1, ఫిబ్రవరి 2021, సోమవారం

ఐదు 'జ' కారాలనూ

 *జామాతా,  జఠరం,  జాయా, జాతవేదా,  జలాశయ:*


*పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా:* *(దుర్భరా)*


లోకములో తృప్తి అనేది వేటికి  వుండదు? 

అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు:


ఈ లోకం లో ఐదు

 'జ'   కారాలున్నాయి.

వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు. అవి ఏమిటంటే :


(1) 'జామాతా' అంటే అల్లుడు. 

ఎంత యిచ్చినా చాలు అనని వాడు.


(2) 'జఠరం'  అంటే కడుపు. 

దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే. 


(3) 'జాయా'  అంటే భార్య. 

ఈవిడ కూడా అంతే.

ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.


(4) 'జాతవేదా'   అంటే అగ్ని. 

ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి. 


(5) 'జలాశయ'  అంటే సముద్రము. 

ఎంతనీరు వచ్చి పడినా తృప్తి లేదు.


ఈ ఐదు 'జ'   కారాలనూ తృప్తి పరచటం కష్టం.


శాశ్వత మైన జఠరాలు.

అసంతృప్తి తప్ప, 

తృప్తి అనేదే ఉండదు. 

                                                                

*సర్వే జనా సుఖినోభవంతు*

🌹👏🏾🌷

తర్పణాలు

 🌻🍄🌻🍄🌻🍄🌻

🍄🌻🍄🌻🍄🌻🍄




*🌻 అందరం తప్పకుండా తెలుసుకోవలసిన తర్పణాలు వాటి సమగ్ర వివరణ 🌻*



""తృప్తినిచ్చే అర్పణం తర్పణం ""అంటారు.



1. తర్పణం అంటే ఏమిటి ?


పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.


2. తర్పణము ఎన్నిరకాలు ?


తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.


ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.

1-గరుడ తర్పణం : -

ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.


2-బ్రహ్మ యజ్ఞ తర్పణం : -

నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.


3-పర్హెణి తర్పణం : -

యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.


4-సాధారణ తర్పణం : -

అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు.


మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.


3. తర్పణాలు ఎందుకు వదులుతాము ?

తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.


4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ?

1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.


2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .


3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.


4. ఆవు నేతితో తర్పణము చేస్తే, సుఖము


5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, సర్వ సిద్ధి


6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము


5. తర్పణం ఎలా వదలాలి ?


కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు “స్వాహా” చేర్చి తర్పణము లీయవలెను.


(అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?


మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


 భాద్రపద బహుళపాడ్యమి నుంచి భాద్రపద అమవాస్య వరకు మధ్యనున్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు. మరణించిన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పుత్రులు నిర్వహించే శ్రాద్ధ తర్పణ , పిండప్రదానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షాలు అంటారు. వీటినే పితృపక్షము అనీ అపరపక్షములనీ కూడా అంటారు. మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి , వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశము.


*పితృదేవతలకు.... ఆకలా...?*


అనే సందేహం కలుగవచ్చు. ఈ కనిపించే సకల చరాచర జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది.


*అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః*


*యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞఃకర్మ సముద్భవః*


అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది. వర్షం వలన అన్నం లభిస్తుంది. యజ్ఞం వలన వర్షం కురుస్తుంది. ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమౌతుంది. అంటే... అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి. మేఘాలు వర్షించాలంటే... దేవతలు కరుణించాలి. దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి. వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్భాగాలు వారికి అందజేయాలి. ఎందుకు ఇంత తతంగం అని అడగొచ్చు.


మరణించిన ప్రాణి ఆత్మ రూపంలో పితృలోకంలో ఉంటుంది. ఆ ఆత్మ తన పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమిమీద జీవాత్మగా అవతరించడానికి ... అన్నాన్ని ఆశ్రయించి , తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి , శుక్ల కణముగా రూపొంది , స్త్రీ గర్భకోశంలో ప్రవేశించి , శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది.


మరణించిన మన పితరులకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి. అలా జరగాలంటే...


పితృదేవతలు దేహధారణ చేసి ఈ లోకంలోకి రావాలి. అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి. అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి. అప్పుడే వారికి పితృఋణం తీరుతుంది. ఋణం తీరడమే మోక్షం అంటే. ఎవరికైనా ఇంతే..


*తద్దినాలు పెడుతున్నాం కదా... మహాలయ పక్షాలు పెట్టాలా?*


అనే సందేహం తిరిగి కలుగవచ్చు. మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం. పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి , తాత , ముత్తాతలను తలచుకుని పితృయజ్ఞాన్ని నిర్వహిస్తాడు. మరి పుత్రులు లేనివారి సంగతి ఏమి ? వారి గతి అధోగతేనా ? అంటే కాదు. అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్ళికాని సోదర , సోదరీలు మరణించి ఉండవచ్చు. లేదా పెళ్ళయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు. లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్న పిల్లలు ఉండవచ్చు. లేదా యుద్ధాలలో కానీ , శిక్షల ద్వారా కానీ , ఆత్మహత్యల ద్వారాకానీ , ప్రకృతి వైపరీత్యాల (భూకంపాలు , వరదలు)ద్వారా కాని గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు. అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలు నిర్దేశించబడ్డాయి. పితృతిథి నాడు మూడు తరాల వారికి (తండ్రి , తాత , ముత్తాత) మాత్రమే తిలోదకాలతో పిండప్రదానం ఇవ్వబడుతుంది. కానీ ఈ మహాలయ పక్షాలు , పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక , పుత్రులు లేని గురువులకు (గురువు కూడా తండ్రితో సమానం) స్నేహితులకు కూడా తిలోదకాలతో , పిండప్రదానం ఇచ్చే అర్హత , అధికారం ఉంది. దీనినే *సర్వకారుణ్య తర్పణ విధి* అంటారు. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి , తద్దినం , పెట్టకపోతే ఆ తద్దినం పెట్టని దోషం మహాలయం పెట్టడం వలన పోతుంది. పితృయజ్ఞం చేసిన వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలనీ .... పిల్లపాపలతో ఆనందంగా ఉండాలనీ దీవిస్తారు.


*మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి?*


సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు మహాలయం పెట్టడం ఉత్తమమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో మహాలయ అమావాస్యనాడు పెట్టడం ప్రశస్తం. దీనినే సర్వ పితృ అమావాస్య అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ... వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి.


క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమి తిథులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన 4 లేక 5 రోజున మహాలయం పెట్టాలి.


భార్య మరణించిన వాడు అవిధవ నవమినాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి. ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి , పసుపు , కుంకుమ , గాజులు , పూవులు , చీర , పెట్టి సత్కరించి పంపాలి.


చిన్న పిల్లలు చనిపోతే... వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి. చిన్న పిల్లలు అంటే ఉపనయన వయస్సు (పది సంవత్సరములు) దాటనివారు. ఒకవేళ పది సంవత్సరముల వయస్సు లోపే ఉపనయనము జరిగి ఉంటే... ఆ పిల్లవాడు మరణించిన తిథినాడే మహాలయం పెట్టాలి.


ఇక ప్రమాదాలలో కానీ , ఉరిశిక్ష వల్ల కానీ , ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థినాడు అనగా అమావాస్య ముందురోజున పెట్టాలి.


