11, జూన్ 2023, ఆదివారం

సర్వభూత గణామేయ సౌహార్దాయ

 

సర్వభూత గణామేయ సౌహార్దాయ

                ➖➖➖✍️


```శ్రీమఠంలో ప్రతిరోజూ సాయంత్రం, ఏనుగులకు బెల్లం కలిపిన అన్నాన్ని పెద్ద పెద్ద ముద్దలు బంతులుగా పెట్టడం అలవాటు. మావటి ఆ అన్నం ముద్దలను చేతిలోకి తీసుకుని, నేరుగా ఏనుగు నోట్లో పెట్టేవాడు.


ఒకరోజు ఏనుగులకు అన్నం పెట్టే సమయంలో పరమాచార్య స్వామివారు మామూలుగా అటువైపు వచ్చారు. ముద్దలుగా చేసిన అన్నాన్ని చూశారు. దగ్గరలోనే ఉన్న సహాయకునితో, “ఈ అన్నం ముద్దలను ఏనుగుకు తినిపించవద్దు అని మావటికి చెప్పు” అని చెప్పి వెళ్ళిపోయారు.


వెంటనే మేనేజరుని పిలిచారు స్వామివారు.


“ఏనుగుకు పెట్టే అన్నాన్ని సరిగ్గా ఉడికించలేదు. పొడిగా, తరకలుగా విరిగిపోతోంది. ఇంత అశ్రద్ధతో, ఇలా దానికి ఆహారం పెట్టరాదు. అది మాటలురాని ఒక జంతువు, దానికి ఇలా సగం ఉడికిన అన్నం పెడతారా? మావటికి చెప్పు. ఈ ఏనుగుకు పెట్టే ఆహారం సాక్షాత్ గజముఖునికి పెట్టే నైవేద్యం లాగా ఉండాలి. అంత భక్తి ఉండాలి. అంత శ్రద్ధ ఉండాలి. మరలా అన్నం వండి, ఏనుగుకు పెట్టండి” అని చెప్పారు.


మాటలురాని ఒక జంతువుపై స్వామివారికి ఉన్న కారుణ్యాన్ని చూసి శిష్యులు కరిగిపోయారు.


మహాస్వామి వారు ఆ అన్నం ముద్దల్ని చేతిలోకి తీసుకుని పరిశీలించలేదు. అంతెందుకు, అసలు ఒక్క క్షణం అక్కడ నిలబడి వాటివైపు కూడా చూడలేదు. మరి అది సరిగ్గా ఉడకలేదని, తరకలుగా అయిపోయిందని స్వామివారికి ఎలా తెలుసు?


ఇంత చిన్న విషయాల్లో కూడా స్వామివారు తమ సర్వజ్ఞత్వాన్ని చూపేవారు.✍️```


--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్-దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


https://t.me/paramacharyavaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వాల్మీకి రామాయణం:

 27.

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


             వాల్మీకి రామాయణం:

                   27 వ  భాగం:

                  ➖➖➖✍️



అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయికి స్వయంగా తానే ఈ శుభవార్త చెప్పాలని కైకేయి మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలో కైకేయి ఎక్కడా కనపడలేదు. 


కైకేయి కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. 


దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయి నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు...

"కైకేయ, నీకు ఏమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతోంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటే చెప్పు, తప్పక తీరుస్తాను.”


అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |

దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||


ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైకా. నీ కోరికేంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను" అన్నాడు.


“నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను” అని కైకేయి అంది.


అప్పుడు దశరథుడు "ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైకా, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను" అన్నాడు. 


అప్పుడా కైక..."రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా,పగటి దేవతలారా, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులారా, మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని...


అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః |

అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |

నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |

చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |

భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||


"ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి" అని అంది.


(త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమంది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయిని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయి అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)


అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయి కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు...

"ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు? గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైకా, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైకా, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.


రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దగ్గరకు వచ్చి, “మామగారూ నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు” అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మాంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, “ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము” అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడూ సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.


ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని అడిగితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్నా నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, ‘నాన్నా! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను’ అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయి పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయి పక్కకు జరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.✍️

రేపు...28వ భాగం...


                      🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

    


🍀

శివభక్తుడు

          *శివభక్తుడు...*

          *అమర్నీతి నాయనారు.*

                  ➖➖➖✍️


అమర్నీతి నాయనారు చోళరాజ్యమున ప్రసిద్ధినందిన పజైయ్యరాయికి చెందిన 

వైశ్య కులజుడు. ఆ గ్రామం చాలా సారవంతమైనది. చుట్టూ తోటలతో లతలతో పచ్చగా శోభాయమానంగా ఒప్పుతూండేది. 


*అమర్నీతి నాయనారు* బంగారం, 

రత్నాలు, పట్టు వస్త్రముల వ్యాపారి. విదేశాలనుండి వస్తువులను తెప్పించి వ్యాపారం చేస్తుండేవాడు. ఆయన ఆర్జన ఎంతో నీతిమంతముగా ఉండేది. 

వ్యాపారం కలిసి రావడంతో మంచి ధనవంతుడయ్యాడు. 


వ్యాపారము చేస్తున్నా, ఇహలోక వ్యాపకాలున్నా, నాయనారు మనసు 

శివుని మీదే వుండేది. పరమశివ 

భక్తుడు. శివభక్తులను తన గృహమునకు పిలిచి వారిని అర్చించేవాడు. వారలకు కౌపీనము, దుస్తులు మొదలగునవి ఇచ్చి, సుష్టుగా భోజనము పెట్టి, ఏమైనా కానుకలు ఇచ్చి, వారు సంతసించునట్లుగా చేసి సాగనంపేవాడు.


పండుగలలో పబ్బాలలో తిరునల్లూరు దేవాలయమునకు దైవ దర్శనమునకు వెళ్లేవాడు. అక్కడ శివుని ముందు భావయుక్తంగా పంచాక్షరిని జపిస్తూ 

శివుని అర్చించేవాడు. 


కొన్నాళ్లకి పండుగలకు మాత్రమే తిరునల్లూరు దేవాలయమునకు వెళ్ళటంతో సంతృప్తినందక - ఆ వూరిలోనే నివసిస్తే - నిరంతరము శివ దర్శనము చేయవచ్చని, శివభక్తుల సేవకు వీలవుతుందని తలచి - తిరునల్లూరుకు తన బంధువులతో సహా వెళ్లి, అక్కడే స్థిరపడి - దైవదర్శనమునకు వచ్చెడి శివభక్తులకు వుండుటకు వీలుగా ఒక మఠం కట్టించాడు. 


ప్రతి దినము వారిని తన ఇంటికి పిలిచి, వారలకు కౌపీనము మొదలగునవి ఇచ్చి సంతసింపజేసేవాడు.



నాయనారు భక్తితత్పరతకు పరమశివుడు పరవశించి పోయాడు. ముఖ్యముగా కౌపీనములను ఇచ్చుచుండుట, శివభక్తులయెడ వాత్సల్యము, ఔదార్యము శివుని ఆకర్షించినవి. 


అతని ఔదార్యాన్ని అందరిచేత ప్రశంసింపజేయాలని, అతనికి తన శుభాశీస్సులను ఇయ్యటానికి శివుడు నిశ్చయించాడు. 


అందుకని ఒకరోజున బ్రహ్మచారి వేషంతో జటతో, విభూతి పుండ్రములు, భుజం మీద దండంతో శివుడు అమర్నీతి నాయనారు మఠంకి విచ్చేశాడు. బ్రహ్మచారి దండానికి చివర 2 కౌపీనములు, విభూతిసంచి కట్టబడి వున్నాయి. ఆయన ముఖం తేజోవంతంగా ఉంది. కళ్లు ప్రకాశమానంగా వున్నాయి. 

ఠీవిగా మఠంలోకి ప్రవేశించాడు. 


అమర్నీతి నాయనారు పరమానందంతో అతిథిని ఆహ్వానించి అర్చించాడు. 



బ్రహ్మచారి - అమర్నీతి నాయనారుతో, "మీరు మహాత్ములు. ప్రతి ఒక్కరు మీ దానాలకి, ముఖ్యముగా కౌపీనముల దానాలకు మిమ్మలను అభినందిస్తున్నారు. మీ దర్శనానికి వచ్చాను." అని అన్నాడు. 


అమర్నీతి నాయనారు - బ్రహ్మాచారిని తన వద్దనుండి బిక్షను స్వీకరించవలసిందిగా అర్థించాడు. బ్రహ్మచారి ఒప్పుకొని, "నేను నదికెళ్లి స్నానము చేసి నిత్యకర్మానుష్టానము చేసి వస్తాను. వర్షము వస్తోంది. వర్షమునకు నా కౌపీనములు తడిసిపోయాయి. అందుకని ఈ పొడి కౌపీనమును జాగ్రత్త పరచండి. నేను వచ్చి తీసుకుంటాను. అది చాలా విలువైంది, ప్రత్యేకమైనది గూడ. అందుచే దానిని భద్రముగా ఉంచండి" అని చెప్పి స్నానానికి నదికి వెళ్లాడు.


బ్రహ్మచారి నదికి వెళ్లాడు. అమర్నీతి నాయనారు ఆ కౌపీనమును భద్రపరిచాడు. పరమశివుడు దానిని మాయం చేశాడు. 


బ్రహ్మచారి స్నానము చేసి వచ్చి, తన పొడి కౌపీనమును ఈయమని కోరాడు. తన రెండో కౌపీనము వానకు తడిసిపోంది. అందుకని పొడిదానిని అడిగాడు. 


అమర్నీతి నాయనారుకు తాను భద్రపరచినచోట కౌపీనము కనిపించలేదు. అంతటా వెదికాడు. ఎక్కడా కనిపించలేదు. అందుకని వణుకుతూ బ్రహ్మచారికి ఇంకొక కౌపీనముతో నిలబడి పరిస్థితిని చెప్పాడు. 


బ్రహ్మచారి నాయనారు మాటలను అంగీకరించలేదు. వినలేదు. నాయనారు చాలాధనము దానికి బదులుగా యిస్తానన్నాడు. 


బ్రహ్మచారి, "ధనాన్ని నేనేమి చేసికొంటాను? అవసరం లేదు, నా అవసరం కౌపీనము మాత్రమే" అన్నాడు. బ్రహ్మచారి ఇంకా ఇలా అన్నాడు. "మీకు కౌపీనము కనిపించనిచో, నా ఇంకో కౌపీనమునకు సరితూగే వేరొక కౌపీనమును ఈయండి" అన్నాడు. 


అమర్నీతి నాయనారుకు కొంచెం స్వస్థత కలిగింది. వెంటనే త్రాసును తెప్పించాడు. బ్రహ్మచారి కౌపీనమును ఒక తక్కెటలో ఉంచాడు. రెండో తక్కెటలో తాను ఇవ్వదలచిన కౌపీనమును పెట్టాడు. బ్రహ్మచారి కౌపీనమే ఎక్కువ బరువు చూపింది. 


అమర్నీతి నాయనారు ఏమిపెట్టినను బ్రహ్మచారి కౌపీనమే బరువుగా కనిపించింది. అమర్నీతి నాయనారుకు ఆశ్చర్యము కలిగింది. ఇదంతా శివలీలయని గ్రహించాడు. తన సంపద యావత్తు బ్రహ్మచారి కౌపీనమునకు సరితూగలేదు. పరమ శివుని కౌపీనము వేదమును తలపింపజేస్తుంది. దాని పోగులు శాస్త్రాలు.


అమర్నీతి నాయనారుకు ఏమీ పాలుపోలేదు. బ్రహ్మచారి కాళ్లమీద పడ్డాడు. "స్వామీ! నన్ను, నా భార్యను, నా పుత్రుని గూడ మీ కౌపీనమునకు సమమవుతాయేమో తూచండి" అని అర్థించాడు. 


బ్రహ్మచారి అందుకు అంగీకరించాడు. అమర్నీతి నాయనారు తన కుటుంబముతో సహా తక్కెటలో కూర్చుంటూ, "నేను శివభక్తులను భక్తితో, చిత్తశుద్ధితో, సేవించుచున్నట్లయితే, ఈ త్రాసు ఇప్పుడు సరితూగుగాక" అన్నాడు. 


త్రాసు ఆశ్చర్యకరంగా సరితూగింది. అమర్నీతి నాయనారు పుణ్యం బ్రహ్మచారి కౌపీనమూనకు తుల్యమయింది. 


అచ్చట చేరిన ప్రజలందరూ ఆశ్చర్య చకితులయ్యారు. వారు అమర్నీతి నాయనారు పాదములపైబడి ప్రశంసించారు. దేవతలు ఆ కుటుంబముపై పారిజాత సుమ వృష్టి కురిపించారు. బ్రహ్మచారి అంతర్థానమైనాడు. పార్వతీపరమేశ్వరులు వృషభ వాహనముపై ప్రత్యక్షమై, నాయనారును అనుగ్రహించారు. పరమేశ్వరుడు అమర్నీతి నాయనారును ఉద్దేశించుచు, "నీ కౌపీన దాతృత్వము, శివభక్తుల నిరుపమాన సేవ మమ్మల్ని అలరించాయి. నీవు, నీ భార్య, నీ పుత్రుడు - ముగ్గురూ నా లోకంలో శాశ్వతంగా నివసించండి" అన్నారు. 


శివానుగ్రహం వల్ల తక్కెడ దివ్యవిమానంగా మారి, అమర్నీతి నాయనారును, అతని భార్యను, మఱియు అతని పుత్రుని శివలోకానికి చేర్చింది.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

తెలంగాణం

 తెలంగాణం.


ప్రకాశపు కాంతులీడిన  ప్రాంతాన

కమ్మిన చీకటిని చీల్చేను సమస్తాన

భారతమాత మోము చిరునవ్వున

ఆ నవ్వు చిందించేది తెలంగాణం.


పాడి పంటల రాశి దేశానికే వాసి

రైతు మోమున సంతోషాల హోలీ

నవ భగీరధుడి అద్బుత సృష్టి

నేల పారేను జలసిరుల తెలంగాణం.


ప్రజారోగ్యానికి అండగా నిలబడే

ఇంటింట కంటి వెలుగును చూపే

అడుగడుగునా సంక్షేమ ఫలం

ప్రజారాజ్యము మన తెలంగాణం.


ఆడబిడ్డకు అండగా నిలిచే

పుట్టిన శిశువుకి భద్రతా కిట్

పుస్తే సమయాన కళ్యాణ కానుక

మహిళకు భరోసానిచ్చే తెలంగాణం.


సరస్వతి బిడ్డలకు కొండంత అండ

విజ్ఞాన కాంతి విరజిల్లే రాష్ట్రమంత

విలాసిల్లే ఉత్పత్తి, ఉపాధి రంగం

విలక్షణ సంపద తెచ్చే తెలంగాణం.


కళ కళ లాడుతుందీ ప్రాంతం  

జల నడకన సిరి మోము వైనం

ఆసాంతం చూస్తుంది యావత్ దేశం

అభివృద్దికి దిక్సూచిగా తెలంగాణం.


పేద ప్రజల ఆత్మ గౌరవ జీవనం

డబుల్ బెడ్రూం ఇచ్చేను నివాసం 

ఇరుకు పోయి తెచ్చేను పదిలం 

గృహస్తుల ఆనందపు తెలంగాణం.


దళితుల అభివృద్ధికి దళితబంధు

చేతి వృత్తులకు ఆపన్న సాయము

కులమతాల మధ్య సామరస్యము

ఆధ్యాత్మిక ప్రాంతం తెలంగాణం.


కల్లోల కాలంలో రోగాలకు బెదరక

జనం మేలుగాంచి  చేసేను సేవన

ధీర్ఘ రోగులకు సి.యం.రిలీఫ్ ఫండ్

సమస్త ఆరోగ్య కాంక్షిచే తెలంగాణం.


మిషన్ కాకతీయ, భగీరధ పధకాలు

ఊరూరా సాగు నీరు, తాగు నీరు

ప్రతి ఇంట కులాయి నీటి ధారలు

అన్నింట పధకాల తెలంగాణం.


కల్లాల్లో సంతోషాల కనులు

ధరణిన తొలిగేను భూ సమస్యలు

ప్రతి పొలం గట్టును చేసేను భద్రం

నవ వ్యవస్థీకరణతో తెలంగాణం.


రంగమేదైనా ప్రోత్సాహ వైనం

పెరిగేను సాప్ట్వేర్ ఉద్యోగ రంగం

వనరులన్నీ పెంచే ఆదాయం

సంపద పెంచి పంచే తెలంగాణం.


కళలకు కళాకారులకు తోరణం

గానాలకు గాత్రాలకు ఆస్థానం

చిత్రమైన చిత్రాలకు నిలయం

కళామతల్లి సౌధం తెలంగాణం.


కారుచీకటి రోజులు పోయేను

పున్నమి కాంతులు తెచ్చేను

ముప్పై ఒక్క జిల్లాల సముదాయం

అధికార వికేంద్రీకరణ తెలంగాణం.


పాలనలో అభివృద్దే ముఖ్యం

ప్రజాక్షేమమే పాలకుల ధ్యేయం

ఎదురు చూస్తుంది యావత్ దేశం

రాజ్యానికే ఆదర్శం తెలంగాణం.


స్వయం పాలనలో పదేండ్ల రాష్ట్రం

సొంతమయ్యే ఆనంద ప్రాంతం

సౌభ్రాతృత్వ తత్వం  సకల జనం

సుజల సుఫల సురక్ష తెలంగాణం.


తెలంగాణా రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలతో...


సాహిత్య దినోత్సవం.


అశోక్ చక్రవర్తి. నీలకంఠం.

9391456575,


33-54, టి.యస్.ఆర్ నగర్,

బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్

బాలాపూర్ మండలం, 

