19, ఫిబ్రవరి 2021, శుక్రవారం

భృగు మహర్షి

 మన మహర్షులు- 26


భృగు మహర్షి


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


భృగు మహర్షి బ్రహ్మగారి హృదయంలోంచి పుట్టాడు. 

భృగువు నవ ప్రజాపతులలో ఒకడు. సప్తర్షులలో ఒకడు.


 ఈయన వంశంని భృగువంశమంటారు. ఈ వంశంలో పుట్టినవాళ్ళు చ్యవన, జమదగ్ని, శుక్ర, దధీచి మొదలైనవాళ్ళు. విష్ణుమూర్తి అవతారం పరశురాముడు కూడ ఈ వంశమే.


 దక్షుని కుమార్తె ఖ్యాతి భృగుమహర్షి  భార్య..

దక్షుని అల్లుడు గనుక, దక్షయజ్ఞం సమయంలో భృగువుకూడా ఉన్నాడని వాయుపురాణం చెప్తోంది.


భృగుమహర్షి మరొకభార్య పులోమని ఒక రాక్షసుడు ఎత్తుకు పోవాలని ఆమె ఎక్కడ వుందని అగ్నిదేవుణ్ణి అడిగాడు. అగ్ని భృగుమహర్షి ఆశ్రమంలో వున్న ఈమే పులోమ అని చెప్పాడు.


ఆ రాక్షసుడు పులోమని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించాడు..


 భృగుమహర్షి అగ్ని దేవుణ్ణి ఇదంతా జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఏది కనిపిస్తే దాన్ని తింటూ సర్వభక్షకుడిగా వుండమని శపించాడు.


 అగ్నిదేవుడు బ్రతిమాలుకుంటే సర్వభక్షకుడివైనా అందరితో గౌరవించబడ్డావన్నాడు.


సరస్వతీ నదీ తీరంలో మహర్షులందరూ కలిసి ఒక యాగం చేస్తుండగా వాళ్ళల్లో ఒకళ్ళకి ఒక సందేహం వచ్చేసింది.  త్రిమూర్తు లలో ఎవరు గొప్పవారు అని భృగు మహర్షిని తేల్చి చెప్పమన్నారు.


భృగు మహర్షి బయల్దేరి ముందు బ్రహ్మలోకం వెళ్ళాడు. బ్రహ్మ నిండు సభలో ఉన్నాడు. భృగు మహర్షి వెళ్ళి మాట్లాడకుండ నిలబడ్డాడు. భృగు మహర్షి స్తోత్రం చెయ్యలేదని బ్రహ్మగారికి కోపం వచ్చింది. అక్కడ నుంచి బయలదేరి కైలాసానికి వెళ్ళాడు భృగుడు.


 శివుడు పార్వతీ సమేతంగా విశ్రాంతి తీసుకుంటూ భృగు మహర్షిని చూసి లేచి వచ్చాడు కానీ భృగు మహర్షి మాట్లాడలేదు. శివుడు కోపంతో శూలంతీశాడు. పార్వతి అడ్డుపడింది.


వైకుంఠం వెళ్ళి విష్ణుమూర్తిని కలిసాడు భృగు మహర్షి. వెంటనే విష్ణుమూర్తి లేచివచ్చి నువ్వు రావడం చూడలేదు .. నువ్వు రావడం వల్ల నేను ధన్యుణ్ణయ్యాను అన్నాడు- విష్ణుమూర్తి. 


విష్ణుమూర్తిని ఆనంద భాష్పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి విష్ణుమూర్తే గొప్పవాడని చెప్పాడు భృగు మహర్షి.


భృగువు, భరద్వాజ మహర్షులు సమకాలికులని మహాభారతం పేర్కొంటోంది.


భృగుమహర్షి జ్యోతిష్య శాస్త్ర పితామహుడు.  ఈయన  జ్యోతిష్య శాస్త్ర గ్రంథం 'భృగుసంహిత ' లో  సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మాత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు.