*ఓం గం గణపతయే నమః*🌻

మనసునుంచి పుట్టిన సరోవరం🌼

 🍄🌼🍄🌼🍄🌼🍄

🌼🍄🌼🍄🌼🍄🌼




*🌼మనసునుంచి పుట్టిన సరోవరం🌼*




మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించడం వల్ల పార్వతి (దుర్గాదేవి)కి ఈ పేరు వచ్చింది. మహిషాసురుడు గొప్ప బలవంతుడు. అతనికి ఉన్న వర మహిమ అతనిని మరింత బలవంతుడిని చేసింది. ఆ బల గర్వంతో మూడు లోకాలను జయించి విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించసాగాడు. దేవతలను, రుషులను, మానవులను క్రూరంగా హింసించసాగాడు. ఏమీ చేయలేక, భయంతో, బాధతో మునులు, దేవతలు, మానవులు త్రిమూర్తులను రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వారి వేడుకోలుకు త్రిమూర్తులు కరిగిపోయారు. మహిషాసురుని మీద వారికి కోపం వచ్చింది. ఆ కోపం నుంచి ఓ తేజస్సు (వెలుగు.. ఒక శక్తి) పుట్టింది. దానికి ఒక రూపం ఏర్పడింది. ఆ తరువాత మూడు కోట్ల దేవతల కోపం, ఆవేశం ఈ తేజో రూపంతో కలిసి మరింత శక్తివంతమైన రూపంగా, అదే ఆదిశక్తిగా, అమ్మగా అవతరించింది. దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలను అమ్మకు ఇచ్చారు. శివుడు తన త్రిశూలాన్ని, మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, విశ్వకర్మ ఒక పదునైన గొడ్డలి (పరశువు)ని, ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆ ఆదిపరాశక్తికి ఆయుధాలుగా ఇచ్చారు. హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. పరాశక్తి ఆ సింహాన్ని వాహనంగా చేసుకుని పైన చెప్పిన ఆయుధాలను తీసుకుని వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించింది. ఆ శంఖ నాదశక్తికి తట్టుకోలేక రాక్షసులు తలకిందులయ్యారు. మహిషాసురుడు అణిమాది అష్టసిద్ధుల సహాయంతో సింహరూపంలో యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలోనూ యుద్ధం చేశాడు. మత్తగజంలా మారి అమ్మను ముట్టడించబోయాడు. చివరకు తన సహజరూపమైన దున్నపోతు (మహిషం) రూపంలో, తన వాడి కొమ్ములతో అమ్మ మీద దండెత్తాడు. తన త్రిశూలంతో అమ్మవారు ఆ మహిషాసురుడి గుండెలను చీల్చిపారేసింది. మహిషాసురుడు ఆరుగురు రాక్షసులకు ప్రతిరూపమైనవాడు. చండ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, మహిషాసుర.. ఈ ఆరు రూపాలు రజో, తమో గుణాలకు ప్రతీకలు. సత్వ గుణానికి అధి దేవత అయిన జగన్మాత ఈ ఆరుగురు రాక్షసులనూ సహరించింది. అలా సంహరించిన రోజే దసరా అయ్యింది.


*మానస సరోవరం*


ఇది పవిత్ర తటాకం. ఇది హిమాలయ పర్వత శిఖరాల మధ్య టిబెట్టులో ఉంది. హిందువులకు ఇది అత్యంత తీర్థాస్థలి. ఇక్కడ సాక్షాత్తూ శివుడు కొలువు ఉంటాడని, ఆయన కైలాస పర్వతశ్రేణిలోనే ఈ పవిత్ర కొలను ఉందని నమ్మిక. ఇక్కడ ముక్కోటి దేవతలు నివసిస్తారని అంటారు. ఈ సరోవరానికి ఉత్తర దిక్కున కైలాస పర్వతం ఉంటుంది. ఈ సరస్సు సముద్ర మట్టానికి 4,590 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన జలం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మ దేవుడి ఆలోచనల (మనసు) నుంచి ఈ సరస్సు ఆవిర్భవించిందని, అందుకే దీనిని మానస సరోవరం అంటారని చెబుతారు. జ్ఞానానికి, అందానికి ప్రతిరూపమైన హంసలు ఇక్కడ స్వేచ్ఛా విహంగాలై విహరిస్తాయి. భారతీయతకు మూలమైన వేదాలకు అధిదేవత అయిన వేద దేవత ఇక్కడే విహరిస్తుందని అంటారు. కైలాస మానస సరోవర యాత్ర అనేది ప్రతి హిందువు కలగనే ఆధ్యాత్మిక యాత్ర. బ్రహ్మపుత్ర, గంగ, సట్లజ్‍ నదులు మానస సరోవరం నుంచే పుట్టాయని కూడా అంటారు. శాస్త్రీయంగా కూడా ఇది శక్తి ప్రాంతం. ఇక్కడ అడుగు పెట్టగానే అద్భుతమైన శక్తి సొంతమైన భావన కలుగుతుంది.🌼

నవగ్రహ దోషముల

 🙏🍄🙏🍄🙏🍄🙏

🍄🙏🍄🙏🍄🙏🍄




*🙏నవగ్రహ దోషముల స్నానౌషధములు నవగ్రహ దోషములు-స్నానౌషధములు🙏*



*నవగ్రహ దోషములు*


స్నానౌషధములు సిద్ధౌషధ సేవలవలన రోగములు, మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధ స్నాన విధానము వలన గ్రహదోషములు నశించును.



*సూర్య గ్రహ దోషము తొలగుటకు:*


మణిశిల,ఏలుకలు, దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు -ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.



*చంద్ర గ్రహ దోషము తొలగుటకు:*


 గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి, శంఖములు,మంచిగంధములు,స్పటికము-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.



*కుజ గ్రహ దోషము:*


మారేడు పట్టూ, ఎర్రచందనము, ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు -ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.



*బుధ గ్రహ దోషము:*


ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము -ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలయును.



*గురు గ్రహదోషమునకు:*


మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం, తేనే -వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.



*శుక్ర గ్రహదోషము:*


 యాలుకలు,మణిశిల, శౌవర్లవణము,కుంకుమ పువ్వు-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆనీటితో స్నానము చేయవలయును.



*శని గ్రహ దోషము:*


నల్ల నువ్వులు, సుర్మరాయి,సాంబ్రాణి, సోపు, -వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.



*రాహు గ్రహ దోషము:*


సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము (ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) -ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.



*కేతు గ్రహ దోషము:*


సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం, మేజ మూత్రం , మారేడు పట్ట-ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను.🙏

గురుచండాల యోగం🥀*

 🍄🥀🍄🥀🍄🥀🍄

🥀🍄🥀🍄🥀🍄🥀




*🥀గురుచండాల యోగం🥀*



గురుగ్రహానికి రాహువు చేరువై చండాల యోగాన్ని ఇస్తాడు. దీనినే గురు చండాల యోగం అంటారు. 

కలియుగంలో ధర్మం ఒక పాదంపైన, అధర్మం 3 పాదాలపైనా నడుస్తున్నదని పురాణాలు చెప్తాయి. ఈ మూడు పాదాల అధర్మ నడకకు పెద్దపీట వేసే గ్రహమే రాహువు. చంద్రునికి ఉత్తర ధృవ బిందువుగా రాహువుంటే, దక్షిణ ధృవ బిందువుగా కేతు వుంటాడు. నవగ్రహాలలో రాహు కేతువులు మినహా మిగిలిన ఏడూ గ్రహాలూ గడియారంలో ముళ్ళువలె సవ్య దిశలో సంచారంలో ఉంటాయి. కాని రాహు కేతువులు అపసవ్య సంచారంలో ఉంటాయి. రాహువు ఉన్న రాశికి, ఏడవరాశిలో కేతువు ఉంటాడు.


ప్రపంచ రాజకీయ రంగాన్ని పరోక్షంగా శాసించే వాడే రాహువు. దీనికి తోడు నూతన అంశాలపై దృష్టి ఉంచి విశేష విజ్ఞానానికి బాటలను వేసేవాడు కూడా రాహువే. ప్రపంచంలో ఆధునిక విజ్ఞాన శాస్త్రం మూడు పువ్వులు, ఆరు కాయలుగా విరాజిల్లుతున్నదంటే, కేవలం రాహు అనుగ్రహమని చెప్పటంలో అతిశయోక్తి లేదు. లోక కల్యాణానికి పునాదులు వేసే విజ్ఞాన శాస్త్రానికి సారధిగా రాహువు ఉండటం నాణేనికి ఒకవైపు అంశం. అదేవిధంగా నాణేనికి రెండవ వైపున విజ్ఞాన శాస్త్రంలోనుంచే విశ్వ వినాశనానికి ప్రేరణ కారకత్వాన్ని ఇచ్చేవాడు కూడా ఛాయా గ్రహమైన రాహువే.


మానసిక, శారీరక, ఆర్ధిక, కుటుంబ, నేత్ర, దంత, సోదర, సోదరీ, వృత్తి, వ్యాపార, ఆరోగ్య, వాహన, గృహ, మాతృ, సంతాన, దాంపత్య, పితృ, ఆయు స్థాన అంశాలన్నిటి లోను అనుకూలంగా, ప్రతికూలంగా ఫలితాలను తనికిష్టమైన రీతిలో ఇచ్చే ఏకైక గ్రహమే రాహువు. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు, ఆకాశ మార్గంలో విమాన ప్రమాదాలు, దానితో పాటు రిమోట్ తో పేల్చే ప్రమాదాలు, ఎత్తైన ప్రాంతం నుంచి దిగువకు పడిపోయే ఘోర ప్రమాదాలు, నూతన వైరస్ క్రిముల ఉత్పత్తితో పాటు అనేకానేక అంశాలన్నీ రాహు ప్రాబల్యం వలెనే జరుగుతుంటాయి. ఇతర గ్రహాలు రాజయోగం ఇచ్చినా, ఇవ్వకపోయినా రాహువు తన ఇష్టానుసారంగా ఫలితాలను తారుమారు చేయగలడు. అందలం ఎక్కించగలడు. భూస్థాపితం చేయగలడు.