రంగారెడ్డి జిల్లా, తెలంగాణా.

దేహం తండ్రి ప్రసాదం*

 

          *దేహం తండ్రి ప్రసాదం*

                  ➖➖➖✍️



*’దేహం తండ్రి ప్రసాదం’ అని వేదం స్పష్టంగా చెప్పింది.*


*‘పురుషే హవా అయిమదితో గర్భో…’ అని మొదలయ్యే ఐతరేయ మంత్రం- శుక్రం రూపంలో, అంటే వీర్యంగా పురుషుడు  స్త్రీ యందు ప్రవేశించడం వల్ల దేహధారణ జరుగుతుందని వివరించింది.*


*తండ్రి బింబం అయితే, తనయుడు ప్రతిబింబమని దీని అర్థం.*


*తండ్రి మాటను నిలబెట్టడం కోసం రాముడు చేసిన అపూర్వ త్యాగాన్ని రామాయణం విస్తారంగా చర్చించింది.*


*తండ్రి యయాతికి తన యౌవనాన్నే ధారపోసిన పూరుడి కథను భాగవతం వర్ణించి చెప్పింది.*


*తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి చివరికంటా బ్రహ్మచర్యం పాటించిన భీష్మ పితామహుడి గాథను భారతం వివరించింది.*


*‘పుత్ర శబ్దానికి – తన మంచి పనులతో ప్రీతి కలిగించేవాడు, పితృభక్తి గలవాడు మాత్రమే అర్హుడు’ అని మన పెద్దలు నిర్వచించారు.*


*‘భార్య, భర్త అనే రెండు తాళ్లు ముడివేస్తే, ఆ ముడి- సంతానం’ అంటాడు భర్తృహరి.*

*దాన్నే ‘సుతాకారపు ముడి’ అని చెబుతారు.*


*అది పేగు బంధం. ఆ బంధం శిథిలమైతే బతుక్కి అర్థం ఉండదు.*


*వృద్ధులైన తల్లిదండ్రులను కావడిలో స్వయంగా మోస్తూ తీర్థయాత్రలకు తిప్పిన ‘శ్రవణ కుమారుడు’ …*


*అనుక్షణం తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాచుకున్న ‘ప్రవరాఖ్యుడు’ …*


*అమ్మ ఆర్యమాంబకు ఇచ్చిన మాట కోసం సన్యాస దీక్ష నుంచి దిగివచ్చి అమ్మకు అంత్యక్రియలు నిర్వహించిన శంకరులు …*


*ఇలాంటివారే పుత్ర శబ్దానికి అర్హులు.*


*అంతేకాని- వృద్ధులైన అమ్మానాన్నలను సేవించడం కంటే, వృద్ధాశ్రమాల్లో పెట్టి పోషించడం సౌకర్యంగా ఉంటుందనుకునేవాళ్లు, పుత్రులు అనిపించుకోరు.*


*అమ్మను ఇంట్లో ఉంచుకుందాం దేనికైనా ‘పని’ కొస్తుందని, అమ్మానాన్నలను విడదీసేవారికి ‘తల్లిదండ్రులు’ అనే పదం గురించి బొత్తిగా తెలియదని అర్థం.*


*ఆ పదం సమాసరీత్యా ద్వంద్వమే కానీ, స్వభావరీత్యా ఏకవచనమే!*


*కాబట్టే విగ్రహవాక్యం – ‘ తల్లియును తండ్రియును ’ అంటూ ఏకవచనంలో చెప్పాలంది వ్యాకరణ శాస్త్రం.*

*‘వారు ఇద్దరు కారు, ఒక్కరే’ అనే భావనను మనలో పెంపొందించడానికే – భారతీయ తత్వచింతన అర్ధనారీశ్వర తత్వాన్ని ప్రతిపాదించింది.*


*కుటుంబ వ్యవస్థకు, గృహస్థుధర్మ నిర్వహణకు ఆధారపీఠాలుగా నిలిచిన నాలుగు మూల స్తంభాల్లో ‘మాతృదేవోభవ’ ‘పితృదేవోభవ’ లను మొదటి రెండుగా చెబుతారు.*


*వీటిలో అమ్మకు- పెరట్లో తులసి మొక్క గూట్లో కాంతులీనే ప్రమిద దీపం ప్రతీక!*


*ఇంటి వాకిటా వికాసాన్ని వెదజల్లే వీధిగడప దీపం నాన్నకు ప్రతీక!*


*లోకంలో అమ్మలపై వచ్చినంత కవిత్వం నాన్నల గురించి రాకపోవడంలో విచిత్రం ఏమీ లేదు.*


*అమ్మ ప్రేమ పారదర్శకం, నాన్న ప్రేమ గుంభనం కావడమే దానికి కారణం. అమ్మది ఆప్తవాక్యం, నాన్నది గుప్తధనం!*


*అమ్మ ప్రేమలో వైశాల్యం ఎక్కువ. నాన్న ప్రేమకు లోతెక్కువ.*


*ఆత్మీయత, వాత్సల్యం వంటి విషయాల్లో ఇద్దరి స్వభావాలూ ఒక్కటే అయినా- నాన్న అంత తొందరగా బయటపడడు కాబట్టి, అమ్మతో ఉన్నంత చనువు నాన్నతో లేకపోవడం లోక సహజం!*


*అమ్మ జన్మదాత, నాన్న జీవనదాత. పిల్లలకు రక్షణ, పోషణ విషయంలో నాన్నే ఆలంబన.*


*శ్రమ విషయంలో కొడుకు తనకన్నా తక్కువ కష్టాలతో గట్టెక్కాలని, స్థాయి విషయంలో తనకన్నా చాలా ఎత్తుగా ఉండాలని తపన పడని తండ్రి ఉండడు. దానికోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడటం నాన్న లక్షణం !!*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏



జన్మ లక్ష్యం…*

 100623j1913.      120623-6.

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


        *మానవ జన్మ లక్ష్యం…*

              *బ్రహ్మ జ్ఞానం!*

                ➖➖➖✍️


*మన జన్మ లక్ష్యం బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడం, జన్మను సార్ధకత చేసుకోవడం..!*


*విశ్వమంతా బ్రహ్మం ఉంది, బ్రహ్మం తప్ప మరేమీ లేదు.*

*అయినా, అది ఎక్కడ చూసినా కనిపించదు, వినిపించదు.*


*బ్రహ్మం - సత్యం - జ్ఞానం - అనంతం..!*

*ఇదీ ఉపనిషత్తులు ఇచ్చిన అర్థం. బ్రహ్మం అంటే సత్యం,*

*సత్యం అంటే జ్ఞానం,*

*జ్ఞానం అంటే అనంతం...*

*అంటే.. ఇవేవీ వేర్వేరు కాదు. అన్నీ ఒకటే.*


*స పర్యగా చ్ఛుక్రమకాయ మవ్రణమ్ అస్నావీరమ్ శుద్ధమపాపవిద్ధమ్ కవిర్మనీషీ పరిభూః స్వయమ్భూః యాథాతథ్యతోర్థాన్ వ్యదధాచ్ఛాశ్వతీభ్యః సమాభ్యః*


*ఎవరైతే బ్రహ్మ జ్ఞానం పొందుతారో వారు బ్రహ్మన్(పరమాత్మ) స్థాయికి చేరుతారు.        బ్రహ్మన్ అంటే పరమాత్మ, ఆయన 'చ్ఛుక్రమ్' పరిశుద్ధమైనవాడు, స్వచ్చమైన వాడు.*

*జీవుడు ముక్తి పొందాక కర్మ తొలగి ఇలాంటి స్థితిని పొందుతాడు.*

*పరమాత్మ దయ వల్లే ఇది లభించాలి తప్ప మరొక మార్గం లేదు.*


*'అకాయమ్' ఆయన దేహం లేనివాడు, అంటే మన వంటి మురికి స్రవించే పాంచభౌతిక దేహం కాదు, ఆయనది పంచ ఉపషణ్మయ దివ్య మంగళ విగ్రహం.*

*'అవ్రణమ్' రోగాలు, వ్యాధులు అంటని శరీరం.*


*'అస్నావీరమ్'.. ప్రేగులు నరాలు ఉండే దేహం కాదు. కనుక 'శుద్ధమపాపవిద్ధమ్' ఆయన దేహం పాప పుణ్యాలకు అతీతమైనది.*


*పరమాత్మ తత్త్వాన్ని ఎవడైతే గుర్తిస్తాడో వాడూ అట్లాంటి స్థితినే పొందుతాడు. వాడు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టు దర్శించగలుగుతాడు.*

*కర్మ తొలగుతుంది కాబట్టి అట్లాంటి స్థితి ఏర్పడుతుంది, కర్మ వల్ల ఏర్పడ్డ శరీరానికి హద్దులు ఎన్నో.   మనం కంటితో అన్నింటినీ గుర్తించగలమా? మన ఇంద్రియాలకు, ఊహకు ఉన్న శక్తి సంకుచితమైనది.*


*ముక్తి పొందిన జీవుడికీ పరమాత్మ మాదిరిగా జ్ఞానం అంతటా విస్తరించి వుంటుంది. సూక్షమైన జ్ఞానం కలిగి ఉంటాడు.*

*వాడు జ్ఞానం కోసం తపిస్తూనే ఉంటాడు. వాడి మనస్సు పూర్తి నియంత్రణలో ఉంటుంది.*

*వాడికీ కోరికలు ఉంటాయి, కానీ అవి పరమాత్మ మయమై ఉంటాయి. భగవంతుని సేవ చేయాలని కోరిక ఉంటుంది. వాడికీ కోపం ఉంటుంది, ఇతరత్రమైన విషయాల యందు.* 

*అట్లాంటి వాడికి మరణం అనేది ఉండదు, ఆ స్థితినుండి దిగజారడం అనేది ఉండదు. కర్మ బంధాలు తొలగి భగవత్ అనుభవాన్ని ఎప్పటికీ అనుభవిస్తూ ఉంటాడు.*


*గురువు మనకు ఇది చెప్పాలంటే.. మనకు నాలుగు అర్హతలు కావాలి. 1. వైరాగ్యము. 2. వివేకము. 3. శమ, దమ, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం  అనే ఆరు సంపదలు 4. ముముక్షత్వం.. ఈ 4 మీలో ఉంటే.. గురువు మిమ్మల్ని పరీక్ష చేసి బ్రహ్మజ్ఞానం బోధిస్తాడు.* 


*వరుణుడు తన కొడుకైన భ్రృగువును, ఎన్నో రకాలుగా పరీక్ష చేసి బ్రహ్మ జ్ఞానం తెలుసుకోనేటట్టు చేస్తాడు.*


*నిజానికి బ్రహ్మజ్ఞానం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందనే విషయం చెప్పలేం. ఒక్క ఘడియలో రావచ్చు. ఒక్క రోజులో రావొచ్చు. ఒక్క సంవత్సరంలో రావొచ్చు. ఒక్క జన్మ కావొచ్చు. కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఇదే బ్రహ్మ విద్య. బ్రహ్మ జ్ఞానం రావడం కాదు. మీరే బ్రహ్మంగా మారిపోతారు. మారడమేకాదు. అసలు మీరెప్పుడూ బ్రహ్మ గానే ఉన్నారు - అని తెలుసుకొంటారు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺

దిలీపుడు

 *రఘు వంశం ...*


                 *దిలీపుడు!*

                 ➖➖➖✍️


*శ్రీరాముని తండ్రి దశరధుడు! మరి దశరధుని తండ్రి అజుడు!అయితే అజుని తండ్రి రఘు మహారాజు!*

*సరే, రఘు మహారాజు తండ్రి దిలీపుడు!*

*అంటే దిలీపుని మునిమనవడే శ్రీరాముడు!*

*సూర్య వంశానికే వెలుగు తెచ్చిన వాడు దిలీపుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్నా కడుపున పుట్టిన వారు లేరు. దానికీ కారణం ఉంది. ఇంద్రలోకం వెళ్ళి దేవేంద్రుణ్ని దర్శించి వస్తున్నాడు దిలీపుడు. ధర్మ సంరక్షణ కోసం భార్య సుదక్షిణాదేవి దగ్గరకు వెళ్ళే తొందరలో కానవచ్చిన కామధేనువును పూజించడం మరిచిపోయాడు. అవమానంగా భావించిన కామధేనువు శపించింది. సంతానం లేకుండా అయిపొమ్మని. ఐరావత ఘీంకారం వల్ల ఆ మాట దిలీపునికి వినిపించలేదు.* 


*ఇవేవీ తెలియక పిల్లలు లేరని దుఃఖంతో రాణీ సమేతుడై వశిష్ఠుని ఆశ్రయించాడు.*


*వసిష్ఠుడు దివ్య దృష్టితో శాపమూలం తెలుసుకున్నాడు. కాని కామధేనువు పాతాళ లోకంలో ఉండడంతో – తన ఆశ్రమంలో ఉన్న “నందినీ ధేనువు”ని సేవించమన్నాడు. అలా సేవిస్తే సంతానం కలుగుతుందనన్నాడు.*


*దిలీపుడు సర్వ సుఖాలూ వదిలి గోవుల కాపరి అయ్యాడు. నందినీ సేవకుడయ్యాడు. సతీసమేతంగా ఆ గోవుని కన్న బిడ్డకన్నా ఎక్కువ మమకారంతో చూసుకున్నారు.* 


*అలా ఇరవై రోజులు గడిచాయి. నందిని కూడా రాజ దంపతులను గమనిస్తూనే ఉంది.*


*ఒకరోజు నందిని కావాలని దారి తప్పింది. మేస్తూ మేస్తూ హిమవత్పర్వతమున్న ప్రాంతం చేరింది. ఒక గుహలోకి దూరింది. వెన్నంటే ఉన్న దిలీపుడు పరిసరాల ప్రకృతి అందాలకు మైమరచి పోయాడు. సింహపు గాండ్రింపు విని ఉలిక్కి పడ్డాడు. గృహలోకి చొరబడ్డాడు. అప్పటికే నందిని మీదకి సింహం ఉరికింది.*


* దిలీపుడు క్షణాల్లో బాణాన్ని అందుకోబోయి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఎందుకంటే సింహం మనిషిలా మాట్లాడడం మొదలు పెట్టింది.*


*ఆ పరిసర ప్రాంతాల రక్షకుడిగా శివకింకరుడిగా చెప్పుకుంది. అక్కడకు వచ్చిన జంతువులను చంపితినే అధికారం తనకుంది అంది. శివుని ఆజ్ఞగా చెప్పుకుంది సింహం. ఆవు ఆహారమై పోనుందని చెప్పి దిలీపుణ్ని వెళ్ళిపోమంది.*


*దిలీపుడు చేతులు జోడించి సింహరాజుని వేడుకున్నాడు. తనని ఆహారంగా స్వీకరించమన్నాడు. నందినీ గోవుని విడిచి పెట్టమన్నాడు. గురువు గారి ప్రాణంగా చెప్పాడు. తన ప్రాణం తీసుకోమన్నాడు. అపకీర్తిని అంట గట్టొద్దన్నాడు. ఈ శరీరం ఎప్పుడైనా నశించేదే అన్నాడు. తనకు తానే ఓ మాంసపు ముద్దలా ముడుచుకుపోయి సింహం నోటి ముందు నిలబడ్డాడు.*


*మూసినకళ్ళు తెరిచేసరికి సింహం మాయమయ్యింది. నందిని నవ్వింది. అంతా తను పెట్టిన పరీక్షంది. పరీక్షలో గెలిచావంది. సంతానం కలుగుతుంది అంది. అందుకు తన పాలను స్వీకరించమంది.*


*దిలీపుడు ఎంతో సంతోషపడినా పాలను స్వీకరించలేనన్నాడు. నీ పాలు గురువుగారి యాగ కార్యాలకు వినియోగించాక, నీ బిడ్డలకు ఇచ్చాక మిగిలితే… అందుకు గురు దేవులు వసిష్టమహర్షి అనుమతిస్తే… అన్నాడు.* 


*అతని ధర్మ నిరతికి వసిష్ఠుడు మెచ్చుకుని అనుమతినీ ఆశీర్వాదాన్నీ అందించాడు.*


*ఆ దంపతులు పాలను సేవించారు. ఆ తర్వాత పండంటి బిడ్డను కన్నారు. అతడే రఘు మహారాజు!*


*దిలీపుడు తిరుగులేని మహారాజుగా తొంభై తొమ్మిది అశ్వమేధయాగాలు చేసి, నూరో యాగం తలపెట్టేసరికి ఇంద్రుడు భయపడ్డాడు. అశ్వాన్ని మాయం చేసాడు.*


*అది తెలిసి కొడుకు రఘుని పంపుతాడు. నందిని తోడు వెళుతుంది. ఇంద్రుడు యుద్ధంలో వజ్రాయుధాన్ని విసురుతాడు. అది ఏ ప్రభావమూ చూపలేకపోతుంది.*


*అప్పుడు ఇంద్రుడు అశ్వమేధ యాగానికి అడ్డుచెప్పడు. అశ్వాన్నీ ఇవ్వడు. రఘు తిరిగి రాజ్యానికి వస్తాడు. రాజ్యం అప్పగించి అడవులకు వెళ్ళిపోయాడు!*

✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

వైటమిన్ బి12 డెఫిషియెన్సీ

 *ఎక్కువ స్ట్రెస్‌కి గురయ్యే ఉద్యోగాల్లో ఉన్న వారికి తరచూ వైటమిన్ బి12 డెఫిషియెన్సీ ఏర్పడుతూ ఉంటుంది. మానసిక వత్తిడి శరీరంలో పెద్దమొత్తంలో బి వైటమిన్స్‌కి ఖర్చుచెయ్యడం దీనికి ప్రధాన కారణం.అవగాహనా కోసం నవీన్ నడిమింటి సలహాలు*


         శరీరంలో అసమతౌల్యత ఏర్పడింది అని ఈ సంకేతాలను బట్టి అర్థం చేసుకోవాలి. చాలామందికి దీనికి పరిష్కారంగా ఎక్కువ డోసుల్లో బి కాంప్లెక్స్ టాబ్లెట్లని తీసుకుంటూ ఉంటారు. సమస్య సాల్వ్ అయినట్లు ఉంటుంది గానీ, సమస్య అసలు కారణాలు అర్థం చేసుకోకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందితే ఉపయోగం ఉండదు.


*సమస్య మూలాల్లోకి వెళితే..*

           వత్తిడి అనేది మనస్సు, శరీరాలను ఒక స్థాయికి మించి అలసటకు గురిచేస్తే ఏర్పడేది. అది విపరీతంగా ఆలోచించడం కావచ్చు.. శారీరక కష్టం చెయ్యడం కావచ్చు. శరీరం, మనస్సు యొక్క సామర్థ్యాలకు మించి వాటిని వాడితే అది రాజసిక గుణాన్ని శరీరంలో పెంచుతుంది. అంటే ఒక వెహికిల్‌కి దానికి ఉద్దేశించబడిన స్పీడ్ కన్నా విపరీతమైన స్పీడ్‌తో నడపడం లాంటిది అన్నమాట.


🛑 *విటమిన్ డి లోపాన్ని గుర్తించే లక్షణాలు*


🛑 *కండరాల బలహీనత:*


 ఎలాంటి కారణం లేకుండా కండరాల పరిమాణం తగ్గడం, అనవసరంగా నొప్పిగా అనిపించడం విటమిన్ డి లోపానికి సంకేతం. నాడీ కణాలకు సరిగా విటమిన్ డి అందనప్పుడు అలాంటి సమస్య మొదలవుతుంది.  


🛑 *డిప్రెషన్:*


 విటమిన్ డి లోపిస్తే డిప్రెషన్ వేధిస్తుంది. అనవసరంగా డిప్రెషన్ కు లోనవడం, చిన్న విషయానికి ఎక్కువగా చింతించడం వంటి లక్షణాలు విటమిన్ డి లోపాన్ని సూచిస్తాయి. 


🛑 *నొప్పి:*


 ఎక్కువగా నొప్పులకు గురవుతున్నారంటే జాగ్రత్త వహించడం మంచిది. ఎన్ని రోజులైనా.. తలనొప్పి, కండరాల నొప్పి వంటివి తగ్గడం లేదంటే.. ఒకసారి విటమిన్ డి టెస్ట్ చేయించుకోవడం మంచిది. 


🛑 *ఎముకలు:*


 విటమిన్ డి కి ఎముకల ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధముంది. విటమిన్ డి లోపిస్తే.. ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.  


🛑 *బీపీ:*


 విటమిన్ డీ లోపిస్తే.. బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశముంది. గుండె ఆరోగ్యంలో విటమిన్ డి ప్రధానం. ఒక వేళ బీపీ పెరిగిందని అనిపించినా.. చిన్న విషయాలకూ చిరాకు పడుతున్నా.. విటమిన్ డిపై శ్రద్ధ వహించాలి. వెంటనే డాక్టర్ ని సంప్రదించి జాగ్రత్త పడాలి.  


🛑 *చిరాకు:*


 చీటికి మాటికి చిరాకులకు, కోపానికి గురవుతున్నారా.. అయితే మీ శరీరంలో విటమిన్ డి స్థాయిలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోండి. విటమిన్ డి లోపిస్తే.. మెదడులో మానసిక ఒడిదుడులపైపై ప్రభావం


*దీన్ని సరిచెయ్యాలంటే లక్షణాలు కనిపించగానే వైటమిన్ టాబ్లెట్స్ వేసుకుని సమస్యని దాచిపెట్టడం కాదు..*


          మన మానసిక వత్తిడిని తగ్గించుకోవడం సరైన పరిష్కారం.

*ధన్యవాదములు 🙏*

*మీ నవీన్ నడిమింటి*

ఫోన్ -9703706660

This group created health information on ayurvedic medicine and create awareness of diseases and management group

ఈ గ్రూప్ లో మీ స్నేహితులకు add చెయ్యండి డాక్టర్స్ సలహాలు కోసం మాత్రమే .👇

 


            *ఆచార్య సద్బోధన:*

                ➖➖➖✍️


```కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది.


బంతి దెబ్బనుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం తప్పించుకోలేం! 


పామరుడు అయినా పండితుడు అయినా సరే తాను చేసిన ప్రతీ కర్మకు ఇప్పుడో మరెప్పుడో ఫలం అనుభవించాలి.


కనుక కర్మ చేసినపుడు,              ఇది మంచిదా? చెడ్డదా? అని ఆలోచించి చేయాలి.


మనకు లాభం వస్తుంది కదా అని ఏది పడితే అది చేసేస్తే కర్మ కూడా తన పని తాను చక్కగా చేసుకుపోతుంది. 


కనుక విచక్షణతో కర్మలను ఆచరించాలి. 


దేవుణ్ణి మనసు నిండుగా నింపుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించినవాడే కర్మకు భయపడి ఉంటాడు. 


ఎందుకంటే వారు చేసిన పనికి దేవుడు క్షమించినా కర్మ వదిలిపెట్టదు అని వారికి బాగుగా తెలుసు కనుక!


అయితే దేవుడంటే లెక్క చేయని వారికి అది అంత సులువైన పని కాదు! వాళ్ళు తమ బుద్ధులను మార్చుకుని దేవునివైపు తిరిగితే తప్ప వాళ్ళను రక్షించడం సృష్టి కర్త వలన కూడా కాదు!✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

అనన్య చింతన*

 *అనన్య చింతన*


తానే సర్వస్వం అని, తనని అనన్య చింతనతో స్మరించుకునే వారి యొక్క యోగ క్షేమాన్ని తాను అన్నీ చూసుకుంటాను అన్న భరోసా శ్రీకృష్ణుల వారు. 


యాంతి దేవవ్రతా దేవాన్ 

పితౄన్ యాంతి పితృవ్రతాః । 

భూతాని యాంతి భూతేజ్యా 

యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 

ఆ.9 శ్లో.25 


దేవతలను పూజించే వారు దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు పితృదేవతల దగ్గరకి వెళ్తారు, భూతప్రేతములను అర్చించువారు అలాంటి వాటిల్లో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.


ఈ శ్లోకంలో స్వామివారు అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతి సాధించటం కోసం మనము ఆ పరమాత్మనే ఆరాధించాలి అని చెప్తున్నారు.

.

ఇంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, అగ్ని వంటి వారిని ఆరాధించేవారు స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత వారు స్వర్గము నుండి పంపించి వేయబడుతారు. పితృదేవతల పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే, కానీ వారి అతి చింతన నష్టదాయకమై మరణించిన పిదప పూర్వీకుల లోకాలకు వెళతారు.


తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తూ భూతప్రేతములలో జన్మిస్తారు అని శ్రీ కృష్ణుడు అంటున్నారు. 


తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారే సర్వోన్నత భక్తులు. తదుపరి జన్మలో ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.


పత్రం పుష్పం ఫలం తోయం 

యో మే భక్త్యా ప్రయచ్ఛతి । 

తదహం భక్త్యుపహృతమ్ 

అశ్నామి ప్రయతాత్మనః ।।

అ.9 శ్లో. 26


నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగాని, ఒక పువ్వు గాని, ఒక పండు గాని, లేదా నీరైనా గాని సమర్పిస్తే, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తుని చే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా ఆరగిస్తాను.


పరమేశ్వరుడిని ఆరాధించటం ఎంత సులువైనదో శ్రీ కృష్ణుడు వివరిస్తున్నారు. వేదాలు దేవతల మరియు పితృదేవతల ఆరాధనకై ఆచరించవలసిన ఎన్నో నియమాలని చెప్తాయి. కానీ శ్రీకృష్ణుల వారి ఈ శ్లోకం లో ప్రేమ నిండిన హృదయంతో తో సమర్పించబడిన ఏదైనా స్వీకరిస్తాను అని తెలియ చేస్తున్నారు. కాపొతే అది ప్రేమ/భక్తితో ఇవ్వబడాలి. ముఖ్యంగా గ్రహించాల్సింది భక్తుని యొక్క భక్తి మాత్రమే భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. దీని ద్వారా స్వామివారి కరుణాపూరిత స్వభావం తెలుస్తోంది.

 

తులసీ దళ మాత్రేణ 

జలస్య చులుకేన చ! 

విక్రీణీతే స్వం ఆత్మానం 

భక్తేభ్యో భక్త-వత్సలః!!

(హరి భక్త విలాస్ 11.261)


"భగవంతునికి నిజమైన ప్రేమతో, ఒక తులసి ఆకు మరియు మీ దోసిట్లో పట్టేంత నీరు సమర్పిస్తే, బదులుగా ఆయన తననే మీకు సమర్పించుకుంటాడు, ఎందుకంటే ఆయన ప్రేమకు వశమైపోతాడు." 


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనిర్వచనీయమైన మహాద్భుత గుణములు కలవాడు, ఎవరి సంకల్ప మాత్రం చేతనే అనంతమైన బ్రహ్మాండాలు సృజించబడి, లయమై పోతుంటాయో, ఆయన తన భక్తునిచే నిజమైన ప్రేమతో సమర్పించబడిన అత్యల్పమైన దాన్ని కూడా స్వీకరిస్తాడు. 


కాకపోతే "కల్మషములేని పవిత్ర హృదయం (మనస్సు) తో ఉన్న వారు సమర్పించే దానిని స్వీకరిస్తాను" అని శ్రీమద్భాగవతం (10.81.4) లో సుదాముని వద్ద అటుకులు తినేటప్పుడు, శ్రీ కృష్ణుడువివరించాడు.


శ్రీ కృష్ణుడు, కౌరవులు, పాండవుల మధ్య సంధికై హస్తినాపురం వెళ్లినప్పుడు దుర్యోధనుడు గర్వంతో యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేసాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆథిధ్యాన్ని వద్దని సామాన్యమైన విదురని ఇంట్లో కేవలం అరటి పండ్లే ఉండి, ప్రేమభావనలో అయోమయంతో పండు పడేసి, తొక్కలు తినిపిస్తుంటే, అక్కడ భక్తి ని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలు తిన్నాడు. 


 *అనన్య భక్తి*


భగవంతుడిని సేవించటానికి, తెలుసుకోవటానికి ఎన్నో మార్గాలు, పద్ధతులున్నాయి. అందులొ ఒకటి “భక్తి” మార్గం.

ఈ భక్తిని సాధన చేయటానికి తొమ్మిది పద్ధతులు పెద్దలు చెప్పారు. వాటినే, ” నవ విధ భక్తి ” అని అంటారు. 


శ్రీ నారద “భక్తి సూత్రాల”లొ, భక్తిని గురించి ‘” సా త్వస్మిన్ పరమప్రేమరూపా ” అని చెప్పారు:


దీని అర్ధం : పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగియుండుటయే భక్తి. అచంచల విశ్వాసము ప్రేమకు పునాది. అది అనంత తత్త్వావలోకమునకు అనాది. విశ్వసించినవానికి విశ్వేశ్వరానుగ్రహము అరచేతి ఉసిరిక.


పై అర్ధాన్ని కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఎవరిపైన మనకు అచంచల విశ్వాసముంటుందో, వారిపైన మనకు ప్రేమవుంటుంది. అంటే, ముందుగా, మన పైన మనకు విశ్వాసమున్నట్లేగదా!! ఈ విశ్వాసమన్నది ఒక పూమొగ్గ. ఆ మొగ్గ, రెక్కలు తొడిగి, విచ్చుకొని, తరువాత, ఒక కాయ రూపంగా మార్పు చెందుతుంది. 


అదే ప్రేమ. ఆ ప్రేమ అపారంగా, అచంచలంగా వృద్ధిచెందిన ప్పుడు, అది “భక్తి” అనే పండుగా మారుతుంది. పరమాత్మపై మనకు అచంచల విశ్వాసమున్నపుడు, అది ప్రేమగా, భక్తిగా మారుతుంది. 


అయితే, దీని ఆంతర్యం ఏమిటి? లేదా దీని “తత్త్వం” ఏమిటి? అతి సులభంగా చెప్పాలంటే, పరమాత్మ అనేవాడు ఒకడు వున్నాడు అని మనం నమ్మినట్లైతే, పరమాత్మ సర్వవ్యాపి అనే సూత్రాన్ని మనం నమ్మాలి. సర్వవ్యాపి అయిన పరమాత్మ, సర్వ ప్రాణులలో వున్నట్లేగదా!! అంటే, పరమాత్మను మనం విశ్వసించి, ప్రేమిస్తున్నట్లైతే, సర్వ ప్రాణులను మనం ప్రేమిస్తున్నట్లేగదా!! 


విశ్వంలోని ప్రతి ప్రాణిని మనం ప్రేమిస్తున్నప్పుడు, మనని, మనం ప్రేమించుకున్నట్లే గదా. ఈ “విశ్వప్రేమే”, “విశ్వశాంతి”ని కలుగచేస్తుంది; అనంతమైన ఆనందాన్ని మన మనసుల్లో సృష్టిస్తుంది. మన ” మనసులొ కలిగే ఈ ఆనందాన్నే ఆనందమయకోశం” అంటారు. అనంతమైన ఈ ఆనందాన్ని పొందటమే, మోక్షమని అంటారు. మరి దీనికి మూలకారణం ” భక్తే “గదా!!


ఈ భక్తికి సంబంధించి ఒక గొప్ప కథను ఇప్పుడు చెప్పుకుందాం:


ఒకసారి, నారదుడు బృందావనం వెళ్ళినప్పుడు, అక్కడ గోపికలందరు ఒక చోటకూడి తమలోతాము చాలా తీవ్రంగా ఏదో విషయంపై చర్చించుకోవటాన్ని గమనించాడు. గోపికలకు, కృష్ణుడంటే, అపారమైన ప్రేమ, భక్తి. కృష్ణుడులేనిదే, వారికి లోకమేలేదు. నారదుని చూసి, గోపికలందరూ, ఆయనకు నమస్కరించి, ఆహ్వానించి కూచోబెట్టారు. ఆ తరువాత, వారు, మరల తమలోతాము వాదించుకోసాగారు. 


అప్పుడు, నారదుడు, మీ వాదులాట దేనిగురించి అని అడిగాడు. గోపికలందరూ, ఒక్కమాటగా, ఒకమాట చెప్పారు. 


” మనుషులను సృష్టించిన ఆ భగవంతుడికి, అంటే, బ్రహ్మకు అసలు బుద్ధిలేదని”. 


అది విన్న నారదుడు, వారిని వారించి, భగవంతుడుని తిట్టటం పాపమని బోధించాడు. అయినా, గోపికలు వారి వాదనను వదిలిపెట్టలేదు. 


అప్పుడు, నారదుడు, సరే, భగవంతుడికి బుద్ధిలేదని మీరు ఏవిధంగా చెప్పగలరని ప్రశ్నించాడు. 


దానికి వారు బదులిస్తూ, మనుషుల కళ్ళకు రెప్పలు పెట్టి, బ్రహ్మ చాలా పెద్ద పొరపాటుచేసాడు అని చెప్పారు. 


దానికి, నారదుడు, కళ్ళల్లో దుమ్ము,ధూళి పడకుండా కాపాడటానికేగదా ఆ బ్రహ్మ కనురెప్పలు పెట్టాడు; అది తప్పు ఎట్లాఅవుతుంది అని ప్రశ్నించాడు. 