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹

తేనె గురించి

 తేనె గురించి సంపూర్ణ వివరణ - 1 . 



    తేనెలోని రకాలు  - 


  *  అర్ఘ్యమను తేనె . 


  *  చాద్ర అనే తేనె . 


  *  చిన్ని పువ్వు తేనె . 


  *  జిద్దాల అనే తేనె . 


  *  జుంటి తేనె . 


  *  దండజం అనే తేనె . 


  *  పుట్ట తేనె . 


  *  పాత్రికం అనే తేనె . 


  *  పౌష్పికం అనే తేనె . 


  *  భ్రామరం అనే తేనె . 


  *  మాక్షికం అనే తేనె . 


  *  సౌషిరం అనే తేనె . 


  *  క్షౌద్రం అనే తేనె . 


  *  సామాన్యపు తేనె . 



      తేనె తియ్యగా రుచిగా ఉండి వేడి పుట్టించి శరీరంను ఆర్చును . త్రిదోషాలను హరించును . విరేచనం , బలమును కలిగించును . హిక్కా , శ్వాస , కాస , వమనము , పిత్త సన్నిపాత రోగములు , విషదోష , విదాహం , చర్ది , రక్తపిత్తము , కుష్ఠు , అతిసారం , శీతపిత్తము , పక్షవాతం , మలమూత్ర బద్దకం , కంటిజబ్బులు , అశ్మరీ , మూత్రాశ్మరీ మొదలగు సమస్యలను నివారించును. 


         సాధారణముగా మన వైద్యులు వాడు మందులలో తేనెని అనుపానంగా ఇవ్వడం జరుగును . దీనిని వైద్యుడు తన యుక్తిని అనుసరించి శాస్త్రానుభవసారముగా దీనిని ఉపయోగించినచో అనేక రోగాలు పుట్టుటకు కారణం అగును. కనుక దీనికి విరుగుళ్లు తెలుసుకుని ఉండవలెను . తేనెకి విరుగుడు వస్తువుగా నెయ్యి , నిమ్మకాయ , మాదీఫలము , ధనియాలు , దానిమ్మకాయ అను వీనిలో ఏదైనా ఒకటి తీసుకుని సేవించిన ఉపశాంతి కలుగును. తేనె వ్రణములను , గాయములను మాన్పును  . 



          తేనె గురించి మరింత విలువైన విషయాలు మరియు తేనెలొని రకాలు వాటి లక్షణాల గురించి తరవాతి పోస్టులలో సంపూర్ణముగా వివరిస్తాను . 



  

    గమనిక  -


                  నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు  గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఎవరో కొందరు చేసిన దానికి

 ఎవరో కొందరు చేసిన దానికి


 ఎవరో కొందరు చేసిన దానికి మొత్తం ముస్లిమ్లనందరినీ ఎలా నిందిస్తారు, అని ఈరోజున ముస్లిం సమాజం బాధపడుతోంది. వారి బాధ అర్ధం చేసుకోదగినదే. అయితే మరీ ఎప్పుడో ఎవరో చేశారు అనే అనుమానంతో ఇప్పటికీ బ్రాహ్మణులను బాపనోడు, పిలక పంతులు అని వారి వేషాలను, భాషని, అలావాట్లని ఇలా వారికి చెందిన అన్నిటినీ దాదాపు వంద సంవత్సరాలుగా అవమానిస్తున్నారే మరి వాళ్ళని ఏమనాలి? 


ఎప్పుడో 3500 సం. ల క్రితం ఆర్యులు అని ఎవరో వచ్చారని, వాళ్ళేదో చేశారని, వాళ్లే బ్రాహ్మణులు అని ఒక కట్టుకథని సృష్టించి, వాళ్ళ పిలకలు లాగి, పంచలు లాగి, యజ్ఞోపవీతాలు తెంపి, వందల, వేల సినిమాలలో బ్రాహ్మణులను వారు వృత్తులను, వారి భాషను, పనిగట్టుకుని అవమానించారు కద? దానికి వారెంత బాధపడి ఉండాలి? 