గ్రహస్థితి బలహీనమైనప్పుడు మానవుడు ఎంత ప్రతిభాశాలి అయిననూ విధి వంచితుడు కాక తప్పదు. రాజకీయ రంగంలోనే ఇలాంటివి తరచుగా కనపడుతుంటాయి. వ్యక్తికి అంగబలం, అర్ధబలంతో పాటు ప్రజలందరూ కూడా జేజేలు పలికిననూ రాహు, కేతువుల అనుగ్రహం లేని కారణంగానే నామినేషన్ల తదుపరి చేసే స్క్రూట్నీతో పేరు గల్లంతవుతుంది. స్వల్ప అవయోగాలవ లెనే విశేష రాజయోగాలు ఉన్ననూ దెబ్బతినేవారు అనేకమంది ఉన్నారు. ముక్కు మొహం తెలియని వారు ఒక్కోసారి అనుకోకుండా ఎన్నికలలో గెలవటము, ఉన్నత పదవులు అలంకరించటము జరుగుతుంది. ఇలాంటి యోగాలని అనుకోకుండా అందించేవాడే రాహువు.


ముఖ్యంగా రాజకీయ రంగము, విజ్ఞాన శాస్త్ర రంగములపై అనుకూల స్థితి ఏ స్థాయిలో ఉంటుందో, దానికంటే రెట్టింపుగా ప్రతికూల పంజాలు ఇవ్వటంలో రాహువుకి సాటి ఎవ్వరూ రారు. ఇంకా ఈ రెండు రంగాలను గురించి కొంత లోతుగా చర్చించుకుందాం.


సప్త గ్రహాలూ అనుకూలించక పోయినప్పటికీ రాహు, కేతువుల యోగాల వలన అనుకోకుండా అదృష్టం వరిస్తుంది. రాహు, కేతువులు ఇచ్చే యోగాలు శాశ్వతం కావు. అశాశ్వతాలే. కనుక ఈ అశాశ్వత రాజ యోగాలను పట్టుకొని, మన వ్యక్తిత్వాన్ని సరియైన స్థితిలో నియంత్రించుకుంటూ ఉంటుంటే రాహు, కేతువులిచ్చే అశాశ్వత యోగాన్ని శాశ్వతం చేసుకోవచ్చు. లేకుంటే మహారాజ సమానుడై భోగ భాగ్యాలతో జీవితం గడుపుతూ చివరకు ఆకాశ వీధులలో మరణం జరిగి అన్నీ అవయవాలు లేకుండా అంత్య క్రియలు జరగటం కూడా ఈ ఛాయా గ్రహాల ప్రభావమేనని గుర్తించాలి. 

రాజకీయ అధికారానికి రాహువు కారకుడు. అంతేకాక అనువంశిక రాజకీయ వారసత్వానికి కూడా రాహువే కారకుడు. పొడవైన, అందమైన శిరోజాలు కావాలంటే రాహు ప్రీతి అవసరం. బంధన కారకత్వం కూడా రాహువు వలెనే జరుగును. బాంబు ప్రేలుడు, ఇతర విస్ఫోటనాలచే మరణానికి రాహువు కారకుడవుతాడు. కఠిన కారాగార యోగము, దీర్ఘకాల కారాగార వాసము, న్యాయ స్థానాలచే సమస్యలు, ఉగ్రవాదుల, తీవ్రవాదుల వలన వాటిల్లే సమస్యలు రాహువు యొక్క దుర్యోగములే.


పదవులు, అత్యున్నత రాజకీయ జీవితం, రాజ్యాధికారము మొదలగు యోగములు పొందాలంటే జాతకునికి రాహు స్థితి ప్రధానంగా అనుకూలమై ఉండాలి. ఇట్టి రాహు అనుగ్రహానికి పరోక్షంగా గోధుమపిండి దీపారాధన ఎంతో తోడ్పడుతుంది. రాహుకాల దీపములు నిమ్మ డొప్పలలో పెట్టవలెను. గురు రాహు లకు జప దాన హోమ శాంతులు చేయించుకొనవలెను.🥀

మత్స్య యంత్రము

 🌷🍄🌷🍄🌷🍄🌷

🍄🌷🍄🌷🍄🌷🍄




*🌷మత్స్య యంత్రము🌷*



మహావిష్ణువు ధర్మ రక్షణకు ఎత్తిన దశ అవతారాలలో ఒకటి 'మత్స్యావతారము'. విష్ణు ద‌శావ‌తార‌ముల‌లో మొట్టమొద‌టి అవ‌తార‌మే మ‌త్స్యావ‌తార‌ము వేద స‌ముద్ధర‌ణ‌కై అవ‌త‌రించిన శ్రీ మ‌హావిష్ణువు రూప‌ము. ఈ యంత్రము, ఇత‌ర యంత్రముల కంటే చాలా విశిష్టమైన‌ది. స‌మ‌స్త వాస్తు దోష నివార‌ణ యంత్ర రాజ‌ము ముఖ్యంగా విశేషించి ఈ యంత్రము – వాని ప్రస్థార‌ము నందు గ‌ల స‌ప్తావ‌ర‌ణ‌ల‌లోను అతి ముఖ్యము శ‌క్తివంత‌మైన బీజాక్షర‌ముల‌తో రూపొందించ‌బ‌డి, స‌ర్వ సాంప్రదాయాను కూల‌ముగా నిర్మించ‌బ‌డింది.


పూజా విధి ఈ మ‌త్స్య యంత్రమును శాస్త్రానుసార‌ముగా దైవ‌జ్ఞుల‌చే త‌యారు చేయించుకొని, యంత్ర సంస్కార జీవ క‌ళాన్యాస‌, ప్రాణ‌ప్రతిష్టాదుల‌ను జ‌రిపించి, శుభ స‌మ‌య‌మున యంత్ర పూజ‌, జ‌పాదుల‌ను ప్రారంభించ‌వ‌లెను. ఈ యంత్రమును శ‌క్తివంత‌ముగా చేయుట‌కై విధి విధాన‌మును మిగిలిన యంత్రముల క‌న్న కొంచెం ఎక్కువ‌గానే నిర్ధేశింప‌బ‌డిన‌ది. 


మత్స్య యంత్రమును 

                శ్లో ||   స్వర్ణేన రజతే  నాపి  పంచాంగుళ  ప్రమాణకమ్ |

                         యంత్రపత్రం  విరచ్యాధ  సప్తకోణం  లిఖేత్పురమ్ |

                         వాదిక్షాంతాని ‍ బీజాని లిఖేత్కోణేషు చక్రమాత్ |

                         మధ్యేతు మత్స్య  మాలిఖ్య  గృహస్థాపన శోభనమ్ |

                         అగ్రముత్తరతః కృత్వాస్తంభమూలే౭ ధవాపరమ్ |

                         శంకుమూలేతు సంస్థాప్య సర్వదోషనివారణమ్ ||

                          

మత్స్య యంత్రంను ఐదు శేర్ల ధాన్యములో ఒక దినం, పంచామృతములందు ఒక దినం మంచి నీటిలో ఒక దినము ఉంచి పూజించి సహస్రాష్టోత్తర శతగాయత్రి జపమును చేసి శంఖు స్థాపన చేసిన గృహ స్థలములలో ఈ యంత్రమును ఏర్పాటు చేసుకోవాలి. ఈ యంత్రంను స్థాపన చేయుటవలన ద్వార దూష్యములు, కూప వేధలు, స్తంభ వేధలు, వీధి శూలలు ఆయుర్ధాయము నశించిన గృహ దోషములు, శంఖు స్థాపన చేయక కట్టిన దోషమును మొదలగునవన్నీ పరిహరించి మిక్కిలి శుభములు కలిగించును.🌷

శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?🦚*

 🦚🌸🦚🌸🦚🌸🦚

🌸🦚🌸🦚🌸🦚🌸



*📖  ఇతిహాసాలు 📓*



*🦚శ్రీకృష్ణుడికి ఎంత మంది పిల్లలో తెలుసా?🦚*



శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ. కానీ, గోవిందుడి కొడుకులు ఎవరు? ఎంతమంది ఉన్నారన్న అనుమానం కలుగుతుంది. మథురని చేరి కంసుని చంపిన దేవదేవుడు తరువాత దేవకీ, వసుదేవుల చెంత వుంటూ వారిని అనుగ్రహించాడు. ఈ సందర్భంలో ఆయన అనేక వివాహాలు చేసుకున్నాడు. ప్రధానంగా ఎనిమిది మంది భార్యలు ఆయనకు అష్ట మహిషులుగా ప్రసిద్ధి పొందారు! శ్రీకృష్ణ పత్నులైన ఆ ఎనిమిది మంది... లక్ష్మీదేవీ అవతారమైన రుక్మిణీ మాత, సత్రాజిత్తు తనయ అయిన సత్యభామ, శ్రీరాముని బంటైన జాంబవంతుని పుత్రిక జాంబవతి, అలాగే, వివిధ రాజ్యాల రాకుమార్తెలైన నాగ్నజితీ, భద్ర, మిత్రవింద, కాళింది, లక్షణ. ఈ ఎనిమిది మందితోనూ శ్రీకృష్ణ పరమాత్మకి పదేసి మంది కొడుకులున్నారని చెబుతోంది భాగవత పురాణం! అంటే, మొత్తం ఎనభై మంది తనయులున్నమాట!