అప్పుడు, గోపికలు “ ఓ నారదా, మేము, మా ప్రేమస్వరూపుడైన కృష్ణుడుని ఒక్క క్షణంకూడా చూడకుండా వుండలేము. అయితే, క్షణ,క్షణానికి, కనురెప్పలు మూసి, తెరుచుకోవటంవల్ల మేము మా కృష్ణుడిని నిరంతరంగా చూడలేకపోతున్నాము. అదేగానీ, బ్రహ్మ కనురెప్పలు పెట్టకుండావుండివుంటే, మేము మా కృష్ణుడిని తదేకంగా చూడగలిగేవారంకదా!! కనురెప్పలవల్ల, మా ఆనందానికి అవరోధం కలుగుతున్నది” అని చెప్పారు. 


అదివిన్న నారదుడు, నేనే గొప్ప భక్తుడిని అనుకుంటే, ఈ గోపికలు నన్ను, అందరిని మించిపోయారు 

గదా అని ఆశ్చర్యపోయాడు. వారి అనన్య “భక్తి” కి తలవంచాడు.


అందుకే, గోపికలందరూ, ఆనంద-బ్రహ్మస్వరూపాలు. ముక్తి సాధకులు. ఇదే భక్తి-తత్త్వం యొక్క రహస్యం.

*

 🕉 మన గుడి :



⚜ కడప జిల్లా : సంబటూరు గ్రామం


⚜ శ్రీ  లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయం



💠 ఒకనాడు కడప సీమలో సంగమేశ్వరం (అనిమెల), 

మోపూరు భైరవేశ్వరాలయం(నల్లచెరువు) హత్యరాల(అత్తిరాల) మరియు పుష్పగిరి వంటివి క్షేత్రాలు శైవ మతానికి ప్రసిద్ద క్షేత్రాలుగా ఉండగా ...


గండికోట, 

సంబటూరు, 

వెయ్యినూతుల కోన, 

రంగనాథాలయం (పులివెందుల), 

తాళ్ళపాక మరియు ఒంటిమిట్ట క్షేత్రాలు శ్రీవైష్ణవ మతానికి అత్యంత ముఖ్యమైన క్షేత్రాలుగా ఉండేవి.


💠 కడప జిల్లా కమలాపురం నుండి కోకటం వెళ్లే దారిలో వస్తుంది సంబటూరు గ్రామం. 

ఇక్కడి లక్ష్మీ చెన్నకేశవాలయం అత్యంత ప్రాచీనమైనది , మరియు ప్రాశస్త్యం కలది. సంబటూరుకే శ్రీభాష్యపురం అని మరో పేరు ఉన్నది. 


💠 పూర్వము ముగ్గురు ఆళ్వార్లు పొయ్‌గయాళ్వార్, పూదత్తాళ్వార్ , పెయ్ అళ్వారులు బదరికాశ్రమానికి వెళ్తూ, చ్యవనాశ్రమములో కొన్నాళ్ళు ఉన్నపుడు, భాగవత పురాణంలో చెప్పబడినట్లుగా, చ్యవనాశ్రమము శ్రీభాష్యపురం అవుతుందని చెప్పారు. 

ఈ శ్రీభాష్యపురం, సంబటూరుకి ఇంకో పేరు.


💠 ఒకనాడు ఈ గ్రామము శ్రీవైష్ణవులకు అత్యంత విశిష్టమైనది. ఆలయ ప్రాంగణంలో ఒక్క లక్ష్మీ చెన్నకేశవ ఆలయం తప్ప మిగతా ఆలయాలు ఇప్పుడు శిథిలమై ఉన్నాయి.  విజయనగర రాజుల, మట్లి రాజుల ఏలుబడిలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా వెలిసిల్లిందని, తెలుగునాటే కాక తమిళులకు కూడా ఈ క్షేత్రము ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది.


⚜ స్థల పురాణం ⚜


💠 పూర్వం ఇక్కడ చ్యవనముని ఆశ్రమం ఉండేది , ఆ చ్యవనాశ్రమం కాలక్రమేణా చమటూరు అయినదని అదే తరువాత కాలంలో సంబటూరు అయినదని స్థానిక చరిత్ర. 


💠 విజయనగర రాజుల, మట్లి రాజుల ఏలుబడిలో ఈ ఊరు శ్రీవైష్ణవ క్షేత్రంగా వెలిసిల్లిందని, తెలుగునాటే కాక తమిళులకు కూడా ఈ క్షేత్రము ముఖ్యమైనదని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తున్నది. 

ఈ ఊరు ఒకప్పుడు సీమలోని అన్ని గ్రామాలలాగే ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్నప్పటికీ ఇప్పుడా గొడవలేవీ లేకుండా ప్రశాంతంగా ఉంటున్నది.


💠 మహాభారత కాలం నాటి అభిమాన్యుని మనవడైన జనమేజయ మహారాజు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు స్థల పురాణం  చెబుతుంది. కాలగమనంలో ఈ దేవాలయం వివిధ రకాలుగా తన రూపు రేఖలను మార్చుకుంటూ పునరుద్ధరణ జరుగుతూ వచ్చినది.


పినాకిని నదీతేరే  చోళరాజాజ్ఞ ప్రతిష్టితం

చ్యవన స్యాశ్రమే రమ్యే  కేశవాఖ్య ఇతి స్మృతం। ।


💠 చోళ రాజు కాలంలో కూడా ఈ దేవాలయం పునరుద్దరణ మరియు విగ్రహ పునఃప్రతిష్టించినట్లు తెలుస్తోంది. 


💠 దాదాపు 550 సంవత్సరాల క్రితం ఈ ఆలయ వైభవం గురించి శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఈ పుణ్య క్షేత్రాన్ని దర్శించి 7 కీర్తనలు రాసారు

ఉదాహరణకు:  

“చక్కటి ఈ వెన్నుడు సంబాటూరు చెన్నుడు “


💠 అన్నమయ్య మనవడు చిన తిరుమలాచార్యులు కూడ ఇక్కడ స్వామిపై ఒక కీర్తన రాసారు.


💠 అప్పటి విజయనగర ప్రభువైన శ్రీ సదాశివ దేవరాయలకు సంతానం లేక బాధ పడుతున్నప్పుడు ఒకరోజు చెన్నకేశవస్వామి రాజుకు కలలో కనిపించి సంబటూరు గ్రామంలో వెలసిన నా దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తే మీకు సంతానం కలుగుతుంది అని స్వామి చెప్పగా 1473 వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని పునరుద్ధరణ చేసినట్లు శాసన ఆధారాలు ఉన్నాయి.  

ఆనాటి నుండి దాదాపు 100  సంవత్సరాల క్రితం వరకు ఏడాదికి రెండు మార్లు మహా వైభవంగా ఉత్సవాలు జరుగుతూ ఉండేవి తర్వాత పూర్వపు వైభవాన్ని సంతరించుకుటకై  03-05-1992 నాడు తిరిగి ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ జరిగింది.


💠 1992 నుండి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మహోత్సవాలు ఈనాటికీ ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ తదియ నాడు (పుష్పగిరి తిరుణాల రోజు)  జరుగుతున్నవి


💠 శ్రీశైల దక్షిణ క్షేత్రం అయిన పుష్పగిరికి పడమర దిశలో, కమలాపురానికి 5 కిమీ ల దూరంలో ఈ ఊరు ఉంది.

గుండెపోటుమరణాలు

 భారతదేశంలో గుండెపోటుమరణాలు   కొలెస్ట్రాల్ పెరగడం కారణంగా  ఎక్కువగా జరుగుతున్నాయని గుర్తుంచుకోండి.

 అమెరికాలోని చాలా పెద్ద కంపెనీలు భారతదేశంలోని హృద్రోగులకు వేలకోట్ల విలువైన మందులను విక్రయిస్తున్నాయి.

 కానీ మీకు ఏదైనా గుండె సంభందించి సమస్య ఉంటే, డాక్టర్ యాంజియోప్లాస్టీ చేయించుకోమని చెబుతారు.

 ఈ ఆపరేషన్‌లో, డాక్టర్ గుండె ట్యూబ్‌లో *స్టంట్* అని పిలువబడే స్ప్రింగ్‌ను చొప్పిస్తారు.

 ఈ స్టంట్ అమెరికాలో తయారు చేయబడుతుంది. మరియు దీని ఉత్పత్తి ధర కేవలం రూ.150-180.

 ఈ స్టంట్‌ను ఇండియాకు తీసుకొచ్చి 3నుంచి5 లక్షల రూపాయలకు విక్రయించి దోచుకుంటున్నారు.

 డాక్టర్లకు లక్షల రూపాయల కమీషన్ వస్తుంది. అందుకే యాంజియోప్లాస్టీ చేయించుకోమని పదే పదే అడుగుతారు.

 కొలెస్ట్రాల్, *బిపి* లేదా గుండెపోటుకు యాంజియోప్లాస్టీ ఆపరేషన్ ప్రధాన కారణం.

 ఇది ఎవరికీ ఎప్పుడూ విజయవంతం కాదు.

 ఎందుకంటే డాక్టర్ హార్ట్ ట్యూబ్ లో పెట్టే స్ప్రింగ్ బాల్ పాయింట్ పెన్ను స్ప్రింగ్ లాంటిది.

 అయితే కొన్ని నెలల్లోనే ఆ స్ప్రింగ్‌కి రెండు వైపులా  కొలెస్ట్రాల్ మరియు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది.

 దీని కారణంగానే రెండోసారి గుండెపోటు వస్తుంది.

 మళ్లీ యాంజియోప్లాస్టీ చేయించుకోవాలని డాక్టర్‌ చెపుతారు.

 లక్షల రూపాయలు దోచుకుని నీ ప్రాణం తీస్తారు.

 ●●●●●●●●●●●●●●●●

 ఆయుర్వేద చికిత్స

●●●●●●●●●●●●●●●●

 *అల్లం రసం -* 

 ఇది రక్తాన్ని పలుచగా చేస్తుంది.

 ఇది సహజ పద్ధతిలో నొప్పిని 90% తగ్గిస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●

 *వెల్లుల్లి రసం* 

 ●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే *అల్లిసిన్* మూలకం కొలెస్ట్రాల్ మరియు బీపీని తగ్గిస్తుంది.

 దాంతో హార్ట్ బ్లాక్స్ ఓపెన్ అవుతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 *నిమ్మరసం* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం రక్తాన్ని శుభ్రపరుస్తాయి.

 ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

 ●●●●●●●●●●●●

 *ఆపిల్ సైడర్ వెనిగర్* 

 ●●●●●●●●●●●●●●●●

 ఇందులో 90 రకాల మూలకాలు ఉన్నాయి, ఇవి శరీరంలోని అన్ని నరాల *బ్లాక్సు* ను తెరుస్తాయి, కడుపుని శుభ్రపరుస్తాయి. మరియు అలసటను తొలగిస్తాయి.

 ●●●●●●●●●●●●●●●●ఈ దేశీయ ఔషధాలు

        ఇలా ఉపయోగించండి ●●●●●●●●●●●●●●●●

 1- ఒక కప్పు నిమ్మరసం తీసుకోండి;

 2- ఒక కప్పు అల్లం రసం తీసుకోండి;

 3- ఒక కప్పు వెల్లుల్లి రసం తీసుకోండి;

 4-ఒక కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి; ●●●●●●●●●●●●●●●●

 నాలుగింటినీ కలపండి. మరియు తక్కువ మంట మీద వేడి చేయండి, 3 కప్పులు మిగిలి ఉన్నప్పుడు, దానిని చల్లబరచండి;

 ఇప్పుడు మీరు

 దానికి 3 కప్పుల తేనె కలపండి.

 ●●●●●●●●●●●●●●●●

 ఈ ఔషధం 3 స్పూన్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోండి.

 అన్ని బ్లాక్సు open అయిపోతాయి.

 ●●●●●●●●●●●●●●●●

 ప్రతి ఒక్కరూ ఈ ఔషధంతో తమను తాము  రక్షించుకోండి.

 ●●●●●●●●●●●●●●●●

 గుండెపోటును ఎలా నివారించాలలి?          ●●●●●●●●●●●

 గుండెపోటు సమయంలో చాలా మంది ఒంటరిగా ఉంటారు కాబట్టి, వారికి ఎటువంటి సహాయం లేకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది.

 గుండె పోటురాగానే మూర్ఛపోవడం ప్రారంభమవుతుంది. కేవలం 10 సెకన్లు మాత్రమే ఉంటాయి.

 అటువంటి స్థితిలో, బాధితుడు తీవ్రంగా దగ్గాలి. దగ్గు చాలా బలంగా ఉండాలి.

 ఛాతీలోంచి ఉమ్మి వచ్చేంతవరకు దగ్గాలి.

 సహాయం వచ్చే వరకు

  ప్రక్రియ పునరావృతం చేయాలి.

 తద్వారా హార్ట్ బీట్ సాధారణంగా ఉంటుంది

 ,.................................

గట్టిగా దగ్గడంవలన ఊపిరితిత్తులు శ్వాస

 ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుంది

బిగ్గరగా దగ్గడం వల్ల

 గుండె కుంచించుకుపోయి

 రక్త ప్రసరణ క్రమం తప్పకుండా

 నడుస్తుంది.

 ●●●●●●●●●●●●●●●●●

 ●●●●●●●●●●●●●●●●●●●●

         మీరు చాలా అభ్యర్థించబడ్డారు

   జోక్ ఫోటోలు పంపే బదులు

        ఈ సందేశాన్ని అందరికీ పంపండి

    ప్రాణాలను కాపాడటానికి

 ఒక స్నేహితుడు నాకు పంపాడు. 

