15, మే 2022, ఆదివారం

 *ॐ    నేను ప్రహ్లాదుణ్ణా? హిరణ్యకశిపుణ్ణా?* 


    "ప్రహ్లాదశ్చాస్మి దైత్యానామ్"    

  - "అసురులలో ప్రహ్లాదుణ్ణి నేను" అంటాడు భగవద్గీతలో పరమాత్మ. 


*ఒక అన్వయం*


    ప్రహ్లాదుడు అసురుడు. 

    అసురకులములో జన్మించినవాడు. 

    అయినా పరమభక్తాగ్రేసరుడు అవడంచేత సాక్షాత్ భగవంతుని పొందగలిగాడు. 

    పరమాత్మ "ప్రహ్లాదుడను నేనే" అని చెప్పడంవల్ల, భక్తియొక్క పరాకాష్ఠస్థితియందు భక్తుడు - భగవంతుడు ఒకటే అవుతారు అనే పరమసత్యం వెల్లడవుతోంది. 

    వారివారి పురుష ( 'పురుష' అంటే "స్త్రీ పురుష" లింగాలలోనిది కాదు. ధర్మార్థకామమోక్షాలనే పురుషార్థాలకి చెందింది ) ప్రయత్నంచే జీవుడు ఈశ్వరుడు కాగలడని స్పష్టమవుతోంది. 


    క్రూరస్వభావముగల అసురజాతియందు పుట్టికూడా, 

  - ప్రయత్నపూర్వకంగా ఆర్జింపబడిన తనయొక్క దైవీసంపదచే మహోన్నత పరమార్థస్థితిని చేపట్టి, 

  - శాస్త్రాదులందు గణుతికెక్కినవాడై, 

  - భక్తశిరోమణియై తేజరిల్లచు, 

  - సాక్షాత్ భగవద్రూపుడై వెలసాడు. 


    కాబట్టి కులముకంటే గుణమే ప్రధానమని తేలతోంది. 

    దీనినిబట్టి ఎట్టి కులమందు జన్మించినా, తన ప్రయత్నముచేత జనులు మహత్తరదైవస్థితి పొండగలరని ఋజువైంది. 

    అసురుడే ముక్తినొందగా, ఇక తక్కనవారిమాట చెప్పనేల? 


    కావున జాతి, మత, కుల, లింగ విచక్షణలేక అందఱూ ఆధ్యాత్మికసాధనలొనర్చి భగవత్పదమును అలంకరించవచ్చును.  


*మరొక అన్వయం* 


    భగవంతుని విభూతులలో దేవతలే కాకుండా, దైత్యులు, దానవులు కూడా ఉన్నారు. 

    దైత్యులంటే దితి సంతతి. 

    దానవులంటే దనువు సంతతి. 

    జీవులలో మంచి స్వభావం కలవారు, చెడ్డస్వభావం కలవారు ఉంటారు. 

    వారి పరిణామాన్నిబట్టి జన్మసంస్కారమేర్పడుతుంది. 

    చెడ్డ సంస్కారములు కలవారు అసురులనీ, మంచి సంస్కారములో పుట్టినవారు దేవలక్షణాలు కలిగినవారనీ పరమాత్మ భగవద్గీతలోనే నిర్వచించాడు. 

    దితి సంతతిలో అందఱూ అసురులు కానక్కరలేదు. ఎక్కువమంది దైత్యులు అసుర లక్షణములు కలవారవడంతో దితికి చెడ్డపేరొచ్చింది. కానీ వారిలోనూ దివ్య లక్షణాలు కలవారున్నారు. అవి యున్నచోట వారిలో ఉన్నది దైవ విభూతియేగానీ మరొకటి కాదు. 

    దానికి ఉదాహరణగా భగవానుడు ప్రహ్లాదుని చెప్పుతున్నాడు. 


    హిరణ్యకశిపుడు లోకకంటకుడైతే, 

    ప్రహ్లాదుడు దైవానుగ్రహం పొందినవాడు. తానే దైవముగా అయినవాడు. 