పోనీ ఈ ఆర్యన్ సిద్ధాంతం కథ ఏమైనా నిజమా అంటే అదీ కాదు. ఏ ఆధారమూ లేకుండా సృష్టించబడిన ఒక కట్టు కథ. అయినా సరే, కేవలం తమకి అది నచ్చింది కనుక కొందరు దానిని నిజం అని నమ్ముతున్నారు. పోనీ కొంతసేపు అదంతా నిజమే అనుకుందాం. నిజమే అయినా, ఎప్పుడో 3500 సం. ల క్రితం ఎవరో చేసిన దానికి మీరు ఇప్పటి వారిని ఎలా బాధ్యులను చేస్తారు? 


బ్రాహ్మణుల మీద ఇంతలా గత రెండు వందల సంవత్సరాలుగా దాడి జరగడానికి ఒక్కటే కారణం. బ్రాహ్మణ్యం పోతే హిందూత్వం కూడా నాశనం అవుతుంది అని మన ప్రత్యర్థులకు స్పష్టంగా తెలియడం. అందుకే వారి మీద ఇన్నిరకాల దాడులు. వారు అనుకుంది కొంత మేర సాధించారు కూడా. ఆ కారణం వల్లనే తెలివైన బ్రాహ్మణులలో చాలా వరకూ ఎవ్వరూ బ్రాహ్మణ వృత్తులు స్వీకరించడం లేదు. అటు డబ్బూ లేక, ఇటు గౌరవమూ లేకపోతే మాకెందుకు ఈ కంచి గరుడ సేవ అనుకుని చాలా మంది సుబ్బరంగా ఉద్యోగ వ్యాపారాలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు.


బ్రాహ్మణుల పట్ల సమాజంలో గౌరవం పెరగడం చాలా అవసరం. అప్పుడే వారు మళ్లీ బ్రాహ్మణ వృతులైన వేదాధ్యయనం, పౌరోహిత్యం, ప్రవచనం వంటి వృత్తులను స్వీకరిస్తారు. హిందూ ధర్మం బలపడాలి అంటే అది చాలా ముఖ్యం. ఈ విషయాలు ఏ బ్రాహ్మణుడూ చెప్పలేడు, నిజానికి చాలా మందికి ఈ విషయాలు తెలుసు అనికూడా నేను అనుకోను.  డబ్బు రాకపోయినా, ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని తెలిసినా ఎందరో బ్రాహ్మణులు మన సంస్కృతికి ఆధారమైన విద్యలు కాపాడారు అంటే కారణం, అది ఈశ్వరుడు తమకు అప్పగించిన బాధ్యత అని వాళ్ళు నమ్మడమే. అలా వారు నమ్మకపోయి ఉంటే, అది అందరి బాధ్యత అని వారు అనుకుని ఉంటే, అంటే మన దేశంలో వర్ణ వ్యవస్థ లేకపోయి ఉండి ఉంటే, భారతదేశానికి కూడా ఇస్లాం, క్రైస్తవాలు అడుగుపెట్టిన తరువాత వర్ణవ్యవస్థ లేని మిగిలిన దేశాలకి ఏ గతి పట్టిందో, అదే గతి పట్టేది. ఆ రెండు మతాలూ అడుగుపెట్టిన తరువాత కూడా తమ సంస్కృతిని, ధర్మాన్ని, నాగరికతని నిలువుకున్న ఏకైక దేశం మనదే. నాకు తెలిసినంత వరకూ ఆఫ్ఘనిస్తాన్ అంత త్వరగా ఇస్లామీకరించబడింది అంటే అందుకు కారణం అక్కడ బౌద్ధం ఎక్కువ అవ్వడమే (ఈ విషయంలో నాది పొరపాటు అయితే తెలియచెయ్యగలరు) 


కనుక బ్రాహ్మణ్యం మన బలం. అజ్ఞానంతో దానిని మనం పోగొట్టుకుంటున్నాం. నిజంగా బ్రాహ్మణ వ్యవస్థ మన బలహీనత అయితే ముఘలులు, బ్రిటిష్ వాళ్ళు, తరువాత వచ్చిన కాంగ్రెస్/కమ్యూనిస్టులు బ్రాహ్మణ వ్యవస్థని బలపరచాలే కానీ బలహీనపరచ కూడదు. 