ఇప్పుడు మీ వంతు

ప్రజా ప్రయోజనం కోసం ఫార్వర్డ్ చేయండి....✍️🙏🙏🙏

Score social media

పూజయే




               *ఇది కూడా పూజయే*

                    ➖➖➖✍️


```పరమాచార్య స్వామివారు తమిళనాడులోని తంజావూరు జిల్లా కొడవసల్ - కొరడచెర్రి మార్గంలో సంచరిస్తున్నారు. తిరుక్కలంబూర్ కి వెళ్తూ, కొంతమంది మురికివాడల ప్రజలు మహాస్వామి వారిని కలిసి ప్రణామాలు సమర్పించారు. 


మహాస్వామివారు ప్రతి ఒక్కరిని పలకరించి వారి బోగోగులని విచారించి, కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఏమాత్రం త్వరపడకుండా మేనేజరుతో వారి బాధలను తీర్చడానికి శ్రీమఠం తరపున ఏమి చెయ్యవచ్చో, మఠం తరపున చెయ్యగలమా లేదా మఠం దాతల సహాయం తీసుకోవలసి వస్తుందా అని దీర్ఘంగా చర్చిస్తున్నారు. 


మేనేజరు మరి కొంత మంది ఉద్యోగులు తరువాతి మకాం చేరుకోవడానికి ఆలస్యం అవుతుందని, తదనంతరం జరగవలసిన పూజకూడా ఆలస్యం అవుతుందని కంగారు పడుతున్నారు. 


కాని పేదల దైవం, దీన రక్షకుడు అయిన పరమాచార్య స్వామివారు వారితో కూర్చుని అక్కడున్నవారందరికి స్థానిక దుకాణాల నుండి పంచలు, చీరలు తెప్పించడని ఆజ్ఞాపించారు. కావాల్సినన్ని ఆ దుకాణంలో దొరకకపోతే కొడవసల్ నుండి తెప్పించి ఇమ్మని చెప్పారు. చిక్కటి సాంబారు అన్నం చేయించి వాళ్ళందరికి చెట్ల నీడన వడ్డించమని ఆదేశించారు. 


దాదాపు రెండు మూడు గంటలు వీటన్నిటి కోసం గడపడం వల్ల మరుసటి మకాం చేరుకోవడం ఆలస్యమవుతుందని, తరువాత జరగవలసిన దీర్ఘమైన పూజక్రతువు చెయ్యడానికి స్వామివారికి కష్టం అవుతుందని తలచాడు. 


ఈ విషయాన్ని మహాస్వామివారికి తెలపాలని మొదలుపెట్టగా స్వామివారు వెంటనే, “ఇది కూడా పూజయే” అని చెప్పి ఆ దీనులతో మాట్లాడడం కొనసాగించారు. 


పేదలకు సహాయం చెయ్యడం, వారి ఉన్నతికి పాటు పడడం కూడా ఈశ్వర సేవయే అనే సందేశాన్ని స్వామివారు మనందరికి అందించారు. 


మానవ సేవయే మాధవ సేవ!


[అలా అని ధర్మాన్ని, ఆచారాన్ని, అనుష్టానాన్ని పక్కనపెట్టి మానవసేవ చేస్తే అది వ్యర్థం. ధర్మము కానిది ఎల్లప్పుడూ వర్జనీయమే. ఏమి చేసినా ధర్మబద్ధంగానే చెయ్యాలి. ధర్మాన్ని వదిలి మానవసేవ చెయ్యడం గజదొంగకి ఉచిత కంటి ఆపరేషన్ చెయ్యించడం వంటిది. కన్న తల్లి తండ్రులని వదిలి వేరేవాళ్ళను ఆదరించడం వంటిది. అది మహానుభావులకే చెల్లింది. సామాన్య మానవులకు స్వధర్మాన్ని మించినది లేదు.]✍️```


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం ।

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ॥


--- రా. గణపతి, ‘మహాపెరియవళ్ విరుంధు’ నుండి.


https://t.me/paramacharyaVaibhavam


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀


*ఆధ్యాత్మిక సాధన అంటే వైరాగ్యం  తప్పనిసరా?*

  

*అన్నిటినీ త్యాగం చేయవలసిందేనా?*


 *విరాగిగా మారవలసిందేనా?* 


*అసలు వైరాగ్యం అంటే?*


*వైరాగ్యం అంటే అన్నింటినీ వదులుకోవడం కాదు...*


*వైరాగ్యం అంటే త్యాగం కాదు... విరాగిగా మారడం అంతకంటే కాదు..*

 

*మరి వైరాగ్యం అంటే?* 


*అన్నింటిలో (ప్రపంచంలో) ఉంటూనే, మనసుకు ఏదీ అంటకుండా, విచక్షణను వదిలేస్తే చాలు.. అదే వైరాగ్యం...*


*తామరాకు మీద నీటిబొట్టు లాగా అన్నమాట.....*


*అంటే?*

  

*రుచి - అరుచి,  బాగుంది - బాగాలేదు, నచ్చింది - నచ్చలేదు, ఆసక్తి - అనాసక్తి,    అనే విచక్షణ (మనసు యొక్క ఒకానొక భావన) వదలి వేయడమే వైరాగ్యం.......* 


*ఎలా ఉన్నా ఆహారం ప్రాప్తంగా స్వీకరించాలి..*

 

*ఎలా ఉన్నా వర్తమానంలో వచ్చే ప్రతి అనుభవాన్ని భగవత్ ప్రసాదంగా ఆహ్వానించాలి*


*ఒక్కసారి ట్రై చేస్తే... వైరాగ్యం అంటే ఏంటో మీకే అర్థమవుతుంది...* 


🙏🙏🙏🙏🙏🙏

ఓం శ్రీ అరుణాచల శివ

వాల్మీకి రామాయణం: 26 వ భాగం:

 

రామాయణం...

ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది...


              వాల్మీకి రామాయణం:

                   26 వ  భాగం:

                     ➖➖➖✍️


కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అంది...

"మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు." అంది.


"చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు" అని కైకేయ అంది.


అప్పుడు మంథర "పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికీ రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.


ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |

ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||


ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి" అని మంథర కైకేయతో అంది.


మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయి  మనసులో  దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో... " నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు?" అని అడిగింది. 


అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే...


అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | 

యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||


"ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వరాలని అడుగు" అని చెప్పింది.


"మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది" అని కైకేయి మంథరని అడిగింది. 


అప్పుడా మంథర…

"ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలోతిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు." అని చెప్పింది.


ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో "ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి " అంది. 


అప్పుడా మంథర... “నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావా అని నిలదియ్యి” అని అంది. 


అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయినో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.✍️

రేపు...27వ భాగం...

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀



        *బలవంతుడ నాకేమని…*

                 ➖➖➖✍️


*ప్రతి జీవికీ తగినంత శారీరక బలం ఉంటుంది. తనను తాను రక్షించుకోవడానికీ, తన అవసరాలు తీర్చుకోవడానికీ అది చాలా అవసరం. కానీ అది గర్వంగా మారకూడదు. తనకంటే బలం తక్కువ ఉన్న వాటిపట్ల చులకన దృష్టి ఉండకూడదు.*


*ఉంటే ..?*


 *‘బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేతచిక్కి చావదే సుమతీ!*

*అని బద్దెన క్లుప్తంగానే అయినా బలవర్ధకమైన సందేశాన్ని ఇచ్చాడు. నల్లచీమల్లో చలిచీమలని ఉంటాయి. అవి ఎక్కువగా తేనెపట్టు పట్టినట్లు పట్టేస్తుంటాయి. అవి ఎక్కడున్నాయో అక్కడ ఒక రకమైన వాసన వస్తుంటుంది. అవి ఒంటిమీదకు చాలా త్వరగా ఎక్కేస్తాయి. సర్వసాధారణంగా కుట్టవు. లోకంలో చాలా బలహీనంగా పైకి కనపడే ప్రాణుల్లో అదొకటి. కానీ అది చాలా చిన్న ప్రాణే కదా అని దానికి పౌరుషం వచ్చేటట్లు ప్రవర్తించారనుకోండి... అవన్నీ కలిసి ఎంత బలమైన ప్రాణినయినా చంపేస్తాయి.* 


*పాముని చూసి భయపడని ప్రాణి ఏముంటుంది. అలాంటి పాముని కూడా మామూలుగా ఈ చలి చీమలు ఏమీ చేయవు. కానీ వాటి ప్రాణానికి పామునుంచి ప్రమాదం ఎదురయినప్పడు అవన్నీ కలిసి మూకుమ్మడిగా ప్రాణాలకు తెగించి దాని పనిపడతాయి.* 


*అంత ప్రమాదకరమైన పాముకూడా కొన్ని వేల చీమల చేతిలో చిక్కి ఎక్కడికక్కడ అవి కుడుతున్నప్పుడు వాటి చేతిలో దయనీయంగా చచ్చిపోక తప్పని పరిస్థితి.*


*గడ్డి పరక కూడా వృక్షజాతుల్లో అల్పమైనది. అవి ఎక్కువ మొత్తంలో కలిస్తే బలిష్ఠమైన ఏనుగును కూడా కట్టిపడేస్తాయి.*


*రావణాసురుడు గొప్ప తపస్సు చేసాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. నీకేం కావాలని అడిగారు. “నాకు గంధర్వల చేతిలో, దేవతల చేతిలో, నాగుల చేతిలో...” అంటూ పెద్ద జాబితా చదివి వీళ్ళెవరి చేతిలో నాకు మరణం ఉండకుండా వరం కావాలన్నాడు.* 


*‘తృణ భూతాహితే ప్రాణినో మానుషోదయః’.. అనుకున్నాడు.* 


*మనుషులు గడ్డిపరకతో సమానం. వాళ్ల పేరెత్తి వాళ్ళ చేతిలో మరణించకూడదని వరం కూడా అడగాలా ... అనుకున్నాడు.* 


*మనిషిని అంత తక్కువగా జమకట్టాడు.. నరుల ఊసే ఎత్తనివాడు, వానరుల ఊసు అసలు ఎత్తలేదు. చివరకు ఏమయింది... పదహారణాల మానవుడు శ్రీరామచంద్రమూర్తి వానరులను కూడా వెంటపెట్టుకుని మరీ వచ్చాడు.  తరువాత ఏమయిందో తెలిసిందే కదా... నిష్కారణంగా వదరి గర్వంతో మరొకరిని తక్కువ చేసి, చులకన చేసి ప్రవర్తించడంవల్ల వచ్చిన ఉపద్రవం అది.*


*కాబట్టి నోటిని, మనసును అదుపులో పెట్టుకోవాలి. నువ్వెంత బలవంతుడవయినా, ఎంత విద్వాంసుడవయినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా... అదే  పనిగా నా అంతవాడిని నేను అని భావిస్తూ అందరినీ నిందిస్తూ, నిరసిస్తూ వాడెంత, వీడెంత అని తక్కువ చేసి చూడడం అలవాటు చేసుకుంటే పరిణామాలు ఇలానే ఉంటాయి.*


*వినయ విధేయతలతో ఉండు, నీకంటే పైవారినే కాదు, కింద వారినీ, తక్కువ స్థాయిలో ఉన్నవారినీ, బాధితులను.. అల్పులనే దష్టితో చూడకుండా అందరిపట్ల దయాదాక్షిణ్యాలతో, గౌరవ మర్యాదలతో ప్రవర్తించడం చిన్నప్పటినుంచే అలవాటు కావాలి.*


*పెద్దలు కూడా ఇటువంటి నీతి శతకాలను పిల్లల చేత చదివిస్తూ సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా మెలగడానికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి.*


*అప్పుడు బద్దెన వంటి పెద్దల తపనకు ప్రయోజనం లభించినట్లవుతుంది.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀


             *ఆచార్య సద్బోధన:*

                   ➖➖➖✍️

```

మానవుని అభిరుచులు వారివారి అభ్యాసముల మీద ఆధారపడి ఉంటాయి. ఎలా అంటే చేపలు అమ్మేవాడికి పూల వాసన గిట్టకపోవచ్చు. 


అలాగే పూవులమ్మేవాడికి చేపల వాసన గిట్టకపోవచ్చు, దీనికి కారణం వారి వారి అభిరుచి,అభ్యాసములే!


మన అభిరుచులు.. మన అలవాట్ల మీద, మనం పుట్టి పెరిగిన వాతావరణం మీద ఆధార పడి ఉంటాయి. 


కనుక తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్యం నుండే మంచి అలవాట్లను అలవరచుకోవడం నేర్పుతుండాలి. 


వారిలో భగవంతునిపై ప్రేమ,విశ్వాసాలు లేత వయసునుండే పెంపొందించాలి. 


నిస్వార్థం,దయ,సేవాభావం వంటి సద్గుణాల కోసం సత్సంగానికి పంపుతుండాలి. 


ధనసంపాదన కాదు! గుణసంపాదనే ద్యేయంగా పిల్లలను పెంచినపుడే  అసలైన తల్లిదండ్రులు కాగలగుతారు అన్న విషయం ఎల్లపుడూ గుర్తుంచుకుంటూ ఉండాలి.✍️```

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀



     *

🍀🍀మహాభారతంలోని ఉద్యోగపర్వం లోని కధ…



    *అహంకారం వినాశహేతువు*

                ➖➖➖✍️



*యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చివరి ప్రయత్నంగా రాయబారానికి వచ్చి తను చెప్పదలచిన హితవు చెప్పాడు.* 


*అనంతరం అదే సభలో ఉన్న మహర్షి పరశురాముడు దుర్యోధనుడికి చేసిన హితబోధ సందర్భంలో వచ్చే కథ ఇది…*


*"నాయనా! దుర్యోధనా! నీకూ, నీ వారికీ సర్వప్రపంచానికీ మేలు కలిగే విషయం చెబుతున్నాను. ఆవేశపడకుండా సావధానంగా విను...*


*చాలా రోజుల క్రితం మాట. ‘దంభోద్భవుడు’ అనే పేరు గల రాజు ఉండేవాడు. ఆయన ఈ భూమండలం అంతటినీ పాలించేవాడు. భుజబలంలో, పరాక్రమంలో ఆయనకు సాటి వచ్చే వారు లేరు ఆ రోజుల్లో. అంతటి మహా యోధుడాయన.* 


*ఆయన రోజూ ఉదయం లేచి, కాలకృత్యాలు పూర్తి కాగానే బాగా అలంకరించుకుని రత్నకిరీటం ధరించి, కోడెత్రాచు వంటి కరవాలం చేతబట్టి సభాభవనానికి వచ్చి బంగారు సింహాసనాన్ని అధిష్టించేవాడు.*


*వంది మాగధులు ఆయన బల పరాక్రమాలను గానం చేస్తుంటే, కోరమీసం మెలితిప్పుతూ ఆనందించేవాడు.*


*అనంతరం, తన కొలువులో ఉన్న వారందరినీ చూస్తూ ‘భూలోకంలో నాతో ఎవడైనా యుద్ధం చేయగల మహావీరుడు ఉన్నాడా? గద, ఖడ్గ, ప్రాసాది ఆయుధాలతో కానీ, ఆగ్నేయ, వారుణ, వాయవ్యాది అస్త్రాలతో కానీ నన్ను ఎదుర్కోగల వీరుడుంటే చెప్పండి. అంతేకాదు.. మల్లయుద్ధం చేయగల వీరుడు కూడా ఉంటే చెప్పండి. వాడినీ క్షణంలో కడతేరుస్తాను.' అని గర్వంగా నవ్వుతూ భుజాలు ఎగుర వేసేవాడు.*


*ఆయన బలపరాక్రమాలు ఎరిగిన వారెవరూ ఆయనతో యుద్ధానికి దిగే వారు కాదు.*


*అలా, ఆ రాజు అహంకారం నానాటికీ పెరుగుతూ వచ్చింది. నా అంత వాడు లేడనే గర్వంతో ఆయన విర్రవీగుతూ తిరుగుతుండే వాడు. అటువంటి అహంకారం ఉన్న రాజుకు ఆయన అనుచరులు కూడా అటువంటి అవివేకులే దొరుకుతారు కదా! వారు రోజూ ఆయన బలపరాక్రమాలను పొగుడుతూ ఉండేవారు.*


*అలా ఉండగా,  ఒకనాడు, ఆయనను చూడటానికి సభా భవనానికి వచ్చిన దూరదేశీయులైన విప్రులు “మహారాజా! మీరు నిజంగా మహావీరులే. బలపరాక్రమ సంపన్నులే. అయితే, గంధమాదన పర్వతం మీద నర-నారాయణులని ఇద్దరు తీవ్ర నిష్టతో తపస్సు చేస్తున్నారు. వారిని జయించగల వీరులు మూడు లోకాలలో లేరని విన్నాము. తమకు కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు” అన్నారు.*


*ఆ మాట వినడంతోనే ఆయన ఆగ్రహంతో మండిపడ్డాడు. కత్తి ఝుళిపించి, నేల మీద పాదంతో గట్టినా తన్ని, 'ఎంత కావరం? నన్ను మించిన యోధులా.. వారు?' అంటూ సేనల్ని సన్నద్ధం చేసి ధనుర్బాణాలు తీసుకుని బయల్దేరాడు. అలా గంధమాదన పర్వతం చేరాడు.*


*ప్రశాంతంగా ఉన్న వనంలో వారు తపస్సు చేసుకుంటున్నారు. వారిని చూస్తూనే రాజు గారు తొడగొట్టి, యుద్ధానికి పిలిచి, నవ్వుతూ కోరమీసం మెలితిప్పాడు.*


*నర, నారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన మహారాజుకు అతిథి సత్కారాలు జరపబోయారు. మహారాజు ఆ అతిథి సత్కారాలను తిప్పికొట్టాడు.*


*'ఇవన్నీ అనవసరం. యుద్ధం.. యుద్ధం మాత్రమే కావాలి' అని అట్టహాసం చేశాడు.*


*అప్పుడు నర-నారాయణులు, “ఎవరితోనూ సంబంధం లేకుండా కళ్లు మూసుకుని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులం మేం. మాతో యుద్ధం చేయాలనే కోరిక ఎందుకు కలిగింది మీకు?” అని ప్రశ్నించారు.*


*వారి మాటలు వినిపించుకోలేదు మహారాజు. “ఈ రోజు నాతో మీరు యుద్ధం చేయాల్సిందే” అని పట్టుబట్టాడు. అలా అంటూనే బాణం తొడుగుతుండగా, అది చూసిన నరుడు నవ్వుతూ, ఒక దర్బపుల్ల తీసి, “ఇదిగో! ఈ గడ్డిపరక నీ సేనను నిలువరిస్తుంది” అని                                    ఆ దర్భను వదిలాడు.*


*ఆ రాజు బాణ వర్షం కురిపించాడు. ఆ గడ్డిపరక అన్ని బాణాలనూ ముక్కలు ముక్కలు చేసింది.*


*ఈలోగా రాజు సైన్యంలోని వారందరూ ముక్కులూ, చెవులూ ఊడిపోయి రోదనలు చేయడం మొదలుపెట్టారు.* 


*రాజుకి ఇదంతా చూసి తల తిరిగిపోయింది. సేనలు పలాయనం చేస్తున్నాయి. అది చూసి రాజుకు గుండె జారింది. ఆయుధాలన్నీ కిందపెట్టి, తల వంచి నర-నారాయణుల పాదాల మీద వాలాడు రాజు. *


*“ఆర్యా!  నన్ను క్షమించి అనుగ్రహించండి. నా గర్వానికి ప్రాయశ్చిత్తం అయింది” అని దీనంగా ప్రార్థించాడు.*


*అప్పుడు, నర-నారాయణులు నవ్వుతూ, “మహారాజా! సిరిసంపదలు కలవారు పేదసాదలకు దాన ధర్మాలు చేసి గొప్పవారు కావాలి. అలాగే, బల పరాక్రమాలు ఉన్న వారు దుర్మార్గుల బారి నుంచి సజ్జనులను రక్షించడానికి తమ శక్తియుక్తులను వినియోగించాలి. అంతేగానీ, అహంకారంతో ఇలా తిరగరాదు. ఇరుగు పొరుగులకు ఉపకారం చేయని వాడి జన్మ వ్యర్థం” అన్నారు.*


*మహారాజు వారి బోధ విని, ఆనాటి నుంచి అహంకారం విడిచి, అందరి శ్రేయస్సునూ దృష్టిలో ఉంచుకుని తన సంపదలను బీదలకు దానం చేస్తూ, తన బలంతో దుర్మార్గులనూ, క్రూరులనూ శిక్షించి, న్యాయమార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు.*