    ఎవడు లోక కంటకుడో, వాని బాధలు లోకానికి తప్పించడానికై దేవుడు తన వైభవాన్ని మంచివారి రూపాన ఉంచుతాడు. 

    హిరణ్యకశిపుడు కోరిన వరాలనుబట్టి అతనికి పరాజయముగానీ, మరణంగానీ ఉండకూడదని అతని భావన. 

    అతడు అసుర లక్షణాలను పొందకుండా, సత్ప్రవర్తనం కలిగియుంటే, సనక సనందాదులలాగా శాశ్వతుడై, లోకగురువులలో ఒకడైయుండేవాడు. 

    కానీ అతడు లోక కంటకుడవడంతో, 

    దైవ విభూతి ప్రహ్లాదునియందు ప్రకాశించింది. అదే హిరణ్యకశిపుని మృత్యువునకు కారణమైంది. 

    కనుక దైత్యులలో ప్రహ్లాదుడు తన విభూతి అని భగవానుడు చెప్పుచున్నాడు. 


*హిరణ్యకశిపుడా? - ప్రహ్లాదుడా?*  


    హిరణ్యకశిపుడు పరమాత్మను పరమపదంలో ఉండేవానిగానే భావించాడు. 


    ప్రహ్లాదుడు పరమాత్మ వ్యాపకతత్త్వాన్ని గుర్తించాడు. 

    తనతోపాటుగా ఉన్న విశ్వమంతా పరమాత్మయే నిండియున్నాడని తెలుసుకున్న దైవశక్తి అయ్యాడు. అందుచేతనే 

- పాముతో కరిపించినా, 

- ఏనుగుతో తొక్కించినా, 

- విషం తాగించినా, 

- అగ్నిలో వేసినా, 

- సముద్రంలో పారవేసినా బాధా లేదు. మరణమూ లేదు. 


    అందుచేతనే  

 - హిరణ్యకశిపుడు మరణం పొందిన హింసాప్రవృత్తి, 

 - ప్రహ్లాదుడు చిరంజీవియైన శాంతస్వభావం. 


                     *మనమెవరం?* 


              *ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః*   


                    =x=x=x= 


    — రామాయణం శర్మ 

               భద్రాచలం

 తైవాన్ దేశస్తులు భారతీయులను ఎందుకు ద్వేషిస్తారు?


తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.

ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు.

తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:

 ‘‘200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు’’

‘‘బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు

 ‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?

నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు. అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు?’’అడిగాడు తైవాన్ స్నేహితుడు.

మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు

‘‘ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు? భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడు

మరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.

కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ముందూ వెనకా ఆలోచించరు’’ 

‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం. సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు

 

ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజం.

ॐశ్రీనృసింహ జయన్తి卐*

 *ॐశ్రీనృసింహ జయన్తి卐*

*(నేడు🦁🦁రేపు)*


*శ్లో𝕝𝕝* వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధశ్యాం శుభేదినే l

సంధ్యాకాలేన సంయుక్తే స్తంభోద్భవ నృకేసరీ ll 


*నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం అయినటు వంటి నేడు/రేపు మిగులు 14 / 15-5-22 శనివారం /ఆదివారం నాడు కూడా జరుపుకుంటారు.* ఈ రోజు సాయంకాలం నరసింహ మూర్తి హిరణ్య కశిపుని వధించడానికి ఆతని ఆస్థాన మండప స్తంభము నుండి ఉద్భవించెను.


"వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,

మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్"


అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.


శ్రీనృసింహభక్తులు సంప్రదాయానుసారంగ త్రయోదశి (ముందు రోజు) నాటి రాత్రి ఉపవాసం ఉండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసం ఉండి, ప్రదోష కాలమున నృసింహ విగ్రహమును పూజించుతారు. స్తంభములో జన్మించాడు గనుక భవంతి స్తంభములకు గంధ, పుష్పాక్షతలతో అలంకరించి పూజిస్తారు. రాత్రి జాగరణముచేసి, స్వర్ణసింహ విగ్రహమును దానమిచ్చి, మరునాడు పారణ చేయుదురు. వైశాఖము గ్రీష్మము గనుక వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు.