గోపాలబాలుడి కులంలో పుట్టిన ఆయన వంశోద్ధారకుల్లో అందరూ ప్రాముఖ్యత వహించలేదు. అయితే, రుక్మిణీ దేవీ కుమారుడైన ప్రద్యుమ్నుడు మహా సుందరుడు, వీరుడు. ఆయన సాక్షాత్తూ రతీదేవీ భర్త అయిన మన్మథుడు. శివుడికి తపోభంగం చేసిన కారణాన ఆయన రూపం నశించి పోగా.. రుక్మిణీ దేవీ గర్భంలో జన్మించి తిరిగి రూపం పొందాడు ప్రద్యుమ్నుడుగా! రుక్మిణీదేవీకి ప్రద్యుమ్నుడు కాక మరో తొమ్మిదిమంది పుత్రులున్నారు. అలాగే, సత్యభామకి భాను, సుభాను, స్వర్భాను అంటూ పది ముంది భాను పేరుగల పుత్రులున్నారు. ఇక మరో ప్రధానమైన కృష్ణుడి పత్ని అయిన జాంబవతి కుమారుడు సాంబుడు. ఈయన కురుక్షేత్ర సంగ్రామంలో వీరోచితంగా పోరాటం చేసి చివరకు ప్రాణాలతో నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో మరణించని అతి కొద్దిమందిలో జాంబవతి, శ్రీకృష్ణుల కుమారుడైన సాంబుడు కూడా ఒకరు! ఈయన కాక మరో తొమ్మిది మంది సంతానం జాంబవతికి వున్నారు.


రుక్మిణీ, సత్యభామ, జాంబవతి లాగే ఇతర శ్రీకృష్ణ పట్టపు రాణులకు కూడా అనేక మందిపుత్రులున్నారు.  అయితే, వాళ్లలో అందరూ కలియుగ ప్రారంభసమయంలో మురళీ మోహనుని అవతార సమాప్తి తరువాత అంతమై పోయారు. శ్రీకృష్ణ, బలరాముల వంశంలో అంతః కలహాలు పెల్లుబికి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు! అలా కృష్ణుని సంతానం ఏదీ మిగలలేదు. రుక్మిణీ, శ్రీకృష్ణ పరమాత్మల తనయుడైన ప్రద్యుమ్నుడికి మాత్రం అనిరుద్ధుడనే కొడుకు కలిగాడు. ఆయన మాత్రం కృష్ణ వంశాన్ని కొనసాగించాడు!🦚

సప్తపది

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                      *సప్తపది!*

                     ➖➖➖✍️


మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగులకు ఉన్న సంబంధమేంటి ?


సాధారణంగా హిందు వివాహ సాంప్రదాయంలో వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థముందంటారు మన పెద్దలు.

ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను ఒకటిగా చేసేదే వివాహ బంధం. హిందూ సాంప్రదాయంలో వివాహ సమయంలో జరిగే వివిధ క్రతువులకు ప్రత్యేకమైన అర్ధం, పరమార్ధం ఉంది. అపరిచితులైన ఇద్దరు వ్యక్తులను మంత్రబద్ధంగా ఒకటిగా చేస్తుంది వివాహం. పెండ్లి కుమారుడు కళ్యాణమండపానికి వచ్చిన తర్వాత కళ్యాణ దీక్షా కంకణం కడతారు పురోహితులు. అమ్మాయి తల్లితండ్రులు వరునికి కాళ్లు కడిగి , తమ కన్నబిడ్డను ధర్మార్ధ, కామ, మోక్షాలలో తోడుగా ఉంటానని ప్రమాణం చేయించి కన్యాదానం చేస్తారు. వివాహ ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెట్టి , పిమ్మట మాంగల్యధారణ జరుగుతుంది.


వివాహ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వధువరుల కొంగు ముడులు కలిపి బ్రహ్మముడి వేస్తారు. వధువు చిటికిన వేలును వరుడు పట్టుకునీ అగ్ని హోత్రం చుట్టూ ప్రదక్షణ చేస్తూ ఏడు అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ, అన్యోన్యంగా, ఆదర్శవంతంగా జీవించాలనేదే సప్తపదిలోని అంతరార్థం. 

పురోహితుడు వధూవరులిద్దరిని అగ్నిసాక్షిగా జీవితాంతం ఒక్కటిగా కలిసి మెలిసి ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటామనే ప్రమాణాలు చేయిస్తాడు.


"సప్తపది అంటే ఏడడుగులు కలిసి నడవడం!"


ఇద్దరూ కలిసి ఏడడుగులు నడిస్తే మిత్రబంధం ఏర్పడుతుందని భావం. అందుకే పెద్దలు వివాహబంధం ఏడడుగుల బంధం అని అంటారు. మరి ఏడు అడుగుల వెనుక దాగున్న పరమార్థాలేంటో తెలుసుకుందాం...


మొదటి అడుగు:

*"ఏకం ఇషే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ మొదటి అడుగుతో విష్ణువు మనిద్దరిని ఒక్కటి చేయుగాక!"


రెండవ అడుగు..

*"ద్వే ఊర్జే విష్ణుః త్వా అన్వేతు"*


ఈ రెండవ అడుగుతో విష్ణువు మనిద్దరికీ శక్తిని ఇచ్చుగాక


మూడవ అడుగు:

*త్రీణి వ్రతాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ మూడవ అడుగుతో విష్ణువు వివాహవ్రతసిద్ధిని అనుగ్రహించుగాక.


నాలుగవ అడుగు:

*"చత్వారి మయోభవాయ విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ నాలుగవ అడుగుతో విష్ణువు మనకు ఆనందమును కలిగించుగాక.


ఐదవ అడుగు:

*"పంచ పశుభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఐదవ అడుగుతో విష్ణువు మనకు పశుసంపదను కలిగించుగాక.


ఆరవ అడుగు:

*"షడృతుభ్యో విష్నుః త్వా అన్వేతు"* 

ఈ ఆరవ అడుగుతో ఆరు ఋతువులు మనకు సుఖమును ఇచ్చుగాక.


ఏడవ అడుగు:

*"సప్తభ్యో హోతాభ్యో విష్ణుః త్వా అన్వేతు"* 

ఈ ఏడవ అడుగుతో విష్ణువు మనకు గృహాస్తాశ్రమ ధర్మనిర్వహణకు అనుగ్రహమిచ్చుగాక. 

మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.✍️


                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

చిట్టికథ

 ✍️...నేటి చిట్టికథ




చిన్నపాటి అవసరం కోసం ఎంతటి మహావృక్షాన్నయినా కొట్టిపారేసే స్వార్థం మనిషిది.

 ఆ స్వార్థంతోనే పచ్చటి పుడమి కాస్తా ఎడారిగా మారిపోతోంది.


 రుతువులు సైతం గతి తప్పేలా భూమి సెగలు కక్కుతోంది. అందుకనే ‘భూమి కాపాడండి బాబులూ’ అంటూ స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేస్తున్నాయి.


 కానీ వేల ఏళ్ల క్రితమే మహాభారతంలో పర్యావరణం విలువని గుర్తుచేసే కథ కనిపిస్తుంది.


 ఆ కథ ప్రకారం...


అనగనగా కాశీరాజ్యంలో ఓ వేటగాడు ఉండేవాడు. అతను తన బాణాలకి విషం రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా ఓ రోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవిలోపల అడుగుపెట్టగానే అతనికి లేళ్ల గుంపు కనిపించింది. వెంటనే వాటికి గురిచూసి బాణాలు వదిలాడు. వేటగాడి దురదృష్టమో, లేళ్ల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురితప్పాయి. వాటిలో ఒక బాణం పోయి పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడిపోయింది.


బాణం కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకి ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి, పండ్లు చెట్టు మీదనే కుళ్లిపోయాయి, కాండం యావత్తూ ఎండిపోయింది


. ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటోంది. తన చిన్నప్పటి నుంచీ ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటోంది. దానికి ఆ చెట్టంటే చాలా అభిమానం. దాంతో ఆ చెట్టుని వీడి పోయేందుకు దానికి మనసు ఒప్పలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది చిలుక.


ఒకో రోజూ గడవసాగింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలిదప్పులతో అలాగే కాలాన్ని వెళ్లదీస్తోంది. తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మోడువారిపోవడం చూసి దానికి ఆకలే వేయడం లేదు. చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానం ఇంద్రుడి వరకూ పాకింది. దాంతో స్వయంగా ఆయనే మానవరూపాన్ని ధరించి చెట్టు దగ్గరకు వచ్చాడు.


‘నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న విశ్వాసం అనితర సాధ్యం. కానీ మోడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడుచేసుకుంటావు. ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరో చెట్టే దొరకలేదా! నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టుని వీడి మరో చోటు చూసుకో’ అని సూచించాడు.

 

తన దగ్గరకి మనిషిరూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మసౌందర్యం స్వచ్ఛమైంది కదా! అందుకే- ‘అయ్యా! మీరు ఇంద్రుడన్న విషయం నాకు తెలుసు. కానీ నేను ఈ చెట్టుని వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను, దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్నబిడ్డలా, కంటికిరెప్పలా కాపాడుకుంది. ఎండావానల నుంచి, ఆకలిదప్పుల నుంచి, శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను. మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారిని సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు!’ అని చెప్పుకొచ్చింది.