*కనుక దుర్యోధనా! అహంకారం, బల గర్వం ఎప్పుడూ పనికిరావు. అవి ఎవరికి ఉంటాయో వారినే నాశనం చేస్తాయి” అని చెప్పడం ముగించాడు పరశురాముడు.*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀

విశ్వామిత్రుని

 

*విశ్వామిత్రుని మరియు జమదగ్ని ల              *             * జన్మ వృత్తాంతం*

                     ➖➖➖✍️


*పూర్వం చంద్ర వంశం లో గాధి అనే క్షత్రియుడు ఉండేవాడు.*


*ఈ దంపతులకు మగ సంతానం కలగాలనే ఆకాంక్ష ఉంది. కానీ ఇతనికి సత్యవతి అనే కూతురు మాత్రమే జన్మించింది.* 


*ఆమెను ‘ఋచీకుడు’ అనే బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు గాధి.*


  *గాధి కి మగ సంతానం కలగాలనే ఆకాంక్ష తో  తన అల్లుడు ఋచీకుడు బ్రాహ్మణుడు అయిన కారణంగా ఆయనతో యజ్ఞాలు జరిపించాలని పూనుకొని ఋచీకుడి తో విషయం చెప్పాడు.* 


*ఋచీకుడు తన మామ చెప్పిన మాటలు విని తన భార్య అయిన సత్యవతి కోసం బ్రాహ్మణ మంత్రాలతో,  తన మామ అయిన గాధి కోసం క్షత్రియ మంత్రాలతో యజ్ఞాలను విడివిడి గా నిర్వహించి, యజ్ఞ ఫలాలను తయారు చేశాడు.*


*ఋచీకుడు యజ్ఞాలు పూర్తి చేసి చరువులను(యజ్ఞ ఫలాలను) తన భార్య సత్యవతికి బ్రాహ్మణ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, తన అత్త అయిన గాధి భార్యకు క్షత్రియ మంత్రాలతో వచ్చిన ఫలాన్ని, విడివిడిగా ఇచ్చి స్నానానికి వెళ్ళిపోతాడు.* 


*గాధి భార్య   కొంత దుర్బుద్ధి తో ఆలోచించి ఇలా అనుకుంది… "ఋచీకుడు తన భార్య కు మంచి లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం జరిపించి మంచి ఫలాన్ని తన భార్యకు, మామూలు లక్షణాలు గల సంతానం కలిగేలా యజ్ఞం గావించి ఆ ఫలాన్ని నాకు ఇచ్చి ఉంటాడు. ఎలాగైనా ఈ యజ్ఞ ఫలాలను తారుమారు చేయాలి!" అనుకుంది. తన కూతురు అయిన సత్యవతిని ఒప్పిస్తుంది. సత్యవతి కూడా విషయం తెలియక ఒప్పుకుని తన ఫలాన్ని తన తల్లి కి మరియు తన తల్లి ఫలాన్ని తానూ తారు మారు చేసుకుని సేవిస్తారు.*


 *స్నానం చేసుకుని తిరిగివచ్చిన ఋచీకుడు జరిగిన విషయం తెలుసుకొని తన భార్య ను ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. “ఇలా జరిగినందుకు నీకు(అంటే ఋచీకుడు మరియు సత్యవతీ దంపతులకు) క్షత్రియ లక్షణాలు కలిగిన బాలుడు, మీ అమ్మ (గాధి దంపతులకు)కు బ్రాహణ లక్షణాలు కలిగిన బాలుడు జన్మిస్తాడు” అని ఋచీకుడు తెలియజేస్తాడు.*


*ఋచీకుడు, సత్యవతి కోరిక మేరకు జరిగిన తప్పు ను మన్నించి పుట్టబోయే సంతానంలో  కొంత మార్పు చేస్తాడు. తమకు సత్యవతి, ఋచీకుల దంపతులకు) కొడుకు గా కాకుండా మనుమడు గా క్షత్రియ లక్షణాలు గల బాలుడు జన్మిస్తాడు అని చెబుతాడు.  తద్వారా గాధి దంపతులకు జన్మించిన బాలుడు విశ్వామిత్రుడుగా,  సత్యవతి - ఋచీకుల దంపతులకు జన్మించిన బాలుడు జమదగ్ని మహర్షి గా ఎదుగుతారు. ఈ జమదగ్ని మహర్షి కుమారుడే పరశురాముడు.*


 *ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏమిటంటే...                   ఈ మధ్య కాలం లో కులాల పేరుతో చాలా గొడవలు, హత్యలు జరుగుతున్నాయి కానీ వారికి కులం అనేది పుట్టుకతో వచ్చింది కాదు వృత్తి ధర్మాన్ని అనుసరించి ఉంటుంది అనే విషయం తెలియదు. ఇటువంటి కథలు చదివినపుడు మాత్రమే అసలైన విషయం తెలుసుకుంటారు.*


   *పూర్వం సూర్య వంశం లో ‘శ్రాద్ధ దేవుడు - శ్రద్ధ’ అనే దంపతులకు దృష్టుడు, దిష్టుడు అనే కుమారులు ఉన్నారు. వీరిలో దృష్టుడు పేరుతో దార్జ వంశం అవతరించింది. ఈ దృష్టుడు పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి బ్రాహ్మణుడి గా    పేరు తెచ్చుకున్నాడు. అలాగే దిష్టుడు కూడా పుట్టుకతో క్షత్రియుడు. కానీ, ఆయన చేసిన వృత్తి ధర్మాన్ని బట్టి వైశ్యుడి గా పేరు గాంచాడు.


    ముగింపు: విశ్వామిత్రుడు, పరశురాముడు, ధృష్టుడు, దిష్టిడు మొదలైన వారి కులాలు పుట్టుకతో నిర్ణయించబడలేదు. వారి వృత్తి ధర్మాన్ని బట్టి వారి కుల నిర్ణయం జరిగింది. అంటే ఉదాహరణకు బ్రాహ్మణ కులం లో జన్మించిన వ్యక్తి వ్యాపారాలు చేసినట్లైతే వైశ్యుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేస్తే క్షత్రియుడు గా, సేవా కార్యక్రమాలు చేస్తే శూద్రుడు గా పరిగణించవచ్చు. అలాగే శూద్రులు కూడా వేదాలు పఠించడం, పాఠాలు చెప్పడం వంటివి చేసినపుడు బ్రాహ్మణుడు గా, పాలన లేదా దేశ రక్షణ వంటి పనులు చేసినపుడు క్షత్రియుడు గా, వ్యాపారాలు చేసినపుడు వైశ్యుడు గా పరిగణించాలి. ఇదే నియమం క్షత్రియులకు మరియు వైశ్యులకు కూడా వర్తిస్తుంది. ఈ విషయాన్ని మనం గ్రహించినపుడు కులాల పేరుతో జరిగే గొడవలను మనం ఆపగలము.✍️


    గమనిక: పై రెండు కథలు పోతన భాగవతం లోని నవమ స్కంధం లోనివి.✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/GovHUA7t8FaBM4Tw2BTnJq

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…గ్రూప్“*  లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మెసేజ్ పెట్టండి...

9493906277

లింక్ పంపుతాము.🙏

యోగవాసిష్ఠ రత్నాకరము*

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-125


నానన్దాయ మమోద్యానం న సుఖాయ మమ స్త్రియః న హర్షాయ మమార్థాశా శామ్యామి మనసా సహ. 


ఉద్యానవనములు నాకు ఆనందమును గలుగజేయుట లేదు; స్త్రీలు నాకు సుఖమును గలుగజేయుట లేదు; ధనప్రాప్తి నాకు హర్ష మొసంగుటలేదు; నేను కేవలము మనస్సహితముగ శాంతి నొందగోరుచున్నాను. 


1-126


కిం మే రాజ్యేన కిం భోగైః కిమర్థేన కిమీహితైః అహంకారవశాదేతత్స ఏవ గలితో మమ. 


నాకు రాజ్యముచేగాని, భోగములచేగాని, ధనముచేగాని, చేష్టలచేగాని, యేమి ప్రయోజనము? ఇవి యన్నియు అహంకారము వలన నుద్భవించినవి. ఆ అహంకారమే నశించిపోయునది.


1-127


జన్మావలివరత్రాయామింద్రియగ్రన్థయో దృఢాః 

యే బద్ధాస్తద్విమోక్షార్థం యతన్తే యే త ఉత్తమాః. 


జన్మ సమూహమను చర్మరజ్జువునందు ఇంద్రియములను దృఢగ్రంథులచే (గట్టి ముడులచే) జీవులు బంధింపబడియున్నారు. అందు ఎవరు ఆ గ్రంథుల నుండి విడివడుటకు యత్నించుదురో, వారే ఉత్తములు.


1-128


అద్యచేత్స్యచ్ఛయా బుద్ధ్యా మునీన్ర్ధ న చికిత్స్యతే 

భూయశ్చిత్త చికిత్సాయాస్త త్కిలావసరః కుతః.  


ఓ మునీంద్రా! ఈ బాల్యకాలముననే నిర్మలబుద్ధిచే చిత్తము చికిత్స గావింపబడనిచో, మరల తక్కిన (యౌవనాది) అవస్థల యందు అట్టి 

చిత్తచికిత్సకు అవకాశ మెక్కడ?!


1-129


విషం విషయవైషమ్యం న విషం విషముచ్యతే జన్మాన్తరఘ్నా విషయా ఏకదేహహరం విషమ్‌.


విషము విషము కాదు; (దృశ్య)విషయములే విషము; ఏలయనిన, విషము ఒక దేహమునే నశింపజేయును; విషయములో అజ్ఞాన వాసనాదుల ద్వారా జన్మాంతరము లందును మృత్యువును గలుగజేయును. 


1-130


తద్భవామి యథా బ్రహ్మన్‌ పూర్వాపరవిదాం వర వీతశోక భయాయాసో జ్ఞస్తథోపదిశాశు మే.


పూర్వాపరముల నెఱుఁగువారిలో నుత్తముడగు మహాత్మా! తత్త్వజ్ఞానమునుఁబడసి, భయశోకాయాసముల నుండి విడివడి నేను ఎట్లుండగలనో ఆ పద్ధతిని శీఘ్రముగ నుపదేశింపుడు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-137


మోహమాతంగమృదితా కలంకకలితాంతరా 

పరం ప్రసాదమాయాతి శేముషీసరసీ కథమ్‌. 


అజ్ఞానమగు ఏనుగు వలన కెలకబడి, మురికియైన బుద్ధియను సరోవరము ఏ విధముగ అత్యంత నిర్మలత్వమును బొందగలదు? 


1-138


సంసార ఏవ నివహే జనో వ్యవహరన్నపి 

న బంధం కథమాప్నోతి పద్మపత్రే పయో యథా.


మనుజుడు సంసార వ్యవహారములందు బాల్గొనుచున్నను తామరాకునందలి నీటిబొట్టువలె, నిర్లిప్తుడై యుండగల్గుట కుపాయమేమి? 


1-139


అత్మవత్తృణవచ్చేదం సకలం కలయన్‌ జనః కథముత్తమతామేతి మనోమన్మథమస్పృశన్‌.  


ఈ సమస్త జగత్తును అంతర్దృష్టిచే ఆత్మగను, బహిర్దృష్టిచే తృణతుల్యము (తుచ్ఛము) గను గాంచుచు, మనస్సుచే కామాది వృత్తులను స్పృశించక ఇవ్విధమున మనుజుడు ఉత్తమత్వము నెట్లు పొందగలడు?


1-140


కిమిహ స్యాదుపాదేయం కిం వా హేయమథేతరత్‌ కథం విశ్రాంతిమాయాతు చేతశ్చపలమద్రివత్‌. 


ఈ ప్రపంచమున గ్రహింపదగిన దెద్ది? త్యజింపదగిన దెద్ది? చంచలమగు చిత్తమును పర్వతమువలె స్థిరమొనర్చు టెట్లు? 


1-141


కేన పావనమంత్రేణ దుఃసంసృతివిషూచికా 

శామ్యతీయ మనాయాసమాయాసశతకారిణీ. 


లెక్కలేనన్ని బాధలను గలిగించు ఈ సంసారమను విషూచివ్యాధి ఏ పవిత్రమంత్రమువలన ఉపశమింపగలదు? 


1-142


ప్రోచ్చవృక్షచలత్పత్రలమ్బామ్బు లవభఙ్గురే 

ఆయుషీశానశీతాంశుకలామృదుని దేహకే. 


ఆయువు ఎత్తైన చెట్టుయొక్క కదలుచున్న ఆకు చివర వ్రేలాడు నీటి బొట్టువలె క్షణభంగురమై యున్నది. మఱియు వర్షాకాలపు బాలచంద్రునివలె అయ్యది దేహము దుర్లక్ష్యమై యున్నది.

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-131


క్రకచాగ్రవినిష్పేషం సోఢుం శక్నోమ్యుహం మునే సంసారవ్యవహారోత్థం నాశావిషయవైశసమ్‌. 


ఓ మూనీశ్వరా! ఱంపపు పండ్లయొక్క ఘర్షణము నైనను సహించుటకు నేను శక్తుడను, కాని సంసారవ్యవహారము వలన కలుగు ఆశావిషయముల బాధను మాత్రము సహింపజాలను. 


1-132


విద్యన్త ఏవేహ న తే మహాత్మన్‌ 

దురాధయో న క్షయమాప్నువన్తి

యే సఙ్గమేనోత్తమమానసానాం 

నిశాతమాంసీవ నిశాకరేణ. 


మహాత్మా! చంద్రుని ప్రకాశముచే అంధకారము క్షయించునట్లు, ఈ ప్రపంచమున ఉత్తమ మానసులగు మహాత్ముల సాంగత్యముచే క్షయింపని దుష్టమానసక వ్యథ లెవ్వియును లేవు. 


1-133


ఆయుర్వాయువిఘట్టితాభ్రపటలీలమ్బామ్బువద్భఙ్గురం 

భోగా మేఘవితానమధ్యవిలసత్సౌదామినీచంచలాః, లోలా యౌవనలాలనాజలరయ శ్చేత్యాకలయ్య ద్రుతం 

ముద్రైవాద్య దృఢార్పితా నను మయా చిత్తే చిరం శాన్తయే. 


ఆయువు వాయువుచే చలింపబడిన మేఘపటలమందు వ్రేలాడు జలబిందువుల వలె క్షణభంగురమైనది; భోగములు మేఘవిస్తార మధ్యమందు ప్రకాశించు మెఱుపువలే చంచలమైనవి; యౌవనకాలమందలి చిత్తవినోదము లన్నియు జలప్రవాహమువలే అస్థిరములైనవి ఈ విషయమును నేనీ బాల్యకాలముననే శీఘ్రముగ విచారించి చిత్తమున చిరకాల శాంతిప్రాప్తి కొరకై దృఢనిశ్చయము గావించుకొంటిని.


1-134


వికల్పేభ్యో లుఠన్త్యేతాశ్చాంతఃకరణవృత్తయః 

శ్వభ్రేభ్య ఇవ సారఙ్గాస్తుచ్ఛాలంబవిడంబితాః. 


గోతిని కప్పియున్న పచ్చికకై పరువిడి, లేళ్ళు అందు పడునట్లు తుచ్ఛ విషయములకై పరువిడు మనోవృత్తులు దుఃఖమున కూలిపోవుచున్నవి.


1-135


అతోఽ తుచ్ఛమనాయాస మనుపాధి గత భ్రమమ్‌ కిం తత్థ్సితిపదం సొధో యత్ర శోకో న విద్యతే.  


ఓ సాధూ! తుచ్ఛమగు (దృశ్య) విషయము కానిదియు, జనన మరణాది ఆయాసరహితమును, దేహాద్యుపాధిశూన్యమును, భ్రమవర్జితమును, శోకరహితమునగు విశ్రాంతిస్థాన మేది?


1-136


కాం దృష్టిం సముపాశ్రిత్య భవన్తో వీతకల్మషాః 

మహాన్తో విచరన్తీహ జీవన్ముక్తా మహాశయాః.


మిమ్ముబోలు జీవన్ముక్త మహాశయు లెట్టి దృష్టి నవలంబించి ఈ సంసార క్షేత్రమున సంచరించుచున్నారు?!

 *యోగవాసిష్ఠ రత్నాకరము* 


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-143


క ఉపాయో గతిః కా వా కా చిన్తా కః సమాశ్రయః కేనేయమశుభోదర్కా న భవేజ్జీవితాటవీ.


ఇట్టి స్థితియందు నాకు ఉపాయ మేమి? మార్గ మెయ్యది? దేనిని చింతించుదును? దేనిని ఆశ్రయించుదును? ఏ యుపాయముచే ఈ జీవితారణ్యము శుభప్రదము కాగలదు? 


1-144


రాగద్వేష మహారోగా భోగపూగా విభూతయః 

కథం జన్తుం న బాధన్తే సంసారార్ణవచారిణమ్‌. 