*నృసింహ పురాణ కథ*

~~~~~~


అవంతీ నగరమున సుశర్మ అను వేద వేదంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండెను. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలిగిరి. వారిలో కనిష్ఠుడు వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేయువాడు. ఇట్లుండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించెను. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భుజింపలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్య లేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసెను. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసినది. అజ్ఞాతముగా ఇట్లు వ్రత మాచరించుట వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందితిరి.


*నరసింహావతారం:*

~~~~


మానవ పరిణామ క్రమంలో అసంపూర్ణమైన (సగం మానవాకారం, సగం సింహాకారం) మానవ రూపంతో కంనిపించే మొట్టమొదటి అవతారమే నరసింహావతారం. ఈ అవతారానికి ముందు మత్స్య, కూర్మ, వరాహావతారాలున్నాయి. అవి జంతు సంబంధమైనవి. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా వెన్నెముక నిటారుగా ఉన్న అవతారాల్లో మొట్టమొదటిది నరసింహావతారమే. మానవావిర్భావం మొదట మత్స్య రూపమునుంచి ఆవిర్భవించిందనే సిద్ధాంతానికి, దశావతారాల్లో కనిపించే క్రమమూ, పరిణామమూ నిదర్శనాలుగా నిలుస్తాయి.


నరసింహావతారంలో రెండు భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. నృసింహుడు హిరణ్యకశిపుని పాలిట ఉగ్రుడై కనిపిస్తే, అదే రూపం ప్రహ్లాదునిపై దయారసాన్ని కురిపించింది. హిరణ్యకశిపుడు భయభ్రాంతుడైతే, అదే రూపాన్ని దర్శించిన ప్రహ్లాదుడు భక్తిరసాంబుధిలో ఓలాలాడాడు. హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు వీరిద్దరిలో ఎవరు ధైర్యవంతులు? భుజబలం ఉన్నప్పటికీ మానసిక శక్తులు లేని హిరణ్యకశిపునికన్నా, బాలుడైనా ఆత్మశక్తి ద్వారా సంపాదించిన భక్తిబలంతో ప్రహ్లాదుడు ఉగ్రభీకర నృసింహ స్వరూపాన్ని చూసి భయపడలేదు. అలాగే హిరణ్యకశిపుడు కోరిన కోర్కెలు విషయవాంఛలు. విషయ వాంఛలపై ఎంతగా ప్రలోభపడినా చివరికి ఏదో ఒక రూపంలో అవి మనల్ని కాటేయక మానవు.


సంప్రదాయంలో నారసింహస్వామిగ విజయాన్ని అందించే వేల్పుగా ఖ్యాతి వహించాడు. రాజ్యలక్ష్మి సమేతుడై శత్రుభయంకరుడై, ఆర్తుల ఆర్తిని పోగొట్టే ఆర్తత్రాణ పరాయణుడు. నియమపూర్వకమైన సాధనల ద్వారా యౌగిక స్తంభాన్ని చేధిస్తే మాత్రమే మన హృదయంలో ఆవిర్భవించే విజ్ఞాన స్వరూపుడు. అహంకారంతో, ప్రలోభాలతో శరీరాకృతిలో మనల్ని పీడించే భవబాధలను వివేకమనే నఖాగ్రాలతో చీల్చి ఉపశమంపచేసే వాత్సల్య స్వరూపుడు.

అందుకే ఆది శంకరాచార్యులు స్వామివారిని ఇలా స్తుతించారు.


సంసార సాగర విశాల కరాళకాల

నక్రగ్రహ గ్రసన నిగ్రహ విగ్రహస్య

వ్యగ్రస్య రాగరసనోర్మిని పీడితస్య

లక్ష్మీనృసింహ! మమదేహి కరావలంబం!!


