్న మీ తమ్ముడు అమెరికా నుండి పంపిన 1.5 లాక్స్ ఆపిల్ ఫోను, నిన్న మీ పెళ్ళిరోజుకి మీ భర్త గిఫ్ట్ గా ఇచ్చిన డైమండ్ నెక్లెసూ,పట్టుచీర ఎక్కడా..? అవి ఇవ్వు చాలు" అన్నాడు...


పంకజం అవి అన్నీ తీసి అతనికి ఇస్తూ "ఇవ్వన్నీ నా దగ్గర ఉన్నట్టు అంత ఖచ్చితంగా మీకు ఎలా తెలుసు అండి..?" అంది...


దానికి ఆ దొంగ చిన్నగా నవ్వుతూ "నేను నీ పేస్ బుక్ ఫ్రెండుని మీ ప్రతి పోస్టుకి లైక్ కొడుతూ మిమల్ని ఫాలో అవుతూ ఉంటాను..మీరేగా మొన్నా,నిన్నా ఈ డీటెయిల్స్ అన్నీ పోస్ట్ చేసారు..సరే కానీ పొద్దుట నెయ్యి వేసి ఘమ ఘమలాడుతున్న రవ్వ కేసరి చేసా అని పోస్ట్ పెట్టారు.. చూస్తేనే నోరు ఊరిపోయింది..అదేమైనా కొంచం మిగిలి ఉంటే తీసుకురండి తినేసి వెళ్ళిపోతాం...."అన్నాడు..


పంకజం 😇😇😇😇


😂😂😂😂😜😜😜