ఒక బ్రాహ్మణుడు ఈ పోస్ట్ లైక్ చెయ్యాలి అన్నా, షేర్ చెయ్యాలి అన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. వారి ఆత్మవిశ్వాసాన్ని అంతలా తూట్లు పొడిచారు. ఒక్కసారి ఈ విషయాన్నీ అందరూ కొంత విశాల దృక్పధంతో ఆలోచించండి

తల్లితండ్రుల పుణ్యఫలం

 🙏!శుభోదయమ్!!*✨🌷

🌸 *卐ॐ!! _సుభాషితమ్_!!ॐ卐* 🌸


శ్లో|| సుశీలోమాతృపుణ్యేన 

పితృపుణ్యేన చాతుర

ఔదార్యం వంశపుణ్యేన

ఆత్మపుణ్యేన భాగ్యవాన్.


తా|| తల్లితండ్రుల పుణ్యఫలం వలన మంచి గుణాలు, చాతుర్యం పొందుతాము. అలాగే వంశ పుణ్యాన ఉదారత్వం లభిస్తుంది. కానీ, స్వంత పుణ్యఫలం ఉంటేనే భాగ్యవంతులు కాగలరు. అందుకని అందరం సత్కర్మలు అంటే ఇతరులకు ప్రయోజనం కలిగించే పుణ్యకార్యాలు చేయాలి....... 

🙏✨💖🌷

సాధు దర్శనం..*

 *సాధు దర్శనం..*


"అయ్యా..ఏడుగురు సాధువులు మందిరం వద్దకు వచ్చారు..వాళ్లకు తెలుగు రాదు..హిందీ లో మాట్లాడుతున్నారు..మన సిబ్బంది లో ఎవరికీ హిందీ లో మాట్లాడటం రాదు..మీరొక్కసారి వాళ్ళతో మాట్లాడి..విషయం కనుక్కుని చెపితే..మేము అందుకనుగుణంగా నడుచుకుంటాము.." అని మా సిబ్బంది నాకు ఫోన్ చేసి అడిగారు..వాళ్ళ చేతికి ఫోన్ ఇచ్చి మాట్లాడించమని చెప్పాను..వాళ్ళతో మాట్లాడిన తరువాత..ఆ సాధువులు హరిద్వార్ వద్ద ఉంటారని..వాళ్ళు తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో వుండే క్షేత్రాల ను దర్శించుకుంటూ తిరుగుతున్నారని..గొలగమూడి వెంకయ్య స్వామి మందిరానికి వెళ్ళినప్పుడు..మొగిలిచెర్ల లో కూడా ఒక అవధూత మందిరం వున్నదని విని..దర్శించుకోవడానికి వచ్చారని అర్ధమైంది..ఆ సాధువులు ఆ రాత్రికి స్వామివారి మందిరం వద్ద ఉండడానికి ఏర్పాట్లు చేయమని మా సిబ్బందికి చెప్పాను..తమ ఆహారం తామే తయారు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు..


ఆరోజు రాత్రి ఎనిమిది గంటలకు స్వామివారి మందిరం వద్ద ఉన్న భక్తులు భజన చేస్తూ వున్నారు..ఏడుగురు సాధువులూ ఆ భజనను ఆసక్తిగా విన్నారు..మరి కొద్దిసేపటికి వాళ్ళు కూడా హిందీ లో భజన చేయడం ప్రారంభించారు..అందరూ స్వామివారి ముఖ మంటపం లోనే పడుకున్నారు..తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి..స్నానాదికాలు ముగించుకొని మళ్లీ మంటపం లోకి వచ్చి ధ్యానం చేసుకోసాగారు..ఆరోజు ఉదయం ఏడు గంటలకు నేను స్వామివారి మందిరం వద్దకు వెళ్ళాను..ఆ సమయానికి సాధువులందరూ స్వామివారి హారతి కళ్లకద్దుకొని..తీర్ధం తీసుకుంటూ వున్నారు..నన్ను నేను పరిచయం చేసుకొన్నాను..