*నరసింహ అవతారం*

~~~~


నరసింహ అవతారం తక్కిన అవతారాల కన్నా చాలా విశిష్టమైనది. 


తాను ఆర్తత్రాణపరాయణుడు, భక్త జన పరిపాలకుడు అని నిరూపించే అత్యంత అరుదైన అవతారం. 


తన భక్తుడు ఏవైపైతే వేలు చూపడం ఆపాడో అక్కడనుండి అవతరించి తన భక్తుని నమ్మకాన్ని నిరూపించిన భక్త పరాధీనుడు.


క్షణాలలో క్రోధాన్ని ఆవహింప చేసుకుని తమోగుణప్రధాన రూపమై తానే రుద్రుడై వచ్చాడు శ్రీహరి నరసింహస్వామీయై అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపము. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే నరసింహ స్వామికి కూడా జరుగుతాయి. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. 


అటువంటి నృసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో.


ఆది శంకరులు పలుమార్లు నృసింహ స్మరణ మాత్రం చేత కాపాడబడ్డారు. ఆయన పరకాయ ప్రవేశం చేసి తిరిగి తన శరీరంలో వెళ్ళబోవు సమయంలో ఆ రాజభటులు ఆ శరీరానికి నిప్పు పెట్టి ఆహుతి చేయ్యబోగా కరావలంబ స్తోత్రం చేసి కాపాడబడ్డారు.


ఒకసారి ఒక వ్యాధుడు ఆయన శిరస్సును కోరి ఆయన ధ్యానమగ్నులైనప్పుడు తల నరకబోగా ఆయన శిష్యుడు చేసిన నృసింహ స్తోత్రానికి ప్రత్యక్షమై వారిని రక్షించారు. కాశ్మీరంలో ఆయన మీద విషప్రయోగం చెయ్యగా దాన్ని విరిచి మరొక సారి కాపాడారు. ఇలా కోరిన వెంటనే రక్షించిన స్వామీ నరసింహుడు.


మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. 


అన్నమయ్య ఆయన రాసిన 32 వేల సంకీర్తనలలో వేంకటేశుని తరువాత అంత ఆర్ద్రంగా రాసిన కీర్తనలు నృసింహుని పైనే. 


అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.


శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు. 


ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వండబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతలు, ముని, ఋషి బ్రాహ్మణులు తినరే ఎలా అని బ్రహ్మ వ్యాకుల పడగా శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ తరువాతే అందరికీ ఆ నైవేద్యం వడ్డించబడింది. 


అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసిమ్హుని ముందు కూర్చుని ధ్యానిస్తే ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.


అందుకే వెంకటేశ్వరపాదసేవలో నృసిమ్హునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు


"రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !

శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! "

మాతా నృసింహశ్చ పితానృసింహ: సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ విద్యానృసింహో ద్రవిణం నృసింహ: స్వామి నృసింహ సకలం నృసింహ

     

🙏 *శ్రీ నృసింహ 🦁 జయన్తి శుభాకాంక్షలు* 

🙏🙏🦁🦁🙏🙏


*బ్రాహ్మణ చైతన్య వేదిక*

గొంతెమ్మ కోరికలు

 *గొంతెమ్మ  కోరికలుపై ఓ చిన్న చర్చ*


కుంతికి విక్రుత నామమే గొంతి. కాలక్రమేణా అదె గొంతెమ్మ అయ్యింది. తనకు వరప్రసాదమైన కోరికను అనాలోచితంగా కుంతి కోరుకోవడంతో ఆమెకు వివాహానికి ముందే సూర్య భగవానుడి వల్ల కర్ణుడు జన్మిస్తాడు. అందువల్ల ముందుచూపు లేకుండా చేసే చర్యలు ఇబ్బంది పెడతాయని దీని భావన. 


అంతేకాకుండా కురుక్షేత్ర యుద్ధంలో తన ఇద్దరు కుమారులైన కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ బ్రతకాలని ఆమె కోరుకుంటుంది. అది సాధ్యం కాదు కాబట్టి అటువంటి సాధ్యం కాని కోర్కెలను కోరుకునేవారిని గొంతెమ్మ కోరికలు కోరుకోవద్దని పెద్దలు సలహా ఇస్తుంటారు.