 


చిలుక నిబద్ధతకి, విశ్వాసానికీ ఇంద్రుడికి నోటమాటరాలేదు. ‘నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి మెచ్చాను. ఏదన్నా వరాన్ని కోరుకో!’ అంటూ అభయమిచ్చాడు.

‘అయ్యా! దయచేసి నన్నూ ఈ చెట్టునీ వేరుచేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే... ఈ చెట్టు మళ్లీ చిగురించేలా... పండ్లు, పుష్పాలతో కళకళలాడేలా దీవించండి,’ అంటూ వేడుకొంది.


చిలుక మాటలకి మురిసిన ఇంద్రుడు ఓ నాలుగు చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే... అది మళ్లీ జీవం పోసుకొంది. 



ఒక చెట్టుని ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే.... భూమిలోని అణువణువు మీదా ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి ..



🍁🍁🍁🍁🍁

త్రిజట

 *📖 మన ఇతిహాసాలు 📓*



*త్రిజట*



*రామాయణం*


వాల్మీకి రాసిన అసలు రామాయణంలో, త్రిజను రెండు సంఘటనలలో ఎక్కువగా కనిపించే వృద్ధ రాక్షసి (దెయ్యం) గా అభివర్ణించారు. మొదటిది ఇతిహాసం యొక్క ఐదవ భాగమైన సుందర కాండ జరుగుతుంది. అపహరణకు గురైన యువరాణి సీతను లంకలోని అశోక వాటిక లో ఉంచారు . లంక యొక్క రాక్షస-రాజు,రావణుడు ,తన భర్త రాముడికి నమ్మకంగా ఉంటూ తనని మొండిగా కాదంటున్న సీతకు కాపలాగా ఉండే రాక్షసనులకి ఎలాగైనా సీతను తనతో పెళ్ళికి ఒప్పించమని ఆఆజ్ఞాపించాడు . రావణుడు వెళ్లిన తరువాత, ఎలాగైనా సీత నిర్ణయాన్ని మార్చుకోమని రాక్షసులు సీతను వేధించడం మొదలుపెడతారు. వృద్ధురాలైన త్రిజట జోక్యం చేసుకుని, రావణుని మరణాన్ని మరియు రాముడి విజయాన్ని చూపిన తన కల గురించి వివరించింది . 


తన కలలో, త్రిజట రాముడు మరియు అతని సోదరుడులక్ష్మణుడు ఖగోళ ఏనుగుఐరావతం పైన సీత వైపు స్వారీ చేయడాన్ని చూస్తాడు. రాముడు సీతను తన ఒడిలో తీసుకొని ఆకాశం అంత ఎత్తుకు పైకి లేచి, సీతను సూర్యుడిని, చంద్రుడిని తాకడానికి అనుమతిస్తాడు. అప్పుడు ముగ్గురూ లంకకు ప్రయాణించి,పుష్పక విమానము (రావణ వైమానిక రథం) లో ఉత్తరం వైపు ఎగరడాన్నీ మరియు ఆ సమయంలో రావణుడు నూనెలో తడిసి, ఎర్రటి రంగుతో నేలమీద పడుకున్నాడు. రావణుడు అప్పుడు గాడిదపై దక్షిణం వైపుకు వెళ్లి పేడ గొయ్యిలో పడతాడు. ఎర్ర చీరలో ఉన్న ఒక నల్లజాతి స్త్రీ అతన్ని దక్షిణానికి లాగుతుంది. రావణ కుటుంబంలోని ఇతర సభ్యులు, అతని సోదరుడు కుంభకర్ణుడు, కుమారుడు ఇంద్రజిత్తు వంటి వారు కూడా ఇలాంటి స్థితిని ఎదుర్కొంటారు. రావణ సోదరుడు విభీషణుడు పుష్పక మానం దగ్గర నాలుగు దంతాల ఏనుగును నడుపుతూ ఠీవిగా తెల్లని వస్త్రాలలో కనిపిస్తాడు. లంక నగరం సముద్రంలో మునిగిపోతుంది మరియు రాముడి యొక్క ఒక కోతి ( వానరమ్ ) దూత నగరాన్ని కాల్చేస్తుంది.  త్రిజట రాక్షసులకు సీతను ఆశ్రయించాలని మరియు ఆమెకు క్షమాపణ చెప్పమని సలహా ఇస్తుంది ; త్రిజట కల నెరవేరితే, ఆమె తన రక్షా కాపలాదారులను రక్షిస్తుందని సీత వాగ్దానం చేసింది. 


రెండవ సంఘటన ఆరవ పుస్తకం యుద్ధ కాండ లో కనుగొనబడింది. రాముడు మరియు అతని సోదరుడు లక్ష్మణుడు వానర సైన్యంతో సీతను రాక్షస-రాజు బారి నుండి కాపాడటానికి వస్తారు. యుద్ధం యొక్క మొదటి రోజు, రావణ కుమారుడు ఇంద్రజిత్ నాగపాశం (పాము- నూస్ ) అనే ఆయుధంతో సోదరులను బంధిస్తాడు మరియు సోదరులు స్పృహ కోల్పోతారు. రావణుడు యుద్ధభూమిని చూడటానికి త్రిజట తో సీతను పంపుతాడు. తన భర్త చనిపోయాడని అనుకుంటూ, సీత విలపిస్తుంది, కాని త్రిజట రమా లక్ష్మణ సోదరులు ఇంకా బతికే ఉన్నారని భరోసా ఇస్తుంది . త్రిజట సీతపై తన ప్రేమను వ్యక్తం చేస్తుంది మరియు బందీగా ఉన్న సీత యొక్క "నైతిక స్వభావం మరియు సున్నితమైన స్వభావం" ఆమెను ప్రేమించమని బలవంతం చేసిందని చెబుతుంది. 



*🎣సేకరణ:సొంటేల ధనుంజయ🎣*

Vitamin D

 Vitamin D is made by the body with sunlight.


Sesame seeds (til) have the highest calcium (975mg per 100g). Milk has 125mg only.


The body is capable of storing vitamin D up to a year, and use the reserves.


Lastly, the body is capable of getting its vitamin D reserves full with 3 full days of sunlight.


The best quality of sunlight is end of winter & beginning of summer.


Now join the dots, and see how wise our sages were in ancient India.


They created a festival of flying kites where by our kids get excited to go in the open, under direct sunlight, throughout the day starting from early morning. And their mothers feed them homemade TIL ladoos.


Are we not a fantastic culture 😊?


Makar Sankranti - the kite flying festival in India is on January 14th this year.

ప్రయాణం



ఒక వ్యక్తి  ఓడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఓడ ప్రమాదానికి గురి అయింది. ఆ  ప్రమాదం నుంచి తప్పించుకుని  ఒక ద్వీపం దగ్గరకి చేరాడు.రోజూ భగవంతుడిని  ప్రార్థించుకుంటూ ఎవరైనా సహాయానికి కనబడతారేమో అని ఎదురు చూస్తూ ఉండేవాడు. అతి కష్టంతో ఒక చిన్న గుడిసె కట్టుకున్నాడు. ఒక రోజు తినడానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ  బయటికి వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్ళి చూస్తే కష్టపడి కట్టుకున్న చిన్న గుడిసెకి చితిమంట అంటుకుంది. పొగ ఆకాశం వైపు వెళుతోంది. చాలా  నిరుత్సాహంతో,కోపంతో ఏడుస్తూ  “ఎందుకు ఇలా చేసావు” అని భగవంతుడిని అడిగాడు.మర్నాడు పొద్దున్నే ఓడ హారన్ వినిపించింది. ఇక్కడ నేను ఉన్నట్టు ఎలా తెలిసింది అని ఓడలోని  వ్యక్తులను అడిగాడు. “ఆకాశం లో పొగని చూసి, ఇక్కడ ఎవరో ఉన్నారు అని వచ్చాము అన్నారు వాళ్ళు.  ఆ ఓడలో ప్రయాణం చేసి ఆ వ్యక్తి తన ఇంటికి చేరుకున్నాడు. 

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍁🍁🍁🍁🍁🍁🍁🍁


 *నీతి :* 

మనము అనుకున్నవి జరగనప్పుడు నిరుత్సాహ పడడం సహజం. మనం కష్టకాలంలో కూడా భగవంతుడిని నమ్ముకుని పూర్తి శరణాగతితో ఉంటే మనకి కావాల్సిన ధైర్యం, ఆలోచనా శక్తి , బలం అన్నీ  భగవంతుడు మనకి ఇస్తాడు

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️☀️☀️☀️☀️☀️☀️☀️☀️🌼🌼🌼🌼🌼🌼🌼🌼

సులోచన

 *సులోచన సంసారం..*


ఒక శనివారం నాటి సాయంత్రం ఐదు గంటల వేళ.."పల్లకీసేవ ఏడు గంటలకు ప్రారంభం అవుతుందని మైక్ లో చెపుతున్నారు..అందులో ఆడవాళ్లు పాల్గొనవచ్చా?" అంటూ ఒక యువతి నన్ను అడిగింది.."పూజ వరకూ పాల్గొనవచ్చు..పల్లకీ మాత్రం ఆడవాళ్ళ చేత మోయనియ్యరు.." అని చెప్పాను.."ఓహో అలాగా..! " అని..ఒక్కక్షణం ఆలోచించుకుని.."నేనొక్కదానినే వచ్చానండీ..పల్లకీవద్ద పూజ చేయించుకుంటాను..నాకొక టికెట్ ఇప్పించండి.." అన్నది.."సరే నమ్మా.." అని చెప్పి..మా సిబ్బంది వద్దకు వెళ్లి టికెట్ తీసుకోమని చెప్పాను..