"నిన్న సాయంత్రం ఐదారు గంటల వేళ మేము ఇక్కడికి వచ్చాము..మీరు మీ సిబ్బందికి చెప్పిన తరువాత..వాళ్ళు మమ్మల్ని స్వామివారి సమాధి దర్శించుకునే అవకాశం కల్పించారు..స్వామివారి సమాధి వద్దకు వెళ్ళాము..మాకు తెలీకుండానే..మా వళ్ళంతా జలదరింపులు వచ్చాయి..ఇక్కడ అఖండమైన తపో శక్తి నిక్షిప్తమై ఉన్నది..కేవలం మా అదృష్టవశాత్తూ ఇటువంటి అవధూత మందిరాన్ని దర్శించుకున్నాము..తరువాత ఇక్కడ భజన లో పాల్గొని..మేము కూడా పారవశ్యం తో భజన చేసాము..ఆ మంటపం లోనే రాత్రి పడుకున్నాము..ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నందున ఈరోజు మేము వెళ్లిపోతున్నాము..కానీ అతి త్వరలోనే ఇక్కడికి వచ్చి..కనీసం పదిహేను రోజులపాటు ధ్యానం చేసుకుంటూ గడుపుతాము..మాకొఱకు ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లూ వద్దు..మా ఆహారం మేమే వండుకుంటాము.." అని చెప్పి.."మా భాష అర్ధం కాకపోయినా..మీ సిబ్బంది బాగా సహకరించారు..మా సైగలు వాళ్ళు అర్ధం చేసుకున్నారు.."అని చెప్పారు..వాళ్ళు తెచ్చుకున్న కొద్దిపాటి సామాను సర్దుకొని..తిరిగి వెళ్లేముందు..స్వామివారి సమాధిని మరొక్కసారి దర్శించుకుంటామని అడిగారు..అలాగే వెళ్ళిరండి అన్నాను..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని ఇవతలికి వచ్చి మూకుమ్మడిగా అందరూ "జై గురుదేవ్..జై దత్తాత్రేయ.." అని పెద్ద స్వరం తో పలికి..ఒక ఐదు నిమిషాలు కళ్ళుమూసుకుని నిలబడ్డారు..ఆ తరువాత ఇవతలికి వచ్చి..దత్తపాదములు ఉన్న చిన్న మందిరం వద్దకు వెళ్లి నమస్కారం చేసుకున్నారు..ఒక్కొక్కరుగా తమ శిరస్సులను దత్తపాదములకు ఆనించి.."జై దత్తాత్రేయా.." అని పలికి ఇవతలికి వచ్చేసారు..


"ఈ స్వామివారు మమ్మల్ని అనుగ్రహిస్తే..అతి త్వరలో మళ్లీ ఇక్కడికి వస్తాము.." అని చెప్పారు..మరో గంట తరువాత సాధువులు వెళ్లిపోయారు..


స్వామివారి సమాధిని ఎందరో సాధువులు, సాధకులు, సన్యాసులు దర్శించుకుంటూ వుంటారు..ఇక్కడ స్వామివారి తపశ్శక్తి నిక్షిప్తమై ఉన్నది అని వారందరూ తరచు చెపుతూ వుంటారు..ఆ తపోమహిమ ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా అనుభవానికి వస్తుంది..అలా అనుభూతి పొందిన వారు మరలా మరలా ఈ క్షేత్రానికి వచ్చి వెళుతుంటారు..అలాటి సాధు సన్యాసుల దర్శనం కూడా స్వామివారి వలన మాబోటి వారికి లభిస్తున్నది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).