ఇదే జాతీయము, మరో నేపధ్యంతో కూడా ప్రచారంలో ఉండి ఉండవచ్చు. మన సాహితీ మిత్రులు అటువంటి కధనాలను వారి వారి సందేశాల ద్వారా మన సమూహ తోటి సాహితీ మిత్రులతో పంచుకోగలరు.  అటువంటి ఫోస్ట్ లు అవగాహనను మరింతగా పెంచేటందుకు దోహదం చేస్తాయి కూడా.

ఎక్కువగా మాట్లాడాలి

 *🤷🏼‍♂️🤷🏼‍♂️మామూలు గా ఇంట్లోని వాళ్ళు పెద్దవారిని మాట్లాడనివ్వరు 🤷‍♀️🤷‍♀️🤷‍♀️

వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి ఎందుకు అంటే 💃💃💃


 వైద్యులు ఇలా అంటున్నారు.  *పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు.  ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం.*


సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి.


  *మొదటిది:* మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది సహజంగానే వేగంగా ఆలోచించే ప్రతిబింబాన్ని కలిగిస్తుంది మరియు జ్ఞాపకశక్తిని కూడా పెంచుతుంది.  మాట్లాడని సీనియర్  సిటిజన్లు, జ్ఞాపకశక్తి కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


  *రెండవది:* మాట్లాడటం అనేది చాలా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది, మానసిక అనారోగ్యాన్ని దూరం చేస్తుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.  మనం తరచుగా ఏమీ అనలేము, కానీ దానిని మన గుండెల్లో పాతిపెట్టి, మనల్ని మనం ఉక్కిరిబిక్కిరి చేస్తాము._ ఇది నిజం!  కాబట్టి!  సీనియర్లుకు  ఎక్కువ మాట్లాడే అవకాశం కల్పించడం మంచిది.


  *మూడవది:* మాట్లాడటం వల్ల చురుకైన ముఖ కండరాలకు వ్యాయామం చేయవచ్చు & అదే సమయంలో, గొంతుకు వ్యాయామం చేయవచ్చు & ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, అదే సమయంలో, ఇది కళ్ళు & చెవులు క్షీణించడాన్ని తగ్గిస్తుంది మరియు మైకము వంటి గుప్త ప్రమాదాలను తగ్గిస్తుంది.  & చెవిటితనం.


 *సంగ్రహంగా చెప్పాలంటే, రిటైర్ అయినవాళ్ళు, అంటే సీనియర్ సిటిజన్లు  *సాధ్యమైనంత వరకు ఎక్కువగా మాట్లాడటం మరియు వ్యక్తులతో చురుగ్గా సంభాషించడం, అల్జీమర్స్‌ను నివారించే ఏకైక మార్గం. దీనికి వేరే ఎటువంటి చికిత్స  లేదు.*

 *కాబట్టి, మనం ఎక్కువగా మాట్లాడదాం మరియు ఇతర సీనియర్లను  కూడా బంధు మిత్రులతో ఎక్కువగా మాట్లాడేలా ప్రోత్సహిద్దాo...👍*

Intelligent Indians*

 *Intelligent Indians*


Brushing with *Colgate*


Shaving with *Gillette*


Bathing with *Pears*


Aftershave with *Old Spice*


Wearing *Allen Solly* shirt


Wearing a *Levis* pant


Eating *Maggi* and 


Drinking *Nescafe*


Watching on a *SONY* 


Using *Vodafone*


Wearing a *Ray-ban*


Seeing time on *RADO*


Travelling in a *Toyota*


Using *Apple computer*


with *Coke* on the side


Finishing lunch at , 

*McDonald's* 


Buying Pizza  for the 

wife from *Dominos*


Drinking *Johnny Walker & Chivas Regale*


Shopping on *Amazon*

And...,


Then asking a question,

*"WHY IS THE INDIAN*

*RUPEE GOING DOWN*

*AGAINST THE DOLLAR*


*Eye opener Message for all intelligent Indians.* 


 *BE INDIAN, BUY INDIAN PRODUCTS* 


               🇮🇳🇮🇳 Anand Hi Anand 🇮🇳🇮🇳