ఆరోజు సాయంత్రం ఏడు గంటలకు పల్లకీసేవ లో ఆ యువతి పాల్గొన్నది..పూజారి గారికి తన గోత్రము..భర్తపేరు, తన పేరు..తన అత్త మామల పేర్లు తెలిపి అర్చన చేయించుకున్నది..పల్లకీసేవ వద్ద జరిగే పూజా కార్యక్రమాలు శ్రద్ధగా చూస్తూ..మధ్య మధ్య లో స్వామివారి ఉత్సవ మూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉన్నది..పూజ అనంతరం పల్లకీ ని భక్తులు పల్లకీని మోసుకొని ఆలయం వెలుపల మూడు ప్రదక్షిణాలు చేసేటప్పుడు..పల్లకీ వెనకాల దత్తనామం స్మరిస్తూ..తానుకూడా ప్రదక్షిణాలు చేసింది..మొత్తం పల్లకీసేవ లో  అత్యంత భక్తిగా పాల్గొన్నది..


ప్రక్కరోజు ఆదివారం ఉదయం ప్రభాతసేవ ను కూడా మంటపం లో కూర్చుని భక్తిగా చూసింది..శ్రీ స్వామివారి సమాధికి అర్చకస్వాములు ఇచ్చే నక్షత్ర హారతి ని కళ్లకద్దుకొని..ఇవతలకు వచ్చేసింది..మరో గంట తరువాత..మా దంపతులము కూర్చుని ఉన్న చోటుకి వచ్చి నిలబడి.."మీతో కొద్దిగా మాట్లాడాలి..మీకెప్పుడు తీరిక అవుతుందో చెపుతారా..?" అని అడిగింది..మరో గంట వేచి ఉండమని చెప్పాను..మేము కూర్చున్న కుర్చీలకు వెనకాలే కొద్దీ దూరంలో నేల మీద పద్మాసనం వేసుకొని కూర్చుంది..


ఒక గంట తరువాత..స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల తాకిడి తగ్గిన తరువాత..ఆ యువతిని పిలిచాను..దగ్గరకు వచ్చింది.."అమ్మా..ఏదో మాట్లాడాలి అన్నావు కదా..ఇప్పుడు చెప్పుతల్లీ.." అన్నాను..


"మీ ఇద్దరినీ చూస్తుంటే..మా అమ్మానాన్న గుర్తుకొస్తున్నారు.." అని చెప్పి.."నాపేరు సులోచన..మాది నెల్లూరు..నాకు పెళ్లై ఏడేళ్లు అయింది..మా అత్తగారిది కూడా మంచి కుటుంబం..వాళ్లకూ మంచి పేరుంది..అది చూసే..మా నాన్నగారు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారు..అన్నీ బాగున్నాయి కానీ..మా వారికి తాగుడు వ్యసనం ఉంది...మనిషి మంచివాడే..నన్నూ బాగా చూసుకుంటాడు..వ్యాపారం కూడా బాగా చేస్తాడు..కానీ ఏం లాభం..రోజూ రాత్రికి తాగి ఇంటికొస్తాడు..మా పుట్టింట్లో కానీ..అత్తగారింట్లో కానీ..డబ్బుకు కొదవలేదు..అన్ని సౌకర్యాలూ ఉన్నాయి..కానీ ఈయన కున్న ఈ వ్యసనం తో నాకు మనఃశాంతి లేదు..ఇంతవరకూ సంతానం మాకు సంతానం లేదు..అందరు దేవుళ్లకూ మొక్కుకున్నాను..ఈమధ్య ఈ స్వామివారి గురించి విన్నాను..ఎందుకనో ఆశ కలిగింది..ఒక్కసారి ఇక్కడికొచ్చి మొక్కుకొని వెళదామని అనుకున్నాను..మా అత్తగారు కూడా.."నువ్వెళ్ళి స్వామిని వేసుకొని రా..మా వాడు బాగు పడితే..మనమందరం వెళ్లి ఆ స్వామివారి వద్ద మొక్కు చెల్లించుకుందాము.."అన్నది..శనివారం నాడు పల్లకీసేవ అని చదివాను..అందుకే నిన్న వచ్చి, ఆ సేవలో పాల్గొన్నాను..ఇప్పుడు స్వామివారి సమాధికి మొక్కుకుంటాను..నన్ను మీరు కూడా ఆశీర్వదించండి.." అన్నది..


"ముందుగా స్వామివారిని దర్శించుకో.." అని మా ఆవిడ ఆ అమ్మాయికి చెప్పింది..సరే అని చెప్పి..స్వామివారి సమాధి ని దర్శించుకొని..తన బాధ చెప్పుకొని ఇవతలికి వచ్చింది..శ్రీ స్వామివారి ఉత్సవ మూర్తి వద్ద అర్చన చేయించుకొని..మళ్లీ మా వద్దకు వచ్చింది.."స్వామివారికి గట్టిగా నా గోడు చెప్పుకున్నాను..ఎందుకనో స్వామివారు నన్ను మరో నాలుగు వారాలు రమ్మన్నట్లు గా అనిపించింది..మొత్తం ఐదు వారాలు అవుతాయి..అదికూడా మనసులో అనుకున్నాను..ఇది ఆయన ఆదేశం అనిపించింది..తప్పకుండా నాలుగు వారాలు వస్తాను..ఆపై ఆయన దయ చూపితే..నా సంసారం ఒక గాడిన పడుతుంది..ఇదే చివరి ఆశ.." అని కన్నీళ్లు పెట్టుకున్నది..కొద్దిసేపటి తరువాత తేరుకొని.."వెళ్ళొస్తానండీ.." అని మా ఇద్దరికీ చెప్పి..చటుక్కున మా పాదాలకు నమస్కారం చేసి..వెళ్ళిపోయింది..అనుకున్న ప్రకారమే ఐదు వారాల పాటు సులోచన మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చి..ప్రతివారం పల్లకీసేవ లో అర్చన చేయించుకొని..ఆ రాత్రికి మంటపం లో నిద్రచేసి..తెల్లవారి ఆదివారం స్వామివారి సమాధి దర్శనం చేసుకొని..తిరిగి వాళ్ళ ఊరెళ్ళింది..ఆఖరివారం లో మళ్లీ మా దంపతుల వద్దకు వచ్చి.."దత్తాత్రేయుడి దయ ఉంటే..మళ్లీ వస్తాను.." అని చెప్పి వెళ్లింది..


ఈ సంఘటన జరిగిన పద్దెనిమిది నెలల తరువాత..పోయిన జూలై నెలలో ఒక శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయం లో రెండు కార్లు వచ్చి స్వామివారి మందిరం ముందు ఆగాయి..అందులోంచి ముందుగా సులోచన..ఆతరువాత సుమారు ఆరుమంది వ్యక్తులూ దిగారు..మాదంపతుల దగ్గరకు వచ్చి.."నేను గుర్తున్నానా..నెల్లూరు నుంచి సులోచనను..ఈయన మా వారు ప్రభాకర్..ఆమె మా అత్తగారు, మా మామగారు..మా అమ్మానాన్న..అందరం వచ్చాము..స్వామివారి దయవల్ల మా సమస్య తీరిపోయింది..ఆయన పూర్తిగా మారిపోయారు.."అని పట్టరాని ఆనందం తో చెప్పింది..పైగాతాను మూడోనెల గర్భవతిని అనికూడా చెప్పింది..


సులోచన సమస్య ఒక్కరాత్రిలో తీరిపోలేదు..సంవత్సరం పట్టింది..కానీ ఆ అమ్మాయి ఓపిక గా స్వామివారినే నమ్ముకొన్నది..స్వామివారు భక్త సులభుడు కదా..అందుకే సులోచన సంసారం చక్కబడింది..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కథ"

 #"తప్పక చదవాల్సిన కథ"#


ఒక తల్లి తన నిత్యపూజ అయిన తర్వాత విదేశాల్లో వుండే తన కుమారునికి వీడియో చాట్ చేసి తను

 ఖాళీగా ఉన్నాడా లేదా అని కనుక్కుని వీడియో చాట్ లో జరిగిన సంభాషణలు మన కోసం.🙏


తల్లి, నాయనా! పూజా పునస్కారాలు ఐనాయా?