సంసార సముద్రమందు చరించు మనుజుడు ఏమి యొనర్చినచో రాగద్వేషాత్మకములగు మహారోగములు, భోగసర్ప సమూహములు ఆతనిని పీడింపకుండును? 


1-145


మనో మననశాలిన్యాః సత్తాయా భువనత్రయే 

క్షయో యుక్తిం వినా నాస్తి బ్రూత తామలముత్తమామ్‌. 


దృశ్యవిషయములను మననము చేయునట్టి వాసనాసహితమగు మనస్సు యొక్క నాశము ఉత్తమయుక్తి లేనిచో ముల్లోకములందును ఎన్నడును సంభవింపనేరదు. కాబట్టి ఓ మునీశ్వరా! అట్టి యుక్తిని నాకు లెస్సగ నుపదేశింపుడు.


అత్తఱి వేదవేత్తలగు శ్రీ వసిష్ఠ విశ్వామిత్ర సహిత నారదాది మహర్షులు నతశిరస్కుఁడగు శ్రీరామచంద్రుని నుద్దేశించి యిట్లు పలికిరి.      

    కుమారుఁడగు శ్రీరాముఁడు వైరాగ్య పరిపూర్ణములును, ఉదారములును శుభప్రదములును నగు వాక్కుల నుడివినాడు. 


ఋషయ ఊవాచః


1-146


ప్రజ్ఞాదీపశిఖా యస్య రామస్యేవ హృది స్థితా ప్రజ్వలత్యసమాలోక కారిణీ స పుమాన్స్మృతః


శ్రీరామచంద్రునకువలె అసాధారణమగు పదార్థతత్త్వ ప్రకాశమును గావించునట్టి ప్రజ్ఞయను దీపశిఖ యెవని హృదయమందుండునో ఆతడే పురుషుడు. 


1-147


రక్త మాంసాస్థియన్త్రాణి బహూన్యతితరాణిచ పదార్ధానభికర్షన్తి నాస్తి తేషు సచేతనః. 


ప్రజ్ఞాహీనులైన జనులు రక్త మాంస, అస్థిరూప శరీరములను యంత్రములే యగుదురు. దేహమం దాత్మబుద్ధి గలవారగుటచే వారు అనేకములగు శబ్దస్పర్శాది పదార్థముల ననుభవించుటయందే జీవితమును గడుపుచున్నారు. అట్టివారు అత్మజ్ఞానార్థము పురుషార్థము నొనర్పనివా రగుటచే అచేతనులే యగుదురు.

 *యోగవాసిష్ఠ రత్నాకరము*


వైరాగ్య ప్రకరణము

ఒకటవ అధ్యాయము 

రాఘవ వైరాగ్య వర్ణనము


1-148


జన్మ మృత్యు జరాదుఃఖమనుయాన్తి పునః పునః విమృశన్తి న సంసారం పశవః పరిమోహితాః. 


ఎవరు ఈ సంసార తత్త్వమును గూర్చి విచారింపరో, వారు అజ్ఞానముచే మోహితులును, పశువులునై యున్నారు. మఱియు నట్టివారు మరల మరల జన్మమృత్యు జరాదుఃఖములందు తగుల్కొందురు. 

కామాది శత్రువులను మర్ధించునట్టి ఈ శ్రీరామచంద్రునివంటి నిర్మల అభిప్రాయము గలవాడును, పూర్వాపర విచారమందు సమర్థుడు నగు మనుజుడు ఈ ప్రపంచమున ఎచటనో ఒకచోట ఎంతయో ప్రయాసచే కానుపించును.(బహుదుర్లభుడని భావము). 


1-149


అమత్తమచమత్కారఫలాః సుభగమూర్తయః

భవ్యా హి విరలా లోకే సహకారద్రుమా ఇవ. 


సర్వోత్కృష్ట మాధుర్యము (ఆనందము)తో గూడిన ఆత్మ సాక్షాత్కారమను ఫలములతో గూడినవారును, సౌభాగ్యమూర్తులగు ఉత్తములు ఈ లోకమున తియ్యనిమామిడి చెట్లవలె అరుదుగా నున్నారు. 


1-150


సుభగాః సులభారోహాః ఫలపల్లవశాలినః 

జాయన్తే తరవో దేశే న తు చన్దనపాదపాః.


సుందరములును, ఎక్కుటకు సులభములును, ఫలపల్లవాదులచే శోభితములు నగు వృక్షములు అన్నిచోట్లను పుట్టునుగాని చందన వృక్షములు మాత్రము కాదు.


1-151


వృక్షాః ప్రతివనం సన్తి నిత్యం సఫలవల్లవాః నత్వపూర్వచమత్కారో లవఙ్గః సులభః సదా.


ఫలపల్లవాది సహితములగు వృక్షములు అన్ని వనములందును గలవు కాని అపూర్వ చమత్కారము (విశేషము)తో గూడిన లవంగ వృక్షము మాత్రము సదా అన్నిచోట్లను సులభముగా లభించదు. 


1-152


యతన్తే సారసంటప్రాప్తౌ యే యశోనిధయో ధియః 

ధన్యా ధురి సతాం గణ్యాస్త ఏవ పురుషోత్తమాః.


సారమగు ఆత్మవస్తువు యొక్క సంప్రాప్తికై ప్రయత్నించువారును, సదా తత్త్వచింతాపరులును, 

కీర్తినిలయులునగు మనుజులే ధన్యులు, వారే సత్పురుషులలో శ్రేష్ఠులు, మఱియు నట్టివారే పురుషోత్తములు. 


1-153


న రామేణ సమోఽ స్తీ హ దృష్టో లోకేషు కశ్చన 

వివేకవానుదారాత్మా న భావీ చేతి నో మతిః. 


శ్రీరామచంద్రునితో సమానుడగు వివేకవంతుడును, ఉదారశీలుడును, ఈ లోకమం దెవడును పూర్వము గాంచబడి యుండలేదు. ఇపుడును అట్టివాడెవడును లేడు; ముందు నుండబోడని మా యభిప్రాయము.  


శ్రీవాల్మీకీచే రచింపబడిన మోక్షోపాయమగు యోగవాసిష్ఠరత్నాకరమందు వైరాగ్యప్రకరణములో రాఘవవైరాగ్యవర్ణనమను మొదటి అధ్యాయము సమాప్తము. 


*వైరాగ్య ప్రకరణం సమాప్తము.*

🙏

గహనా కర్మణో గతిః

 గహనా కర్మణో గతిః 

కర్మ గతి తెలుసుకోవడం చాలా కష్టం.


కర్మ ముందా? జన్మ ముందా?


 కర్మని బట్టి జన్మ కాదు, కర్మని బట్టి పునర్జన్మ ఉంటుంది. కర్మ వల్ల జన్మ, జన్మ వల్ల కర్మ వస్తుంది. ఇది ఒక చక్రం. కానీ, మొదటి జన్మకి మునుపు, మనకి జన్మ లేనప్పుడు కర్మ కూడా ఉండదు కదా? అసలు మొదటి జన్మ ఏది, మనకి ఎలా వచ్చింది? అంతకుముందు మనం ఎవరం? అసలీ జన్మ చక్రంలో మనం ఎలా చిక్కుకున్నాం? వీటికి లాజికల్గా ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు. ఈ ప్రశ్నలని ఎంతమంది వేదాంతులని, మహాత్ములని, సత్పురుషులని అడిగినా కూడా ఇంతదాకా ఎవరూ సంతృప్తికరమైన జవాబు ఇవ్వలేదు. చెట్టు ముందా? విత్తు ముందా? ఎవరు చెప్పగలరు?


అమెరికాలో వివిధ మతసమ్మేళనం జరిగినప్పుడు దానికి హాజరైన *స్వామి వివేకానందుని* ఎవరో ఇదే ప్రశ్న వేస్తె దానికి ఆయన ఇచ్చిన జవాబు. "ఈ జనన మరణ చక్రంలో ఎప్పుడు చిక్కుకున్నామో, ఎందుకు చిక్కుకున్నామో, ఎలా చిక్కుకున్నామో మా హిందూ సనాతన ధర్మం చెప్పలేదు. కానీ ఈ చక్రంనుంచి ఎలా తప్పుకోవాలో మాత్రం చెప్పింది."


వేదాంతంలో ఇంకో ఉదాహరణ కూడా చెప్తారు. అసలు మనకి మొదటి జన్మ ఎలా వచ్చింది అంటే? నీ కల ఎలా ప్రారంభం అయిందో నువ్వు గుర్తించగలిగితే నీకు మొదటి జన్మ ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది అని.


సమాధానం దొరకని ప్రశ్నని పట్టుకుని వేలాడేకంటే ఈ చావుపుట్టుకలనించి తప్పుకోవడం తెలివైన పని. కృష్ణుడు కూడా అర్జునుడితో అదే చెప్తాడు. "ఈ కర్మలు, జన్మలు ఇదంతా పెద్ద సాలెగూడులాంటిది అర్జునా.. దీనిగురించి ఎంత ఆలోచించినా జవాబు కష్టం. అందుకే అవన్నీ వదిలేసి నన్ను శరణువేడు అని"


అందుకే భగవాన్ రమణమహర్షి అంటారు. భగవంతుడికి శరణాగతి చెందినవారి పూర్వ జన్మ కర్మలు వానికి అనుకూలంగానే ఉంటాయి కానీ, ప్రతికూలంగా వుండవు అని.


ఎలా ఈ కర్మ-జన్మ చక్రం నుంచి తప్పుకోవాలో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు 18 అధ్యాయాల్లో చెప్పాడు.


చెట్టు ముందా? విత్తు ముందా? ఈ రెండిటికి ముందున్నవాడు ఒకడున్నాడు. ఆయనే పరమాత్మ. తన సంకల్పాన్ని బట్టి ఆయన చెట్టు నుంచి విత్తుని లేదా విత్తు నుంచి చెట్టుని సృష్టించగలడు.

---‐--------‐------------------‐-----------------

పై దానికి నా సమాధానము 👇


*కర్మ ముందా? జన్మ ముందా?* అంటే కర్మయే ముందు. కర్మ పుట్టిన తరువాతనే జన్మ వచ్చిందని నేను అంటాను. 


ఎలా? అంటే....


ఒకప్పుడు ఈ సృష్టికి పూర్వం భగవంతుడు/దేవుడు ఇలా అనేక పేర్లతో పిలువబడే దైవశక్తి ఉన్నది. ఒకానొక సమయంలో ఆ దైవశక్తి *నేను రెండుగా అగుగాక!* అని సంకల్పించెను. ఆ సంకల్పమాత్రమున ఏర్పడిన రెండవ భాగమే మొదటి జన్మ. ఆ సంకల్పమే కర్మ. అంతకు ముందు ఉన్న దైవశక్తి *ఆనాది*. అంటే దానికి పుట్టుక అనేది లేదు. భగవద్గీతలో కృష్ణపరమాత్మ *నేను... అనగా వాసుదేవుడనైన నేను.... భగవానుడనైన నేను.... "అనాది"* నాకు ముందు ఏదియూ లేదు. అంటాడు.ఆ అనాది ఎలా ఏర్పడినదనే దానికి ఎక్కడా సమాధానము లేదు. అని భగవానుడు చెప్పాడు భగవద్గీతలో. 


ఆతరువాత సృష్టికి మాత్రం నేను రెండుగా అగుగాక! అనే సంకల్ప క్రియయే కారణము. కనుక కర్మ ముందు. జన్మ తరువాత. 

మీ 

*~శ్రీశర్మద* 

+91 8333844664

సాదాకా మేలుకో -5 అన్నిటి యందు సమ భావము

 *సాధకా మేలుకో -5 అన్నిటి యందు సమ భావము*

  

గత కండికలో మనం సాధకుడు స్త్రీపురుష సమ భావం గురించి   తెలుసుకున్నాము. ఇప్పుడు సాధకుడు అంతకంటే ఉత్కృష్టమైన కఠినమైన సమభావన దేనిమీద ఎలా కలిగి ఉండాలో తెలుసుకుందాం. నిజానికి ఇంత కఠినంగా సాధనచేసే సాధకుడు ప్రస్తుత సమాజంలో ఉన్నారో లేరో కూడా మనం  ఊహించలేము. కానీ హిమాలయాల్లో, అరణ్యాలలో సాధనచేసే సత్పురుషులు ఇప్పటికి ఉండవచ్చు. ఆ దశకు చేరుకోవటం అంటే ఒకరకంగా మోక్ష స్థితిని చేరుకోవటంగా మనం భావించవచ్చు. 


ముందుగా సర్వ జీవులయందు సమభావం కలిగి ఉండటం.  సాధకుడు తన సాధన కొంత ముందుకు వెళ్లిన తరువాత తన  శరీరంలో,మానసిక స్థితిలో కొన్ని మార్పులు  తెలుయకుండానే వస్తాయి. ఒక యతీశ్వరుని సాధన శక్తి అతని కళ్లలోనే కనపడుతుంది.  శరీరం పూర్తిగా శుష్కించి వుండి కన్నులు తీవ్రంగా వాడిగా వుండి సామాన్యులు అతని కన్నులలోకి చూడటానికే భయపడేటట్లు ఉంటాయి. 


సాధకుడు సర్వ జీవులయందు సమభావంతో ఉండటంతో ప్రతిజీవి కూడా తన సహజ గుణాలని మరచి సాధకునికి సన్నిహితంగా  ఉంటుంది. ఒక పర్యాయం స్వామి వివేకానంద విదేశాలలో ఒక గ్రామంలో తన ఇద్దరు శిష్యులతో నడుచుకుంటూ వెళ్లుతున్నారట అప్పుడు ఒక యెద్దును సమీపంలో వున్న రైతు అదిలిస్తే అది  వేగంగా దూకుతూ  వారి వద్దకు వచ్చిందట.  ఒక శిష్యుడు దానిని చూసి పరిగెత్తి వెళ్ళాడట. స్వామి ప్రక్కన వున్నా శిష్యురాలు క్రింద  పడినాడట. కొంచం అయితే ఆ ఎద్దు పాదాలక్రింద ఆమె నలిగి పోయేది అట్టి  వివేకానంద స్వామి వేగంగా వెళ్లి ఆ ఎద్దు ముందు నిలపడినారట అంటే స్వామిని చూసిన ఆ ఎద్దు వెంటనే అక్కడే ఆగిపోయి స్వామి చెంత ప్రశాంతతతో  వున్నాడట. 


సాధకుడు చేసే సాధన వల్ల ప్రక్రృతి పూర్తిగా వసంగా ఉంటుంది. ఏ విధంగా సాధకుడు తన సాధనను వృద్ధి చేసుకొని భగవంతునికి దగ్గరగా వేళతాడో అదే విధంగా ప్రకృతి సదా సాధకుని వెన్నంటుకొని వుండి రక్షిస్తుంది. ఈ విషయం మనలో కొందరికి అనుభవమే కదా. 


ఒక గురువుగారు తన శిష్యగణంతో నాయనలారా జగమంతా బ్రహ్మ మాయం,  నేను బ్రహ్మను, నీవు బ్రహ్మవు,  కనిపించేది అంతా బ్రహ్మయే, బ్రహ్మ కానిది ఏది లేదని తెలిపారట.  పాఠం వంట పట్టిన ఒక శిష్యుడు వీధిలో వెళుతున్నాడు. మనస్సులో ఒకటే ఆలోచన గురువు గారు తెలిపిన సత్యాన్ని పరీక్షించుకోవటం ఎలా అలా అని ఆలోచిస్తూ ఉంటే అతనికి ఎదురుగా ఒక ఏనుగు కనపడింది.  వెంటనే అతని మదిలో ఒక ఆలోచన మెదిలింది.  ఇదే మంచి సమయం గురువుగారు బోధించిన విషయం నిర్ధారించుకోవటం కొరకు అని అనుకోని ఆ ఏనుగుకు ఎదురుగా వెళ్ళాడట.  అప్పుడు ఏనుగు మీద వున్న మావటి బాబు ప్రక్కకు వెళ్ళు ఏనుగు నిన్ను తొక్కుతుంది అని హెచ్చరించాడట.  కానీ అంతా బ్రహ్మ అని నమ్మే మన శిష్యుడు అతని మాటలను పెడచెవి పెట్టి ఏనుగుకు ఎదురుగా నిలబడి ఏనుగులో వున్న బ్రహ్మ తనను ఏమిచేయదు అని స్థిరంగా వున్నాడు.  కానీ ఒక్క క్షణంలో ఏనుగు తొండంతో వానిని పట్టుకొని ప్రక్కన వున్న పొదలలోకి విసిరింది. క్రింద పచ్చని చెట్లు ఉండటంతో పెద్ద దెబ్బలు తగలకుండా బతుకు జీవుడా అని పరిగెత్తి వెళ్లి గురువు గారిని చేరుకొని గురువు గారు మీరు చెప్పింది నిజం కాదు అని ఏనుగులో వున్న బ్రహ్మతో తనకు కలిగిన పరాభవాన్ని తెలియ చేసాడు.  దానికి గురువు గారు నాయనా నీవు బ్రహ్మను గురించి తెలుసుకున్నావు కానీ ఏనుగును తెలుసుకోలేదు కదా అయినా ఏనుగు మీద వున్నా బ్రహ్మ (మావటి) నిన్ను జాగ్రత్త పరిస్తే ఎందుకు వినలేదని మందలించాడట. 