కుమారుడు ఇలా చెప్పారు.

అమ్మా!నేను ఒక జీవ శాస్త్రవేత్తని. అది కూడా  అమెరికాలో మానవ వికాసానికి సంబంధించి  అన్వేషణ(రీసెర్చ్) చేస్తున్నాను. మీరు డార్విన్ 

జీవ పరిణామ సిద్ధాంతాన్ని వినే వుంటారు. అలాంటి నేను పూజలు చేస్తూ కూర్చుంటే ఏం బాగోదు.


తల్లి మందహాసంతో కన్నా! నాకు కూడా డార్విన్ గురించి కొద్దిగా తెలుసు కన్నా. కానీ అతను కనిపెట్టినవి అన్ని మన పురాతన ధర్మంలో ఉన్నవే కదా నాన్నా  అన్నది.


కుమారుడు వ్యంగ్యంగా అలాగా అమ్మ నాకు తెలీదే అని అన్నాడు. అపుడు ఆ తల్లి నీకు అంత ఆసక్తిగా వుంటే చెపుతా విను అని కొంచెం మృదువుగా తన సంభాషణ కొనసాగించింది.


నీకు మహా విష్ణువు యొక్క దశావతారాల గురించి తెలుసు కదా.


కుమారుడు ఆసక్తిగా అవును తెలుసు దానికి ఈ జీవ పరిణామానికి ఏమిటీ సంబంధం అని ప్రశ్నించాడు.

 

అప్పుడు ఆ తల్లి సంబంధం ఉంది. ఇంకా నువ్వు,  నీ డార్విన్ తెలుసుకోలేనిది కూడా చెపుతాను విను.


1 మత్స్య అవతారం: అది నీటిలో ఉంటుంది. అలాగే సృష్టి కూడా నీటిలోంచే కదా మొదలైంది. 

ఇది నిజమా కాదా. కొడుకు కొంచెం అలెర్ట్ గా వింటున్నాడు.


2 కూర్మ అవతారం: అంటే తాబేలు. దీనిని బట్టి సృష్టి నీటి నుండి భూమి మీదకు ప్రయాణించినట్టుగా 

గమనించాలి. అంటే ఉభయచర జీవులు లాగా. తాబేలు సముద్రం నుండి భూమికి జీవ పరిణామం జరిగింది.


3 వరాహ అవతారం: అంటే పంది. ఇది అడవి జంతువు లను అంటే బుద్ధి పెరగని జీవులు అదే డైనోసార్లని గుర్తుకు తెస్తుంది.

 

4 నృసింహ అవతారం: అంటే సగం మనిషి, సగం జంతువు. దీన్ని బట్టి మనకు జీవ పరిణామం అడవి 

జంతువు నుండి బుద్ధి వికసితమైన జీవులు ఏర్పడ్డాయి అని తెలుస్తుంది. 


5 వామన అవతారం: అంటే పొట్టివాడు అయినా ఎంతో ఎత్తుకు పెరిగిన వాడు. నీకు తెలుసుకదా మానవులు మొదట హోమో erectes మరియు హోమో సేపియన్స్ అని వున్నారు అని వాళ్లలో 

హోమో సేపియన్స్ మనుషులు  గా వికాసం చెందారు.  


కుమారుడు తల్లి చెప్పేది వింటూ స్తబ్దుగా ఉండిపోయాడు.


6 పరశురామ అవతారం: ఈ పరశురాముడు గండ్రగొడ్డలిని 

పట్టుకు తిరిగేవాడు. దీని వల్ల ఏం తెలుస్తుందంటే ఆదిమ మానవుడు వేటకు వాడే ఆయుధాలు 

తయారు చేసుకొన్నాడు. మరియు అడవులు, గుహలో నివసించే వాడు మరియు కోపిష్ఠి ఆటవిక న్యాయం కలిగినవాడు.


7 రామావతారం: మర్యాద పురుషోత్తముడైన రాముడు మొదటి ఆలోచన పరుడైన సామాజిక వ్యక్తి. అతను సమాజానికి నీతి నియమాలు . సమస్త కుటుంబ బంధుత్వానికి ఆది పురుషుడు.


 8 కృష్ణ పరమాత్మ అవతారము. రాజనీతిజ్ఞుడు, పాలకుడు, ప్రేమించే స్వభావి. అతడు సమాజ  నియమాలను 

ఏర్పరిచి వాటితో ఆనందాన్ని ఎలా పొందాలో తెలిపినవాడు. వాటితో సమాజములో వుంటూ సుఖ దుఃఖ లాభ నష్టాలు అన్ని నేర్పినవాడు.


కొడుకు ఆశ్చర్యం, విస్మయంతో వింటున్నాడు. ఆ తల్లి తన జ్ఞాన గంగా ప్రవాహాన్ని కొనసాగిస్తూ


9 బుద్ధ అవతారం:  ఆయన నృసింహ అవతారం నుండి మానవుడిగా మారిన క్రమంలో మర్చిపోయిన తన  సాధు స్వభావాన్ని వెతుక్కొన్నాడు. ఇంకా అతను మనిషి తన జ్ఞానాన్ని వెతుక్కొంటూ చేసే ఆవిష్కరణలకు మూలం. 


10కల్కి అవతారం:  అతను నీవు  ఏ మానవునికై  వేతుకుతున్నావో  అతనే ఇతను. అతను ఇప్పటివరకు వారసత్వంగా వచ్చిన వాటికంటే ఎంతో గొప్ప శ్రేష్ఠమైన వ్యక్తిగా వెలుగొందుతాడు.


కుమారుడు తన తల్లివంక అవాక్కయి చూస్తున్నాడు. అప్పుడు ఆ కుమారుడు ఆనంద భాష్పాలతో అమ్మా! 

హిందు ధర్మం ఎంతో అర్థవంతమైన  నిజమైన ధర్మం. అని అన్నాడు,


ఆత్మీయులారా!

మన వేదాలు, గ్రంథాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇత్యాది అన్నీ ఎంతో అర్థవంతమైనవి. కానీ మనం 

చూసే దృష్టి కోణం మారాలి. మీరు ఎలా అనుకొంటే అలా వైజ్ఞానికమైనవి కావచ్చు. లేదా ధర్మ పరమైనవి

 కావచ్చు. శాస్త్రీయతతో కూడిన ధర్మాన్ని నేడు మూఢాచారాలు పేరిట మన సంస్కృతిని మనమే అపహాస్యం చేసుకొంటున్నాం. 


ఇకనైనా మేలుకోండి. ఋషులు ఏర్పరచిన సనాతన ధర్మాన్ని పాటించుదాం.🙏


అమ్మ అందరిని చల్లగా చూడమ్మా 🙏

మనసెరిగిన మాధవుడు

 మనసెరిగిన మాధవుడు.. 


         గుడి తలుపులు తెరచుకుంటూ లోపలకు వెళ్లాడు పూజారి. చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. ప్రకృతికి కూడా కారణం తెలిసినట్లుంది. నిశ్శబ్దంగా ఉంది. 

              ఈ రోజే స్వామి సేవాభాగ్యానికి ఆఖరి రోజు అన్న ఆలోచనే అతనికి భరించరానిదిగా ఉంది. భార్యాబిడ్డలకు ఎలా నచ్చచెప్పాలో  తెలియడం లేదు. తన బాధ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. అతని గోడు వినే వారెవరూ?

              నిజానికి ఇందులో ఎవరి తప్పిదమూ లేదు. ఎవరికీ అతనంటే ఎవరికీ వ్యతిరేకత లేదు. కాలానుగుణంగా వచ్చిన వృద్ధాప్యమే అతని పాలిట శాపంగా మారింది. 

             మెల్లిగా పుష్పాలను కృష్ణుని పాదాల దగ్గర ఉంచి కన్నీళ్ళతో తలను పాదాల మీద ఉంచాడు. తనను తాను నిగ్రహించుకుంటూ పూజ చేయసాగాడు. హారతి ఇచ్చే సమయం వచ్చింది. పూజా విధులన్నీ అయిపోయాయి. ఇక ఆలయానికి తాళం వేయాలి. రేపటినుంచి తాను రాలేడు అన్న విషయం గుర్తుకొచ్చి వెక్కివెక్కి ఏడ్చాడు.


                 ఇంతకీ ఆ వృద్ధ పూజారి మనోవ్యధకు కారణమేమిటి?  దాదాపు ముప్పయి ఏళ్లుగా ఎంతో భక్తి శ్రద్ధలతో చిత్తశుద్ధితో శ్రీ కృష్ణునికి సేవలందించాడు. అతని జీవితమే కృష్ణమయం అయ్యింది. ఎవ్వరి నోట విన్నా అతని దివ్యభక్తి గురించే చెపుతారు. 


                  అయితే కాలానికి అందరూ తలవంచ వలసిందే కదా!. పూజారికి వృద్ధాప్యంవల్ల గూని వచ్చింది. దానితో స్వామి మెడలో పూలమాలలు వేయాలన్నా, ముఖానికి తిలకం దిద్దాలన్నా గూనితనం వల్ల చేయలేకపొతున్నాడు. అందుకే కమిటీ వారు  అతని కుమారునికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ రోజే అతని సేవలకు చివరిరోజు!. అదీ అతని వ్యధకు కారణం!!.

                   ఓ కృష్ణా! ఇదే నా ఆఖరి పూజ. ఇన్నేళ్ళకాలంలో నా వల్ల తెలిసిగాని, తెలియక గాని, అపరాధం జరిగి ఉంటే నన్ను క్షమించు. నీకు పూలమాలలు వేయలేకున్నాను. నుదుట తిలకం దిద్దలేకున్నాను. నువ్వే సర్దుకుపోయావు. ముసలితనం వల్ల నీ సేవకు దూరం అవుతున్నా. నేను నిస్సహాయున్ని!! నన్ను మన్నించు కృష్ణా! అంటూ కన్నీటితో వీడ్కోలు పలికి  ఆలయానికి తాళం వేసి భారమైన మనస్సుతో ఇంటి ముఖం పట్టాడు. తెల్లవార్లూ అతనికి నిద్రపట్టలేదు.చెప్పలేని బాధ అతన్ని స్థిమితంగా ఉండనీయలేదు. 


                తెల్లారింది!. కుమారుడు ఆలయానికి వెళ్లాడు. అప్పుడు జరిగింది అద్భుతం! నిజంగానే అద్భుతమే జరిగింది!!!.


               కుమారుడు బిగ్గరగా అరుస్తూ," నాన్నగారూ ! అద్భుతం జరిగింది. అద్భుతం జరిగింది!" అని నోట మాటరాక ఆయాసపడుతున్నాడు. వృద్ధ పూజారి ఆశ్చర్యపోతూ,ఆలయానికి వచ్చి చూస్తే నిలబడి ఉన్న కృష్ణ విగ్రహం కూర్చోని ఉంది. అతని ప్రాణానికి ప్రాణమైన మాధవుడు మందస్మిత వదనంతో కూర్చోని అతనితో సేవలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 


                     తనతో సేవలు చేయించుకోవడానికి వీలుగా స్వామి తన భంగిమను మార్చుకున్నాడని అర్ధమవగానే ఆ వృద్ధుడు తన వయస్సు మర్చిపోయి  విగ్రహాన్ని అల్లుకుపోయాడు. తన జన్మ సార్థకమైనదని ఆనందంతో కన్నీరు పెట్టసాగాడు.


                      భక్తి అంటే అదే కదా! తనకు తాను సంపూర్ణంగా స్వామి చరణాలకు సమర్చించుకోగలగడమే కదా!. అలాంటి వారి పట్ల మాధవుడు కరుణ చూపడంలో ఆశ్చర్యం ఏముంది!.


                     ఇది పూరి జగన్నాథుని క్షేత్రానికి దగ్గరలోని సాక్షి గోపాలుని మందిరంలో జరిగిన వాస్తవ సంఘటన. భగవంతుడు భక్తులపై చూపే కరుణకు ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.

                     ఓం మాధవాయ నమః

ఋష్యశృంగుడు

 మన మహర్షులు- 10

ఋష్యశృంగుడు

🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷


ఋష్యశృంగ మహర్షి గురించి రామాయణము లోని బాల కాండము లో వివరించబడింది.


 దశరథుని మంత్రి అయిన సుమంతుడు ఋష్యశృంగుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు


.కశ్యప ప్రజాపతి కుమారుడైన విభాండకుడు అనే మహర్షి పుత్రుడే మన ఋష్యశృంగ మహర్షి. ఋష్యశృంగునికి సకల విద్యలు, వేదాలు, వేదాంగాలు, యజ్ఞయాగాది క్రతువులు తానే గురువై, 

విబాండక మహర్షి నేర్పుతాడు.


 ఋష్యశృంగుడు బాహ్యప్రపంచము అంటే ఏమిటో తెలియకుండా పెరిగాడు. అలా పెరిగిన ఋష్యశృంగునికి లోకములోని స్త్రీపురుష తారతమ్యములు తెలియవు. విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. ఆ ఋష్యశృంగుడు జ్వలిస్తున్న అగ్ని గుండము వలె ఉండేవాడు.


అంగరాజ్యాన్ని రోమపాదుడు అనేరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ధర్మము తప్పి ప్రవర్తించిన కారణమున ఆ అంగ రాజ్యంలో వర్షాలు పడడం మానేసి అనావృష్టి తో క్షామము వస్తుంది. అప్పుడు ఆ మహారాజు దీనికి పరిష్కారముగా ఏమి చెయ్యవలెననని తన మంత్రులను అడుగగా, వారు ఋష్యశృంగుడిని రాజ్యములోకి రప్పిస్తే రాజ్యములో వర్షాలు పడాతాయి అని మంత్రులు సలహా చెబుతారు.


రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుడు తండ్రి సంరక్షణలో పెరుగుచున్నాడని, విషయ సుఖాలంటే తెలియవని, అందువలన ఋష్యశృంగుని రప్పించటం దుర్భేద్యమైన కార్యమని, దానికి తరుణోపాయంగా అందమైన స్త్రీలను ఋష్యశృంగుడు ఉండే ఆశ్రమం వైపు పంపిస్తాడు.


 ఆ స్త్రీలు ఆశ్రమానికి దగ్గరగా చేరుకొని అక్కడ పాటలు పాడుతూ నాట్యాలు చేస్తారు. ఆ శబ్దాలకు ఋష్యశృంగుడు అక్కడకు వస్తాడు. వారు ఋష్యశృంగుడిని చూసి విభండక మహర్షి ఆశ్రమములో లేడని తెలుసుకొని ఋష్యశృంగుడి ఆశ్రమానికి చేరుతారు. విషయసుఖాలంటే తెలియని , స్త్రీపురుష భేదము తెలియని ఋష్యశృంగుడు వారికి ఆర్ఘ్యపాద్యాలిచ్చి పూజిస్తాడు. వారికి తేనె ఇస్తాడు. వారు అది సేవించి, ఋష్యశృంగుడికి తాము తీసుకొని వచ్చిన పిండివంటలు పెడతారు. ఋష్యశృంగుడు వాటిని ఫలాలు అని సేవిస్తాడు. 


వారితో చెలిమి ఏర్పడి  వారివెంట అంగదేశములో అడుగు పెడతాడు. అతడు అడుగు పెట్టిన వెంటనే అంగదేశంలో వర్షము పడుతుంది.


కపటనాటకము ద్వారా ఋష్యశృంగుడిని తీసుకొని వచ్చిన విషయాన్ని ఆయన తండ్రి అయిన విభండక మహర్షికి చెప్పి ఆయన నుండి అభయాన్ని కోరుకొంటారు.


 రోమపాదుడు తన కూతురైన శాంత ను ఋష్యశృంగుడికి కిచ్చి వివాహం జరిపిస్తాడు


ఋష్యశృంగుడు దశరథుడికి పుత్రసంతానం  కోసం అశ్వమేధయాగం, పుత్రకామేష్టి చేయించాడు. కులగురువయిన వసిష్ఠ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి శాస్త్రోక్తంగా చేయించాడు ఋష్యశృంగుడు. ఆ అగ్నిహోత్రంలోంచి ఒక దివ్య పురుషుడు వచ్చి ఒక బంగారు పాత్రలో పాయసాన్ని ఇచ్చి దశరథుణ్ణి ఈ పాయసం నీ భార్యలకు ఇస్తే సంతానం కలుగుతుందని చెప్పాడు. పాయసాన్ని నలుగురు భార్యలకు తినిపించి శ్రీరామ భరత లక్షణ శత్రుఘ్నులనే నలుగురు కొడుకుల్ని పొందాడు దశరథుడు. పరమపవిత్రమైన యాగాన్ని పూర్తిచేయించి ఋష్యశృంగుడు భార్య శాంతను తీసుకుని తన తండ్రి విభాండకుడి ఆశ్రమానికి వెళ్ళిపోయాడు


 తర్వాత ఋష్యశృంగుడు ద్వాదశ వార్షిక యజ్ఞం చేశాడు.


ఋష్యశృంగుడు రాసిన గ్రంథం “ఋష్యశృంగ స్మృతి" అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. దానిలో ఆచారం, శౌచం, శ్రాద్ధం, ప్రాయశ్చిత్తం మొదలయిన వాటి గురించి రాయబడి ఉంది. 


ఋష్యశృంగుడి దేవాలయము ఇప్పటి శృంగేరి కి 10 మైళ్ల దూరములో కిగ్గా అనే గ్రామములో ఉంది. ఈ ఆలయం లో శివలింగానికి శృంగం ఉండడం గమనించవచ్చు..ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.ఇప్పటికి తీవ్ర క్షామం అనుభవిస్తున్న ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి జగద్గురువుల ఆదేశాల మేరకు పూజలు చేస్తూవుంటారు...వారి ప్రాంతాలు చక్కగా వానలు పడి సుభిక్షమవుతాయి...


🌸జై శ్రీమన్నారాయణ🌸


🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