ప్రతి సాధకుడు సదా జాగరూకుడై వుండి విచక్షణతో మెలగాలి. అందుకే సాధన సంపత్తితో ముందుగా మనం తెలుసుకునేది వివేకం కదా. 


విషయ వాంఛల మీద సమ భావము కలిగి ఉండటం ఇది ఇంకా కఠినమైనదిగా వేదాంతులు చెపుతారు. ఒక రాజ్యంలో రాజుగారు ఆయన సతీమణి అంటే రాణిగారు ఇద్దరు వైరాగ్యం చెంది తమ రాజ్యాన్ని వదలి వెళ్లాలని నిర్ణయించుకొని అరణ్య మార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారట.  ముందుగా పతి నడుస్తుంటే అతనికి కొంచెం దూరంలో పత్ని నడుస్తూ వున్నది.  కొంత దూరం వెళ్లిన తరువాత పతిగారు నేలమీద కాలితో మట్టిని ఒక ప్రక్కకు నెట్టారట.  అది చూసి సతీమణి స్వామి మీరు ఎందుకు అక్కడ మట్టిని కాలితో తోశారు అని అడిగింది అప్పుడు ఆయన అక్కడ నేను ఒక బంగారు గొలుసును చూసాను నీవు దానిని చూసి ఎక్కడ మానసిక వికారానికి లోనవుతావు అని అలా చేశాను అని అన్నారు.  దానికి ఆ సాద్వీమణి ఇంకా మీకు మట్టికి బంగారానికి తేడా తెలుస్తున్నదా అని అన్నారట.  చూసారా ఆ మహాతల్లి వైరాగ్య చింతన.  అంతటి వైరాగ్యం కలగాలంటే మనం యెంత సాధన చేయాలో ఒక్కసారి ఆలోచించండి. 


సాధకుడు పైన పేర్కొన్నట్లు జగత్తులోని అన్నిటి మీద సమభావం కలిగి ఉంటే అప్పుడు మోక్షసాధన చేయటానికి అర్హత పొందగలడు.   


ఓం తత్సత్


ఓం శాంతి శాంతి శాంతిః


ఇట్లు భార్గవశర్మ

ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

 ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి వర్ధంతి సందర్భంగా నివాళులతో


మీ కోట్ నా బూట్లను వెదకడానికి వెళ్లింది :


వేదాంతముల తోడ వెక్కిరింత తోడ -లెక్చర్లు ఇచ్చే ఆయన్ని చూస్తే ఎంతటి వాడికైనా గుండె గుబేలే ..ఆయన చాతుర్యం అటువంటిది.. పైగా ఇంగ్లాండు వెళ్ళి పెద్ద చదువులు చదివి వచ్చిన  వారాయే . సహజ కవి,  ఉన్నత మనస్కుడు కూడా .ఆయనే దుగ్గిరాల గోపాల కృష్ణయ్య -


హిందూత్వ సాధన కోసం,  హిందువుల హక్కుల కోసం పోరాడేందుకు ఒక సేవాసంస్థ, ఒక దండు ఉండాలని ఆశించిన ఆయన

రామదండు సంస్థాపన జేశారు. 


చీరాల పేరాల ఉద్యమం ద్వారా ఆంగ్లేయుల గుండెల్లో నిద్ర పోయిన తెలుగు ఘనుడు. ఆంధ్ర రత్న అని పేరుబడ్డవారు.


వారు దురదృష్టవశాత్తూ చిన్నతనములోనే మరణించారు గానీ లేకున్న అత్యున్నత స్థాయి పదవులు నిర్వహించ వలసినవారు. 


ఓసారి  రైలులో దుగ్గిరాల వారు ప్రయాణిస్తున్నారు. రాత్రి కావొచ్చింది . 


ఓ ఆంగ్లేయుడు అటూ ఇటూ తిరుగుతూ బూట్ల కిర్రు కిర్రు శబ్ధం చేస్తున్నాడు. ఎంతటికీ నిద్ర పట్టడం లేదు వీరికి. 


కాసేపటికి ఆ ఆంగ్లేయుడు నిద్ర పోయాడు. 


వెంటనే దుగ్గిరాల వారు లేచి తన బూట్లతో పెద్ద శబ్ధం చేస్తూ అటూ ఇటు నడవడం ఆరంబించారు. ఆయన గంభీర రూపం చూస్తే ఆంగ్లేయునికి భయం వేసింది .


కాసేపయ్యాక బూట్లు విప్పేసి బెర్త్ కింద పెట్టి నిద్ర పోయారు దుగ్గిరాల వారు.


అదను చూసి ఆ అంగ్లేయుడు ఆ బూట్లను ఎత్తి కింద పడేసాడు కిటికీ నుండి . 


మధ్యలో దుగ్గిరాల వారు మెలుకువ వచ్చి చూస్తే తన బెర్త్ కింద ఉన్న బూట్లు లేవు. సరేలే అని పడుకుని  ఉన్న ఆ ఆంగ్లేయుని ముఖం పరికించాడు . ఆ పని చేసింది అతడే అని తెలుసుకుని అక్కడ తగిలించి ఉన్న అతగాడి కోట్ తీసి కింద పడేసి తనపాటికి తను పుస్తకం ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నారు.


కాసేపయ్యాక టికెట్ కలెక్టర్ వచ్చి అందరి టికెట్టులు అడుగుతున్నారు. ఆంగ్లేయుడు లేచి తన కోట్ కోసం చూస్తే కోటెక్కడ ఉంది. 


మీరు గానీ నా కోట్ చూసారా అని దుగ్గిరాల వారిని అడిగారు ఆ ఆంగ్లేయుడు . 


అది "ఇందాకే పోయిన నా బూట్లను  వెదకడానికి వెడుతుంటే చూసాను " అని సమాధానం ఇచ్చారు ఆంగ్లములో.


అవాక్కయిపోయిన ఆంగ్లేయుడు చేతిలో మళ్ళీ  టికెట్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి.


మొత్తం ఆతను ఉద్యోగానికి వెళ్లవలసిన ప్రాంతపు చిరునామా అన్నీ అందులోనే ఉన్నాయిట .


వాడి మొహం లో నెత్తురు చుక్క లేక పోవడం చూసి టికెట్ కావాలా!!? , కొనమంటావా!!?? అని ఎదురడిగారట.

 



*10వేల ఏళ్ల‌నాటి త్రిశూలం..* 

*3వేల ఏళ్లనాటి వజ్రాయుధం....* 


       బాలి, మలేషియా, జపాన్, చైనా వంటి దేశాల్లో హిందువుల దేవుళ్లను వివిధ పేర్లతో పూజిస్తూ ఉంటారని చెబుతారు. 

తాజాగా మరో దేశంలో హిందూ దేవుళ్ళ ఆనవాలు తవ్వకాల్లో వెలుగులోకి వచ్చాయి. 10 వేల ఏళ్ల నాటి త్రిశూలం, 3 వేల ఏళ్ల కిందటి వజ్రాయుధాన్ని # *కర్ణాటకకు చెందిన వ్యాపారవేత్త సయ్యద్ శామీర్ హుస్సేన్ బెంగళూరులో ప్రెస్ క్లబ్లో ప్రదర్శించారు.* 

ఆయన మీడియాతో మాట్లాడుతూ 2015 మే నెలలో *#ఫిలిప్పిన్స్ మైనింగ్ తవ్వకాలల్లో ఈ త్రిశూలం, వజ్రాయుధం బయటపడ్డాయని తెలిపారు.*

  2012 నుంచి ఫిలిప్పిన్స్ కాపర్, గోల్డ్ మైనింగ్ల్లో తను భాగస్వామిని అని తెలిపారు. వ్యాపార రీత్యా తన సమయాన్ని ఫిలిప్పిన్స్లోనే ఎక్కువగా గడుపుతూ ఉంటానని, అలాగే అక్కడి పౌరులతో కలిసి పనిచేయడం వల్ల వారితో దగ్గరి సంబంధాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు.

ఈ క్రమంలో 2015 మే 5న మైనింగ్ సూపర్వైజర్, తాను మునుపెన్నడూ #చూడని వస్తువులు తవ్వకాలలో బయటపడ్డాయని తెలిపారు.  వాటిని నీటితో శుభ్రం చేయగా అందులో ఒకటి చూడడానికి దేవుడి విగ్రహంలా ఉంది. ఇక రెండోది త్రిశూలంగా గుర్తించామని చెప్పారు. అయితే ఈ రెండూ కూడా హిందూ పురాణాలకు సంబంధించిన వస్తువులుగా నిర్థారించినట్లు తెలిపారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటి ఫొటోలను స్నేహితులందరికీ పంపిన‌ట్లు తెలిపారు.

 

వాటిపై పరిశోధన కోసం ఇంటర్నెట్ లో వెతికారట. త్రిశూలంతో పాటు దొరికిన మరో వస్తువు వజ్రాయుధం అని తెలిసిందని చెప్పారు. అది #హిందూ_పురాణాల్లో ఇంద్ర భగవానుడి ఆయుధం, త్రిశూలం శివుడిది అయ్యుండవచ్చని భావించి తర్వాత భారత్ కు వచ్చి పురావస్తు శాఖ వారిని సంప్రదించామని, పురావస్తు శాఖ మాజీ అధికారి #అంజనీమున్షీ వాటిని పురాతన వస్తువులుగా ఆమోదించారని వివరించారు.

©️ Nijam today 

https://nijamtoday.com/2023/06/10/anciant-trishul-vajrayudh/?fbclid=IwAR2Xjhz5kA0ZJCubOuH3SMdh72wktqViTRkTMl5eWSmXrB7pItdmpSSQa5Y


#karnataka #trishul #vajrayudha #phillipines #benglore #hindu #hinduism

కారణమూ... "మనస్సే",

 🅄🅂🄴🄵🅄🄻 🄸🄽🄵🄾🅁🄼🄰🅃🄸🄾🄽

*అన్ని రోగాలకూ కారణమూ... "మనస్సే", విరుగుడూ... "మనస్సే"    “జపాన్ శాస్త్ర వేత్తలు చేసిన వివిధ ప్రయో గాలలో ఆశ్చర్య కర విషయాలు వెలుగు చూశాయి.*


*ఇంత కాలం మనం "గుడ్డి"గా నమ్ముతున్న అనేక ఆరోగ్య సమస్యలకు మూలాలు మనం తీసుకునే ఆహారం లో లేవని,"మనం జీవించే విధానం లోనే ఉన్నాయని"*

*మనసును హాయిగా ఉంచు కున్న వారికి     ఏ రోగాలు రావని వారు తేల్చి చెబు తున్నారు. అమెరికాలో జరిగిన మరో సర్వేలో కూడా మనసు బాగున్న వారు ఎక్కువ కాలం జీవిస్తున్నారని తేల్చారు.          మనసు కలత బారితే లేని పోని ఆలోచనలు చోటు చేసుకుని వాటి నుంచి బైటపడ డానికి "బలహీనతలు" పెంచు కోవడం, వాటికి బానిసలై "దురలవాట్ల" పాలై పోవడం వంటివి చేస్తున్నారని వారు తేల్చారు.           ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా డాక్టర్లు కీలక రోగాలకు మందులు ఇవ్వడం తగ్గించి, "జీవన శైలి"ని సరి దిద్దే పనిలో పడ్డారు.*


      _అందుకే డయాబిటిక్, బిపి వంటి నిరంతర అనారోగ్యకర అంశాలకు డాక్టర్లు ట్రీట్‌ మెంట్ ఇచ్చే పద్ధతి మార్చు కున్నారు._

    

*ఇది వరకు తిన కూడదు*

     *అన్న అన్ని రకాల*

     *ఆహారాన్ని నిరభ్యంతరంగా*

    *తిన మంటున్నారు.*


_పొద్దుటే వాకింగ్ వెళ్ళే వారు ప్రశాంతమైన మూడ్‌లో ఉండాలని అందు కోసం నచ్చిన పాటలు విన మంటున్నారు._


*ఏం చేస్తే ఉత్సాహంగా అనిపిస్తుందో అది చేయ మంటున్నారు. కొందరు "వాకింగ్" ఇష్టపడితే మరి కొందరు జిమ్‌కు వెళ్ళాలను కుంటారు. ఇంకొందరు "బ్రిస్క్‌వాక్" చేయాలనుకుంటే, ఇంకొందరు "స్టెయిర్ కేస్  వాక్"  చేయాలను కుంటుంటారు. అందుకని డాక్టర్లు పేషెంట్ల ఇష్టానికే విడిచి పెట్టి ఎంతో కొంత వ్యాయామం మాత్రం చేయ మని సూచిస్తున్నారు.*


      ఒక్క సారిగా వీరి వైఖరి

      ఇలా మారి పోడానికి

      కారణం సరికొత్త

      అధ్యయనాలలో

      వెలుగు చూస్తున్న అంశాలే

      కారణం. 

*ఇలా వెల్లడైన అనేక పరి శోధనల ఫలితాలలో జపాన్ శాస్త్రవేత్తల పరిశోధన, అధ్యయనం సరికొత్తది.          దీనిలో పాల్గొన్న సైంటిస్టులు ఏం చెబు తున్నారో చూద్దాం.*  


*➢    "మానసిక ఒత్తిడి" వల్ల గ్యాస్ ::*

       కడుపులో  గ్యాస్ సమస్యను వాయువు అంటారు.                ఇది రావ డానికి, ముదర డానికి కారణం  ఆహార లోపాల వల్ల కాదట.  

"మానసిక ఒత్తిడి" వల్ల ఎక్కువ వస్తుందట !


*➢  "ఆవేశ కావేశాల" వల్లే అధిక రక్తపోటు ::*


     ఉప్పు ఎక్కువగా తినే వారి కంటే 

"ఆవేశ కావేశాలను" అదుపులో పెట్టుకోని వారిలోనే  "అధిక రక్తపోటు" ఎక్కువట !


*➢   "అతి బద్ధకం" వల్ల చెడు కోలెస్టరాల్ ::*


        కొవ్వు పదార్థాలు తినేవారిలో కంటే  అతిబద్ధకం వలన కొవ్వు పెరిగిన వారిలోనే చెడు కోలెస్టరాల్ ఎక్కువట!


*➢   "మధుమేహం" సమస్య: తీపి పదార్థాలు అధికంగా తినే వారిలో కంటే,*

       "అధిక స్వార్ధం", 

       "మొండితనం"

*ఉన్నవారి లోనే ఎక్కువట !*


*➢  "అతి విచారం" వల్ల ఆస్త్మా  ::*


    ఊపిరి తిత్తులకు గాలి అందక పోవడం కంటే, 

అతివిచారం వల్లనే ఊపిరి తిత్తులలో మార్పులు వచ్చి ఆస్త్మా వస్తుందట... 


*➢   "ప్రశాంతత" లేక గుండె జబ్బులు ::*


ధమనుల్లో రక్తం ప్రసరణ లోపాల కంటే ప్రశాంతత లోపించడం వల్లనే గుండె కొట్టు కోవడంలో మార్పులు వస్తున్నాయట.


అందువల్ల మనిషికి గుండెజబ్బులు వస్తున్నాయట. 


*మొత్తం మీద శరీరంలో వచ్చే సర్వ రోగాలకు "మూల కారణాలు" తరచి చూస్తే "ఆహార అలవాట్ల" వల్లకాదని లైఫ్‌ స్టయిల్ సంబంధ మైన వేనని తెలుస్తోంది. అందుకు వారు వివిధ కారణాలను చూపించారు.         వారి అధ్యయనం ప్రకారం-* 


  *  50% ఆధ్యాత్మికత

      లోపంవల్ల

  *  25% మానసిక కారణాల

      వల్ల

  *  15% సామాజిక,

      స్నేహబాంధవ్యాల లోపం

      వల్ల

  *  10% శారీరక కారణాల

       వల్ల...

*రోగాలు వస్తున్నాయి. అందువల్ల "కడుపు మాడ్చుకుని" ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆరాటపడేకన్నా, "జీవన శైలి"ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మేలని జపాన్ సైంటిస్టులు అంటున్నారు.* 


*వీరి సూచనల ప్రకారం మనం ఆరోగ్యంగా ఉండా లంటే* 


       -  స్వార్ధం, 

       -  కోపం, 

       -  ద్వేషం, 

       -  శత్రుత్వం, 

       -  ఆవేశం, 

       -  అసూయ,

       -  మొండితనం, 

       -  బద్ధకం, 

       -  విచారం, 


*వంటి "వ్యతిరేక భావాల"ను వదిలించు కోవాలి.*


       -  కారుణ్యం, 

       -  త్యాగం, 

       -  శాంతం, 

       -  క్షమ, 

       -  నిస్వార్ధం, 

       -  స్నేహభావం,

       -  సేవాభావం, 

       -  కృతజ్ఞత, 

       -  హాస్య ప్రియత్వం,

       -  సంతోషం , 

       -  సానుకుల దృక్పథం

పెంచు కోవాలి.”